breaking news
Actress
-
మా బాడీ పార్ట్స్ జూమ్ చేసి.. మేము ఆడవాళ్ళం బొమ్మలు కాదు
-
బెస్ట్ ఫ్రెండ్ పెళ్లిలో గ్లామరస్ హీరోయిన్ సందడి (ఫొటోలు)
-
వాడు అమ్మాయిల పిచ్చోడు అందుకే వదిలేసా బ్రేకప్ పై తొలిసారి స్పందించిన హీరోయిన్
-
కొత్త ప్రియుడుతో కలిసి పాత లవర్ హత్య
బెంగళూరులోదారుణం చోటు చేసుకుంది. టీవీ నటి పార్టీ పేరుతో పిలిచి ప్రియుడిని హతమార్చిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బెంగళూరులోని మంజునాథనగర్లో ఫిబ్రవరి 18న జరిగిన ఈ దిగ్భ్రాంతికరమైన హత్య దాదాపు 12 రోజుల తరువాత వెలుగులోకి వచ్చింది.గత కొన్ని రోజులుగా టీవీ నటి నటి ఊర్మిళ అలియాస్ బిందు, మోహన్ కృష్ణా రావు (40) కొంత కాలంగా 'లివ్-ఇన్' రిలేషన్షిప్లో ఉన్నారు. తాజాగా లారీ డ్రైవర్ వినయ్ అనే మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. అయితే దీన్ని మోహన్ రావు వ్యతిరేకించడంతో అతని హత్యకు పూనుకున్నారని నార్త్-వెస్ట్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డిసిపి) డీల్ నాగేష్ తెలిపారు.ఇదీ చదవండి: న్యూక్లియర్ వాచ్ డాగ్ వార్నింగ్, స్పందించని ఇరాన్దీంతో తన పెళ్లికి అడ్డుగా ఉన్నాడన్న కారణంగా మోహన్ రావును వదిలించుకోవడానికి ప్లాన్ వేసింది. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం బిందు, మోహన్ కలిసి ఉంటున్న ఇంట్లోనే పార్టీ ఏర్పాటు చేశారు. ఫుల్గా మద్యం సేవించిన తర్వాత, వినయ్ తన స్నేహితుడు ధనుష్తో కలిసి మోహన్ రావుపై ఎటాక్ చేశాడు. కాళ్లు చేతులు కట్టేసి, నోటికి, ముక్కు టేపులు వేసి మరీ మోహన్ రావును పలుమార్లు కత్తితో పొడిచారు. దీంతో ఊపిరి ఆడకపోవడంతో మోహన్ రావు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. అనంతరం నిందితులు అక్కడి నుండి పరారయ్యారు.అయితే హత్య జరిగిన 12 రోజుల తర్వాత, ఆ ఇంటి నుండి తీవ్రమైన దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి చూడగా కుళ్ళిపోయిన స్థితిలో మోహన్ రావు మృతదేహం లభ్యమైంది. ప్రస్తుతం పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, ఈ క్రైమ్లో ఎవరి పాత్ర ఎంత ఉందనే దానిపై విచారణ జరుపుతున్నారు. బిందు 'భజరంగి', 'పోలీస్ క్వార్టర్స్', 'కాలభైరవ' వంటి సినిమాల్లో చిన్న పాత్రల్లో కనిపించింది. -
తీహార్ జైల్లో 4 నెలలు.. చావు కోసం ఎదురుచూశా: నటి
మనీలాండరింగ్ కేసులో నాలుగు నెలలపాటు తీహార్ జైలులో శిక్ష అనుభవించింది నటి, ఇన్ఫ్లుయెన్సర్ సందీప విర్క్. తాజాగా తన జైలు జీవితం గురించి చెప్తూ భావోద్వేగానికి లోనైంది. సందీప మాట్లాడుతూ.. నా శత్రువు కూడా అలాంటి ప్రదేశంలో ఉండకూడదని కోరుకుంటున్నాను. తొలిసారి తీహార్ జైలులో అడుగుపెట్టినప్పుడు దేవుడెందుకింత శిక్ష విధించాడని ఎంతో బాధపడ్డాను. ఏ జన్మలో ఏ పాపం చేశానో..అక్కడి వాతావరణం కూడా భయానకంగా ఉంది. గత జన్మలో తెలిసో తెలియకో ఏదో పాపం చేసుంటాను, ఆ కర్మ నన్ను ఇలా వెంటాడుతోందని భావించాను. దేవుడా, నన్ను త్వరగా తీసుకెళ్లు అని ఎన్నోసార్లు వేడుకున్నాను. జైల్లో ఉన్నప్పుడు పేరెంట్స్ వచ్చి మనల్ని కలుస్తుంటే మరింత బాధేసేది. నా వల్ల వారు జైలుకు రావాల్సి వచ్చినందుకు క్షమాపణలు చెప్పాను. కానీ నేనేంటో తెలిసిన నా పేరెంట్స్, కుటుంబం నాకు అండగా నిలబడ్డారు.కన్నీళ్లు ఆగవుతీహార్ జైల్లో ఉన్నప్పుడు శారీరకంగా, మానసికంగా కుంగిపోయాను. తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యాను. ఇప్పటికీ ఆ జైలు జీవితం గుర్తొస్తుంటే కన్నీళ్లు ఆగవు. వాష్రూమ్స్ ఎంతో మురికిగా ఉంటాయి. నేలపై పడుకోవాలి. తిండి దారుణంగా ఉంటుంది. నాలుగు రోటీలు, అన్నం, పప్పు.. రోజూ ఇదే ఉంటుంది. ఏమీ తినాలనిపించదు. కొందరు పోలీసులు జాలి చూపిస్తారు. మరికొందరు వారి ఫ్రస్టేషన్, కోపాన్నంతా ఖైదీలపై చూపిస్తారు. ఇద్దరు మహిళలకు సాయంకానీ జైల్లో డబ్బు లేకుండా ఏ పనీ జరగదు. పైసా లేదం,న టే వాళ్లను ఎవరూ పట్టించుకోరు. ఒక మహిళ రూ.3000 దొంగతనం చేసిన కేసులో నాలుగునెలలుగా జైల్లో ఉంటోంది. తనకు అంధురాలైన తల్లి ఉంది, తండ్రి మంచానికే పరిమితమయ్యాడు. నేను బయటకు వచ్చాక తనకు సాయం చేస్తానని మాటిచ్చాను, ఆ మాట నిలబెట్టుకున్నాను. మరో మహిళ.. భర్త చేసిన ఆర్థిక మోసానికిగానూ ఆరునెలలుగా శిక్ష అనుభవిస్తోంది. తనకు కూడా మధ్యంతర బెయిల్ వచ్చేందుకు సహకరించాను అని చెప్పుకొచ్చింది.చదవండి: లక్కీ మూవీ.. ఓటీటీ రివ్యూ -
వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)
-
తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ మృణాల్ (ఫొటోలు)
-
జాలీగా గడిపేస్తున్న మెహరీన్ (ఫోటోలు)
-
పిల్లాడే కాదు, మేమూ మిస్ అవుతాం: కాజల్ (ఫోటోలు)
-
ప్రియుడితో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
ఒకదానికొకటి సంబంధమే లేదు.. మీనాక్షి చౌదరి ఫన్నీ (ఫొటోలు)
-
థాయ్ల్యాండ్ ఏనుగులతో రీతూవర్మ (ఫొటోలు)
-
తిరుమల శ్రీవారి సేవలో ఒకప్పటి హీరోయిన్ (ఫొటోలు)
-
హిందూ, క్రిస్టియన్ పద్ధతుల్లో బ్రిటీషర్ని పెళ్లాడిన నటి (ఫొటోలు)
-
తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)
-
ట్రెండింగ్లో రుక్మిణి వసంత్ (ఫొటోలు)
-
తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ త్రిష (ఫోటోలు)
-
ఉంగరాల జుట్టుతో ఎపిక్ హీరోయిన్ (ఫోటోలు)
-
హ్యాపీ బర్త్ డే కేరళ కుట్టీ.. అనుపమ పరమేశ్వరన్ స్పెషల్ (ఫొటోలు)
-
డాక్టర్గా హీరోయిన్ శ్రీలీల.. పట్టా అందుకున్న మధుర క్షణాలు (ఫొటోలు)
-
కశ్మీర్ అందాలు ఆస్వాదిస్తోన్న హీరోయిన్ లక్ష్మీరాయ్ (ఫోటోలు)
-
హీరోయిన్ స్నేహ బిజినెస్.. సెకండ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
ఎల్లో డ్రెస్లో నిహారిక కొణిదెల అందాలు (ఫొటోలు)
-
రెండోసారి ప్రెగ్నెన్సీ.. నటి పూర్ణ బేబీ బంప్ (ఫొటోలు)
-
తెలుగు తెరపై కొత్తందం
ప్రతి ఏడాది తెలుగు తెరపై కొత్త అమ్మాయిలు మెరుస్తుంటారు. కొత్త కథానాయికలు ఎందరొచ్చినా అందరికీ తెలుగు తెర చోటు కల్పిస్తూనే ఉంటుంది. ఈ ఏడాది వెండితెరను మెరిపించేందుకు, తమలోని నటనా నైపుణ్యంతో తెలుగు ప్రేక్షకులను మెప్పించేందుకు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న కొంతమంది కథానాయికల వివరాలపై ఓ లుక్ వేద్దాం.లక్కీ చాన్స్ ప్రభాస్ వంటి పాన్ ఇండియా స్టార్తో తొలి సినిమా అంటే ఏ హీరోయిన్కు అయినా లక్కీ చాన్స్ అనే చెప్పోచ్చు. ఈ లక్కీ చాన్స్ ఇమాన్వీ ఇస్మాయిల్కు దక్కింది. ‘సీతారామం’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడికల్ యాక్షన్ సినిమా ‘ఫౌజి’. ఈ చిత్రంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్నారు. ఇమాన్వీ హీరోయిన్గా చేస్తున్నారు. దేశభక్తి, ప్రేమ, కర్తవ్యం వంటి అంశాల మేళవింపుతో 1940 నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, జయప్రద, భానుచందర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.తొలి సినిమాయే ప్రభాస్ వంటి టాప్ హీరోతో నటిస్తుండటం, పైగా జయప్రద, మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ వంటి సీనియర్ నటీనటులతో స్క్రీన్ షేర్ చేసుకోవడం అంటే ఇమాన్వీకి కెరీర్ పరంగా ఇది బంపర్ ఆఫర్ అనే చెప్పుకోవచ్చు. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ‘ఫౌజి’ చిత్రం ఈ దసరాకు విడుదల కానుంది. ఈ సినిమాకు సహ– నిర్మాతగా శివ చనన వ్యవహరిస్తుండగా, విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు.వెల్కమ్ జోయా రణ్బీర్ కపూర్ హీరోగా సందీప్రెడ్డి వంగా దర్శకత్వంలోని ‘యానిమల్’ చిత్రం 2023లో విడుదలై, సూపర్ హిట్గా నిలిచింది. ఈ చిత్రంలో గీతాంజలి పాత్రలో రష్మికా మందన్నా హీరోయిన్గా నటించగా, కథలో కీలకమైన జోయా పాత్రధారిగా త్రిప్తీ దిమ్రి నటించారు. జోయా పాత్రలో త్రిప్తి నటనకు ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభించింది. ఈ ‘యానిమల్’ సినిమా తెలుగులో కూడా విడుదల కావడంతో తెలుగు ప్రేక్షకుల దృష్టిలో కూడా పడ్డారు త్రిప్తి. అప్పట్నుంచి ఈ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ ఫలానా హీరోతో ఉంటుందనే ప్రచారం సాగింది.కానీ ఫైనల్గా ప్రభాస్ హీరోగా చేస్తున్న ‘స్పిరిట్’ చిత్రంతో త్రిప్తీ దిమ్రి టాలీవుడ్కు వస్తున్నారు. ఈ యంగ్ బ్యూటీ చేస్తున్న తొలి స్ట్రయిట్ తెలుగు ఫిల్మ్ ‘స్పిరిట్’ కావడం విశేషం. అంతేకాదు... ‘యానిమల్’ సినిమాతో త్రిప్తీకి పాపులారిటీ తెచ్చిపెట్టిన సందీప్ రెడ్డివంగాయే ‘స్పిరిట్’ చిత్రానికీ దర్శకత్వం వహిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. భూషణ్ కుమార్, క్రిషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 5న రిలీజ్ కానుంది.తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ వంటి భారతీయ భాషలతో పాటు జపాన్ వంటి విదేశీ భాషల్లోనూ ‘స్పిరిట్’ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో ప్రభాస్ తొలిసారిపోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. డాక్టర్ పాత్రలో నటిస్తున్నారట త్రిప్తీ దిమ్రి. ప్రభాస్, త్రిప్తి ఈ చిత్రంలో భార్యాభర్తలుగా నటిస్తున్నారని సమాచారం. ప్రభాస్ క్యారెక్టరైజేషన్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని తెలిసింది. ప్రకాశ్రాజ్, కాంచన, వివేక్ ఓబెరాయ్ ఈ సినిమాలోని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.