breaking news
Kanaka Mahalakshmi Temple
-
విశాఖపట్నం : కనకమహాలక్ష్మి ఆలయానికి పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
ఘనంగా మార్గశిర మాసం ఉత్సవాలు
-
కనకమహాలక్ష్మి దేవస్థానం ఈవోగా శిరీష
విశాఖపట్నం: కనకమహాలక్ష్మి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా జిల్లా దేవదాయ ధర్మదాయ శాఖ సహాయ కమిషనర్ కె.శిరీష నియమితులయ్యారు. ఇంతవరకూ ఈవోగా విధులు నిర్వహిస్తున్న కె.రమేష్నాయుడు కృష్ణాజిల్లా తిరుపతమ్మ దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా బదిలీ అయ్యారు. సహాయ కమిషనర్ బాధ్యతలతో పాటు కనకమహాలక్ష్మి ఆలయ ఈవోగా అదనపు బాధ్యతలను శిరీష నిర్వహించనున్నారు. గతేడాది జూలై ఒకటి నుంచి ఈ ఏడాది మార్చి 29వరకు ఆమె కనకమహాలక్ష్మి ఆలయ ఈవోగా అదనపు బాధ్యతలు నిర్వహించారు. ఆలయ ఆదాయం పెంపు, భక్తులకు సౌకర్యాలతో పాటు అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు నిర్వహించి అందరి ప్రశంసలు పొందారు. ముఖ్యంగా అమ్మవారి దత్తత దేవాలయం అంబికాబాగ్ రామచంద్రస్వామి దేవస్థానం ఆస్తులు, అనకాపల్లిలో అన్యాక్రాంతం కాగా వాటిని స్వా«దీనం చేసుకొని దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ఉన్నతాధికారుల ప్రశంసలు పొందారు. దీంతో శిరీషాను అమ్మవారి దేవస్థానం ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ దేవదాయ శాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. ఒకట్రెండు రోజుల్లో శిరీష ఈవోగా బాధ్యతలు స్వీకరించనున్నారు. -
సిరులతల్లి శ్రీకనకమహాలక్ష్మి
గోపురం లేని ఆలయం! కనకమహాలక్ష్మి ఆలయానికి ఇతర దేవాలయాల మాదిరిగా గోపురం ఉండదు. దేశంలో గోపురం లే ని దేవాలయం ఇదే కావడం విశేషం. బహిరంగ మండపంలోనే విగ్రహాన్ని ప్రతిష్టించారు. పంచభూతాలు అమ్మవారిని సేవించడానికి వీలుగా ఇలా గోపురం లేకుండా స్థాపించారని పండితులు చెబుతారు. ఇక్కడ రోజులో 24 గంటలూ దర్శించుకునేందుకు ఆలయం తెరిచే ఉంచడం మరో ప్రత్యేకత. అమ్మవారి విగ్రహం ఏ కాలంలో వెలిసిందో తెలిపే ఆధారాలు లేవు. దీంతో 1912కి ముందే ఉన్నట్టు నిర్ధారణ అవుతోంది. శ్రీకనకమహాలక్ష్మి .. విశాఖవాసుల ఇలవేల్పుగాను, కోరిన కోర్కెలు తీర్చే తల్లిగాను, సిరిసంపదలు, స్త్రీలకు ఐదవతనాన్ని, అందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చే అమ్మవారిగాను, మహిళల కొంగుబంగారంగా భాసిల్లుతున్నారు. కనకమహాలక్ష్మికి ఆలయానికి ఏడాది పొడవునా భక్తుల రద్దీ ఉంటుంది. అయితే అమ్మవారు గురువారం నాడు ఆవిర్భవించడం వల్ల, ఆమెకు ప్రీతికరమైన మాసం మార్గశిరం కావడం