Live Updates
తీరాన్ని తాకిన మోంథా.. ఎగిసి పడుతున్న రాకాసి అలలు
ఓడలరేవు ప్రాంతాల్లో అలకల్లోలంగా ఉన్న సముద్రం
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా...
- కోనసీమలో భారీగా కూలిన చెట్లు.. పలుచోట్ల ధ్వంసమైన విద్యుత్ లైన్లు
- రోడ్డుకు అడ్డంగా భారీ వృక్షాలు కోవడంతో నిలిచిపోతున్న రాకపోకలు
- పలు ప్రాంతాల్లో కురుస్తున్న చిరుజల్లులు
- జిల్లా వ్యాప్తంగా 50 వేల ఎకరాల్లో దెబ్బతిన్న వరి పంట
- పెద్ద సంఖ్యలో కూలిన కొబ్బరి చెట్లు
- తీర ప్రాంతంలో కొనసాగుతున్న ఈదురు గాలులు
- అంతర్వేది, ఉప్పలగుప్తం ఓడలరేవు ప్రాంతాల్లో అలకల్లోలంగా ఉన్న సముద్రం
- ఎగసిపడుతున్న అలలు
- సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో ఉప్పొంగిన సముద్రం
- గ్రామం మీదకు చొచ్చుకొచ్చిన సముద్రపు నీరు భయాందోళనలో గ్రామస్తులు
- కనివిని ఎరుగని రీతిలో సముద్రం గ్రామం మీదకు చొచ్చుకు రావడం మొదటిసారి అంటున్న గ్రామస్తులు
నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం
- శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం
- కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి,ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం
తుఫాను తీరం దాటినప్పటికీ, నిర్లిప్తత పనికిరాదు
విజయనగరం జిల్లా
తుపాను ప్రభావంతో జిల్లాలో మోస్తరు వర్షాలు.
గడిచిన 24 గంటల్లో కొత్తవలసలో గరిష్టంగా 109 మిమి, బొబ్బిలిలో కనిష్టం గా 29 మిమి ల వర్షపాతం నమోదు.
రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్ కార్యాలయం.
అప్రమత్తంగా ఉండాలి...జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డితుఫాను తీరం దాటినప్పటికీ, నిర్లిప్తత పనికిరాదు.
జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాసం ఉంది. రిజర్వాయర్లు, నదులు, చెరువుల్లోని నీటి మట్టాన్ని నిరంతరం పరిశీలిస్తూ తగిన చర్యలు తీసుకోవాలి.
ప్రాణ, ఆస్తి నష్టాలు వాటిల్లకుండా ముందుజాగ్రత్తగా చేపట్టిన చర్యలను కొనసాగించాలి.
ఉదయం 3 గంటల సమయంలో కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నుంచి మండలస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ రాంసుందర్ రెడ్డి.
జిల్లాలో పరిస్థితి ఇప్పటివరకు పూర్తిగా అదుపులో ఉందని ప్రకటించిన కలెక్టర్.
మెంటాడ మండలం ఆండ్ర రిజర్వాయర్లు కు ... పెద్ద ఎత్తున చేరుతున్న వరదనీరుపూర్తి స్థాయి నీటి మట్టం. 146 మీటర్లు
ఇన్పో 4500 క్యూసెక్కులు రావడంతో మూడు గేట్లు ఎత్తి దిగవన ఉన్న చంపావతినది లోకి 4,000 క్యూసెక్కులు నీటిని వదలుతున్న అదికారులు
చంపావతినది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపిన అదికారులు
ఇళ్లలోకి చేరిన వరద నీరు.. ఆందోళనలో గ్రామస్థులు
ప్రకాశం
- మర్రిపూడి మండలం కూచిపూడిలో తెగిన చెరువు కట్ట
- ఇళ్లలోకి చేరిన వరద నీరు... ఆందోళనలో గ్రామస్థులు
- మర్రిపూడి కూచిపూడి మద్య పొంగిపొర్లుతున వడ్డెర వాగు
- రాకపోకలకు అంతరాయం
- వాహనాలు తిరగకుండా గస్తీ కాస్తున్న సచివాలయ సిబ్బంది
ఘాట్రోడ్పై ఏరులై పారుతోన్న వరద నీరు
- విశాఖ-అరకు ఘాట్రోడ్పై ఏరులై పారుతోన్న వరద నీరు..
- అనంతగిరి సమీపంలో రోడ్డుపైనా ఉధృతంగా వరద నీరు.. తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహన చోదకులు..
- బొర్రా, చిమిడిపల్లి రైల్వేస్టేషన్ మధ్య ట్రాక్పై వర్షపు నీరు.. ట్రాక్ పునరుద్ధరణ చర్యలు చేపట్టిన రైల్వే శాఖ..
విద్యుత్ షాక్తో సునీత అనే మహిళ మృతి
వైఎస్సార్ జిల్లా
ప్రొద్దుటూరు మండలం చౌడురు గ్రామంలోని బీసీ కాలనిలో విద్యుత్ షాక్ తో సునీత అనే మహిళ మృతి
వర్షంలో పశువుల పాక వద్ద విద్యుత్ షాక్ తగలడంతో మృతి చెందిన మహిళ
వేంపాడు టోల్ ప్లాజా వద్ద వాహనాలను నిలిపేసిన పోలీసులు
అనకాపల్లి :
- నక్కపల్లి మండలం వేంపాడు టోల్ ప్లాజా వద్ద వాహనాలను నిలిపేసిన పోలీసులు..
- కిలోమీటర్ మేర నిలిచిన వాహనాలు..
- విశాఖ - విజయవాడ వెళ్లే వాహనాలు నిలిపివేత..
- తుఫాను ప్రభావం తగ్గుముఖం పట్టాక వాహనాలు విడుదల చేసే అవకాశం..
నంద్యాల జిల్లాలో తుఫాను ప్రభావంతో వాగులో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు
- నంద్యాల జిల్లాలో తుఫాను ప్రభావంతో వాగులో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు
- ప్రాణలతో బయటపడ్డ ప్రయాణికులు
- ఆళ్లగడ్డ తాలూకా ఉయ్యాలవడా మండల సమీపంలో వాగులో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు
- బస్సులో ఉన్న 15 మంది ప్రయాణికులు వాగులో చిక్కుకపోవడంతో సురక్షితంగా బయటికి తీసిన స్థానికులు
- తుఫాను ప్రభావంతో వాగు పొంగి ప్రవహించడంతో సర్వాయి పల్లె గ్రామ సమీపంలో వాగులో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు
30 మంది విద్యార్థులకు కరెంట్ షాక్
- గుర్లలో కస్తూరిబా పాఠశాలలో విద్యార్థులకు విద్యుత్ షాక్.
- విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన అధికారులు.
- భారీ ఈదురుగాలులకు తెగిపడిన విద్యుత్ వైర్లు.
- గోడను పట్టుకున్న సుమారు 30 మందికి కరెంట్ షాక్.
- విశాఖ-అరకు ఘాట్రోడ్పై ఏరులై పారుతోన్న వరద నీరు..
- అనంతగిరి సమీపంలో రోడ్డుపైనా ఉధృతంగా వరద నీరు.. తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహన చోదకులు..
- బొర్రా, చిమిడిపల్లి రైల్వేస్టేషన్ మధ్య ట్రాక్పై వర్షపు నీరు.. ట్రాక్ పునరుద్ధరణ చర్యలు చేపట్టిన రైల్వే శాఖ
భీమిలి మధురవాడ ప్రాంతాల్లో భారీ వర్షం.
విశాఖ
- భారీ వర్షానికి తాళ్లవలస జాతీయ రహదారిపై కూలిన భారీ వృక్షం.
- కూలిన వృక్షాన్ని తొలిగిస్తున్న జివిఎంసి సిబ్బంది
- పాయకరావుపేట నియోజకవర్గంలో చాలా ప్రాంతాల్లో కరెంటు లేక ప్రజల అవస్థలు
మోంథా ప్రభావంపై కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్
- తూర్పు తీరంపై మోంథా తుఫాను ప్రభావాన్ని అంచనా వేయడానికి సన్నాహాల్లో భాగంగా రైల్వే జోనల్, బోర్డు స్థాయిలో వార్ రూమ్లను ఏర్పాటు చేశాం.
- తూర్పు తీర విభాగాలలో అవసరమైన వనరులను ఉంచాం
- విజయవాడ, విశాఖపట్నం,గుంటూరులోని మా బృందాలు అప్రమత్తంగా ఉన్నాయి.
- అంతరాయాలను తగ్గించడానికి రైలు కార్యకలాపాలను నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.
