breaking news
heavy rains
-
హైదరాబాద్లో కుండపోత.. స్తంభించిన ట్రాఫిక్
సాక్షి, హైదరాబాద్: నగరంలో పలు చోట్ల భారీ వర్షం దంచికొడుతోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఫిల్మ్నగర్, టోలీచౌకీ, గచ్చిబౌలి, మియాపూర్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి, మల్లాపూర్, హఫీజ్పేట్, సరూర్నగర్, కార్వాన్, చాంద్రాయణగుట్ట, సైదాబాద్, బండ్లగూడ, మణికొండ, కొండాపూర్, షేక్పేటలో వర్షం కురుస్తోంది. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ స్తంభించింది.నగరంలో రోడ్లన్నీ జలమయంగా మారాయి. దీంతో జీహెచ్ఎంసీ, హైడ్రా బృందాలు అప్రమత్తమయ్యాయి. మ్యాన్ హోల్స్ దగ్గర అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. నగరంలో భారీ వర్షపాతం నమోదైంది. మియాపూర్ 9.7 సెం.మీ, లింగంపల్లి 8.2, హెచ్సీయూ 8.1, గచ్చిబౌలి 6.6, చందానగర్ 6.4, హఫీజ్పేట్ 5.6, ఫతేనగర్ 4.7 సెం.మీ వర్షపాతం నమోదైంది.ఏపీకి అలర్ట్.. విజయవాడలో కూడా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. భారీ వర్షం కురుస్తోంది. పశ్చిమమధ్య,ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతం వరకు తూర్పు విదర్భ, తెలంగాణ మరియు దక్షిణ కోస్తాంధ్ర మీదుగా సముద్ర మట్టానికి సగటున 0.9 కి.మీ ఎత్తులో ద్రోణి కొనసాగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.దీని ప్రభావంతో రానున్న రెండు రోజులు రాయలసీమలో ఒకటి, రెండు చోట్ల పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉరుములతో కూడిన వర్షాలు పడేటప్పుడు చెట్ల క్రింద నిలబడరాదని సూచించారు. కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ వెల్లడించారు. బుధవారం సాయంత్రం 5 గంటలకు ప్రకాశం జిల్లా ఒంగోలులో 64.5మిమీ, కె.ఉప్పలపాడులో 53.5మిమీ, వేములపాడు 47మిమీ, చిలకపాడులో 45మిమీ, విజయనగరం జిల్లా రాజాంలో 40.2మిమీ, కాకినాడలో 39మిమీ వర్షపాతం రికార్డు అయిందన్నారు. -
మునిగిన ముంబై.. స్కూళ్లు, కాలేజీలు బంద్
-
వానొస్తే ప్రాణాలు గల్లంతే!
హైదరాబాద్: నగరంలో వానొస్తే ప్రాణాలు గల్లంతే అనే దుస్థితి నెలకొంది. ఆదివారం సాయంత్రం గంటసేపు వర్షం దంచికొట్టడంతో రహదారులు చెరువులను తలపించాయి. నాలాలు ఉప్పొంగాయి. ముషీరాబాద్తో పాటు తట్టి అన్నారంలో 12.8 సెంటీ మీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. వరద ప్రవాహంలో నాంపల్లి పరిధి హబీబ్నగర్లోని అఫ్జల్సాగర్లో ఇద్దరు, ముషీరాబాద్లో మరొకరు కొట్టుకుపోయారు. కిలో మీటర్ల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోయింది. హైడ్రా, జీహెచ్ఎంసీ, జలమండలి బృందాలు రంగంలోకి దిగి వరద నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టాయి. Heavy Rains In Hyderabad Three People Missing After Falling Into A DrainageHeavy Rains In Hyderabad Three People Missing After Falling Into A Drainage -
హైదరాబాద్కు ఎల్లో అలర్ట్.. భారీ వర్ష సూచన
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఇవాళ కూడా భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రానున్న మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయవ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదిలి ఉత్తర తెలంగాణ, విదర్భ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వివరించింది.దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. దీని ప్రభావంతో పలుచోట్ల తేలికపాటి వర్షాలు, కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాల ఉపసంహరణ మొదలైంది. సాధారణంగా సెప్టెంబర్ మూడో వారం చివరలో మొదలవ్వాల్సిన ఈ ప్రక్రియకు ఈసారి సానుకూల వాతావరణ పరిస్థితులు ఉండటంతో ముందే ప్రారంభమైందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. రానున్న రెండు రోజుల్లో రాజస్తాన్, పంజాబ్, గుజరాత్లోని కొన్ని ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాలు క్రమంగా నిష్క్రమిస్తూ అక్టోబర్ రెండో వారాంతానికి దేశం నుంచి పూర్తిస్థాయిలో నిష్క్రమిస్తాయని వివరించింది.ఈ సమయంలోనూ చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు గతేడాది కంటే మూడు రోజుల ముందే.. మే 23న కేరళను తాకాయి. ఆ తర్వాత మూడు రోజుల్లో రాష్ట్రంలోకి ప్రవేశించాయి. జూలై రెండో వారం నాటికి దేశమంతా విస్తరించాయి. నైరుతి రుతుపవనాల సీజన్లో రాష్ట్రంలో సగటున 74.06 సెం.మీ. సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఇప్పటికే 83.02 సెం.మీ. మేర వర్షం కురిసింది. ఇది సాధారణ వర్షపాతంకన్నా 12 శాతం అధికం. -
ధర్నాకు దిగిన వైష్ణోదేవి భక్తులు
కత్రా/జమ్మూ: త్రికూల పర్వతాల్లో కొలువైన మాతా వైష్ణోదేవిని దర్శించుకునే భాగ్యం తమకు కల్పించాలని భక్తులు ధర్నాకు దిగారు. భారీ వర్షాలు, కొండచరియలు విరిగి పడుతున్న ఘటనలతో ముందుజాగ్రత్తగా జమ్మూకశీ్మర్ పాలనాయంత్రాంగం వైష్ణోదేవి యాత్రను గత 20 రోజులుగా నిలివేసిన నేపథ్యంలో విసుగుచెందిన యాత్రికులు, భక్తులు ధర్మాగ్రహం వెలిబుచ్చారు. దేవీదర్శనం కోసం సుదూరాల నుంచి వచ్చాక తీరా త్రికూల పర్వతాల వద్ద హఠాత్తుగా ఆపేసి, యాత్రకు అర్థంతరంగా రద్దుచేయడంపై భక్తులు తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. ఆదివారం రేసీ జిల్లాలోని కత్రా బేస్క్యాంప్ వద్ద పెద్దసంఖ్యలో యాత్రికులు నిరసన చేపట్టారు. ఆలయం దిశగా ర్యాలీగా వెళ్తేందుకు భక్తులు ప్రయతి్నంచగా అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. ఆలయబోర్డ్ ఆదేశాలను ఉల్లంఘించడానికి వీల్లేదని పోలీసులు తెగేసి చెప్పారు. ఆలయానికి దారితీసే ప్రధాన ఘాట్రోడ్డు, దానికి అనుసంధానమైన రహదారుల వెంట భారీ వర్షాలు, పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిన పడటంతో మొత్తం ఘటనల్లో 34 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. 20 మంది గాయపడ్డారు. దీంతో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని వైష్ణోదేవి ఆలయ బోర్డ్ ఆగస్ట్ 26వ తేదీన యాత్రను నిలిపేసింది. అప్పటి నుంచి యాత్ర ఆగిపోయి ఆదివారానికి వరసగా 20 రోజులు పూర్తయింది. సెపె్టంబర్ 14వ తేదీన యాత్రను పునరుద్ధరిస్తామని గతంలోప్రకటించినా ఆదివారం(సెప్టెంబర్ 14న) అది మొదలుకాలేదు. దీంతో రోజులతరబడి వేచి ఉండే ఓపికలేక భక్తుల్లో అసహనం, ఆగ్రహం పెల్లుబికింది. ‘‘రెండు నెలలపాటు పాదరక్షల్లేకుండా కాలినడకన కత్రా బేస్క్యాంప్దాకా వచ్చా. వీలైనంత త్వరగా దర్శనభాగ్యం దక్కుతుందని ఆశపడుతున్నా. పెద్దగుంపులుగా జనానఇన పంపిస్తే ఇబ్బందులు తలెత్తుతాయని భావిస్తే చిన్న గుంపులుగా అయినా యాత్రను మొదలెడతే బాగుంటుంది’’అని మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన రాజీవ్ లోధీ అనే భక్తుడు అన్నారు. ‘‘19 రోజలతర్వాత 14వ తేదీన యాత్ర మొదలుకానుందని తెల్సి తమిళనాడు నుంచి కుటుంబంతో వచ్చా. తీరాచూస్తే యాత్ర పునరుద్ధరణ వాయిదాపడింది. మా క్షేమం కోరి యాత్రను ఆపేశారని తెలుసు. కానీ ఇంకెన్ని రోజులు వేచి ఉండాలో తెలీట్లేదు’’అని చెన్నైవాసి వినోద్కుమార్ అన్నారు. ‘‘ఏదేమైనా యాత్ర పూర్తిచేస్తాం. సస్పెండ్చేసే ఉద్దేశమే ఉంటే ఆన్లైన్ రిజి్రõÙ్టషన్ ఎందుకు మొదలెట్టారు?’అని ముంబై నుంచి వచి్చన రేఖ ఆగ్రహం వ్యక్తంచేశారు. దర్శనం చేసుకున్నాక వెనుతిరుగుతామని బిహార్ వాసి రాజ్కుమార్ స్పష్టంచేశారు. -
గుంటూరులో కుంభవృష్టి
సాక్షి, అమరావతి/ విజయపురిసౌత్/ పోలవరం రూరల్/సాక్షి ప్రతినిధి, గుంటూరు: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం గుంటూరులో కేవలం రెండు గంటల్లో 13 నుంచి 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కుంభవృష్టితో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఒకటి, రెండు అడుగుల మేర నీరు ప్రవహించడంతో ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మూడు వంతెనల కింద వర్షం నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కంకరగుంట ఆర్యూబీ కింద వర్షం నీరు నిలిచిపోయింది. బృందావన్ గార్డెన్స్, చంద్రమౌళీనగర్, ఏటీ అగ్రహారం, బస్టాండ్ ప్రాంతం, అరండల్పేట, బ్రాడీపేట, శ్రీనగర్, బొంగరాలబీడు సహా పలు ప్రాంతాల్లో జనజీవనం స్థంభించింది. చంద్రమౌళీనగర్ ఎనిమిదో లైన్లో రోడ్డుపై వెళ్తున్న కారుపై భారీ వృక్షం కూలింది. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. పల్నాడు జిల్లా తుర్లపాడులో 5.4, పెదకూరపాడులో 4, గుంటూరు జిల్లా వంగిపురం, కోనసీమ జిల్లా ముక్కామలలో 3.9 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. వచ్చే నాలుగు రోజులు రాష్ట్రంలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ, విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపాయి. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద కొనసాగడంతో అధికారులు 26 క్రస్ట్గేట్ల ద్వారా 2,74,248 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం నుంచి సాగర్కు 2,40,313 క్యూసెక్కులు వచ్చి చేరటంతో ఇక్కడ నుంచి మొత్తం 3,22,424 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్ జలాశయంలో 307.5790 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు నదిలోకి నీరు చేరడంతో ఉధృతంగా మారింది. పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే వద్ద 30 మీటర్లకు పైగా నీటిమట్టం ఉండటంతో 48 గేట్ల నుంచి 6.60 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు చేరుతోంది. భద్రాచలం వద్ద నీటి మట్టం 36.30 అడుగులకు చేరింది. -
కోస్తాంధ్రలో భారీ వర్షాలు
సాక్షి, అమరావతి/బుట్టాయగూడెం: బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురుస్తుండగా.. రాయలసీమలో తేలికపాటి జల్లులు పడుతున్నాయి. శనివారం తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి, ఏలూరు జిల్లా లింగపాలెంలో 8.7 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. గుంటూరు జిల్లా పెదకాకానిలో 7.7, పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో 7.5, గుంటూరు జిల్లా వల్లభపురంలో 7.4, గుంటూరులో 7.2, ఏలూరు జిల్లా నూజివీడులో 7.1, కృష్ణా జిల్లా తోట్లవల్లూరు, కౌతవరంలో 7, ప్రకాశం జిల్లా దర్శిలో 6.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 47 ప్రాంతాల్లో 4 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైనట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. కాగా, ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో బైనేరు, కొవ్వాడ, చింతకొండ, జల్లేరు, కొండ వాగులు పొంగిపొర్లుతున్నాయి. కేఆర్ పురం సమీపంలోని కొండవాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పోలవరం నుంచి కన్నాపురం మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పలు గ్రామాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నేడు మోస్తరు వానలు.. అల్పపీడనం 48 గంటల్లో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా పశ్చిమ వాయవ్య దిశగా కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీనికి అనుబంధంగా ఛత్తీస్గఢ్, విదర్భ మీదుగా దక్షిణ మహారాష్ట్ర వరకు ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం శ్రీకాకుళం, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పలు చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తీరం వెంబడి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. -
తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
-
సిక్కింలో వరద బీభత్సం.. నలుగురు మృతి.. ముగ్గురు గల్లంతు
-
ఉమ్మడి కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు
కర్నూలు(అగ్రికల్చర్)/వాకాడు: అల్పపీడన ప్రభావంతో గురువారం తెల్లవారుజాము నుంచి ఉమ్మడి కర్నూలు జిల్లాలో వరుణుడు ఉగ్రరూపం దాల్చాడు. ప్రధానంగా గూడూరు, మద్దికెర మండలాల్లో కుండపోత, మిగిలిన మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. గూడూరు మండలంలో కురిసిన వర్షాలకు వాగులు, వంకలు ఏకమయ్యాయి. ఫలితంగా హంద్రీకి భారీ ఎత్తున వరద నీరు చేరింది. కర్నూలు జిల్లా గూడూరులో 99 మిల్లీమీటర్లు, నంద్యాల జిల్లా కొలిమిగుండ్లలో 128.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలతో పత్తి, ఉల్లి పంటలకు నష్టం వాటిల్లింది.గూడూరు మండలం పెంచికలపాడు సమీపంలోని వక్కెర వాగు పొంగిపొర్లడంతో ఉదయం నుంచి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. సి.బెలగల్ మండలంలోని పోలకల్ గ్రామ శివారులో ఉన్న జక్కులోని వాగు నిండుగా ప్రవహించింది. ప్రయాణికులతో వెళ్లిన ఆర్టీసీ బస్సు వాగు నీటి ఉద్ధృతికి మధ్యలోనే నిలిచిపోవడంతో గ్రామస్తులు ట్రాక్టర్ సాయంతో బయటకు తీశారు.మరోవైపు తిరుపతి జిల్లా వాకాడు మండలం తూపిలిపాళెం వద్ద సముద్రం గురువారం 3 మీటర్లు వరకు ముందుకు చొచ్చుకొచ్చినట్లు స్థానికులు తెలిపారు. అలల తాకిడికి తీరానికి వచ్చిన పర్యాటకులు వెనుతిరిగి వెళ్లారు. ఉదయాన్నే వేటకు వెళ్లిన మత్స్యకారులు సముద్రం ఆటు పోటులతో వేట చేయలేక ఖాళీ బోట్లతో మధ్యాహా్ననికి ఒడ్డుకు చేరుకున్నారు. -
Hyderabad: హైదరాబాద్లో పలుచోట్ల వర్షం (ఫోటోలు)
-
మెదక్లో క్లౌడ్ బరస్ట్.. చెరువుల్లా రోడ్లు, కాలనీలు
సాక్షి, మెదక్: అతిభారీ వర్షం దాటికి మెదక్ మరోసారి అతలాకుతలం అయ్యింది. గురువారం జిల్లా కేంద్రంలో కేవలం మూడున్నర గంటల వ్యవధిలో 13 సెం.మీ వర్షం (క్లౌడ్ బరస్ట్) కురిసింది. దీంతో రోడ్లు చెరువులను తలపించాయి. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. రాజీపల్లి 9.2, పాతుర్ 8 సెం. మీ వర్షం కురిసింది. మెదక్ పట్టణంలో లోతట్టు ప్రాంతాలకు భారీగా నీరు చేరింది. గాంధీ నగర్ కాలనీని రోడ్డు ముంచెత్తింది. పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. రామ్ దాస్ చౌరస్తా నుంచి కొత్త బస్టాండ్ వరకు రోడ్డుపై వరద పోటెత్తింది. మెదక్-హైదరాబాద్ హైవేపై భారీగా వరద నీరు చేరడంతో జేసీబీతో మధ్యలో ఉన్న డివైడర్ను అధికారులు తొలగించారు. ఇదిలా ఉంటే.. తెలంగాణలో రాబోయే నాలుగు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ క్రమంలో మొన్నటి పరిస్థితుల దృష్ట్యా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. -
అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం
ధర్మశాల/చండీగఢ్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. నీట మునిగిన పంట పొలాలు, ధ్వంసమైన ఇళ్లు, రహదారులను స్వయంగా పరిశీలించారు. బాధితులతో మాట్లాడారు. భారీ వర్షాలు, వరదలకు తోడు కొండచరియలు విరిగిపడడంతో తీవ్రంగా నష్టపోయిన హిమాచల్ ప్రదేశ్కు తక్షణ సాయం కింద రూ.1,500 కోట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. వరదల్లో మృతిచెందినవారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున నష్టపరిహారం ఇస్తామని వెల్లడించారు.హిమాచల్ ప్రదేశ్లో ఏరియల్ సర్వే అనంతరం కాంగ్రా పట్టణంలో ప్రధాని మోదీ సమీక్షా సమావేశం నిర్వహించారు. సహాయ పునరావాస చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి సుఖ్వీందర్సింగ్ సుఖూ పాల్గొన్నారు. వరద బాధితులు సైతం హాజరై తమ గోడు వినిపించారు. తమను ఆదుకోవాలని ప్రధాని మోదీని వేడుకున్నారు. కచ్చితంగా అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. వరదల్లో దెబ్బతిన్న మౌలిక సదుపాయాలను సాధ్యమైనంత త్వరగా పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. ధ్వంసమైన ఇళ్లను ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పునరి్నరి్మంచాలని సూచించారు. రాష్ట్రంలో ఈ ఏడాది జూన్ 20 నుంచి సెపె్టంబర్ 8 దాకా వరదలు, కొండచరియల కారణంగా ఏకంగా 370 మంది మృతిచెందారు. పంజాబ్లో సహాయక చర్యలపై ఆరా ప్రధాని మోదీ హిమాచల్ ప్రదేశ్లో పర్యటన అనంతరం పంజాబ్కు చేరుకున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. హెలికాప్టర్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. బాధితులను కలిసి మాట్లాడారు. అన్ని విధాలుగా ఆదుకుంటామని, ధైర్యంగా ఉండాలని వారికి సూచించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతోనూ మాట్లాడారు. సహాయక చర్యలపై ఆరా తీశారు. గురుదాస్పూర్లో సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. పంజాబ్కు తక్షణ సాయం కింద రూ.1,600 కోట్లు అందజేస్తామని ప్రకటించారు. భారీ వర్షాలతోపాటు సట్లెజ్, బియాస్, రావి నదులు ఉప్పొంగి ప్రవహించడంతో పంజాబ్లో భారీ నష్టం వాటిల్లింది. 51 మంది మరణించారు. 1.84 లక్షల హెక్టార్లలో పంటలు నీట మునిగాయి. రూ.13,000 కోట్ల నష్టం జరిగినట్లు ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. రూ.20,000 కోట్ల సహాయ ప్యాకేజీ ప్రకటించాలని ప్రధాని మోదీని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేసింది.చిన్నారి నీతికతో మోదీ హిమాచల్ప్రదేశ్లోని కాంగ్రాలో సమీక్షా సమావేశం సందర్భంగా ప్రధాని మోదీ 14 నెలల చిన్నారి నీతికను ఎత్తుకొని బుజ్జగించారు. ప్రకృతి విలయం వల్ల అనాథగా మారిన నీతిక దీనగాథ విని ఆయన చలించిపోయారు. హిమాచల్ప్రదేశ్లో మండీ జిల్లాలోని తల్వార గ్రామంలో జూన్ 30న రాత్రిపూట హఠాత్తుగా భారీ వర్షం కురిసింది. గ్రామంపై కొండ చరియలు విరుచుకుపడ్డాయి. ఓ ఇంట్లో రమేశ్ కుమార్(31), రాధాదేవి(24) దంపతులు తమ కమార్తె నీతికతోపాటు తల్లి పూనమ్దేవితో కలిసి నిద్రిస్తున్నారు. ఇంట్లోకి బురద చొచ్చుకొచ్చింది.నీతికను వంట గదిలో పడుకోబెట్టి బురదను తొలగించేందుకు ముగ్గురూ ప్రయత్నించారు. ఇంతలో భారీ కొండచరియ ఆ ఇంటిపైకి దూసుకొచ్చింది. వంట గది మినహా ఆ ముగ్గురున్న గది నేలమట్టమైంది. రమేశ్ కుమార్, రాధాదేవి, పూనమ్దేవి బురదతోపాటు కొట్టుకుపోయి మృత్యువాత పడ్డారు. వంట గదికి నష్టం జరగకపోవడంతో నీతిక ప్రాణాలతో బయటపడింది. ఆ సమయంలో నీతిక వయసు 11 నెలలే. నీతికను హిమాచల్ప్రదేశ్ ప్రభుత్వం ‘చైల్డ్ ఆఫ్ ద స్టేట్’గా ప్రకటించింది. ఆమె చదువుతోపాటు జీవనానికి అయ్యే ఖర్చులు భరిస్తామని ప్రకటించింది. -
డేంజర్ మార్క్ను దాటేసిన యమునా.. ఢిల్లీ అప్రమత్తం
ఢిల్లీ: యమునా నది ప్రమాద స్థాయిని దాటి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో వరద పెరిగింది. వరద నీరు బయటకి రాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. యమునా నది హోల్డింగ్ కెపాసిటీ పెంచామని ప్రభుత్వం వెల్లడించింది. యమునా నది పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న మురికివాడల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.మరో మూడు రోజులపాటు ఢిల్లీలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని.. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అవసరముంటే తప్ప బయటకి రావద్దని ప్రజలకు వాతావరణ శాఖ సూచించింది. పలు ప్రాంతాల్లో జలమయం కావడంతో ట్రాఫిక్ డైవర్షన్ చేస్తున్నారు. పాత రైల్వే వంతెనను మూసివేశారు.#WATCH | Yamuna river continues to flow above the danger mark in Delhi; Visuals from Old Yamuna Bridge. pic.twitter.com/vypHTNP1Uo— ANI (@ANI) September 3, 2025బుధవారం మధ్యాహ్నం 1 గంటకు 207 మీటర్లు దాటి పోయింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు, దుకాణాల్లోకి వరద నీరు ప్రవేశించింది. 1963 నుంచి ఇప్పటివరకు దాదాపు ఆరు దశాబ్దాల్లో యమునా నది 207 మీటర్ల మార్క్ను దాటడం ఇది ఐదోసారి. 2023 (208.66 మీ), 2013 (207.32 మీ.), 2010 (207.11 మీ.), 1978 (207.49 మీ.) దాటి ప్రవహించింది. -
వెయ్యి మందిని మింగిన మట్టి
కైరో: అంతర్యుద్ధంతో తల్లడిల్లుతున్న ఆఫ్రికా దేశం సూడాన్లో ఘోర ప్రకృతి విపత్తు చోటుచేసుకుంది. డార్ఫుర్రీజియన్లోని మర్రాహ్ పర్వతాల్లో ఆదివారం ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడటంతో తరసిన్ అనే గ్రామం మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. ఈ విపత్తులో వెయ్యిమందికి పైగా సజీవ సమాధి అయినట్లు ఆ ప్రాంతంలో అధికారంలో ఉన్న సూడాన్ లిబరేషన్ మూవ్మెంట్ ఆర్మీ ప్రకటించింది. ఈ ఘోర ప్రమాదం నుంచి ఒకే ఒక్క వ్యక్తి ప్రాణాలతో బయటపడినట్లు వెల్లడించింది. తరసిన్ గ్రామం మర్రాహ్ పర్వతాల్లో 3000 మీటర్ల ఎత్తులో ఉంది. కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో భారీస్థాయిలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రాంతం సూడాన్ రాజధాని ఖార్టోమ్కు 900 కిలోమీటర్ల దూరంలో ఉంది. మృతదేహాలను వెలికితీసేందుకు సూడాన్ లిబరేషన్ మూవ్మెంట్ ఆర్మీ అంతర్జాతీయ సాయం కోరింది. మరుభూమిగా ప్రపంచ వారసత్వ ప్రాంతం మర్రాహ్ పర్వతాలను యూనిసెఫ్ గతంలో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ఎత్తయిన ఈ పర్వతాల్లో చల్లని వాతావరణంతోపాటు భారీ వర్షాలు కురుస్తుంటాయి. ఇవన్నీ పురాతన అగి్నపర్వత ప్రాంతాలు. ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణానికి పెట్టింది పేరు. సూడాన్లో 2023 ఏప్రిల్ నుంచి సైన్యానికి, పారామిలిటరీ దళమైన ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (ఆర్ఎస్ఎఫ్)కు మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. దీంతో ప్రజలు ప్రాణాలు కాపాడుకునేందుకు కొండచరియలు విరిగిపడిన ప్రాంతానికి భారీగా వలస వెళ్లారు. తీవ్ర కరువు కారణంగా ఈ ప్రాంతంలో ప్రజలు గడ్డి తిని బతుకుతున్నారని కొన్నాళ్ల క్రితమే ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తంచేసింది.యుద్ధం కారణంగా ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఐరాస కార్యకలాపాలు కూడా నిర్వహించటం లేదు. దీంతో తక్షణ సాయం అందించటం సాధ్యం కావటం లేదని సూడాన్ అధికార వర్గాలు తెలిపాయి. కొండలపై నుంచి మట్టి, రాళ్లు భారీ మొత్తంలో జారిపడటంతో తరసిన్ గ్రామం చాలా లోతులో కూరుకుపోయినట్లు స్థానిక మీడియా తెలిపింది. అక్కడ ఒక గ్రామం ఉన్న ఆనవాళ్లు కూడా కనిపించటం లేదు. ఇటీవలి కాలంలో సూడాన్లో అతిపెద్ద ప్రకృతి విపత్తుల్లో ఇదీ ఒకటిగా నిలిచింది. -
ఉబికొచ్చిన భూగర్భ జలాలు
సాక్షి, హైదరాబాద్: సాధారణానికి మించి వర్షాలు కురవడంతో భూగర్భ జలాలు ఉబికి పైకొచ్చాయి. భూగర్భ జలాల రాష్ట్ర సగటు లోతు మేలో 10.07 మీటర్లకు పడిపోగా, వర్షా కాలం ప్రారంభం కావడంతో జూన్లో 9.47, జూలైలో 8.37 మీటర్లకు వృద్ధి చెందాయి. తాజాగా కురిసిన భారీ వర్షాలతో ఆగస్టులో ఏకంగా 5.78 మీటర్ల లోతుకు ఉబికివచ్చాయి. 2024 ఆగస్టులో 6.84 మీటర్ల లోతులో భూగర్భ జలాలు లభ్యం కాగా, 2025 ఆగస్టులో 1.06 మీటర్ల మేర వృద్ధితో 5.78 మీటర్ల లోతుల్లోనే లభ్యం కావడం గమనార్హం. అంటే గతేడాది కంటే ఈ ఏడాది భూగర్భ జలాలు మెరుగ్గా ఉన్నట్టు ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్ర భూగర్భ జలశాఖ జూన్లో రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో భూగర్భ జలాల స్థితిగతులను పరిశీలించి తాజాగా రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. అన్ని మండలాల్లో ఏర్పాటు చేసిన 1,771 పీజో మీటర్ల ద్వారా భూగర్భ జలాల స్థితిగతులను ప్రతి నెలా సమీక్షించి, తర్వాతి నెలలో నివేదికలను విడుదల చేస్తూ ఉంటుంది.ఆదిలాబాద్లో భారీగా వృద్ధి ఆదిలాబాద్ జిల్లాలో 1.71 మీటర్ల లోతుల్లోనే భూగర్భ జలాల లభ్యత ఉండగా, సిద్దిపేట జిల్లాలో అత్యధికంగా 11.38 మీటర్ల లోతుల్లో అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలోని జిల్లాలను సగటు భూగర్భ జలమట్టాన్ని 0–5 మీటర్లు, 5–10 మీటర్లు, 10 మీటర్లపైన లోతు.. అనే మూడు కేటగిరీలుగా వర్గీకరిస్తారు. » భూగర్భ జలాలు 0– 5 మీటర్లలోపు లోతులో ఉంటే సురక్షిత స్థాయిలో ఉన్నట్టు భావిస్తారు. 18 జిల్లాల్లో 0–5 మీటర్ల లోతులోనే భూగర్భ జలమట్టం ఉందని గుర్తించారు. 13 జిల్లాల్లో 5–10 మీటర్ల లోతులో, 2 జిల్లాల్లో 10–15 మీటర్ల లోతులో భూగర్భ జలాలున్నట్టు తేలింది.» 10 మీటర్లకన్నా లోతుకు భూగర్భ జలాలు పడిపోయిన జిల్లాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టుగా భావిస్తారు. సాధారణం కంటే అధికంగా...ఆగస్టులో రాష్ట్ర వార్షిక సగటు వర్షపాతం 574 మి.మీ.లు కాగా, 2025 ఆగస్టులో 721 మి.మీ.ల సగటు వర్షపాతం నమోదైంది. అంటే సాధారణం కంటే 26 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైందని స్పష్టమవుతోంది. 18 జిల్లాలు సాధారణం కంటే అధికం (21శాతం నుంచి 90 శాతం వరకు), మిగిలిన 15 జిల్లాలు సాధారణ (–13% నుంచి 16 శాతం) వర్షపాతాన్ని నమోదు చేశాయి. గతేడాది కంటే మెరుగే...2024 ఆగస్టుతో పోల్చితే 2025 ఆగస్టులో రాష్ట్రంలోని 23 జిల్లాల్లో భూగర్భ జలాలు మెరుగైన స్థితిలో ఉండగా, 10 జిల్లాల్లో స్వల్ప క్షీణత నమోదైంది. అత్యధికంగా నాగర్కర్నూల్ జిల్లాలో 5 మీటర్లు, అత్యల్పంగా నిజామాబాద్ జిల్లాలో 0.02 మీటర్ల వృద్ధి నమోదైంది.431 మండలాల్లో మెరుగుదలరాష్ట్రంలో మొత్తం 621 మండలాలు ఉండగా, దశాబ్ద కాల సగటుతో పోలిస్తే.. గత ఆగస్టు నెలలో 528 మండలాల్లో (86 శాతం) 0.01 నుంచి 19.64 మీటర్ల వరకు భూగర్భ జలాలు వృద్ధి చెందాయి. మిగిలిన 93 మండలాల్లో (21 శాతం) 0.01 నుంచి 20.92 మీటర్ల వరకు భూగర్భ జలమట్టం పతనమైందని గణాంకాలు చెబుతున్నాయి. -
ఏపీకి అలర్ట్.. ఆ మూడు జిల్లాల్లో భారీ వర్షాలు
సాక్షి, విజయవాడ: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని.. ఇది రాబోయే 24 గంటల్లో అదే ప్రాంతంలో మరింతగా బలపడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఆ తదుపరి 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా ఒడిశా మీదుగా కదిలే అవకాశం ఉందన్నారు. తీరం వెంబడి 40-60 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదని సూచించారు.దీని ప్రభావంతో రేపు(బుధవారం) శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.మంగళవారం సాయంత్రం 5 గంటల నాటికి శ్రీకాకుళం జిల్లా సంత బొమ్మాళిలో 88.7మిమీ, వజ్రపుకొత్తూరులో 80.7మిమీ, పలాసలో 70.5మిమీ, రావివలసలో 56.5 మిమీ, మదనపురంలో 53.5 మిమీ, హరిపురంలో 53 మిమీ చొప్పున వర్షపాతం రికార్డైందని పేర్కొన్నారు. సాయంత్రం 5 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి వరద నీటిమట్టం 41.3 అడుగులు ఉందన్నారు.ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 9.72 లక్షల క్యూసెక్కులు ఉందని మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించినట్లు తెలిపారు. కృష్ణానది ప్రకాశం బ్యారేజి వద్ద సాయంత్రం 5 గంటలకు ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 3,52,772 క్యూసెక్కులు ఉందన్నారు. కృష్ణా, గోదావరి నదుల వరద ప్రవాహం పూర్తిగా తగ్గే వరకు పొంగిపొర్లే నదులు, వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదన్నారు. -
డేంజర్ మార్క్ దాటేసిన యమునా.. ఢిల్లీకి వార్నింగ్ బెల్
యమునా నది ఉగ్రరూపంతో.. దేశ రాజధాని పరిధిలోని పలు ఇళ్లలోకి మంగళవారం ఉదయం నీరు చేరింది. నది ప్రవాహం డేంజర్ మార్క్ దాటేయడం, ఎగువ నుంచి వరద పోటెత్తుతుండడంతో కొనసాగుతుండడంతో ఢిల్లీకి ముంపు హెచ్చరికలు జారీ అయ్యాయి. మరోవైపు.. భారీ వర్షాలతో గురుగ్రామ్లోనూ జనజీవనం స్తంభించిపోగా, మరోసారి భారీ వర్షం కురవొచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో యమునా నదికి వరద నీరు పోటెత్తుతోంది. హర్యానా హాథ్నికుండ్ బ్యారేజ్ నుంచి భారీగా వరద నీరు కిందకు విడుదల అవుతోంది. దీంతో.. రాజధాని లోతట్టు ప్రాంతాలు నీట మునిగే అవకాశం ఉందని, హెచ్చరికలు జారీ చేశామని అధికారులు అంటున్నారు. మరోవైపు షాదరా జిల్లాలో యమునా నదిపై ఉన్న లోహపుల్ వంతెన మీదుగా మంగళవారం సాయంత్రం రాకపోకలు పూర్తిగా బంద్ చేయనున్నట్లు జిల్లా మేజిస్ట్రేట్ ప్రకటించారు. VIDEO | After incessant heavy rains in Delhi-NCR, the Yamuna River has risen and crossed the danger mark.Drone visuals from Loha Pul (Old Iron Bridge). As per officials, it will remain shut as water levels approach the evacuation mark of 206 meters.#DelhiFloods #YamunaRiver… pic.twitter.com/aa4rOiKjRU— Press Trust of India (@PTI_News) September 2, 2025 #YamunaRiver is flowing above the #DangerMark due to #ContinuousRainfall since yesterday. pic.twitter.com/cxSizrOdQp— Upendrra Rai (@UpendrraRai) September 2, 2025 సోమవారం కురిసిన భారీ వర్షంతో గురుగ్రామ్ అతలాకుతలం అయ్యింది. గురుగ్రామ్ ట్రాఫిక్కు సంబంధించిన ఓ వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. 20 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కావడంతో.. అధికారులు అప్రమత్తం అయ్యారు. మంగళవారం కూడా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో విద్యా సంస్థలను మూసేయాలని ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే ఆన్లైన్ తరగతులు నిర్వహించుకోవచ్చని, అలాగే ఉద్యోగులకు వర్క్ఫ్రమ్ హోం వెసులు బాటు కల్పించాలని కంపెనీలకు అధికార వర్గాలు సూచించాయి. రోడ్ల మీద భారీగా నీరు చేరడంతో జనాలు తీవ్ర అవస్థలు పడ్డారు. మంగళవారం భారీ వర్షం కురిసే అవకాశం ఉండడంతో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ద్వారాకా ఎక్స్ప్రెస్ వే సర్వీస్ లేన్పై భారీగా వరద నీరు చేరడంతో మూసేశారు. -
Heavy Rains: ఏపీకిహై అలర్ట్ రానున్న 5 రోజుల్లో భారీ వర్షాలు
-
హిమాచల్, ఉత్తరాఖండ్లో వర్ష బీభత్సం
న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో సోమవారం భీకర వర్షాలు, కొండచరియలు విరిగి పడిన ఘటనల్లో ఏడుగురు చనిపోయారు. ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ మార్గంలో సోమవారం ఉదయం కొండచరియలు విరిగి వాహనంపై పడగా ఇద్దరు యాత్రికులు చనిపోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సోన్ప్రయాగ్–గౌరీకుండ్ మార్గంలోని ముంకాటియా వద్ద కొండప్రాంతం పక్క నుంచి వెళ్తున్న వాహనంపై ఒక్కసారిగా బండరాళ్లు పడ్డాయని అధికారులు తెలిపారు. బాధితులంతా ఉత్తరకాశీ జిల్లాకు చెందిన వారేనన్నారు. క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థి తి విషమంగా ఉందన్నారు. భారీ వర్షాలు కొనసాగుతుండటంతో ఛార్ ధామ్ యాత్ర, సిక్కుల హేమ్కుండ్ సాహిబ్కు వెళ్లే దారిని ఈ నెల 5వ తేదీ వరకు మూసివేసినట్లు అధికారులు వివరించారు. వాతా వరణం మెరుగయ్యాక, రహదారులు పూర్తి సురక్షితమని భావించిన తర్వాతే తిరిగి రాకపోకలను అనుమతిస్తామన్నారు. సోమవారం ఉదయం 8 గంటల వేళకు చంపావత్ జిల్లా బన్బాసాలో 25.64 సెంటీమీటర్లు, ఖతిమాలో 18.1 సెంటీమీటర్లు, తనక్పూర్లో 17.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వివరించారు. రానున్న రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశమున్న డెహ్రాడూన్, ఉత్తరకాశీ, తెహ్రీ, పౌడీ, నైనిటాల్ తదితర 9 జిల్లాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. హిమాచల్లో ఐదుగురు.. హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లా జిల్లాలో 24 గంటల వ్యవధిలో వేర్వేరు చోట్ల కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో ఐదుగురు చనిపోయారు. వీరిలో ఒక మహిళ, ఏడేళ్ల ఆమె కుమార్తె ఉన్నారు. జుంగాలోని డబ్లూ ప్రాంతంలో కొండచరియలు విరిగి ఇల్లు కూలడంతో తండ్రి, అతడి పదేళ్ల కుమార్తె మరణించారు. సిమ్లాలోని కోట్ఖైలో ఇల్లు కూలి వృద్ధ మహిళ మరణించారు. కొండచరియలు విరిగిపడటంతో సిమ్లా–కల్కా మార్గంలో నడిచే ఆరు రైళ్లను రద్దు చేశారు. దెబ్బతిన్న ఐదు జాతీయ రహదారులు సహా 793 రహదారులను మూసివేశారు. మంగళవారం వరకు ఆరు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ విభాగం హెచ్చరించింది. కశ్మీర్లో అమిత్ షా పర్యటన జమ్మూకశ్మీర్లోని కత్రాలో భారీ వర్షం కురియడంతో మాతా వైష్ణోదేవి ఆలయాన్ని వరుసగా ఏడో రోజూ మూసి ఉంచారు. జమ్మూకశ్మీర్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లోని వారి పునరావాసానికి అన్ని విధాలుగా సాయమందిస్తామని హోం మంత్రి అమిత్ షా తెలిపారు. సోమవారం జమ్మూలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. అనంతరం లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, సీఎం ఒమర్ అబ్దుల్లా, సీనియర్ నేతలతో రాజ్భవన్లో జరిగిన సమావేశంలో పరిస్థితిని సమీక్షించారు. -
Devastating Monsoon Rains: దేశాన్ని ముంచేస్తోన్న వరద
-
సెప్టెంబర్లోనూ భారీ వర్షాలు
న్యూఢిల్లీ: సెప్టెంబరు నెలలోనూ దేశంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. ఏటా సెప్టెంబరులో 167.9 మిల్లీమీటర్ల వర్షపాతం కురుస్తుందని, అయితే ఈ ఏడాది ఈ నెలలో సాధారణం కంటే 109 శాతం అధికంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ వర్షాల వల్ల ఆకస్మిక వరదలు సంభవించి, కొండచరియలు విరిగిపడి జనజీవనం స్తంభించే ముప్పు ఉంటుందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మోహపాత్రా హెచ్చరించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. భారీ వర్షాల వల్ల ఉత్తరాఖండ్లో నదులు ఉప్పొంగి కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలకు దారితీయవచ్చని, దక్షిణ హర్యానా, ఢిల్లీ, ఉత్తర రాజస్థాన్లలో సాధారణ జనజీవనానికి అంతరాయం కలిగిస్తాయని హెచ్చరించారు. 1980 నుంచి ఏటా సెప్టెంబరులో భారత్లో వర్షపాతం పెరుగుతోందని ఆయన తెలిపారు. అయితే 1986, 1991, 2001, 2004, 2010, 2015, 2019 సంవత్సరాల్లో సెప్టెంబరు నెలల్లో తక్కువ వర్షపాతం నమోదైందన్నారు. సెప్టెంబరులో పశ్చిమ మధ్య, వాయవ్య, దక్షిణ భారత్లోని చాలా ప్రాంతాల్లో నెలవారీ సగటు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలో, సాధారణం కంటే తక్కువ స్థాయిలో ఉండొచ్చని మోహపాత్రా తెలిపారు. ఇక, తూర్పు మధ్య భారత్, తూర్పు, ఈశాన్య, వాయవ్య భారత్లోని పలు ప్రాంతాలు, పశ్చిమ తీర ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువ స్థాయుల్లో ఉండొచ్చని వెల్లడించారు.3నెలలూ సాధారణం కంటే అధిక వర్షపాతం‘జూన్ 1 నుంచి ఆగస్టు 31 మధ్య దేశంలో 743.1 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇది దీర్ఘకాలిక సగటు 700.7 మి.మీ కంటే దాదాపు 6 శాతం ఎక్కువ. జూన్ నెలలో సాధారణం కంటే దాదాపు 9 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది. జూలై నెలలో 294.1 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఇది సాధారణం కంటే దాదాపు 5 శాతం ఎక్కువ. ఆగస్టులో 268.1 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఇది సాధారణం కంటే 5.2 శాతం ఎక్కువ. ఇప్పటివరకు వర్షాకాలం మూడు నెలల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది’ అని మోహపాత్రా వివరించారు. -
వర్షం దెబ్బకు కామారెడ్డిలో ప్రస్తుత పరిస్థితి
-
సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలు సంభవిస్తున్నా ముందస్తు ప్రణాళికలు, సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫల మైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు విమర్శించారు. సహాయక చర్యల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొనాలని.. బాధితులకు అండగా నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన గురువా రం పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వ హించి జిల్లాలవారీగా వరద నష్టంపై ఆరా తీశారు. జనజీవనం అస్తవ్యస్తంపై కేసీఆర్ ఆందోళన భారీ వర్షాలు, వరదలతో రాష్ట్ర ప్రజలకు ఇబ్బందులు కలగడం, జనజీవనం అస్తవ్యస్తం కావడంపై మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్రావు ఆందోళన వ్యక్తం చేశారు. వరదలతో ఇళ్లు నీట మునిగి, రోడ్లు తెగిపోయి రవాణా వ్యవస్థ అతలాకుతలం కావడంపై దిగ్బ్రాంతి చెందారు. వరద ప్రభావిత ప్రాంతాలకు చెందిన పార్టీ నేతలతో గురువారం ఫోన్లో మాట్లాడారు. తమ వంతుగా పార్టీ శ్రేణులు సహాయక చర్యలు చేపట్టేలా చూడాలని కేటీఆర్ను ఆదేశించారు. -
జల విలయం
సాక్షి, నెట్వర్క్: ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా కురిసిన కుంభవృష్టి కామారెడ్డి జిల్లాలో బీభత్సం సృష్టించింది. జల ప్రళయాన్ని తలపిస్తూ.. బుధవారం కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం అర్గొండలో 24 గంటల్లో 43.35 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. 2023 జూలైలో ములుగు జిల్లా వెంకటాపూర్లో కురిసిన 64.9 సెంటీమీటర్ల తర్వాత ఇదే అత్యధిక వర్షపాతం కావడం గమనార్హం. అటు మెదక్, నిర్మల్ జిల్లాలను కూడా వాన ముంచెత్తింది. సిద్దిపేట, సిరిసిల్ల, ములుగు, యాదాద్రి భువనగిరి, నల్లగొండ జిల్లాలను సైతం భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. దీంతో జన జీవనం స్తంభించిపోయింది. కన్యాకుమారి – కశ్మీర్ నేషనల్ హైవే 44 సహా పలుచోట్ల ప్రధాన రహదారులు కోతకు గురికావడం, అనేకచోట్ల వంతెనలు, కాజ్వే లు కొట్టుకు పోవడంతో పట్టణాలు, గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. వందేళ్ల చరిత్ర కలిగిన పోచారం ప్రాజెక్టును వరద ముంచెత్తగా డ్యామ్కు ఒకవైపు గుంత పడటంతో ఒకదశలో ప్రాజెక్టు తెగిపోతుందేమోనన్న భయాందోళనలు వ్యక్తం అయ్యాయి. ముందుజాగ్రత్తగా మూడు గ్రామాలను ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించారు. మరోవైపు ఎన్నడూ లేనివిధంగా ఎగువ మానేరు ఉగ్రరూపం దాల్చింది. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు అలుగు పారుతున్నాయి. రైల్వే ట్రాక్లు సైతం కోతకు గురి కావడంతో పట్టాలు వరదలో తేలుతున్నట్టుగా కన్పించాయి. వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా ముగ్గురు మరణించగా, ఆరుగురు గల్లంతయ్యారు. రాష్ట్రంలో వర్షాలు వరదల పరిస్థితిని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, జిల్లాల అధికారులతో సమీక్షించారు. ఏరియల్ సర్వే ద్వారా ముంపు ప్రాంతాలను పరిశీలించారు. కామారెడ్డి కకావికలం కుండపోతగా కురిసిన వర్షంతో కామారెడ్డి జిల్లా అతలాకుతలమైంది. కామారెడ్డి పట్టణం చిగురుటాకులా వణికిపోయింది. కాలనీల్లో ఇళ్లు నీట మునిగాయి. బుధవారం ఉదయం 8.30 గంటల నుంచి గురువారం ఉదయం 8.30 గంటల వరకు 24 గంటల్లో జిల్లాలోని 11 మండలాల్లో 30 సెం.మీ. నుంచి 43 సెం.మీ. దాకా వర్షపాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు. వేలాది మంది వరద ముంపుబారిన పడ్డారు. జాతీయ రహదారులతో పాటు జిల్లా రహదారులు, గ్రామీణ రహదారులు, వంతెనలు కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాలు, వరదలు సృష్టించిన బీభత్సంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, ఒకరు గల్లంతయ్యారు. రాజంపేట మండల కేంద్రంలోని బీసీ కాలనీలో గోడ కూలి ఇప్పకాయల పల్లె దవాఖాన వైద్యుడు వినయ్ (28) ప్రాణాలు కోల్పోయాడు. బుధవారం పొలం వద్దకు వెళ్లిన బీబీపేట మండలం జనగామకు చెందిన రైతు రాజిరెడ్డి (63) ఎడ్లకట్టవాగులో గల్లంతయ్యాడు. గురువారం ఆయన మృతదేహాన్ని గుర్తించారు. బీబీ పేట మండలం సంగమేశ్వర్ గ్రామానికి చెందిన బాలరాజు వరదలో గల్లంతవగా ఆయన ఆచూకీ దొరకలేదు. జిల్లాలోని బీబీ పేట చెరువుకు గండిపడింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో రెండు ఎన్డీఆర్ఎఫ్, ఆరు ఎస్డీఆర్ఎస్ బృందాలు 25 చోట్ల రెస్క్యూ చేసి 775 మందిని కాపాడారు. నీట మునిగిన సిద్దిపేట నగరం మెతుకుసీమ అతలాకుతలం రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మెతుకుసీమ కకావికలమైంది. జిల్లా చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా అతిభారీ వర్షాలు నమోదయ్యాయి. ముఖ్యంగా హవేళీ ఘన్పూర్ మండలంలో వర్షం బీభత్సం సృష్టించింది. మెదక్ నుంచి రాజుపేట వైపు వెళ్తున్న ఓ ఆటో గంగమ్మ వాగులో కొట్టుకుపోవడంతో ఇందులో ప్రయాణిస్తున్న రాజుపేటకు చెందిన బెస్త సత్యనారాయణ మృతి చెందాడు. ఇదే గ్రామానికి చెందిన యాదగౌడ్ ఆచూకీ ఇంకా లభించలేదు. వాస్తవానికి వీరిద్దరు వాగులో ఉన్న ఓ చెట్టుపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు. అయితే వరద ఉధృతికి వీరు కొట్టుకుపోయారు. మరోవైపు ఇదే మండలంలోని నక్కవాగులో ఓ కారు కొట్టుకుపోయింది. అందులో ఉన్న నరేందర్గౌడ్ ఓ పొదను పట్టుకుని 100కు ఫోన్ ద్వారా లొకేషన్ పంపడంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కాపాడారు. గంగమ్మ వాగుపై రాజుపేట బ్రిడ్జిపై 8 మంది చిక్కుకుపోగా, వీరిని కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి. దూప్సింగ్ తండాను వరద నీరు ముంచెత్తింది. నిజాంపేట మండలం చల్మెడలోని సోమయ్య చెరువు, బ్రాహ్మణ చెరువు నిండిపోయి గ్రామాలను ముంచెత్తే ప్రమాదం ఉండటంతో చెరువు కట్టకు గండి పెట్టి నీటిని దిగువకు వదిలేశారు. కొల్చారం మండలంలోని తుక్కాపూర్లో కాలకృత్యాలు తీర్చుకునేందుకు బయటకు వెళ్లిన టేక్మాల్ మల్లప్ప భార్య ప్రమీల మంజీర నదిలో గల్లంతయ్యింది. గురువారం మధ్యాహ్నం వరకు అందిన వివరాల ప్రకారం..జిల్లాలో 49 రోడ్లు తెగిపోయాయి. 24 కాజ్వేలు, కల్వర్టులు కూలిపోయాయి. 21 బ్రిడ్జిలు దెబ్బతిన్నాయి. 22 చెరువులకు గండ్లు పడ్డాయి. మెదక్, రామాయంపేట పట్టణాలతో పాటు, పలు గ్రామాల్లో 20 కాలనీల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. 6,341 ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. జలదిగ్బంధంలో రామాయంపేట రామాయంపేటలో రెండురోజుల్లో 20 సెం.మీ వరకు వర్షం కురిసింది. పట్టణంలోని శ్రీనగర్కాలనీ, అక్కలగల్లి, బీసీ కాలనీ ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రామాయంపేట – కామారెడ్డి– సిద్దిపేట మార్గంలో వరద నీరు చేరడంతో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. ఎస్సీ మహిళా డిగ్రీ కాలేజీ హాస్టల్లో నీరు చేరడంతో 50 మంది విద్యార్థినులను తాళ్ల సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు వివేక్, దామోదర రాజనర్సింహ పర్యటించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు. రైతులు, ఇటుక బట్టీ కార్మీకుల రెస్క్యూ మెదక్, కామారెడ్డి జిల్లాల్లో కురుస్తున్న భారీవర్షాలతో రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టుకు బుధవారం వరద పోటెత్తింది. రికార్డు స్థాయిలో వచ్చిన నీటితో మానేరు పరవళ్లు తొక్కుతోంది. దిగువన ఉన్న పరీవాహక వాగులో ఒక రైతు గల్లంతు కాగా.. ఐదుగురు రైతులు, ఇద్దరు ఇటుక బట్టీ కార్మీకులు ప్రవాహంలో చిక్కుకున్నారు. గురువారం భారత వైమానిక దళ హెలికాప్టర్ సాయంతో రైతులను, కార్మీకులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. గేదెల కోసం వెళ్లిన గంభీరావుపేట మండలం నర్మాల గ్రామానికి చెందిన పంపుకాడి నాగయ్య అనే రైతు వరదలో గల్లంతయ్యాడు. నర్మాలకు చెందిన పలువురు రైతులు పశువులను తోలుకెళ్లి వాగులో చిక్కుకుపోయారు. అదే ప్రాంతంలో ఉన్న ఇటుకబట్టీలో పనిచేస్తున్న మహారాష్ట్రకు చెందిన ఇద్దరు కార్మీకులు అక్కడే ఉండిపోయారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేశ్ బీ గీతే వరదలో చిక్కుకుపోయిన వారికి డ్రోన్ల ద్వారా ఆహార పదార్థాలు పంపించారు. బండి సంజయ్ చొరవ కేంద్ర మంత్రి బండి సంజయ్ చొరవతో భారత వైమానిక దళానికి చెందిన హెలీకాప్టర్ సాయంతో రైతులను, కార్మీకులను ఒడ్డుకు చేర్చారు. గురువారం సంఘటన స్థలానికి చేరుకున్న సంజయ్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో కలిసి రైతులతో మాట్లాడారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ఎగువ మానేరుకు వచ్చి వరద ఉధృతిని పరిశీలించారు. మధ్యాహ్నం ఆర్మీ హెలీకాప్టర్లు బాధితులను రక్షించేంతవరకు ఆయన ఘటనాస్థలంలోనే ఉండటం గమనార్హం. కాగా వరదలో గల్లంతైన నర్మాలకు చెందిన పంపుకాడి నాగయ్య నివాసానికి సంజయ్ వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించారు. నాగం కుమారుడు సాయికి రూ.లక్ష ఆర్థిక సాయం అందించారు. నీటమునిగిన నిర్మల్ నిర్మల్ జిల్లాలో బుధవారం మధ్యాహ్నం నుంచి గురువారం ఉదయం వరకు భారీ నుంచి అతిభారీ వర్షం కురిసింది. నిర్మల్ పట్టణంలో పలు కాలనీలు నీటమునిగాయి. జిల్లాలోని లక్ష్మణచాంద మండలంలో మునిపల్లి శివారులోని గోదావరి కుర్రులో చిక్కుకుపోయిన పశువుల కాపరి శంకర్ను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రాణాలకు తెగించి కాపాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి గ్రామం వద్ద రోడ్డు మీదుగా ఉధృతంగా వరద నీరు ప్రవహించడంతో సుమారు 24 గంటల పాటు వాహనాల రాకపోకలను నిలిపివేశారు. తెగిన ఎన్హెచ్– 44.. కశ్మీర్ టూ కన్యాకుమారి ఎన్హెచ్–44 పై పలుచోట్ల రోడ్డు, వంతెనలు తెగిపోవడంతో జాతీయ రహదారిపై బుధ, గురువారాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. మెదక్ జిల్లా నార్సింగి వద్ద వరద 44వ నంబర్ జాతీయ రహదారిని వరద ముంచెత్తింది. దీంతో హైదరాబాద్ – నిజామాబాద్ మార్గంలో పలుచోట్ల వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మెదక్ – సిద్దిపేట రహదారిపై నిజాంపేట వద్ద ఉన్న బ్రిడ్జి కొట్టుకుపోయింది. దీంతో ఈ రూట్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మెదక్ నుంచి ఎల్లారెడ్డి, బాన్సువాడ రహదారిపై పోచారం ప్రాజెక్టు పొంగి ప్రవహించడంతో వంతెన దెబ్బతిని రాకపోకలు నిలిచిపోయాయి. కామారెడ్డి జిల్లా భిక్కనూరు టోల్ప్లాజా వద్ద జాతీయ రహదారిపై భారీగా వరద నీరు పారడంతో రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు కామారెడ్డి–భిక్కనూరు మండలాల సరిహద్దులో జంగంపల్లి వద్ద జాతీయ రహదారిపైకి భారీగా వచ్చిన వరద నీటితో రోడ్డు కోతకు గురైంది. సదాశివనగర్ మండలం కల్వరాల వద్ద కూడా ఎన్హెచ్ 44 కోతకు గురైంది. టేక్రియల్ వంతెన కోతకు గురైంది. హైదరాబాద్–నిజామాబాద్ ఆర్టీసీ సరీ్వసులు నిలిచిపోయాయి. కామారెడ్డి జాతీయ రహదారిలోని జీఆర్ కాలనీలో కల్వర్టు కింద నుంచి ప్రవాహంలో కొట్టు కొచ్చిన కార్లు కొట్టుకుపోయిన రైల్వే లైన్లు సికింద్రాబాద్–నిజామాబాద్ రైల్వే లైనుపై పలు చోట్ల మట్టికొట్టుకుపోయి ట్రాక్లు గాలిలో వేలాడడంతో రైళ్లను రద్దు చేశారు. మెదక్ జిల్లా శమ్నాపూర్ దేవుని చెరువు నీళ్ల ధాటికి రైల్వే ట్రాక్ కోతకు గురైంది. దీంతో అక్కన్నపేట – మెదక్ మార్గంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. కామారెడ్డి జిల్లా తలమడ్ల సమీపంలో కూడా ట్రాక్ కోతకు గురికావడంతో సికింద్రాబాద్– మన్మార్డ్ మా ర్గంలో రైళ్లు నిలిచిపోయాయి. ఈ రూట్లో రైళ్లు పునరుద్ధరించాలంటే రెండు రోజులైనా పట్టే అవకాశాలున్నాయని అంటున్నారు.మెదక్ జిల్లాలో నీట మునిగిన దూప్సింగ్ తండా భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో..భూపాలపల్లి జిల్లా ఎగువనుంచి వరద నీరు వస్తుందటంతో మోరంచ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. మహాముత్తారం మండలంలోని పెగడపల్లి, కేశవపూర్ మధ్య గల పెద్దవాగు ఉప్పొంగి ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. బ మల్హర్ మండలంలోని తాడిచర్ల ఓపెన్కాస్ట్లో 6 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోగా, భూపాలపల్లి ఏరియాలో మంగళవారం, బుధవారం కురిసిన వర్షానికి ఓపెన్కాస్ట్ 2,3 ప్రాజెక్టుల్లో 20 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం వాటిల్లినట్లు సింగరేణి అధికారులు వెల్లడించారు. ములుగు జిల్లా మొండ్యాల తోగు వద్ద జాతీయ రహదారి వరద తాకిడికి భారీగా కోతకు గురైంది. ఊరట్టం తూ ముల వాగు వరద తాకిడికి బ్రిడ్జి సమీపంలో రోడ్యాం వద్ద సీసీ రోడ్డు కోతకు గురైంది. రంగాపూర్ పెద్ద చెరువు కట్ట తెగిపోయింది. జల దిగ్బంధంలో సిద్దిపేట రెండు రోజులుగా ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో సిద్దిపేట జిల్లా కేంద్రం జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. ఎగువ నుంచి కోమటి చెరువుకు వరద నీరు చేరడంతో పొంగి పొర్లుతోంది. దీంతో పట్టణంలోని శ్రీనగర్ కాలనీ, హరిప్రియానగర్, శ్రీనివాసనగర్, సీతారామంజనేయ థియేటర్ జలమయంగా మారాయి. హరిప్రియానగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వరద నీరు చేరడంతో..వరద ప్రవాహంలోనే రోగులను స్ట్రెచర్పై మరో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. గజ్వేల్లోని లక్ష్మీప్రసన్న కాలనీ, ఎలైట్ ప్రజ్వల్ కాలనీ కూడా నీట మునిగాయి. కూడవెల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. గజ్వేల్–దుబ్బాక మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గజ్వేల్ పట్టణంలోని ఎర్రకుంట పొంగి పొర్లుతుండటంతో వరద నీరంతా తూప్రాన్ రోడ్డు వై జంక్షన్ వద్ద నిలిచి 33/11 కేవీ సబ్ స్టేషన్ జలమయంగా మారింది. వరద ముంపులో చిక్కుకున్న సిద్దిపేట జిల్లా అక్బర్పేట–భూంపల్లి మండలం చిన్ననిజాంపేట గ్రామానికి చెందిన ముగ్గురు రైతులు 22 గంటల పాటు బిక్కుబిక్కుమంటూ గడిపారు. అనంతరం ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది పడవ ద్వారా వారిని ఒడ్డుకు చేర్చారు. పోచారం ప్రాజెక్టుకు తప్పిన ముప్పు కామారెడ్డి జిల్లాలోని పోచారం ప్రాజెక్టుకు భారీ ముప్పు తప్పింది. భారీ వర్షాలతో ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. దీంతో ప్రాజెక్టు పైభాగం నుంచి నీరు పడడంతో స్ట్రక్చర్కు ఒకచోట గొయ్యి ఏర్పడింది. ప్రాజెక్టు తెగిపోయినట్టేనని అందరూ భావించారు. కానీ వరద తీవ్రత తగ్గడంతో పెద్ద ప్రమాదం తప్పింది. రైలుకు ఎదురెళ్లి నిలిపేసిన గ్యాంగ్మన్ గ్యాంగ్మన్ అప్రమత్తతతో పెద్ద రైలు ప్రమాదం తప్పింది. కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో బుధవారం కురిసిన భారీ వర్షాలకు వరద పోటెత్తడంతో కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలంలోని రామేశ్వర్పల్లి–తిప్పాపూర్ మధ్య 528 మైలురాయి వద్ద రైల్వే ట్రాక్ కింద ఉన్న మట్టికట్ట 50 గజాల మేర కొట్టుకుపోయింది. దీంతో రైలు పట్టాలు గాల్లో వేలాడుతున్నాయి. గ్యాంగ్మన్ రమేష్ దీన్ని గమనించి అప్రమత్తమయ్యాడు. భిక్కనూరు నుంచి వస్తున్న కాచిగూడ–పెద్దపల్లి ప్యాసింజర్ రైలుకు ఎదురుగా వెళ్లి అది ఆగిపోయేలా చూశాడు. ట్రాక్ కొట్టుకుపోయిన విషయాన్ని లోకో పైలట్కు తెలియజేయడంతో ఆయన స్టేషన్ మాస్టర్ భానుశేఖర్కు సమాచారం అందించారు. ఆయన ఉన్నతాధికారులకు సమాచారం చేరవేయడంతో వారు వెంటనే సికింద్రాబాద్–నిజామాబాద్ మార్గంలో ప్రయాణించే పలు రైళ్లను రద్దు చేసి, కొన్ని రైళ్లను వేరే మార్గంలోకి మళ్లించారు. కాచిగూడ–పెద్దపల్లి ప్యాసింజర్ రైలులో 167 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదం జరగకుండా వీరిని కాపాడిన గ్యాంగ్మన్ రమేష్ను డివిజనల్ రైల్వే మేనేజర్ సంతోష్ కుమార్, ప్రయాణికులు అభినందించారు. -
కూలిన స్తంభాలు... నీళ్లలో సబ్స్టేషన్లు
సాక్షి, హైదరాబాద్/మిరుదొడ్డి (దుబ్బాక)/తొగుట (దుబ్బాక): వరద ప్రభావిత ప్రాంతాల్లోని చాలా గ్రామాల్లో అంధకారం అలముకుంది. సబ్ స్టేషన్లలోకి నీళ్లు చేరడం, విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో విద్యుత్ శాఖకు భారీ నష్టం వాటిల్లింది. వరదల నేపథ్యంలో విద్యుత్ సరఫరాను నిలిపివేసిన అధికారులు సరఫరా పునరుద్ధరణకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. అయినా మరో 3–4 రోజుల వరకు విద్యుత్ పునరుద్ధరణ సాధ్యం కాకపోవచ్చని అధికార వర్గాలు అంటున్నాయి. మరోవైపు ఉత్తర, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీలు ముషారఫ్ ఫారూఖీ, కర్నాటి వరుణ్రెడ్డి తాజా పరిస్థితిని గురువారం మీడియాకు వెల్లడించారు. కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్ ప్రాంతాల్లో వరుణ్రెడ్డి పర్యటించారు. కరీంనగర్ సర్కిల్ ఆఫీ సులో లోడ్ మానిటరింగ్ సెల్ను పరిశీలించి విద్యుత్ సరఫరా, సబ్స్టేషన్ల పనితీరు, స్తంభాలు, లైన్ల పనితీరును పర్యవేక్షించారు. కాగా, క్షేత్రస్థాయి నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు. పలు జిల్లాల్లో ‘విద్యుత్’ నష్టం ఇలా.. » మెదక్ జిల్లాలో వరద ప్రభావానికి కొన్నిచోట్ల సబ్స్టేషన్లలోకి నీళ్లు చేరాయి. 33 కేవీ ఫీడర్లు 11, 11 కేవీ ఫీడర్లు 175, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు 262 సహా 971 విద్యుత్ స్తంభాలకు నష్టం వాటిల్లింది. వందల కి.మీ. మేర విద్యుత్ లైన్లు దెబ్బతిన్నాయి. » నల్లగొండ, గద్వాల్, యాదాద్రి, సంగారెడ్డి, నారాయణపేట జిల్లాల పరిధిలో వరదల ప్రభావానికి 33 కేవీ ఫీడర్లు 39, 11 కేవీ ఫీడర్లు 296, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు 280, 1,357 విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. మరోవైపు ఉత్తర ప్రాంత విద్యుత్ సంస్థ పరిధిలోని కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ సర్కిల్ పరిధిలో 108 విద్యుత్ స్తంభాలు నేలకూలగా వాటిల్లో 87 స్తంభాలను అధికారులు పునరుద్ధరించారు. అలాగే 21 ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతినగా అన్నింటినీ బాగుచేశారు. అయితే 86 ట్రాన్స్ఫార్మర్లు నీటమునగగా వాటిలో ఆరింటిని పునరుద్ధరించారు. ప్రాణాలకు తెగించి వాగులోకి వెళ్లి..9 గ్రామాలకు ఉద్యోగుల వెలుగులు భారీ వర్షాల వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడంతో విద్యుత్ఉద్యోగులు ప్రాణాలకు తెగించి సర ఫరా పునరుద్ధరించారు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట– భూంపల్లి మండలం ఖాజీపూర్ పరిధిలోని 33/11 కేవీ ఫీడర్ లైన్కు సంబంధించిన విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో కాసులాబాద్, రుద్రారం, మల్లుపల్లి, జంగపల్లి, వీరారెడ్డిపల్లి, మదన్నపేట, బేగంపేట, అల్మాస్పూర్, ఖాజీపూర్, గుర్రాలపల్లి గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న ఎస్సీ చంద్రమోహన్, డీఈ రామచంద్రయ్య, ఏడీ గంగాధర్, ఏఈ కనకయ్యలు తమ సిబ్బందితో కలిసి వాగులోకి వెళ్లి విద్యుత్ స్తంభాన్ని ఏర్పాటు చేశారు. దీంతో తొమ్మిది గ్రామాలకు సరఫరాను పురుద్ధరించారు. మరోవైపు తొగుట మండలం వెంకట్రావుపేట వనం చెరువు మధ్యలో ఉన్న ఓ విద్యుత్ స్తంభానికి పిన్ ఇన్సులేటర్ ఊడి పడిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో జేఎల్ఎం మల్లేశం చెరువులోకి ఈదుకుంటూ వెళ్లి స్తంభంపైకి చేరుకొని.. పిన్ ఇన్సులేటర్ను బిగించాడు. దీంతో సరఫరా పునరుద్ధరణ అయింది. జేఎల్ఎం మల్లేశంను అధికారులు అభినందించారు. -
మరో రెండ్రోజులు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు కూడా అత్యంత చురుకుగా కదులుతున్నాయి. వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసరాల్లో కొనసాగిన తీవ్ర అల్పపీడనం వాయువ్య దిశలో కదిలి గురువారం దక్షిణ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో తీరాన్ని దాటింది. ప్రస్తుతం మధ్య ఛత్తీస్గఢ్ ప్రాంతంలో అల్పపీడనంగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల చక్రవాత ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో మరో రెండ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. సగటున 5.08 సెంటీమీటర్ల వర్షపాతం...బుధ, గురువారాల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వర్షాలు కురిశాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా సగటున 5.08 సెంటీమీటర్ల వర్షం కురిసింది. గురువారం రాత్రి వరకు చూస్తే 2.5 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. నైరుతి రుతుపవ నాల సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా 8 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కాగా 10 జిల్లాల్లో అధికం, 15 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ఈ సీజన్లో ఆగస్టు 28 నాటికి రాష్ట్రంలో సగటున 55.19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 69.17 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సాధారణ వర్షపాతం కంటే 25 శాతం అధికంగా వర్షాలు కురిసినట్లు రాష్ట్ర ప్రణాళిక శాఖ గణాంకాలు చెబుతున్నాయి. మరో రెండ్రోజుల పాటు కురిసే వర్షాలతో రాష్ట్రంలో సగటు వర్షపాతం ఈ సీజన్ మొత్తంలో కురవాల్సిన సాధారణ వర్షపాతానికి సమానమవుతుందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. -
యుద్ధప్రాతిపదికన మరమ్మతులు
సాక్షి, హైదరాబాద్/పెద్దపల్లి/మెదక్జోన్: భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న చెరువులు, కాల్వలు, రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. తక్షణ మే అంచనాలు తయారు చేసి అత్యవసర నిధులతో పనులు చేపట్టాలని సూచించారు. వరదల్లో మృతిచెందిన వారి కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెల్లించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్తో కలిసి సీఎం రేవంత్రెడ్డి గురువారం వరదలతో అతలాకుతలమైన కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించారు. భారీ వర్షాలతో బుధ, గురువారాల్లో పోటెత్తిన వరదలతో కామారెడ్డి, మెదక్ జిల్లాలో అపార నష్టం వాటిల్లిందని సీఎంకు రెండు జిల్లాల కలెక్టర్లు నివేదించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద హెలికాప్టర్ దిగి వరదల పరిస్థితిపై సమీక్షించారు. అనంతరం నిజాంసాగర్, పోచారం ప్రాజెక్టులను ఏరియల్ సర్వే నిర్వహించారు. కామారెడ్డిలో హెలికాప్టర్ దిగి జిల్లా కలెక్టర్తో సమీక్షించాల్సి ఉండగా, వాతావరణం అనుకూలించకపోవటంతో సాధ్యం కాలేదు. దీంతో మెదక్ జిల్లా చేరుకుని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం హెలికాప్టర్ను మెదక్ ఎస్పీ కార్యాలయంలో దించి జిల్లాలో వరదల పరిస్థితిపై అక్కడే సమీక్ష నిర్వహించారు. జిల్లాలో వరద పరిస్థితిని కలెక్టర్ సీఎంకు నివేదించారు. వరద సహాయక చర్యల్లో అధికార యంత్రాంగం బాగా పని చేసిందని సీఎం కితాబిచ్చారు. సమీక్షలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, ఎంపీ రఘునందన్ రావు తదితరులు పాల్గొన్నారు. మెదక్ నుంచే సీఎం కామారెడ్డి జిల్లా కలెక్టర్కు ఫోన్ చేసి వరద పరిస్థితులపై ఆరా తీశారు. సత్వరం సహాయక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వరద నష్టంపై అత్యవసరంగా కేంద్రానికి ప్రాథమిక నివేదిక సమర్పిస్తామని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. అప్రమత్తంగా ఉండాలిభారీ వర్షాల నేపథ్యలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవా లని సీఎం ఆదేశించారు. గురువారం ఉదయం తన నివాసంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, మంత్రులు శ్రీధర్బాబు, సీతక్కతో కలిసి వరద పరిస్థితిపై సమీక్షించారు. హైదరాబాద్ నగరంతోపాటు అన్నిచోట్లా శిథిలావస్థకు చేరిన ఇళ్లలో ఉన్న వారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. వినాయక మండపాల వద్ద విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లతో భక్తులకు ప్రమాదం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. హైదరాబాద్లో హైడ్రా, జీహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, పోలీసు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. చెరువులు, కుంటలకు గండ్లు పడే ప్రమాదం ఉన్నందున నీటి పారుదల శాఖ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. అంటువ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. వైద్యారోగ్య శాఖ సిబ్బంది ఆస్పత్రుల్లో సరిపడా మందులు అందుబాటులో ఉంచుకోవడంతోపాటు అవసరమైన చోట వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్బృందాల సాయం తీసుకోవాలని సీఎస్ను ఆదేశించారు. మామ స్వాతిముత్యం.. అల్లుడు ఆణిముత్యంమామ స్వాతిముత్యం.. అల్లుడు ఆణిముత్యంలా రూ.లక్షల కోట్లు వెచ్చించి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో ఎన్నో లోపాలు ఉన్నాయని సీఎం రేవంత్రెడ్డి విమర్శించారు. గురువారం పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ఆయన మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బరాజ్ కుంగిపోయిందని, ఏనాడో నిర్మించిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టే ప్రస్తుతం తెలంగాణకు వరప్రదాయినిగా మారిందని అన్నారు. మామ, అల్లుడు కాళేశ్వరం ప్రాజెక్టును గొప్పగా నిర్మించామని చెప్పుకుంటున్నారని, వాళ్లలా తాము 80 వేల పుస్తకాలు చదవలేదని మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావుపై సెటైర్ వేశారు. యూరియాపై ఎప్పటికప్పుడు బఫర్ స్టాక్ డిస్ప్లే చేస్తున్నామని సీఎం తెలిపారు. తదుపరి పంటలకు సైతం కొందరు రైతులు యూరియాను నిల్వ చేసుకోవడంతో కొరత ఏర్పడిందని చెప్పారు. సీఎం వెంట మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, రామగుండం ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ మక్కాన్సింగ్ ఉన్నారు. -
గోదావరి మళ్లీ ఉగ్రరూపం
సాక్షి, హైదరాబాద్: గోదావరి నది మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. పరీవాహక ప్రాంతాల్లో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రధాన ఉపనదులైన మంజీర, మానేరు, పెన్గంగా, వార్ధా, వెయిన్గంగా, ప్రాణహిత, ఇంద్రావతి, శబరితోపాటు గోదావరి నది ఎగువ, మధ్య, దిగువ పాయలు భీకరంగా ప్రవహిస్తున్నాయి. దీంతో పరీవాహకంలోని అన్ని ప్రాజెక్టులకు గంటగంటకూ భీకర వరద పోటెత్తడంతో అప్రమత్తత ప్రకటించారు. మహారాష్ట్రలోని జైక్వాడ్ ప్రాజెక్టు నుంచి ఏపీలోని ధవళేశ్వరం బరాజ్ వరకు పరీవాహకంలోని అన్ని ప్రాజెక్టుల గేట్లు పైకి ఎత్తారు. » భదాచలం వద్ద గోదావరిలో 7.45 లక్షల క్యూసెక్కుల వరద పోటెత్తడంతో నీటిమట్టం 38.6 అడుగులకు చేరుకుంది. ప్ర వాహం 9.32 లక్షల క్యూసెక్కులకు చేరితే తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. » మంజీరపై ఉన్న సింగూరు ప్రాజెక్టుకు 44,650 క్యూసెక్కుల వరద వస్తుండగా, 18.32 టీఎంసీల నిల్వను కొనసాగిస్తూ వచ్చిన నీటిని వచ్చినట్టే దిగువకు విడుదల చేస్తున్నారు. దిగువన ఉన్న నిజాంసాగర్ గరిష్ట సామర్థ్యం 17.8 టీఎంసీలు కాగా, 1.81లక్షల క్యూసెక్కుల వరద వస్తుండడంతో 16.14 టీఎంసీల నిల్వను కొనసాగిస్తూ 27 గేట్లు పైకెత్తి 2.2 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. » శ్రీరాంసాగర్ గరిష్ట నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా, ప్రాజెక్టుకు 3.2 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండడంతో 67.05 టీఎంసీల నిల్వలను కొనసాగిస్తూ 39 గేట్లు పైకెత్తి 3.55 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నెల 30న శ్రీరాంసాగర్కు గరిష్టంగా 3.7లక్షల క్యూసెక్కుల వరద పోటెత్తనుందని అంచనా వేశారు.» కడెం ప్రాజెక్టు సామర్థ్యం 4.7 టీఎంసీలు కాగా, 66,605 క్యూసెక్కుల వరద వస్తుండడంతో 3.78 టీఎంసీల నిల్వ కొనసాగిస్తూ, 62,407 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. స్వర్ణ ప్రాజెక్టులోకి 5,700 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండటంతో అదేస్థాయిలో రెండుగేట్ల ద్వారా నీటిని వదులుతున్నారు. భైంసాలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టులోకి 17,500 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతుండటంతో మూడుగేట్ల ద్వారా 18,500 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. » దిగువన ఉన్న ఎల్లంపల్లి నిల్వ సామర్థ్యం 20.18 టీఎంసీలు కాగా 5.14 లక్షల క్యూసెక్కుల వరద పోటెత్తడంతో 14.63 టీఎంసీల నిల్వను కొనసాగిస్తూ 38 గేట్లు పైకెత్తి 5.9 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సోమవారం రాత్రి నాటికి 9 లక్షల క్యూసెక్కులకు వరద పెరుగుతుందని అంచనా వేశారు. » కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన సుందిళ్ల బరాజ్కు 8.36 లక్షలు, అన్నారం బరాజ్కు 6.19 లక్షలు, మేడిగడ్డ బరాజ్కు 5.52 లక్షల క్యూసెక్కులతోపాటు సమ్మక్క బరాజ్కు 5.13 లక్షలు, సీతమ్మసాగర్ బరాజ్కు 7.02 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, వచ్చిన వరదను వచ్చినట్టు కిందకు విడుదల చేస్తున్నారు. మేడిగడ్డ బరాజ్కు శనివారం నాటికి గరిష్టంగా 9.48 లక్షల క్యూసెక్కుల వరద రానుందని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో భద్రాచలం వద్ద గోదావరిలో నీటిమట్టం మంగళ, బుధవారాల్లో అత్యంత ప్రమాదకర స్థాయికి పెరగనున్నట్టు అంచనా వేస్తున్నారు. మిడ్మానేరు గేట్లు ఎత్తివేత.. భారీ వర్షాలతో మానేరు నది పోటెత్తింది. దీంతో మిడ్మానేరు రిజర్వాయర్కు మానేరు నుంచి 45,565 క్యూసెక్కులు, శ్రీరాంసాగర్ నుంచి ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా మరో 12,000 క్యూసెక్కులు కలిపి మొత్తం 57,566 క్యూసెక్కులు వచ్చి మిడ్మానేరులో కలుస్తుండడంతో జలాశయ 17 గేట్లను పైకెత్తి 47,850 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో దిగువ మానేరు జలాశయానికి వరద ప్రవాహం 56,944 క్యూసెక్కులకు పెరిగింది. జలాశయం నిల్వ సామర్థ్యం 24.07 టీఎంసీలు కాగా ప్రస్తుతం 16.97 టీఎంసీలకు నిల్వలు చేరాయి. మంగళవారం ఉదయం నాటికి జలాశయం పూర్తిగా నిండొచ్చు.సాగర్కు పెరిగిన వరద 26 గేట్ల ద్వారా కృష్ణమ్మ పరవళ్లు నాగార్జునసాగర్/డిండి: సాగర్ జలాశయానికి 3,18,791 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా, 26 క్రస్ట్ గేట్లు, విద్యుదుత్పాదనతో దిగువ కృష్ణానదిలోకి 2,35,058 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. వర్షాలు కురుస్తుండడంతో ఆయకట్టుకు నీటి అవసరాలు తగ్గాయి. దీంతో నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు నీటి విడుదలను నిలిపివేశారు. అవసరమైన సమయంలో మళ్లీ నీటిని విడుదల చేయనున్నట్టు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. అలుగు పారుతున్న డిండి ప్రాజెక్టుడిండి మండల కేంద్రంలోని డిండి ప్రాజెక్టులోకి వరద మరింత పెరిగింది. ఈ నెల 14 నుంచి ప్రాజెక్టు అలుగుపోస్తున్న విషయం తెలిసిందే. అయితే గురువారం నుంచి ప్రాజెక్టులోకి 10,202 క్యూసెక్కుల నీరు వస్తుండడంతో అలుగు నుంచి నీటి విడుదల కూడా పెరిగింది. డిండి ప్రాజెక్టు అందాలను చూడటానికి పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తున్నారు. -
శ్రీశైలంలో విరిగిపడ్డ కొండచరియలు
సాక్షి, నంద్యాల జిల్లా: శ్రీశైలం డ్యామ్ సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. కొండరాళ్లు స్వల్పంగా విరిగిపడగా.. ఆ సమయంలో ఎవ్వరు లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. కొండచరియలు విరిగిపడటంతో శ్రీశైలం-హైదరాబాద్ రహదారి కావడంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో కొండచరియలు విరిగిపడుతున్నాయి.కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. శ్రీమఠం పరిసర ప్రాంతాల్లో వర్షపు ప్రవహిస్తుండటంతో భక్తుల ఇక్కట్లు పడుతున్నారు. వసతి గృహాలు లేక ఇబ్బందులు పడుతున్న భక్తులకు హెచ్ఆర్బీ, టీటీడీ కళ్యాణ మండపాల్లో ఉచిత వసతి ఏర్పాట్లు చేయించారు.ఎగువ రాష్ట్రల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా, గోదావరి నదులకి వరద ఉధృతంగా వచ్చి చేరుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. వరద ప్రవాహ హెచ్చుతగ్గులను పర్యవేక్షిస్తూ కృష్ణా, గోదావరి పరివాహక జిల్లాల్లోని క్షేత్రస్థాయి అధికారులను అప్రమత్తం చేస్తున్నట్లు తెలిపారు. ప్రభావిత జిల్లాల్లో అత్యవసర సహాయక చర్యల కోసం 5 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పంపించినట్లు వెల్లడించారు.ప్రజలు వరద సమాచారం, సహాయం కోసం విపత్తుల నిర్వహణ సంస్థలోని కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112,1070,18004250101 సంప్రదించాలన్నారు. వినాయక నిమజ్జన సమయంలో నదీ, కాలువల వద్ద హెచ్చరిక బోర్డులను తప్పనిసరిగా పాటించాలన్నారు. వరద నీటిలో ఈతకు వెళ్ళడం, స్నానాలకు వెళ్ళడం లాంటివి చేయరాదని సూచించారు. రేపు మన్యం, అల్లూరి, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు.గురువారం సాయంత్రం 6 గంటల నాటికి ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణానది వరద ప్రవాహం ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 4.43 లక్షల క్యూసెక్కులు ఉందని, మొదటి హెచ్చరిక కొనసాగుతుందని తెలిపారు. శ్రీశైలం డ్యాం వద్ద ఇన్ ఫ్లో 2.38, ఔట్ ఫ్లో 3.21 లక్షల క్యూసెక్కులు, నాగార్జునసాగర్ వద్ద ఇన్ ఫ్లో 3.18, ఔట్ ఫ్లో 2.46 లక్షల క్యూసెక్కులు, పులిచింతల వద్ద ఇన్ ఫ్లో 2.70, ఔట్ ఫ్లో 2.74 లక్షల క్యూసెక్కులు ప్రవాహం ఉందన్నారు.మరోవైపు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 38.6 అడుగులు అందని పేర్కొన్నారు. ధవళేశ్వరం వద్ద సాయంత్రం 6 గంటలకు ఇన్ ఫ్లో 5.31, ఔట్ ఫ్లో 5.30 లక్షల క్యూసెక్కులు ఉందని, శనివారం ఉదయానికి మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి,ఆదివారంలోపు దాదాపు రెండవ ప్రమాద హెచ్చరిక స్థాయి వరకు వరద ప్రవాహం చేరే అవకాశం ఉందన్నారు. నదుల ప్రవాహంతో వివిధ ప్రాజెక్టులలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నందున ఆయా నదీపరీవాహక ప్రాంత, లోతట్టు గ్రామ ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని చెప్పారు -
కామారెడ్డి జిల్లా: రేపు, ఎల్లుండి విద్యాసంస్థలకు సెలవు
సాక్షి, కామారెడ్డి: జిల్లాలో మరో రెండు రోజులు విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. భారీ వర్షాల నేపథ్యంలో రేపు, ఎల్లుండి(శుక్ర,శని) కలెక్టర్ సెలవు ప్రకటించారు. నిర్మల్ ఇంకా రెడ్ అలర్ట్లోనే ఉందని కలెక్టర్ అభినవ్ తెలిపారు. అత్యవసరం అయితే, తప్ప బయటకు రావొద్దన్నారు. పశువుల కాపరులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని.. నిర్మల్కు వరద ముప్పు పొంచి ఉందని తెలిపారు.తెలంగాణ డీజీపీ జితేందర్ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉన్నామని తెలిపారు. ఇప్పటివరకు వేల మందిని రెస్క్యూ చేశామని.. ఎయిర్ ఫోర్స్, ఆర్మీ సహాయంతో రెండు హెలికాప్టర్ల ద్వారా రెస్క్యూ చేసినట్లు వెల్లడించారు. 2 వేల మంది సిబ్బందితో ఎస్డీఆర్ఎఫ్ను ఏర్పాటు చేసి రెస్క్యూ ఆపరేషన్లో పెట్టామని తెలిపారు.‘‘ఎన్డీఆర్ఎఫ్కు దీటుగా ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పని చేస్తున్నాయని.. భారీ వర్షాలు కురుస్తున్నా.. ఎక్కడ కూడా ప్రాణాలు పోకుండా రెస్క్యూ చేస్తున్నామన్నారు. ఎస్డీఆర్ఎఫ్ గత ఏడాది నుంచి మంచి ఫలితాలను ఇస్తున్నాయి. అన్ని జిల్లాల ఎస్పీలకు ఆదేశాలిస్తూ నిరంతరం రివ్యూ చేస్తున్నాం. వర్షాకాలం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అవసరమైతేనే బయటకు రండి. ప్రజలు ప్రయాణాలు తగ్గించుకోవడం మంచిది’’ అని డీజీపీ చెప్పారు. -
ఏపీలో కుండపోత.. హెచ్చరికలు జారీ చేసిన విపత్తుల నిర్వహణ సంస్థ
విజయవాడ, సాక్షి: అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ పలు జిల్లాల్లో భారీ వర్షాలు, మిగతా చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు పొంగిపొర్లి ఒడిశాతో ఏపీకి రాకపోకలు బంద్ అయ్యాయి. కోస్తా తీరం అతలాకుతలం అవుతోంది. మరో నాలుగు రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ అంటోంది.ఈ తరుణంలో ఏపీకి విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక జారీ చేసింది. కృష్ణా,గోదావరి,తుంగభద్ర నదిపరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. పొంగిపొర్లే వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ పేరిట ఒక ప్రకటన వెలువడింది. భారీ వర్షాలతో ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కృష్ణా నదికి మళ్లీ వరద ప్రవాహం పోటెత్తుతోంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం బ్యారేజ్ వద్ద ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 4.05 లక్షల క్యూసెక్కులుగా ఉంది. -
17 ఏళ్ల తర్వాత ఇలా.. లేహ్లో చిక్కుకుపోయిన హీరో మాధవన్!
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో జనం అల్లాడిపోతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల జనజీవనం స్థంభించిపోయింది. కొన్ని చోట్ల రోడ్డు కొట్టుకుపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ వర్షాల వల్ల తాను జమ్మూ కశ్మీర్లో చిక్కుకుపోయానంటున్నాడు తమిళ హీరో ఆర్.మాధవన్ (R Madhavan). ప్రస్తుతం ఇతడు లెహ్లో ఉన్నాడు. 17 ఏళ్ల తర్వాత మరోసారి..తన హోటల్ రూమ్ బయట పరిస్థితి ఎలా ఉందో తెలియజేస్తూ ఓ వీడియో షేర్ చేశాడు. ఆగస్టు నెలాఖరుకే లద్దాఖ్లో మంచు కురుస్తోంది. గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. దీంతో నేను ఇక్కడే చిక్కుకుపోయాను. అదేంటోకానీ లద్దాఖ్కు షూటింగ్కు వచ్చిన ప్రతిసారి ఇదే జరుగుతుంది. 2008 ఆగస్టులో 3 ఇడియట్స్ షూటింగ్ కోసం ఇక్కడికి వచ్చాను. అప్పుడు కూడా ఇలాగే..పాన్గాంగ్ సరస్సు వద్ద ఆ మూవీ షూటింగ్ జరిగింది. అప్పుడు కూడా సడన్గా మంచు కురవడంతో ఇక్కడే ఆగిపోవాల్సి వచ్చింది. మళ్లీ ఇప్పుడదే పరిస్థితి ఎదురైంది. అయినప్పటికీ ఈ ప్రదేశమంతా ఎంతో అందంగా ఉంది. దాన్ని నేను ఆస్వాదిస్తున్నాను. కనీసం ఈరోజైనా వాతావరణం కాస్త కుదుటపడితే నేను ఇంటికెళ్లిపోతాను అని చెప్పుకొచ్చాడు. ఈ పోస్ట్కు 17 ఏళ్ల తర్వాత వర్షం అన్న క్యాప్షన్ను జత చేశాడు. ఆర్ మాధవన్.. చివరగా ఆప్ జైసా కోయ్ సినిమాలో నటించాడు. ప్రస్తుతం ధురంధర్ అనే మూవీ చేస్తున్నాడు. ఆదిత్య ధర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ డిసెంబర్ 5న విడుదల కానుంది.చదవండి: సింగర్తో దుబాయ్ యువరాణి రెండో పెళ్లి -
భారీ వర్షాలు.. ఆ జిల్లాల్లో రేపు విద్యాసంస్థలకు సెలవు
సాక్షి, కామారెడ్డి: భారీ వర్షాలు నేపథ్యంలో కామారెడ్డి, మెదక్ జిల్లాలో రేపు(గురువారం) విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. జిల్లాల్లోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలు కళాశాలల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని ఆ జిల్లాల కలెక్టర్లు ఒక ప్రకటనలో తెలిపారు. కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నారు.ఎడతెరిపి లేకుండా వానలు కురవడంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కామారెడ్డిలో రికార్డు స్థాయిలో 41 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో కొన్ని ప్రాంతాల్లో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పలుచోట్ల ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కామారెడ్డి-నిజామాబాద్ మధ్య రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది.నిజాంసాగర్ మండలం గోర్గల్ గ్రామంలోకి మంజీర వరద నీళ్లు చేరుతున్నాయి. గ్రామ శివారులో వందల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. వర్షాలు, వరదలు తగ్గించాలంటూ వేడుకొంటూ గంగమ్మ తల్లికి గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శాంతించాలని కోరుతూ మంజీర నదిలో తెప్ప పడవను గ్రామస్తులు వదిలారు. -
పట్టాలపై నీళ్లు: పలు రైళ్ల రద్దు.. మరికొన్ని దారి మళ్లింపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. భారీ వర్షాలు పలు జిల్లాలను అతలాకుతలం చేస్తున్నాయి. దీంతో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేయగా, మరి కొన్నింటిని దారిమళ్లించింది. కాచిగూడ-నిజామాబాద్, నిజామాబాద్-కాచిగూడ, కరీంనగర్-కాచిగూడ, కాచిగూడ-మెదక్, మెదక్-కాచిగూడ, బోధన్-కాచిగూడ, ఆదిలాబాద్-తిరుపతి సర్వీసును రద్దు చేసినట్టు రైల్లే అధికారులు ప్రకటించారు.మహబూబ్నగర్-కాచిగూడ, షాద్నగర్-కాచిగూడ సర్వీసును పాక్షింగా రద్దు చేసినట్టు అధికారులు వెల్లడించారు. కామారెడ్డి-బికనూర్-తలమడ్ల, అక్కన్నపేట్ -మెదక్ రైల్వే ట్రాక్ పైనుంచి ఉధృతంగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మెదక్, కామారెడ్డి జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. Bulletin 4 - SCR PR No. 357 Dt. 27.08.2025 on "Cancellations/Partial Cancellation/Diversion/Rescheduling of Trains Due to Heavy Rains@drmhyb @drmsecunderabad @drmned @drmvijayawada @drmgtl @drmgnt pic.twitter.com/8mqMmUO6UQ— South Central Railway (@SCRailwayIndia) August 27, 2025 -
Bandi Sanjay: బాధితులెవరూ భయపడొద్దని పూర్తిగా అండగా ఉంటామని భరోసా
-
చైనా-భారత్-పాక్.. కనివినీ ఎరుగని రీతిలో విధ్వంసం!
దక్షిణాసియా దేశాలైన భారత్, పాకిస్తాన్, చైనాలను ఈ మధ్యకాలంలో తీవ్రమైన ప్రకృతి విపత్తులు కుదిపేస్తున్నాయి. మునుపెన్నడూలేని విధంగా క్లౌడ్ బరస్ట్, మెరుపు వరదలు మూడు దేశాల్లోనూ తీవ్ర నష్టం కలిగించాయి. ఈ సీజన్లో వర్షాలు మామూలే అయినా.. ఈ ఏడాది మాత్రం అసాధారణంగా నమోదు అవుతోంది. అందుకు కారణాలను పరిశీలిస్తే.. భారీ వర్షాలు భారత్, పాకిస్తాన్, చైనా దేశాలను పెను విపత్తులుగా ముంచెత్తాయి. క్లౌడ్ బరస్ట్, మెరుపు/ఆకస్మిక వరద(Flash Floods) ఎక్కువగా వినాల్సి వస్తోంది. ఇవే ఈ మూడు దేశాల్లో విపరీతమైన ఆస్తి, ప్రాణ నష్టాల్ని కలిగించాయి. జమ్ము కశ్మీర్ ఈ ప్రభావంతో ఈ మధ్యకాలంలో ఎంతో మంది మరణించడం చూస్తున్నదే. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో రహదారులు దారుణంగా దెబ్బ తిన్నాయి. దక్షిణ రాష్ట్రాల్లోనూ ఇప్పుడు ఇదే పరిస్థితి.ఇక.. పాకిస్తాన్లో ఖైబర్ పఖ్తూన్ఖ్వా, గిల్గిట్-బాల్టిస్తాన్, పంజాబ్ ప్రాంతాలు వర్షాలు, వరదలతో తీవ్రంగా ప్రభావితమయ్యాయి. రెండు నెలల కాలంలో వర్షాలు, వరదలతో పాక్లో 700 మంది మరణించినట్లు పలు గణాంకాలు చెబుతున్నాయి. వీళ్లలో చిన్నారులే అధికంగా ఉన్నారు. చైనాలో రెండు నెలల వర్షాల వల్ల ₹1.84 లక్షల కోట్ల మేర ఆర్థిక నష్టం వాటిల్లింది. ప్రాణ నష్టాన్ని చైనా అధికారికంగా ప్రకటించలేదు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల మాన్సూన్ ట్రఫ్ దక్షిణ దిశగా కదిలిపోతోంది. ఈ ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షపాతం.. దానికి వ్యతిరేకంగా ఇంకొన్ని చోట్ల తగ్గుదల కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో వర్షపాతం తగ్గుముఖం పట్టింది. మాన్సూన్ ట్రఫ్ అంటే..మాన్సూన్ ట్రఫ్ అనేది దక్షిణాసియా దేశాల్లో వర్షాకాలంలో వర్షాల పంపిణీకి దిశానిర్దేశం చేసే వాతావరణ రేఖ. ఇది సాధారణంగా పాకిస్తాన్ నుంచి బెంగాల్ ఖాతీ వరకు విస్తరించి ఉంటుంది. ఈ ట్రఫ్ చుట్టూ తక్కువ ఒత్తిడి ఏర్పడిన ప్రాంతాల(Low Pressure Formation) వల్ల వర్షాలు కురుస్తుంటాయి. చైనా, పాక్, భారత్లో ఈ సీజన్లో వర్షాలకు కారణం ఇదే. (తక్కువ ఒత్తడి ప్రాంతాల్లోకి చుట్టుపక్కల నుంచి గాలి ప్రవహిస్తుంది. ఆ గాలి ఆవిరితో నిండిన మేఘాలను తీసుకువస్తుంది. ఇది వర్షాలు కురవడానికి అనుకూల పరిస్థితిని కలిగిస్తుంది. అందుకే మాన్సూన్ కాలంలో తక్కువ ఒత్తడి ప్రాంతాలు భారీ వర్షాలకు కారణమవుతాయి). అయితే..వాతావరణ మార్పు, నగరీకరణ, అటవీ నాశనం వంటి మానవ చర్యలు ఈ ట్రఫ్ మార్గాన్ని అస్థిరంగా మార్చి వర్షాల తీవ్రతను పెంచుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల కొండ ప్రాంతాలు, నదుల నుంచి నీటి ఆవిరి ఎక్కువగా ఉంటోంది. ఈ ఆవిరి మేఘాల్లో చేరి, ఒక స్థాయికి చేరుకున్న తర్వాత తక్కువ సమయంలో భారీ వర్షంగా కురుస్తుంది. ఇది వర్షపాతం తీవ్రతను పెంచుతూ, ఆకస్మిక వరదలకు దారితీస్తోంది. పైపెచ్చు ఉదయం వేళల్లో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఆవిరి పెరిగి, తక్కువ సమయంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ✅ పరిష్కార మార్గాలు• ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు: ప్రజలకు సమయానికి సమాచారం అందించాలి. అయితే అది కష్టతరంగా మారుతోంది• వరద మైదానాల పునరుద్ధరణ: సహజ జల ప్రవాహ మార్గాలను తిరిగి స్థాపించాలి.• స్థిరమైన నగరీకరణ ప్రణాళికలు: పర్యావరణాన్ని దెబ్బతీయకుండా అభివృద్ధి.• అటవీ విస్తరణ: వర్షపు నీటిని శోషించే వనరుల పెంపు.• ప్రజల అవగాహన: వాతావరణ మార్పు, ప్రకృతి విపత్తులపై ప్రజలలో చైతన్యం కలిగించాలి.దక్షిణాసియాలో వర్ష విపత్తులు మామూలు ప్రకృతి ధోరణుల కంటే ఎక్కువగా మానవ చర్యల ప్రభావంతో ఏర్పడుతున్నాయి. వాతావరణ మార్పును అర్థం చేసుకుని, దీన్ని ఎదుర్కొనే విధానాలను అభివృద్ధి చేయడం అత్యవసరమనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. -
Vijayawada: బెజవాడ అల్లకల్లోలం
-
తెలంగాణలో నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్
తెలంగాణలో కుండపోత వర్షం.. అప్డేట్స్మెదక్ అంధకారం..పలు కాలనీల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయంపిల్లికొట్టాల్లో పసుపులేరు వాగు ఉధృతికి కొట్టుకుపోయిన సబ్ స్టేషన్కామారెడ్డిలో అంధకారంభారీ వర్షం నేపథ్యంలో విద్యుత్ సరాఫరాకు అంతరాయంజిల్లా కేంద్రంలోని గాంధీనగర్, అయ్యప్ప నగర్, బతుకమ్మ కుంట, రుక్మిణికుంట, పంచముఖి హనుమాన్ కాలనీ, గోపాలస్వామి రోడ్, షేర్ గల్లి తదితర ప్రాంతాల్లో అంధకారం.కరెంటు లేక ఇబ్బందులు పడుతున్న జిల్లా ప్రజలుజీఆర్ కాలనీలో సహాయ చర్యల కోసం వేచి చూస్తున్న కాలనీవాసులువరదలు ఉధృతంగా ఉన్న చెరువుల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులుకామారెడ్డి హౌసింగ్ బోర్డ్ కౌండిన్య కాలనీలో వరదలో చిక్కుకున్న బాధితులురక్షించేందుకు కామారెడ్డికి చేరిన బోట్లు.సుమారు 50 మంది పైగా చిక్కుకున్న కాలనీవాసులుజల దిగ్బంధంలో ఉన్న బాధితులను కాపాడేందుకు రంగంలోకి దిగిన రెస్క్యూ టీం మెదక్ జిల్లా: రేపు విద్యాసంస్థలకు సెలవుజిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలుప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించిన కలెక్టర్ తెలంగాణలో నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్వచ్చే మూడు గంటల్లో అతిభారీ వర్ష సూచననిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం మెదక్ రామాయంపేటలో రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్నీట మునిగిన మహిళా డిగ్రీ కళాశాలవిద్యార్థినులను రక్షించిన సహాయక బృందాలుసురక్షిత ప్రాంతానికి 300 మంది తరలింపు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట సమీపంలో ఎగువ మానేరులో చిక్కుకున్న కార్మికులు ఆరు గంటలుగా సాయం కోసం ఎదురు చూపులుస్వామి అనే కార్మికుడికి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్స్వామితోపాటు మిగిలిన నలుగురు బాధితులు పిట్ల మహేశ్, పిట్ల స్వామి, ధ్యానబోయిన స్వామి పరిస్థితిపైనా ఆరాబాధితులెవరూ భయపడొద్దని పూర్తిగా అండగా ఉంటామని భరోసా ఇచ్చిన బండి సంజయ్జిల్లా కలెక్టర్ సైతం అక్కడే ఉంటూ సహాయ చర్యల్లో పాల్గొంటున్నారని చెప్పిన కేంద్ర మంత్రిఅధికారులతో మాట్లాడి భోజనం అందేలా చర్యలు తీసుకుంటామని వెల్లడి వర్షాలపై రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షరాష్ట్రంలో నిన్నటి నుండి కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి.కామారెడ్డి ,మెదక్ జిల్లాలో భారీ వర్షాలకు అలుగులు పొంగి పొర్లుతుండడం ,రోడ్లపై భారీ వరద నీరు వచ్చి చేరుతుండడం ఆర్టీసీ బస్సు డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలి .హైదరాబాద్ లో వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద జీహెచ్ఎంసీ సిబ్బంది ఎప్పటికప్పుడు నీరు నిలువ లేకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలి,భారీ వర్షాలకు వరదల వల్ల ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలిలోతట్టు ప్రాంతాల్లో ఏదైనా సమస్య ఉంటే వెంటనే వారిని అక్కడనుండి తరలించేలా చర్యలు తీసుకోవాలి .వర్షాల వల్ల గణేష్ మండపాల వద్ద ,ఇతర విద్యుత్ స్తంభాల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలి,ప్రమాదాలు చోటు చేసుకోకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలి ఉమ్మడి నల్లగొండలో వాన బీభత్సంయాదాద్రి భీమలింగం కత్వా వద్ద వరద ఉధృతిచౌటుప్పల్ నాగిరెడ్డిపల్లి మధ్య రాకపోకల బంద్ ఇంకా వరదలోనే మెదక్ హవేలిఘన్పూర్ మండలంలోని దూప్సింగ్ తండాసాయం కోసం బిల్డింగ్ల మీదకు ఎక్కిన జనంరక్షించేందుకు అధికారుల ప్రయత్నాలు కామారెడ్డి కలెక్టర్తో మంత్రి సీతక్క టెలికాన్ఫరెన్స్కామారెడ్డి జిల్లా అంతటా భారీ వర్షాలు .. జలదిగ్బంధంలో పలుగ్రామాలుకలెక్టర్, ఇతర ఉన్నతాధికారులతో ఇన్చార్జి మంత్రి సీతక్క టెలికాన్ఫరెన్స్ తక్షణ సహాయక చర్యలు కొనసాగుతాయని హామీఅధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి :మంత్రి సీతక్క,ప్రతి గ్రామం, పట్టణంలోని పరిస్థితులను నిశితంగా పరిశీలించాలి :మంత్రి సీతక్కలోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టాలి :మంత్రి సీతక్కచెరువులు, వాగులు పొంగిపొర్లుతున్న ప్రాంతాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ రాకపోకలను అనుమతించొద్దు :మంత్రి సీతక్కప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి :మంత్రి సీతక్కరక్షణ చర్యల్లో ఎక్కడా నిర్లక్ష్యం చోటుచేసుకోరాదు.. ప్రతి ఒక్క అధికారి తమ బాధ్యతను పూర్తిస్థాయిలో నిర్వర్తించాలి:మంత్రి సీతక్కవర్షాల కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుంది:మంత్రి సీతక్క బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనంగా బలపడిన వాయుగుండంరేపూ తెలంగాణ వ్యాప్తంగా కుండపోత వానలుకుండపోత వానతో రాష్ట్రమంతటా ఆగమాగంజనజీవనం అస్తవ్యస్తం భారీ వర్షాల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నేడు పలు రైళ్ల దారి మళ్లింపుకామారెడ్డి మీదుగా వెళ్ళే రైళ్లు నిజామాబాద్ మీదుగా మళ్లింపునిజామాబాద్ - తిరుపతి రాయలసీమ ఎక్స్ప్రెస్ ఈ రోజు రద్దుమెదక్ - కాచిగూడ రైలు ఈ రోజు పాక్షికంగా రద్దు కామారెడ్డి, మెదక్లకు రెడ్ అలర్ట్ రెండు జిల్లాల్లో రికార్డు స్థాయిలో వర్షంరాజంపేట మండలం అర్గొండలో 31.9 సెం.మీ. అత్యధిక వర్షపాతంమెదక్ నాగపూర్లో 20.8 సెం.మీ. వర్షపాతంబిక్నూర్లో 19.1 సెం.మీటెక్మాల్ మండలంలో 18.03 సెంటీమీటర్ల వర్షపాతంపాత రాజంపేటలో 18, రామాయంపేటలో 16 సెం.మీలుచేగుంట 13.2 సెంమీ, మెదక్లో 11 సెం.మీ. కామారెడ్డి తలమట్ల దగ్గర రైల్వే ట్రాక్ నుంచి నీటి ప్రవాహం.. 12 రైళ్ల రాకపోకలకు అంతరాయం కామారెడ్డి, మెదక్ జిల్లా కలెక్టర్లను అప్రమత్తం చేసిన సీఎం రేవంత్రెడ్డివెంటనే సహాయక చర్యలు చేపట్టాలని.. అన్ని విభాగాల అధికారులు సిద్ధం చేయాలని ఆదేశంఎలాంటి విపత్కర పరిస్థితి ఎదుర్కొనేందుకైనా సిద్ధంగా ఉండండి :సీఎం రేవంత్రెడ్డిఅన్ని శాఖల అధికారులు.. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సాయం తీసుకోవాలని సీఎస్కు ఆదేశంఇరు జిల్లాల ఎమ్మెల్యేలతోనూ మాట్లాడిన సీఎంకలెక్టర్లతో సమన్వయం చేసుకోవాలని ఎమ్మెల్యేలకు సూచన భారీ వర్షాలతో కామారెడ్డి జిల్లాలో పలు గ్రామాలు నీట మునడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరాకామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిపేట ఘటనపై కలెక్టర్ కు ఫోన్ చేసిన కేంద్ర మంత్రిప్రమాద బాధితులను ఆదుకునేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిద్ధంగా ఉందని చెప్పిన బండి సంజయ్అనంతరం ఎన్డీఆర్ఎఫ్ అధికారులతో మాట్లాడిన బండి సంజయ్ఎల్లారెడ్డిలో తక్షణమే అవసరమైన సాయం అందించాలని ఎన్డీఆర్ఎఫ్ ను కోరిన కేంద్ర మంత్రిజిల్లా కలెక్టర్ తో సమన్వయం చేసుకుని సహాయ చర్యల్లో నిమగ్నమవ్వాలని సూచంచిన కేంద్ర మంత్రి కామారెడ్డిలో భారీ వర్షాలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న తిమ్మారెడ్డిలోని కల్యాణి వాగు వాగుపై బొగ్గు గుడిసె సమీపంలో వరదలో చిక్కుకున్న ఆరుగురు కార్మికులు డీసీఎంలో అమర్చిన వాటర్ ట్యాంకర్ పైకి ఎక్కి సాయం కోసం ఎదురుచూపులు ఈ వరద కారణంగా కామారెడ్డి- భిక్కనూర్ సమీపంలో రైలు పట్టాల కింద గండి.. రైళ్ల రాకపోకలు నిలిపివేతసిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో భారీ వర్షంఎగువ మానేరు నుంచి దిగువకు నీరు విడుదలనాగయ్య అనే పశువుల కాపరి గల్లంతు.. గాలిపు చేపట్టిన అధికారులుమానేరు వాగులో చిక్కుకున్న ఐదుగురు రైతులురక్షించేందుకు అధికారుల ప్రయత్నాలు -
ఏపీ, తెలంగాణకు వెదర్ అలర్ట్.. ఈ జిల్లాల్లో కుండపోత వానలు
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రేపు వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. దీంతో తెలంగాణ, ఏపీ వాతావరణ కేంద్రాలు హెచ్చరికలు జారీ చేశాయి.ఏపీలో ఉత్తర కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. మూడు రోజులపాటు భారీ వర్షాలు ఉంటాయని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాలకు కుండపోత తప్పదని తెలిపింది. మరోవైపు.. ఆవర్తన ప్రభావంతో దక్షిణ కొస్తా, రాయలసీమలో తేలికపాటి వర్షాలు ఉంటాయని తెలిపింది.ఇక.. తెలంగాణకు రెండు రోజులపాటు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఇవాళ, రేపు.. పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. హైదరాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి వరంగల్ జిల్లాలకు కుండపోత తప్పదని హెచ్చరించింది. వాయవ్య బంగాళాఖాతంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలపై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం బలపడనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో బుధవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఉపరితల ఆవర్తనంతో ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల్లో ఇప్పటికే పలుచోట్ల భారీ వర్షాలు పడుతుండగా మరో మూడు రోజులు అవి కొనసాగుతాయని పేర్కొంది. గత రాత్రి నుంచే ఉమ్మడి విశాఖను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. సోమవారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. శ్రీకాకుళం జిల్లా నందిగం మండలం మదనపురంలో 3.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అదే మండలంలోని నందిగంలో 2.7 సెంటీమీటర్ల వర్షం పడింది. పార్వతీపురం జిల్లా గుమ్మలక్ష్మీపురం, శ్రీకాకుళం జిల్లా పాలకొండలో రెండు సెంటీమీటర్ల వర్షం కురిసింది.40-50 కిమీ వేగంతో ఉండనున్న ఈదురు గాలులు వీస్తాయని విపత్తుల శాఖ పేర్కొంది. సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున ఈ నెల 27 వరకూ ఉత్తరాంధ్ర జిల్లాల్లోని మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వాతావరణ అధికారులు హెచ్చరించారు.తెలుగు రాష్ట్రాలల్లో ఇప్పటిదాకా కురిసిన వానలకు, ఎగువన కురుస్తున్న వర్షాలకు పలు ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది. మహబూబ్నగర్ జురాల, నంద్యాల శ్రీశైలం జలాయశంకు వరద పోటెత్తుతోంది. -
జలాశయాలకు జలకళ.. చెరువులు వెలవెల..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో జలాశయాలు జలకళ సంతరించుకోగా, చెరువులు మాత్రం వెలవెలబోతున్నాయి. రాష్ట్రంలో మొత్తం 34,701 చెరువులుండగా, 12,701 చెరువులు మాత్రమే పూర్తి స్థాయి లో నిండి అలుగుపోస్తున్నాయి. మరో 10,240 చెరువులు 75–100% వరకు నిండి జలకళను సంతరించుకున్నాయి. మిగిలిన చెరువుల్లో 5,682 చెరువులు 50–75%, 3,302 చెరువులు 25–50% నిండగా, 2,816 చెరువులు 0–25 శాతమే నిండాయి. చెరువుల్లో నిల్వలపై నీటిపారుదల శాఖ తాజాగా రూపొందించిన ఓ నివేదికలో ఈమేరకు వెల్లడించింది. జలవనరుల సమర్థ నిర్వహణ, పర్యవేక్షణ కోసం నీటిపారుదల శాఖ నిర్వహిస్తున్న ఇరిగేషన్ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ (ఐడీఎస్సీ) డ్యాష్ బోర్డుకి ఇప్పటివరకు రాష్ట్రంలోని 21,500 చెరువులను మ్యాపింగ్ చేశారు. వాటి మొత్తం నిల్వ సామర్థ్యం 253.8 టీఎంసీలు కాగా, 119.23 టీఎంసీల నిల్వలు (47శాతం) కలిగి ఉన్నాయి. ఈ చెరువులు మొత్తం 3098.85 చదరపు కి.మీ. ప్రాంతంలో విస్తరించి ఉండగా, 1321.44 చ.కి.మీ. ప్రాంతాని(42.6శాతం)కే నీటి నిల్వలు పరిమితమయ్యాయి. నల్లగొండ, నిజామాబాద్ జిల్లాల్లో కరువే.. గత ప్రభుత్వం నీటిపారుదల శాఖను 19 ప్రాదేశిక ఈఎన్సీలు/చీఫ్ ఇంజనీర్లుగా విభజించింది. శాఖ నివేదిక ప్రకారం రాష్ట్రంలో గజ్వేల్ ఈఎన్సీ పరిధిలో అత్యధిక చెరువులు పూర్తిగా నిండి మత్తడి దూకుతున్నాయి. గజ్వేల్, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, మహబూబ్నగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో వానాకాలం ముగిసేలోగా కురవనున్న వర్షాలతో చెరువులు పూర్తిగా నిండే అవకాశం ఉంది. అయితే, చెరువుల్లో నీటి నిల్వలపరంగా అత్యంత కరువు పరిస్థితులు నల్లగొండ, నిజామాబాద్ జిల్లాల్లో ఉన్నాయి. నల్లగొండ సీఈ పరిధిలో 1628 చెరువులుండగా, కేవలం 183 చెరువులే పూర్తిగా నిండాయి. పొరుగునే ఉన్న సూర్యాపేట, కొత్తగూడెం జిల్లాల్లో పరిస్థితి మెరుగ్గానే ఉంది. నిజామాబాద్ సీఈ పరిధిలో 997 చెరువులుండగా, 55 చెరువులే పూర్తిగా నిండాయి. జలాశయాల్లో 75% నిల్వలు రాష్ట్రంలో కృష్ణా, గోదావరి పరీవాహకంలో మొత్తం 1069.34 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో 87 జలాశయాలుండగా, సోమవారం నాటికి 802.92 టీఎంసీల (75శాతం) నిల్వలున్నాయి. ఎగువ నుంచి రెండు నదులకూ వరదలు కొనసాగుతుండటంతోపాటు ప్రస్తుత వానాకాలం ముగిసేలోగా మరికొన్ని దఫాలు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో జలాశయాలు 100శాతం నిండే అవకాశం ఉంది. పరీవాహక ప్రాంతాల వారీగా చూస్తే గోదావరి పరిధిలో 419.81 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో 57 జలాశయాలుండగా, ప్రస్తుతం 223.67 టీఎంసీలకు నిల్వలు చేరాయి. కృష్ణా పరిధిలో 649.53 టీఎంసీల సామర్థ్యంతో 30 జలాశయాలుండగా, నిల్వలు 579.25 టీఎంసీలకు చేరాయి. జలాశయాలు, చెరువులు కలిపి మొత్తం 1323.14 టీఎంసీల నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉండగా, ప్రస్తుతం 922.15 టీఎంసీలకు నిల్వలు చేరాయి. -
బలపడుతున్న ఉపరితల ఆవర్తనం
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: వాయవ్య బంగాళాఖాతంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలపై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం బలపడనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో బుధవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఉపరితల ఆవర్తనంతో ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల్లో ఇప్పటికే పలుచోట్ల భారీ వర్షాలు పడుతుండగా మరో మూడు రోజులు అవి కొనసాగుతాయని పేర్కొంది.దీంతోపాటు కోస్తాంధ్ర, రాయలసీమల్లోనూ అక్కడక్కడ వానలు పడే అవకాశం ఉందని వివరించింది. సోమవారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. శ్రీకాకుళం జిల్లా నందిగం మండలం మదనపురంలో 3.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అదే మండలంలోని నందిగంలో 2.7 సెంటీమీటర్ల వర్షం పడింది. పార్వతీపురం జిల్లా గుమ్మలక్ష్మీపురం, శ్రీకాకుళం జిల్లా పాలకొండలో రెండు సెంటీమీటర్ల వర్షం కురిసింది.వచ్చే మూడు రోజులు ఉత్తరాంధ్రలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎనీ్టఆర్, గుంటూరు జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడతాయని పేర్కొంది. బుధవారం విశాఖపట్నం జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎనీ్టఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున ఈ నెల 27 వరకూ ఉత్తరాంధ్ర జిల్లాల్లోని మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వాతావరణ అధికారులు హెచ్చరించారు. -
వరద విలయం.. వామ్మో.. ఆ గ్రామంలో రెండు కిలోమీటర్ల గొయ్యి
జైపూర్: ప్రకృతి చూడడానికి ఎంత ప్రశాంతంగా ఉంటుందో.. ప్రకోపిస్తే వినాశనం కూడా అంత భయకరంగా ఉంటుంది. రాజస్థాన్లో భారీవర్షాలు దంచికొడుతున్నాయి. సవాయ్ మాధోపూర్ జిల్లాలోని జడవాటా గ్రామం వద్ద సుర్వాల్ డ్యామ్ పొంగిపోవడంతో 2 కిలోమీటర్ల పొడవైన పెద్ద గొయ్యి ఏర్పడింది. గ్రామం, పొలాల మీదుగా నీరు పొంగి ప్రవహిస్తోంది. ఈ గుంత 2 కిలోమీటర్లు పొడవు, 100 అడుగుల వెడల్పు, 55 అడుగుల లోతు ఉంది.వర్షాలు కొనసాగితే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ భారీ గొయ్యి కారణంగా వందల ఎకరాల వ్యవసాయ భూమి నీటి మునిగింది. వరద ఉధృతికి రెండు ఇళ్లు, రెండు షాపులు, రెండు దేవాలయాలు కూలిపోయాయి. పొలాల మీదుగా వచ్చిన నీరు గుంతలోకి ప్రవహించి జలపాతంలా మారింది.ఆ గ్రామానికి చేరుకున్న ఆర్మీ బృందాలు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. సమీపంలోని ఇళ్లను ఖాళీ చేయించారు. అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కరోడి లాల్ మీనా గుంతపై ఆరా తీశారు. వెంటనే ప్రభావిత ప్రాంతాన్ని పరిశీలించారు. నీటి ప్రవాహాన్ని మళ్లించేందుకు యంత్రాల సహాయంతో చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆయన ఆదేశించారు.सवाई माधोपुर, राजस्थान के जाडावता गांव में भारी बारिश से स्थिति बेहद गंभीर हो गई है। यहाँ मानो 'नियाग्रा फॉल्स' फूट पड़ा है, जहाँ कभी अमरूद के बाग और हरे-भरे खेत हुआ करते थे, वहाँ अब पानी के तेज बहाव ने उन्हें एक गहरी नदी में बदल दिया है। पानी के लगातार कटाव से जमीन चौड़ी ..1/2 pic.twitter.com/poyX33CkPq— Lokesh kumar (@lkmeena8619) August 24, 2025రాజస్థాన్.. భారీ వర్షాల కారణంగా అతలాకుతలమవుతోంది.. వందలాది గ్రామాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. గ్రామాలకు మధ్య సంబంధాలు తెగిపోయాయి. రాకపోకలు స్తంభించాయి. కోటా, బుండీ, సవాయ్ మాధోపూర్, ఝాలావార్ జిల్లాల్లో భారీ వర్షాల ప్రభావం అధికంగా ఉంది కనిపిస్తోంది. కోటా జిల్లాలోని నిమోడా గ్రామంలో 400కి పైగా ఇల్లు కూలిపోయాయి. వందలాది మంది ప్రజలు సహాయ శిబిరాల్లో తలదాచుకుంటుకున్నారు. -
ముంబై చేస్తున్న హెచ్చరిక!
ప్రణాళికాబద్ధంగా లేని పట్టణీకరణను పరిహసిస్తూ తరచు ప్రకృతి వైపరీత్యాలు విరుచుకు పడుతున్నా పాలకులు మేల్కొనటం లేదనటానికి మళ్లీ నీట మునిగిన ముంబై మహానగరమే సాక్ష్యం. ముంబై దక్షిణ ప్రాంతంలో గురువారం ఉదయానికి 24 గంటల వ్యవధిలో ఏకధాటిగా 300 మి.మీ., పశ్చిమ శివారు ప్రాంతంలో 200 మి.మీ. వర్షం కురిసిందంటే కుంభవృష్టి ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. నిన్నంతా దాదాపు ప్రశాంతంగానే ఉన్నట్టు కనబడిన ఆ మహానగరం, మళ్లీ భారీ వర్షాలుంటాయన్న హెచ్చ రికలతో బెంబేలెత్తుతోంది. ఏటా వర్షాకాలంలో కనీసం ఒక్కసారైనా వరదలు ముంబైని పలకరించటం ఆనవాయితీ. ఈసారి మే నెలలోనే ఒక రోజు నడుంలోతు వరదల్లో నగరం నానా యాతనలూ పడింది. ఆ నెలలో కొత్తగా ప్రారంభమైన వొర్లి మెట్రో స్టేషన్ భారీ వరదతో వణికిపోయింది. రెండు నెలలు గడిచాయో లేదో మళ్లీ నగరానికి కుంభవృష్టి తప్పలేదు. నిరుడు 21 దఫాలు 100 మి.మీ. వర్షం పడిందని గణాంకాలు చెబుతు న్నాయి. వాతావరణంలో పెనుమార్పులు విపత్తుల తీవ్రతను పెంచాయి. అస్తవ్యస్థ పట్టణీకరణ ఈ సమస్యను వందల రెట్లు పెంచింది. ఈసారి వర్షాలవల్ల సంపన్నులు, సినీతారలు నివసించే ప్రాంతాలు సైతం వరద నీటన మునిగాయి. ఇటీవలే ఆర్భాటంగా ప్రారంభించిన మోనోరైల్ సైతం భారీ వర్షాలతో విద్యుత్ సరఫరా అందక గంటసేపు నిలిచిపోయింది. చివరకు అద్దాలు బద్దలుకొట్టి వందమంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకురావాల్సి వచ్చింది. ముంబై తూర్పు శివారులోని మీథి నది ఆ మహానగరంపై విరుచుకుపడింది. అయిదు రోజులపాటు వరసగా కురిసిన వర్షాలతో ఆ నది కట్టు తెంచుకుని అటువైపుగల రైల్వే ట్రాక్లన్నిటినీ ముంచెత్తింది. అరేబియా సముద్రం భారీ కెరటాలతో అల్లకల్లోలంగా ఉండటంతో దానిలో కలవాల్సిన మీథి వరద నీరు కాస్తా వెనక్కొచ్చి నగరంలోని అనేక ప్రాంతాలను జలమయం చేసింది. హైదరాబాద్ నగరంలో మూసీ మాదిరిగా ముంబైలో మీథి నదిని కూడా మురికిమయం చేశారు. అందులో 70 శాతం మురికినీరు కాగా, 30 శాతం చెత్తాచెదారం, 10 శాతం పారిశ్రామిక వ్యర్థాలు కలుస్తున్నాయి. ప్రకృతి వైపరీత్యా లుగా కనబడు తున్నవన్నీ సారాంశంలో మానవ తప్పిదాల పర్యవసానం. గత యేభైయ్యే ళ్లుగా నగరాన్ని విస్తరించుకుంటూ పోవటమే తప్ప అందుకు తగిన మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టినవారు లేరు. అలాగని మీథి నది ప్రక్షాళనకు ప్రయత్నాలు జరగ లేదని కాదు. 2013–23 మధ్య బృహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) రూ. 2,000 కోట్లు వ్యయం చేసింది. కానీ చివరకు తాజా వర్షాల ధాటికి మురికి నీటితో, ప్లాస్టిక్ వ్యర్థాలతో నివాస ప్రాంతాలన్నీ నిండిపోయాయి. 70వ దశకం వరకూ పరిశుభ్రంగా ఉండే ఆ నది మురికి కూపంగా మారిందంటే పాలకులు, అధికార యంత్రాంగం నిర్లక్ష్యమే కారణం.భౌగోళికంగా ముంబై తీరం పశ్చిమ కనుమలకు దగ్గరలో ఉంది. వాటివల్ల నైరుతి రుతుపవనాల్లో గాలుల తీవ్రత హెచ్చుగా ఉంటుంది. అందుకే ఏటా భారీవర్షాలు, వరదలు తప్పవు. దేశ ఆర్థిక రాజధానిగా, ఢిల్లీ తర్వాత అత్యధిక జనసాంద్రత గల నగరంగా ముంబై మన దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రాణప్రదమైనది. దేశ జీడీపీలో ఆ నగరం వాటా దాదాపు 7 శాతం. కానీ వరదలు ముంచుకొచ్చిన ప్రతిసారీ మౌలిక సదుపాయాలు దెబ్బతినటం, ఉత్పాదకత పడకేయటం రివాజైంది. పునర్నిర్మాణానికి ఏటా రూ. 550 కోట్ల వ్యయమవుతోంది. నిజానికి ఈ సంక్షోభం అక్కడే కాదు... దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల పాలకులనూ పునరాలోచనకు పురిగొల్పాలి. నగర నిర్మాణాల్లో ఎలాంటి మెలకువలు తీసుకోవాలో, పెద్ద నగరాల నిర్మాణంపై మోజువల్ల చివరకు జరిగేదేమిటో గ్రహించేలా చేయాలి. కానీ అదెక్కడా కనబడదు. ఆంధ్రప్రదేశ్లో రాజధాని అమరావతి తాజా వర్షాలకు ఎంత దయనీయ స్థితిలో పడిందో కనబడుతూనే ఉంది. పెద్ద నగరాల నిర్మాణంవల్ల జనసాంద్రత పెరిగి మౌలిక సదుపాయాల కల్పన అసాధ్యమవుతుందనీ, పైగా అభివృద్ధి మొత్తం ఒకే చోట కేంద్రీకరించటం వల్ల ఇతర ప్రాంతాలు ఎప్పటికీ ఎదుగూబొదుగూ లేకుండా ఉండిపోతాయనీ నిపుణులు హెచ్చరిస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు తలకెక్కటం లేదు. మన కోసం ప్రకృతి మారదు. మనమే దానికి అనుగుణంగా మారాలన్న స్పృహ పాలకులకు కలగాలి. మళ్లీ మళ్లీ మునుగుతున్న ముంబై మహానగరాన్ని చూసైనా గుణపాఠం నేర్వకపోతే భవిష్యత్తు క్షమించదు. -
వర్షాలతో రోడ్లకు రూ.1,000 కోట్ల నష్టం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా ఆర్ అండ్ బీ శాఖ రోడ్లకు సుమారు రూ.1,000 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఆ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అధికారులు నివేదించారు. రోడ్లతోపాటు పలుచోట్ల కల్వర్టులు, మైనర్ బ్రిడ్జ్లు, హైవే స్ట్రెచ్లు దెబ్బతిన్నట్లు చెప్పారు. రోడ్లకు జరిగిన నష్టంపై గురువారం సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. వర్షాల కారణంగా రహదారులకు జరిగిన నష్టంపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో రాష్ట్ర, జాతీయ రహదారుల ప్రస్తుత పరిస్థితిపై ఫీల్డ్ రిపోర్ట్ తయారు చేయాలని సూచించారు. పూర్తిగా శిథిలావస్థకు చేరిన కల్వర్టులు, మైనర్ బ్రిడ్జ్ల స్థానంలో కొత్తగా నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కోరారు. త్వరలోనే హ్యామ్ విధానం ద్వారా నాణ్యమైన రోడ్లు వేయబోతున్నట్లు వెల్లడించారు. వర్షాలు తగ్గుముఖం పట్టగానే ఆ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. కేంద్రం నుంచి క్లియరెన్స్ రావాల్సిన జాతీయ ప్రాజెక్టులపై మంత్రి ఆరా తీశారు. ఖానాపూర్ నుంచి బెల్లంపల్లి, ఉట్నూర్ నుంచి గుడిహత్నూర్ రోడ్డు మార్గంపై ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఇచ్చిన వినతి పత్రంపై మంత్రి సానుకూలంగా స్పందించారు. సమావేశంలో ప్రభుత్వ స్పెషల్ సీఎస్ వికాస్రాజ్, ఈఎన్సీ జయ భారతి, సి.ఈ రాజేశ్వర్రెడ్డి, ఎస్ఈ ధర్మారెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు. కాంగ్రెస్ను డర్టీ పార్టీ అనడం కేటీఆర్ అహంకారానికి నిదర్శనం దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీని డర్టీ పార్టీ అని దూషించటం బీఆర్ఎస్ నేత కేటీఆర్ అహంకారానికి నిదర్శనమని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ ఇచ్చిన పార్టీ నీకు థర్డ్ గ్రేడ్ పార్టీలా కనిపిస్తుందా? అని గురువారం ఒక ప్రకటనలో ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ నిలబెట్టిన ఉప రాష్ట్రపతి అభ్యర్థిని చూసి దేశం మొత్తం హర్షిస్తోందని తెలిపారు. తెలంగాణ బిడ్డను వ్యతిరేకిస్తే బీఆర్ఎస్ను తెలంగాణ ప్రజలు క్షమించబోరని హెచ్చరించారు. -
కృష్ణమ్మ ఉగ్రరూపం : ప్రకాశం బ్యారేజ్ వద్ద పర్యాటకుల సందడి (ఫొటోలు)
-
నిజాం సాగర్ 13 గేట్లు ఎత్తి 50 వేల క్యూసెక్కుల నీటి విడుదల
-
వీడని భారీ వర్షం.. ప్రైవేట్ కార్యాలయాలకూ సెలవు
ముంబై: రుతుపవనాల ఉధృతి దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. ఈ పరిణామాలకు మహారాష్ట్ర అత్యంత ఘోరంగా దెబ్బతింది. ముంబైలో కేవలం ఎనిమిది గంటల్లో 177 మి.మీ వర్షపాతం నమోదైంది. VIDEO | Maharashtra: Amid incessant rain, several areas in Palghar have been waterlogged.(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/I3gToQTOXL— Press Trust of India (@PTI_News) August 19, 2025ఫలితంగా రోడ్లు జలమయం అయ్యాయి. ట్రాఫిక్ మందగించింది. చాలా మంది ప్రజలు ఇంటికే పరిమితమయ్యారు.#WATCH | Mumbai, Maharashtra: Marine Drive witnesses high tides amid the heavy rainfall in the city. pic.twitter.com/83D21X2wgf— ANI (@ANI) August 19, 2025ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా విమాన, రైలు సేవలకు అంతరాయం కలిగింది. ముంబై, థానే, పాల్ఘర్ నవీ ముంబైలలో భారీ వర్షాల దృష్ట్యా, ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది.VIDEO | Maharashtra: Mumbai continues to witness rain. Visuals from the Gateway of India.(Full video available on PTI Videos- https://t.co/dv5TRAShcC) pic.twitter.com/Sn3CjvKU8E— Press Trust of India (@PTI_News) August 19, 2025నగరంతో పాటు శివారు ప్రాంతాలలోని అన్ని పాఠశాలలు, కళాశాలలను మూసివేశారు. ఈరోజు(మంగళవారం) ప్రైవేటు సంస్థలకు కూడా సెలవు ప్రకటించారు.#WATCH | Mumbai, Maharashtra: Due to the heavy rainfall, the Mithi River flows near the danger mark. pic.twitter.com/HaLkmp09eO— ANI (@ANI) August 19, 2025నగరంలో భారీ వర్షాల మధ్య మెరైన్ డ్రైవ్లో అలలు ఎగిసిపడుతున్నాయి. ముంబైలో వర్షం కొనసాగుతోంది. గేట్వే ఆఫ్ ఇండియా వద్ద నీరు నిలిచిపోయింది.#WATCH | Mumbai, Maharashtra: Waterlogging seen as heavy rain lashes Mumbai. Visuals from the Eastern Express Highway Area pic.twitter.com/VYMsT0BUgR— ANI (@ANI) August 19, 2025భారీ వర్షపాతం కారణంగా మిథి నది ప్రమాద పరిధికి దగ్గరగా ప్రవహిస్తున్నది. తూర్పు ఎక్స్ప్రెస్ హైవే ప్రాంతంలో జలదిగ్బంధం ఏర్పడింది.బాంద్రా ఖార్ లింక్ రోడ్ జలమయం అయ్యింది. చెంబూర్ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా తీవ్ర జలదిగ్బంధం ఏర్పడింది.#WATCH | Mumbai, Maharashtra: Waterlogging seen as heavy rain lashes Mumbai. Visuals from the Eastern Express Highway Area pic.twitter.com/VYMsT0BUgR— ANI (@ANI) August 19, 2025పన్వేల్లోని అటల్ సేతు హైవేను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వాసాయి-విరార్ ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోయింది. VIDEO | Maharashtra: Rainfall lashes parts of Mumbai. Night visuals from Mira Road. (Full video available on PTI Videos- https://t.co/dv5TRARJn4) pic.twitter.com/JQOyhQvghc— Press Trust of India (@PTI_News) August 18, 2025 -
కృష్ణమ్మ ఉగ్రరూపం.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
సాక్షి, విశాఖపట్నం/విజయవాడ: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఈ ఉదయానికి తీరం దాటింది. గోపాల్పూర్ వద్ద తీరం దాటినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలో.. ఏపీలో కొన్నిచోట్ల వర్షాలు పడుతున్నాయి. అదే సమయంలో.. గడిచిన 24 గంటల్లో కురిసిన వర్షాలతో కృష్ణా నదికి వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది.కృష్ణానదికి ప్రవాహం పెరగడంతో.. ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉధృతంగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుత ఇన్ ఫ్లో , అవుట్ ఫ్లో 4,01,087 క్యూసెక్కులుగా ఉంది. మొత్తం 70 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చే అవకాశం ఉండడంతో.. ప్రభావిత జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ‘‘కృష్ణానది పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వాగులు.. కాలువలు దాటే ప్రయత్నం చేయరాదు’’ అని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో ప్రజలను హెచ్చరించారు. వాయుగుండం ప్రభావంతో గడచిన 24 గంటల్లో.. పాడేరులో 16 సెంమీ వర్షపాతం నమోదైంది. రాష్ట్రమంతటా ఇవాళ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు, అలాగే కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ భారీ వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. తీరం వెంబడి ఈదురు గాలులు కొనసాగుతాయని పేర్కొంది.చేపల వేటకు వెళ్ళి.. భారీ వర్షంలో.. చేపల వేటకు వెళ్లిన ఓ యువకుడు సముద్రంలో గల్లంతయ్యాడు. పెద్ద అల ఒక్కసారిగా రావడంతో యువకుడు తమ కళ్ల ముందే కొట్టుకుపోయాడని, రక్షించే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని కొందరు మత్స్యకారులు తెలిపారు. సదరు యువకుడిని ఎంవీపీ కాలనీకి చెందిన సతీష్గా గుర్తించారు. విషయం తెలిసిన వెంటనే అతని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
హైదరాబాద్లో రాత్రంతా జోరు వాన
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలను వరుణుడు వదలడం లేదు. అల్పపీడన ప్రభావంతో నగరాన్ని భారీ వాన ముంచెత్తింది. గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు ప్రాంతాల్లో నాలాలు, డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. మరోవైపు మంగళవారం ఉదయం కూడా వాన జోరు కొనసాగుతోంది. దీంతో సహాయక చర్యలకు కాస్త ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇవాళ కూడా భారీ వర్షం కురవొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇంకో రెండు రోజులపాటు వర్షాలు ఉన్నాయన్న హెచ్చరికల నేపథ్యంలో నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం సూచిస్తోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాజెక్టులకు వరద నీరు పోటెత్తుతోంది. మరో రెండ్రోజులు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. -
వణుకుతున్న ఉత్తరాంధ్ర
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తరాంధ్ర జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రాష్ట్రంలోని 7 జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, ఏలూరు జిల్లాల్లో సోమవారం భారీ వర్షాలు కురిశాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకూ అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లిలో 7.3 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. పార్వతీపురం మన్యం జిల్లా గుళ్ల సీతారామపురంలో 6.6, శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో 6, అల్లూరి జిల్లా కొత్తూరులో 5.9 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. 24 గంటల్లో పాడేరులో 16.1 సెం.మీ. వర్షం అంతకుముందు ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకూ 24 గంటల వ్యవధిలో అల్లూరి జిల్లా పాడేరులో అత్యధికంగా 16.1 సెం.మీ. వర్షం కురిసింది. అనకాపల్లి జిల్లా చీడికాడ మండలంలో 15.5, మాడుగుల, కె.కోటపాడులో 15 సెం.మీ. చొప్పున వర్షం పడింది. విశాఖ జిల్లావ్యాప్తంగా సగటున 24 గంటల వ్యవధిలో 12.5 సెం.మీ., అనకాపల్లి జిల్లాలో సగటున 10.7 సెం.మీ. వర్షం కురిసింది. విజయనగరం జిల్లాలో 5.8, అల్లూరి జిల్లాలో 5.1, శ్రీకాకుళం జిల్లాలో 4.4, కాకినాడ జిల్లాలో 4 సెం.మీ. సగటు వర్షపాతం నమోదైంది. అల్లూరి జిల్లా అతలాకుతలం చింతూరు, కూనవరం, వీఆర్ పురం, ఎటపాక మండలాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. అల్లూరి జిల్లాలో వాగులు పొంగుతుండటంతో పలుచోట్ల రహదారుల పైకి వరదనీరు చేరుతోంది. కూనవరం మండలంలో కొండ్రాజుపేట కాజ్వే పైకి నీరు చేరడంతో 7 గ్రామాలకు, వీఆర్పురం మండలంలో అన్నవరం వాగు కాజ్వే కూలిపోవడంతో 42 గ్రామాలకు, చింతరేగుపల్లి వద్ద వరదనీరు రహదారిపై ప్రవహిస్తుండడంతో 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.చింతూరు మండలంలో కుయిగూరువాగు పొంగి వరద నీరు ఆంధ్రా–ఒడిశా జాతీయ రహదారి–326పై ప్రవహిస్తుండడంతో ఆంధ్రా నుంచి ఒడిశాకు రాకపోకలు స్తంభించాయి. సోకిలేరు, జల్లివారిగూడెం, చంద్రవంక, చీకటివాగులు సైతం పొంగడంతో చింతూరు మండలంలో 16 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పలుచోట్ల చిన్న వంతెనలు కొట్టుకుపోయాయి. విశాఖ ఫిషింగ్ హార్బర్ పరిసరాలు భారీ వర్షంతో జలమయమయ్యాయి. 1.83 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఎనీ్టఆర్, కృష్ణా, పశ్చిమ గోదావరితో పాటు 14 జిల్లాల్లోని 828 గ్రామాల్లో 1.83 లక్షల ఎకరాల్లో పంటలు ముంపునకు గురయ్యాయి. 1.50 లక్షల ఎకరాల్లో వరి, 20 వేల ఎకరాల్లో పత్తి, 5 వేల ఎకరాల్లో మొక్కజొన్న, సజ్జలు, కందులు, వేరుశనగ, పెసలు, మినుము పంటలు ముంపుబారిన పడ్డాయి. జిల్లాల వారీగా చూస్తే అత్యధికంగా గుంటూరు జిల్లాలో 72 వేల ఎకరాలు, బాపట్ల జిల్లా పరిధిలో 41 వేల ఎకరాలు, పశి్చమ గోదావరిలో 19 వేల ఎకరాలు, కృష్ణాలో 17 వేల ఎకరాలు, ఎనీ్టఆర్ జిల్లాలో 12 వేల ఎకరాలు ముంపునకు గురైనట్టు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. మిగిలిన జిల్లాల్లో 22 వేల ఎకరాల్లోని పంటలకు నష్టం వాటిల్లింది. కాగా, భారీ వర్షాలు కొనసాగితే విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలని సీఎస్ కె.విజయానంద్తో సమీక్షలో సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.నేడు తీరం దాటనున్న వాయుగుండం బంగాళాఖాతంలో విశాఖకు సమీపాన ఏర్పడిన అల్పపీడనం రాష్ట్రం నుంచి దూరంగా కదిలి వెళ్లింది. ప్రస్తుతం ఒడిశాకు సమీపంలో కేంద్రీకృతమై ఉంది. దక్షిణ ఒడిశా సమీపంలో తీవ్ర అల్పపీడనంగా మారి.. ఒడిశాలోని గోపాల్పూర్కు ఆగ్నేయంగా 38 కి.మీ. దూరంలో, కళింగపటా్ననికి ఈశాన్యంగా 110 కి.మీ. దూరంలో కొనసాగుతోంది. మంగళవారం వేకువజామున మధ్యాహ్నం గోపాల్పూర్ వద్ద తీరం దాటే అవకాశాలున్నాయి. కాగా.. కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా మీదుగా కొనసాగుతున్న రుతుపవన ద్రోణి ప్రభావంతో బుధవారం మధ్యాహ్నం వరకూ కోస్తా, రాయలసీమల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. గాలుల తీవ్రత గంటకు 50 నుంచి 60 కి.మీ. వేగంతో ఉంటుందని, తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. మత్స్యకారులు బుధవారం వరకు వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు. 24న మరో అల్పపీడనం! ప్రస్తుత తీవ్ర అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం ఈ నెల 24వ తేదీ నాటికి అల్పపీడనంగా మారే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. కోస్తాంధ్ర తీరాలకు సమీపంలో ఇది ఏర్పడే అవకాశాలు ఉన్నాయని ఆ సమయంలో మళ్లీ వర్షాలు పుంజుకుంటాయని భావిస్తున్నారు. -
కుండపోత వాన..
సాక్షి, నెట్వర్క్: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిశాయి. సంగారెడ్డి, సిద్దిపేట, ఆసిఫాబాద్, కామారెడ్డి, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, ములుగు, మంచిర్యాల, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల్లో కుండపోతగా వర్షాలు కురిశాయి. హైదరాబాద్ నగరంలో ఆదివారం రాత్రి 8 గంటలకు మొదలైన వాన సోమవారం తెల్లవారుజాము వరకు కొనసాగింది. జిల్లాల్లో అనేకచోట్ల 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు కాగా, అత్యధికంగా సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గౌరారంలో 23.6 సెం.మీ వర్షం కురిసింది. ఏకధాటిగా కురిసిన వర్షాలతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పలుచోట్ల జనావాసాల్లోకి సైతం వరద నీరు చేరింది. కొన్నిచోట్ల జాతీయ రహదారులపై వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. రాజీవ్ రహదారిపై వరద కుంభవృష్టితో సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గౌరారం వద్ద రాజీవ్ రహదారిపై వరదనీరు చేరడంతో కరీంనగర్–హైదరాబాద్ మార్గంలో వాహనాల రాకపోకలకు ఒకింత అంతరాయం ఏర్పడింది. పంటపొలాలు నీట మునిగి చెరువులను తలపిస్తున్నాయి. హల్దీవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. అంబర్పేట–శాకారం మార్గంలో రవాణా స్తంభించి పోయింది. గుండాల మండలంలో 16 సెం.మీ వర్షం యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలో 16 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. దీంతో నిన్నటి వరకు చుక్కనీరు లేని శామీర్పేట, చిన్నేరు వాగులు పరవళ్లు తొక్కుతున్నాయి. బిక్కేరు, మూసీ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కాజ్వేల పైనుంచి నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిపివేశారు. జిల్లాలోనే అతి పెద్దదైన తుర్కపల్లి మండలంలోని గంధమల్ల చెరువు అలుగుపోస్తోంది. సూర్యాపేట జిల్లా అర్వపల్లిలో జెడ్పీహెచ్ఎస్, కేజీబీవీ మళ్లీ జలమయమయ్యాయి. కేజీబీవీకి సోమవారం కూడా సెలవు ఇచ్చారు. చెరువుల్లా పంట పొలాలు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. నాగర్కర్నూల్ జిల్లాలో వరి, పత్తి, మొక్కజొన్న తదితర పంటలకు నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మహబూబ్నగర్, నాగర్కర్నూల్ జిల్లాలోని దుందుభీ నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దాదాపు 1000 చెరువులు అలుగు పారుతున్నాయి. కొట్టుకుపోయిన కోళ్లు..కారు సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలో 16.6 సెం.మీ వర్షపాతం నమోదైంది. హత్నూర మండలం ఎల్లమ్మగూడ శివారులోని కాలువ కట్ట కొట్టుకుపోయి సమీపంలో ఉన్న ఫౌల్ట్రీఫాంను వరద ముంచెత్తడంతో కొన్ని కోళ్లు కొట్టుకుపోయాయి. 3 వేల కోళ్లు మృత్యువాత పడ్డాయి. సిర్గాపూర్ మండలం వాసర్ గ్రామ శివారులో పొంగి ప్రవహిస్తున్న వాగులో పవన్ అనే వ్యక్తికి చెందిన కారు కొట్టుకు పోయింది. పవన్ ప్రమాదం నుంచి బయట పడ్డాడు. వరద తగ్గిన తర్వాత పోలీసులు కారును బయటకు తీశారు. మంజీరా నది మహోగ్ర రూపం దాల్చింది. మెదక్ జిల్లాలోని ప్రసిద్ధి చెందిన వనదుర్గమ్మ ఆలయం జల దిగ్బంధంలోనే కొనసాగుతోంది. కల్యాణి , పోచారం ప్రాజెక్టులు ఉధృతంగా అలుగు పోస్తున్నాయి. వందలాది చెరువులు నిండాయి. బాన్సువాడ నుంచి కామారెడ్డికి వచ్చే రహదారిపై సర్వాపూర్ వాగు పొంగి ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలంలో 16.2 సెం.మీ వర్షం కురిసింది. మహారాష్ట్రకు నిలిచిన రాకపోకలు మంచిర్యాల జిల్లా కేంద్రంలో కురిసిన భారీ వర్షానికి పలు కాలనీలు జలమయం అయ్యాయి. ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. ప్రాణహిత, పెన్గంగ, వార్దా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సిర్పూర్(టి) నుంచి మహారాష్ట్రకు అంతర్రాష్ట్ర రహదారి గుండా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆదిలాబాద్ జిల్లాలో పలు వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ములుగులో పోటెత్తుతున్న వాగులు ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం ముళ్లకట్ట వద్ద జాతీయ రహదారిపై ఉన్న 163 హైలెవల్ వంతెన వద్ద రెండు కిలోమీటర్ల పొడువునా గోదావరి వరద నీరు ప్రవహిస్తోంది. కొండాయి వద్ద జంపన్నవాగు, ఎలిశెట్టిపల్లి వద్ద జంపన్నవాగు, గోగుపల్లివాగు, ఏటూరునాగారం–భద్రాచలం రహదారి మధ్యలోని జీడివాగు, మంగపేట మండలంలోని కమలాపురం వద్ద ఎర్రవాగు, కన్నాయిగూడెం మండలంలోని హనుమంతుల వాగు, ముళ్లకట్ట వద్ద మేడివాగు పొంగిపొర్లుతున్నాయి. ఏటూరునాగారం–బూర్గంపాడు ప్రధాన రోడ్డుపై నుంచి రెండు మీటర్ల ఎత్తులో వరదనీరు ప్రవహించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. కాగా ఆయా జిల్లాల్లో కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులు వరద పరిస్థితిని సమీక్షించారు. గొర్రెల కాపరులు, రైతును రక్షించిన ఎన్డీఆర్ఎఫ్ కామారెడ్డి జిల్లాలో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచి పోయాయి. జిల్లాలో అత్యధికంగా పిట్లంలో 17.5 సెం.మీ. వర్షపాతం నమోదైంది. నిజాంసాగర్, మహహ్మద్నగర్, నస్రుల్లాబాద్, మండలాల్లో 12 సెం.మీ నుంచి 16 సె.మీ. వర్షం కురిసింది. ఆదివారం అర్ధరాత్రి నిజాంసాగర్ గేట్లు ఎత్తడంతో మంజీరలో ప్రవాహం పెరిగి బిచ్కుంద మండలం శెట్లూర్ వద్ద ప్రవాహంలో ముగ్గురు గొర్రెల కాపరులు, ఒక రైతు చిక్కుకున్నారు. 656 గొర్రెలు కూడా నీటి మధ్యలో ఉండిపోయాయి. అధికారులు సోమవారం తెల్లవారుజామున ఎన్డీఆర్ఎఫ్ బృ«ందాల సాయంతో గొర్రెల కాపరులు, రైతును రక్షించారు. అలాగే గొర్రెలను బయటకు తీసుకువచ్చారు. మహారాష్ట్ర వరదల్లో ముగ్గురు మహిళల గల్లంతు – జగిత్యాలలోని టీఆర్నగర్లో విషాదం జగిత్యాల క్రైం: మహారాష్ట్రలో జరిగిన ఓ వివాహ వేడుకల్లో పాల్గొని కారులో తిరుగు ప్రయాణమైన ముగ్గురు మహిళలు అక్కడి వరదల్లో గల్లంతు కావడంతో జగిత్యాల జిల్లా కేంద్రంలోని టీఆర్నగర్లో విషాదం చోటుచేసుకుంది. టీఆర్నగర్కు చెందిన షేక్ అఫ్రిన (30), సమీన (50), హసీన (28)తో పాటు వారి బంధువు, ఆర్మూర్కు చెందిన సోహెబ్ ఆదివారం మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ముక్హేడ్ తాలూకా దెగ్లూర్కు వెళ్లారు. ఆదివారం రాత్రి జగిత్యాల వైపు ఖాళీగా వస్తున్న ఓ కారు డ్రైవర్ వీరిని ఎక్కించుకుని టీఆర్నగర్కు బయల్దేరాడు. 30 కిలోమీటర్ల దూరం రాగానే ఓ వాగు ఉప్పొంగి ప్రవహించడంతో కారు అందులో చిక్కుకుంది. సోహెబ్, డ్రైవర్ ఎలాగో బయటపడి ఒడ్డుకు చేరారు. ముగ్గురు మహిళలు మాత్రం గల్లంతయ్యారు. అంతకుముందు సమీన తన కోడలుకు ఫోన్ చేసి ‘పిల్లలు జాగ్రత్త.. మేం వరదల్లో కొట్టుకుపోతున్నాం..’ అని సమాచారం ఇచ్చింది. ఆ తర్వాత కుటుంబ సభ్యులు ఎంత ప్రయతి్నంచినా సమీన ఫోన్ పనిచేయలేదు. సోమవారం రాత్రి వరకూ వారి ఆచూకీ లభించలేదు. చేపల వేటకు వెళ్లి ఒకరు మృతి, మరొకరి గల్లంతు కామారెడ్డి జిల్లాలో చేపల వేటకు వెళ్లిన ఒకరు నీట మునిగి చనిపోయారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వెల్వర్తి గ్రామ శివారులో చెరువు అలుగు వరదలో సోమవారం సాయంత్రం చేపల వేటకు వెళ్లిన మోత్కూరు మండలం పాలడుగు గ్రామానికి చెందిన శివరాత్రి నవీన్ (25) గల్లంతైనట్లు గ్రామస్తులు తెలిపారు. -
వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, హైదరాబాద్: పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆదివారం ఉదయం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో అల్పపీడనం ఏర్పడింది. సోమవారం ఉదయానికల్లా ఇది వాయవ్య దిశలో కదిలి మరింత బలపడి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత వాయుగుండం దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల సమీపంలో ఈ నెల 19వ తేదీ మధ్యాహ్నం నాటికి తీరాన్ని దాటే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల చక్రవాత ఆవర్తనం కొనసాగుతోంది.ఇది సముద్ర మట్టం నుంచి 9.6 కిలోమీటర్ల ఎత్తువరకు విస్తరించి ఉంది. అల్పపీడనం, వాయగుండం ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఉత్తర ప్రాంత జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది. ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీచేసింది. సోమవారం ఈ మూడు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశంఉందని, ఆయా జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.నైరుతి రుతుపవనాల కదలికలు చురుగ్గా ఉండడంతోపాటు రాష్ట్రమంతటా ఆకాశం మేఘావృతమవ్వడంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా పతనమయ్యాయి. ఆదివారం రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు సెల్సియస్ తక్కువగా నమోదయ్యాయి. ఆదివారం గరిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్లో 30.8 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్లో 20 డిగ్రీ సెల్సియస్గా నమోదైంది.15 శాతం అధిక వర్షపాతంనైరుతి సీజన్ వర్షాలు సంతృప్తికరంగా ఉన్నాయి. ఆదివారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 47.81 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 54.98 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సాధారణ వర్షపాతం కంటే 15 శాతం అధికంగా వర్షాలు నమోదైనట్లు రాష్ట్ర ప్రణాళిక శాఖ గణాంకాలు చెబుతున్నాయి. 5 జిల్లాల్లో అత్యధికంగా, 9 జిల్లాల్లో అధికంగా వర్షాలు కురిశాయి. 19 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ఆదివారం ఒక్కరోజు రాష్ట్రంలో సగటున 1.51 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
ఎత్తిపోతలు ఎప్పుడు?
సాక్షి, హైదరాబాద్: వర్షాకాలం ప్రారంభమై రెండున్నర నెలల తర్వాత ఎట్టకేలకు ఎగువ గోదావరి వరదెత్తింది. నదీ పరీవాహకంలో కురుస్తున్న భారీ వర్షాలతో సింగూరు ప్రాజెక్టు నుంచి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వరకు గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. పరీవాహకంలోని జలాశయాలన్నీ అడుగంటిపోయి ఉండగా, ఎప్పటికప్పుడు పంపుల ద్వారా ఎత్తిపోసి నిల్వ చేసుకోకపోవడంతో వరద జలాలన్నీ వృథాగా సముద్రంలో కలిసిపోతున్నాయి. జలాల ఎత్తిపోతలో మీనమేషాలు లెక్కిస్తున్న అధికార యంత్రాంగం.. ఎల్లంపల్లి జలాశయం నుంచి మేడారం, అక్కడి నుంచి మిడ్మానేరు జలాశయానికి పంపింగ్ను మాత్రమే ప్రారంభించడం గమనార్హం. మిడ్ మానేరుకు తరలింపులో తీవ్ర ఆలస్యం మిడ్మానేరు నుంచి ఎగువన ఉన్న అనంతగిరి, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ జలాశయాల్లోకి నీళ్లను ఎత్తిపోసే ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. వాస్తవానికి శ్రీరామ్సాగర్కు గత మూడు రోజులుగా భారీ వరద వస్తున్నా ఫ్లడ్ ఫ్లో కెనాల్ (ఎఫ్ఎఫ్సీ) ద్వారా గ్రావిటీతో మిడ్మానేరు జలాశయానికి నీళ్లను తరలించడంలో తీవ్ర ఆలస్యం జరిగింది. ఆదివారం సాయంత్రం ఎల్ఎఫ్సీ ద్వారా 10,000 క్యూసెక్కులను విడుదల చేయగా, ఇంకా ఆ నీళ్లు మిడ్మానేరుకు చేరుకోలేదు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నంది పంప్హౌస్ ద్వారా 12,600 క్యూసెక్కులను మేడారం రిజర్వాయర్లోకి, అక్కడి నుంచి గాయత్రి పంప్హౌస్ల ద్వారా అంతే నీళ్లను మిడ్మానేరు జలాశయంలోకి ఎత్తిపోస్తున్నారు. నంది, గాయత్రి పంప్హౌస్లలో చెరో ఏడు చొప్పున మొత్తం 14 పంపులుండగా, చెరో 4 పంపులతో నీళ్లను పంపింగ్ చేస్తున్నారు. దీంతో మిడ్మానేరు జలాశయం నిల్వ సామర్థ్యం 27.5 టీఎంసీలకు గాను 11.13 టీఎంసీలకు చేరింది. మిడ్ మానేరు నుంచి ఎప్పుడు? మిడ్మానేరు నుంచి నీళ్లను ఏకకాలంలో సమాంతరంగా అనంతగిరి, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్తో పాటు మరో లింక్ ద్వారా మలకపేట, అప్పర్ మానేరుకు ఎత్తిపోసేందుకు వీలుండగా, ఇంకా ఆ ప్రక్రియను ప్రారంభించలేదు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన ఈ ఆన్లైన్ రిజర్వాయర్లలో ప్రస్తుతం నిల్వలు అడుగంటిపోయి ఉన్నా పంపింగ్ ప్రారంభించకపోవడం గమనార్హం. ప్రాజెక్టులకు వరద ఇలా.. రాష్ట్రంలో మంజీరపై ఉన్న సింగూరు ప్రాజెక్టుకు శనివారం సాయంత్రం 6 గంటలకు 31,412 క్యూసెక్కుల వరద రాగా, ఆదివారం సాయంత్రం 6 గంటల సమయానికి 28,357 క్యూసెక్కులకు తగ్గిపోయింది. జలాశయం నిల్వ సామర్థ్యం 29.91 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 20.37 టీఎంసీల నిల్వను కొనసాగిస్తూ 43,244 క్యూసెక్కులను కిందికి విడుదల చేస్తున్నారు. దిగువన ఉన్న నిజాంసాగర్ గరిష్ట నిల్వ సామర్థ్యం 17.8 టీఎంసీలు కాగా, 49,000 క్యూసెక్కుల వరద వస్తుండడంతో ప్రస్తుతం నిల్వలు 12.88 టీఎంసీలకు చేరాయి. ఇక గోదావరి ప్రధాన పాయపై ఉన్న శ్రీరామ్సాగర్ గరిష్ట నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా, ప్రాజెక్టుకు 1.51 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండడంతో నిల్వలు 66.23 టీఎంసీలకు పెరిగాయి. మరో రెండురోజుల్లో శ్రీరామ్సాగర్ గేట్లు ఎత్తే అవకాశం ఉంది. అప్పుడే కడెం, ఎల్లంపల్లి గేట్లు కిందకి.. కడెం నదిపై ఉన్న కడెం ప్రాజెక్టుకు వస్తున్న వరద ప్రవాహం శనివారంతో పోల్చితే ఆదివారానికి 1.33 లక్షల క్యూసెక్కుల నుంచి 4,632 క్యూసెక్కులకు తగ్గిపోవడంతో గేట్లను కిందికి దించేశారు. జలాశయం గరిష్ట నిల్వ సామర్థ్యం 4.7 టీఎంసీలు కాగా ప్రస్తుతం 3.17 టీఎంసీల నిల్వలను కొనసాస్తూ 299 క్యూసెక్కులను కాల్వకు విడుదల చేస్తున్నారు. శ్రీరామ్సాగర్, కడెంకి దిగువన గోదావరి ప్రధాన పాయపై ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వచ్చే వరద సైతం 2.15 లక్షల క్యూసెక్కుల నుంచి 28,460 క్యూసెక్కులకు పడిపోవడంతో గేట్లను మూసివేశారు. జలాశయం నిల్వ సామర్థ్యం 20.18 టీఎంసీలు కాగా 18.31 టీఎంసీల నిల్వలను కొనసాగిస్తూ 12,600 క్యూసెక్కులను మేడారం రిజర్వాయర్కు పంపింగ్ చేస్తున్నారు. అక్కడి నుంచి గాయత్రి పంప్హౌస్ ద్వారా 9,390 క్యూసెక్కులను మిడ్మానేరు రిజర్వాయర్లోకి తరలిస్తున్నారు. మిడ్మానేరు నుంచి నీళ్లను ఎత్తిపోస్తే అనంతగిరి రిజర్వాయర్ కింద 40వేల ఎకరాలు, రంగానాయకసాగర్ కింద 1.10 లక్షల ఎకరాలు, మల్లన్నసాగర్ కింద 2.96 లక్షల ఎకరాలు, కొండపోచమ్మసాగర్ కింద 2.85 లక్షల ఎకరాలు, అప్పర్ మానేరు కింద 16,085 ఎకరాలకు ప్రస్తుత ఖరీఫ్లో సాగునీరు అందే అవకాశం ఉంది. కృష్ణా జలాశయాలు కళ కళ కృష్ణా పరీవాహకంలో రాష్ట్రంలో మొత్తం 649.53 టీఎంసీల సామర్థ్యంతో 30 రిజర్వాయర్లుండగా, 584.65 టీఎంసీల నిల్వలతో అన్నీ జలకళను సంతరించుకున్నాయి. కానీ గోదావరి పరీవాహకంలో మొత్తం 419.81 టీఎంసీల సామర్థ్యంతో 57 జలాశయాలుండగా, కేవలం 191.69 టీఎంసీల నిల్వలతో వెలవెలబోతుండటం గమనార్హం. నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ (ఎన్డీఎస్ఏ) సూచనల మేరకు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లలో నీళ్లను నిల్వ చేసుకునే అవకాశం లేకపోవడంతో 33.18 టీఎంసీల నిల్వ సామర్థ్యాన్ని రాష్ట్రం తాత్కాలికంగా కోల్పోయింది. సింగూరు జలాశయానికి ఏ క్షణంలోనైనా గండిపడవచ్చనే హెచ్చరికలున్న నేపథ్యంలో 21 టీఎంసీలకు మించి నీళ్లను నిల్వ చేయడం లేదు. కాగా నీటి నిల్వలకు అవకాశం ఉన్న జలాశయాలూ ఖాళీగా ఉండడం గమనార్హం. -
3 రోజుల పాటు కోస్తాలో అతి భారీ వర్షాలు
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: దక్షిణ ఛత్తీస్గడ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా ఆదివారం నుంచి మంగళవారం వరకు రాష్ట్రంలో వర్షాలు పడతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. దానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సోమవారం మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు. వీటి ప్రభావంతో కోస్తా జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు, సీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదివారం అల్లూరి సీతారామరాజు, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. సోమవారం తూర్పు, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, ఉత్తరాంధ్రతో పాటు కాకినాడ, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి.19న కోస్తాంధ్ర అంతటా మోస్తరు వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు పడనున్నాయి. ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున మంగళవారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని ప్రఖర్ జైన్ సూచించారు. కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, కాకినాడ, గంగవరం పోర్టుల్లో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. -
పోటెత్తిన గోదావరి
సాక్షి, హైదరాబాద్/బాల్కొండ/నిర్మల్/రామగుండం: నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించిన రెండున్నర నెలల తర్వాత ఎట్టకేలకు ఎగువ గోదావరి నది పోటెత్తింది. పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో సింగూరు ప్రాజెక్టు నుంచి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వరకు గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువన మహారాష్ట్రలో ఉన్న జైక్వాడ్ ప్రాజెక్టు గరిష్ట నిల్వ సామర్థ్యం 102.73 టీఎంసీలు కాగా, శనివారం సాయంత్రం 6 గంటల సమయానికి 6,738 క్యూసెక్కుల వరద వస్తుండడంతో 97.29 టీఎంసీలకు చేరింది. రెండు మూడు రోజుల్లో జైక్వాడ్ నిండితే గోదావరి ప్రధాన పాయ ద్వారా తెలంగాణలోకి వచ్చే వరద ప్రవాహం మరింత పెరగనుంది. రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లకు వరద రాష్ట్రంలో మంజీర నదిపై నిర్మించిన సింగూరు ప్రాజెక్టుకు 31,412 క్యూసెక్కుల వరద వస్తుండగా, 21.34 టీఎంసీల నిల్వను కొనసాగిస్తూ 43,634 క్యూసెక్కులను కిందికి విడుదల చేస్తున్నారు. సింగూరు ప్రాజెక్టు గరిష్ట నిల్వ సామర్థ్యం 29.91 టీఎంసీలు అయినప్పటికీ డ్యామ్ భద్రతపై డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్ (డీఎస్ఆర్పీ) హెచ్చరికల నేపథ్యంలో నిల్వను 21 టీఎంసీలకు మించకుండా చర్యలు తీసుకుంటున్నారు. దిగువన ఉన్న నిజాంసాగర్ గరిష్ట నిల్వ సామర్థ్యం 17.8 టీఎంసీలు కాగా, 31,500 క్యూసెక్కుల వరద వస్తుండడంతో నిల్వలు 9.22 టీఎంసీలకు చేరాయి. గోదావరి ప్రధాన పాయపై ఉన్న శ్రీరాంసాగర్ గరిష్ట నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా, ప్రాజెక్టుకు 1.04 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండడంతో నిల్వలు 54.63 టీఎంసీలకు పెరిగాయి. కడెం నదిపై నిర్మించిన కడెం ప్రాజెక్టు సామర్థ్యం 4.7 టీఎంసీలు కాగా, 1.33 లక్షల క్యూసెక్కుల వరద పోటెత్తడంతో 3.06 టీఎంసీల నిల్వలను కొనసాగిస్తూ, 2.04 లక్షల క్యూసెక్కులను కిందికి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు మొత్తం 18 గేట్లను ఎత్తివేశారు. ప్రాజెక్టు దిగువన చేపల వేటకు వెళ్లిన కన్నాపూర్ గ్రామానికి చెందిన గంగాధర్ (41) నీటి ప్రవాహంలో గల్లంతయ్యాడు. సారంగాపూర్ మండలంలోని స్వర్ణ ప్రాజెక్టుకు 15వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో రావడంతో ఐదు గేట్లు ఎత్తి 25,400 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. భైంసా పట్టణంలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టులోకి 10,500 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా, ఐదు గేట్లు ఎత్తి 20 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీరాంసాగర్, కడెం నుంచి వస్తున్న వరద తోడుకావడంతో దిగువన గోదావరి ప్రధాన పాయపై ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 2.15 లక్షల క్యూసెక్కుల వరద పోటెత్తింది. జలాశయం నిల్వ సామర్థ్యం 20.18 టీఎంసీలు కాగా, 18.23 టీఎంసీల నిల్వలను కొనసాగిస్తూ 20 గేట్లను ఎత్తి 53,800 క్యూసెక్కులను కిందికి విడుదల చేస్తున్నారు. నంది పంప్హౌస్ ద్వారా మరో 12,600 క్యూసెక్కులను మేడారం రిజర్వాయర్కు తరలించి అక్కడి నుంచి గాయత్రి పంప్హౌస్ ద్వారా 11,000 క్యూసెక్కులను మిడ్మానేరు రిజర్వాయర్లోకి తరలిస్తున్నారు. అక్కడి నుంచి త్వరలో రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్లోకి నీటి పంపింగ్ ప్రారంభించే అవకాశం ఉంది. దీంతో సాగు, తాగునీటికి ఇబ్బందులు తొలగిపోనున్నాయి. దిగువ గోదావరిలో కొనసాగుతున్న ఉధృతి ఎల్లంపల్లి నుంచి విడుదల చేసిన వరద ఇంకా చేరకపోవడంతో దిగువన ఉన్న సుందిళ్ల బరాజ్కి 6,142, అన్నారం బరాజ్కి 7,825 క్యూసెక్కుల వరద మాత్రమే వస్తోంది. అయితే, వచ్చిన వరదను వచ్చినట్టు కిందికి విడుదల చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లలో నీళ్లు నింపరాదని ఎన్డీఎస్ఏ సూచించిన విషయం తెలిసిందే. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లోని దిగువ పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో ఉపనదులైన ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, వాగులు, వంకల్లో వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో దిగువ గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. గోదావరిలో ప్రాణహిత కలిసే కాళేశ్వరం వద్ద నిర్మించిన మేడిగడ్డ బరాజ్ నుంచి ధవళేశ్వరం బరాజ్కు దిగువన సముద్రంలో కలిసే వరకూ గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రాణహిత నది వచ్చి కలవడంతో మేడిగడ్డ బరాజ్కి 3.73 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, దాన్ని మొత్తం కిందికి విడుదల చేస్తున్నారు. దానికి ఛత్తీస్గఢ్ నుంచి వస్తున్న ఇంద్రావతి వరద తోడవుతుండటంతో తుపాకులగూడెం (సమ్మక్క సాగర్) బరాజ్లోకి 4.60 లక్షల క్యూసెక్కుల వరద చేరుతుండగా అంతే స్థాయిలో దిగువకు విడుదల చేస్తున్నారు. సీతమ్మసాగర్ (దుమ్ముగూడెం బరాజ్)లోకి చేరుతున్న 3.56 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తుండడంతో ఏపీలోని పోలవరం ప్రాజెక్టు గుండా ప్రవహించి ధవళేశ్వరం బరాజ్ మీదుగా సముద్రంలోకి వరద చేరుతోంది. వాగులు వంకలు ఏకంరాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు పలు జిల్లాల్లో పొంగుతున్న వాగులు సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో వర్షాలు దంచి కొడుతున్నాయి. పలు జిల్లాల్లో భారీ వర్షాలకు వరద పోటెత్తడంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. కొన్నిచోట్ల రోడ్లు, వంతెనలు దెబ్బతినటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాగులు, వంకలు పొంగుతున్నాయి. జలాశయాలు నిండు కుండలను తలపిస్తున్నాయి. మరో రెండుమూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించటంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. దెబ్బతిన్న రోడ్లను యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీస్, రెవెన్యూ, అగ్నిమాపక విభాగాలు సిద్ధమయ్యాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా: ఉమ్మడి జిల్లా పరిధిలోని మహబూబాబాద్, ములుగు, వరంగల్, భూపాలపల్లి జిల్లాల్లో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని పాకాల వాగు బ్రిడ్జి పైనుంచి వరద పొంగిపొర్లుతోంది. దీంతో ఏటి అవతలి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొత్తగూడ మండలంలోని గుంజేడువాగు, గాదెవాగు, రాళ్లతెట్టెవాగు, ముస్మివాగు, మొండ్రాయిగూడెం వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. బయ్యారం మండలం ఇల్లెందు– మహబూబాబాద్ రహదారి పైనుంచి జిన్నెలవర్రె వాగు పొంగి ప్రవహిస్తోంది. ములుగు జిల్లా మేడారంలోని జంపన్నవాగులో మేడారం బ్రిడ్జిని ఆనుకుని వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు నగర్– వెంగ్లాపూర్ మధ్య ఉన్న యాసంగి తోగు వరద రోడ్డును కమ్మేయడంతో పస్రా నుంచి మేడారానికి శనివారం ఉదయం నుంచి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మేడారం, రెడ్డిగూడెం, కన్నెపల్లి, ఊరట్టం, ఎల్బాక, పడిగాపూర్, నార్లాపూర్ గ్రామాల్లోని వరి పొలాలు నీట మునిగాయి. ఎల్బాక, పడిగాపూర్ గ్రామా లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గోవిందరావుపేట మండలంలోని లక్నవరం సరస్సు సామర్థ్యం 33 ఫీట్ల 6 ఇంచులు కాగా, శనివారం సాయంత్రం వరకు చెరువు పూర్తిగా నిండి అలుగు పోస్తోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపసముద్రం, భీంఘనపురం రిజర్వాయర్లలోకి 18 అడుగుల మేర నీరు చేరింది. మోరంచవాగు ఉప్పొంగి ప్రవహించింది. చిట్యాల, మొగుళ్లపల్లి, టేకుమట్ల చలివాగుకు వరద పెరిగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా: ఖమ్మం, పాలేరు, వైరా, పినపాక, ఇల్లెందు నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు భారీ వర్షం కురిసింది. వైరా, కారేపల్లి మండలాల్లో పలుచోట్ల లోతట్టు ప్రాంతాల కాలనీలను వరద ముంచెత్తగా ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని మున్నేటికి వరద నెమ్మదిగా పెరుగుతుండడంతో నీటిమట్టం శనివారం రాత్రి 15 అడుగులకు చేరింది. దీంతో మున్నేటికి ఇరువైపులా పరిస్థితులను ఖమ్మం కలెక్టర్ అనుదీప్, మున్సిపల్ కమిషనర్లు పరిశీలించి స్థానికులను అప్రమత్తం చేశారు. భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో పత్తి, పెసర పంటలు దెబ్బతిన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా: జిల్లాలో శనివారం కుండపోతగా వర్షం కురిసింది. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో అత్యధికంగా 98.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, లక్సెట్టిపేట, చెన్నూరు, కాగజ్నగర్ పట్టణాల్లో లోతట్టు కాలనీల్లోకి వరద నీరు చేరింది. ఆదిలాబాద్ తరుణం వాగులో రెండు లారీలు వరదలో చిక్కుకుపోగా, డ్రైవర్లను పోలీసులు రక్షించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సుభాష్ నగర్, భాగ్యనగర్, కృష్ణానగర్ కాలనీల్లోకి నీరు చేరడంతో స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బజార్హత్నూర్, కన్నెపల్లి, భీమిని, వేమనపల్లి తదితర మండలాల్లో పత్తి, సోయా, వరి పంటలు దెబ్బ తిన్నాయి. ఇంద్రవెల్లి మండలం ముట్నూరు వద్ద ఆదిలాబాద్–మంచిర్యాల రహదారి తెగిపోయింది. సిరికొండలోని చిక్మాన్ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. సాత్నాల ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం రాత్రి నుంచి శనివారం మధ్యాహ్నం వరకు ఏకధాటిగా వర్షం కురిసింది. పంట పొలాలు నీట మునిగాయి. బోధన్ డివిజన్ పరిధిలో అత్యధికంగా వర్షపాతం నమోదైంది. జలాల్పూర్–బడాపహాడ్ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. ఇందల్వాయి మండలం సిర్నాపల్లి వాగు ఉధృతంగా ప్రవహించడంతో గ్రామానికి రాకపోకలు నిలిచాయి. కామారెడ్డి జిల్లా: కామారెడ్డి జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి భారీ వర్షం కురిసింది. అత్యధికంగా రామారెడ్డి మండలంలో 12.3 సెం.మీ. వర్షపాతం నమోదైంది. పోచారం ప్రాజెక్టు నిండి అలుగులు పోస్తూ మంజీరలోకి ప్రవహిస్తోంది. ఎగువన సింగూరు, గణపురం ఆనకట్టల ద్వారా కూడా దిగువకు నీటిని వదులుతుండడంతో మంజీర ద్వారా నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 31 వేల క్యూసెక్కుల నీరు వస్తోంది. భారీ వర్షాలతో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఒక ఇల్లు పూర్తిగా, 11 ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. -
అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: సీఎం రేవంత్
హైదరాబాద్: తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలిని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. వర్ష ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ బృందాలను తరలించాలని ముందుగా ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, చెరువులు, రిజర్వాయర్లు, కుంటల దగ్గర ఇసుక బస్తాలను ముందుగానే సిద్ధంగా ఉంచాలన్నారు. ప్రజల వినతులపై తక్షణమే స్పందించాలన్నారు సీఎం రేవంత్. ఇదిలా ఉంచితే, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. దీనిలో భాగంగా భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. ఇక ఆదిలాబాద్, కొమురం భీం, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లా, వరంగల్, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. -
మూడు రోజుల పాటు భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దీనికి అనుబంధంగా ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల మీదుగా రుతుపవన ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తీరం వెంబడి గంటకు గరిష్టంగా 60 కి.మీ. వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని, ఈ నెల 18 వరకూ మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. కళింగపట్నం, భీమిలి, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం పోర్టుల్లో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గడిచిన 24 గంటల్లో పెందుర్తిలో 87.5 మి.మీ, వేపగుంటలో 74 మి.మీ, జియ్యమ్మవలసలో 67మి.మీ, కురుపాంలో 60మి.మీ వర్షపాతం నమోదైంది. -
పాక్లో వర్ష విలయం
పెషావర్/ఇస్లామాబాద్: పాకిస్తాన్తోపాటు పీవోకేలో కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర ఆస్తి, ప్రాణనష్టం మిగిల్చాయి. గత 36 గంటల వ్యవధిలో 214 మంది చనిపోగా పదుల సంఖ్యలో జనం గల్లంతయ్యారు. ఖైబర్ ఫక్తున్వా ప్రావిన్స్లో ఆకస్మిక వర్షాలు, వరదల్లో అత్యధికంగా 198 మంది చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. వీరిలో 14 మంది మహిళలు, 12 మంది చినానరులు ఉన్నారన్నారు. పీవోకేలోని గిల్గిట్–బాల్టిస్తాన్, కారకోరమ్ హైవే దెబ్బతిన్నాయన్నారు. ఖైబర్ ప్రావిన్స్లోని బునెర్ జిల్లాలో అత్యధికంగా 92 మంది చనిపోగా మన్òÙరా జిల్లాలో 17 మంది బజౌర్, బటగ్రామ్ జిల్లాల్లో 18 మంది చొప్పున మృత్యువాతపడ్డారని స్థానిక అధికారులు వెల్లడించారు. లోయర్ దిర్ జిల్లాలో ఐదుగురు, స్వాత్లో నలుగురు, సంగ్లాలో ఒకరు చనిపోయారు. పలువురు చిన్నారులు సహా మొత్తం 125 మంది చనిపోయినట్లు విపత్తు నిర్వహణ విభాగం తెలిపింది. సహాయ, అన్వేషణ కార్యక్రమాలను ముమ్మరం చేసినట్లు వివరించింది. స్వాత్, బజౌర్లలో ఆర్మీ సహాయ కార్యకలాపాల్లో పాల్గొంటోంది. ఆకస్మిక వరదల్లో గిల్గిట్–బల్టిస్తాన్లోని ఘిజర్ జిల్లాలో 8 మంది చనిపోగా ఇద్దరు గల్లంతయ్యారు. జిల్లాలో పలు నివాసాలు, వాహనాలు, స్కూలు భవనాలు, ఆరోగ్య కేంద్రాలు ధ్వంసమయ్యాయి. కారకోరమ్ హైవే, బల్టిస్తాన్ హైవే పలు చోట్ల దెబ్బతింది. లింకు రోడ్లు తెగిపోవడంతో నీలమ్ లోయలోని రట్టి గలి సరస్సు వద్ద చిక్కుకుపోయిన 600 మందికి పైగా పర్యాటకులను అక్కడే ఉండాలంటూ అధికారులు సూచనలు చేశారు. కుందల్ షాహి వద్ద వంతెన కొట్టుకుపోయింది. వరద ఉధృతికి ఒక రెస్టారెంట్తో పాటు మూడిళ్లు నేలమట్టమయ్యాయి. జీలమ్ నదికి వరద పోటెత్తడంతో లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు ప్రారంభించారు. పీవోకేలోని ముజఫరాబాద్ జిల్లాలోని సర్లి సచాలో ఇల్లు కూలి కుటుంబంలోని ఆరుగురు సజీవ సమాధి అయ్యారు. సు«ద్నోటి, బాగ్ జిల్లాల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.కూలిన హెలికాప్టర్ సహాయక చర్యల్లో పాల్గొన్న హెలికాప్టర్ శుక్రవారం ఖైబర్ ప్రావిన్స్లో కూలిందని అధికారులు తెలిపారు. ఘటనలో ఇద్దరు పైలట్లు, ముగ్గురు సహాయక సిబ్బంది సహా ఐదుగురు చనిపోయారని చెప్పారు. వాతావరణం ప్రతికూలంగా మారడమే ఇందుకు కారణమని భావిస్తున్నామన్నారు. పెషావర్ నుంచి టేకాఫ్ తీసుకున్న ఎంఐ–17 హెలికాప్టర్ మహ్మంద్ జిల్లాలోని చంగి బండా వద్ద కూలిందని వివరించారు. ఘటన నేపథ్యంలో మరో హెలికాప్టర్ను సహాయక చర్యల కోసం వినియోగిస్తున్నామన్నారు. -
నైరుతి కాదు.. సైరుతి
సాక్షి, హైదరాబాద్: నైరుతి వర్షాలు ఆశాజనకంగా ఉన్నాయి. సీజన్ ప్రారంభం నుంచి రెండు నెలల పాటు నెలకొన్న వర్షాభావ పరిస్థితులు ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్నాయి. వారం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. ప్రస్తుత సీజన్లో ఇప్పటివరకు ఉన్న లోటు వర్షపాతం నుంచి క్రమంగా సాధారణ స్థాయికి గణాంకాలు పరుగులు పెడుతున్నాయి.తాజా సీజన్లో ఈనెల 15వ తేదీ నాటికి రాష్ట్రంలో సగటున 46.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 50.92 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సాధారణ వర్షపాతం కంటే 10 శాతం అధికంగా నమోదైంది. గతవారం వరకు వర్షపాతం దాదాపు 30 శాతం వరకు లోటు నమోదు కాగా... వారం రోజులుగా రుతుపవనాలు అత్యంత చురుగ్గా కదలడం, మరోవైపు వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో కురిసిన వర్షాలతో సాగుకు అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. ⇒ వాయవ్య బంగాళాఖాతం ప్రాంతంలో కొనసాగుతున్న అల్పపీడనం.. దక్షిణ ఒడిశా, దానికి అనుకొని ఉన్న ఉత్తరాంధ్ర కోస్తా తీర ప్రాంతానికి విస్తరించింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల చక్రవాత ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్రమట్టం నుంచి సగటున 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంది. ⇒ మరోవైపు బికనీర్, కోట, సియోని, రాయపూర్ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న రెండు రోజులు చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వివరించింది. శనివారం దక్షిణ ప్రాంత జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కూడా నమోదు కావొచ్చని వాతావరణ శాఖ వివరించింది. నెలాఖరు వరకు వానలు... రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల కదలికలు ప్రస్తుతం అత్యంత చురుగ్గా ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. సీజన్ ప్రారంభ సమయంతో పోలిస్తే ప్రస్తుతం బంగాళాఖాతంలో కూడా వర్షాలకు అనుకూల వాతావరణం ఉందని, దీంతో ఈ నెలాఖరు వరకు వివిధ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయంటున్నారు. నెలాఖరు కల్లా రాష్ట్రంలో నైరుతి సీజన్లో కురవాల్సిన సాధారణ వర్షపాతానికి గణాంకాలు చేరుకుంటాయని, ఆ తర్వాత వర్షాలు అదనంగా భావించొచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు.గత వారం రోజులుగా కురిసిన వర్షాలతో రాష్ట్రంలో లోటు ప్రభావం చాలావరకు తగ్గింది. రాష్ట్రవ్యాప్తంగా ఐదు జిల్లాల్లో అత్యధిక వర్షాలు నమోదు కాగా... ఏడు జిల్లాల్లో అధికం, 14 జిల్లాల్లో సాధారణ వర్షాలు కురిశాయి. మరో ఏడు జిల్లాల్లో లోటు వర్షపాతం ఉంది. ⇒ మండలాల వారీగా వర్షాల తీరును పరిశీలిస్తే... 90 మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కాగా, 185 మండలాల్లో అధిక వర్షపాతం, 255 మండలాల్లో సాధారణ వర్షపాతం, 91 మండలాల్లో లోటు వర్షపాతం ఉన్నట్టు రాష్ట్ర ప్రణాళిక శాఖ నివేదిక చెబుతోంది. ⇒ లోటు వర్షపాతం ఉన్న జిల్లాలు: ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి. ఈ జిల్లాల్లో ఇప్పటివరకు నమోదు కావాల్సిన సాధారణ వర్షపాతం 10 శాతానికి పైబడి తక్కువ వర్షాలు నమోదయ్యాయి. ⇒ సాధారణ వర్షపాతం నమోదైన జిల్లాలు: కుమురంభీం ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, హనుమకొండ, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, జనగామ, మేడ్చల్–మల్కాజిగిరి, ఖమ్మం, ములుగు. ఈ జిల్లాల్లో వర్షపాతం సాధారణం కంటే దాదాపు 20 శాతం వరకు అదనపు వర్షాలు కురిశాయి. -
పాక్, పీవోకేలో జల విలయం.. 150 మందికి పైగా మృతి
గత 24 గంటలుగా పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్(PoK) ప్రాంతాలను ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కుండపోత వర్షాలు కారణంగా భారీ ప్రాణ నష్టం సంభవించినట్లు ఆ దేశ జాతీయ, ప్రాంతీయ విపత్తు నిర్వహణ అధికారులు వెల్లడించారు. వర్ష బీభత్సంతో 154 మంది మృతి చెందారని... పలువురు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ ప్రాంతం వర్షాలకు తీవ్రంగా దెబ్బతిందని.. భారీ సంఖ్యలో మరణాలు సంభవించినట్లు అధికారులు పేర్కొన్నారు.పీవోకేలోని గిల్గిత్-బాల్టిస్తాన్లో ఆకస్మిక వరదలు విధ్వంసం సృష్టించాయి. పలు భవనాలు ధ్వంసం కాగా.. ఎనిమిది మంది మరణించారు. ఘైజర్ జిల్లాలో ఇద్దరు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. బునేర్ జిల్లాలో 75 మంది, మాన్సెహ్రా జిల్లాలో 17 మంది, బాజౌర్, బాటాగ్రామ్ జిల్లాల్లో 18 మంది మృతి చెందినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఆకస్మిక వరదల ప్రభావంతో పలువురు చిన్నారులు సహా 125 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.Breaking News: Fllods in North West Pakistan wreak havoc as death toll in KP nears 100 in a single day so far. Only Buner death toll has reached to 75, 56 dead bodies have been recovered so far says Dy Commissioner. pic.twitter.com/iCbrIMcvwV— Fakhar Ur Rehman (@Fakharrehman01) August 15, 2025కారకోరం, బాల్టిస్తాన్ జాతీయ రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి. రవాణా, సహాయక చర్యలు పూర్తిగా నిలిచిపోయాయి. నీలం లోయలో లింక్ రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో వందలాది మంది పర్యాటకులు రట్టి గలి సరస్సు బేస్ క్యాంప్ వద్ద చిక్కుకుపోయారు. కుండల్ షాహిలోని ఒక ప్రధాన వంతెనతో పాటు ఇళ్ళు, నది తీరంలోని రెస్టారెంట్ను వరద తుడిచిపెట్టేసింది. ముజఫరాబాద్లోని సర్లి సచాలో కొండచరియలు విరిగిపడి ఒక ఇల్లు కుప్పకూలి ఆరుగురు కుటుంబ సభ్యులు చనిపోయినట్లు సమాచారం. -
ఢిల్లీలో ఊహించని విషాదం.. సీసీటీవీ దృశ్యాలు
ఢిల్లీ: నగరంలో ఊహించని విషాదం జరిగింది. కల్కాజీ ప్రాంతంలో తండ్రి, కూతురు బైక్పై వెళ్తుండగా భారీ వర్షానికి బైక్పై చెట్టు కూలిపోయింది. తండ్రి మృతి చెందగా.. కూతురి పరిస్థితి విషమంగా ఉంది. సుధీర్ కుమార్ (50) అనే వ్యక్తి తన కుమార్తె ప్రియ (22)తో కలిసి వెళ్తుండగా.. దక్షిణ ఢిల్లీలోని కల్కాజీలో ఒక పాత వేప చెట్టు విరిగి బైకర్, పక్కనే ఉన్న వాహనాలపై పడింది. ఈ ఘటన ఉదయం 9:50 గంటలకు జరిగింది. సీసీటీవీలో ఈ విషాద ఘటన రికార్డయ్యింది.చెట్టు కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు స్థానికులు ప్రయత్నించారు. పీసీఆర్ కాల్కు పోలీసులు వేగంగా స్పందించి రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. ఇద్దరు బాధితులను బయటకు తీసి, సెంట్రలైజ్డ్ యాక్సిడెంట్ అండ్ ట్రామా సర్వీసెస్ (CATS) అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు.In South Delhi’s Kalkaji, a biker lost his life after a tree collapsed on him during heavy rain.pic.twitter.com/58u0JEa4E4— Greater Noida West (@GreaterNoidaW) August 14, 2025తండ్రి, కుమార్తె ఇద్దరినీ AIIMS ట్రామా సెంటర్లో చేర్చారు. తండ్రి తీవ్ర గాయాలతో మరణించాడు. దేశ రాజధాని ఢిల్లీలో తెల్లవారుజామున నుండి కుండపోత వర్షం కురుస్తోంది. భారీ వర్షాలు ప్రభావంతో నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ ఏర్పడింది. జనజీవనానికి అంతరాయం కలిగింది. -
ఏపీకి భారత వాతావరణశాఖ తీవ్ర హెచ్చరిక
విశాఖపట్నం: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అవుతోంది. పలు జిల్లాల్లో ఇప్పటికే వాగులు, వంకలు పొంగిపొర్లి రాకపోకలు స్తంభించిపోయాయి. ఈ తరుణంలో గురువారం భారత వాతావరణశాఖ ఏపీకి తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.రాబోయే 24 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆకస్మిక వరద (ఫ్లాష్ ఫ్లడ్) ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి, కేంద్ర పాలిత ప్రాంతం యానాంకు ఈ హెచ్చరికలు జారీ చేసింది. మరో వైపు బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం శుక్రవారం మరింత బలపడి అల్పపీడనంగా మారే అవకాశముందని తెలుస్తోంది.పశ్చిమ మధ్య వాయవ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం.. పశ్చిమ వాయవ్య దిశగా ఉత్తరాంధ్ర ఒడిశా వైపు కదిలే అవకాశముందని విశాఖ వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో రాగల వారం రోజుల పాటు కోస్తాంధ్రలో వర్షాలు పడే అవకాశముందని వాతావరణకేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు.ఏపీ వ్యాప్తంగా గురువారం పలుజిల్లాలో భారీ వర్షాలు కొనసాగాయి. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద ఎగువ నుంచి వరదలతో అధికారులు అప్రమత్తమయ్యారు. బ్యారేజీ వద్ద 4 లక్షల క్యూసెక్కులకు పైగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. దీంతో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గడిచిన 24 గంటల్లో ఏలూరులో 22, ముమ్మిడివరంలో 18, అమలాపురంలో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కళింగపట్నం, విశాఖ, కాకినాడ, మచిలీపట్నం పోర్టుల్లో ప్రమాద సూచికను ఏగురవేశారు. వరద నీటిలో ఈతకు వెళ్లడం, చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. -
వాన జోరు.. వరద హోరు