సీతా పయనం యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్యా అర్జున్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వస్తున్నారు. అర్జున్ స్వీయ దర్శకత్వంలో నిర్మించి, నటించిన బహుభాషా చిత్రం ‘సీతా పయనం’ ఈ నెల 14న విడుదల కానుంది. ఈ చిత్రంలోనే ఐశ్వర్యా అర్జున్ హీరోయిన్గా నటించారు. ఐశ్వర్యకు తొలి తెలుగు స్ట్రయిట్ ఫిల్మ్ ఇదే. ఇలా తన తండ్రి డైరెక్షన్ వహించి, నటించిన సినిమాతో ఐశ్వర్య తెలుగులోకి వస్తుండటం విశేషం. ఇక ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర అన్న కొడుకు నిరంజన్ హీరోగా నటించారు. ఈ చిత్రంలో సత్యరాజ్, ప్రకాశ్రాజ్, కోవై సరళ ఇతర ప్రధాన పాత్రల్లో నటించగా, ధ్రువ సర్జా గెస్ట్ రోల్ చేశారు.ఆకాశంలో ఒక తార ‘ఆకాశంలో ఒక తార’ సినిమాతో సినీ తారగా తెలుగుకి వస్తున్నారు సాత్విక వీరవల్లి. ఈ సినిమాలో ఓ చాలెంజింగ్ రోల్ చేస్తున్నారు సాత్విక. ఓ మారుమూల పల్లె నుంచి వచ్చి, తన కలలను సాకారం చేసుకోవాలని తాపత్రయపడే అమ్మాయి పాత్రలో సాత్విక నటిస్తున్నారని తెలిసింది. ‘ఆకాశంలో ఒక తార’ సినిమాలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తుండగా, సాత్విక వీరవల్లి హీరోయిన్గా చేస్తున్నారు. మరో హీరోయిన్ శ్రుతీహాసన్ ఈ సినిమాలోని ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమాస్ సమర్పణలో పవన్ సాధినేని దర్శకత్వంలో సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఆల్రెడీ 80 శాతం పూర్తయింది. ఈ వేసవిలోనే ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ పీరియాడికల్ ఎమోషనల్ అండ్ ఫీల్ గుడ్ మూవీకి జీవీ ప్రకాశ్కుమార్ సంగీతం అందిస్తున్నారు.శ్రీను–మంగల లవ్స్టోరీ బాలీవుడ్లో వన్నాఫ్ ది టాప్ హీరోయిన్స్ అయిన రవీనా టాండన్ కుమార్తె రషా తడానీ టాలీవుడ్ ఎంట్రీ ఖరారైంది. ‘ఆర్ఎక్స్ 100, మంగళవారం’ వంటి సినిమాలను తెరకెక్కించిన అజయ్ భూపతి డైరెక్షన్లో రానున్న ఇంటెన్స్ లవ్స్టోరీ సినిమా ‘శ్రీనివాస మంగాపురం’. సూపర్స్టార్ కృష్ణ, మహేశ్బాబుల నటవారసత్వాన్ని కొనసాగిస్తూ, జయకృష్ణ ఘట్టమనేని ఈ చిత్రంతో హీరోగా వెండితెరకు పరిచయం అవుతున్నారు.ఈ సినిమాలోనే రషా తడానీ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ పీరియాడికల్ లవ్స్టోరీ చిత్రంలో శ్రీను పాత్రలో జయకృష్ణ ఘట్టమనేని నటిస్తుండగా, మంగ పాత్రలో రషా తడానీ నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా నుంచి మంగ ఫస్ట్ లుక్పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ సినిమా రెండో షూటింగ్ షెడ్యూల్ జరుగుతోంది. సి. అశ్వినీదత్ సమర్పణలో చందమామ కథలు పతాకంపై పి. కిరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానుందని తెలిసింది. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్కుమార్ స్వరకర్త.లెగసీ ‘లెగసీ’ అనే ΄పొలిటికల్ మూవీతో టాలీవుడ్కి వస్తున్నారు కన్నడ హీరోయిన్ ఏక్తా రాథోడ్. విశ్వక్ సేన్ హీరోగా సాయికిరణ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ΄పొలిటికల్ థ్రిల్లర్ మూవీ ‘లెగసీ’. ‘పాలిటిక్స్ ఈజ్ పర్సనల్’ అనేది ఉపశీర్షిక. ఈ న్యూ ఇయర్ సందర్భంగా ఈ సినిమాను మేకర్స్ అధికారికంగా ప్రకటించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రంతోనే ఏక్తా రాథోడ్ టాలీవుడ్కి పరిచయం అవుతున్నారు. గతంలో ‘సిలికాన్ సిటీ, మాస్టర్ పీస్’ వంటి చిత్రాల్లో నటించారు ఏక్తా రాథోడ్. విశ్వక్ సేన్ రాజకీయ నాయకుడిగా నటిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఆల్రెడీ మొదలైంది. యశ్వంత్ దగ్గుమాటి, సాయికిరణ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.తెలుగు అమ్మాయి హరికృష్ణ మనవడు, జానకి రామ్ తనయుడు నందమూరి తారక రామారావు హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ‘సీతయ్య, దేవదాసు, లాహిరి లాహిరి లాహిరిలో, యువరాజు’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన వైవీఎస్ చౌదరి కొంత గ్యాప్ తర్వాత ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో తెలుగు అమ్మాయి వీణా రావు హీరోయిన్గా పరిచయం అవుతున్నారు. వీణ మంచి కూచిపూడి డ్యాన్సర్ కూడా. నటనలో దాదాపు ఏడాదిన్నర కాలం శిక్షణ తీసుకున్న తర్వాత హీరోయిన్గా ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నట్లుగా వీణ చెప్పారు. అయితే ఈ సినిమా చిత్రీకరణ, రిలీజ్ వంటి అంశాలపై అప్డేట్ రావాల్సి ఉంది. ⇒ పదేళ్ల క్రితం రాజేంద్రప్రసాద్ లీడ్ రోల్లో నటించిన ‘దాగుడు మూత దండాకోర్’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించారు సారా అర్జున్. అయితే మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘΄పొన్నియిన్ సెల్వన్’ సినిమాలో నందిని (నందిని రోల్ను ఐశ్వర్యా రాయ్ చేయగా, ఈ రోల్ యంగ్గా ఉన్నప్పటి సీన్స్లో సారా అర్జున్ నటించారు) పాత్రలో నటించి, యంగ్ యాక్టర్గా పాపులర్ అయ్యారు సారా. కాగా ఈ ఫిబ్రవరి 6న థియేటర్స్లో విడుదలైన ‘యుఫోరియా’ సినిమాతో ఓ లీడ్ యాక్టర్గా తెలుగు చిత్రపరిశ్రమకు సారా అర్జున్ పరిచయం అయ్యారు.గుణశేఖర్ దర్శకత్వంలో నీలిమ గుణ నిర్మించిన ఈ చిత్రంలోని సారా నటన తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తోంది. అలాగే సారా అర్జున్ ఓ లీడ్ రోల్లో నటించిన ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రం ‘మ్యాజిక్’ విడుదల కావాల్సి ఉంది. ఈ సినిమాకు ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. ఇంకా రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ‘ధురంధర్’ సినిమా గత ఏడాది డిసెంబరులో విడుదలై, ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. ఈ చిత్రంలోని హీరోయిన్ పాత్ర యాలినా జమాలిగా సారా నటించారు. హీరోయిన్గా హిందీలో సారా అర్జున్కు ఇది తొలి చిత్రం కావడం విశేషం.⇒ ‘ది రాజాసాబ్’ సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టారు హీరోయిన్ మాళవికా మోహనన్. ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్లో రూపొందిన ఈ చిత్రంలో భైరవి అనే పాత్రలో కనిపించారు మాళవిక. ఈ చిత్రంలో భైరవిగా ఓ యాక్షన్ సీక్వెన్స్ కూడా చేశారు మాళవిక. టీజీ విశ్వప్రసాద్, కృతీప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ సంక్రాంతి సందర్భంగా జనవరి 9న విడుదలైన సంగతి తెలిసిందే.ఈ సంగతి ఇలా ఉంచితే... ‘ది రాజాసాబ్’ సినిమా కంటే ముందే మాళవికా మోహనన్ ఎంట్రీ తెలుగులో జరగాల్సింది. విజయ్ దేవరకొండ, మాళవికా మోహనన్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కాల్సిన ఓ సినిమా క్యాన్సిలైంది. ఆ తర్వాత ప్రభాస్ ‘సలార్’ సినిమాలోని హీరోయిన్ పాత్ర కోసం మాళవికా మోహనన్ పేరును ఈ చిత్రదర్శకుడు ప్రశాంత్ నీల్ పరిశీలించారు. కానీ ఈప్రాజెక్ట్లో మాళవిక పేరు ఫైనలైజ్ కాలేదు. ఈ చాన్స్ శ్రుతీహాసన్కు దక్కింది. ఇలా... మాళవిక టాలీవుడ్ రాక కాస్త ఆలస్యమైంది. ఇలా ఈ ఏడాది తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయం కానున్న హీరోయిన్లు మరికొంతమంది ఉన్నారు. – ముసిమి శివాంజనేయులు -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి మీనాక్షి చౌదరి (ఫొటోలు)
-
బ్లూ డ్రెస్లో హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ అందాలు (ఫోటోలు)
-
ప్రతి జన్మకూ నువ్వే కావాలి: శ్రీలీల (ఫోటోలు)
-
ఎవరూ సాయం చేయలేదు.. ప్రముఖ నటి మృతి
టాలీవుడ్లో సహాయనటిగా గుర్తింపు తెచ్చుకున్న వాహిని అలియాస్ పద్మక్క అనారోగ్యంతో మరణించారు. ఆమె కొంతకాలంగా రొమ్ము క్యాన్సర్తో బాధపడుతున్న విషయం తెలిసిందే. తన వైద్యం కోసం రూ. 35 లక్షలు ఖర్చు అవుతుందని నటి కరాటే కల్యాణి సోషల్మీడియా వేదికగా కొద్దిరోజుల క్రితం తెలిపారు. ఆమె త్వరగా కోలుకునేందుకు సహాయం చేయండి అంటూ విరాళాలు పంపేందుకు ఫోన్పే, గూగుల్పే నంబర్లు, బ్యాంక్ అకౌంట్ వివరాలను జత చేశారు కూడా.. ఆయితే, దాతల నుంచి సరైన సాయం అందకపోవడంతో వాహిని మరణించడం బాధాకరం.ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న వాహిని బుధవారం సాయంత్రం (2026 ఫిబ్రవరి 4న) తుదిశ్వాస విడిచారు. ఇదే విషయాన్ని నటి కరాటే కల్యాణి తెలిపారు. తనను కాపాడేందుకు చాలా ప్రయత్నం చేశానని బాధతో ఆమె పోస్ట్ చేశారు. తన సొంత ఊరు విజయనగరంలో అంత్యక్రియలు జరగనున్నాయి. కళ్యాణి చేసిన పోస్ట్, సినీ అభిమానులను, నెటిజన్లని దిగ్బ్రాంతికి గురిచేస్తోంది.ఎవరీ వాహిని?విజయనగరంలో జన్మించిన వాహిని.. చిన్న పాత్రలతో కెరీర్ ప్రారంభించింది. తెలుగు, తమిళంలో అనేక సినిమాలు చేసింది. వెండితెరపై కంటే బుల్లితెరపైనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. జయవాహిని పేరుతో ఎక్కువ ఫేమస్ అయింది. చివరగా పోలీస్ వారి హెచ్చరిక సినిమాలో నటించింది. నరేశ్, విజయకృష్ణ ముఖ్య పాత్రల్లో నటించిన ‘రఘుపతి వెంకయ్య నాయుడు’ చిత్రంలో కథానాయికగా వాహిని నటించి ప్రశంసలు పొందింది.కొన్ని నెలలుగా ఆమె రొమ్ము క్యాన్సర్తో పోరాడుతున్నారని తనకు ఆర్థిక సాయం చేయాలని కరాటే కల్యాణి కోరారు. బహుళ అవయవాలు దెబ్బతిన్నాయి. చికిత్స మొత్తానికి రూ. 25 లక్షల నుంచి రూ.35 లక్షల మేర అవుతుందని డాక్టర్లు అంచనా వేశారు. ఇంత ఖర్చు ఆమె కుటుంబం భరించలేదని కల్యాణి చెప్పుకొచ్చారు. దయచేసి ఆమె త్వరగా కోలుకునేందుకు సహాయం చేయండి అంటూ విరాళాలు ఇవ్వాలని కల్యాణి కోరారు. కానీ, సరైన సమయంలో ఆమెకు ఎవరూ సాయం చేయకపోవడంతో మరణించారు. కేవలం డబ్బు కారణంగా వాహిని మరణించారని తెలుసుకున్న నెటిజన్లు బాధతో పోస్టులు పెడుతున్నారు. -
