బాలీవుడి నటి కీర్తి కుల్హారీ (Kirti Kulhari) సైబర్ నేరగాళ్ల మోసానికి గురయ్యారు. ఆమెకు తెలియ కుండానే, ఎలాంటి ఓటీపీ లేకుండా ఆమెక్రెడిట్ కార్డ్ ద్వారా విదేశీ విమానయాన సంస్థకు భారీ మొత్తంలో చెల్లింపులు జరిగిన ఘటన దిగ్బ్రాతి రేపింది. ఈ ఘటనపై ముంబై అంబోలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
'ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్!' ఫేమ్ కీర్తి ఆమె సినిమా చూస్తున్న సమయంలోనే క్రెడిట్ కార్డ్ను ఉపయోగించి కేటుగాళ్లు ఆమెకు ప్రమేయం లేకుండానే రూ. 2.43 లక్షలకు పైగా డబ్బులు కొట్టేశారు. జూలై 24న రాత్రి అంధేరిలోని ఒక మల్టీప్లెక్స్లో కీర్తి సినిమా చూస్తుండగా బ్యాంకు నుంచి ఈ (International Transaction) లావాదేవీకి సంబంధించిన అలర్ట్ రావడంతో ఆమె ఒక్కసారిగా షాక్ అయింది. AeroMexico ఏయిర్లైన్స్కి 2,525 యూఎస్ డాలర్ల చెల్లింపు జరిగినట్లు మెసేజ్ రావడంతో కీర్తి వెంటనే కస్టమర్ కేర్ను సంప్రదించారు.
ఇదీ చదవండి: చెఫ్ అవుదామనుకుని స్టార్ హీరో : కళ్లు చెదిరే కార్లు, ఆస్తులు
ప్రాథమిక విచారణలో ఆమె కార్డ్ ఉపయోగించి వరుసగా 4 లావాదేవీల ద్వారా మొత్తం రూ. 2.43 లక్షలకు పైగా డ్రా చేసినట్లు తేలింది. వెంటనే ఆమె పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. దీంతో మరిన్ని అనధికారిక లావాదేవీలు జరగకుండా బ్యాంక్ అధికారులు వెంటనే ఆ క్రెడిట్ కార్డ్ను బ్లాక్ చేశారు.ఈ ఘటనపై కీర్తి కుల్హారీ ఫిర్యాదు మేరకు ముంబై సైబర్ సెల్ పోలీసులు నమోదు చేశారు.
ఇదీ చదవండి : భార్యతో జస్ట్ 90 సెకన్లు : వ్యాపారవేత్త ఆదిత్య ఆసక్తికర వ్యాఖ్యలు
కాగా కీర్తి ఇటీవల 'ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్!' చివరి సీజన్లో కనిపించారు. అంతకుముందు పింక్, క్రిమినల్ జస్టిస్, షైతాన్, హ్యూమన్ వంటి విజయవంతమైన చిత్రాలు, టెలివిజన్, సిరీస్లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాల్లోనూ వైవిధ్యమైన పాత్రలతో ఆదరణ పొందారు. జగన్ శక్తి దర్శకత్వంలో వచ్చిన 'మిషన్ మంగళ్' చిత్రంలో కీర్తి కుల్హరి ఆకట్టుకున్నారు.
ఇదీ చదవండి: బెల్జియంలో గర్బా : పారిశ్రామిక వేత్త హర్ష్ గోయెంకా స్పందన


