
కుక్కుటేశ్వర స్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్, కాకినాడ జిల్లాలోని పిఠాపురంలో ఉంది.

అష్టదిక్కుల శక్తి పీఠంలో 10వ శక్తిపీఠం ఈ దేవాలయంలో కొలువై ఉంది.

శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో ఉదయం 6:30 నుండి దర్శనాలు జరుగుతూ ఉంటాయి.

పాదగయ తీర్ధం వద్ద గయాసురుని పాదాలున్నాయి. కనుక ఇక్కడ పెద్దలకు శ్రాద్ధకర్మలు నిర్వహిస్తే.. పుణ్యలోకం ప్రాపిస్తుందని నమ్మకం.

గుడికి ఎదురుగా పెద్ద ఏకశిల నంది విగ్రహం ఉంటుంది.

ఇక గర్భాలయంలో కొలువైన కుక్కుటేశ్వర స్వామి లింగం తెల్లగా ఉంటారు.. స్వచ్ఛమైన మనసుతో కోరి కొలిచినవారి కోర్కెలు తీరుస్తున్నాడు భోళాశంకరుడు

కుక్కుటేశ్వర ఆలయానికి ఇరువైపులా పురూహూతికా అమ్మవారి ఆలయం, శ్రీపాదుల ఆలయాలు ఉన్నాయి.

ఈ ఆలయానికి చేరుకోవడానికి బస్సు సౌకర్యం ఉంది. ఇక రైలు మార్గంగా ద్వారా చేసుకోవాలంటే సమీపంలో సామర్లకోట రైల్వే జంక్షన్ వద్ద దిగాల్సి ఉంది. పిఠాపురం నుండి కేవలం 10 కిలోమీటర్ల దూరంమాత్రమే.