నేను తప్పు చేసినా సహించావ్.. సంఘవి ఎమోషనల్ (ఫోటోలు)
-
జ్యోతిర్లింగాల యాత్ర మొదలుపెట్టిన హీరోయిన్ (ఫొటోలు)
-
హీరోయిన్ జెనీలియా పెళ్లి జ్ఞాపకాలు (ఫొటోలు)
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ ప్రముఖులు (ఫొటోలు)
-
చీరలో వావ్ అనేలా స్రవంతి (ఫొటోలు)
-
రంగస్థలం బ్యూటీ పూజిత పొన్నాడ లేటేస్ట్ పిక్స్ (ఫొటోలు)
-
ప్రియాంక చోప్రా జనవరి జ్ఞాపకాలు.. కూతురు, భర్తతో చిల్ మోడ్ (ఫొటోలు)
-
కొంచెం నాటీ కొంచెం స్వీట్.. లంగా ఓణీలో మీనాక్షి (ఫొటోలు)
-
ఈ టాలీవుడ్ హీరోయిన్ని గుర్తుపట్టారా? (ఫొటోలు)
-
యంగ్ లుక్లో హీరోయిన్ సదా పోజులు (ఫొటోలు)
-
బ్లాక్ డ్రస్లో భాగ్యశ్రీ డిఫరెంట్ లుక్స్ (ఫొటోలు)
-
మ్యాడ్ నటి 'రెబా జాన్' ట్రెండింగ్ ఫోటోలు
-
కొండల్లో తిరిగేస్తున్న తేజస్విని (ఫొటోలు)
-
ఫారిన్ ట్రిప్లో 'ఓజీ' బ్యూటీ ప్రియాంక మోహన్ (ఫొటోలు)
-
ముద్దుగుమ్మలు ఒకేచోటు.. మాజీ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
వేకేషన్ ఎంజాయ్ చేస్తోన్న చిన్నారి పెళ్లికూతురు అవికా గోర్ (ఫోటోలు)
-
స్టన్నింగ్ అవుట్ఫిట్లో టాలీవుడ్ హీరోయిన్ ఇషా రెబ్బా (ఫోటోలు)
-
అదే మొదటిసారి అంటున్న రుక్మిణి వసంత్ (ఫోటోలు)
-
ఉజ్జయిని మహకాళేశ్వర్ ఆలయంలో హీరోయిన్ లక్ష్మీరాయ్ పూజలు (ఫొటోలు)
-
14 ఏళ్లకే మద్యం.. ఇప్పుడు గ్రీన్ టీతో పార్టీలు: నిధి అగర్వాల్
సినీ ఇండస్ట్రీలో తన అందం, నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటి నిధి అగర్వాల్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను ఇటీవల వెల్లడించింది. చిన్న వయసులోనే మద్యం సేవించడం ప్రారంభించినప్పటికీ, ఆ అలవాటును పూర్తిగా విడిచిపెట్టి ఆరోగ్యకరమైన జీవనశైలిని ఎంచుకున్నట్లు ఆమె తెలిపింది. నిధి అగర్వాల్ మాట్లాడుతూ.. తాను 14 ఏళ్ల వయసులోనే తొలిసారి మద్యం సేవించాను. ఆ సమయంలో ఫ్రెండ్స్తో కలిసి తాగడం సరదాగా అనిపించేది. అప్పట్లో అది ఫన్గా అనిపించింది. కానీ కాలక్రమేణా మద్యం నాకు సరిపడదని అర్థమైంది. తాగిన తర్వాత తనకు అసౌకర్యంగా, కొన్నిసార్లు భయంగా కూడా అనిపించేది.ఆ అనుభవాలే నన్ను ఆలోచనలో పడేశాయి. చివరకు మద్యం పూర్తిగా మానేయాలనే నిర్ణయం తీసుకున్నాను. నేను చివరిసారి మద్యం తాగి దాదాపు ఆరేళ్లు పూర్తయింది. ఆల్కహాల్ ఆరోగ్యానికి మంచిది కాదని ఆలస్యంగా అయినా గ్రహించాను. నా శరీరం కూడా ఆల్కహాల్ను అంగీకరించడం లేదని అర్థమైంది. అందుకే వెంటనే మానేశాను.ప్రస్తుతం పార్టీలకు వెళ్లినప్పటికీ మద్యం జోలికి మాత్రం వెళ్లడం లేదు. అయితే దాని బదులు గ్రీన్ టీతో ఎంజాయ్ చేస్తున్నాను. నా ఫ్రెండ్స్లో కొంతమంది ఆల్కహాల్ తాగుతారు. కానీ నేను మాత్రం తాగను. మద్యం లేకుండానే పార్టీల్లో బాగా ఎంజాయ్ చేయొచ్చని నిధి స్పష్టం చేసింది. -
హీరోయిన్ సంఘవి కూతురి బర్త్డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
బుడ్డోడితో బీచ్లో బుల్లితెర నటి లహరి (ఫోటోలు)
-
థాయ్లాండ్లో సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
హీరోయిన్ లయ సంక్రాంతి బొమ్మల కొలువు (ఫోటోలు)
-
అందంగా కవ్విస్తూనే యాక్షన్ మోడల్లో రాజాసాబ్ బ్యూటీ (ఫోటోలు)
-
ప్రముఖ నటుడికి సన్మానం.. హాజరైన మీనా (ఫోటోలు)
-
పెళ్లి తర్వాత మరింత కళగా సమంత (ఫోటోలు)
-
పూల స్కర్ట్లో ఆహా అనేలా జాన్వీ కపూర్ (ఫొటోలు)
-
గోవాలో బీచ్ ఒడ్డున హీరోయిన్ రాశీ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
-
'బేబి' వైష్ణవి చైతన్య క్యూట్ ఫొటోలు
-
పెళ్లాడితే కారు, బంగళా, రూ.10 లక్షలపైగా జీతం
కోట్లు ఉంటే చాలు కొండ మీది కోతిని కూడా కిందకు దిగొస్తుంది అని సంపన్నులతో పాటు చాలా మంది నమ్మకం. అయితే కోతి అయినా వస్తుందేమో గానీ, ఆత్మవిశ్వాసం ఉన్న అందమైన అమ్మాయి మాత్రం రాదని ఓ యువతి నిరూపించింది. తనను పెళ్లి చేసుకోవాలని కోరుతూ ఆస్తి, భూమి ఐదు అంకెల నెలవారీ భత్యంతో పాటు మరెన్నో అద్భుతమైన విలాసాలను ఆశ చూపించినప్పటికీ... ఆమె ఒప్పుకోలేదు.ఆమె పేరు అమీ నూర్ టినీ( Amy Nur Tinie). ఈ 29 ఏళ్ల మలేషియా నటి మాజీ అందాల రాణి కూడా. ఆమె ఇటీవల మలేషియా కంటెంట్ క్రియేటర్ సఫ్వాన్ నజ్రీ పాడ్కాస్ట్ లో పాల్గొన్న సందర్భంగా ఈ విషయాన్ని పంచుకుంది. ఈ ప్రతిపాదన తమ దేశానికే చెందిన ఓ పెద్ద వివిఐపి నుంచి వచ్చిందని ఆమె వెల్లడించింది. మలేషియాలో సాధారణంగా చాలా ఉన్నత సామాజిక ఆర్థిక హోదా కలిగిన వ్యక్తులను వివిఐపీలుగా అభివర్ణిస్తారు.కార్పొరేట్ ఈవెంట్లను నిర్వహిస్తున్నప్పుడు తాను తరచుగా అలాంటి వివిఐపిలను కలుస్తుండడం జరుగుతుందని, ఆ సమయంలో వారిలో చాలామంది తన ఫోన్ నంబర్ అడగడం సర్వసాధారణం అని తెలిపింది. అంతేకాకుండా తనను వ్యక్తిగతంగా కలవాలని కూడా ఆహ్వానిస్తారని అమీ వివరించింది. అదే విధంగా ఒక వ్యక్తి తనను కలిశాడని, నేరుగా మ్యారేజ్ ప్రపోజల్ తెచ్చాడని గుర్తు చేసుకుంది. ఆ వ్యక్తి ప్రపోజల్ను అంగీకరిస్తే ఆమెకు ఒక బంగ్లా, కారు, 10 ఎకరాల (40,000 చదరపు మీటర్లు) భూమి, 50,000 రింగిట్స్ (సుమారు రూ.11 లక్షలు) నెలవారీ భత్యం ఇస్తానని ఆఫర్ ఇచ్చాడని తెలిపింది.ప్రస్తుతం మలేషియాలో ఈ పాడ్ కాస్ట్ సంచలనంగా మారింది. ఈ సందర్భంగా ఆ వ్యక్తి గురించి ఆరా తీస్తున్నవారు గతంలో ఇదే నటి ఇచ్చిన మరో ఇంటర్వ్యూను వెలుగులోకి తెచ్చారు. అందులో మరింత వివరంగా ఆమె తాను అందుకున్న ప్రతిపాదనకు సంబంధించిన విశేషాలను వెల్లడించింది. దాని ప్రకారం... ఈ ప్రతిపాదన 2019లో జరిగిందని, ఆమె 23 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు ఆఫర్ అందుకుందని తేలింది. ఆసమయంలో ఆమె అందాల పోటీలలో చురుకుగా పోటీ పడుతోందని వెల్లడైంది. ఆ వ్యక్తి ని డాతుక్ అంటూ ఆమె పేర్కొనడం గమనార్హం. అందాల పోటీలలో పాల్గొనడానికి నిధులు సమకూర్చడానికి కార్పొరేట్ స్పాన్సర్షిప్ల అవసరం ఏర్పడడంతో...ఆ విషయంలో దాతుక్ తనకు మద్దతు ఇవ్వడానికి ముందుకొచ్చాడని అయితే అతని ఆఫర్ను తాను వెంటనే తిరస్కరించినట్టు చెప్పింది. సదరు వ్యక్తికి దాదాపు తన తండ్రి వయస్సు ఉంటుందని అంతే కాకుండా అతనికి అప్పటికే రెండు పెళ్లిళ్లు కూడా ఆయ్యాయని కూడా వివరించింది. అయితే తన తల్లి తనను అమ్మేయాలని అనుకోలేదని ఆమె చెప్పింది. ఇంకా అవివాహిత గానే ఉన్న అమీ...పాడ్కాస్ట్లో, తన జీవిత భాగస్వామిగా కాబోయేవాడు బాధ్యతాయుతంగా ఆర్థికంగా స్థిరపడి ఉంటే చాలని మరీ విపరీతమైన సంపద అవసరం లేదని చెప్పారు. ఆ ఆఫర్ ని అంగీకరించి ఉంటే తన జీవితం మరింత సుఖంగా ఉండి ఉండేదని ఆమె అంగీకరించింది, కానీ అది తాను కోరుకున్న జీవన మార్గం కాదని చెప్పింది. -
కూతురితో కలిసి పోర్చుగల్ ట్రిప్ వేసిన ప్రణీత (ఫొటోలు)
-
భర్తతో హనీమూన్ ట్రిప్లో సమంత..! (ఫొటోలు)
-
ప్రభాస్ గిఫ్ట్ ఇచ్చిన చీరలో హీరోయిన్ రిద్ధి (ఫొటోలు)
-
థ్యాంక్యూ 2025.. భాగ్యశ్రీ క్యూట్ ఫొటోలు
-
'జన నాయగణ్' ఈవెంట్ కోసం పూజా రెడీ అయిందిలా (ఫొటోలు)
-
చీరలో రీసెంట్ ట్రెండింగ్ బ్యూటీ గిరిజ (ఫొటోలు)
-
కాజల్ అగర్వాల్ డిసెంబరు జ్ఞాపకాలు (ఫొటోలు)
-
ఈవినింగ్ చిల్ అయిపోతున్న సుప్రీత (ఫొటోలు)
-
వారణాసి ట్రిప్లో అలనాటి హీరోయిన్ భాగ్యశ్రీ (ఫొటోలు)
-
బ్లాక్ డ్రెస్లో ఫుల్ గ్లామరస్గా అక్కినేని కోడలు శోభిత (ఫొటోలు)
-
ఫుడ్.. షాపింగ్.. ఇంకేం కావాలంటున్న రెజీనా! (ఫోటోలు)
-
హ్యాపీ బర్త్ డే మై హార్ట్బీట్.. భర్తకు జెనీలియా విషెస్ (ఫొటోలు)
-
సినిమా స్టోరీలా మారిన సెలబ్రిటీ లైఫ్
బెంగళూరు: నటి చైత్ర, ప్రముఖ నిర్మాత హర్షవర్ధన్కు సంబంధించిన కుటుంబ వివాదం ఇప్పుడు పోలీస్ కేసుగా మారింది. సొంత భార్యను నిర్మాత కిడ్నాప్ చేశాడంటూ చైత్ర తల్లి బెంగళూరులోని బ్యాటరాయనపుర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. నటి చైత్ర, నిర్మాత హర్షవర్ధన్ ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె ఉంది. కుటుంబ కలహాల కారణంగా దంపతులు వేరుగా నివసిస్తున్నారు. చైత్ర తన కుమార్తెను వెంట తీసుకుని మైసూరులో ఉంటుండగా, హర్షవర్ధన్ బెంగళూరులో ఉన్నట్టు సమాచారం. ఈ క్రమంలో తన కుమార్తెను చూడాలనే కారణంతో హర్షవర్ధన్ చైత్రను బలవంతంగా కిడ్నాప్ చేశాడని ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై బ్యాటరాయనపుర పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఇది కుటుంబ వివాదమా? లేక నేరుగా కిడ్నాప్ కేసా? అన్న కోణంలో పోలీసులు అన్ని అంశాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై చైత్ర, హర్షవర్ధన్ నుంచి ఇంకా అధికారిక స్పందన రావాల్సి ఉంది. View this post on Instagram A post shared by Chaitra R (@chaitraram1998official) -
తిరుమలలో నటి స్వాతి దీక్షిత్ (ఫోటోలు)
-
ప్రపంచంలో అందమైన టాప్ టెన్ హీరోయిన్స్ వీళ్లే.. ఇండియా నుంచి ఆమె ఒక్కరే..!
సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ పాత్రలకు గ్లామరస్ చాలా ముఖ్యం. టాలెంట్తో పాటు గ్లామర్ కూడా కలిసొస్తే ఇక వారికి సినీ ఇండస్ట్రీలో అవకాశాలు నల్లేరు మీద నడకే. కానీ అందంగా ఉన్నప్పటికీ సరైన హిట్ పడకపోయినా ఛాన్స్ రావడం కష్టమే. సినిమా అనే రంగుల ప్రపంచంలో అందానికి ఉన్న ప్రముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అలా ఈ ఏడాది అత్యంత అందమైన తారల గురించి చర్చించుకుందాం. ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తే టాప్ టెన్ అందమైన హీరోయిన్ల లిస్ట్లో ఇండియా నుంచి కేవలం ఒక్కరే స్థానం దక్కించుకున్నారు. ఆమె మరెవరో కాదు.. ఆదిపురుష్ భామ కృతి సనన్ మాత్రమే టాప్-5లో నిలిచింది. ఈ ఏడాదితో గానూ ఐఎండీబీ ప్రకటించిన అందాల తారల లిస్ట్లో కృతి సనన్ ఐదో స్థానం దక్కించుకుంది.మొదటి స్థానంలో ఆస్ట్రేలియాకు చెందిన మార్గోట్ రాబీ నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా అమెరికా బ్యూటీ షైలీన్ వుడ్లీ, చైనాకు చెందిన దిల్రుబా దిల్మురాత్, సౌత్ కొరియా బ్యూటీ నాన్నీ మెక్డోనీ నిలిచారు. టాప్-5 లో బాలీవుడ్ భామ కృతి సనన్ స్థానం దక్కించుకుంది. ఆ తర్వాత పాకిస్తాన్కు చెందిన హానియా అమీర్ ఆరోస్థానంలో నిలిచింది. ఆ తర్వాత వరుసగా స్పెయిన్కు చెందిన అనా డి అర్మాస్, పారిస్కు చెందిన ఎమ్మా వాట్సన్, అమెరికాకు చెందిన అంబర్ హెర్డ్, టర్కీ బ్యూటీ హ్యాండే ఎర్సెల్ నిలిచారు.Top 10 Most Beautiful Actresses in the World 2025/261. 🇦🇺 Margot Robbie2. 🇺🇸 Shailene Woodley3. 🇨🇳 Dilraba Dilmurat4. 🇰🇷 Nancy McDonie5. 🇮🇳 Kriti Sanon6. 🇵🇰 Hania Aamir7. 🇨🇺/🇪🇸 Ana de Armas8. 🇬🇧 Emma Watson9. 🇺🇸 Amber Heard10. 🇹🇷 Hande Erçel(Source: IMDb List - Top… pic.twitter.com/DlW1Hj9Pzy— Infodex (@infodexx) December 15, 2025 -
విశాఖపట్నంలో సందడి చేసిన సినీనటి కీర్తి సురేష్ (ఫొటోలు)
-
హ్యాపీ బర్త్ డే లవర్.. భర్తకు హీరోయిన్ లవ్లీ విషెస్ (ఫొటోలు)
-
పెళ్లయి ఏడాది.. కీర్తి సురేశ్ ఇంత హంగామా చేసింది? (ఫొటోలు)
-
క్యాన్సర్తో పోరాటం.. నటి పరిస్థితి విషమం!
టాలీవుడ్లో సహాయనటిగా గుర్తింపు తెచ్చుకున్న వాహిని అలియాస్ పద్మక్క చావుబతుకుల మధ్య పోరాడుతోంది. ఆమె కొంతకాలంగా రొమ్ము క్యాన్సర్తో బాధపడుతోంది. గత కొన్ని నెలలుగా చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి మరింత క్షీణించడంతో ఐసీయూలో చేర్చి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. కీమోథెరపీ, ఆపరేషన్, ఐసీయూలో ట్రీట్మెంట్ కోసం రూ.25 లక్షల నుంచి రూ.35 లక్షల వరకు ఖర్చవుతుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని నటి కరాటే కల్యాణి సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.కరాటే కల్యాణి ఎమోషనల్ పోస్ట్ఆర్టిస్ట్ జీవితం ఎప్పుడు, ఎలా మలుపు తిరుగుతుందో ఎవరికీ తెలియదు. మద్రాస్ నడిగర సంఘం సభ్యత్వం ఉండి తెలుగు సినిమాల్లో చాలా క్యారెక్టర్స్ వేసి.. అప్పుడప్పుడు సీరియల్స్లో మెరుస్తోంది పద్మక్క అలియాస్ వాహిని. ఆమె మా విజయనగంలో మా పెదనాన్న ఇంటి పక్కనే ఉండేవారు. చిన్నప్పుడు ఆమె సినిమాల్లోకి వెళ్లినప్పుడు నేను స్కూల్లో ఉన్నాను. ఈరోజు అక్కకి ఇలా క్యాన్సర్ సోకి ప్రాణాంతకంగా మారింది. మనల్ని అందరినీ అలరించిన ఈ నటి కష్టంలో ఉంది.. ఆమెను మనందరం ఆదుకుందాం..దయచేసి కాపాడండికొన్ని నెలలుగా ఆమె రొమ్ము క్యాన్సర్తో పోరాడుతున్నారు. దురదృష్టవశాత్తూ ఆమె ఆరోగ్యం విషమించింది. బహుళ అవయవాలు దెబ్బతిన్నాయి. చికిత్స మొత్తానికి రూ. 25 లక్షల నుంచి రూ.35 లక్షల మేర అవుతుందని డాక్టర్లు అంచనా వేశారు. ఇంత ఖర్చు ఆమె కుటుంబం భరించలేదు. దయచేసి ఆమె త్వరగా కోలుకునేందుకు సహాయం చేయండి అంటూ విరాళాలు పంపేందుకు ఫోన్పే, గూగుల్పే నంబర్లు, బ్యాంక్ అకౌంట్ వివరాలను జత చేసింది. ఇది చూసిన నెటిజన్లు వాహిని క్యాన్సర్ను జయించి త్వరగా కోలుకోవాలని కామెంట్లు చేస్తున్నారు.ఎవరీ వాహిని?వాహిని.. చిన్న పాత్రలతో కెరీర్ ప్రారంభించింది. తెలుగు, తమిళంలో అనేక సినిమాలు చేసింది. వెండితెరపై కంటే బుల్లితెరపైనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. జయవాహిని పేరుతో ఎక్కువ ఫేమస్ అయింది. చివరగా పోలీస్ వారి హెచ్చరిక సినిమాలో నటించింది.చదవండి: భరణి అవుట్.. సెకండ్ ఫైనలిస్ట్గా తనూజ.. కానీ ఓ ట్విస్ట్ -
Karthika Nair : నాలో ఓ భాగం కోల్పోయా.. నటి రాధ కూతురు కార్తీక ఎమోషనల్ (ఫొటోలు)
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి శ్రియ (ఫొటోలు)
-
చేతి వేళ్లన్నంటికీ రింగ్స్.. మృణాల్ ఠాకుర్ ఫ్యాషన్ (ఫొటోలు)
-
హోటల్లో 'పాయల్ రాజ్పుత్' బర్త్డే.. ఫోటోలు వైరల్
-
తెలుగు నటి జ్యోతి బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
-
చైతూ- శోభిత పెళ్లి వీడియో.. లవ్లీ మూమెంట్స్ షేర్ చేసిన శోభిత! (ఫొటోలు)
-
హీరోయిన్ రాశీఖన్నా బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
-
ఫ్యామిలీతో కరీబియన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తోన్న లయ (ఫొటోలు)
-
న్యూజిలాండ్ ట్రిప్లో నభా నటేశ్ (ఫొటోలు)
-
ఫ్రెండ్స్తో హీరోయిన్ అనిక బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
-
తమన్నా డైలీ రొటీన్ ఇలా ఉంటుందా! (ఫొటోలు)
-
దుబాయిలో చిల్ అవుతున్న అప్సరరాణి (ఫొటోలు)
-
హీరోయిన్ జెనీలియా ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)
-
పెద్ద ముక్కెరతో 'బలగం' బ్యూటీ కావ్య (ఫొటోలు)
-
తెరపై ముద్దు.. ఎలా ఉంటుందో చెప్పిన నటి!
ఇది సోషల్ మీడియా యుగం. ఎప్పుడు ఎవరు ఎలా ఫేమస్ అవుతారో తెలియదు. అసలు ఎందుకు ట్రెండ్ అవుతారనే విషయం చెప్పడం కూడా కష్టమే. గత 15 రోజులుగా ఓ నటి పేరు నెట్టింట మారుమోగుతుంది. ఎన్నో సినిమాల్లో నటించినా రాని గుర్తింపు.. ఒకే ఒక ఇంటర్వ్యూతో వచ్చింది. ఆ ట్రెండింగ్ బ్యూటీ ఎవరోకాదు మరాఠీ ముద్దుగుమ్మ గిరిజా ఓక్(Girija Oak). ఓ సినిమా కోసం గుల్షన్ దేవయ్యతో రొమాంటిక్ సీన్ చేస్తున్నప్పుడు జరిగిన ఓ ఫన్నీ ఇన్నిడెంట్ని షేర్ చేసుకోవడంతో గిరిజా పేరు నెట్టింట వైరల్గా మారింది. ఇంత వైరల్ అవుతుందని ఆమె కూడా ఊహించలేదు. ఆ ఇంటర్వ్యూ తర్వాత గిరిజాకు సంబంధించిన ఓ కిస్ సీన్ కూడా నెట్టింట చక్కర్లు కొట్టింది. తాజాగా ఈ లిప్లాక్ సీన్ గురించి కూడా స్పందించారు గిరిజా. ఓ ఇంటర్వ్యూ పాల్గొన్న ఆమెకు ముద్దు సన్నివేశాలు ఎలా షూట్ చేస్తారు? రొమాంటిక్ సీన్ల షూటింగ్కి ప్రత్యేకమైన నైపుణ్యం ఏమైనా అవసరం ఉంటుందా? అనే ప్రశ్నలు ఎదురయ్యాయి. వాటికి గిరిజా సమాధానం ఇస్తూ.. అదంతా మెకానికల్గా ఉంటుంది తప్ప..నిజమైన భావాలకు ఏమాత్రం చోటు ఉండదని స్పష్టం చేసిది.‘షూటింగ్ సమయంలో సౌండ్కి ఇబ్బంది అవుతుందని ఏసీలను సైతం ఆఫ్ చేస్తారు. చెమటలు కారుతూనే ఉంటాయి. ఒకరు వచ్చి చెమటలు తూడుస్తుంటారు. మరొకరు వచ్చి హెయిర్ని సెట్ చేస్తుంటారు. ఇంకోవైపు లైట్ సరిగా పడడం లేదంటూ థర్మాకోల్ తీసుకొస్తారు.. ఇలా ఇన్ని కళ్లు చూస్తున్నప్పుడు రొమాన్స్ ఎక్కడ నుంచి వస్తుంది? అదంతా మెకానికల్, టెక్నికల్ ప్రాసెస్ మాత్రమే. ఆ సీన్లు షూట్ చేసేటప్పుడు హీరో ముఖం కంటే ఎక్కువగా సౌండ్ ఇంజనీరింగ్ ముఖమే గుర్తుకు వస్తుంది’ అని నవ్వుతూ చెప్పింది గిరిజా.ఇక ముద్దు సీన్ గురించి మాట్లాడుతూ.. తెరపై కిస్ అంటే.. కార్ట్బోర్డ్ని ముద్దు పెట్టుకున్నట్లే ఉంటుందని చెప్పింది. క్లోజప్ సీన్స్ తీసేటప్పుడు ఎదుటివాడు అక్కడ ఉండడు కూడా. కెమెరాని చూస్తూనే నటించాల్సి ఉంటుంది. అక్కడ ఏ మాత్రం ఎమోషన్ ఉండదు. చాలా సార్లు నేను కెమెరా దగ్గర ఉన్న ఒక స్టాండ్ లేదా థర్మాకోల్ ముక్కను చూస్తూ రొమాంటిక్ డైలాగులు చెప్పాను’ అని గిరిజా చెప్పుకొచ్చింది.ఎవరీ గిరిజా?స్వతహాగా మరాఠీ నటి అయిన గిరిజా ఓక్.. హిందీలోనూ పలు మూవీస్ చేసింది. బాలీవుడ్లో 'తారే జమీన్ పర్' ఈమె మొదటి సినిమా. ఆ తర్వాత సొంత భాష మరాఠీతో పాటు హిందీలోనూ షోర్ ఇన్ ద సిటీ(2010), కాలా, జవాన్ (2023) చిత్రాలు చేసింది. రీసెంట్గా ఓటీటీలో రిలీజైన ఇన్స్పెక్టర్ జెండే మూవీలోనూ కనిపించింది. -
అలనాటి హీరోయిన్ రాధ కూతురు.. పెళ్లయి రెండేళ్లయిపోయిందా? (ఫొటోలు)
-
తెలుసు కదా మూవీ సెట్లో సరదా సరదాగా కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి (ఫోటోలు)
-
జీన్స్ డ్రెస్సులో మెరుస్తున్న అక్కినేని కోడలు శోభిత (ఫోటోలు)
-
నా సూపర్స్టార్ వీడే.. కొడుకు గురించి కాజల్ క్యూట్ పోస్ట్ (ఫొటోలు)
-
అది నేను తీసుకున్న చెత్త నిర్ణయం.. రెండో పెళ్లి చేసుకుంటా!
