
ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీశైల మహాక్షేత్రంలో బుధవారం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మవార్లకు కనుల పండువగా స్వర్ణరథోత్సవం నిర్వహించారు.

వేకువజామున స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేషపూజలు చేశారు. లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకులు సంకల్పాన్ని పఠించారు.

అనంతరం రథారూఢులైన స్వామిఅమ్మవార్లకు విశేషపూజలు చేశారు.

ఉదయం 7.30గంటలకు స్వర్థరథోత్సవం ప్రారంభమై గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు సాగింది. ఉత్సవంలో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.





