శబరిమలలో తగ్గిన భక్తుల రద్దీ ..! సన్నిధానం పెద్ద ఫుట్‌పాత్ సైతం.. | Sabarimala without a crowd 15 percent of those who booked did not arrive | Sakshi
Sakshi News home page

శబరిమలలో తగ్గిన భక్తుల రద్దీ ..! సన్నిధానం పెద్ద ఫుట్‌పాత్ సైతం..

Dec 1 2025 1:07 PM | Updated on Dec 1 2025 1:13 PM

Sabarimala without a crowd 15 percent of those who booked did not arrive

సాక్షి శబరిమల: మొనటివరకు జసందోహంతో కిటకిటలాడిన శబరిమల ఈ రోజు చాలా ఖాళీగా దర్శనమిచ్చింది. వర్చువల్‌ క్యూ ద్వారా బుక్‌ చేసుకున్న వారిలో దాదాపు 15% మంది దాక రాలేదు. అందువల్ల గత రెండు రోజులుగా అయ్యప్ప స్వామి దర్శనానికి రద్దీ తగ్గింది. స్పాట్‌ బుకింగ్‌ కేవలం 5000 మందికి మాత్రమే తగ్గింది. ఈ రోజు ఉదయం 5 గంటల నుంచి సన్నిధానం పెద్ద ఫుట్‌పాత్‌ ఖాళీగా ఉండటం గమనార్హం. 

అలాగే 18వ మెట్టు ఎక్కడానికి క్యూలో ఎవరూ లేరు. పంపా నుంచి వచ్చిన వారు వేచి ఉండకుండా నేరుగా మెట్లు ఎక్కి దర్శనం చేసుకున్నారు. అలాగే ఈరోజు ఉదయం 7.30 గంటలకు పూజ సమయం కావడంతో 18వ మెట్టు ఎక్కడానికి అరగంటపాటు నిలిపివేసినా కూడా అంతగా రద్దీ లేదు. ఇదిలా ఉండగా, డిసెంబర్‌ 27తో వర్చువల్‌ క్యూబుకింగ్‌ పూర్తయింది. ఒకవేళ బుక్‌ చేసుకునేందుకుక ప్రయత్నిస్తే..అక్కడ ఎరుపు రంగులో కనిపిస్తుంటుంది. అంటే దీని అర్థం మండలకాలం ముగిసేవరకు ఎవరూ కొత్తది బుక్‌ చేసుకోలేరు. 

ఇక ప్రతి రోజు శబరిమల సన్నిధానం రద్దీ ఆధారంగా స్పాట్‌ బుకింగ్‌లకు అనుమతివ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. నీలక్కల్ మాత్రమే స్పాట్ బుకింగ్ కౌంటర్. ఈ స్పాట్‌ బుకింగ్‌ అర్ధరాత్రి 12 గంటలకు ప్రారంభమవుతుంది. అదంతా కూడా గంటలోపు పూర్తవుతుంది. దాంతో ఇరుముడు కట్టుతో వచ్చే యాత్రికులు నిరాశతో నీలక్కల్ చుట్టూ తిరగాల్సి వస్తోంది. కాగా, గతేడాది ఇరుముడి కట్టుతో వచ్చే భక్తులను ఎవ్వరిని వెనక్కి పంపకూడదని  స్ట్రాంగ్‌ నిర్ణయం తీసుకున్నారు. కానీ ఈసారి ఆ వైఖరిని మార్చడం గమనార్హం. 

దీనివల్ల యాత్రికులకు చాలా ఇబ్బందులు ఎదురవ్వుతున్నాయి. అయితే దర్శనం కోసం వచ్చే భక్తుల రద్దీ మాత్రం తగ్గుతోంది. ఈ ఉదయం వరకు ఉన్న గణాంకాల ప్రకారం, ఇప్పటివరకు 12.13 లక్షల మంది అయ్యప్పలు ఆలయాన్ని సందర్శించారు.

(చదవండి: 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement