AP: కాకినాడ వైపు దూసుకొస్తున్న మోంథా తుపాను | Cyclone Montha Updates: Heavy Rainfall In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

Cyclone Montha Updates: కాకినాడ వైపు దూసుకొస్తున్న మోంథా తుపాను

Oct 26 2025 9:55 AM | Updated on Oct 27 2025 4:04 PM

Cyclone Montha Updates: Heavy Rainfall In Andhra Pradesh

ప.గో, కృష్ణా జిల్లాలకు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు

  • ఒక్కో జిల్లాకు 30 మంది సిబ్బందితో కూడిన ఎన్డీఆర్‌ఎఫ్‌ టీమ్‌
  • రేపటి నుంచి 3 రోజుల పాటు స్కూళ్లకు సెలవు ప్రకటించిన కలెక్టర్‌
  • తుపాను నేపథ్యంలో సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు
     

విజయవాడ: 

  • మోంథా తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం
  • వాతావరణ హెచ్చరికల నేపధ్యంలో రేపట్నుంచి కృష్ణా,ఎన్టీఆర్ జిల్లాల్లో మూడు రోజుల పాటు పాఠశాలలకు సెలవులు
  • 27,28,29 తేదీల్లో జిల్లాలోని అన్ని ప్రభుత్వ , ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన రెండు జిల్లాల కలెక్టర్లు
  • జిల్లాలోని అన్ని సంక్షేమ హాస్టల్స్ లోని విద్యార్ధులు ఇళ్లకు వెళ్లిపోయేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు
  • కలెక్టర్ల ఆదేశాల మేరకు కృష్ణా,ఎన్టీఆర్ జిల్లాల్లోని హాస్టల్స్ నుంచి ఇళ్లకు వెళ్లిపోయిన విద్యార్ధులు
  • విద్యార్ధులను ఇళ్లకు తీసుకెళ్లిన తల్లిదండ్రులు

గుంటూరు: 

  • కలెక్టర్ కార్యాలయంలో మోంథా తుఫాన్ దృష్ట్యా జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ప్రత్యేక అధికారి సిసోడియా,జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారీయా
  • స్పెషల్ ఆఫీసర్ సిసోడియా కామెంట్స్
  • రానున్న 3 రోజుల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది
  • అధికారులను అప్రమత్తం చేసాం
  • లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసాం
  • ప్రభుత్వ పాఠశాల ల్లో 16 పునరావాస కేంద్రాల్లో అధికారులు వుంటారు
  • తుఫాన్ కి ఎక్కువ నష్టం జరగకుండా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం
  • జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారీయా కామెంట్స్
  • 27,28,29 తేదీలలో భారీ వర్షం ఈదురుగాలులు ఉంటాయి
  • గుంటూరు జిల్లాలో ఎక్కడ ప్రాణ నష్టం జరగకూడదు
  • 18 మండలాల్లో అధికారులు దగ్గరనుండి పర్యవేక్షణ చేస్తున్నారు
  • ప్రజల కోసం కంట్రోల్ నెంబర్ కూడా ఏర్పాటు చేసాం
  • వ్యవసాయ రంగానికి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
  • రూరల్ ప్రాంతాల్లో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నాం
  • అత్యాసవసర పరిస్థితి ఉంటేనే ప్రజలు బయటకు రావాలి
  • కాలేజీ స్కూల్స్ అంగన్ వాడి కేంద్రాలు 3 రోజులు సెలవలు ప్రకటించాం
  • ప్రజలకు సమస్య ఉంటే తప్పకుండా కాల్ సెంటర్ కి కాల్ చేయండి
  • నగరంలో 12 లోతట్టు ప్రాంతాల ను తెలుసుకున్నాం
  • ప్రధానంగా ఉన్న పీకల వాగు పొంగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం
     

ఏలూరు జిల్లా:

  • ఏలూరు జిల్లాలో   మోంథా తుఫాన్ ప్రభావం..
  • ఈనెల27, 28న జిల్లాలో తీవ్రమైన గాలులు, భారీ వర్షాలు ఉండే అవకాశం
  • జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీలకు  27, 28 తేదీలలో సెలవు
  • వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు, ప్రజలను అప్రమత్తం చేసిన జిల్లా అధికారులు
  • గోదావరి నదిలోనికి పర్యాటక  లాంచీలను నిలిపివేత
  • జిల్లా, అన్ని మండలాలలో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు
  • ఏలూరు జిల్లా  కంట్రోల్ రూమ్ నెంబర్ 9491041419, టోల్ ఫ్రీ నెంబర్ 18002331077
  • ప్రజలకు అందుబాటులో గ్రామానికి ఒక నోడల్ అధికారి*
  • తుఫాన్ తీవ్రతపై జిల్లా ఎస్పీతో కలిసి అధికారులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అప్రమత్తం చేసిన  జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి

పశ్చిమ గోదావరి జిల్లా

  • మోంథా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ముందస్తు విస్తృత ఏర్పాట్లు.
  • జిల్లా కలెక్టరేట్ తో పాటు ఆర్డీవో కార్యాల యాల్లో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు..
  • జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ నెంబర్.. 08816 299219,
  • భీమవరం ఆర్డీవో కార్యాలయంలో .. 98484 13739, 87907 31315,
  • నరసాపురం ఆర్టీవో కార్యాలయంలో 93911 85874,
  • తాడేపల్లి గూడెం ఆర్డీవో కార్యాలయంలో 93817 01036, 98497 12358

