
కదిలిన జగన్నాథ రథచక్రాలతో నగరంలో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. హరే కృష్ణ నామస్మరణలు, సంకీర్తనల హోరు.. రథచక్రాల గిరగిరలు.. భక్తుల కోలాహలం మధ్య భక్తి పారవశ్యంలో మునిగితేలింది. నగరంలో పలుచోట్ల జగన్నాథ రథయాత్ర మహోత్సవాలు అత్యంత వైభవంగా, కనుల పండువగా జరిగాయి.

జై జగన్నాథ నినాదాలతో వీధులు మార్మోగాయి. ఈ ఆధ్యాత్మిక సందడిలో పాల్గొనేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చి, స్వామి రథాన్ని లాగి తరించారు.





