ఒకప్పుడు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసిన జ్యోతి చాలాకాలంగా వెండితెరపై కనిపించడమే లేదు. ఆ మధ్య తెలుగు బిగ్బాస్ మొదటి సీజన్లోనూ పాల్గొంది. కానీ, ఎక్కువ వారాలు ఉండలేకపోయింది. ఇటీవల కొడుకుతో కలిసి కొత్తింట్లోకి గృహప్రవేశం చేసి మరోసారి వార్తల్లోకెక్కింది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను పంచుకుంది.అందుకే గ్యాప్నేను పుట్టింది ఒరిస్సాలో అయినా విశాఖపట్నంలో పెరిగాను. 24 ఏళ్లుగా హైదరాబాద్లో ఉంటున్నాను. చిన్నప్పుడు డ్యాన్స్ అంటే పిచ్చి. హీరోయిన్ అవుదామనే హైదరాబాద్కు వచ్చాను. మొదటిసారి అందం సినిమా ఆడిషన్స్కు వెళ్లి సెలక్ట్ అయ్యాను. అలా సినిమాలు చేసుకుంటూ పోయాను. వ్యాంప్ తరహా పాత్రలే తరచూ అడగడంతో కెరీర్కు గ్యాప్ ఇచ్చాను. అయినప్పటికీ ఇప్పటికీ ఐటం సాంగ్స్ చేయమని అడుగుతున్నారు.పెళ్లి చేసుకుని తప్పు చేశా..ఏ సినిమాకు నేను కమిట్మెంట్ ఇవ్వలేదు. అయితే కెరీర్ బాగున్న దశలో పెళ్లి చేసుకుని తప్పటడుగు వేశాను. నేను ఒకబ్బాయిని ప్రేమించాను. వాడు నన్ను మోసం చేశాడు. ఆ కోపంలో నాకు ప్రపోజ్ చేసిన మరో అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను. అదే నేను తీసుకున్న చెత్త నిర్ణయం. బాబు పుట్టిన రెండేళ్లకే మాకు విడాకులయ్యాయి. అప్పటినుంచి సింగిల్గానే ఉన్నాను. విడాకులయ్యాక ఆర్థిక ఇబ్బందులు ఎదురుచూశాను. రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మంచి అబ్బాయి దొరికితే పెళ్లి చేసుకుంటాను.అద్దంలో చూసుకుని..అందరివాడు సినిమాలో చిరంజీవితో కాంబినేషన్ సీన్ ఉంది చేస్తావా? అని అడిగారు. ఆయన స్ఫూర్తితోనే ఇండస్ట్రీకి వచ్చిన నేను సంతోషంతో ఓకే చెప్పాను. తీరా చూస్తే చిరంజీవిని పెళ్లి చూపుల్లో రిజెక్ట్ చేసే సీన్ అది. ఆ సన్నివేశం చేసి ఇంటికొచ్చాక అద్దంలో నన్ను నేను చూసుకుని తూ, నేను చిరంజీవిని రిజెక్ట్ చేయడమేంటి? అని నన్ను నేను తిట్టుకున్నాను.సినిమాఅలాగే ఈ కాలం అమ్మాయిలకు ఓ విషయం చెప్పాలనుకుంటున్నా.. పెళ్లయినవాడి జోలికెళ్లకండి.. అంతకంటే దారుణం మరొకటి ఉండదు, తర్వాత మీరే బాధపడాల్సి వస్తుంది అని చెప్పుకొచ్చింది. జ్యోతి.. పెళ్లాం ఊరెళితే, ఎవడిగోల వాడిది, మహాత్మ, దరువు, కెవ్వు కేక వంటి పలు చిత్రాల్లో నటించింది.చదవండి: బిగ్బాస్ 9 సంజనాకి ఫ్యామిలీ వీక్ లేనట్లేనా? -
మృణాల్ 'డకాయిట్' షూటింగ్ జ్ఞాపకాలు (ఫొటోలు)
-
సిద్ధార్థ్ సతీమణి ఆదితి రావు హైదరీకి అరుదైన అవార్డ్ (ఫొటోలు)
-
ప్రముఖ బాలీవుడ్ నటి ఇకలేరు: ఒక శకం ముగిసింది!
ప్రముఖ బాలీవుడ్ నటి కామిని కౌశల్ (Kamini Kaushal ) (98) కన్నుమూశారు. దీంతో బాలీవుడ్లో ఒక శకం ముగిసింది అంటూ బాలీవుడ్ పెద్దలు ఆమె మరణంపై సంతాపం వెలిబుచ్చారు. బాలీవుడ్ స్వర్ణయుగం నాటి మిగిలిన చివరితారల్లో కామిని కౌశల్ ఒకరంటూ గుర్తు చేసుకున్నారు. ఈ కష్టసమయంలో తమ గోప్యతను గౌరవించాలని కామిని కౌశల్ కుటుంబం విజ్ఞప్తి చేసింది.కామిని కౌశల్ 1927, ఫిబ్రవరి 24న జన్మించారు. 1946లో 'నీచా నగర్' చిత్రంతో బాలీవుడ్లోకి అడుగు పెట్టారు. ఈ మూవీ మొదటి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ చిత్ర అవార్డును గెలుచుకుంది. పామ్ డి'ఓర్ను గెలుచుకున్న ఏకైక భారతీయ చిత్రంగా మిగిలిపోయింది. అంతేకాదు ఇదే చిత్రానికి కామిని కౌశల్ మాంట్రియల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డును గెలుచుకున్నారు.చాలా తక్కువ సమయంలోనే మంచి పేరు తెచ్చుకుని, పాపులర్ నటిగా ఎదిగారు. 1946 -1963 వరకు అనేక చిత్రాల్లో నటించి తన ప్రతిభను చాటుకున్నారు. దో భాయ్ (1947), షహీద్ (1948), నదియా కే పార్ (1948), జిద్ది (1948), షబ్నం (1949), పరాస్ (1949), నమూన (1949), అర్జూ (1950), ఝంజర్ (1953), ఆబ్రూ (1956), బడే సర్కార్ (1957), జైలర్ (1958), గోదాన్ (1963) మొదలైనవి ఆమెకు పేరు తెచ్చిన గొప్ప చిత్రాలు. కొత్తవారితో పాటు, స్టార్ హీరోలైన రాజ్ కపూర్, దేవ్ ఆనంద్, దిలీప్ కుమార్, అశోక్ కుమార్, కిషోర్ సాహు, సజ్జన్, శేఖర్, అభి భట్టాచార్య, సోహ్రాబ్ మోడీ, అజిత్, మురాద్ , రాజ్ కుమార్ వంటి వారందరితోనూ నటించారు. 70ల వరకు కూడా ఆమె నటనను కొనసాగించారు. దో రాస్తే (1969), ప్రేమ్ నగర్ (1974), మహా చోర్ (1976 అన్హోనీ (1973) చిత్రాలలో నటించి, యువ నటులు కూడా అసూయ పడేలా తన నైపుణ్యాన్ని చాటుకున్నారు. చివరిసారిగా 2022లో లాల్ సింగ్ చద్దా సినిమాలో కనిపించారు. కామిని కౌశల్.పిల్లల కోసం కామిని కౌశల్సినిమాలతో పాటు, కామిని కౌశల్ పిల్లల పత్రిక పరాగ్ కోసం అనేక కథలు రాశారు. 70ల చివరలో చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీకి అధ్యక్షురాలిగా పనిచేశారు. ఖేల్ ఖిలోన్ సహా దూరదర్శన్లో పిల్లల కోసం అనేక టీవీ సీరియల్స్ కూడా చేశారు. తన బ్యానర్ గుడియా ఘర్ ప్రొడక్షన్స్ (1989 - 1991 వరకు) కింద చాంద్ సితారే, చాట్ పానీ , చందమామ వంటి తోలుబొమ్మ ఆధారిత టీవీ కార్యక్రమాలను నిర్వహించారు. ఆమె స్వయంగా తోలుబొమ్మలను తయారు చేసి, విభిన్న పాత్రలకు అనుగుణంగా తన గొంతుతో ప్రాణం పోశారు. ఒక నటిగా ఆమె సినిమా రంగం నుంచి శాశ్వతంగా సెలవు తీసుకోవడం మాత్రమే కాదు బ్లాక్ అండ్ వైట్ సినిమాల నుంచి డిజిటల్ యుగానికి భారతీయ సినిమా పరుగులు తీసిన పరిణాక్రమం నుంచి కూడా నిష్క్రమించడం. అయితే భారతీయ సినిమాలో ఆమె పేరు ఎప్పటికీ శాశ్వతమే అంటూ పలువురు కామిని కౌశల్ అస్తమయంపై నివాళులర్పించారు. -
బీచ్ ఒడ్డున సంయుక్త.. ఇంత అందమా? (ఫొటోలు)
-
తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ అంజలి (ఫొటోలు)
-
ట్రెడిషనల్ లుక్లో సురేఖవాణి కూతురు సుప్రీత (ఫొటోలు)
-
తెలుగమ్మాయి ఆనంది గ్లామరస్ ఫొటోలు
-
అను ఇమ్మాన్యుయేల్ 'ద గర్ల్ఫ్రెండ్' జ్ఞాపకాలు (ఫొటోలు)
-
ముద్దమందారం అంతా క్యూట్గా బ్రిగిడ (ఫొటోలు)
-
రష్మిక 'ద గర్ల్ఫ్రెండ్' సినిమా (ఫొటోలు)
-
తిరుమల శ్రీవారి సేవలో నటి దివి (ఫొటోలు)
-
ప్రముఖ గాయని, నటి కన్నుమూత, సరిగ్గా అదే రోజు
ప్రముఖ నటి, గాయని సులక్షణా పండిట్ (71) (Sulakshana Pandit) గురువారం (నవంబర్ 6) అర్ధరాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. . దీర్ఘకాలం అనారోగ్యంతో బాధపడుతున్న గాయని ముంబైలోని నానావతి ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. మనోహరమైన గాత్రం, చిరస్మరణీయ నటనకు పేరుగాంచిన ప్రముఖ గాయని మరణంతో సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. యాదృచ్ఛికంగా దివంగత నటుడు, తాను ఎంతో ప్రేమించిన సంజీవ్కుమార్ వర్ధంతి రోజే 40 ఏళ్లకు ఆమె ఈ లోకంనుంచి శాశ్వతంగా సెలవు తీసుకుంది.సులక్షణ పండిట్ -సంజీవ్ కుమార్ ప్రేమ1975లో వచ్చిన ఉల్జాన్ సినిమాలో సులక్షణ పండిట్ ,సంజీవ్ కుమార్ కలిసి నటించారు. ఆ సినిమా సెట్స్ లో ఆమె అతనితో ప్రేమలోపడింది. పెళ్లి చేసుకోవాలని భావించి, పెళ్లి ప్రపోజ్ చేసింది కూడా. అయితే దీర్ఘకాలిక గుండె జబ్బుతో బాధపడుతున్న తాను ఎక్కువ కాలం అనేభావనతో ఆమె ప్రేమను సున్నితంగా తిరస్కరించారట. 1985, నవంబర్ 6న సంజీవ్ కుమార్ మరణించాడు. అయితే సంజీవ్ కుమార్ మరణం తర్వాత తాను మానసికంగా కలత చెందాను, కుంగిపోయాను, చాలా కృంగిపోయానని ఒక సందర్భంలో స్వయంగా చెప్పారు సులక్షణ పండిట్ .అటు సినిమా ఆఫర్లు, పాడు అవకాశాలు తగ్గిపోయాయి. ఆ తర్వాత ఆమె తల్లి మరణం సులక్షణ పండిట్ను మానసికంగా, శారీరకంగా తీవ్రంగా దెబ్బతీసింది. ఆమె స్టార్డమ్ నుండి క్రమంగా దూరమైంది. దీనికి తోడు ఆరోగ్య సమస్యలు, పేదరికంతో బాధపడింది. అనుభవించింది. సోదరి, నటుడు విజయత పండిట్ , ఆమె భర్త, సంగీత స్వరకర్త ఆదేశ్ శ్రీవాస్తవతో కలిసి జీవించేది 2007లో తిరిగి ఇండస్ట్రీలోకి రావడానికి కూడా ప్రయత్నించింది.సులక్షణ పండిట్,కొన్ని ఆసక్తికర సంగతులు చత్తీస్గఢ్లోని రాయ్గఢ్లో జూలై 12, 1954న జన్మించిన సులక్షణ పండిట్ సంగీతం కుటుంబం నుంచి వచ్చారు. ఆమె ప్రఖ్యాత శాస్త్రీయ గాయకుడు పండిట్ జస్రాజ్ మేనకోడలు , సంగీత స్వరకర్త ద్వయం జతిన్-లలిత్ సోదరి. సులక్షణ తొమ్మిదేళ్ల వయసులోనే తన సంగీత ప్రయాణాన్ని ప్రారంభించింది. 1967లో తన నేపథ్య గాయనిగా అరంగేట్రం చేసింది. సంకల్ప్ (1975)లోని ‘తు హి సాగర్ హై తు హి కినారా’ పాట ఏకంగా ఉత్తమ మహిళా నేపథ్య గాయనిగా ఫిలింఫేర్ అవార్డును సంపాదించి పెట్టింది.తక్దీర్ (1967) చిత్రం నుండి లతా మంగేష్కర్తో ఆమె యుగళగీతం ‘సాత్ సమందర్ పార్ సే’ మరో అద్భుతమైన గీతం. నటిగా కూడా ఆమెది ప్రత్యేక స్థానమే. సంజీవ్ కుమార్ సరసన ఉల్జాన్ (1975) చిత్రంతో ఆమె నటనా రంగ ప్రవేశం చేసింది. సంకోచ్ (1976), హేరా ఫేరి, అప్నాపన్, ఖండాన్ మరియు వక్త్ కి దీవార్ వంటి ప్రముఖ చిత్రాలలో నటించింది. బాలీవుడ్ స్టార్ హీరోలు రాజేష్ ఖన్నా, జీతేంద్ర, వినోద్ ఖన్నా, శశి కపూర్ , శత్రుఘ్న సిన్హాతో నటించి ప్రశంసలందుకుంది. చదవండి: నటికి జర్నలిస్టు అవమానకర ప్రశ్న : చిన్మయి ఫైర్ -
నటికి జర్నలిస్టు అవమానకర ప్రశ్న : సిగ్గుచేటంటూ నెటిజన్లు ఫైర్