కాకినాడ:

  • మోంథా తుపాన్‌ నేపథ్యంలో స్కూళ్లకు సెలవులు
  • రేపటి నుంచి ఐదు రోజులపాటు సెలవు ప్రకటించిన కలెక్టర్‌
  • ాకాకినాడలో 14 పునరావాస కేంద్రాలు ఏర్పాటు
  • కాకినాడ  పోర్టులో మూడో ప్రమాద హెచ్చరిక జారీ
  • ఉప్పాడ-కాకినాడ బీచ్‌ రోడ్డులో రాకపోకలు నిలిపివేత
  • కాకినాడలో బీచ్‌లు మూసివేత

 

విశాఖ:

  • విశాఖ జిల్లాలో రెండు రోజుల పాటు స్కూళ్లకు సెలవు
  • సోమ, మంగళవారాలు స్కూళ్లకు సెలవు

బాపట్ల

  • మోంథా తుపాన్‌ నేపథ్యంలో స్కూళ్లకు సెలవులు
  • రేపటి నుంచి నాలుగు రోజుల పాటు సెలవు ప్రకటించిన కలెక్టర్‌
  • తుపాన్‌ ాకారణంగా బాపట్ల జిల్లాలోని బీచ్‌లు మూసివేత
  • యాత్రికులు, భక్తులు బీచ్‌లకు రావొద్దని పోలీసుల హెచ్చరికలు

విశాఖ:

  • మోంథా తుపాన్‌ నేపథ్యంలో రైల్వే జోన్‌ హై అలెర్ట్‌
  • రైల్వే వంతెనలు, పట్టాలు, యార్డులు, సిగ్నలింగ్‌ వ్యవస్థపై నిఘా
  • అత్యవసర సేవల కోసం రైళ్లు ిసిద్ధం చేసిన అధికారులు
  • ట్రాక్‌, సిగ్నలింగ్‌, విద్యుత్‌ పునరుద్ధరణ కోసం ప్రత్యేక బృందాలు
  • విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం స్టేషన్లలో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు
  • తుపాను పరిస్థితులను నిరంతరం సమీక్షిస్తున్న వాల్తేరు డీఆర్‌ఎమ్‌
     

ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం బలపడింది. తీవ్రవాయుగుండంగా కేంద్రీకృతమైంది. గడిచిన 6 గంటల్లో గంటకు 10 కి.మీ వేగంతో వాయుగుండం కదిలింది. రాబోయే 24 గంటల్లో తుపానుగా బలపడే అవకాశం ఉందని.. మంగళవారం (అక్టోబర్‌ 28) ఉదయానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

ప్రస్తుతానికి పోర్ట్ బ్లెయిర్ కి 610 కి.మీ, చెన్నైకి 790 కి.మీ, విశాఖపట్నంకి  850 కి.మీ, కాకినాడకి  840 కి.మీ, గోపాల్‌పూర్ కి  950 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైందని పేర్కొంది. మంగళవారం రాత్రి తీరం దాటే అవకాశం మచిలీపట్నం-కళింగపట్నం మధ్య  కాకినాడ సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని..  రేపు, ఎల్లుండి(సోమ, మంగళ కోస్తాంధ్రలో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

మోంథా తుఫాన్‌.. కాకినాడ వైపు దూసుకొస్తోంది. అప్రమత్తమైన అధికారులు.. తుపాన్‌ను ఎదుర్కోనేందుకు సన్నద్ధమయ్యారు. కాకినాడ- ఉప్పాడ రోడ్డులో ఈనెల 30 వరకు  రాకపోకలు నిలిపివేశారు. వాకలపూడి బీచ్, ఎన్టీఆర్ బీచ్ మూసివేశారు. హోప్ ఐలాండ్‌లో నివాసం ఉంటున్న మత్స్యకారులను తీరానికి తరలిస్తున్నారు. సముద్రంలోకి మత్స్యకారులు  వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. అధికారులు, సిబ్బందికి సెలవులను ప్రభుత్వం రద్దు చేసింది.  తుపాను సహయక చర్యల కోసం కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా: తుపాను ప్రభావంతో పాపికొండల విహార యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు.  వాగులు వద్దకి వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. పర్యాటక ప్రాంతాలన్నీ తాత్కాలికంగా మూయించివేసిన పోలీసులు.. సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్ద కంట్రోల్ రూమ్‌ని ఏర్పాటు చేశారు.

విజయవాడ: భారీవర్షాల నేపథ్యంలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల యంత్రాంగం అప్రమత్తమైంది. ఈనెల 27, 28, 29వ తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. 27, 28 ,29వ తేదీల్లో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు కలెక్టర్లు సెలవులు ప్రకటించారు. అన్ని సంక్షేమ హాస్టల్స్ లోని విద్యార్ధులు రేపు సాయంత్రంలోగా (ఈనెల 26) ఇళ్లకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు ఆదేశాలిచ్చారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement