
యాదగిరిగుట్ట: ఓవైపు నిత్యారాధనలు, మరో వైపు భారీగా తరలివచ్చిన భక్తులతో ఆదివారం యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో కోలాహలం నెలకొంది.

వేకువజామున స్వామివారి మేల్కొలుపులో భాగంగా సుప్రభాత సేవ, అనంతరం గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీదళాలతో అర్చకులు తులసీదళ అర్చన చేశారు.

ప్రథమ ప్రాకార మండపంలో , గజ వాహనసేవ, స్వామి, అమ్మవారికి నిత్యకల్యాణం ఆగమశాస్త్రం ప్రకారం నిర్వహించారు.

బ్రహ్మోత్సవం, ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చనమూర్తులకు అష్టోత్తర పూజలు నిర్వహించారు. ఆయా వేడుకల్లో భక్తులు భారీగా పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.