సాక్షి, నెట్వర్క్: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం, ఉపరితల ఆవర్తనం, రుతుపవనాలు చురుకుగా మారడంతో రాష్ట్రంలో వానలు ఊపందుకున్నాయి. రెండు, మూడ్రోజులుగా హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే పలు రిజర్వాయర్లు నిండిపోయాయి. ప్రాజెక్టుల గేట్లు ఎత్తారు. మరోవైపు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు అలుగు పారుతున్నాయి. పలు ప్రాంతాల్లో రోడ్లు, వంతెనలపై వరద ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం వాటిల్లింది. పంట చేలు ముంపునకు గురయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్లో భారీ వర్షం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంగళ, బుధవారాల్లో కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పొంగాయి. మంచిర్యాల జిల్లా భీమిని మండలంలో బుధవారం ఉదయం వరకు భారీ వర్షాలు కురిసాయి. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు రెండు గేట్లు, స్వర్ణ ప్రాజెక్టు ఒక గేటు, కుమురంభీం ప్రాజెక్టు ఏడు, వట్టివాగు ప్రాజెక్టు ఆరు గేట్లు ఎత్తి దిగువకు అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం మత్తడివాగు గేటు ఎత్తారు. ఆసిఫాబాద్ మండలం తూంపెల్లి వాగు, నంబాల వాగు పొంగడంతో 13 గ్రామాలకు రాకపోకల్లో అంతరాయం కలిగింది. అలాగే కెరమెరి మండలం అనార్పల్లి వాగు, బూరుగూడ పెంచికల్పేట ఎర్రవాగు లోలెవల్ వంతెనపై వరద నీరు ప్రవహించడంతో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. నెన్నెల మండలం లంబాడి తండా ఎర్రవాగుపై ఉన్న తాత్కాలిక వంతెన తెగిపోయింది. భీమిని మండలం రాజారాం, కర్జీ భీంపూర్లో రోడ్డు కొట్టుకుపోయింది. కోటపల్లి మండలాల్లో వరద నీరు పంట చేన్లకు చేరింది. మంచిర్యాల, బెల్లంపల్లి పట్టణాల్లో రోడ్లపై వరద చేరింది. కలెక్టరుŠల్ ముంపు ప్రాంతాలను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. మంచిర్యాల జిల్లాలో భారీ వర్షానికి మూడు వేల ఎకరాల్లో వరి, పత్తి పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఉమ్మడి రంగారెడ్డి, మహబూబూబ్నగర్ జిల్లాల్లో.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బుధవారం పలుచోట్ల భారీ వర్షం కురిసింది. పరిగి, వికారాబాద్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారిపై వాహనదారులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. బుధవారం రాత్రి వనపర్తి, మహబూబ్నగర్ జిల్లాల్లో కుండపోతగా వర్షం కురిసింది. సరళాసాగర్, రామన్పాడు, పోపల్దిన్నె రిజర్వాయర్లకు భారీగా వరద కొనసాగింది. ఉమ్మడి జిల్లాలో 350 చెరువులు అలుగు పారుతున్నాయి. వనపర్తి జిల్లా ఊకచెట్టు వాగులో నీటి ఉధృతి పెరిగి ఆత్మకూర్–మదనాపురం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. సంగారెడ్డి అతలా కుతలం సంగారెడ్డి జిల్లాలో మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. న్యాల్కల్ మండల పరిధిలోని రేజింతల్ గ్రామ శివారులో వరద బ్రిడ్జిపై నుంచి ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. పంట పొలాలు వరదనీటితో నిండిపోయాయి. ప్రధానంగా పత్తి పంటతోపాటు చెరుకు, మినుము, సోయా, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. సూర్యాపేట జిల్లాలో.. సూర్యాపేట జిల్లాలోనూ భారీ వర్షపాతం నమోదైంది. పలుచోట్ల వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మునగాల మండలంలోని మొద్దులచెరువు, కలకోవ ఊరచెరువు, రేపాల, నర్సింహులగూడెం, ముకుందాపురం తిప్పాయికుంట, ఆకుపాముల నాగులకుంట చెరువులు అలుగు పోస్తున్నాయి. పాలేరు రిజర్వాయర్ నిండు కుండలా మారింది. ఆయకట్టు పరిధిలో భారీ వర్షాలు కురుస్తుండటంతో సాగర్ ఎడమ కాల్వకు బుధవారం నీటి విడుదలను నిలిపివేశారు. కోదాడలో బుధవారం సాయంత్రం నుంచి కురుస్తున్న వర్షానికి పట్టణ ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. బుధవారం రాత్రి గుడిబండ రోడ్డులో ఉన్న తులసీనగర్ టౌన్íÙప్లోకి వర్షపునీరు చేరడంతో ఇళ్లలోని వారిని మున్సిపాలిటీ సిబ్బంది జేసీబీతో బయటకు తీసుకొచ్చారు. షిర్డీసాయినగర్కు వరద ముప్పు దృష్ట్యా అక్కడ ఉన్న ముస్లిం మైనార్టీ బాలికల పాఠశాల విద్యార్థులను మధ్యాహ్నమే ఖాళీ చేయించి ఇంటికి పంపారు. పలు కాలనీల్లో ఇళ్లు, లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. మూసీ వంతెనలు పరిశీలించిన అధికారులు హైదరాబాద్లో కురిసిన భారీ వర్షాలకు యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో మూసీ పరవళ్లు తొక్కుతోంది. వలిగొండ మండలం బీమలింగం, భూదాన్ పోచంపల్లి మండలం జూలరు–రుద్రవెల్లి వద్ద లో లెవల్ బ్రిడ్జిల పైనుంచి వరద ప్రవహిస్తోంది. దీంతో అధికారులు రాకపోకలను నిలిపివేశారు. రాచకొండ సీపీ సుధీర్బాబు, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్రెడ్డి ఇతర అధికారులు మూసీ వంతెనలను పరిశీలించారు. భూదాన్పోచంపల్లి, వలిగొండ, బీబీనగర్ మండలాల్లో మూసీ ఆధారిత చెరువులు అలుగులు పోస్తున్నాయి. వరంగల్ లోతట్టు కాలనీల్లో వరద వరంగల్ నగరంలో మంగళవారం ఉదయం నుంచే వర్షం తగ్గుముఖం పట్టినా పలు లోతట్టు కాలనీల్లో ప్రవహిస్తున్న వరదనీరు ఉధృతి బుధవారం కూడా తగ్గలేదు. ఎస్ఆర్ఆర్ తోట, శివనగర్, మైసయ్య నగర్, శాకరాశికుంట, నాగేంద్రనగర్, కాశికుంట కాలనీలు నీటిలో ఉన్నాయి. 12 మెరీల నుంచి బొందివాగు వరకు రహదారిపై నీళ్లు ప్రవహిస్తున్నాయి. శివనగర్లో బల్దియా ఏర్పాటు పునరావాస కేంద్రంలో నిర్వాసితులు తలదాచుకుంటున్నారు. -
వరద ముంపులో అమరావతి
సాక్షి ప్రతినిధి, గుంటూరు/తాడికొండ : రాజధాని అమరావతి మళ్లీ వరద ముంపులో చిక్కుకుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లడంతో గుంటూరు వైపు నుంచి రాజధాని అమరావతికి రాకపోకలు నిలిచిపోయాయి. మంగళవారం రాత్రి పది గంటల నుంచి బుధవారం ఉదయంలోపు జిల్లాలో సగటున 145 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవడంతో తాడికొండ మండలం లాం వద్ద కొండవీటి వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దాదాపు ఆరు గంటల పాటు వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. పెదపరిమి వద్ద కోటేళ్లవాగు, కంతేరు వద్ద ఎర్రవాగు, అయ్యన్నవాగు, పాలవాగులు పొంగడంతో రహదారులపైకి నీరు చేరింది.రాజధాని నిర్మాణాలతో స్వరూపం కోల్పోయిన వాగులు..రాజధాని ప్రాంతంలో వివిధ నిర్మాణాల కారణంగా పాలవాగు, అయ్యన్నవాగులు వాటి స్వరూపాన్ని కోల్పోయాయి. కొండవీటి వాగు నీరు దిగువకు వెళ్లే పరిస్థితి లేకుండాపోయింది. నిర్మాణాలతో వాగులు మూసుకుపోవడంతో పాటు రోడ్ల ఎత్తును పెంచడంతో వాగు నుంచి వచ్చే వేల క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్లే పరిస్థితి లేక వేలాది ఎకరాల్లో పంటలు పూర్తిగా నీటమునిగాయి. ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రభుత్వం దృష్టిసారించకుండా కొండవీటి వాగు వరదను గాలికొదిలేయడంతో పరిస్థితి అధ్వానంగా తయారైంది. మరోవైపు.. తాడికొండ, తుళ్ళూరు, మేడికొండూరు, మంగళగిరి రూరల్ మండలాల్లోని సుమారు 40 వేల ఎకరాల్లో పంటలు కొండవీటి వాగు వరద ఉధృతికి ముంపుబారిన పడి సముద్రాన్ని తలపిస్తున్నాయి. ఎక్కడ చూసినా వరద నీరే ఉండటంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ప్రత్యామ్నాయ చర్యలు నిల్..ఇక మంగళవారం రాత్రి తాడికొండ మండలంలో 225 మిల్లీమీటర్లు, తుళ్ళూరు మండలంలో 180.2 మి.మీ., మేడికొండూరు 140.2, ఫిరంగిపురం 111.2, మంగళగిరి 194.8 మి.మీ., వర్షం కురిసింది. ఈ వర్షం నీరు అంతా కొండవీడు కొండల మీదుగా మేడికొండూరు, తాడికొండ, తుళ్ళూరు, తాడేపల్లి మండలాల మీదుగా ప్రకాశం బ్యారేజ్కు చేరాల్సి ఉంది. కానీ, కొండవీటి వాగు ప్రక్షాళనకు రూ.234 కోట్లతో టీడీపీ కూటమి ప్రభుత్వం తలపెట్టిన ఎత్తిపోతల పథకంలో ఎక్కడా ఎగువ నుంచి దిగువకు వరద నీరు పూర్తిగా వచ్చేలా ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోలేదు. నిజానికి.. వందల ఏళ్లుగా కొండవీటి వాగు పల్లపు ప్రాంతమైన రాజధాని ప్రాంతం నుంచే ప్రవహించేది. అయితే, ప్రస్తుతం దానిని మూసేసి ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లుచేయకపోవడంవల్లే రాజధాని ప్రాంతం ముంపునకు గురైందని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. మరోవైపు.. కాసుల కక్కుర్తి కోసం రాజధానిలో రిజర్వాయర్ల పేరుతో ఇతర నిర్మాణాలను చేపట్టడం కూడా వరద ముంపునకు కారణమైంది. దీంతో.. గత 25 ఏళ్లలో ఎప్పుడూ జరగని నష్టం ఇప్పుడీ ప్రాంతానికి వచ్చింది. ఇటు పంటలు మునగడంతో పాటు గ్రామాల్లో కూడా నీరు కదిలే పరిస్థితి లేక రాజధానితో పాటు పరిసర ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం..ఇదిలా ఉంటే.. గుంటూరు నుంచి రాజధానికి వెళ్లేందుకు ప్రధాన రహదారి అమరావతి–గుంటూరు రోడ్డే. అయితే, ఈ మార్గంలో లాం వద్ద కొండవీటి వాగు ఏటా ఉప్పొంగి ప్రవహిస్తుంది. ఇక్కడ వంతెన నిర్మాణం హామీ ఇప్పటివరకు ఆచరణకు నోచుకోలేదు. » మరో మార్గం.. జాతీయ రహదారి మీదుగా కంతేరు–తాడికొండ మధ్యలో ఎర్రవాగు వద్ద కూడా వరద పొంగి ప్రవహిస్తుంది. ఇక్కడ కూడా వంతెన నిర్మాణం చేయాల్సి ఉంది. ఆ దిశగా కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. » మంగళగిరి మీదుగా రాజధానికి ప్రవేశించాలన్నా నీరుకొండ–పెదపరిమి రహదారి వద్ద భారీ వర్షం కురిస్తే వారం పాటు రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఐనవోలు మీదుగా కూడా రహదారి పూర్తిగా దిగ్బంధం అవుతుంది. » ఒక్క చంద్రబాబు నివాసం మీదుగా వచ్చే కరకట్ట రహదారి మినహా రాజధానికి రావాలంటే ఏ ఒక్క రోడ్డు అందుబాటులో లేకపోవడంతో రాష్ట్ర సచివాలయానికి ఉద్యోగులు వెళ్లలేక నానా ఇబ్బందులు పడ్డారు. -
నేడు అక్కడక్కడా అతిభారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాలకు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో బుధవారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. ఇది మరింత బలపడి గురువారం మధ్యాహ్నానికి వాయుగుండంగా మారే అవకాశాలున్నాయి. ఆదివారానికి దక్షిణ ఒడిశా మీదుగా కదులుతూ తీరం దాటనుంది. మరోవైపు వాయవ్య బంగాళాఖాతం మీదుగా ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా, తెలంగాణ వరకూ తూర్పు పశ్చిమ ద్రోణి విస్తరించి ఉంది. అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. రాయలసీమలో భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం కూడా రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు పడనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా గురు, శుక్రవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. వర్షాల ప్రభావం ఈనెల 17 వరకు ఉంటుందని.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో 18న కూడా కొనసాగే సూచనలున్నాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు.. ఈనెల మూడో వారంలో కోస్తాంధ్ర తీరాల్లో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని.. ఆ తర్వాత మళ్లీ వర్షాలు పుంజుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. -
కృష్ణవేణి.. ఉగ్రరూపిణి
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు తోడు ఉప నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. ప్రకాశం బ్యారేజీలోకి బుధవారం రాత్రి 9 గంటలకు వరద 3,97,250 క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండగా.. అంతే పరిమాణంలో 70 గేట్ల ద్వారా అధికారులు సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఇక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువ నుంచి గురువారం ఉదయానికి ప్రకాశం బ్యారేజీలోకి వచ్చే వరద ప్రవాహం 4 నుంచి 4.50 లక్షల క్యూసెక్కులకు చేరుతుందని అంచనా. ఈ నేపథ్యంలో.. కృష్ణా నదీ తీర ప్రాంతంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మూడ్రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా, ప్రధాన ఉప నది తుంగభద్ర పరవళ్లు తొక్కుతున్నాయి. బుడమేరు పరీవాహక ప్రాంతంలో కూడా విస్తారంగా వర్షాలు కురవడంతో బుధవారం రాత్రికి 10–15 వేల క్యూసెక్కుల వరద వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మున్నేరు, కొండవీటి వాగు తదితర వాగుల ద్వారా ప్రకాశం బ్యారేజీలోకి భారీగా వరద వస్తోంది. విజయవాడలో పలు ప్రాంతాలు జలమయం భారీ వర్షాలకు విజయవాడతోపాటు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో డ్రెయిన్లు పొంగడంతో రోడ్ల మీద 4 అడుగుల మేర నీరు నిలిచింది. వందల సంఖ్యలో ఇళ్లలోకి నీరుచేరింది. బుడమేరు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. హంసలదీవి వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది. పమిడిముక్కల మండలం ఐనంపూడిలో పిడుగుపడి పశువులపాక దగ్ధం కావటంతో రెండు గేదెలు, ఒక ఎద్దు మృతిచెందాయి. కాజ టోల్గేటు వద్ద నిలిచిన ట్రాఫిక్ మంగళగిరి నగర పరిధిలోని కాజ టోల్గేటు వద్ద జాతీయ రహదారిపై భారీగా నీరు నిలిచిపోవడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. టోల్ప్లాజా వద్ద మూడడుగుల నీరు ఉండడంతో గుంటూరు నుంచి విజయవాడ వైపు పలు లైన్లలో రాకపోకలు నిలిపివేశారు. మంగళగిరి టిడ్కో గృహ సముదాయంలో నీరు నిలిచిపోయింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని వివిధ గ్రామాల్లో ప్రధాన రహదారులపై వాగులు పొంగి పొర్లడంతో రాకపోకలు నిలిపోయాయి. గుంటూరు రోడ్లు, డ్రెయిన్లు, మార్కెట్లు, జలమయమయ్యాయి. పిడుగురాళ్ల మండలం జూలకల్లు, గుత్తికొండ, దాచేపల్లి, కారంపూడి మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. అక్కడక్కడ బ్రిడ్జిలు, చప్టాలు కూలిపోయాయి. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండల పరిధిలోని దొంగలవాగు ఉధృతంగా ప్రవహించటంతో కర్నూలు రహదారిలో కొత్తూరు వద్ద ఉన్న వెలుగొండ ప్రాజెక్టు సొరంగ నిర్మాణ ప్రాంతం వద్ద బుధవారం ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ‘పశ్చిమ’లోనూ భారీ వర్షం పశి్చమ గోదావరి జిల్లా భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పెనుగొండ, ఉండి నియోజకవర్గాల్లో కుండపోత వర్షంతో పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్ర«దాన రహదారులపై సైతం వర్షం నీరు నిలిచిపోవడంతో వాహన చోదకులు ఇక్కట్లకు గురయ్యారు. ఏలూరు జిల్లాలోనూ కుండపోత వర్షం కురిసింది. కాకినాడ, జిల్లాలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రహదారులు కనిపించని విధంగా జలమయమయ్యాయి. మూడు జిల్లాల్లో పంటలకు నష్టం వర్షాల వల్ల ఖరీఫ్ పంటలు నీటమునుగుతున్నాయి. గుంటూరు, ఎన్టీఆర్, బాపట్ల జిల్లాల్లో పంటలు ముంపునకు గురయ్యాయి. ప్రాథమిక అంచనా ప్రకారం.. ఈ మూడు జిల్లాల పరిధిలో 161 గ్రామాల్లో 1.12 లక్షల ఎకరాల్లోని పంటలు ముంపుబారిన పడ్డాయి. 52,924 మంది రైతులకు చెందిన పంటలు దెబ్బతిన్నాయి. అత్యధికంగా 1.02 లక్షల ఎకరాల్లో వరి, 8,550 ఎకరాల్లో పత్తి, వెయ్యి ఎకరాల్లో మినుము, 300 ఎకరాల్లో వేరుశనగ పంటలు ముంపునకు గురయ్యాయి. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోనూ వందల ఎకరాల్లో వరి పైర్లు నేలకొరిగాయి. ఉమ్మడి గోదావరి జిల్లాల్లోనూ అక్కడక్కడ వరి పంటలు నీట మునిగాయి. కర్నూలు జిల్లాలో పత్తి, ఉల్లి, మొక్కజొన్న, కంది, టమాట పంటలు నీటమునిగి కుళ్లిపోతుండడంతో రైతులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. నంద్యాల జిల్లాలోనూ వరి పైరు నీట మునిగింది. మినుము, మొక్కజొన్న పంటలకు తీవ్రనష్టం వాటిల్లుతోంది. అప్రమత్తంగా ఉండండి: సీఎంరాష్ట్రంలో వచ్చే రెండు, మూడ్రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. కృష్ణా పరివాహక ప్రాంతంలో వాగులు, వంకల నుంచి వచ్చే ఆకస్మిక వరద ప్రవాహాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ దిగువ ప్రాంతాలకు సమాచారం ఇవ్వాలని సూచించారు.సీఎం చంద్రబాబు బుధవారం తన క్యాంపు కార్యాలయంలో మంత్రులు, అధికారులతో రాష్ట్రంలో వర్షాల పరిస్థితిపై సమీక్షించారు. ప్రకాశం బ్యారేజీకి దిగువ ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేయాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. జిల్లాల్లో వర్షాల పరిస్థితిపై కలెక్టర్లు ఎప్పటికప్పుడు రైతులకు సమాచారం ఇవ్వాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీటిని తొలగించాలని చెప్పారు. బెజవాడలో ముగ్గురు దుర్మరణం భారీ వర్షాలకు విజయవాడలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. పాతబస్తీ గులాం మొహిద్దీన్ వీధిలో భూగర్భ డ్రైనేజీ మరమ్మతుల నిమిత్తం నగరపాలక సంస్థ సిబ్బంది తీసిన గోతిలోపడి కృష్ణా జిల్లా హోల్సేల్ డ్రగ్ ట్రేడ్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు టీవీ మధుసూదనరావు మరణించాడు. మరో ఘటనలో.. పాతబస్తీ సుబ్బరామయ్య వీధిలోని జెండా చెట్టు వద్ద ప్రధాన అవుట్ఫాల్ డ్రెయిన్ సమీపంలో ముర్తుజా అనే వ్యక్తి వర్షపు నీటిలో పడి కొట్టుకుపోయాడు. లయోలా కాలేజీ సమీపంలో చెట్టు పడటంతో ఓ వ్యక్తిపై ప్రాణాలు విడిచాడు. కాగా.. కృష్ణా నదిలో తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెం వద్ద ఇసుకను తోడే బుల్డోజర్ స్థానం మార్చేందుకు దిగిన కామేశ్వరరావు (19), వీర ఉపేంద్ర (22) గల్లంతు కాగా.. మరో యువకుడు సురక్షితంగా బయటపడ్డాడు. -
తెలుగు రాష్ట్రాలకు హై అలర్ట్.. వానలే వానలు (ఫొటోలు)
-
నీట మునిగిన ‘ఏపీ రాజధాని’
సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. అమరావతి నీట మునిగింది. అమరావతి కోర్ క్యాపిటల్ వరద ముంపులో చిక్కుకుంది. అమరావతి రాజధాని గ్రామాలు వర్షానికి మునిగాయి. ఏపీ రాజధాని అమరావతి.. కృష్ణా నదిని తలపిస్తోంది. రాత్రి కురిసిన వర్షానికి రాజధానిలోకి భారీ స్థాయిలో వరద నీరు చేరుకుంది. కొండవీటి వాగు, పాలవాగు పొంగిపొర్లుతుంది. నీరుకొండ వద్ద కొండవీటి వాగు పొంగి పొర్లుతోంది. దీంతో కనుచూపుమేరలో రాజధానిలో భూమి కనిపించడం లేదు.వేల ఎకరాలు భూములు నీటమునిగాయి. నీరుకొండ వద్ద వర్షపు నీరు గంట గంటకు పెరుగుతోంది. శాఖమూరు, ఐనవోలు, కృష్ణాయ పాలెం, నీరుకొండ, కురగల్లు, ఎర్రబాలెం, పెనుమాక, బేతపూడి పొలాల్లోకి వరద నీరు చేరింది. ఎస్ఆర్ఏం యూనివర్సిటీ చుట్టూ భారీగా వరద నీరు చేరుతోంది. హైకోర్టుకు వెళ్లే రోడ్డు మార్గం జలమయంగా మారింది. రాజధాని నిర్మాణాల చుట్టూ వరద నీరు పెరుగుతోంది. పొంగి ప్రవహిస్తున్న కొండవీటి వాగు, పాలవాగుతో వేలాది ఎకరాల నీటమునిగాయి.ప్రకాశం బ్యారేజీకి వరద నీరు భారీగా పోటెత్తుతోంది. దీంతో అధికారులు.. మొత్తం 70 గేట్లను పూర్తిగా ఎత్తివేశారు. విజయవాడకు మరోసారి వరద ముప్పు పొంచి ఉంది. భారీ వర్షాలతో డ్రైనేజీలు, మ్యాన్ హోల్స్ పొంగిపొర్లుతున్నాయి. కృష్ణా నది ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. గుంటూరు, తాడికొండ మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. మంగళగిరిలో ఇళ్లలోకి వరద నీరు చేరింది.నీట మునిగిన అమరావతి ఐకానిక్ టవర్ నిర్మాణంఅమరావతి ఐకానిక్ టవర్ నిర్మాణం కూడా నీట మునిగిపోయింది. ఐకానిక్ టవర్ నిర్మాణం చుట్టూ వరద నీరు చేరింది. రాయపూడిలో ఐకానిక్ టవర్ నిర్మాణం అవుతోంది. అమరావతి ఐకానిక్ టవర్ ప్రాంతం చెరువులా మారిపోయింది. -
గుంటూరు కాజా టోల్ గేట్ దగ్గర భారీగా వరద
-
ఏపీవాసులకు బిగ్ అలర్ట్.. నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు
Heavy Rains In AP Updates:బుడమేరు వాగు ఉధృతిభారీవర్షాలతో బుడమేరులో పెరిగిన నీటి ప్రవాహంసరైన సమాచారం లేక ఆందోళన చెందుతున్న ప్రజలుబుడమేరు మధ్య కట్ట, గుణదల తదితర ప్రాంతాలలో పర్యటించిన సీపీఎం నేత సీహెచ్ బాబురావులోతట్టు ప్రాంతాల్లో మునిగిన కొన్ని ఇళ్లను సందర్శించిన బాబురావు, సీపీఎం నేతలుకృష్ణానది వరద ముంపు, కృష్ణ కరకట్ట ప్రాంత ప్రజలను పరామర్శించిన సీపీఎం బృందంవిజయవాడలో దంచికొడుతోన్న వర్షంరోడ్లు జలమయంపొంగిపొర్లుతున్న డ్రైన్లులోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి చేరుతున్న వర్షపు నీరువిద్యాధరపురంలో పలు ఇళ్లలోకి చేరిన వర్షపునీరుగన్నవరం నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షంవిజయవాడ రూరల్ మండలం రామవరప్పాడు, ప్రసాదంపాడులో జాతీయ రహదారిపైకి చేరిన వర్షపు నీరు.తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు.సాక్షి, విజయవాడ: ఏపీలో రాబోయే నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఆవర్తనం అల్పపీడనంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. తీరం వెంబడి ఈదురుగాలులు కొనసాగుతున్నాయి. ఏలూరు, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కృష్ణనది పరీవాహక ప్రాంత ప్రజలకు అధికారులు అలెర్ట్ జారీ చేశారు. విజయవాడలో బుడమేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. గుణదల వంతెనపై నుంచి బుడమేరు ప్రవాహం కొనసాగుతోంది. ఇబ్రహీంపట్నంలోని చినలంక, పెద్దలంక ప్రాంతాలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తాడికొండ మండలం పొన్నెకల్లులో చెరువుకు గండి పడింది. ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంటూరు కాజా టోల్ గేట్ దగ్గర భారీగా వరద నీరు చేరుకుంది. కోల్కత్తా-చెన్నై జాతీయ రహదారిపై వాహనాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో నిన్న(మంగళవారం) రాత్రి నుండి కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షానికి పలు గ్రామాలు జలమయమయ్యాయి. వాగులు పొంగి వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. పిడుగురాళ్ల మండలం జూలకల్లు గ్రామ శివారులో వాగు పొంగి జూలకల్లు పిడుగురాళ్ల గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. పిడుగురాళ్ల మండలం గుత్తికొండ గ్రామంలో రహదారిపై నుండి పారుతున్న వరద నీరు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాచేపల్లి పట్టణంలోని రజక కాలనీ, బొడ్రాయి సెంటర్తో పాటు పలు కాలనీలు జలమయమయ్యాయి.కేసానుపల్లి గ్రామంలో వాగు పొంగిపొర్లుతోంది. కారంపూడి-దాచేపల్లి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మాచవరం మండలం రుక్మిణి పురం గ్రామం వద్ద పిల్లేరు వాగు పొంగి పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మాచవరం మండలం గాంధీనగర్ వద్ద వరద నీటితో వాగు పొంగి పొర్లడంతో మాచవరం-పిడుగురాళ్ల గ్రామాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. -
విజయవాడ: మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం.. ఇద్దరు బలి
సాక్షి, విజయవాడ: మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇద్దరి నిండు ప్రాణాలు బలయ్యాయి. మ్యాన్ హోల్ కోసం తవ్విన గుంతలో పడి ఒకరు, చెట్టు మీదపడి మరొకరు మృతిచెందారు. మృతులను టీవీ మధుసూదన్, మూర్తాజా గుర్తించారు.గులాం మొహిద్దీన్ స్ట్రీట్లో మ్యాన్ హోల్ కోసం నగరపాలక సంస్థ అధికారులు భారీ గుంత తవ్వించారు. భారీ గోతుల వద్ద అధికారులు ఎలాంటి ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయలేదు. గత రాత్రి కురిసిన వర్షానికి రోడ్లు చెరువుల్లా మారాయి. వీఎంసీ అధికారులు తవ్విన గోతిలో టీవీ మధుసూదన్ అనే వ్యక్తి మృతి చెందాడు. వీఎంసీ అధికారుల నిర్లక్ష్యంపై మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, వైఎస్సార్షీపీ నేత పోతిన మహేష్ మండిపడ్డారు.పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో నిన్న రాత్రి నుండి కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షానికి పలు గ్రామాలు జలమయమయ్యాయి వాగులు పొంగి వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. పిడుగురాళ్ల మండలం జూలకల్లు గ్రామ శివారులో వాగు పొంగి జూలకల్లు పిడుగురాళ్ల గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. పిడుగురాళ్ల మండలం గుత్తికొండ గ్రామంలో రహదారిపై నుండి పారుతున్న వరద నీరు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.దాచేపల్లి పట్టణంలోని రజక కాలనీ, బొడ్రాయి సెంటర్ తో పాటు పలు కాలనీలు జలమయమయ్యాయి. కేసానుపల్లి గ్రామంలో వాగు పొంగి పొర్లుతోంది. కారంపూడి దాచేపల్లి గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మాచవరం మండలం శ్రీరుక్మిణిపురం గ్రామం వద్ద పిల్లేరు వాగు పొంగి పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం కలిగింది. మాచవరం మండలం గాంధీనగర్ వద్ద వరద నీటితో వాగు పొంగి పొర్లడంతో మాచవరం పిడుగురాళ్ల గ్రామాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. -
తెలంగాణకు వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు
హైదరాబాద్: తెలంగాణ అంతటికీ వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. నాలుగు నుంచి ఐదు రోజులపాటు వర్షాలు విస్తారంగా కురుస్తాయని తెలిపింది. ఈ క్రమంలో.. బుధ, గురువారాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న మీడియాకు వెల్లడించారు. సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, మేడ్చల్-మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, భద్రాద్రి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు రెడ్ కలర్ వార్నింగ్ జారీ చేసినట్లు నాగరత్న తెలిపారు. అలాగే.. హైదరాబాద్, హనుమకొండ, ఆదిలాబాద్, జనగామ, కామారెడ్డి, కుమురం భీం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, నల్గొండ, రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ కలర్ వార్నింగ్ జారీ చేసినట్లు చెప్పారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ‘‘నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశాం. రేపు మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్ష తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఇవాళ జీహెచ్ఎంసీ పరిధిలో రెడ్ అలర్ట్.. రేపు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశాం. రాష్ట్రంలో ఐదు రోజుల పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. ఉత్తర తెలంగాణలో 17న వర్ష తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయి’’ అని ఆమె అన్నారు. రాష్ట్రమంతటా రేపు కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వివరించారామె.అప్రమత్తమైన జీహెచ్ఎంసీభారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. సాయంత్రం నుంచి అధిక వర్షాలు పడే అవకాశం ఉండడంతో.. ఎమర్జెన్సీ బృందాలను సిద్ధం చేసింది. మరోవైపు.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు రావాలని, మ్యాన్హోల్స్ను ఎవరూ తెరవొద్దని హెచ్చరించింది. -
హైదరాబాద్కు భారీ వర్ష సూచన!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఉత్తర ప్రాంతాల్లో బుధ, గురు, శుక్రవారాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని మంగళవారం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ప్రకటించారు. ఇతర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని, సరాసరి 10 నుంచి 15 సెం.మీ కంటే ఎక్కువ, కొన్ని చోట్ల 20 సెం.మీ. కంటే ఎక్కువ వర్షం కురవవచ్చని పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ఆయా రోజుల్లో వాహనాల కదలికలను తగ్గించాలని అభ్యర్థించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండి అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. -
వరంగల్ను ముంచెత్తిన వరద
సాక్షి, వరంగల్/ఖమ్మం/నల్లగొండ నెట్వర్క్: వరంగల్ నగరాన్ని వరద ముంచెత్తింది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు వాన దంచికొట్టింది. పలు కాలనీలు జలమయమయ్యాయి. వరంగల్ రైల్వేస్టేషన్లో ఉన్న మూడు పట్టా లైన్లు నీట మునిగి రైళ్ల రాకపోకలకు కొంతసేపు అంతరాయం కలిగింది. రైల్వే సిబ్బంది నీటిని బయటకు పంపడంతో రైళ్ల రాకపోకలు సాగాయి. హంటర్ బ్రిడ్జ్ రోడ్డులోకి భారీగా వరద నీరు చేరడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాశీకుంట వాంబేకాలనీలోని ఇంట్లోకి నీరు వచ్చి మంచం మునగడంతో దానిపై పడుకున్న వృద్ధురాలు పసునూటి బుచ్చమ్మ చనిపోయింది. కొన్ని ప్రాంతాల్లో వరద నీటిలో చిక్కుకున్న వారిని పోలీసులు రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఖిలా వరంగల్ కోట నీటిలో మునిగింది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం నారాయణపురం గ్రామంలో గేదెలను బయటకు తోలేందుకు ఆకేరు వాగులో దిగిన పశువుల కాపరి కందికగ్ల ఉప్పలయ్య వరదనీటిలో గల్లంతయ్యారు. ∙గొల్లబుద్దారం ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలకు వరద ప్రవా హం ఒక్కసారిగా పెరిగిపోవడంతో పాఠశాల ప్రాంగణం ఒక చిన్న చెరువును తలపించింది. దాదాపు 400 మంది విద్యార్థులు పాఠశాల లోపలే చిక్కుకుపోయి విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఖమ్మం జిల్లాలో....ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. పాలేరు రిజర్వాయర్ సామర్థ్యం 23 అడుగులు కాగా 23.15 అడుగులు, వైరా రిజర్వాయర్ 18.03 అడుగులకుగాను 18.08 అడుగుల మేర ప్రవాహంతో పోటెత్తుతున్నాయి. ఇక తిరుమలాయపాలెం మండలం రాకాసితండాను గతేడాది ఆ కేరు వరద ముంచెత్తగా ఈసారి మంగళవారం సాయంత్రాని కి ఆకేరు వరద పెరిగి సీతారామ ఆక్వాటెక్ట్కు తాకి ప్రవహి స్తుండడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.ఉమ్మడి నల్లగొండ జిల్లాలో....ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. తిరుమలగిరి మండలంలోని తొండ గ్రామం వద్ద వలిగొండ– తొర్రూరు ప్రధాన రహదారిపై బ్రిడ్జి పనులు సాగుతుండగా, తాత్కాలికంగా మట్టి రోడ్డు వేశారు. వరద నీరు దిగువకు వెళ్లక అక్కడే చేరి వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. వెలిశాలలో ఎస్ఆర్ఎస్పీ కాల్వ లైనింగ్ దెబ్బతిన్నది. భూదాన్పోచంపల్లి మండలం జూలూరు, రుద్రవెల్లి గ్రామాల మధ్య గల లోలెవల్ బ్రిడ్జి పై నుంచి మూసీనది ఉధృతి కొనసాగింది. దీంతో పోచంపల్లి నుంచి బీబీనగర్కు రాకపోకలు నిలిచిపోయాయి.సంగారెడ్డి జిల్లాలో....రాయికోడ్(అందోల్): సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం యూసుఫ్పూర్ గ్రామానికి చెందిన ఎం. శ్రీనివాస్(35) మంగళవారం రాయికోడ్ నుంచి స్వగ్రామానికి పయనమ య్యాడు. గ్రామ సమీపానికి చేరుకోగానే వాగులో వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. శ్రీనివాస్ వరద నీటిలో నుంచి గ్రామం వైపు దాటేందుకు ప్రయత్నించాడు. వరద ఉధృతికి ఒక్కసారిగా వరద నీటిలో కొట్టుకుపోయి మరణించాడు. నీళ్లు నిలిచి.. ఒండ్రు చేరి..సంగారెడ్డి జిల్లాలో పత్తి చేలన్నీ నీట మునిగాయి. కొన్ని చోట్ల మొక్కలు ఎర్రగా, మరికొన్నిచోట్ల నల్లగా మారి మురిగిపోయాయి. భారీ వర్షం పడినప్పుడు పొలాల్లో నీళ్లు పారుతుండటంతో ఒండ్రుమట్టి వచ్చి చేరుతోంది. -
దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
సాక్షి, అమరావతి: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం ప్రకాశం జిల్లా మద్దిపాడులో అత్యధికంగా 9.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాకినాడ జిల్లా కోటనందూరులో 7.6, సామర్లకోటలో 7.2, అల్లూరి సీతారామరాజు జిల్లా కరిముక్కిపుట్టిలో 6.8, ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో 5.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వాయవ్య బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో వచ్చే రెండు రోజులు కోస్తాంధ్రలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని.. శనివారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకూడదని హెచ్చరించింది. పిడుగులతో కూడిన వర్షాల నేపథ్యంలో ప్రజలు చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు, హోర్డింగుల వద్ద ఉండవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఇప్పటికే ప్రభావిత జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. బుధవారం పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, తూర్పుగోదావరి, నంద్యాల జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలకు ఆస్కారముందన్నారు. -
72 గంటలు హై అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. మూడు రోజుల పాటు అధికారులు, ఉద్యోగులు, ఇతర సిబ్బంది సెలవులను రద్దు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ మేరకు అధికారులను ఆదేశించారు. పోలీసు ఉన్నతాధికారులు కూడా ఆన్డ్యూటీలో ఉండాలన్నారు. హైదరాబాద్తో పాటు వరద ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాల్లో అప్రమత్తంగా ఉండాలని, ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. ముంపు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం జరగడానికి వీల్లేదని స్పష్టం చేశారు. వరద ముంపు పరిస్థితుల్లో ట్రాఫిక్ సమస్యను నివారించడానికి శాంతిభద్రతల విభాగం పోలీసుల సేవలను కూడా వినియోగించుకోవాలని చెప్పారు. రాబోయే 72 గంటలు అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండి సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ం నిర్వహించారు. మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ జితేందర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. కాజ్వేలు, వంతెనలపై రాకపోకలు ఆపండి ‘లోతట్టు కాజ్వేలు, ఉధృతంగా ప్రవహించే నదులు, వాగులు, వంకల వంతెనలపై నుంచి రాకపోకలు లేకుండా చూడాలి. పశువులు, గొర్రెలు, మేకల కాపర్లు తరచూ వాగుల్లో చిక్కుకుపోతున్నారు. వారిని అప్రమత్తం చేయాలి. ఎక్కడైనా ప్రమాదవశాత్తు చిక్కుకుంటే వారిని తక్షణమే బయటకు తీసుకువచ్చే ఏర్పాట్లు చేయాలి. విద్యుత్ శాఖ అధికారులు ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలి. మొబైల్ ట్రాన్స్ఫార్మర్లు, జనరేటర్లు సిద్ధంగా ఉంచుకోవాలి. డ్రైనేజ్ వ్యవస్థను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. గతంలో ఖమ్మంలో 2 గంటల్లో 42 సెం.మీ వర్షం పడింది. అలాంటి పరిస్థితులను కూడా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. మన దగ్గర 24 గంటల్లో 2 సెం.మీ వర్షాన్ని దృష్టిలో ఉంచుకొని పట్టణాలు నిర్మాణం అయ్యాయి. కాబట్టి ఒకటీ రెండు గంటల్లోనే 20, 30 సెంటీమీటర్ల వర్షం (క్లౌడ్ బరస్ట్) పడితే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. అలాంటి పరిస్థితులను కూడా ఎదుర్కొనేలా సన్నద్ధం కావాలి. అత్యధిక స్థాయిలో వర్షాలు పడే జిల్లాలు ప్రాంతాలను ముందుగానే గుర్తించి ప్రజలను అప్రమత్తం చేయాలి. ఆయా జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించాలి. సహాయక చర్యలకు అవసరమైన నిధులు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. నీటి విడుదలపై అలర్ట్ చేయాలి.. ‘అకస్మిక వరదలు సంభవించినపుడు ఎయిర్ లిఫ్టింగ్ చేసేందుకు అవసరమైన హెలికాప్టర్లు ఉండేలా చూసుకోవాలి. పీహెచ్సీలు, సీహెచ్సీల్లో అవసరమైన మందులు ఉంచాలి. గర్భిణులను తక్షణమే తరలించేలా అంబులెన్స్లు అందుబాటులో ఉంచాలి. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలి. అవసరమైతే పాఠశాలలు, కళాశాలలకు సెలవు ఇవ్వడంపై జిల్లా కలెక్టర్లు నిర్ణయం తీసుకోవాలి. ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ చేసేలా చర్యలు తీసుకోవాలి. ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లోకి ఇన్ఫ్లో, ఔట్ ఫ్లోపై నీటిపారుదల శాఖ పూర్తి అవగాహనతో ఉండాలి. ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలపై పూర్తి సమాచారం లోతట్టు ప్రాంతాల ప్రజలకు తెలియజేయాలి. చెరువులు, కుంటలు కట్టలు తెగే ప్రమాదం ఉన్నందున ముందు జాగ్రత్తలు తీసుకోవాలి..’ అని రేవంత్ ఆదేశించారు. జిల్లాలు కమాండ్ కంట్రోల్తో టచ్లో ఉండాలి.. ‘భారీ వర్షాల సమయంలో ప్రజలు బయటకు రాకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలి. అన్ని జిల్లాలను కమాండ్ కంట్రోల్తో అనుసంధానం చేయాలి. వారికి ఎప్పటికప్పుడు అలర్ట్ సమాచారం ఇవ్వాలి. డిజాస్టర్ మేనేజ్మెంట్తో వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసుకోవాలి. తద్వారా అందరూ అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. వర్షాలు, వరదల పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఎఫ్ఎం రేడియోలలో అలర్ట్ చేయాలి. సాధ్యమైనంత వరకు రోడ్లపై ట్రాఫిక్ తక్కువగా ఉండేలా చూడాలి. మీడియా తప్పుడు వార్తలతో భయానక వాతావరణం సృష్టించే ప్రయత్నం చేయొద్దు. సమాచార శాఖ మీడియాకు సరైన సమాచారం అందించేలా చర్యలు తీసుకోవాలి..’ అని సీఎం సూచించారు. అన్ని విభాగాలూ సమన్వయంతో పని చేయాలి ‘హైదరాబాద్లో వరదలపై హైడ్రా అప్రమత్తంగా వ్యవహరించాలి. 24 గంటలూ అందుబాటులో ఉండాలి. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు సమన్వయంతో పని చేయాలి. జీహెచ్ఎంసీ, హైడ్రా, పోలీస్, విపత్తు నిర్వహణ, అగ్నిమాపక సిబ్బంది.. ప్రతి విభాగం సమన్వయంతో పని చేయాలి. అత్యవసర సమయాల్లో ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేయాలి. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి..’ అని ముఖ్యమంత్రి ఆదేశించారు. -
వచ్చే మూడ్రోజులు వర్షాలు
సాక్షి, అమరావతి/తిరుపతి అర్బన్/కర్నూలు (అగ్రికల్చర్)/అనంతపురం అగ్రికల్చర్: ఉత్తర కోస్తాంధ్ర మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో మంగళవారం పలుచోట్ల పిడుగులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. 13వ తేదీ నాటికి వాయవ్య, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేందుకు ఆస్కారముందని తెలిపింది. దీని ప్రభావంతో బుధ, గురువారాల్లో కోస్తాంధ్రలో చెదురుముదురుగా భారీ వర్షాలు కురిసేందుకు అవకాశమున్నట్లు వెల్లడించింది.పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉంది. దీంతో.. ఈనెల 12న ఉమ్మడి కర్నూలు జిల్లాకు ఎల్లో అలర్ట్.. 13న నంద్యాల జిల్లాకు ఆరెంజ్ అలర్ట్, కర్నూలు జిల్లాకు ఎల్లో అలర్ట్.. 14న ఉమ్మడి జిల్లాకు ఆరెంజ్ అలర్ట్.. 15న ఉమ్మడి జిల్లాకు ఎల్లో అలర్ట్ను వాతావరణ శాఖ ప్రకటించింది. సహాయక చర్యలకు టోల్ఫ్రీ నెంబర్లు.. వర్షాల నేపథ్యంలో సహాయక చర్యల కోసం విపత్తుల నిర్వహణ సంస్థలోని కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 18004250101ను సంప్రదించాలని ఆ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ కోరారు. సోమవారానికి కాకినాడ జిల్లా రౌతులపూడిలో 4.2, అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలులో 4.1, అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 4 సెం.మీ. అత్యధిక వర్షపాతం నమోదైంది. -
Telangana: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 13న అల్పపీడనం ఏర్పడే ఛాన్స్
-
Hyd: అసంపూర్తిగా వదిలేసిన SNDP నాలాలో పడిన డెలివరీ బాయ్
-
తెలుగు రాష్ట్రాలకు హైఅలర్ట్.. భారీ నుంచి అతి భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 13న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈశాన్య బంగాళాఖాతం వరకు ద్రోణి కొనసాగుతోంది. ఇవాళ తెలంగాణలోని 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయ్యింది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు(సోమవారం) కూడా తెలంగాణలోని 19 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయ్యింది.ఏపీలో నేటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇవాళ్టి నుంచి శుక్రవారం వరకు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. పార్వతీపురం, అల్లూరి, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.కాగా, హైదరాబాద్ మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. నిన్న (శనివారం) రాత్రి 8:30 గంటల నుంచి సుమారు రెండు గంటలపాటు ఏకధాటిగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం దంచికొట్టింది. దీంతో ప్రధాన రహదారులన్నీ చెరువులను తలపించగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఫలితంగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించింది. పలు అపార్ట్మెంట్లలోకి వరదనీరు వచ్చి చేరింది.ముఖ్యంగా నగర శివారు ప్రాంతాలు వర్ష బీభత్సానికి వణికిపోయాయి. రాత్రి 11 గంటల వరకు నగర శివారులోని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం తొర్రూర్ గ్రామ పంచాయతీ పరిధిలో అత్యధికంగా 13.5 సెం.మీ. వర్షం కురిసింది. హయత్నగర్, అబ్దుల్లాపూర్మెట్, వనస్థలిపురం, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షానికి హైదరాబాద్–విజయవాడ హైవేపై పెద్దఅంబర్పేట్ వద్ద రోడ్డుపై భారీగా ట్రాఫిక్జామ్ ఏర్పడింది.ఫలితంగా వాహనదారులు, ఊళ్లకు పయనమైన ప్రయాణికులు నరకయాతన అనుభవించారు. మరోవైపు నగరంలోని ప్రధాన ప్రాంతాలైన బేగంబజార్, ఖైరతాబాద్, హిమాయత్నగర్, శ్రీనగర్ కాలనీ తదితర ప్రాంతాల్లోనూ భారీ వర్షానికి వాహనదారులు ఇక్కట్లు పడ్డారు.ప్రధాన రహదారులపై నీళ్లు నిలిచిన చోట్ల హైడ్రా అధికారులు మోటార్లతో వరద నీటిని తోడారు. ట్రాఫిక్ పోలీసులు సైతం ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు శ్రమించారు. కాగా, ఈ నెల 15 వరకు నగరంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. -
ఉరిమిన వరుణుడు
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరాన్ని మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. శనివారం రాత్రి 8:30 గంటల నుంచి సుమారు రెండు గంటలపాటు ఏకధాటిగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం దంచికొట్టింది. దీంతో ప్రధాన రహదారులన్నీ చెరువులను తలపించగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఫలితంగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించింది. పలు అపార్ట్మెంట్లలోకి వరదనీరు వచ్చి చేరింది. ముఖ్యంగా నగర శివారు ప్రాంతాలు వర్ష బీభత్సానికి వణికిపోయాయి. రాత్రి 11 గంటల వరకు నగర శివారులోని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం తొర్రూర్ గ్రామ పంచాయతీ పరిధిలో అత్యధికంగా 13.5 సెం.మీ. వర్షం కురిసింది. హయత్నగర్, అబ్దుల్లాపూర్మెట్, వనస్థలిపురం, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షానికి హైదరాబాద్–విజయవాడ హైవేపై పెద్దఅంబర్పేట్ వద్ద రోడ్డుపై భారీగా ట్రాఫిక్జామ్ ఏర్పడింది. ఫలితంగా వాహనదారులు, ఊళ్లకు పయనమైన ప్రయాణికులు నరకయాతన అనుభవించారు. మరోవైపు నగరంలోని ప్రధాన ప్రాంతాలైన బేగంబజార్, ఖైరతాబాద్, హిమాయత్నగర్, శ్రీనగర్ కాలనీ తదితర ప్రాంతాల్లోనూ భారీ వర్షానికి వాహనదారులు ఇక్కట్లు పడ్డారు. ప్రధాన రహదారులపై నీళ్లు నిలిచిన చోట్ల హైడ్రా అధికారులు మోటార్లతో వరద నీటిని తోడారు. ట్రాఫిక్ పోలీసులు సైతం ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు శ్రమించారు. కాగా, ఈ నెల 15 వరకు నగరంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. -
భారీ వర్షాలు.. ఢిల్లీలో పెను విషాదం
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. నిన్న(శుక్రవారం) రాత్రి నుంచి కురుస్తున్న కుండపోత వర్షం కారణంగా పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. జైత్పూర్లో శనివారం ఉదయం గోడ కూలిపోవడంతో ఎనిమిది మంది మృతిచెందారు.మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. కొంతమంది శిథిలాల కింద చిక్కుకున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. రంగంలోకి దిగిన పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.కాగా, శనివారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కుంభవృష్టి వర్షం కారణంగా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా, భారీ వర్షాలు కారణంగా విమాన సర్వీసులకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. 200లకు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.#दिल्ली के जैतपुर थाना इलाके में आज एक हादसा - लगभग 100 फुट लंबी दीवार गिर गई जिसकी चपेट में पास की कई झुग्गियां आ गई है। pic.twitter.com/FsEMHTY8o6— Rohit Chaudhary (@rohitch131298) August 9, 2025 -
తెలంగాణ వ్యాప్తంగా వచ్చే నాలుగు రోజులపాటు విస్తారంగా వర్షాలు
-
కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్లో కాలనీలు అతలాకుతలం
-
HYD Rains: హైదరాబాద్ లో వర్ష బీభత్సం
-
దేవభూమిలో విలయం.. గల్లంతైనవాళ్లు ఎందరో?