సమాజంలో, ముఖ్యంగా సినీ సమాజంలో నటీ మణులు, హీరోయిన్లపై, శరీరాలపై అవమానకర (Bodyshaming) వ్యాఖ్యలు పరిపాటిగా మారిపోయాయి. తాజాగా తమిళ నటి గౌరీ కిషన్ (Gouri Kishan) శరీరాన్ని అవమానించేలా ఒక ప్రెస్మీట్లో అడిగిన ప్రశ్న ఆగ్రహ జ్వాలల్ని రగిలించింది. సినిమా ప్రమోషన్లో భాగంగా చెన్నైలో జరిగిన ప్రెస్ ఈవెంట్లో తన బరువు గురించి తమిళ యూట్యూబ్ మీడియా జర్నలిస్టు ‘మిమ్మల్ని ఎత్తితే ఎంత బరువు ఉంటారు?’ అని అడిగిన ప్రశ్నకు గౌరీ కిషన్ తీవ్రంగా స్పందించింది. నటిగా నా నటన గురించి అడిగాలి, సినిమా గురించి అడగాలి కానీ, నా శరీర బరువు గురించి అడగడం ఏమిటంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే ప్రశ్న ఒక పురుష నటుడి బరువు గురించి అడుగుతారా అని కూడా ఆమె ప్రశ్నించింది. పైగా బరువు గురించి అడిగిన ప్రశ్న కరెక్టే అని ఒక పురుష జర్నలిస్ట్ వాదించడం దిగ్భ్రాంతికి గురిచేసిందనీ, ఇది జర్నలిజం కాదు. వేధింపులతో సమానమని పేర్కొంది. జర్నలిస్టులు వృత్తికి అవమానం తెస్తున్నారంటూ సీరియస్ అయ్యింది.దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చర్చకు దారి తీసింది. ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద నటికి మద్దతుగా నిలిచారు. మహిళలపై ఆబ్జెక్టిఫికేషన్, బాడీ షేమింగ్కు అడ్డుకోవాల్సిందే అంటూ వ్యాఖ్యానించారు. గౌరీ కిషన్ తన రాబోయే చిత్రం 'అదర్స్' కోసం చెన్నైలో జరిగిన ప్రెస్ మీట్ సందర్భంగా ఈ ఘటన జరిగింది. చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగికత గురించి చర్చకు దారితీసింది. గౌరీ స్పందనతో అక్కడే వున్న ఆదిత్య మాధవన్ మౌనం కూడా ఈ చర్చకు ఆజ్యం పోసింది.క్షమాపణలు కోరిన హీరోఅయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌరీ సహనటుడు, నటుడు ఆదిత్య మాధవన్ దీనిపై స్పందిస్తూ అందరికీ క్షమాపణలు చెప్పారు. తన మౌనం బాడీ షేమ్ చేయడాన్ని ఆమోదించినట్టుకాదనీ, కానీ ఆ సందర్భంలో స్తంభించి పోవడంతో తన నోట మాట రాలేదంటూ చెప్పుకొచ్చాడు. అయినా తాను జోక్యం చేసుకుని ఉండి ఉంటే బాగుండు అన్నారు.చిన్మయి స్పందనగాయని చిన్మయి శ్రీపాద ఆమె ధైర్యాన్ని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు."గౌరీ అద్భుతమైన పని చేసింది. అగౌరవకరమైన, అనవసరమైన ప్రశ్న అడిగిన క్షణం, అరుపులు, ఎదురుదెబ్బలు వినిపిస్తాయి. ఇంత చిన్న వయస్సులో ఇంత ధైర్యంగా నిలబడినందుకు చాలా గర్వంగా ఉంది. ఏ పురుష నటుడిని కూడా బరువు గురించి అడగరు అంటూ ఆమె అసహనం వ్యక్తం చేశారు.అటు పలువురు మహిళా జర్నలిస్టులు, పలువురు నెటిజన్లు గౌరీ ధైర్యాన్ని మెచ్చుకున్నారు. హీరో, దర్శకుడు అక్కడే ఉండి కూడా మౌనంగా ఉండటం ఇద్దరికీ సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. కాగా బాల నటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన గౌరీ కిషన్ తనదైన నటన, ప్రతిభతో హీరోయిన్గా రాణిస్తోంది తెలుగు, తమిళంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.Thank you @Chinmayi Women like you inspire us to stand our ground. Your support means a lot to me, thank you. https://t.co/SbfN3eCyEp— Gouri G Kishan (@Gourayy) November 6, 2025 -
న్యూయార్క్లో చిల్ అవుతోన్న కన్నప్ప హీరోయిన్ ప్రీతి ముకుందన్.. ఫోటోలు
-
ఇంట్లోనే అనన్య బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
భర్త పుట్టినరోజు.. వింటేజ్ ఫొటోలతో సమీరా రెడ్డి (ఫొటోలు)
-
కాజల్ అగర్వాల్ పెళ్లయి ఐదేళ్లు.. పోస్ట్ వైరల్ (ఫొటోలు)
-
సాయిపల్లవి 'అమరన్' జ్ఞాపకాలు (ఫొటోలు)
-
వెెకేషన్లో చిల్ అవుతోన్న హీరోయిన్ రాశి ఖన్నా (ఫోటోలు)
-
నిషా అగర్వాల్ కొడుకు బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
'బైసన్' కోసం పల్లెటూరి అమ్మాయిలా మేకప్ లేకుండా (ఫొటోలు)
-
ఇండస్ట్రీలో విషాదం మిగిల్చిన అక్టోబరు
వయసు పెరిగిన తర్వాత ఎప్పుడో ఒకప్పుడు తుదిశ్వాస విడువక తప్పదు. అయితే ఇండస్ట్రీలో గత కొన్నిరోజులుగా సంభవిస్తున్న సెలబ్రిటీల వరస మరణాలు మాత్రం చాలా విషాదాన్ని నింపాయని చెప్పొచ్చు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఆరుగురు వరకు రోజుల వ్యవధిలో మరణించారు. ఇప్పుడీ విషయం చర్చనీయాంశంగా మారిపోయింది. ఇంతకీ ఆయా నటీనటులు ఎవరు?నటి డ్యాన్సర్ మధుమతి.. అనారోగ్య సమస్యల కారణంగా 87 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. 1960, 70ల్లో పలు సినిమాలు చేసిన ఈమె.. అక్షయ్ కుమార్, గోవింద లాంటి స్టార్స్కి డ్యాన్స్ నేర్పించింది. ఈమె అక్టోబరు 15న చనిపోయింది.మధుమతి చనిపోయిన రోజునే పంకజ్ ధీర్ అనే సీనియర్ నటుడు కూడా మృతి చెందారు. 'మహాభారతం'లో కర్ణుడిగా చేసిన ఈయన.. చాన్నాళ్లుగా క్యాన్సర్తో బాధపడుతూ కన్నుమూశారు. 'చంద్రకాంత'లో ఈయన యాక్టింగ్ చాలా పాపులర్.నటుడు, కమెడియన్ గోవర్ధన్ అశ్రానీ(84).. ఈ అక్టోబరు 20న చనిపోయారు. ఊపిరితిత్తుల్లో నీరు చేరడం ఈయన మరణానికి కారణం. ఈయన షోలే సినిమాలో జైలర్ పాత్ర పోషించి ఫేమ్ సొంతం చేసుకున్నారు. ఈయన యాక్టర్, కమెడియన్, దర్శకుడిగా పలు విభాగాల్లో పనిచేశారు.సింగర్ రిషభ్ టండన్.. దీపావళి పండగని కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకొనేందుకు ఢిల్లీ వెళ్లారు. కానీ అక్టోబరు 21న గుండెపోటుతో మరణించారు. ఈయన వయసు అయితే 35 ఏళ్లే. మరీ చిన్న వయసులో చనిపోవడంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.మనం చూసిన ఎన్నో యాడ్స్ సృష్టించిన పీయూష్ పాండే.. అక్టోబరు 24న కన్నుమూశారు. గత కొన్ని వారాలుగా న్యూమోనియాతో పోరాడిన ఈయన 70 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. ప్రధాని మోదీ, సచిన్ టెండూల్కర్ తదితరులు ఈయనకు సంతాపం తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు.ప్రముఖ నటుడు-కమెడియన్ సతీష్ షా.. 74 ఏళ్ల వయసులో ముత్రపిండాల సమస్యతో ఇబ్బంది పడుతూ అక్టోబరు 25న మరణించారు. సరాభాయ్ vs సరాభాయ్, దిల్ వాలియా దుల్హానియా లే జాయేంగే తదితర చిత్రాలతో ఈయన చాలా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇలా ఈ నెల 15-25వ తేదీల్లో ఏకంగా ఆరుగురు బాలీవుడ్ సెలబ్రిటీలు చనిపోవడం బాధాకరమైన విషయం. -
పసిబిడ్డను చంపేయమని అడిగా.. నాపై ఉమ్మేశారు!: కస్తూరి
ముక్కుసూటి వైఖరితో ఎప్పుడూ వివాదాల్లో నానుతూ ఉంటుంది నటి కస్తూరి శంకర్ (Kasthuri Shankar). తమిళనాడులోని అంతఃపురంలో సేవలు చేసేందుకు తెలుగువారు వచ్చారని.. అందులో కొందరు ఇప్పుడు తమిళులుగా చెలామణి అవుతున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకుగానూ జైలుకు కూడా వెళ్లొచ్చింది. తాజాగా ఆమె తన సినీ జీవితం, జైలు జీవితం గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చిందిఅపార్థం చేసుకున్నారుకస్తూరి మాట్లాడుతూ.. 'నేను యాంకర్గా కెరీర్ ప్రారంభించాను. ఆ సమయంలో నాగార్జున షేక్హ్యాండ్ ఇచ్చారు. తర్వాత ఆయనతోనే అన్నమయ్య సినిమాలో నటించాను. అందుకు చాలా హ్యాపీ. గతేడాది నాకు అస్సలు కలిసిరాలేదు. ఓ రాజకీయ వేదికపై నేను చెప్పిన మాటల్ని ట్విస్ట్ చేసి వైరల్ చేశారు. నాపై నింద వేసి మరీ జైల్లో వేశారు. తెలుగు భాష అన్నా, ఇక్కడివారన్నా నా ఫ్యామిలీలాగా భావిస్తాను. ఆ అభిమానంతోనే ఇక్కడ సెటిలయ్యాను. అలాంటిది వీళ్లందరూ నన్ను అపార్థం చేసుకున్నారన్నదే నా పెద్ద బాధ!బ్లడ్ క్యాన్సర్సినిమాల్లో చూపించినట్లుగా జైలు జీవితం ఉండదు. జైలుకు వెళ్లిన రోజు నా జీవితంలోనే వరస్ట్. ఇకపోతే నా జీవితం అయిపోయింది అని బాధపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. మా అమ్మ ఆరోగ్యం బాగుచేయాలని ఆరేళ్లు కష్టపడ్డాం. కానీ చనిపోయింది. అమ్మ పోయిన ఐదు నెలలకే నాన్న మరణించాడు. తర్వాత మా అమ్మాయిని చావు అంచుల నుంచి బయటకు తీసుకొచ్చాం. తనకు బ్లడ్ క్యాన్సర్.. ట్రీట్మెంట్ పని చేయలేదు. ప్రపంచంలో 200 మందికి మాత్రమే వచ్చే అరుదైన బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. తనను పోగొట్టుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలన్నారు. అదే నాకు పెద్ద పరీక్ష, బాధ! నా కూతురి పేరిట మను మిషన్ అని ఓ స్వచ్చంద సంస్థను ప్రారంభించాను. రైల్వే ట్రాక్పై పసిబిడ్డ దొరికిందిఈ చారిటీ ద్వారా అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారులకు ఏదైనా బహుమతులు, దుస్తులు ఇవ్వడం లాంటి చిన్నచిన్న పనులు చేస్తుంటాం. అలా చేస్తుండగా ఓసారి రైల్వే ట్రాక్పై ఓ పసిబిడ్డను చూశాను. తనకు రెండేళ్లు.. కానీ చూసేందుకు ఐదు నెలల పిల్లాడిలా ఉంటాడు. రోడ్లపై అడుక్కోవడం కోసం ఆ చిన్నారిని ఎదగనివ్వలేదు. నోట్లో సారా పోసి పడుకోబెట్టేవారు. ఆ బిడ్డను అవసరమైనంతవరకు వాడుకుని తర్వాత రైల్వే ట్రాక్పై పడేశారు. ఆ బాబును ఆస్పత్రికి తీసుకెళ్తే కాలేయం పూర్తిగా పాడైందన్నారు.చావును ప్రసాదించమన్నా..మానసిక ఎదుగుదల లేదని చెప్పారు. వారంపాటు నేన ట్రీట్మెంట్ చేయించాను. ఏమాత్రం బెటర్మెంట్ లేకపోయేసరికి నేను ధైర్యం తెచ్చుకుని ఓ మాట అడిగాను. తనకు ఎదుగుదల లేనప్పుడు వైద్యం చేయించి ఇంకా నరకంలోకి తోయడం ఎందుకు? తనను మెర్సీ కిల్లింగ్(చావు ప్రసాదించడం)కి వదిలేయొచ్చుగా అని అడిగాను. అందుకు డాక్టర్.. అలా చావాలని రాసుంటే ఆకలిదప్పికలతో ఎప్పుడో చచ్చిపోయేవాడు. బతికున్నాడంటే అతడొక ఫైటర్. నాపై ఉమ్మేశారుతనను బతికించడం మా బాధ్యత అన్నారు. ప్రస్తుతానికైతే బాబు పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే చావును మనం నిర్ణయించకూడదు. బతకడం మాత్రమే మన కర్తవ్యం అని చెప్పుకొచ్చిందిది. తనకు ఎదురైన ఓ చెత్త అనుభవం గురించి చెప్తూ.. ఓసారి దగ్గర్లో ఉన్న ఏటీఎమ్ కోసం నడుచుకుంటూ వెళ్లాను. ఇంతలో ఓ బస్సులో నుంచి ఒకరు నా మీద ఉమ్మేశారు అని తెలిపింది.చదవండి: 'రూ.2 కోట్లిస్తావా? ప్రైవేట్ వీడియోలు బయటపెట్టమంటావా?' -
నచ్చిన ఫుడ్ లాగించేస్తున్న విశ్వంభర బ్యూటీ (ఫోటోలు)
-
కెనడా ట్రిప్లో అలనాటి హీరోయిన్ భాగ్యశ్రీ (ఫొటోలు)
-
భర్తతో మొదటిసారి నటి అభినయ దీపావళి సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
నటి అనసూయ ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
హైదరాబాద్లో షూటింగ్స్ సందడి
కొందరు సెట్స్లో... కొందరు నేచురల్ లొకేషన్స్లో... ఇలా హైదరాబాద్లో షూటింగ్ చేస్తూ ఈ వారం అంతా బిజీ బిజీగా గడిపారు కొందరు స్టార్స్. ఆదివారం, దీపావళికి సోమవారం బ్రేక్ తీసుకోనున్న స్టార్స్ కొందరైతే... హాలిడే లేకుండా షూట్లో పాల్గొననున్న స్టార్స్ కూడా ఉన్నారు. ఇక గత ఆరేడు రోజులుగా హైదరాబాద్లో ఏయే సినిమాల షూటింగ్స్ జరి గాయో తెలుసుకుందాం.సెట్లో శంకరవరప్రసాద్... చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. ‘పండక్కి వస్తున్నారు’ అనేది ఉపశీర్షిక. వెంకటేశ్ హీరోగా నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ (2025) వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. ఈ మూవీలో నయనతార హీరోయిన్గా నటిస్తున్నారు. ‘సైరా: నరసింహారెడ్డి’ చిత్రం తర్వాత చిరంజీవి, నయనతార జోడీగా కలిసి నటిస్తున్న సినిమా ఇది. అయితే ‘గాడ్ఫాదర్’ సినిమాలో చిరంజీవికి చెల్లెలుగా నయనతార నటించిన సంగతి తెలిసిందే. ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రంలో హీరో వెంకటేశ్, హీరోయిన్ కేథరిన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్ బ్యానర్పై సాహు గారపాటి, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు.ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ చిత్రం కీలక షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. అన్నపూర్ణ సెవన్ ఎకర్స్ స్టూడియోలో వేసిన ప్రత్యేకమైన సెట్లో చిరంజీవి, నయనతార, కేథరిన్, నటుడు సచిన్ ఖేడేకర్లతో పాటు ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు అనిల్ రావిపూడి. చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి నటిస్తున్న పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రం ఇది. ఈ మూవీలో చిరంజీవి–నయనతార భార్యాభర్తలుగా నటిస్తున్నారు. ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రం 2026 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే.. చిరంజీవి హీరోగా మల్లిడి వశిష్ట దర్శకత్వం వహించిన ‘విశ్వంభర’ సినిమా 2026 వేసవిలో రిలీజ్ కానుంది.ఆర్ఎఫ్సీలో అడ్వెంచర్ మహేశ్బాబు హీరోగా అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతోన్న చిత్రం ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ (వర్కింగ్ టైటిల్). రామ్చరణ్, ఎన్టీఆర్లతో ‘ఆర్ఆర్ఆర్’ (2022) వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఈ సినిమాలో ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రధారులు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్పై కేఎల్ నారాయణ నిర్మిస్తు్త్తన్నారు. ఈ సినిమా కోసం మహేశ్బాబు పొడవాటి హెయిర్ స్టైల్, గెడ్డంతో ప్రత్యేకంగా మేకోవర్ అయిన సంగతి తెలిసిందే. ఆయన లుక్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ సినిమా నుంచి ఇప్పటివరకూ మహేశ్బాబుకి సంబంధించిన ఎలాంటి లుక్ అధికారికంగా చిత్రయూనిట్ విడుదల చేయలేదు. అయితే చిత్రీకరణ సమయంలోని కొన్ని ఫొటోలు లీక్ అయిన సంగతి తెలిసిందే.అమేజాన్ అడవుల నేపథ్యంలో భారీ అడ్వెంచరస్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ మూవీ కోసం ప్రత్యేకంగా వేసిన సెట్లో మహేశ్బాబుతో పాటు ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట రాజమౌళి. సూపర్ స్టార్ మహేశ్బాబు, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా ఇండస్ట్రీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రాన్ని దాదాపు రూ. 1000 కోట్ల బడ్జెట్తో పాన్ వరల్డ్ రేంజ్లో నిర్మిస్తున్నారనే టాక్ నడుస్తోంది.ఈ చిత్రాన్ని 120 దేశాల్లో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటివరకు ఏ భారతీయ సినిమాకీ లభించని ఘనత ‘ఎస్ఎస్ఎమ్బీ 29’కి దక్కనుందని టాక్. హైదరాబాద్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత కెన్యా దేశంలో ఈ సినిమా చిత్రీకరణని ΄్లాన్ చేశారు రాజమౌళి. ఇప్పటికే ఆయన అక్కడి లొకేషన్స్ని కూడా పరిశీలించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన మొదటి బిగ్ రివీల్ ఈ నవంబరులో రానుండటంతో అందరిలో ఎంతో క్యూరియాసిటీ నెలకొంది.యాక్షన్ ఎంటర్టైనర్... పవన్ కల్యాణ్ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ‘గబ్బర్సింగ్’ (2012) తర్వాత హీరో పవన్ కల్యాణ్– డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతోన్న ద్వితీయ చిత్రమిది. ఈ సినిమాలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సీన్స్ని తెరకెక్కిస్తున్నారట హరీష్ శంకర్. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా దాదాపు పూర్తి కావొచ్చిందట. నవంబరు చివరికల్లా చిత్రీకరణ మొత్తం పూర్తవుతుందని ఫిల్మ్నగర్ టాక్.హిట్ కాంబినేషన్లో... హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరిలది హిట్ కాంబినేషన్ అని చెపొ్చ్చు. వీరి ముగ్గురి కాంబినేషన్లో వచ్చిన ‘దసరా’ (2023) మూవీ బ్లాక్బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఈ హిట్ కాంబోలో వస్తున్న ద్వితీయ చిత్రం ‘ది ΄్యారడైజ్’. ఎస్ఎల్వీ సినిమాస్పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్లో జరుగుతోంది. ఈ మూవీ కోసం వేసిన ప్రత్యేకమైన సెట్స్లో చిత్రీకరిస్తున్నారు. నానితో పాటు చిత్రంలోని ప్రధాన తారాగణం ఈ షెడ్యూల్లో పాల్గొంటోందట.ఈ చిత్రంలో నాని పాత్ర పేరు జడల్. గతంలో విడుదల చేసిన స్టిల్లో నాని రెండు జడలు వేసుకుని, పక్కా మాస్ లుక్లో కనిపించిన సంగతి తెలిసిందే. హీరో లుక్, స్టోరీ, టేకింగ్... ఇలా ప్రతిదీ వైవిధ్యంగా ఉండేలా తెరకెక్కిస్తున్నారట శ్రీకాంత్. ‘దసరా’ వంటి హిట్ కాంబినేషన్లో వస్తున్న ‘ది ΄్యారడైజ్’ పై ఇండస్ట్రీలో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో 2026 మార్చి 26న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ఇప్పటికే ప్రకటించింది.ఓ వీరాభిమాని కథ రామ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ మూవీ ఫేమ్ పి. మహేశ్బాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ‘మిస్టర్ బచ్చన్, కింగ్డమ్’ చిత్రాల ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నారు. ఉపేంద్ర, రావు రమేశ్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలుపోషిస్తున్నారు. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టి సిరీస్ ఫిలిమ్స్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్లో జరుగుతోంది.ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలోని రైల్వేస్టేషన్లో హీరో రామ్పై కొన్ని సన్నివేశాలను తెరకెక్కించారు మహేశ్బాబు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్లో జరుగుతోంది. రామ్తో పాటు ఇతర ప్రధాన తారాగణంపై పలు సన్నివేశాలను తీస్తున్నారట దర్శకుడు. ఈ సినిమాలో ఉపేంద్ర ఓ స్టార్ హీరోగా నటిస్తుండగా ఆయన వీరాభిమాని పాత్రలో రామ్పోతినేని నటిస్తున్నారు. తన అభిమాన హీరో కోసం ఈ వీరాభిమాని ఏం చేశాడు? అన్నది తెలియాలంటే నవంబరు 28 వరకు వేచి ఉండాలి. ఈ చిత్రం అదే రోజు విడుదల కానుంది. అల్యూమినియం ఫ్యాక్టరీలో... హీరో నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్సీ 24’ (వర్కింగ్ టైటిల్). ‘తండేల్’ సినిమాతో బ్లాక్బస్టర్ అందుకోవడంతో పాటు తొలిసారి వంద కోట్ల క్లబ్లో చేరారాయన. ‘తండేల్’ వంటి హిట్ మూవీ తర్వాత ‘విరూపాక్ష’ (2023) మూవీ ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో నాగచైతన్య నటిస్తున్న ‘ఎన్సీ 24’ చిత్రంలో మీనాక్షీ చౌదరి హీరోయిన్గా నటిస్తున్నారు. బాపినీడు సమర్పణలో సుకుమార్ రైటింగ్స్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్లో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.భారీ బడ్జెట్తో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. నాగచైతన్య, మీనాక్షీ చౌదరితో పాటు ఇతర నటీనటులు ఈ చిత్రీకరణలో పాల్గొంటున్నారట. ‘తండేల్’లో ఫుల్ మాస్ లుక్లో కనిపించిన నాగచైతన్య ‘ఎన్సీ 24’లో స్టైలిష్గా సరికొత్త లుక్తో కనిపించనున్నారు. అదే విధంగా మీనాక్షీ చౌదరి కూడా సరికొత్త పాత్రలో కనిపిస్తారు. రాయలసీమ నేపథ్యంలో... అఖిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్’. ‘ప్రేమ కన్నా ఏ యుద్ధం హింసాత్మకమైనది’ కాదు అనేది ఉపశీర్షిక. కిరణ్ అబ్బవరం హీరోగా ‘వినరో భాగ్యము విష్ణుకథ’ వంటి విజయవంతమైన సినిమా తెరకెక్కించిన మురళీ కిశోర్ అబ్బూరి దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ ‘లెనిన్’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లోని బూత్ బంగ్లాలో జరుగుతోంది. అఖిల్తో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు మురళీ కిశోర్.రాయలసీమ నేపథ్యంలో సాగే రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా కోసం పొడవాటి హెయిర్, గెడ్డంతో మాస్ లుక్లోకి మారిపోయారు అఖిల్. ఈ సినిమాలో తొలుత శ్రీలీల హీరోయిన్గా ఫిక్స్ అయ్యారు. అయితే ఆమె ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. శ్రీలీల స్థానాన్ని ‘మిస్టర్ బచ్చన్, కింగ్డమ్’ సినిమాల ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే రీప్లేస్ చేశారట. అయితే హీరోయిన్ విషయంపై అధికారిక ప్రకటన చేయలేదు మేకర్స్.యాక్షన్... ఎమోషన్ విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘పూరిసేతుపతి’ (వర్కింగ్ టైటిల్) అనే పాన్ ఇండియా చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సంయుక్త హీరోయిన్గా నటిస్తున్నారు. టబు, విజయ్ కుమార్, బ్రహ్మాజీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పూరి కనెక్ట్స్, జేబీ మోషన్ పిక్చర్స్ బ్యానర్పై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్, జేబీ నారాయణరావు కొండ్రోల్లా నిర్మిస్తున్నారు. యాక్షన్, ఎమోషన్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. విజయ్ సేతుపతి, సంయుక్త, టబు, విజయ్కుమార్, బ్రహ్మాజీలతో పాటు ఇతర నటీనటులపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట పూరి జగన్నాథ్. తనదైన మాస్, కమర్షియల్ స్టయిల్లో ఒక యునిక్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నారట పూరి. ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.ముచ్చింతల్లో మహాకాళి ‘హనుమాన్’ మూవీ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘మహాకాళి’. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో రూపొందిన తొలి చిత్రం ‘హను–మాన్’ (2024) పాన్ ఇండియా బ్లాక్బస్టర్గా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో 12 సూపర్ హీరోస్ సినిమాలను తెరకెక్కించనున్నట్లు గతంలో ప్రకటించారు ప్రశాంత్ వర్మ. అందులో భాగంగా ఈ యూనివర్స్లో రూపొందుతోన్న ద్వితీయ చిత్రం ‘మహాకాళి’. ప్రశాంత్ వర్మ క్రియేటర్, షో రన్నర్గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు.ఆర్కే దుగ్గల్ సమర్పణలో ఆర్కేడీ స్టూడియోస్ బ్యానర్పై రివాజ్ రమేశ్ దుగ్గల్ నిర్మిస్తున్నారు. అమ్మవారి చుట్టూ అల్లుకున్న కథతో బెంగాల్ సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోందని సమాచారం. నటీనటుల వివరాలను మేకర్స్ ఇప్పటివరకూ అధికారికంగా ప్రకటించలేదు. అయితే అసురుల గురువు శుక్రాచార్యుడిగా బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా నటిస్తున్నట్లు ప్రకటించి, ఆయన ఫస్ట్ లుక్ని మాత్రం ఇటీవల రిలీజ్ చేశారు మేకర్స్. ఇదిలా ఉంటే.. ‘మహాకాళి’ సినిమా షూటింగ్ ప్రస్తుతం శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్లో జరుగుతోంది. నటీనటులపై కీలకసన్నివేశాలు తీస్తున్నారు మేకర్స్. డిసెంబరు నెలాఖరుకి ఈ సినిమా చిత్రీకరణ పూర్తవుతుంది. పైన పేర్కొన్న సినిమాలే కాదు... మరికొన్ని చిత్రాలు కూడా ప్రస్తుతం హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. – డేరంగుల జగన్ మోహన్ -
కోర్ట్ మూవీ హీరోయిన్ శ్రీదేవి గణపతి హోమం (ఫోటోలు)
-
ట్రెడిషనల్ శారీ లుక్లో ‘కూలి’ బ్యూటీ..