వల్ల ఈ మాసంలో వచ్చే నాలుగు లక్ష్మివారాలు (గురువారాలు) లక్షల్లో భక్తులు సందర్శించి పునీతులవుతారు. మహిళలు అమ్మవారికి నేరుగా పసుపు కుంకుమలు సమర్పించుకోవడం, భక్తులే స్వయంగా కొబ్బరికాయలు కొట్టుకోవడం ఇక్కడి ప్రత్యేకత. విశాఖలో అమ్మవారి భక్తులెవరూ పెళ్లయిన ఆడపిల్లను గురువారం అత్తవారిళ్లకు పంపరు. అలా పంపితే లక్ష్మి వారి వెంట వెళ్లిపోతుందని నమ్ముతారు. ఇలా వెలిశారు.. స్థలపురాణం ప్రకారం.. శ్రీకనకమహాలక్ష్మి ఈ ప్రాంతాన్ని పాలించిన విశాఖ రాజుల ఇలవేల్పు. వారి కోట ఈ పరిసరాల్లో ఉండేది. అందుకే అమ్మవారున్న ప్రదేశాన్ని బురుజుపేటగా పిలుస్తారు. శత్రురాజులు విశాఖ కోటపై దండెత్తినప్పుడు అమ్మవారిని బావిలో పడేశారు. కలియుగారంభంలో ఓ సత్బ్రాహ్మణుడు తపస్సుతో దైవసాన్నిధ్యం పొందాలని కాశీకి పయనమై బురుజుపేట చేరుకున్నాడు. అక్కడ బావిలో స్నానమాచరిస్తుండగా అమ్మవారు ప్రత్యక్షమై తనను పైకి తీసి ప్రతిష్ఠించాలని కోరారు. అందుకు ఆ బ్రాహ్మణుడు తిరస్కరించడంతో బావి నుంచి పైకి వచ్చి తన ఎడమ చేతిలోని పరిఘ అనే ఆయుధంతో అతడిని సంహరించడానికి యత్నించారు. అతడు శివుని ప్రార్థించడంతో ఆమె చేతిలోని ఆయుధాన్ని నిర్వీర్యం చేసి వామహస్తాన్ని మోచేతి దాకా ఖండించాడు. అప్పటితో ఆమె కోపం మాయమై శాంతి, కారుణ్యంతో కలియుగంలో శ్రీకనకమహాలక్ష్మిగా అవతరించి భక్తుల కోర్కెలు తీర్చేలా అనుగ్రహించాడు. అలా వెలిసిన అమ్మవారు నిత్యపూజలందుకుంటున్నారు. 1912లో వీధి వెడల్పు చేసినప్పుడు అమ్మవారి విగ్రహం అలాగే ఉంచారు. 1917లో ఆ విగ్రహాన్ని రోడ్డు మధ్య నుంచి 30 అడుగుల దూరం జరిపారు. ఆ తర్వాత విశాఖలో ప్లేగు వ్యాధి ప్రబలి వేలాది మంది మరణించారు. అమ్మవారి విగ్రహాన్ని కదపడం వల్లే ఇదంతా జరిగిందని భావించిన ప్రజలు యథాస్థానంలో చేర్చారు. అనంతరం ప్లేగు పునరావృతం కాకపోవడంతో అదంతా అమ్మవారి మహిమగా విశ్వాసం ప్రబలింది. ఇవీ పూజలు.. మార్గశిరమాసంలో అమ్మవారికి పంచామృతాభిషేకం, సహస్ర, అష్టోత్తర నామార్చన పూజలుంటాయి. గురువారాల్లో (బుధవారం అర్ధరాత్రి నుంచి) విశేషపంచామృతాభిషేక సేవ, సహస్రనామార్చన పూజ, సర్వదర్శనం ఉంటాయి. ఎలా రావాలి? శ్రీకనకమహాలక్ష్మిని దర్శించుకోవడానికి రైలు, రోడ్డు, విమాన మార్గాలున్నాయి. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి 3, రైల్వే స్టేషన్ నుంచి 3, విమానాశ్రయం నుంచి 15 కి.మీల దూరంలో ఈ ఆలయం ఉంది. ఈ ప్రాంతాల నుంచి చేరుకోవడానికి కార్లు, ఆటోలు, బస్సు సదుపాయాలున్నాయి. - బొల్లం కోటేశ్వరరావు, సాక్షి, విశాఖపట్నం. ఫొటోలు: పి.ఎన్.మూర్తి, విశాఖపట్నం