దేవభూమిని మరోమారు భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. మంగళవారం మధ్యాహ్నాం కుంభవృష్టి ధాటికి వరద పోటెత్తి ఏకంగా రెండు గ్రామాలు సర్వనాశనం అయ్యాయి. నివాసాలు, హోటల్స్ బురద వరదలో కొట్టుకుపోయిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఈ విలయం ధాటికి ఇప్పటికే ఐదుగురు మరణించగా.. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు, అదే సమయంలో చిక్కుకుపోయిన వాళ్లను రక్షించే చర్యలు కొనసాగుతున్నాయి.భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న ఉత్తరాఖండ్లో.. మంగళవారం ఉత్తరకాశీ జిల్లాలో సంభవించిన క్లౌడ్ బరస్ట్ కుంభవృష్టి పెను విషాదాన్ని మిగిల్చింది. హర్సిల్ సమీపంలోని ఖీర్ గధ్ వాగు నీటిమట్టం ఊహించని రీతిలో ప్రమాదస్థాయికి చేరుకుని ఒక్కసారిగా సమీప గ్రామాలపై విరుచుకుపడింది. స్వల్ప వ్యవధిలో ధరాలీ (Dharali), సుకీ(Sukhi) గ్రామాలను కొండకు చెరోవైపు నుంచి ఆకస్మిక వరద(Flash Floods) ముంచెత్తింది. ఈ దుర్ఘటనలో.. గల్లైంతన వారి కోసం బుధవారం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఇప్పటిదాకా ఐదు మృతదేహాలను సహాయక బృందాలు వెలికి తీశాయి. మరో 130 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అయితే భారీ వర్షం సహాయక చర్యలకు అంతరాయం కలిగిస్తోంది. అయినప్పటికీ సైన్యం ముందుకు వెళ్తోంది. శరణార్థులకు భోజనం, దుప్పట్లు ఇతర సదుపాయాలను అందిస్తోంది. పోలీస్, అగ్నిమాపక శాఖ, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్డీఆర్ఎఫ్), భారత సైన్యం.. విపత్తు సహాయక బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. కనీసం 50 మంది గల్లంతై ఉండొచ్చని స్థానికుల సమాచారం ఆధారంగా అధికారులు ప్రకటన చేశారు. అయితే.. కేవలం కేరళ నుంచి 28 మందితో వచ్చిన ఓ బృందం ఆచూకీ లేకుండా పోవడం ఇప్పుడు ఆందోళనకు గురి చేస్తోంది. మరోవైపు వాతావరణ శాఖ మళ్లీ భారీవర్షాలు ఉన్నాయన్న హెచ్చరికల నేపథ్యంలో.. పర్వత జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇదిలా ఉంటే.. ఉత్తరాఖండ్ ఎంపీలు ఇవాళ ప్రధాని మోదీని కలిసి సహాయక చర్యలపై విజ్ఞప్తి చేశారు. కేంద్రం అన్నివిధాలా ఆదుకుంటుందని ప్రధాని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు ముఖ్యమంత్రి పుష్పర్ ధామి ఉత్తర కాశీలో ఏరియల్ సర్వే నిర్వహించి అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. 🚨 "𝗦𝘄𝗶𝗳𝘁 𝘁𝗼 𝗥𝗲𝘀𝗽𝗼𝗻𝗱, 𝗖𝗼𝗺𝗺𝗶𝘁𝘁𝗲𝗱 𝘁𝗼 𝗣𝗿𝗼𝘁𝗲𝗰𝘁." 🪖📍Kheer Gad, Dharali Village | Uttarkashi | 1345 Hrs, 05 Aug 2025A massive mudslide struck #Dharali village in the #KheerGad area near Harsil, triggering sudden flow of debris and water through the… pic.twitter.com/FwPPMrIpqu— SuryaCommand_IA (@suryacommand) August 5, 2025 -
చైనాలో గోల్డ్ రష్..!
బీజింగ్: ఒకటీరెండూ కాదు..ఏకంగా 20 కిలోల బంగారం, వెండి నగలు...బంగారం, డబ్బు నిండుగా ఉన్న ఇనుప బీరువా..! చైనాలోని ఓ ఊళ్లో జనం వీటిని సొంతం చేసుకునేందుకు తెగ వెతుకుతున్నారు. కొందరు బురద మట్టిని తవ్వి మరీ చూస్తున్నారు. మరికొందరైతే ఏకంగా మెటల్ డిటెక్టర్లను పట్టుకుని తిరుగుతున్నారు. ఇదంతా నిధీ నిక్షేపాల కోసం మాత్రం కాదు..వరదల్లో కొట్టుకుపోయిన సొత్తు కోసం సాగుతున్న ఎడతెగని అన్వేషణ..! ఏం జరిగిందంటే..జూలై 25వ తేదీన షాంగ్జి ప్రావిన్స్లోని వుక్వి కౌంటీలో భారీ వర్షాలతో అనూహ్యంగా వరదలు వచ్చాయి. కొన్ని నిమిషాల వ్యవధిలోనే మీటరు ఎత్తున వరద ఉప్పొంగి పట్టణాన్ని ముంచెత్తింది. ఆ వరద లావోఫెంగ్ జియాంగ్ దుకాణంలోకి కూడా ప్రవేశించింది. అధికార యంత్రాంగం వరద హెచ్చరికలతో ఆ రాత్రంగా జాగారం చేసిన దుకాణం సిబ్బంది, ఉదయం పూట యథా ప్రకారం దుకాణం తెరిచేందుకు ఉద్యుక్తులవుతున్నారు. బంగారం, ఇతర విలువైన సామగ్రిని సురక్షితంగా భద్రపర్చడం మర్చిపోయారు. సరిగ్గా ఆ సమయంలో ఎవరూ ఊహించని విధంగా ఒక్కసారిగా వేగంగా వరద ప్రవాహం దుకాణంలోకి చేరింది. తేరుకునేలోపే నగలున్న ట్రేలు, కాబిన్లను ఊడ్చిపెట్టుకుపోయింది. నగదు, నగలతోపాటు ఒక ఐరన్ సేఫ్ సైతం వరదతో పాటు మాయమైంది. బంగారం గొలుసులు, ఉంగరాలు, గాజులు, బ్రాస్లెట్లు, వజ్రపు ఉంగరాలు, వెండి ఆభరణాలు, పచ్చలు పోయిన వాటిల్లో ఉన్నాయి. ఐరన్ సేఫ్లో పెద్ద మొత్తంలో నగదుతోపాటు, కరిగించిన బంగారం, కొత్త బంగారు వస్తువులు ఉన్నాయి. వెరసి దుకాణదారుకు వాటిల్లిన నష్టం మార్కెట్ ధర ప్రకారం రూ.12 కోట్లని అంచనా. ఈ సొత్తు కోసం దుకాణం యజమాని కుటుంబంతోపాటు సిబ్బంది రెండు రోజులుగా కాళ్లకు బలపం కట్టుకుని మరీ ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. పోయిన వాటిలో సుమారు కిలో బంగారు ఆభరణాలు దొరికినట్లు అధికారులు చెబుతున్నారు. వరదల కారణంగా పట్టణంలో కరెంటు సరఫరా నిలిచిపోయింది. దీంతో, సీసీటీవీ ఫుటేజీ వ్యవస్థ దెబ్బతింది. దీనివల్ల వరద సమయంలో దుకాణంలో ఏం జరిగిందో తెలుసుకునేందుకు సరైన ఆధారమంటూ లేకుండా పోయింది. ఎవరైనా ఈ వస్తువులను తీసుకెళ్లారా? లేక వరదలోనే కొట్టుకుపోయాయా అనేది నిర్థారించడం సైతం కష్టంగా మారింది. తమ నగల దుకాణానికి సంబంధించిన విలువైన వస్తువులను ఎవరైనా ఉద్దేశ పూర్వకంగా తీసుకున్నట్లు తెలిస్తే చట్టపరమైన చర్యలకు ఉపక్రమిస్తామని యజమాని హెచ్చరిస్తున్నారు. దుకాణంలోని వస్తువులు వరదల్లో కొట్టుకుపోయినట్లు సమాచారం తెలుసుకున్న స్థానికులు సైతం గాలింపు మొదలుపెట్టారు. వరదలకు కొట్టుకు పోయి న బురద, మట్టిని తవ్వి మరీ చూస్తున్నారు. కొందరు మెటల్ డిటెక్టర్లతోనూ వెదుకుతున్నారు. ఈ గోల్డ్ రష్కు సంబంధించిన వీడియోలు ఆన్లైన్లో ప్రత్యక్షమవుతున్నాయి. అయితే, స్థానికులెవరూ దొరికిన వస్తువులను తమకివ్వలేదని దుకాణం యజమాని చెబుతున్నారు. అలా ఎవరైనా తీసుకుపోయినట్లు తెలిస్తే సమాచారమివ్వాలని స్థానికులను కోరుతున్నారు. తెచ్చిన వారికి ఆ వస్తువు విలువను బట్టి బహుమతులను సైతం ఇస్తామని ఆశచూపుతున్నారు.బీజింగ్లో వర్షాలు, వరదల్లో 44 మంది మృతి చైనా రాజధాని బీజింగ్ను భారీ వర్షాలు, వరదలు కకావికలం చేశాయి. శనివారం కురిసిన కుండపోత వానలు, వరదల్లో కనీసం 44 మంది చనిపోగా, 9 మంది గల్లంతయ్యారు. గత నాలుగు రోజులుగా బీజింగ్ సహాయక, రక్షణ కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో మరోసారి భీకరంగా వాన కురియడంతో రహదారులు తెగిపోవడంతోపాటు, విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వరద ప్రభావిత ప్రాంతాల్లోని జనాన్ని సురక్షిత ప్రాంతాలకు యంత్రాంగం తరలిస్తోంది. బీజింగ్లో ఉత్తరాన ఉన్న పర్వతప్రాంత మియున్, యాంగ్వింగ్ జిల్లాల్లో అత్యధిక నష్టం వాటిల్లిందని అధికార వార్తా సంస్థ జిన్హువా తెలిపింది. -
అమర్నాథ్ యాత్ర తాత్కాలిక నిలిపివేత
శ్రీనగర్: పహల్గాం, బాల్తాల్ మార్గాల్లో అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. బుధవారం తెల్లవారుజామునుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముందు జాగ్రత్త చర్యగా నిలిపివేసినట్లు జమ్మూ కశశ్మీర్ డివిజనల్ కమిషనర్ విజయ్ కుమార్ బిధూరి తెలిపారు. రెండు మార్గాల్లోనూ కురుస్తున్న భారీ వర్షాలు బేస్ క్యాంపుల నుంచి యాత్రికుల రాకపోకలను ప్రభావితం చేశాయన్నారు.పరిస్థితి మెరుగుపడేవరకు బాల్తాల్, నున్వాన్ బేస్ క్యాంపుల వైపు ఎలాంటి రాకపోకలను అనుమతించబోని తెలిపారు. ఈ విషయంలో యాత్రికులకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తామని అధికారులు వెల్లడించారు. పరిస్థితులు మెరుగుపడితే యాత్రను తిరిగి ప్రారంభించే విషయాలను కూడా యాత్రికులకు తెలియజేస్తామన్నారు. జూలై మూడో తేదీన ప్రారంభమైన ఈ యాత్ర ఆగస్టు 9వ తేదీతో ముగియనుంది.ఈ పవిత్ర వార్షిక యాత్ర కోసం ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు వస్తారు. యాత్రికులు రెండు మార్గాల్లో పుణ్య క్షేత్రానికి చేరుకుంటారు. ఒకటి 48 కిలోమీటర్ల పొడవైన పహల్గాం మార్గం కాగా, మరోటి నిటారుగా ఉన్న తక్కువ దూరమైన బాల్తాల్ మార్గం. ఈ ఏడాది ఇప్పటివరకు 3.93 లక్షల మంది యాత్రికులు అమర్నాథ్ను దర్శించుకున్నారు. -
Delhi: భారీ వర్ష సూచన.. వైమానిక సంస్థల హెచ్చరికలు
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో మంగళవారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఇటువంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో విమాన ప్రయాణికుల సౌకర్యార్థం పలు విమానయాన సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి.ఎయిర్ ఇండియా #TravelAdvisory Gusty wind and rain may impact flight operations to and from Delhi this morning.Please check your flight status here https://t.co/ZRtxRBbSY7… before heading to the airport and allow extra time for your journey.— Air India (@airindia) July 29, 2025 ఢిల్లీలో వర్షం కురుస్తున్న కారణంగా విమాన కార్యకలాపాలు ప్రభావితం కావచ్చని ఎయిర్ ఇండియా ప్రయాణికులకు తెలియజేసింది. విమానాశ్రయానికి వెళ్లే ముందు ప్రయాణికులు http://airindia.com/in/en/manage/fలో మీరు ప్రయాణం చేయబోయే విమాన స్థితిగతులను తెలుసుకోవాలని సూచించింది. మీ ప్రయాణానికి అదనపు సమయాన్ని కేటాయించాలని కోరింది. ఇండిగో Travel Advisory 🌂 A Rainy Day Reminder With heavy rainfall expected over #Delhi, we’re seeing a chance of delays and slower traffic to and from the airport. While we can’t control the skies, we’re doing everything possible to keep your journey steady on the ground.…— IndiGo (@IndiGo6E) July 29, 2025 ప్రముఖ విమానయాన సంస్థ ‘ఇండిగో’ ప్రయాణికులకు వాతావరణ సంబంధిత ప్రయాణ హెచ్చరికలను జారీచేసింది. అదనపు ప్రయాణ సమయానికి ముందుగానే సిద్ధం కావాలని ప్రయాణికులను కోరింది. స్పైస్ జెట్ #WeatherUpdate: Due to bad weather in Delhi (DEL) and Dharamshala (DHM), all departures/arrivals and their consequential flights may get affected. Passengers are requested to keep a check on their flight status via https://t.co/2wynECYWr0.— SpiceJet (@flyspicejet) July 29, 2025 విమానయాన సంస్థ స్పైస్ జెట్ కూడా ప్రయాణికులకు ఇలాంటి హెచ్చరికను జారీ చేసింది. ఢిల్లీ, ధర్మశాలలో ప్రతికూల వాతావరణం కారణంగా విమానాల రాకపోకలపై ప్రభావం పడనుంది. దీనిని గమనించాలని సూచించింది. భారత వాతావరణ శాఖ Delhi weather report: IMD predicts cloudy sky with moderate rain in national capital on Tuesday#DelhiRains #DelhiWeather #IMD https://t.co/rwVi0Riava— IndiaTV English (@indiatv) July 28, 2025 ఇంతలో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవార మధ్యాహ్నం నాటికి వర్ష తీవ్రత పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆగస్టు 3 వరకు అంటే వచ్చే ఏడు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని తెలియజేసింది. -
ఐదు జిల్లాల్లో ఇంకా లోటే!
సాక్షి, హైదరాబాద్: వారంరోజులుగా కురుస్తున్న వర్షాలకు కాస్త బ్రేక్ పడింది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో ఉన్న రైతులకు తాజా వర్షాలు భారీ ఊరటనిచ్చాయి. ప్రస్తుత గణాంకాలు సాధారణ స్థితిలో ఉన్నా, మరిన్ని వర్షాలు కురవాల్సిన అవసరముందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం నైరుతి సీజన్ వర్షపాత గణాంకాలు పరిశీలిస్తే... జూలై 27వరకు రాష్ట్రంలో కురవాల్సిన సాధారణ వర్షపాతం 33.40 సెంటీమీటర్లు కాగా, నమోదైన వర్షపాతం 33.68 సెంటీమీటర్లు. నెలాఖరు నాటికి 35.81 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. రెండ్రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టినా, రేపట్నుంచి వర్షాలు మోస్తరుగా కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.అక్కడ ఇంకా లోటే...సీజన్ ప్రారంభం నుంచి దాదాపు ఆరువారాల వరకు తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో రాష్ట్రంలో సగటు వర్షపాతం తీవ్ర లోటులో ఉంది. గతవారం రోజులుగా కురిసిన వర్షాలతో వర్షపాత గణాంకాలు అమాంతం పైకిలేచాయి. అయినా, ఐదు జిల్లాల్లో ఇప్పటికీ లోటు వర్షపాతమే ఉంది.⇒ మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, జనగామ జిల్లాల్లో 20శాతం పైబడి లోటులో ఉన్నట్టు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. లోటు వర్షపాతం ఉన్న మండలాల్లోఅత్యధికం ఉత్తర ప్రాంత జిల్లాల్లోనే ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు పంటల సాగుపై తీవ్ర ప్రభావాన్నే చూపునున్నాయి. ⇒ సిద్దిపేట, రంగారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్ జిల్లాల్లో 20శాతం పైబడి వర్షాలు కురవడంతో ఆయా జిల్లాలు అధిక వర్షపాతం కేటగిరీలో ఉన్నాయి.⇒ మిగిలిన 23 జిల్లాల్లో వర్షపాత గణాంకాలు సాధారణ స్థితిలో నమోదయ్యాయి.నేడు..రేపు తేలికపాటి వానలురాష్ట్రంలో రానున్న రెండ్రోజులు తేలికపాటి వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ సూచించింది. ప్రస్తుతం రుతుపవన ద్రోణి బికనీర్, కోట, వాయువ్య మధ్యప్రదేశ్ దాని పరిసరాల్లో కొనసాగుతోంది. దీని ప్రభావం రాష్ట్రంపై పెద్దగా లేదని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రానికి తక్కువ ఎత్తులో బలమైన గాలులు వీస్తున్నాయి, సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, ఒకట్రెండు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదు కావొచ్చని అధికారులు చెబుతున్నారు. ఉత్తర ప్రాంత జిల్లాల్లోని కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశముంది. వర్షపాత గణాంకాలు ఇలా.... మండలాల సంఖ్య లోటు 132సాధారణం 339అధికం 131అత్యధికం 132 -
‘తుంగభద్ర, శ్రీశైలం, గోదావరి’లో వరద హోరు
హొళగుంద/శ్రీశైలం ప్రాజెక్ట్/సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కర్ణాటకలోని తుంగభద్ర జలాశయానికి శనివారం వరద నీరు పోటెత్తింది. సగటు ఇన్ ఫ్లో 44,348 క్యూసెక్కులుండగా.. గంటకు 46,500 క్యూసెక్కులు చొప్పున నీరు జలాశయంలోకి చేరుతోంది. మొత్తం 33 గేట్లలో 26 గేట్లను రెండున్నర అడుగుల మేర ఎత్తి 50 వేల క్యూసెక్కుల వరకు నీటిని నదికి వదులుతున్నారు. కాలువలకు 10 వేల క్యూసెక్కుల వరకూ విడుదల చేస్తున్నారు. తుంగభద్ర జలాశయానికి ఈ ఏడాది ముందుగానే వరద నీటి చేరిక మొదలైంది. దెబ్బతిన్న క్రస్టు గేట్లను దృష్టిలో ఉంచుకుని డ్యాం పూర్తిమట్టం 105.788 టీఎంసీలలో 80 టీఎంసీలకు నీటి నిల్వను కుదించడం తెలిసిందే. డ్యాం 105.788 టీఎంసీల నీటి సామర్థ్యంలో 77.907 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సాగర్కు కొనసాగుతున్న నీటి విడుదల శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జునసాగర్కు నీటి విడుదల కొనసాగుతోంది. శుక్రవారం నుంచి శనివారం వరకు జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలానికి 1,40,871 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరింది. శ్రీశైలం నుంచి దిగువ ప్రాజెక్ట్లకు 156,722 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. డ్యాం పరిసర ప్రాంతాల్లో 6.80 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. నాగార్జునసాగర్కు క్రస్ట్గేట్ల ద్వారా 53,940 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పాదన ద్వారా 68,846 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. శనివారం సాయంత్రానికి శ్రీశైలం డ్యాం నీటిమట్టం 882.40 అడుగులకు చేరుకోగా.. జలాశయంలో 201.1205 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇదిలా ఉండగా, ఎగువ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరి, శబరి ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో శనివారం సాయంత్రం 6 గంటల సమయానికి పోలవరం ప్రాజెక్టుకు 5.52 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతోంది. పోలవరం స్పిల్ వే 30.400 మీటర్ల ఎత్తు నుంచి 5.52 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. -
ఉధృతంగా ప్రవహిస్తున్న మున్నేరు వాగు
-
హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం
-
వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారింది. సాగర్ ఐలాండ్కు 80 కి.మీ, కలకత్తాకు వంద కి.మీ దూరంలో వాయుగుండం తీరం దాటింది. దీని ప్రభావంతో వారం రోజులపాటు ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది. 40-50 కిమీ వేగంతో ఈదుగు గాలులు వీస్తాయని పేర్కొంది.ఉత్తర కోస్తా తీరం వెంబడి ఉన్న కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ పోర్టులకు 3వ నెంబరు ప్రమాద హెచ్చరిక, దక్షిణ కోస్తాలో మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పార్టీలకు మొదటి ప్రమాద హెచ్చరికను విశాఖ వాతావరణ కేంద్రం జారీ చేసింది. మత్స్యకారుల వేటకు వెళ్లరాదని తెలిపింది. -
రాష్ట్రానికి రెండ్రోజులు ఎల్లో అలర్ట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతుండటంతో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సగటున 2.53 సెం. మీ. వర్షపాతం నమోదైంది. మరోవైపు ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతంలో గురువారం ఉదయం ఉపరితల ఆవర్తనం విలీనమైంది. దీంతో వచ్చే రెండు రోజులపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవొచ్చని అంచనా వేసింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు నమోదవుతాయని తెలిపింది. ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హనుమకొండ, జనగామ, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో గంటకు 30–40 కి.మీ. వేగంతో కూడిన ఈదురుగాలులతో భారీ వర్షాలు నమోదు కావొచ్చని వివరించింది. ఈ మేరకు రెండు రోజులపాటు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 3–6 డిగ్రీల సెల్సియస్ మేర తక్కువగా నమోదవుతున్నాయి. గురువారం నల్లగొండలో 28.5 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలి: సీఎం భారీ వర్షాల నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం... గురువారం సీఎంఓ అధికారులతో మాట్లాడారు. భారీ వర్షాలు నమోదైన ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. లోతట్టు ప్రాంతాల్లో తగిన సహాయక చర్యలు చేపట్టాలన్నారు. వరద ఉధృతి ఉన్న ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సీఎం ఆదేశించారు. భారీ వర్షసూచన ఉన్న జిల్లాల్లో కలెక్టర్లు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని.. ప్రతి విభాగం అధికారితో కలెక్టర్లు నేరుగా మాట్లాడాలని చెప్పారు. భారీ వర్షాలు, వరదల వల్ల ఎక్కడా ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాలు, వరదలను ఎదుర్కొనేందుకు అవసరమైన సహాయక చర్యలకు అధికారులు సిద్ధంగా ఉండాలని.. జిల్లా అధికారులు జిల్లా కేంద్రంలోనే అందుబాటులో ఉండాలన్నారు -
జలజల..జలపాతాలు
సాక్షి, నెట్వర్క్: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో జలపాతాలన్నీ పరవళ్లు తొక్కుతున్నాయి. ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లిలోని బొగత జలపాతం జాలువారుతోంది. పాల నురుగలు కక్కుతూ ఎగిసి పడుతున్న తుంపరులతో కనువిందు చేస్తోంది. కాగా, బొగత జలపాతం ఉప్పొంగి ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తుండటంతో తాత్కాలికంగా పర్యాటకుల సందర్శనను నిలిపివేసినట్టు ములుగు డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సీతానగరం శివారు కొమ్ములవంచ సమీప దట్టమైన అడవిలోని భీమునిపాద జలపాతం జాలువారుతూ చూపరులను కనువిందు చేస్తోంది. బయ్యారం పెద్దగుట్టపై ఉన్న పాండవుల జలపాతం, చింతోనిగుంపు సమీపంలోని వంకమడుగు జలపాతం అందాలను చూసేందుకు పలు ప్రాంతాల నుంచి సందర్శకులు వస్తున్నారు. ఆకాశాన్ని తాకుతున్నట్టుగా ఉన్న ఎత్తయిన కొండల మధ్య నుంచి జాలువారుతోంది కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని రాయికల్ జలపాతం. రెండు రోజులుగా కురుస్తున్న వానలతో దాదాపు 200 మీటర్ల ఎత్తు నుంచి ఈ జలపాతం పారుతోంది. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం మందగూడ పంచాయతీ పరిధిలోని చింతలమాదర(తిర్యాణి) జలపాతం జలకళను సంతరించుకుంది. దాదాపు 50 అడుగుల ఎత్తు నుంచి దూకుతున్న నీళ్లు పాలధారను తలపిస్తున్నాయి. -
రేపు ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం: కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా తీరంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం విశాఖపట్నం సమీపంలో సగటు సముద్ర మట్టానికి 5.8 కిమీ ఎత్తులో కొనసాగుతోంది. మరో ఉపరితల ఆవర్తనం దక్షిణ ఛత్తీస్గడ్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడింది. వీటి ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతంలో 24న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.. దీంతో రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. గంటకు 40నుంచి 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు విస్తాయని పేర్కొన్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో అనేక చోట్ల మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడనున్నాయి. అదేవిధంగా దక్షిణకోస్తా, రాయలసీమల్లో పలు చోట్ల మోస్తరు వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు, ఒకట్రెండు చోట్ల అతి భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. -
బంగాళాఖాతంలోకి ప్రవేశించిన ‘విఫా’.. ఏపీలో భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: మరో 24 గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. "విఫా" తుఫాన్.. చైనా, హాంకాంగ్లో బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే.. "విఫా" తుఫాను అవశేషం... తీరం దాటిన తర్వాత బంగాళాఖాతంలోకి ప్రవేశించింది. క్రమేపీ బలపడుతుందని ఐఎండీ అంచనా వేసింది.వచ్చే మూడు రోజులు ఏపీలో విస్తారంగా వర్షాలు, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. అల్లూరి సీతారామరాజు జిల్లా, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, ఏలూరు, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం తీరం వెంబడి గంటకు 60 కి.మీ గరిష్ఠ వేగంతో గాలులు వీస్తాయని.. మత్స్యకారులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. గత 24 గంటల్లో గుంటూరు, మాచర్ల, నర్సీపట్నంలో 7 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. -
కలెక్టర్లు ఆకస్మిక తనిఖీలు చేయాల్సిందే: సీఎం రేవంత్
హైదరాబాద్: తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలతో జిల్లా కలెక్టర్లంతా అప్రమత్తండా ఉండాలని సీఎం రేవంత్రెడ్డి సూచించారు. ఈరోజు(సోమవారం, జూలై 21) జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో వర్షాలపై సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్.‘వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి. అన్ని విభాగాల అధికారులను అప్రమత్తం చేయాలి. జూన్ నుంచి ఇప్పటి వరకు 21 శాతం వర్షపాతంనమోదైనా… గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అన్ని విభాగాలు అప్రమత్తం చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలి. భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో 150 బృందాలను ఏర్పాటు చేశాం. వాతావరణ సూచనలకు అనుగుణంగా కమాండ్ కంట్రోల్ రూం నుంచి సమన్వయం చేసుకుని ముందుగానే టీంలను పంపిస్తున్నాం. పోలీస్ కమిషనరేట్లకు సంబంధించిన ఉన్నతాధికారులు గ్రౌండ్ లో ఉండాలి. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా సమన్వయంతో పనిచేయాలి. జిల్లాల్లో పిడుగుపాటుతో జరిగే నష్టాల వివరాలు నమోదు చేయాలి. గిరిజనులు అంటువ్యాధుల బారిన పడకుండా ఐటీడీఏ ప్రాంతాల అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. పీహెచ్సీ సెంటర్లు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. పశువులకు సంబంధించి వెటర్నరీ విభాగం అప్రమత్తంగా ఉండాలి. కలెక్టర్లు ఆకస్మిక తనిఖీలు చేయాల్సిందే. కలెక్టర్లు ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో పర్యటనకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేస్తున్నా. అజాగ్రత్తగా ఉంటే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు. ప్రతీ రోజు కలెక్టర్ల కార్యాచరణకు సంబంధించి ప్రభుత్వానికి పూర్తి రిపోర్టును అందించాలని సీఎస్ ను ఆదేశిస్తున్నా. వర్షాలను దృష్టిలో ఉంచుకుని సాగునీటికి సంబంధించి వాటర్ మేనేజ్మెంట్ ఉండాలి’ అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. -
మూడు రోజుల పాటు భారీ వర్షాలు
సాక్షి,విశాఖపట్నం/సాక్షి, అమరావతి: దక్షిణ కోస్తాంధ్ర మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది ఆలస్యంగా బలపడే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇది సముద్ర మట్టానికి 5.8 కిమీ ఎత్తులో కొనసాగుతూ నైరుతి వైపుగా వంగి ఉంది. దీనికి అనుబంధంగా దక్షిణ కర్ణాటక నుంచి దక్షిణ ఆంధ్రప్రదేశ్ వరకూ తూర్పు పశ్చిమ గాలుల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు భారీ నుంచి అతి వర్షాలు కురిసే సూచనలున్నాయి. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో అనేక చోట్ల భారీ వర్షాలు, ఒకట్రెండు చోట్ల అతి భారీ వర్షాలు కురవనున్నాయి.పలుచోట్ల పిడుగులు పడే ప్రమాదం ఉందనీ.. తీరం వెంబడి గరిష్టంగా 50 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గడిచిన 24 గంటల్లో నంద్యాల జిల్లా పెరుసోమలలో 7.8, అల్లూరి జిల్లా లంబసింగిలో 5.7, ఏలూరు జిల్లా మిర్జాపురంలో 5.3, కోనసీమ జిల్లా రామచంద్రపురం లో 5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కాగా, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిసినా..మరికొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా కనిపించింది. శనివారం ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, వైఎస్సార్ కడప జిల్లాల్లో 37 నుంచి 38 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
మరో రెండు రోజులు భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్రంలో రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులపాటు ఇలాగే వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం గ్రేటర్ హైదరాబాద్ సమీప జిల్లాల్లో జోరు వాన నమోదైంది. హైదరాబాద్, జనగామ, మహబూబ్నగర్, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, నల్లగొండ, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, అదిలాబాద్ జిల్లాల్లో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని జిల్లాల కలెక్టర్లకు సూచించింది. నైరుతి రుతుపవనాల సీజన్ ప్రారంభం నుంచి వర్షాలు అంతంత మాత్రంగానే కురిశాయి. గత మూడు వారాలుగా వర్షాల జాడలేకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా లోటు వర్షపాతం నమోదైంది. ఈ సీజన్లో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 26.23 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 20.43 సెంటీమీటర్లు మాత్రమే కురిసింది. -
Nallakunta: ప్రతి సంవత్సరం వర్షం వస్తే ఇదే పరిస్థితి అంటూ కాలనీవాసుల ఆవేదన
-
పీకల లోతు వరద నీటిలో రిపోర్టింగ్, చివరకు..