-
తిరుమల స్వామివారి సేవలో కృతీ శెట్టి, వెంకీ కుడుముల (ఫోటోలు)
-
‘మిత్ర మండలి’ నిహారిక.. సందడి
దేశంలో అగ్రగామి ఇన్ఫ్లుయెన్సర్ అయిన వర్థమాన నటి నిహారిక ఎన్ఎం (Niharika NM) హైదరాబాద్ నగరంలోని శరత్ సిటీ మాల్లో ఆదివారం సందడి చేశారు. ప్రస్తుతం ‘మిత్ర మండలి’ సినిమాతో టాలీవుడ్లో హీరోయిన్గా అరంగేట్రం చేస్తూ తెలుగు ప్రేక్షకుల ముందుకు మరికొద్ది రోజుల్లో రానున్నారు.ఈ నేపథ్యంలో ప్రముఖ బ్రాండెడ్ ఫుట్ వేర్ బాటా నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. సంస్థ తన కొత్త కలెక్షన్లో భాగంగా ‘బ్రైటర్ మూమెంట్స్’ పేరుతో కొత్త ప్రొడక్ట్ను శరత్ సిటీ క్యాపిటల్ మాల్లో (Sarath City Capital Mall ఆవిష్కరించారు.ఈ సందర్భంగా నిర్వహించిన ఇంటరాక్టివ్ గేమ్స్, పండుగ పోటీలు నిహారిక ఉత్సాహంగా పాల్గొన్నారు. అభిమానులతో సెల్పీలు దిగుతూ మీట్–అండ్–గ్రీట్ (Meet and Greet) కార్యక్రమంలో పాల్గొన్నారు. చదవండి: ముద్దుల కోడలితో నీతా అంబానీ.. బుల్లి బ్యాగ్ ధర ఎన్ని కోట్లో తెలుసా? -
మెరిసేదంతా బంగారమే..ఎన్నాళ్లకెన్నాళ్లకు,ఈమెను గుర్తుపట్టారా?
-
చిరునవ్వు ఉన్నచోటే ప్రశాంతత ఉంటుందన్న ఐష్ (ఫోటోలు)
-
ఇంద్రకీలాద్రి కొండపై హీరోయిన్ లయ పూజలు (ఫొటోలు)
-
ఓల్డ్ ట్రెడిషన్ ఎప్పటికీ ఫాలో అవుతా.. శారీలో నటి పూర్ణ అందాలు (ఫొటోలు)
-
సోలో ట్రిప్ జ్ఞాపకాల్లోనే అనసూయ (ఫొటోలు)
-
తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ స్టార్స్ (ఫొటోలు)
-
మేకప్ లేకున్నా భాగ్యశ్రీ అందంగా ఉందే! (ఫొటోలు)
-
సినీ నటిపై దాడి.. యువకుడిపై కేసు
హైదరాబాద్: తన అపార్ట్మెంట్ ముందు పార్కింగ్ స్థలంలో ఓ వ్యక్తి బహిరంగ మూత్ర విసర్జన చేస్తుండగా ఇదేమిటని అడిగినందుకు ఆ యువకుడు కోపంతో సినీనటితో పాటు ఆమె పీఏపై దాడి చేసి గాయపర్చిన ఘటన పంజగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఎల్లారెడ్డిగూడలో నివసించే సినీ నటి ఈ నెల 1వ తేదీన దైవ దర్శనం చేసుకుని ఇంటికి వస్తుండగా అపార్ట్మెంట్ ముందు పార్కింగ్ స్థలంలో దేవేందర్ అనే వ్యక్తి బహిరంగ మూత్ర విసర్జన చేస్తున్నాడు. దీంతో నటి పీఏ బయటకు వచ్చి దేవేందర్ను ఇదేమి పద్ధతి అని నిలదీశాడు. దీంతో దేవేందర్ ఆగ్రహంతో ఊగిపోతూ మరో ఇద్దరు మహిళలతో కలిసి న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ దాడికి పాల్పడ్డాడు. మద్యం మత్తులో దేవేందర్ తనపై కూడా దాడి చేశాడని, ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ బాధిత నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పంజగుట్ట పోలీసులు దాడికి పాల్పడ్డ నిందితుడిపై బీఎన్ఎస్ సెక్షన్ 74, 115 (2), 79, 292 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భర్తతో 'కూలీ' ఫేమ్ రెబా మోనిక.. మాలీవుడ్ సెలబ్రిటీలతో ఇలా (ఫొటోలు)
-
తల్లి సురేఖావాణితో కలిసి సుప్రీత దసరా సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
జ్యూవెలర్లీ ఎగ్జిబిషన్.. తళుక్కుమన్న స్టార్ హీరోయిన్స్ (ఫొటోలు)
-
నివేదా థామస్ చీరలో చాలా సింపుల్గా (ఫొటోలు)
-
'గూఢచారి 2' హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
ఆపిల్ ఫార్మ్లో హీరోయిన్ రీతూ వర్మ (ఫొటోలు)
-
'జాతిరత్నాలు' ఫరియా దుబాయి ట్రిప్ జ్ఞాపకాలు (ఫొటోలు)
-
క్రైమ్ థ్రిల్లర్ మూవీలో యషిక.. 25 రోజుల్లోనే ప్లాన్!
తనదైన అందాలతో యువతను ఆకట్టుకునే బ్యూటీ యషిక ఆనంద్. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం టాస్. ఈ మూవీలో తేజస్విని మరో హీరోయిన్గా నటిస్తోది. ఈ చిత్రంలో రత్నం మౌళి కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ సినిమాకు సగు పాండియన్ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ చిత్రం షూటింగ్ ఇటీవల తమిళనాడులోని కోవెల్ పట్టిలో పూజ కార్యక్రమాలతో ప్రారంభమైంది.ఈ సందర్భంగా టాస్ దర్శకుడు మాట్లాడుతూ.. 'ఇది ఒక ప్రాంతంలో జరిగే 3 హత్యల నేపథ్యంలో సాగే మర్డర్ మిస్టరీ కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. ఆ హత్యల నేపథ్యం ఏమిటి? వాటికి నటి యషిక ఆనంద్కు ఉన్న సంబంధం ఏంటి అన్న అంశాలతో సాగే క్రైమ్ థ్రిల్లర్ కథగా తెరకెక్కిస్తున్నాం. ఈ మూవీ షూటింగ్ను కోవెల్ పట్టి, బిరుదు నగర్, సాత్తూర్ ప్రాంతాల్లో నిర్వహించి 25 రోజుల్లో పూర్తి చేయడానికి ప్రణాళికను సిద్ధం చేసినట్లు చెప్పారు. అదేవిధంగా చిత్రాన్ని ఈ ఏడాది చివర్లో గాని 2026 ప్రథమార్ధంలో గాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు' చెప్పారు.ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నమ్మముందని దర్శకుడు ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా ఈ చిత్రానికి శాంతన్ అనిభజనే సంగీతం అందిస్తుండగా.. ధర్మ దురై సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ మూవీలో విజయ్ టీవీ ఫేమ్ యోగి ,షన్న, సంజయ్ శంకర్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని బ్లాక్ డైమండ్ స్టూడియో పతాకంపై సయ్యద్ జాఫర్ నిర్మిస్తున్నారు. -
బ్లాక్ స్కర్ట్లో మ్యాడ్ స్క్వేర్ బ్యూటీ రెబా మోనికా అందాలు (ఫొటోలు)
-
లండన్ ఫ్యాషన్ వీక్.. అందంగా ముస్తాబైన హీరోయిన్ (ఫొటోలు)
-
అక్కడ అన్ని బూతు సినిమాలే.. మా పేరెంట్స్ నటించవద్దని చెప్పారు: సినీ నటి
ఇంటర్నెట్ పుణ్యమా అని అడల్ట్ సినిమాలు కుప్పలు తెప్పలుగా అందుబాటులోకి వచ్చేశాయి. కానీ ఒకప్పుడు అంటే షుమారుగా 3 దశాబ్ధాల క్రితం ఈ పరిస్థితి లేదు. పెద్దలకు మాత్రమే అంటూ ఊరించే ఎ సర్టిఫికెట్ సినిమాల కోసం సదరు అడల్ట్ మూవీ అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసేవారు. అలాంటి వారందరికీ ఆంగ్ల చిత్రాల తర్వాత మన దేశీయ భాషలో ఒకే ఒక చిత్ర పరిశ్రమ నుంచి సాంత్వన లభించేది. అది...ప్రస్తుతం దేశంలోనే అత్యంత వైవిధ్య భరిత చిత్రాలకు కేరాఫ్గా ఉన్న మళయాల చిత్ర పరిశ్రమ. అదే ఒకప్పుడు బూతు చిత్రాలకు చిరునామాగా ఉండేది. అప్పట్లో షకీలా తదితర అడల్ట్ మూవీ స్టార్స్ మళయాళ సినిమాలపై స్పష్టమైన ఆధిపత్యాన్ని చూపించేవారు. దాంతో దేశవ్యాప్తంగా బి గ్రేడ్ సినిమాలంటే మళయాళమే అనే గుర్తింపు వచ్చేసింది. బహుశా ఇప్పటి తరానికి పెద్దగా తెలియని ఆనాటి విషయాలను గుర్తుకు వచ్చేలా చేసింది తమిళ సినీనటి ఛార్మిల(Charmila)మలయాళ సినిమాలో ఒకప్పుడు ప్రముఖ తారగా వెలుగొందింది నటి చార్మిల, ఆ పరిశ్రమలో చేరడానికి ముందు తనకు ఆ పరిశ్రమ పట్ల ఉన్న అభిప్రాయం గురించి వెల్లడించింది, గతంలో అంటే 1980– 1990 మధ్య కాలంలో మళయాళ చిత్రపరిశ్రమ ఖ్యాతి బి–గ్రేడ్ చిత్రాలవెల్లువలో కొట్టుకుపోయిందని చెప్పిందామె. ఇటీవల ఓ తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన కెరీర్ ప్రారంభంలో మలయాళ సినిమా ఆఫర్లను అంగీకరించకుండా తన తల్లిదండ్రులు అడ్డుకున్నారని గుర్తుచేసుకుంది. ‘‘అప్పట్లో, మలయాళ సినిమా అంటే కేవలం బి–గ్రేడ్ చిత్రాలను మాత్రమే నిర్మిస్తుందని చాలా మంది భావించేవారు, అందుకే నా తల్లిదండ్రులు ఆ పరిశ్రమకు నన్ను పంపడానికి ఇష్టపడలేదు, అందుకే మొదటి ఆఫర్ వచ్చినప్పుడు భయపడ్డా. పేరొందిన దర్శకులు సంప్రదించినప్పుడు కూడా నటించడానికి నిరాకరించాను’’ అంటూ వెల్లడించారామె.కేరళ లోపల కాకుండా ఆ రాష్ట్రం బయట థియేటర్లలో నడిచిన మళయాళ సినిమాల వల్లనే మళయాళ చిత్ర పరిశ్రమకు ఈ రకమైన కళంకం అంటిందని ఆమె అభిప్రాయపడింది. పక్కరాష్ట్రాల్లోని జనం మలయాళ చిత్రాల గురించి మాట్లాడినప్పుడు, వారికి గుర్తుకు వచ్చేది ఎ–సర్టిఫికేట్ సినిమాలు, వాటి పోస్టర్లు మాత్రమే. ‘వారికి మళయాళ వినోదం అంటే డ్రగ్స్ లేడీస్,‘ అంటూ చెప్పిందామె. సీనియర్ నిర్మాత కె బాలాజీ తన కుటుంబాన్ని ఒప్పించిన తర్వాతే బాలాజీ అల్లుడు నేటి సూపర్ స్టార్ మోహన్ లాల్తో తాను నటించానంది. మలయాళ సినిమా అంతా బి–గ్రేడ్ టైప్ కాదని, మోహన్ లాల్ మమ్ముట్టి వంటి ప్రధాన నటులు మంచి చిత్రాలలో మాత్రమే పనిచేస్తారని ఆయన అర్ధం అయేలా చెప్పడంతో చార్మిల తన తొలి మలయాళ ప్రాజెక్ట్లో మోహన్ లాల్ సరసన నటించింది, తరువాత క్లాసిక్ల ద్వారా ఆ భాషలో కెరీర్కు బాటలు వేసుకుంది.ఆ కాలపు మళయాళ చిత్ర పరిశ్రమ గురించి గుర్తు చేసుకుంటూ ‘‘ బి–గ్రేడ్ సినిమాలో పనిచేసిన నటులు ‘పూర్తిగా భిన్నమైన వర్గానికి‘ చెందినవారని వారు బస చేసిన హోటళ్ళు మా హోటళ్ళలా ఉండేవి కావు‘ అని ఆమె చెప్పింది, తరువాత వారిలో చాలామంది సినిమాలను విడిచిపెట్టారని, కొందరు వివాహం తర్వాత విదేశాలకు వెళ్లారని లేదా ఇతర భాషలలో గ్లామర్ పాత్రలకు మారారని ఆమె చెప్పింది.ఆ సమయంలో మలయాళ సినిమా చుట్టూ వివాదాలు ఎలా ఉన్నా చార్మిల సినిమాలు స్వర్ణ యుగంలో భాగంగా పరిగణన పొందాయి. ఆమె తమిళనాడులో జన్మించినప్పటికీ, ’ధనం’లో గ్రామీణ అమ్మాయి థంకమ్ పాత్రలో తన నటనతో మలయాళ ప్రేక్షకుల హదయాలను గెలుచుకుంది. తరువాత ఆమె ’అంకుల్ బన్ ’, ’కేళి’, ’ప్రియపెట్ట కుక్కు’ మోహన్ లాల్, జయరామ్, వినీత్ వంటి తారలతో కలిసి పనిచేసింది. ప్రస్తుతం ఆమె తమిళ సినిమాల్లో పనిచేస్తోంది. అయినప్పటికీ ఆమె అత్యంత ప్రశంసలు పొందిన చిత్రాలు మాత్రం ఆమె మలయాళ విహారయాత్రలుగా మిగిలిపోయాయి. నటుడు బాబు ఆంటోనీ ఆ తరువాత విడాకులు తీసుకున్న నటుడు హోస్ట్ కిషోర్ సత్యతో ఆమె గత సంబంధాలు సహా ఆమె వ్యక్తిగత జీవితం ఆమె స్క్రీన్ కెరీర్ లాగే అందరి దృష్టినీ ఆకర్షించింది.


