
శ్రీకృష్ణ పరమాత్ముడి నామస్మరణతో నగరం పులకరించింది. జగన్నాథ రథయాత్ర ఆద్యంతం ఆధ్యాత్మికతను ద్విగుణీకృతం చేసింది.బంజారాహిల్స్ హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్, అబిడ్స్, సికింద్రాబాద్ ఇస్కాన్ టెంపుల్స్ ఆధ్వర్యంలో శుక్రవారం జగన్నాథ రథయాత్ర కన్నుల పండువగా సాగింది. హరే కృష్ణ.. హరే రామ భజనలు,నృత్యాలతో భక్తులు పారవశ్యం చెందారు.














