తిరుమల : అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీవేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
కన్నుల పండువగా తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు.
ఈ రోజు (గురువారం) చిన్నశేషవాహనం, హంసవాహనంపై శ్రీవారు భక్తులకు దర్శనమిచ్చారు.
స్వామివారి వైభవాన్ని దర్శించుకునేందుకు భక్తకోటి జనం తరలివచ్చారు.