పనిలో డెడికేషన్ అనాలో.. టీఆర్పీ కోసం పాకులాట అనాలో.. వ్యూస్ కోసం స్టంట్లు అనాలో.. ఈ ఘటన గురించి చదివాక మీ స్పందన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. పాకిస్తాన్లో కురుస్తున్న భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో వరదలు పోటెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఒక జర్నలిస్ట్ లైవ్ రిపోర్టింగ్ చేస్తూ నీటిలో కొట్టుకుపోయాడంటూ ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటన రావల్పిండిలోని చాహన్ డ్యామ్ వద్ద చోటుచేసుకుంది. రిపోర్టర్ పీకల లోతు వరద నీటిలో నిలబడి అక్కడి పరిస్థితి వివరిస్తున్నాడు. ఆ సమయంలో వరద ఉధృతికి ఆకస్మికంగా ప్రవాహం అతన్ని లోపలికి లాక్కెళ్లిపోయింది.A Pakistani reporter is swept away by strong currents during a live broadcast while covering the floods in neck-deep water.#Pakistan #Floods pic.twitter.com/0raCbYaoer— Al Arabiya English (@AlArabiya_Eng) July 17, 2025అయితే ఈ వీడియో అక్కడికి మాత్రమే కట్ అయ్యింది. అతను కొట్టుకుపోయాడని, ఇప్పటిదాకా అతని ఆచూకీ తెలీయకుండా పోయిందనేది సదరు వార్త కథనాల సారాంశం. దీంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అతనిది మూర్ఖపు చర్య అని కొందరు, విధి నిర్వహణలో తప్పేం కాదని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. కెమెరామ్యాన్నెవర్డైస్ అంటూ మరికొందరు సరదా కామెంట్లు పెడుతున్నారు. అయితే.. మరికొందరు మాత్రం అతను అసలు రిపోర్టర్ కాదని, టిక్టాక్ లాంటి షార్ట్వీడియోస్ యాప్లలో వ్యూస్ కోసం ఇలాంటి స్టంట్లు చేస్తుంటాడని పలువురు కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం అతను సురక్షితంగానే ఉండి ఉంటాడన్నది ఆ కామెంట్ల సారాంశం. అయితే.. ఫ్యాక్ట్ చెక్లో అతని పేరు అలీ ముసా రాజా(Ali Musa Raza)గా తేలింది. రూహీ అనే చానెల్లో అతను చాలా కాలంగా రిపోర్టర్గా పని చేస్తున్నాడు. అతను క్షేమంగానే ఉన్నాడా? అనే దానిపై ఆ చానెల్ ఎలాంటి ప్రకటన చేయలేదు. తాజా ఘటన నేపథ్యంలో పలువురు జర్నలిస్టులు సైతం అతనికి సంఘీభావం తెలుపుతున్నారు. అతను క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నట్లు కామెంట్లు పెడుతున్నారు. చీప్ గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ కంటే ఇలాంటి ధైర్యమైన రిపోర్టర్లు సమాజానికి అవసరమని, అదే సమయంలో ఇలాంటివాళ్లు సురక్షితంగా కూడా ఉంటాలంటూ కామెంట్లు పెడుతున్నారు. రిపోర్టర్ అలీ ముసా రాజాకు ఇలాంటి స్టంట్లు కొత్తేం కాదు. కిందటి ఏడాది.. పంజాబ్ ప్రావిన్స్ సఖి సర్వర్ ఏరియాలో వరదలను నడుం లోతు నీళ్లలో కవర్ చేస్తూ వైరల్ అయ్యాడు కూడా. View this post on Instagram A post shared by NDTV WORLD (@ndtvworld)పాకిస్తాన్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇది గత సంవత్సరం కంటే 124% ఎక్కువ వర్షపాతం అని అక్కడి వాతావరణ శాఖ చెబుతోంది. తాజా వరదల ధాటికి ఆ దేశంలో ఇప్పటికే 180 మంది మరణించారు. అయితే.. ఒక్క పంజాబ్ ప్రావిన్స్లో 54 మంది ఒకే రోజులో మరణించడం గమనార్హం. -
మూడు రోజులు భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: తీవ్ర వర్షాభావ పరిస్థితుల నుంచి రాష్ట్ర ప్రజలకు ఉపశమనం లభించింది. శుక్రవారం రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. రానున్న మూడు రోజులు కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు సైతం నమోదు కావొచ్చని అంచనా వేసింది. బికనీర్, సికార్, వాయువ్య మధ్యప్రదేశ్ నుంచి నైరుతి ఉత్తరప్రదేశ్ వరకు వాయుగుండం కొనసాగుతోంది.ఇది క్రమంగా తూర్పు ఆగ్నేయ దిశలో కదిలి ఈశాన్య బంగాళాఖాతం వరకు విస్తరించనుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల చక్రవాత ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్రమట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. దీనికి సమాంతరంగా ఉపరితల ద్రోణి కూడా కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మధ్య తెలంగాణలో భారీ వర్షం..: శుక్రవారం రాష్ట్రంలో అనేక చోట్ల వర్షాలు కురిశా యి. ప్రధానంగా మధ్య తెలంగాణలో భారీ వర్షాలు నమోదయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది. గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు 50 చోట్ల 5 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షం కురిసింది. రా ష్ట్రంలో వరుసగా మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. శనివారం ఉదయం వరకు రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, సిద్దిపేట, భువనగిరి, నల్లగొండ, సూర్యాపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచి్చంది. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.జీహెచ్ఎంసీ సమీప జిల్లాల్లో భారీ వర్షం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో శుక్రవారం భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదయ్యాయి. దక్షిణ కోస్తా, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల చక్రవాత ఆవర్తనం, దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులు వర్షాలకు అనుకూలంగా మారాయి. దీంతో మూడు రోజుల పాటు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఉమ్మడి నల్లగొండ, మహబూబ్నగర్లోని కొన్ని ప్రాంతాలు, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. దీంతో వచ్చే మూడు రోజులకు రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ చేశాం. – డాక్టర్ కే.నాగరత్న డైరెక్టర్, ఐఎండీ–హైదరాబాద్ -
ఏపీకి బిగ్ అలర్ట్.. రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: రాగల 24 గంటల్లో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. అల్లూరి, ఏలూరు, గుంటూరు, బాపట్ల పల్నాడు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది.రుతు పవన గాలులు కొనసాగనున్నాయని.. 40-50 కిమీ వేగంతో గాలుల వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది.మరోవైపు, తెలంగాణలొ గత రెండు రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం హైదరాబాద్లో భారీ వర్షం కురిసింది. రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదని తెలిపింది. దక్షిణ తెలంగాణలోని పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అన్ని జిల్లాల్లో 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. -
ఏపీకి చల్లని కబురు.. వారం రోజుల పాటు భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో నేడు, రేపు (శుక్ర,శని) భారీ వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీలో వారం రోజులపాటు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ వద్ద కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. వాయుగుండానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది.కోస్తా జిల్లాల్లో ఐదు రోజులపాటు బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అల్లూరి, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో నేడు, రేపు భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. గడిచిన 24 గంటల్లో విజయనగరం జిల్లాలో 12 సెం.మీ అత్యధిక వర్షపాతం నమోదయినట్లు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.రుతుపవనాలు ప్రవేశించి.. దాదాపు నెలన్నర అవుతున్నా.. లోటు వర్షపాతమే కొనసాగుతోంది. మండు వేసవిని తలపించేలా భానుడు భగభగలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలో.. బ్రేక్మాన్సూన్ పరిస్థితులు కనిపిస్తున్నాయని ఎండలు.. లోటు వర్షపాతం నుంచి కొంత ఉపశమనం కలిగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.వారి అంచనాల ప్రకారం గురువారం నుంచి రాష్ట్రంలో వర్షాలు క్రమక్రమంగా పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోస్తాంధ్రతో పాటు రాయలసీమలోనూ వర్షాలు జోరందుకోనున్నాయి. ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయలసీమల్లో విస్తారంగా వర్షాలు కురిసే సూచనలున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ మోస్తరు వానలు పడనున్నాయి. కొన్ని చోట్ల ఉరుములు, పిడుగులు పడే ప్రమాదం ఉంది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిమీ వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
తెలంగాణకు అలర్ట్.. రెండురోజుల పాటు భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రెండు రోజులపాటు భారీ వర్షాలు ఉంటాయని తెలిపింది. వర్షాలు లేక రైతాంగం ఇప్పటికే తీవ్ర అవస్థలు పడుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఎండలు, ఉక్కపోతతో సామాన్య ప్రజానీకం సైతం ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో.. రేపు(గురువారం) నల్గొండ, సూర్యాపేట, నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు ఉంటాయని తెలిపింది. అలాగే.. ఎల్లుండి మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్ష పడే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. మిగతా జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉంటుందని అంచనా వేస్తోంది. ఈ క్రమంలో ఆ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పలు జిల్లాల్లో పడొచ్చని హెచ్చరించింది.రాజధాని హైదరాబాద్ నగరంలో ఈరోజు సాయంత్రం లేదంటే రాత్రి తేలికపాటి వర్షం పడొచ్చని అంచనా వేస్తోంది. ఇదిలా ఉంటే.. రాష్ట్రంలోని 340 మండలాల్లో ఇప్పటికే లోటు వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెయిన్ అలర్ట్ జిల్లాలుఆదిలాబాద్, ఆసిఫాబాద్, కరీంనగర్, పెద్దపల్లిభూపాలపల్లి, ములుగు, మంచిర్యాల, నిర్మల్నిజామాబాద్, జగిత్యాల, కొత్తగూడెంనల్గొండ, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండరంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ఈదురుగాలులు: గంటకు 30–40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.⚠️ హెచ్చరికలు:పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ ప్రజలు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాల సమయంలో సురక్షితంగా ఉండాలని సూచనచెట్లు విరిగిపడే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు -
1.6 లక్షల మంది నిరాశ్రయులు
న్యూఢిల్లీ: దేశంలో ప్రకృతి విపత్తులు పంజా విసురుతూనే ఉన్నాయి. భారీ వర్షాలు, భీకరమైన వరదల కారణంగా పెద్ద సంఖ్యలో జనం నష్టపోతున్నారు. శాశ్వత లేదా తాత్కాలిక ఇళ్లు, ఆవాసాలు కోల్పోయి నిరాశ్రయులుగా మారుతున్నారు. 2024లో దేశంలో 400కుపైగా ప్రకృతి విపత్తులు చోటుచేసుకున్నాయి. గత రెండు దశాబ్దాల కాలంలో చూస్తే ఇదే అత్యధిక కావడం గమనార్హం. గత ఏడాది విపత్తుల వల్ల 1.18 లక్షల మందికిపైగా జనం నిరాశ్రయులయ్యారని ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్ మానిటరింగ్ సెంటర్ వెల్లడించింది. 2023 కంటే 2024లో నిరాశ్రయుల సంఖ్య 30 శాతం అధికం అని తెలియజేసింది. 2021లో 22,000 మంది, 2022లో 32,000 మంది ఇళ్లు కోల్పోయి రోడ్డున పడ్డారని పేర్కొంది. ప్రకృతి విపత్తులు ప్రతిఏటా పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. 2019 నుంచి 2023 మధ్య 281 విపత్తుల ఘటనలు చోటుచేసుకున్నాయి. 2024లో మాత్రం ఏకంగా 400కు పైగా విపత్తులు సంభవించాయి. గత ఆరేళ్లలో జనం నిరాశ్రయులు కావడానికి వరదలు 55 శాతం, తుఫాన్లు 44 శాతం కారణమని తేలింది. కొండ చరియలు విరిగిపడడం, భూకంపాలు, కరువుల వల్ల కూడా జనం ఆశ్రయం కోల్పోతున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లోనే అధికం 2024లో 1.18 లక్షల మంది నిరాశ్రయులు కాగా, 2025లో మొదటి ఆరు నెలల్లోనే ఏకంగా 1.6 లక్షల మంది బాధితులుగా మారిపోయినట్లు ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్ మానిటరింగ్ సెంటర్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గతేడాది కంటే ఈ ఏడాది పరిస్థితి మరింత దారుణంగా ఉన్నట్లు తేటతెల్లమవుతోంది. పశ్చిమ బెంగాల్తోపాలు ఈశాన్య రాష్ట్రాల ప్రజలే అధికంగా ప్రకృతి విపత్తుల బారినపడుతున్నారు. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో అత్యధికంగా పశ్చిమ బెంగాల్లో 80,000 మంది నిరాశ్రయులయ్యారు. -
ఢిల్లీలో భారీ వర్షం.. రోడ్లపై నిలిచిపోయిన నీరు
-
బ్యాంకులోకి చేరిన వరద.. జనం కాపలా
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తుండటం తెల్సిందే. మండి జిల్లాలోని థునాగ్ పట్టణంలోని రాష్ట్ర సహకార బ్యాంకు కార్యాలయంలోకి వరద నీరు చేరింది. రెండంతస్తుల ఈ భవనం మొదటి అంతస్తు వరద, చెత్తాచెదారంతో నిండిపోయింది. వరద తీవ్రతకు బ్యాంకు షట్టర్ ఒకటి ఊడిపోగా మరో రెండు షట్టర్లు వంకర్లు తిరిగి ఊడిపడేందుకు సిద్ధంగా ఉన్నాయి. బ్యాంకులో ఖాతాదార్లు తాకట్టు పెట్టిన, లాకర్లలో భద్రంగా ఉంటుందని భావించిన లక్షలాది రూపాయల విలువైన నగలు, విలువైన పత్రాలు, కోట్లాది రూపా యల డబ్బు ఉన్నట్లు సమాచారం. అయితే, నష్టం వివరాలు వెల్లడి కాలేదు. చెత్తాచెదారం, వ్యర్థాలను తొలగించిన తర్వాతే నష్టాన్ని అంచనా వేసేందుకు వీలుంటుందని చెబుతున్నారు. థునాగ్ మార్కెట్ ప్రాంతంలో ఉన్న ఈ బ్యాంకులో నిత్యం 150 మంది వరకు వ్యాపా రులు లావాదేవీలు జరుపుతుంటారు. ఎనిమిదివేల జనాభా కలిగిన థునాగ్ పట్టణంలో బ్యాంకు ఇదొక్కటే. వరదల కారణంగా కొట్టుకువచ్చిన విలువైన వస్తువులను ఎవరైనా ఎత్తుకుపోయే ప్రమాదము ందని భావిస్తున్న స్థానికులు నిత్యం కాపలా కాస్తున్నారు. జూన్ 20–జూలై 6వ తేదీల మధ్య హిమాచల్లో భారీ వర్షాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. -
హిమాచల్లో వర్షాలతో నష్టం
న్యూఢిల్లీ: గడిచిన రెండు వారాలుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో హిమాచల్ ప్రదేశ్లో తీవ్ర నష్టం సంభవించింది. వర్షాలకు సంబంధించిన ఘటనల్లో 43 మంది మృతి చెందగా 37 మంది కనిపించకుండా పోయారు. ఒక్క మండి జిల్లాలోనే 17 మంది చనిపోగా, 31 మంది గల్లంతయ్యారు. జూన్ 20వ తేదీ నుంచి హిమాచల్లో కురుస్తున్న వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల కారణంగా రాష్ట్రంలో రూ.5 వేల కోట్ల మేర నష్టం వాటిల్లింది. వచ్చే మంగళవారం వరకు వర్షాల తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాఖండ్లోని భిమ్టల్లో గురువారం ఉప్పొంగుతున్న జలాశయంలో మునిగి నేవీకి చెందిన ఇద్దరు సిబ్బంది చనిపోయారు. పఠాన్ కోట్కు చెందిన ప్రిన్స్ యాదవ్(22), బిహార్లోని ముజఫర్పూర్కు చెందిన సాహిల్ కుమార్(23)గా వీరిని గుర్తించారు. నైనిటాల్ నుంచి సరదాగా గడిపేందుకు వచ్చిన 8 మంది ఐఏఎఫ్ సిబ్బందిలో వీరున్నారు. వర్షాల కారణంగా రాష్ట్రంలోని 100కు పైగా రహదారులను మూసివేశారు. చార్ధామ్ యాత్రకు అంతరాయం కలిగింది. యమునోత్రికి వెళ్లే జాతీయ రహదారిపై ఐదు రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. కొండచరియలు విరిగిపడి ఈ రహదారిపైనున్న సిలాయి మలుపు వద్ద 12 మీటర్ల రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో, 9 మంది నిర్మాణ కార్మికులు కొట్టుకుపోయారు. వీరి కోసం గాలింపు కొనసాగుతోంది. మరోవైపు, ఒడిశా రాజధాని భువనేశ్వర్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నీటిని బయటకు పంపేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మధ్యప్రదేశ్లో శుక్రవారం కురిసిన భారీ వర్షానికి చాలా ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. మండ్లా, సియోని, బాలాఘాట్ జిల్లాల్లో వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ ప్రకటించింది. జబల్పూర్–మండ్లా జిల్లాలను కలిపే జాతీయ రహదారిపై కొండచరియలు విరిగి పడటంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. అదేవిధంగా, రాజస్తాన్లోని జైసల్మీర్ జిల్లా పొఖ్రాన్లో 128 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని పశ్చిమ ప్రాంతంలోనూ భారీ నుంచి అతి భారీ వర్షం కురిసింది. -
హిమాచల్పై వరుణుడి పంజా.. 63 మరణాలు, 400 కోట్ల నష్టం
సిమ్లా: ఎడతెరిపి లేని భారీ వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలం అయ్యింది. కుండపోత వర్షంతో హిమాచల్లో ఆకస్మిక వరదలు సంభవించాయి. రాష్ట్రంలోని బియాస్ నది సహా ప్రధాన నదులు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. వర్షాల కారణంగా ఇప్పటికి 63 మంది చనిపోయినట్టు అధికారులు ప్రకటించారు. రూ.400 కోట్ల ఆస్తి నష్టం సంభవించినట్లు అధికారులు చెబుతున్నారు. జూలై ఏడో తేదీ వరకు వర్షాలు కొనసాగుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ, ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.హిల్స్టేట్ హిమాచల్ ప్రదేశ్ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా అనేక ఇళ్లు దెబ్బతిన్నాయి. కార్లు కొట్టుకుపోయాయి. ఈ వర్షాలకు మండి జిల్లా తీవ్ర విధ్వంసానికి గురైంది. భారీ వర్షాలు, వరదలకు దాదాపు 400కుపైగా రోడ్లను అధికారులు మూసివేశారు. అనేక మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వర్షాల కారణంగా ఇప్పటి వరకూ మరణించిన వారి సంఖ్య 63కి పెరిగింది. మరో 40 మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. అనేక మంది గాయపడ్డారు. గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. రూ.400 కోట్ల ఆస్తి నష్టం సంభవించినట్లు అధికారులు తెలిపారు.VIDEO | Himachal Pradesh: Flash flood triggered by cloudburst causes severe damage in Thunag tehsil of Mandi district. Several houses damaged.#HimachalCloudburst #HimachalNews(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/XjM8R2jJHA— Press Trust of India (@PTI_News) July 4, 2025 शिमला : ढली के लिंडीधार में भारी लैंडस्लाइड - फोरलेन का डंगा गिरा - सैंकड़ों सेब के पेड़ दबे।घर छोड़ भागे लोग, 5 घरों को खतरा।#Shimla #Dhali #Landslide #HimachalNews #DDNewsHimachal pic.twitter.com/dKaekscobU— DD News Himachal (@DDNewsHimachal) July 3, 2025మరోవైపు రాష్ట్రంలోని పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరికలు జారీ చేసింది. జూలై 5న సిమ్లా, సోలన్, సిర్మౌర్, జూలై 6న ఉనా, బిలాస్పూర్, హమీర్పూర్, కాంగ్రా, చంబా, మండి జిల్లాలకు వర్ష సూచన చేసింది. ఈ మేరకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ఇప్పటికే వర్షప్రభావం ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఐఎండీ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షితం ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.Whoahh, that was close!!A massive landslide hit the Shillai area of Sirmaur district, Himachal Pradesh, India today, along National Highway 707 👀pic.twitter.com/nVvfZWty90— Volcaholic 🌋 (@volcaholic1) May 30, 2025Big houses, rocks all got washed away in the flood but "Pandav Shila" in Himachal Pradesh did not move from the place where it was, this is no less than a miracle. pic.twitter.com/pnhWE9Rp3I— Frontalforce 🇮🇳 (@FrontalForce) July 4, 2025🚨HEAVY RAINS TRIGGER CLOUD BURSTS AND FLOODING IN HIMACHAL PRADESH, INDIA.Cloud bursts in Karsog area, Mandi, cause 1 death and 7 missing.Vehicles swept away and 16 MW power project destroyed.Beas River floods intensifySchools and colleges closed; statewide alert active pic.twitter.com/ucXSbYhviD— Weather Monitor (@WeatherMonitors) July 1, 2025 -
హిమాచల్లో కుంభవృష్టి
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్లో సోమవారం రాత్రి నుంచి కుండపోతగా కురుస్తున్న వాన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆకస్మికంగా సంభవించిన వరదల్లో ఐదుగురు చనిపోగా, మరో ఐదుగురు గాయాల పాలయ్యారు. మరో 16 మంది గల్లంతయ్యారు.24 గంటల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా 225.38 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పదకొండు చోట్ల కుండపోత వాన, నాలుగు చోట్ల ఆకస్మిక వరదలు సంభవించగా, ఒక చోట భారీగా కొండచరియలు విరిగిపడ్డాయని అధికారులు తెలిపారు. -
250 రోడ్లు మూసివేత.. 130 చోట్ల కరెంట్ కట్
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్లోఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. దాదాపు రాష్ట్రమంతటా మంచినీటి సరఫరా నిలిచిపోయింది. కనీసం 130 ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు. వరద చేరడం, ధ్వంసం కావడం వంటి కారణాలతో 250 రోడ్లను అధికారులు మూసివేశారు. ఇందులో అత్యధికంగా సిర్మౌర్ జిల్లాలో 57, మండి జిల్లాలో 44 రోడ్లున్నాయి. రాష్ట్రంలో కొండచరియలు విరిగిపడే అవకాశమున్న 22 ప్రాంతాలకుగాను 18 చోట్ల ప్రమాద హెచ్చరికలు జారీ చేశామని తెలిపారు. కంగ్రా, మండి, సిర్మౌర్, సొలాన్ జిల్లాల్లో సోమవారం స్కూళ్లను మూసివేశారు. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. పర్యాటక ప్రాధాన్యమున్న సిమ్లా–కల్కా రైలు మార్గంపైన చేరిన రాళ్లు, చెట్లను తొలగించే రాకపోకలకు వీలు కల్పించారు. గత 24 గంటల్లో చనిపోయిన ముగ్గురితో కలిపి ఈ సీజన్లో వర్షాల సంబంధిత ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 20కి చేరిందని అధికారులు తెలిపారు. సిమ్లా–కల్కా ఐదో నంబర్ జాతీయ రహదారిపై కోటి సమీపంలో కొండచరియలు విరిగి పడటంతో గంటలపాటు రాకపోకలు నిలిచిపోయాయి. -
కేరళలో విషాదం.. భారీ వర్షాలకు కుప్పకూలిన పాత భవనం
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కేరళ అతలాకుతలం అవుతోంది. తాజాగా.. త్రిస్సూర్ సమీపంలో రెండంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరో 27 మంది భవనంలో చిక్కుకున్నారు. రంగంలోకి దిగిన సహాయక బృందాలు ఇప్పటికే 14 మంది బయటకు తీసుకొచ్చింది. తిరువనంతపురం: భారీ వర్షాలకు కేరళ అతలాకుతలం అవుతోంది. శుక్రవారం ఉదయం కొడకర ప్రాంతంలో ఓ భవనం కుప్పకూలి ముగ్గురు మరణించారు. భవనం పాతదని, అందులో వలస కార్మికులు నివసిస్తున్నారని సమాచారం. మరణించిన ముగ్గురూ పశ్చిమ బెంగాల్కు చెందిన వలస కార్మికులేనని అధికారులు ప్రకటించారు. మృతులు:రాహుల్ (19) – ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిరుపెల్ (21) – మృతదేహంగా వెలికితీశారుఅలీమ్ (30) – శవంగా గుర్తింపుసుమారు 40 ఏళ్ల భవనం కావడం, లాటరైట్ ఇటుకలతో నిర్మించబడడంతో భారీ వర్షాలకు కూలి ఉంటుందని అధికారులు పప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ బిడ్డింగ్ పక్కనే కొడకర పంచాయతీ కార్యాలయం ఉన్నప్పటికీ.. ఎలాంటి నష్టం వాటిల్లలేదు. ప్రస్తుతం ఫైర్, రెస్క్యూ బృందాలు జేసీబీలు, భారీ యంత్రాలు ఉపయోగించి శిథిలాలను తొలగిస్తున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. -
బంగాళాఖాతంలో అల్పపీడనం: కోస్తాలో విస్తారంగా వర్షాలు
విశాఖ: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. అల్పపీడన ప్రభావంతో ఉత్తరకోస్తాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలతో పాటు కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడే అవకాశం పడే అవకాశం ఉందని తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, పార్వతీపురం జిల్లాల్లో భారీ వర్షం కురిసే చాన్స్ ఉందని, గంటకు 50 నుంచి 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. దీంతో పాటు మరో ద్రోణి విస్తరించి ఉందని వెల్లడించింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే నాలుగు రోజులు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇదిలా ఉండగా బుధవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. తూర్పుగోదావరి జిల్లాలోని నాగంపల్లెలో అత్యధికంగా 4.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. విశాఖ రూరల్లో 3.7, ఎనీ్టఆర్ జిల్లా మునకుళ్లలో 3.6, అల్లూరి జిల్లా కూనవరంలో 3.5, విశాఖ జిల్లా ఎండాడ, సీతమ్మధారలో 3.5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ ప్రకటించింది. -
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఉత్తర కోస్తాంధ్రలో భారీ వర్షాలు
సాక్షి, అమరావతి: ఐఎండీ సూచనల ప్రకారం వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాల మీదగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని ఆదే ప్రాంతంలో రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడేందుకు అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. దీంతో పాటుగా మరోక ద్రోణి విస్తరించి ఉందని పేర్కొన్నారు.వీటి ప్రభావంతో రాష్ట్రంలో నాలుగు రోజులు చెదురుమదురుగా పిడుగులతో కూడిన భారీ వర్షాలు, 40-60కిమీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందన్నారు, ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భారీ హోర్డింగ్స్, చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు వంటి వాటి దగ్గర నిలబడరాదన్నారు. రానున్న నాలుగు రోజుల్లో వర్షాలు పడే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.గురువారం: శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.శుక్రవారం: శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.శనివారం: శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.ఆదివారం: శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.కాగా, బుధవారం సాయంత్రం 5గంటల నాటికి తూర్పుగోదావరి జిల్లా నాగంపల్లెలో 49 మిమీ, విశాఖ రూరల్ 37.7మిమీ, ఎన్టీఆర్ జిల్లా మునకుళ్ళలో 36.5మిమీ, అల్లూరి జిల్లా కూనవరంలో 35.7మిమీ, విశాఖ జిల్లా ఎండాడలో 35.7మిమీ, సీతమ్మధారలో 35.5మిమీ చొప్పున వర్షపాతం నమోదైందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. -
ఉపరితల ఆవర్తనంతో భారీ వర్షాలు
సాక్షి, అమరావతి/మహారాణిపేట(విశాఖ): ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో 5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగలలో 4.8, అన్నమయ్య జిల్లా గుండ్లపల్లిలో 4.4, విజయనగరం జిల్లా గుల్లసీతారామపురంలో 4.0, నంద్యాల జిల్లా చౌతకూరులో 3.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకూ 24 గంటల వ్యవధిలో తిరుపతి జిల్లా తడలో అత్యధికంగా 8.3 సెంటీమీటర్ల వర్షం పడింది. నాగలాపురంలో 7.9 సెంటీమీటర్లు, పల్నాడు జిల్లా మాచర్లలో 7.1, తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం మలకచర్లలో 6.7, చిత్తూరు జిల్లా యాదమర్రిలో 6.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఉపరితల ఆవర్తనం శుక్రవారానికి ఉత్తర కర్ణాటక దానికి ఆనుకుని ఉన్న తెలంగాణ, రాయలసీమ మీదుగా సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. మరో ద్రోణి పశ్చిమ–మధ్య అరేబియా సముద్రం నుంచి దక్షిణ ఒడిశా తీరం వరకు కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో శనివారం రాష్ట్రవ్యాప్తంగా మేఘావృతమైన వాతావరణంతో పాటు కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. చెదురుమదురుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. -
జల్దీ ఇల్లు కట్టుకోండి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మా ణాన్ని వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పేదల కోసం ఐదేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా, మొదటి విడతలో 4.50 లక్షల ఇళ్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించింది. కానీ, ఇప్పటికి పనులు మొదలైనవి 69 వేలు మాత్రమే. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండో సంవత్సరం కొనసాగుతుండటంతో మరో 4.50 లక్షల ఇళ్ల నిర్మా ణానికి కూడా చర్యలు చేపట్టాల్సి ఉంది. ఈ నేప థ్యంలో ఇళ్ల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలని భావిస్తోంది.అసలే పనుల ప్రారంభంలో ఆలస్యం జరుగుతుండగా, ప్రస్తుతం వానాకాలం కూడా మొదలు కావటంతో ఇళ్ల నిర్మాణం మరింత మందగించనుంది. భారీ వర్షాలు ప్రారంభమైతే అసలు పనులే చేపట్టేందుకు జనం ఆసక్తి చూపరు. వ్యవసాయ పనులు ఊపందుకుంటే పనుల్లోకి వెళ్లేందుకే మొగ్గు చూపుతారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని ఇళ్ల నిర్మాణం వేగంగా జరిగేలా చూడాలని గృహనిర్మాణ శాఖ నిర్ణయించింది. అందులో భాగంగా అధికారులు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి త్వరగా పనులు ప్రారంభించాలని సూచిస్తున్నారు. పూర్తయిన ఇళ్లు రెండే..కాంగ్రెస్ ప్రభుత్వ ఆరు గ్యారంటీల్లో ఇందిరమ్మ ఇళ్లు కూడా ఉన్నాయి. దీంతో వీటి నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇటీవలి నుంచే లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలు జారీ చేస్తుండటంతో నెల రోజులుగా నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 69 వేల ఇళ్లు మాత్రమే మొదలయ్యాయి. వాటిల్లో పూర్తయినవి రెండు మాత్రమే. 15 వేల ఇళ్లకు మాత్రమే ఇప్పటివరకు ఆర్థిక సాయం పంపిణీ జరిగింది.ఇందులో 10 వేల ఇళ్లకు సంబంధించి తొలి విడత బేస్మెంట్ లెవల్ నిధులు రూ.లక్ష చొప్పున విడుదల కాగా, మూడు వేల ఇళ్లకు రెండో విడత, మరో రెండు వేల ఇళ్లకు గోడలకు సంబంధించిన నిధులు విడుదలయ్యాయి. మొత్తంగా రూ.100 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయ్యాయి. నిధులకు ఇబ్బంది లేదని, ప్రతి సోమవారం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేయనున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. భారీ వర్షాలు పడితే ఇసుకకూ కష్టమే..రాష్ట్రంలో వానాకాలం మొదలు కావటంతో భారీ వర్షాలు కురిస్తే ఇళ్ల నిర్మాణ పనులకు ఆటంకాలేర్పడతాయని అధికార యంత్రాంగం భయపడుతోంది. దీంతో వర్షాలు ఊపందుకోక ముందే వీలైనన్ని ఇళ్ల నిర్మాణం పూర్తిచేయాలని భావిస్తోంది. ఈ ఇళ్లకు కావాల్సిన ఇసుకను వాగులు, వంకల నుంచి సేకరించి ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తోంది. భారీ వర్షాలు కురిసి వాగులు నీటితో నిండిపోతే ఇసుక సేకరణ కూడా కష్టమవుతుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈలోపే వీలైనంత మందికి ఇసుకను సరఫరా చేయాలని నిర్ణయించారు. అది జరగాలంటే లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం ప్రారంభించాలి. ఇందుకోసం బృందాలుగా అధికారులు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి వెంటనే పనులు మొదలుపెట్టాలని కోరుతున్నారు. -
వైపరీత్యం..పెరుగుతోంది ప్రాణ నష్టం
దేశంలో వైపరీత్యాలు ఏటికేటికీ పెరుగుతున్నాయి. ఇవి ప్రాణ, ఆస్తి నష్టానికి కారణమవుతున్నాయి. భూకంపాలు, వరదలు, అకాల వర్షాలు, కొండ చరియలు విరిగిపడడం, సుడిగాలులు..ఇలా జన జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. పులి మీద పుట్రలా ప్రజా జీవనాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఇందుకు తాజాగా భారత ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలే నిదర్శనం. సాక్షి, న్యూఢిల్లీః దేశంలో గత ఏడాది ప్రకృతి వైపరీత్యాల కారణంగా మానవ మరణాల సంఖ్య గణనీయంగా ఉందని కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ తెలిపింది. తాజాగా విడుదల చేసిన ఎనీ్వస్టాట్స్ ఇండియా–2025 (పర్యావరణ గణాంకాలు) నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. వరదలు, పిడుగుపాట్లు, వడగాడ్పులు, భారీ వర్షాలు వంటి వైపరీత్యాలతో 2024–25 ఏడాదిలో దేశంలో ఏకంగా 3,080 మంది మరణించినట్లు తెలిపింది. 2013–14 ఏడాదిలో సంభవించిన మానవ మరణాల తర్వాత అత్యధిక మరణాలు గత ఏడాదే సంభవించినట్లు పేర్కొంది. నివేదికలో అంశాలివీ.. ⇒ గడిచిన 25ఏళ్లలో అంటే 2001–02 నుంచి చూస్తే అత్యధిక మరణాలు 2007–08లో 3,764, 2008–09లో 3,405, 2013–14లో 5,677 నమోదు కాగా, ఆ తర్వాత గత ఏడాదే అత్యధికంగా 3,080 మరణాలున్నాయి. ⇒ పశు మరణాల సంఖ్య మాత్రం గత ఏడాది గణనీయంగా తగ్గింది. అత్యధికంగా 2006–07లో 4,55,619 మరణించగా, 2023–24లో 1,19,683 గతేడాది 61,966 చనిపోయాయి. ⇒ ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఇళ్లు ›కూలడం వంటి నష్టాలు 2007–08లో ఏకంగా 35.27లక్షలుండగా, 2023–24లో 1.40లక్షలు, 2024–25లో మాత్రం 3.64లక్షలుగా ఉంది. ⇒ 2007–08లో 85.13లక్షల హెక్టార్లలో పంట నష్టం జరగ్గా, 2023–24లో 13.39లక్షల హెక్టార్లు, 2024–25లో 14.24 లక్షల హెక్టార్లుగా ఉంది. -
ముందస్తు నివారణ చర్యలే మేలు
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలతో తీవ్ర నష్టం జరిగిన తరువాత స్పందించడం కంటే.. నష్టం జరగకముందే నివారణ చర్యలపై ఎక్కువ దృష్టి పెట్టాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అధికారులను ఆదేశించారు. గోదావరి, కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ ఏడాది రాష్ట్రంలో సాధారణం కంటే అధిక వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ (ఐఎండీ) చెపుతున్న నేపథ్యంలో మంత్రి పొంగులేటి గురువారం సచివాలయంలో ప్రకృతి విప త్తుల నిర్వహణ ఉన్నతాధికారులు, రెవెన్యూ అధి కారులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ హైదరాబాద్ తరహాలోనే జిల్లాల్లో వరదల ముప్పును ఎదుర్కొనేందుకు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. విపత్తుల నిర్వహణ విభాగం బలోపేతానికి హైడ్రా కమిషనర్, అగి్నమాపక డీజీ, విపత్తుల నిర్వహణ కమిషనర్, కమాండ్ కంట్రోల్ సెంటర్ డైరెక్టర్, నీటిపారుదల, ఆర్అండ్బీ, ఆరోగ్య శాఖల కమిషనర్లతో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశామని, ఈ కమిటీ వారం రోజుల్లో నివేదిక ఇస్తుందని వివరించారు. తర్వాత కమిటీ నివేదిక ప్రకారం చర్యలు చేపడ్తామని తెలిపారు. వర్షాకాలం ముందుస్తుగానే వచ్చిందని, దీనిని దృష్టిలో పెట్టుకుని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, అన్ని విభాగాల అధికారులతో సమన్వయం చేసుకుని వైపరీత్యాల ప్రభావాన్ని వీలైనంత వరకు తగ్గించాలని మంత్రి ఆదేశించారు. గోదావరి, కృష్ణా నదుల పరీవాహక ప్రాంతాల్లో జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వచ్చే భారీ వర్షాల వల్ల ఊహించని వరదలు వస్తున్నాయని, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా పరీవాహక ప్రాంతాల్లోని నివాసితులను గుర్తించి వారిని అక్కడి నుంచి శాశ్వతంగా తరలించి, వారికి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. మూసపద్ధతికి స్వస్తి చెప్పండి.. విపత్తుల నిర్వహణ విభాగం మూసపద్ధతికి స్వస్తి చెప్పి, మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక సాంకేతిక పద్ధతులను, పరిజ్ఞానాన్ని అలవర్చుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సంబంధిత అధికారులను కోరారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఆయా జిల్లాల్లో పరిస్థితులను బట్టి వరదల కార్యాచరణ ప్రణాళికలను ఈనెల 30వ తేదీలోగా తయారు చేసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అలాగే వరద నియంత్రణ కట్టలు, చిన్న–మధ్య తరహా కాల్వలు, వర్షపు నీటి డ్రెయిన్లు.. మొదలైన వాటిని పరిశీలించి మరమ్మతులు చేపట్టాలన్నారు. బోట్లు, లైఫ్ జాకెట్లు, అత్యవసర ఆహార కిట్లను ముందే సిద్ధం చేసుకోవాలని చెప్పారు. ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్, ఆరోగ్య శాఖలు సమన్వయంతో పనిచేయాలని, స్థానిక సహాయక బృందాలను ఏర్పాటు చేసి, వారికి బాధితులను తరలించడం, తక్షణ స్పందన చర్యలపై శిక్షణ ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి నవీన్ మిత్తల్, విపత్తుల నిర్వహణ కమిషనర్, అగ్నిమాపక విభాగం డైరెక్టర్ జనరల్ నాగిరెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, పంచాయితీరాజ్ కమిషనర్ సృజన, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
దంచికొట్టిన వర్షాలు
సాక్షి, అమరావతి/మహారాణిపేట (విశాఖ): ఈశాన్య రాజస్థాన్ నుంచి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ మీదుగా కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. కోస్తా జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. మంగళవారం నుంచి బుధవారం వరకూ 24 గంటల వ్యవధిలో ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం పెదపాలపర్రులో 15.5 సెం.మీ. వర్షం కురిసింది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 10, గుడివాడలో 9.4, చల్లపల్లి మండలం పురిటిగడ్డలో 9.3, బాపట్ల జిల్లా కూచినపూడిలో 7.9 సెం.మీ. వర్షం కురిసింది. బుధవారం పార్వతీపురం మన్యం జిల్లా రస్తాకుంటు బాయిలో 7.2 సెం.మీ. వర్షం పడింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో 6.5, అంబేడ్కర్ కోనసీమ జిల్లా తాతపూడిలో 4.7, ప్రకాశం జిల్లా కొలుకులలో 4.4, ఆత్రేయపురంలో 4.2 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ద్రోణి ప్రభావంతో మరో రెండు, మూడు రోజులపాటు రాష్ట్రంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గురువారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కర్నూలు, నంద్యాల, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరుగా, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. శుక్రవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్ కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. -
ఎన్టీఆర్, ఏలూరు జిల్లాలకు బిగ్ అలర్ట్
సాక్షి, విశాఖపట్నం: రానున్న 24 గంటల్లో ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బాపట్ల, కృష్ణ, గుంటూరు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. వచ్చే ఐదు రోజులు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి ఉత్తరాంధ్ర తీరానికి అనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వాతావరణం.. రుతుపవనాల పురోగమనానికి అనుకూలంగా మారింది. నిన్న గుడివాడలో అత్యధికంగా 11 సెంటీమీటర్ల వర్ష పాతం నమోదైంది. కైకలూరు, మచిలీపట్టణం 7, ఏలూరు 6, నూజివీడు, భీమడోలు, రేపల్లె 5 సెంటీమీటర్ల, లేపాక్షి 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
రాష్ట్రంలో నాలుగైదు రోజులు భారీ వర్షాలు
సాక్షి, అమరావతి: వచ్చే నాలుగైదు రోజులు రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరప్రదేశ్ నుంచి పశి్చమ మధ్య బంగాళాఖాతం వరకు, ఉత్తర మధ్యప్రదేశ్, దక్షిణ ఛత్తీస్గఢ్, మధ్య ఒడిశా మీదుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రాయలసీమపై దీని ప్రభావం అధికంగా ఉంటుందని తెలిపింది. అనంతపురం, కర్నూలు, శ్రీ సత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. కోస్తా జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రధానంగా 11, 12 తేదీల్లో వర్షాలు ఎక్కువగా కురుస్తాయని, గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వివరించింది. మరోవైపు కొన్నిచోట్ల ఉక్కపోతతోపాటు ఎండ ప్రభావం ఉంటుందని తెలిపింది. మంగళవారం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో 4.3 సెంటీమీటర్లు, శ్రీకాకుళంలో 4.2, విశాఖ జిల్లా ఆనందపురంలో 3.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే ప్రకాశం జిల్లా వేమవరంలో 40 డిగ్రీలు, కొనకనమిట్లలో 39.9, తిరుపతి జిల్లా మంగ నెల్లూరు 39.9, వైఎస్సార్ కడప జిల్లా ఎర్రగుంట్లలో 39.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. -
ఏపీకి ఐఎండీ బిగ్ అలర్ట్
సాక్షి, విశాఖపట్నం: ఏపీకి భారత వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. వచ్చే వారం రోజులు వాతావరణం అల్లకల్లోలంగా ఉంటుందని చెబుతూ.. ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన చేసింది. అదే సమయంలో దక్షిణ కోస్తాలోనూ విస్తారంగా వర్షాలు పడతాయని తెలిపింది. ఉత్తర ఒడిశాను అనుకుని ఉన్న బంగాళాతంలో ఉపరితల ఆవర్తనం బలంగా కొనసాగుతోంది. రుతుపవనాల పురోగతికి మారిన వాతావరణం అనుకూలంగా మారింది. ఈ నేపథ్యంలోనే భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఒడిశాలోని గోపాల్ పూర్ వరకు నైరుతి విస్తరించి ఉంది. తీరం వెంబడి ఇప్పటికే గరిష్టంగా 40కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. ఆవర్తన ప్రభావంతో పాతపట్నంలో 5, పార్వతీపురంలో 5 ,టెక్కలి.. సాలూరు.. శ్రీకాకుళం.. ఆనందపురంలో 4, విజయనగరం, కళింగపట్నం. అనకాపల్లిలో 3 సెంమీ చొప్పున వర్షపాతం నమోదు అయ్యింది. -
ఈ నగరాలు...సముద్రం పాలు!
నదీజలాలు. నాగరికతకు పుట్టినిళ్లు. అత్యంత భారీ వర్షాలు వచ్చినప్పుడు ఉగ్రరూపంలో ఉప్పొంగినా తర్వాత సాధారణ స్థితికి వచ్చి మానవులకు ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. కానీ సముద్రజలాలు అలాకాదు. ప్రపంచవ్యాప్తంగా సముద్రతీరమున్న ఎన్నో పట్టణాలను ఇప్పుడు సముద్రజలాల పెరిగే నీటిమట్టాలు అక్కడి ప్రజల్లో ఆందోళన మట్టాలను అమాంతం పెంచేస్తున్నాయి. తరతరాలుగా తీరప్రాంతాల్లోనే స్థిరనివాసం ఏర్పాటుచేసుకుని ఉంటున్న స్థానికులను సాగరజలాలు ఇప్పుడు బద్ధశత్రువుగా మారాయి. తీవ్రమైన వ్యాధి శరీరాన్ని కబళించినట్లు ఈ సముద్రజలాలు నెమ్మదిగా ఆయా తీరప్రాంతాల సమతల భూభాగాలను శాశ్వతంగా తనలో కలిపేసుకుంటున్నాయి. శరవేగంగా పెరుగుతున్న సముద్ర నీటిమట్టాలు ఇప్పుడు కోట్లాది మంది ప్రజలకు కంటిమీద కనుకులేకుండా చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా డజనుకుపైగా తీరప్రాంతాల్లో సముద్ర నీటిమట్టాలు ఇటీవలికాలంలో చాలా అత్యధిక వేగంతో పెరుగుతున్నాయని సింగపూర్లోని నాంయాంగ్ టెక్నాలజికల్ యూనివర్సిటీ(ఎన్టీయూ) శాస్త్రవేత్తలు కుండబద్దలు కొట్టారు. 2014 నుంచి చూస్తే గత ఆరేళ్లలోనే ఏటా ఒక సెంటీమీటర్ ఎత్తు సముద్రజలాల నీటిమట్టం పెరుగుతూ తీరప్రాంతాలను శాశ్వతంగా ముంచేసినట్లు తాజా అధ్యయనంలో తేలింది. ఆసియా, ఆఫ్రికా, యూరప్, ఉత్తర అమెరికా, ద.అమెరికా ఖండాల్లో 48 తీరనగరాలకు తీరనిశోకంగా సాగరజలాలు మారాయని అధ్యయనం పేర్కొంది. వాతావరణ మార్పులకుతోడు కుంగిపోతున్న భూమి కారణంగా ఈ సమస్య తీవ్రమవుతోందని తేలింది. రెండేళ్ల క్రితం ఈశాన్యచైనాలోని తియాంజిన్ నగరంలో తీరప్రాంత వీధులన్నీ కుంగడంతో వేలాది మందిని అపార్ట్మెంట్ల నుంచి హుటాహుటిన ఖాళీ చేయించారు. 2014 నుంచి 2020 ఏడాది వరకు చూస్తే తియాంజిన్ నగర భూభాగం ఏటా 18.7 సెంటీమీటర్లమేర కుంగింది. సముద్రజలాలు పెరిగి భూగర్భజలాలు పెరగడంతో నేల కుంగింది. ముంపు బారిన ముంబై దేశ వాణిజ్య రాజధాని ముంబై మహానగరాన్నీ ముంపు సమస్య పట్టిపీడిస్తోంది. 2014 నుంచి చూస్తే సంవత్సరానికి 0.01 సెం.మీ.ల నుంచి 5.9 సెంటీమీటర్ల స్థాయిలో ముంబైలోని చాలా ప్రాంతాలను సముద్రనీరు ముంచేసింది. ఏటా 1 సెం.మీ.చొప్పున నేల సముద్రజలాల్లో కలిసిపోతున్న చోట్ల 62 లక్షల మంది జీవిస్తున్నట్లు ఎన్టీయూ అధ్యయనకారులు ప్రకటించారు. మాతుంగా ఈస్ట్లోని కింగ్ సర్కిల్ స్టేషన్ ప్రాంతం వేగంగా ముంపునకు గురవుతోంది. ఇక్కడ ఏటా 2.8 సె.మీ.ల మేర సముద్రజలాలు పెరుగుతున్నాయి. విశ్వవ్యాప్తంగా సాగరజలాలు గత ఏడాది 0.59 సెంటీమీటర్లమేర ఎగిశాయని నాసా అధ్యయనంలో స్పష్టమైంది. భూగర్భజలాలను విచ్ఛలవిడిగా తోడేయడం, ఊహించనంత బరువుతో ఆకాశహర్మ్యాలను నిర్మించడం, నిరాటంకంగా కొనసాగుతున్న మెట్రో ప్రాజెక్ట్ పనులు, చిత్తడినేలలను ప్రభుత్వాలు పునరుద్ధరించడం తదితర కారణాలు సైతం మహానగరంలోకి సాగరజలాలు చొచ్చుకొచ్చేలా చేస్తున్నాయి. కనీసం 50 లక్షల జనాభా ఉన్న సముద్రతీర నగరాల వెంట సముద్రనీటిమట్టాలు పెరుగుతున్న అంశాన్ని ఉపగ్రహాల సాయంతో విశ్లేషించి ఈ అధ్యయనం చేశారు. అగ్రరాజ్యంలోనూ.. అమెరికాలోని మయామీ సిటీని సాగరజలాలు ముంచెత్తుతున్నాయి. 2014 నుంచి 2020 వరకు చూస్తే మయామీ సిటీలో కోకోనట్ గ్రోవ్సహా చాలా ప్రాంతాలు గరిష్టంగా 2.2 సెంటీమీటర్లమేర సముద్రజలాల మట్టాలు పెరిగాయి. ఏటా 1 సెం.మీ. సముద్రనీరు పెరుగుతున్న ప్రాంతాలు 43,000 మందికిపైగా అమెరికన్లు నివసిస్తున్నారు. న్యూయార్క్ నగరంలోని క్వీన్స్ పరిధిలోని బ్రీజీ పాయింట్ వద్ద నీరు ఏటా 3 సె.మీ.ల మేర పెరుగుతోంది. ఇక్కడ ఏటా 1 సెం.మీ. సముద్రనీరు పెరుగుతున్న చోట 1,03,000 మందికిపైగా అమెరికన్లు నివసిస్తున్నారు. లాస్ ఏంజెలిస్ సిటీలోని శాన్ పెడ్రో సహా పలు తీర ప్రాంతాల్లో నీరు ఏటా 2.5 సె.మీ.ల మేర పెరుగుతోంది. హ్యూస్టన్ సిటీ పరిధిలో గరిష్టంగా ఏకంగా 11 సెం.మీ. మేర సముద్రమట్టాలు పెరుగుతున్నాయి. హ్యూస్టన్లోని సెంట్రల్ సౌత్వెస్ట్ ప్రాంతంలో ఏటా 8 సెం.మీ.ల మేర సముద్రనీరు పైకొస్తోంది.కొత్త పరిష్కారం చూపుతున్న జపాన్ భూకంపాలను తట్టుకునేలా నిర్మాణాలు చేస్తున్న జపాన్ ఇప్పుడు సముద్రమట్టాల పెరుగుదల ముప్పుకూ మరో పరిష్కారం వెతికింది. విచ్ఛలవిడిగా భూగర్భజలాలను వాడడంతో నేల కుంగి పరోక్షంగా సముద్రనీరు చొచ్చుకొస్తున్న నేపథ్యంలో గ్రౌండ్వాటర్ అతి తోడివేతకు చెక్ పెట్టింది. ఈ విషయంలో కఠిన నిబంధనలను అమలుచేస్తోంది. పటిష్టవంతమైన నీటి పారుదల వ్యవస్థను ఏర్పాటుచేసింది. 2014 ఏడాది నుంచి చూస్తే 0.01–2.3 సె.మీ.ల స్థాయిలో నేల కుంగినా ఇప్పుడు మాత్రం ఆ దురవస్థ నుంచి కాస్తంత బయటపడింది. ఎగువ ప్రాంతాలు, అడువులు, నదుల నుంచి సిటీ వైపుగా వచ్చే నీటిని నగరానికి దూరంగా ఉన్న రెండు రిజర్వాయర్లలో నింపుతోంది. అక్కడి నుంచి అవసరమైన మేరకే నీటి నగరంలో జనావాసాలకు, పరిశ్రమలకు సరఫరాచేస్తోంది. అయితే జపాన్ మోడల్ అన్ని దేశాలకు పనికొస్తుందో లేదో తెలీదు. పైగా ఇది అత్యంత ఖర్చుతో కూడిన వ్యవహారమని జపాన్లోని వసేడా యూనివర్సిటీలో ప్రొఫెసర్ మిగూయెల్ ఎస్తిబాన్ అభిప్రాయపడ్డారు. భూగర్భజలాల అతి తోడివేతను తగ్గించుకుని తైపే నగరం ఈ సమస్య నుంచి కాస్తంత బయటపడింది. దీనికితోడు బ్యాంకాక్, అమెరికాలోని హ్యూస్టన్, బ్రిటన్లోని లండన్ నగరాలు సైతం భూగర్భజాలాల అతివాడకానికి చరమగీతం పాడాయి.భూగర్భజలాలు పైకి రావడానికి కారణాలెన్నో.. తీర ప్రాంతాల వెంట భవనాల నిర్మాణం, గనుల తవ్వకం, భూఫలకాల కదలికలు, భూకంపాలు, సహజంగా భూమిపొరలు ఒత్తకునిపోవడం తదితర కారణాలతో భూమి కాస్తంత కుంగుతుంది. వీటికితోడు కింది పొరలో భూగర్భజలాలు ఉన్న చోటు నుంచి మనం నీటిని తోడేసి ఖాళీచేస్తున్నాం. దీంతో అప్పటిదాకా భూగర్భజలాలపై ఉన్న శిలలు, నేల పొరలు కిందకు పడిపోతున్నాయి. ఇలా భూమి కుంగుతోంది. ‘‘ అత్యధికంగా భూమి కుంగుతున్న 48 తీరప్రాంతాల్లో సగం ప్రాంతాలు ఈ సమస్యకు అతిగా భూగర్భజలాలను తోడేయడమే కారణం’’ అని ఎన్టీయూ పరిశోధనలో కీలక పరిశోధకురాలు చెరిక్ టే చెప్పారు. జకార్తా వంటి నగరాల్లో భూగర్భజలాలను వెలికితీయడం మరీ ఎక్కువైందని ఆయన వెల్లడించారు. ‘‘ అత్యధిక అభివృద్ధి ప్రాజెక్టులు, జనాభా ఉన్న దేశాల్లో అధిక భూగర్భజలాల వినియోగం కనిపిస్తోంది. ముఖ్యంగా, ఆసియా, తూర్పు ఆసియా ప్రాంతాల్లో ఈ సమస్య తీవ్రమవుతోంది. తక్కువ ఎత్తున్న డెల్టా ప్రాంతాల్లో వెలిసిన నగరాలకు ఈ సమస్య మరీ ఎక్కువ. సముద్రంలో కలవడానికి ముందే ఎక్కువ పాయలుగా విడిపోయి ప్రవహించే నదుల వెంట ఉన్న ప్రాంతాల్లోనూ ఇదే సమస్య కనిపిస్తోంది. జకార్తా, బ్యాంకాక్, హో చి మిన్ సిటీ, షాంఘైలకు ఈ ముంపు ముప్పు ఎక్కువ. జకార్తా సిటీలో సగం ప్రాంతాలు సముద్ర నీటిమట్టం కంటే తక్కువ ఎత్తులో ఉండటం గమనార్హం. 1970 ఏడాదితో పోలిస్తే జకార్తాలో ప్రస్తుతం పలు ప్రాంతాలు 4 సెం.మీ. కుంగిపోయాయి. ఈ కారణంగానే తీరానికి కాస్తంత దూరంగా నుసంతారా పేరిట కొత్త రాజధానిని ప్రభుత్వం నిర్మిస్తోంది. ‘‘ తీరం వెంట మా ఇల్లు ఉంది. ఇంటి కిటికీలు నా చిన్నప్పుడు మెడ ఎత్తులో ఉండేవి. ఇప్పుడు మోకాలు ఎత్తుకు వచ్చేశాయి. నేలపై సముద్రనీరు చొచ్చుకొచ్చి నప్పుడల్లా మా ఇంటి అడుగును పూడుస్తూ వచ్చాం. దీంతో గ్రౌండ్ఫ్లోర్లో ఇంటి ఎత్తు తగ్గుతూ వస్తోంది. చివరకు గ్రౌండ్ఫ్లోర్ మొత్తం మునిగిపోతుందో, ఇల్లే కూలిపోతుందో మాకే అర్థంకావట్లేదు’’ అని నార్త్ జకార్తాలోని ఎర్నా, ఆమె తల్లి సోనీ వాపోయారు. తాత్కాలిక ప్రత్యామ్నాయాలు జకార్తా, ఈజిప్్టలోని అలెగ్జాండ్రియా, వియత్నాంలోని హో చీ మిన్ సిటీల్లోకి పెరిగిన సముద్రమట్టాలు చొచ్చుకురాకుండా గోడలు, అవరోధాలు నిర్మించారు. వచ్చిన నీరు అక్కడే తిష్టవేయకుండా కందకాల వంటి తవ్వి నీటిని మరో చోటుకు మళ్లించారు. అయితే ‘‘గోడలు ఒకరకంగా మంచిచేస్తే మరోరకంగా చేటుచేస్తున్నాయి. ఎగువ నుంచి వరద వస్తే మళ్లీ ముంపు సమస్య అలాగే ఉండిపోతుంది’’ అని ఇటలీలోని పడోవా యూనివర్సిటీలో ప్రొఫెసర్ పెట్రో తియాటినీ చెప్పారు. షాంఘై వినూత్న పంథా షాంఘై నగరం వాటర్ ఇంజెక్షన్ అనే కొత్త విధానాన్ని అవలంబిస్తోంది. యాంగ్జే నది నుంచి సేకరించిన నీటిని శుద్ధిచేసి ఆ నీటిని బావులు, ఇతర మార్గాల ద్వారా నేలలోకి పంపిస్తోంది. నీటిని తోడేందుకు వేసిన బోరుబావుల రంధ్రాల నుంచి నీటిని నేలలోకి పంపుతోంది. అలా భూగర్భజలాల మట్టాలను పెంచుతోంది. తద్వారా భూగర్భజలాల సమతుల్యతను కాపాడుతోంది. చైనాలోని చోంగ్క్విన్, ఎల్సాల్విడార్లోని శాన్ సాల్విడార్ సిటీలో ‘స్పాంజ్ సిటీ’ పంథాలో వెళ్తున్నాయి. అత్యధిక నీటిని పీల్చుకునే మట్టిరకం, చెట్లు, గడ్డిని పెంచుతున్నాయి. అదనంగా వచ్చిన నీరు పార్కుల్లోకి, చిత్తడినేలల్లోకి వెళ్లేలే ఏర్పాట్లుచేశారు. ‘‘అదనపు నీటిని నిల్వచేసేందుకు పేద్ద రిజర్వాయర్ కట్టాలంటే చాలా ఖర్చు అవుతుంది. దీనితో పలిస్తే పదో వంతు వ్యయంతోనే సమస్యకు పరిష్కారం వెతకొచ్చు’’ అని వర్జీనియా టెక్ వర్సిటీలో ప్రొఫెసర్ మనోòÙహర్ షెర్జాయీ చెప్పారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అసోంలో తగ్గని వరద తీవ్రత
గువాహటి: అసోంలో వరదల తీవ్రత గురువారం కూడా కొనసాగింది. మొత్తం ఏడు లక్షలమంది వరదలతో ప్రభావితులు కాగా, 21 జిల్లాల పరిధిలోని ప్రధాన నదుల్లో నీటి మట్టం అంతకంతకూ పెరుగుతోంది. వరదలు, కొండచరియలు విరిగి పడిన ఘటనల్లో మృతుల సంఖ్య 19కి చేరింది. బ్రహ్మపుత్ర సహా మొత్తం తొమ్మిది ప్రధాన నదులు ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. బరాక్, ఉపనదులు చచార్ జిల్లాలో ఉగ్రరూపాన్ని చూపుతున్నాయి. శ్రీభూమి జిల్లాలో అత్యధికంగా 339 గ్రామాల్లోని 2.60 లక్షల మందిపై వరద ప్రభావం పడింది. రాష్ట్రంలో వరదలతో మొత్తం 15 వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. కజిరంగా నేషనల్ పార్క్ జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఇలా ఉండగా, సిక్కింలోని చటెన్లో వరదల్లో చిక్కుకున్న 63 మంది హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వీరిలో ఎక్కువ మంది పర్యాటకులే కావడం గమనార్హం. చెటెన్లో చిక్కుకున్న మరో 64 మందిని బయటకు తీసుకువచ్చేందుకు ఆర్మీ, స్థానిక యంత్రాంగం ప్రయత్నాలు సాగిస్తున్నాయి. వాతావరణం అనుకూలించకపోవడంతో ఆలస్యమవుతోందని అధికారులు అంటున్నారు. -
నేడు, రేపు రాష్ట్రంలో భారీ వర్షాలకు అవకాశం
సాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించాయి. బుధవారం రాత్రికి ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లో మొత్తంగానూ, మహారాష్ట్ర, తెలంగాణలో చాలా భాగాలు, చత్తీస్ఘఢ్, ఒడిశాల్లో కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయి. మరోవైపు వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర దిశగా కదులుతోంది. ఇది గురువారం మధ్యాహ్నానికి ఉత్తర బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశముంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే సూచనలున్నట్లు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు.అల్లూరి, పార్వతీపురం మన్యం, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలకు ఆస్కారం ఉందని వెల్లడించారు. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి వానలు పడతాయని తెలిపారు. వాయుగుండం ప్రభావంతో తీరం వెంబడి గంటకు 40–50, గరిష్టంగా 60 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొన్నారు. రాష్ట్రంపై వర్షాల ప్రభావం జూన్ 1 వరకూ కొనసాగనుంది. అనంతరం క్రమంగా వర్షాలు తగ్గుముఖం పట్టి.. పొడి వాతావరణం ఉంటుందనీ.. జూన్ 10 తర్వాత నుంచి వర్షాలు జోరందుకుంటాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. -
అకాల వర్షాలు.. కొండెక్కిన ధరలు.. ఇలాగే ఉంటే...!
దాదర్: గత వారం, పదిరోజులుగా రాష్టవ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలవల్ల వివిధ రకాల పంటలతోపాటు కూరగాయల తోటలకు అపార నష్టం వాటిల్లింది. వర్షాలకు అనేక ప్రాంతాల్లో కూరగాయల తోటలు నీటమునిగాయి. కొన్ని చోట్ల ట్రక్కులు, టెంపోలలో రవాణాకు సిద్ధంగా ఉంచిన కూరగాయలు కుళ్లిపోవడంతో అక్కడే రోడ్లపై పారేయాల్సిన పరిస్ధితి వచి్చంది. ఫలితంగా న్యూ ముంబై వాషిలోని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ (ఏపీఎంసీ), అలాగే థానేలోని హోల్సేల్ మార్కెట్లలో కూరగాయల లోడుతో వచ్చే వాహనాల సంఖ్య తగ్గిపోయింది. సరుకు కొరత ఏర్పడడంతో కూరగాయల ధరలు మండి పోతున్నాయి. మొన్నటి వరకు స్ధిరంగా ఉన్న కూరగాయల ధరలు ఇప్పుడు అకాల వర్షాల వల్ల చుక్కలను తాకుతున్నాయి. అసలే వర్షాలు, ఆపై కూరగాయల కొరత, ధరల పెరుగుదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. 18 ఏళ్ల తరువాత మళ్లీ... రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో గత వారం, పదిరోజులుగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఏడాది వర్షాలు కొంత ముందుగానే ఆరంభమవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించినప్పటికీ 20 రోజుల ముందుగానే ఊహించని వర్షాలతో సామాన్య జనాలతో పాటు రైతులు కూడా ఆందోళనకు గురయ్యారు. గత 18 ఏళ్ల కిందట మే నెలలో భారీ వర్షాలు కురిశాయి. ఆ తరువాత మళ్లీ ఇప్పుడు కురుస్తున్న భారీ వర్షాలు రికార్డు బ్రేక్ చేశాయని కొలాబా, శాంటాకృజ్ వాతావరణ శాఖలు తెలిపాయి. చదవండి: గంగి గోవు పాలు...గడ్డిపోచ..ఏది ఘనమైనది?!ఇలాగే ఉంటే...మరింత పైపైకి... కొద్ది నెలలుగా స్ధిరంగా కూరగాయలు, ఉల్లి, బంగాళదుంపలు, టమాటాలు, ఆకు కూరల ధరలు కొద్ది నెలలుగా స్థిరంగా ఉంటుండటంతో కొద్దిగా ఊపిరి పీల్చుకుంటున్న ప్రజలు అకాల వర్షాలు, ధరల పెరుగుదలతో బెంబేలెత్తిపోతున్నారు. కొరత కారణంగా వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరల ధరలు ఇప్పటికే 10–20 శాతం పెరిగాయి.రాష్ట్రంలోని అనేక జిల్లాలో రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయి. దీంతో రవాణా వ్యవస్థ స్తంభించి పోయింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోవడంతో సరుకులు కుళ్లీపోకే ముందే అక్కడే ఖాళీ చేస్తున్నారు. తక్కువ ధరకు విక్రయించి కనీసం పెట్టుబడి రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. పరిస్ధితి ఇలాగే ఉంటే రేట్లు మరింత పెరిగే అవకాశముందని వ్యాపారులు అంటున్నారు.ఇదీ చదవండి: స్కూల్ కోసం ఏకంగా రూ. 15 కోట్లు : అపూర్వ సహోదరులు -
ఐఎండీ అలర్ట్.. ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
హైదరాబాద్: దేశంలో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. మహారాష్ట, గోవా, సౌత్, కర్ణాటకకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, రాజస్థాన్, హిమాచల్ప్రదేశ్, రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన ఐఎండీ.. ముంబైలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. కర్నాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కర్ణాటక తీర ప్రాంతాల్లో మరో ఐదు రోజులపాటు రెడ్అలర్ట్ అమల్లోనే ఉంటుందని అధికారులు ప్రకటించారు. మంగళూరు సిటీలో చాలా లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచింది. దక్షిణ కన్నడ జిల్లాలో కొండప్రాంతాల్లో స్వల్పస్థాయిలో కొండచరియలు విరిగిపడిన ఘటనలు నమోదయ్యాయి.రెడ్ అలర్ట్ రాష్ట్రాలు: మహారాష్ట, గోవా, సౌత్, కర్ణాటకఆరెంజ్ అలర్ట్ రాష్ట్రాలు: కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, రాజస్థాన్, హిమాచల్ప్రదేశ్ఆంధ్రప్రదేశ్: శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలుతెలంగాణ: ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో భారీ వర్షాలుదక్షిణమధ్య బంగాళాఖాతం, ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. నైరుతి సీజన్లో బంగాళాఖాతంలో ఏర్పడే ఉపరితల ఆవర్తనం, అల్పపీడనాలు, వాయుగుండాలు, తుపానుల ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈసారి రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించిన మర్నాడే అల్పపీడనం ఏర్పడటంతో భారీ వర్షాలు కురవొచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.ఏపీలోని శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో రానున్న మూడు రోజులు తెలంగాణవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీ, ఇంకొన్ని చోట్ల అతిభారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. -
YS Jagan: పొదిలి పర్యటన వాయిదా
సాక్షి, ప్రకాశం: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) పొదిలి పర్యటన వాయిదా పడింది. రేపు(బుధవారం, మే 28) ఆయన అక్కడ పర్యటించాల్సి ఉంది. అయితే.. భారీ వర్షాల నేపథ్యంతో పొదిలి పర్యటన(Podili Tour) వాయిదా పడిందని వైఎస్సార్సీపీ ఓ ప్రకటనలో తెలిపింది. వాతావరణం అనుకూలించిన తర్వాత పర్యటన విషయమై తదుపరి ప్రకటన చేస్తామని వెల్లడించింది. కూటమి పాలన(Kutami Prabhutvam)లో మద్ధతు ధర లేక రైతాంగం అష్టకష్టాలు పడుతోంది. ఈ నేపథ్యంలో పొదిలి పొగాకు వేలం కేంద్రానికి వెళ్లి స్వయంగా వారి సమస్యలు తెలుసుకోవాలని వైఎస్ జగన్ భావిస్తున్నారు.ఇదీ చదవండి: కోనసీమ విషాదంపై జగన్ తీవ్ర దిగ్భ్రాంతి -
ముంబై అతలాకుతలం.. నీటిలో మహా నగరం (ఫొటోలు)
-
ముందస్తు నైరుతి ఎందుకంటే..!
రుతుపవనాల రాక కోసం కర్షకుడు ఆకాశంకేసి కళ్లు కాయలు కాచేలా చూస్తాడు. హలధారితో దోబూచులాడే రుతుపవనాలు ఈసారి రైతన్నలను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తూ ఆగమేఘాల మీద దూసుకొచ్చి వర్షాలను దంచికొడుతున్నాయి. అడవుల నరికివేత, యథేచ్ఛగా సాగుతున్న మానవ కార్యకలాపాలు, శిలాజ ఇంధనాల విచ్చలవిడి వినియోగం తదితరాలతో వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్ సంభవించిన కారణంగానే రుతుపవనాలు ఇలా ముందుగా వచ్చేశాయని ఎన్నో విశ్లేషణలు వెలువడుతున్నాయి. అయితే ఇలా ముందస్తు వర్షాలు గతంలో సర్వసాధారణమని వాదించే వాళ్లూ ఉన్నారు. దీంతో ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ముందస్తు రాకకు కారణాలేంటి అనే దానిపై ఇప్పుడు చర్చ మొదలైంది. గతంలోనూ ముందొచ్చాయి కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలో నైరుతి రుతుపవనాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఊరకే రాష్ట్రాలను చుట్టేయకుండా భారీ వర్షాలతో పలకరించి ఈసారి అధిక వర్షాలు ఖాయమని కబురును రుతుపవనాలు మోసుకొచ్చాయి. అయితే ఇలా ముందస్తు రాక కొత్తేమీ కాదని గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. ఈసారి పలు రాష్ట్రాల్లోకి రెండు వారాల ముందే రుతుపవనాలు ప్రవేశించడంతోపాటు కేరళ నుంచి మహారాష్ట్రదాకా అవి వేగంగా, విస్తారంగా మే 24న ఒక్కరోజులోనే విస్తరించడం విశేషం. ఇది అసాధారణమేమీ కాదని, కేవలం అరుదైన విషయమని గణాంకాలు చాటుతున్నాయి. 1971 ఏడాదిలోనూ రుతుపవనాలు కర్ణాటకలో అధిక భాగం, మహారాష్ట్రలో కొంత మేర ఒకేసారి విస్తరించి అప్పుడు అందర్నీ విస్మయానికి గురిచేశాయి. మళ్లీ దాదాపు యాభై ఏళ్ల తర్వాత ఇదే తరహాలో రుతుపవనాలు ఒకేసారి విస్తరించాయి. ఆ తర్వాత కాస్తంత బ్రేక్ జూన్ రెండో తేదీదాకా రుతుపవనాలు ఇదే వేగంతో విస్తరిస్తాయని వాతావరణ శాఖ వర్గాలు అంచనావేస్తున్నాయి. మహారాష్ట్ర, తూర్పు భారతాన్ని త్వరగా చుట్టుముట్టాక వేగం తగ్గే వీలుంది. గతంలో మాది రే వేగం నెమ్మదించి మెల్లిగా రుతుపవనాలు ముందుకు సాగనున్నాయి. మధ్య స్థాయి ఎత్తులో పొడి వాతావరణం ఏర్పడటంతో జూన్ మొదటి వా రం తర్వాత వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. తరచూ వర్షాలు పడే అవకాశాలు సన్నగిల్లుతాయి. రుతుపవనాల గమన వేగం సైతం తగ్గనుంది. ముందస్తుపై వాతావరణ మార్పుల ప్రభావం సహజ వాతావరణ వ్యవస్థతోపాటు మానవ ప్రేరేపిత భూతాపోన్నతి, గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పులు వంటి అంశాలూ రుతుపవనాలపై ప్రభావం చూపిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతానికైతే భారత్లో రుతుపవనాల రాకపై వాతావరణ మార్పుల ప్రభావం పరిమిత స్థాయిలోనే ఉందని వారు అభిప్రాయపడ్డారు. భూతాపోన్నతి దెబ్బకు యురేసియా, హిమాలయ ప్రాంతాల్లో మంచు దుప్పటి కరిగిపోతోంది. 1990–2020 కాల సగటుతో పోలిస్తే ప్రస్తుతం యురేసియా, హిమాలయాల పరిధిలో మంచు 15 శాతం అంతరించిపోయింది. తక్కువ మంచు కారణంగా ఉపరితల ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీంతో రుతుపవనాలు ప్రేరేపితమై త్వరగా వస్తాయి. ఒక్కోసారి మే నెల మధ్యలోనే ఇవి రావొచ్చు. గ్లోబ ల్ వార్మింగ్లో పెరిగే ప్రతి ఒక్క డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతకు సముద్రాలపై వాతావరణంలో తేమ 6–8 శాతం పెరుగుతుంది. పారిశ్రామిక విప్లవానికి ముందునాటితో పోలిస్తే 2025లో ఉష్ణోగ్రత 1.2 డిగ్రీ సెల్సియస్ పెరిగిందని ఇప్పటికే గణాంకాలు చాటుతున్నాయి.ఈ నేపథ్యంలో అరేబియన్ సముద్రం, బంగాళాఖాతం ఉపరితల వాతావరణంలో తేమ పెరిగి మే నెలలోనే మేఘాల అధిక ఆవిర్భావానికి దారితీసింది. కర్ణాటక–గోవా తీరం వెంట ద్రోణి కారణంగా తుపాను పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇవి ఈసారి రుతుపవనాలను మరింత ముందుకు లాగాయి. మారిషస్, మడగాస్కర్ల మధ్య తక్కువ ఎత్తులో వీచే పవనాల దృగ్విషియాన్ని సోమాలీ జెట్గా పిలుస్తారు. ఇది ఈనెలలోనే విజృంభించింది. ఈ గాలులు అరేబియా సముద్రం మీదుగా భారత పశి్చమ తీరం వైపు వీస్తాయి. ఇవి కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్రలనూ తాకుతాయి. ఈసారి సోమాలీ జెట్ గాలుల ప్రభావం తోడవడంతో నైరుతి పవనాలు త్వరగా వచ్చేశాయి. మరెన్నో కారణాలు.. భౌగోళిక, సముద్ర, వాతావరణ పరిస్థితుల మధ్య సమన్వయంలో తేడా సైతం ఈసారి రుతుపవనాల ఆగమనాన్ని ముందుకు తోసింది. భూమధ్యరేఖ జోన్లో ప్రతి 30 నుంచి 60 రోజులకు ఒకసారి సముద్రజలాల మీదుగా మేఘాలు, వర్షాలు, పవనాలు ఒక క్రమపద్దతిలో ముందుకు సాగుతాయి. దీనినే మేడిన్ జూలియన్ ఆసిలేషన్(ఎంజేఓ)గా పిలుస్తారు. ఎంజేఓ అనేది రుతుపవనాల్లో తేమ, పొడి దశలను నిర్దేశిస్తుంది. ఈనెలలో ఎంజేఓ మూడో దశలోఉంది. ఇది మేఘావృత స్థితిని అధికం చేసి దక్షిణభారతంలో వర్షాలను కురిపిస్తుంది. మే 25వ తేదీన ఇది నాలుగోదశకు మారడంతో హిందూ సముద్రం నుంచి మరింత తేమ పవనాల రూపంలో భారత్పై కురిసింది. ఈసారి ఎల్నినో సైతం తటస్థ వైఖరిని ప్రదర్శించడంతో రుతుపవనాలకు అనుకూల వాతావరణం ఏర్పడింది. అందుకే ఈసారి వర్షాలు ముందే పడ్డాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలో అన్నదాతల ఆవేదన
-
దెబ్బతిన్న ముందుభాగంతోనే లాండింగ్
శ్రీనగర్: 220 మందికి పైగా ప్రయాణికులతో బుధవారం ఢిల్లీ నుంచి శ్రీనగర్ బయల్దేరిన ఇండిగో విమానానికి పెనుప్రమాదం తప్పింది. భారీ వర్షాలు, ఈదురు గాలుల నేపథ్యంలో ప్రయాణం ఆద్యంతం విమానం భారీ కుదుపులకు లోనైంది. పైలట్ అత్యవసరంగా శ్రీనగర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ను సంప్రదించాడు. తీవ్ర ప్రతికూల వాతావరణ పరిస్థితుల మధ్యే సాయంత్రం 6.30కు విమానాన్ని సురక్షితంగా లాండ్ చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులంతా తీవ్ర భయాందోళనలకు లోనై దైవప్రార్థనలు చేస్తున్న దృశ్యాలకు సంబంధించిన వీడియోలతో పాటు విమానం తాలూకు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైన ఫొటోలు వైరల్గా మారాయి. అది లాండింగ్కు ముందే విరిగిపోయిందని, చావు ముంగిటి దాకా వెళ్లొచ్చామని ఓ ప్రయాణికుడు చెప్పుకొచ్చాడు. -
హైదరాబాద్లో దంచికొడుతున్న వర్షం
హైదరాబాద్, సాక్షి: నగరంలో పలుచోట్ల వర్షం దంచికొడుతోంది. సికింద్రాబాద్, బేగంపేట్, బోయిన్పల్లి, బంజారాహిల్స్, మోహిదీపట్నం, ఆసిఫ్నగర్, కార్వాన్, మలక్పేట్, సైదాబాద్, చాదర్ ఘాట్, మారేడుపల్లి, షేక్పేట్, మాదాపూర్, గచ్చిబౌలి, అత్తాపూర్, అంబర్పేట్, అత్తాపూర్, రాజేంద్రనగర్, నల్లకుంట, నాచారం, తార్నాక, తిరుమలగిరి, అల్వాల్, బొల్లారం, ఉప్పల్, రామంతాపూర్లో భారీ వర్షం కురుస్తోంది.ద్రోణి, ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని నగరం హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో బుధవారం మధ్యాహ్నాం నుంచి ఈదురు గాలులు, పిడుగులతో కూడిన వానలు పడుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ‘రెయిన్ అలర్ట్’ జారీ చేసింది.ఉపరితల ద్రోణి ఉదయం నుంచి హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాలపై మేఘాలు కమ్ముకోగా.. మధ్యాహ్నాం నుంచి పలుచోట్ల ఈదురు గాలులతో వర్షం(Hyderabad Rains) కురుస్తోంది. కొన్ని చోట్ల చిరుజల్లులు, మరికొన్ని చోట్ల ఓ మోస్తరు వాన పడుతోంది. మలక్ పేట్, నాంపల్లి, చార్మినార్, దిల్సుఖ్ నగర్, కోఠి, రామంతపూర్, అబిడ్స్, అంబర్పేట్.. తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఖైరతాబాద్, లక్డీకాపూల్, రాజ్ భవన్, ట్యాంక్ బండ్ సమీపంలో స్వల్ప వర్షంతో మొదలై.. జడి వానగా మారింది. నగర శివారు ప్రాంతాల్లో చోట్ల చిరు జల్లులు పడుతున్నాయి. మరికొన్ని గంటల్లో జంట నగరాల వ్యాప్తంగా పూర్తి స్థాయిలో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. అలాగే.. రాత్రి సమయంలో హైదరాబాద్లో తీవ్రమైన తుఫాను(Cyclone) వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ(GHMC) అప్రమత్తం అయ్యింది. సాయంత్రం పనులు ముగించుకుని వెళ్లేవాళ్లను అప్రమత్తం చేస్తోంది. మ్యాన్ హోల్స్, కరెంట్ పోల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని నగర ప్రజలకు సూచించింది.ఇదిలా ఉంటే.. ద్రోణి, ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాజధాని నగరంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో(Telangana Rains) ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులపాటు ఈదురు గాలులు, పిడుగులతో కూడిన భారీ వానలు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్లు జారీ చేసింది. ఇక పంట చేతికొచ్చే సమయం కావడంతో అప్రమత్తంగా ఉండాలని రైతులకు అధికార యంత్రాంగం సూచిస్తోంది. తెలంగాణకు రెయిన్ అలర్ట్వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. రాష్ట్ర వ్యాప్తంగా రెయిన్ అలర్ట్ జారీ చేసింది. సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉండడంతో.. అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ముందస్తు ప్రణాళికలతో సమన్వయం చేసుకోవాలని సూచించింది. అలాగే..ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్లను సైతం అందుబాటులో ఉండాలని ఆదేశించింది.‘‘ఋతుపవనాలు ముందుగా రాబోతున్నాయి. అన్ని విభాగాలు అప్రమత్తంగా ఉండాలి. 2024లో కురిసిన భారీ వర్షాలకు NDRF అందుబాటులో లేకపోవడంతో గోల్డెన్ అవర్ కోల్పోయాం. 2024 సెప్టెంబర్ లాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కావొద్దు. జిల్లాల్లో కలెక్టర్లు ముందస్తు ప్రణాళికలు, సమన్వయం చేసుకోవాలి. సింగరేణి లో ప్రత్యేక శిక్షణ పొందిన రెస్క్యూ టీమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి’’ అని సర్క్యులర్లో డిజాస్టర్స్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ అరవింద్ కుమార్ పేర్కొన్నారు. సీఎం రేవంత్ కీలక ఆదేశాలుముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం సీఎస్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, వాతావరణ శాఖ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ‘‘ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మార్కెట్లలో ఉన్న ధాన్యం తడవకుండా తగిన రక్షణ చర్యలు చేపట్టాలి. కలెక్టర్లు.. కాంటాలు వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడకుండా తగిన చర్యలు చేపట్టాలి.హైదరాబాద్ సిటీలో వర్షం కురుస్తున్న ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిల్వ లేకుండా చూడాలి. ట్రాఫిక్ ఇబ్బందులు, విద్యుత్తు సమస్యలు లేకుండా చూడాలి. జీహెచ్ఎంసీ, పోలీస్, హైడ్రా, ట్రాఫిక్, విద్యుత్తు విభాగాలు సమన్వయంతో పని చేయాలి. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలి’’ అని సీఎస్ను ఆదేశించారాయన. ఇదీ చదవండి: సూర్యుడిపైకి సాగర మేఘాలు -
వేగంగా విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు
సాక్షి, అమరావతి/మహారాణిపేట: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మంగళవారం రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఎన్టీఆర్, కృష్ణా తదితర జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. గడిచిన 24 గంటల్లో బాపట్ల జిల్లా కూచినపూడిలో 7.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. విశాఖ రూరల్లో 7.5, కృష్ణా జిల్లా ఘంటశాలలో 7.1, కాకినాడలో 6.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కాకినాడ జిల్లా కరపలో 6.5 సెం.మీ వర్షం పడింది. అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోనూ పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. చిత్తూరు జిల్లా కటికపల్లిలో 5.3 సెంటీమీటర్లు, కోనసీమ జిల్లా మండపేటలో 4.8, కాకినాడ జిల్లా ఆర్యావటంలో 4.6, మధ్యకొంపలులో 4.4 సెంటీమీటర్ల వర్ష పాతం నమోదైంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో వచ్చే రెండు రోజులు రాష్ట్రంలో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంటుందని తెలిపింది. 4, 5 రోజుల్లో కేరళను తాకనున్న రుతుపవనాలు అనుకూల వాతావరణ పరిస్థితులు నెలకొనడంతో నైరుతి రుతుపవనాలు 4, 5 రోజుల్లో కేరళను తాకే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వేగంగా విస్తరిస్తున్న రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, కొమోరిన్ ప్రాంతంలోని మిగిలిన ప్రాంతాలు, లక్షద్వీప్ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలు, కేరళ, తమిళనాడు, బంగాళాఖాతం, ఈశాన్య రాష్ట్రాల్లో ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా మారే అవకాశం ఏర్పడిందని పేర్కొంది. -
భారీ వర్షానికి తడిసి ముద్దైయిన ప్రపంచ స్థాయి రాజధాని అమరావతి
-
ఏపీలోకి ముందుగానే నైరుతి రుతుపవనాలు
-
ఏపీకి బిగ్ అలర్ట్.. ఐదు రోజుల పాటు భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: రానున్న ఐదు రోజుల పాటు ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వానలు కురుస్తాయని పేర్కొంది. నేడు అల్లూరి, మన్యం, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి కేంద్రకృతమైంది. నిన్న శ్రీకాకుళం, ఏలూరు జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది.కాగా, తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. ఇక, గురువారం తెల్లవారుజాము నుంచి హైదరాబాద్లో వర్షం కురుస్తోంది. మరో రెండు గంటల పాటు పలుచోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఏపీలో భిన్నమైన వాతావరణం నెలకొంది. ఓవైపు ఎండలు.. మరోవైపు వానలు దంచికొడుతున్నాయి. మరో ఐదు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక, నిన్న శ్రీకాకుళం జిల్లాల్లో 5.3 సెంమీ వర్షపాతం నమోదైంది. అనంతపురం జిల్లా వ్యాప్తంగా అర్ధరాత్రి పలు చోట్ల భారీ వర్షం కురిసింది. రాప్తాడు, కందుకూరు, ఆకుతోటపల్లి వద్ద కాలనీలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను పోలీసులు, ఫైర్ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు. -
"చివరికి ప్రకృతి కూడా కరుణించింది! 'సూపర్ సిక్స్' చలని కబురు ఎప్పుడు వింటామో..ఏమో! "
-
ఏపీకి చల్లని కబురు.. నాలుగురోజుల పాటు విస్తార వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో నాలుగు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కోస్తా, రాయలసీమలో నాలుగు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో పిడగులు పడే ప్రమాదం ఉందని.. గంటకు 40-50 కిమీ వేగంతో గాలుల తీవ్రత ఉండన్నాయని.. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.కాగా, తెలంగాణలో ఎండలు తీవ్రం కానున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. రానున్న రెండు రోజులు సాధారణం, అంతకంటే కాస్త ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. వాస్తవానికి గత ఐదు రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సాధారణం కంటే 1 నుంచి 4 డిగ్రీ సెల్సీయస్ తక్కువగా నమోదయ్యాయి.అయితే ప్రస్తుతం వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ కారణంగా వచ్చే రెండు రోజులు ఉష్ణోగ్రతలు కాస్త పెరుగుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సాధారణ ఉష్ణోగ్రతలే నమోదైనప్పటికీ ఉక్కపోత పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు.దక్షిణాది జిల్లాలకు వర్ష సూచన ప్రస్తుతం మరత్వాడ నుంచి అంతర్గత కర్ణాటక, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఇది సముద్రమట్టం నుంచి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని దక్షిణ ప్రాంత జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశంం ఉంది. -
అకాల వర్షాలు, అన్నదాతకు అంతులేని శోకం
సాక్షి, ముంబై: జల్గావ్ జిల్లాలో మంగళవారం కురిసిన వడగళ్ల వానలు, తుఫానుల గాలులు, అకాల వర్షాల ప్రభావంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మొత్తం 7,235 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని, 4,279 హెక్టార్లలో విస్తరించి ఉన్న అరటి తోటలు నేలమట్టమయ్యాయి. తీవ్ర పంటనష్టంతో రైతులకు ఆరి్థకంగా కోలుకోలేని దెబ్బ తగిలిందని జిల్లా వ్యవసాయ సూపరింటెండెంట్ కార్యాలయం తెలిపింది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు, భారీ వర్షాలు జిల్లాలోని 14 తాలూకాలలో పంటలను ప్రభావితం చేశాయి. అమల్నేర్ మినహా మిగిలిన అన్ని తాలూకాల్లో వడగళ్ల వానలు బొప్పాయి, మొక్కజొన్న, జొన్న, మిల్లెట్, ఉల్లిపాయ, బీన్స్ పంటలు దెబ్బతిన్నాయి. ఒక్క జల్గావ్ తాలూకాలోనే అత్యధికంగా 1,320 హెక్టార్లలో అరటి తోటలు ధ్వంసమయ్యాయి. చోప్డాలో 663 హెక్టార్లు, రావర్లో 519 హెక్టార్లు, యావల్లో 436 హెక్టార్లు, ఎరండోల్లో 254 హెక్టార్లు, ముక్తాయ్నగర్లో 250 హెక్టార్ల మేర నష్టం వాటిల్లింది. అలాగే 717 హెక్టార్లలో మొక్కజొన్న, 507 హెక్టార్లలో మినుములు, 214 హెక్టార్లలో జొన్న, 301 హెక్టార్లలో ఉల్లిపాయ, 249 హెక్టార్లలో బొప్పాయి, 751 హెక్టార్లలో ఇతర పంటలు దెబ్బతిన్నాయి. ఇక, ధరణగావ్ తాలూకాలోని ఎక్లగ్న బుద్రుక్ గ్రామంలో పిడుగుపాటుకు రెండు గేదెలు మతి చెందగా, చోప్డా తాలూకాలోని పుంగావ్ గ్రామంలో యువరాజ్ బావిస్కర్ అనే రైతు గేదెపై చెట్టు పడటంతో మరణించిందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో రైతులు నష్టపరిహారం కోసం ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన కింద నమోదు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ సూపరింటెండెంట్ ఖుర్బాన్ తడ్వి సూచించారు.ఫిర్యాదుల కోసం హెల్ప్లైన్ నంబర్ 14447 లేదా వాట్సాప్ నంబర్ 7065514447 ను సంప్రదించవచ్చని తెలిపారు. -
పలుచోట్ల వర్షం
సాక్షి, అమరావతి: విభిన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో మంగళవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో రాష్ట్రంలో పలుచోట్ల వర్షం కురిసింది. చిత్తూరు జిల్లా కార్వేటినగరంలో 78.5 మిల్లీమీటర్లు, ప్రకాశం జిల్లా పెద్దరావీడులో 59.2, తిరుపతి జిల్లా పుత్తూరులో 58.7, ప్రకాశం జిల్లా మార్కాపురంలో 37 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదయింది. నేడు పలు ప్రాంతాల్లో భారీవర్షాలు రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఓ పక్క విపరీతంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలుంటే సాయంత్రానికి ఆకాశం మేఘావృతమై అధికవర్షం పడుతోంది. మంగళవారం చిత్తూరు జిల్లా తవణంపల్లెలో 42.4 డిగ్రీలు, తిరుపతి జిల్లా రేణిగుంట, నంద్యాల జిల్లా దొర్నిపాడులో 42.1, వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్టలో 41.3, కర్నూలు జిల్లా కామవరంలో 41నిడిగ్రీల సెంటీగ్రేడ్ చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. బుధవారం గరిష్ట ఉష్ణోగ్రతలు 42ని–43 డిగ్రీల మధ్య ఉండవచ్చని తెలిపింది.అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు, గంగవరం మండలాల్లో మోస్తరు నుంచి భారీవర్షాలు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చని, 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఈదురుగాలుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు హోర్డింగ్స్, చెట్లకింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలకు సమీపంలో ఉండరాదని సూచించింది. గురువారం నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగే అవకాశం ఉందని తెలిపింది. -
చల్లబడిన ఏపీ.. ఈదురుగాలులతో భారీ వర్షం
-
ట్రాక్టర్ విక్రయాలు.. రికార్డ్!
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ట్రాక్టర్లకు బలమైన డిమాండ్ ఉంటుందని క్రిసిల్ రేటింగ్స్ అంచనా. కీలక పంటలకు అధిక మద్దతు ధరలకుతోడు, నిర్మాణ రంగం నుంచి డిమాండ్, పాత వాహనాలను మార్చడం, సాధారణం కంటే అధిక వర్షాలు పడతాయన్న అంచనాలతో క్రిసిల్ రేటింగ్స్ అ అంచనాకు వచి్చంది. 2025–26లో ట్రాక్టర్ల విక్రయాలు 9.75 లక్షల యూనిట్లుగా ఉండొచ్చని.. క్రితం ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూస్తే 3–5 శాతం వరకు పెరుగుతాయని తన తాజా నివేదికలో పేర్కొంది. ట్రాక్టర్ల తయారీ పరిశ్రమలో రూ.4,000 కోట్ల మూలధన పెట్టుబడులకు అవకాశాల్నుట్టు తెలిపింది. ప్రస్తుత తయారీ సామర్థ్యంలో వినియోగం 75–80 శాతానికి చేరుకోవడం, పర్యావరణ అనుకూల టెక్నాలజీలకు మద్దతు మూలధన నిధుల వ్యయాలకు మద్దతుగా నిలుస్తాయని పేర్కొంది. కర్బన ఉద్గారాల నిబంధనలు ‘టర్మ్ 5’ 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని.. కనుక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివర్లో ట్రాక్టర్ల ముందస్తు కొనుగోళ్లు ఊపందుకోవచ్చని కూడా క్రిసిల్ అంచనా వేసింది. కనుక 2022–23 ఆర్థిక సంవత్సరంలో నమోదైన ట్రాక్టర్ల గరిష్ట విక్రయాలు 9.45 లక్షల యూనిట్ల మార్క్ను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అమ్మకాలు అధిగమించొచ్చని పేర్కొంది. 2024–25లో ట్రాక్టర్ల అమ్మకాలు 7 శాతం పెరిగినట్టు తెలిపింది. వర్షపాతం అంచనాలతో సానుకూల సెంటిమెంట్ ‘‘సాధారణం కంటే ఎక్కువ వర్షాలు నమోదవుతాయంటూ భారత వాతావణ శాఖ వేసిన అంచనాలు గ్రామీణ సెంటిమెంట్ను బలపరుస్తాయి. రైతుల్లో ఆత్మవిశ్వాసం బలపడుతుంది. ట్రాక్టర్లు సహా సాగుపై పెట్టుబడులకు ఇది కీలకంగా పనిచేస్తుంది’’అని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ అనుజ్ సేతి తెలిపారు. కీలక పంటలకు కనీస మద్దతు ధరలు పెరుగుతాయని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. అలాగే నిర్మాణ రంగంలో కార్యకలాపాలు ఊపందుకోవడం వంటివి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ట్రాక్టర్ల విక్రయాలు పెరిగేందుకు సానుకూలిస్తాయన్నారు. ముఖ్యంగా 2026 ఏప్రిల్ 1 నుంచి టర్మ్ 5 నిబంధనలు అమల్లోకి వస్తుండడంతో ట్రాక్టర్ల ధరలు పెరుగుతాయని.. ఇది కూడా ముందస్తు కొనుగోళ్లను పెంచుతుందని అంచనా వేశారు. అమ్మకాల్లో పెరుగుదల, తయారీ వ్యయాలు తగ్గుముఖం పట్టడం వంటివి ట్రాక్టర్ల కంపెనీల మార్జిన్లను 13–13.5 శాతం స్థాయిలో స్థిరంగా కొనసాగేందుకు దారితీస్తాయని క్రిసిల్ నివేదిక తెలిపింది. వర్షాల్లో తాత్కాలిక అవాంతరాలు, వ్యవసాయ రంగం, గ్రామీణ ఆదాయాలపై దీని ప్రభావం, కమోడిటీల ధరలు, వడ్డీ రేట్లు, కాలుష్య ఉద్గారాల నిబంధనల అమలు ప్రభావం వంటివి మధ్య కాలానికి గమనించాల్సిన అంశాలుగా పేర్కొంది. -
ఒక్క వానకే కకావికలం
సాక్షి, హైదరాబాద్/సాక్షి, నెట్వర్క్: రాష్ట్రంలో శుక్రవారం పగలంతా మండిన ఎండలు.. సాయంత్రానికి ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఈదురుగాలులకు తోడు భారీ వర్షంతో పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్తోపాటు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. రాష్ట్ర ప్రణాళికా శాఖ గణాంకాల ప్రకారం నగరంలోని కంచన్బాగ్లో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బహదూర్పురాలో 7.9, చారి్మనార్లో 7.63 సెం.మీ. వర్షపాతం నమోదైంది. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లోనూ మోస్తరు వర్షాలు కురిశాయి. హైదరాబాద్లోని పలుచోట్ల వరద నీరు భారీగా చేరడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా కురిసిన భారీ వర్షాలతో వరి, మామిడి, మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లింది. సిద్దిపేట జిల్లాలో ఏకధాటి వర్షానికి దుబ్బాకలో 10 వేల క్వింటాళ్లకుపైగా ధాన్యం తడిసిపోయింది. రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో మామిడికాయలు రాలిపోయాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. ఉడకబెట్టి ఆరబెట్టిన పసుపుపంటలు తడిసి ముద్దయ్యాయి. ధాన్యం కొనుగోలు కేంద్రంలో పిడుగు జనగామ జిల్లా ఆలింపూర్లో వాన పడుతుండటంతో తలదాచుకునేందుకు రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రంలో వేసిన చలువ పందిరి కిందకు వెళ్లారు. వారికి సమీపంలోనే పిడుగు పడగా, ఆ ధాటికి వారంతా ఎగిరిపడ్డారు. 12 మందికి గాయాలయ్యాయి. వీరిని జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అపస్మారకస్థితిలో ఉన్న కొందరికి వైద్యులు సీపీఆర్ చేశారు. కాగా, కామారెడ్డి మండలం ఇస్రోజివాడిలో పిడుగు పడి 40 గొర్రెలు మృతిచెందాయి. రూ.5 లక్షలకుపైగా నష్టం వాటిల్లినట్టు బాధితుడు కడారి దేవయ్య తెలిపాడు. జనగామ జిల్లా చేర్యాలలో పిడుగుపాటుకు మూడు గేదెలు మృత్యువాత పడ్డాయి.నేడు, రేపు అక్కడక్కడా వానలురాష్ట్రంలో రెండ్రోజులు అక్కడక్కడా తేలికపాటి వర్షాలు పడే అవకాశమున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. మరోపక్క రాష్ట్రంలో రానున్న మూడు రోజులు ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని, కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే ఒకటి నుంచి మూడు డిగ్రీల మేర అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని సూచించింది. శుక్రవారం నిజామాబాద్లో 42.6 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత, దుండిగల్లో 19.1 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
Andhra Pradesh: ఉపరితల ఆవర్తనం.. తగ్గిన ఉష్ణోగ్రతలు
సాక్షి, అమరావతి/ఒంగోలు సిటీ: దక్షిణ కోస్తాంధ్ర, యానాం పరిసర ప్రాంతాలపై సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఆదివారం ఉష్ణోగ్రతలు కొద్దిమేర తగ్గాయి. పలుచోట్ల ఆకస్మిక వర్షాలు కురిశాయి. దక్షిణ కోస్తాలోని పలు జిల్లాల్లో ఎండ తీవ్రత తగ్గినా ఉక్కపోత ఎక్కువగా ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఆదివారం ప్రకాశం జిల్లా దరిమడుగులో అత్యధికంగా 41.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.54 మండలాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. మరోవైపు అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 54.7 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ప్రకాశం జిల్లా కనిగిరిలో 43 మిల్లీమీటర్లు, ఏలూరు జిల్లా బుట్టాయిగూడెంలో 39.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిశాయి. సోమవారం కూడా ఇదే తరహా వాతావరణం ఉండే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రకాశం జిల్లాలో గాలివాన బీభత్సం ప్రకాశం జిల్లాలో ఆదివారం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షం పడింది. కనిగిరి, మార్కాపురం, కొండపి, గిద్దలూరు, దర్శి, సంతనూతలపాడు, ఒంగోలు నియోజకవర్గాల పరిధిలో వర్షం కురిసింది. కనిగిరి, దొనకొండ ప్రాంతాల్లో వడగండ్ల వాన పడింది. కనిగిరి మండలం శంఖవరంలో డబ్బుకొట్టు లక్ష్మమ్మ (52) అనే మహిళ పశుగ్రాసం కోసం వెళ్తుండగా, నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి గోడ గాలివానకు కూలి ఆమెపై పడటంతో అక్కడికక్కడే మృతిచెందింది.కనిగిరిలో ఈదురుగాలులకు ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగి సరఫరా నిలిచిపోయింది. పీసీపల్లి, మర్రిపూడి, దర్శి, మార్కాపురం మండలాల్లోని కల్లాల్లో ఉన్న మిరపకాయలు వర్షానికి తడిసి ముద్దయ్యాయి. పొన్నలూరులో పొగాకు బ్యారన్ల పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. పొదిలిలో గాలివానకు భారీ వృక్షం విరిగి కారుపై పడటంతో ధ్వంసమైంది. -
బిహార్లో వర్షాలు, పిడుగుల బీభత్సం
పట్నా: బిహార్లో బుధ, గురువారాల్లో భారీ వర్షాలు, పిడుగుపాటు ఘటనలు 38 మందిని బలి తీసుకున్నాయి. బుధవారం 13 మంది చనిపోగా, గురువారం మరో 25 మంది మృత్యువాతపడ్డారు. వీరిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. పిడుగులు పడటంతోపాటు చెట్లు, ఇళ్లు, కరెంటు స్తంభాలు కూలిన ఘటనల్లో అత్యధికంగా నలందలో 18 మంది చనిపోయారు. సివాన్లో ఇద్దరు, దర్భంగా, బెగుసరాయ్, కటిహార్, భాగల్పూర్, జెహానాబాద్లలో ఒక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రులైన మరో 11 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బుధవారం పిడుగులు పడిన ఘటనల్లో నాలుగు జిల్లాల్లో కలిపి 13 మంది చనిపోయారని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. మృతుల కుటుంబాలకు సీఎం నితీశ్కుమార్ సానుభూతి తెలిపారు. రూ.4 లక్షల చొప్పున వీరి కుటుంబాలకు సాయం అందజేస్తామని ప్రకటించారు. బిహార్లో 38 జిల్లాలకుగాను 24 జిల్లాలకు యెల్లో అలర్ట్, 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ వాతావరణ శాఖ ప్రకటించింది. శుక్ర, శనివారాల్లో భారీ వర్షాలు కూడా కురిసే అవకాశముందని తెలిపింది.