In preparation for Cyclone Montha's expected impact on the East Coast, war rooms are activated at Divisional, Zonal and Board levels. Positioned essential resources in east coastal divisions.
Our teams in Vijayawada, Visakhapatnam and Guntur are on alert. Train operations are… pic.twitter.com/2L7eALUnEp— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) October 28, 2025
అంధకారంలో పిఠాపురం
కాకినాడ:
- అంధకారంలో పిఠాపురం
- ఉదయం నుంచి నిలిచిపోయిన విద్యుత్ సరఫరా
- అంధకారంలో పిఠాపురం, ఉప్పాడ తీరంలోని గ్రామాలు
నెల్లూరు జిల్లాలో కుండపోత వర్షాలు
- నెల్లూరు జిల్లాలో కుండపోత వర్షాలు
- కందుకూరులో 14.సెం.మీ వర్షపాత నమోదు
- కావలిలో 13, దగదర్దిలో 11. 7, జలదంకిలో 11.3 ెసెం.మీ వర్షపాతం
- నిడవలూరు, కొడవలూరులో 10 సెం.మీ వర్షపాతం
- ఉలవలపాడు, గుడ్లూరు 10 సెం.మీ వర్షపాతం నమోదు
నంద్యాల:
- ఆత్మకూరు డివిజన్లో భారీ వర్షం
- కర్నూలు-గుంటూరు హైవేపై ఉధృతంగా ప్రవహిస్తున్న ావాగు
- ఆత్మకూరు నుంచి గుంటూరు శ్రీశైలం వెళ్లే వాహనాలు
- నంద్యాల, గిద్దలూరు మీదుగా మళ్లీంపు
- నల్లమలలో భారీ వర్షం, రాకపోకలు నిలిపివేత
ప్రకాశం జిల్లాలో కుండపోత వర్షం
- నీట మునిగిన సింగరాయకొండ పోలీస్ స్టేషన్
- ఒంగోలు సమీపంలో వరదలో కొట్టుకుపోయిన కారు
- చెరువులను తలపిస్తున్న రహాదారులు
ఎన్టీఆర్ జిల్లా:
- మోంథా తుఫాన్ ప్రభావంతో వీచిన బలమైన గాలులకు ఇబ్రహీంపట్నంలో తెగిపోయిన కరెంట్ తీగలు
నంద్యాల జిల్లా:
- ఆత్మకూరు రెవిన్యూ డివిజన్ లో మోంథా తుఫాన్ కారణంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం
- కర్నూలు -గుంటూరు జాతీయరహదారిలోని ఆత్మకూరు మండలం, సిద్దాపురం చెరువు అలుగు ఎక్కి పారుతున్న వర్షపు నీరు..
- ఆత్మకూరు నుంచి గుంటూరు, శ్రీశైలం వెళ్లే వాహనాలను నంద్యాల టూ గిద్దలూరు మీదుగా దారి మళ్లించిన పోలీసులు
- నల్లమలలో భారీ వర్షాలు కురుస్తుండటంతో రాకపోకలను నిలుపుదల చేసిన దోర్నాల, ఆత్మకూరు పోలీసులు..
అంధకారంలో కోస్తా జిల్లాలు
- అంధకారంలో కోస్తా జిల్లాలు
- బాపట్ల, రేపల్లె, వేమూరు నియోజక వర్గాల్లో కమ్ముకున్న చీకటి
అంధకారంలో కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా:
- మోంథా తుఫాన్ ఎఫెక్ట్
- కృష్ణాజిల్లా వ్యాప్తంగా నిలిచిపోయిన విద్యుత్ సరఫరా
- అంధకారంలో కృష్ణాజిల్లా
- చిమ్మ చీకట్లలో గ్రామాలు
విజయనగరం:
- గుర్ల మండలం కస్తూరిబా పాఠశాలలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్
- పాఠశాల గోడపై విద్యుత్ స్తంభం వాలిపోవడంతో షార్ట్ సర్క్యూట్
- పరుపులు తగలబడి... దట్టంగా కమ్మిన పొగ
- పలువురు విద్యార్థులకు అస్వస్థత
- నెల్లిమర్ల సీహెచ్ సి కి తరలింపు
- తప్పిన పెను ప్రమాదం
కాకినాడ
- కుంభాభిషేకం రేవులో యువకుడు గల్లంతు
- బోట్లకు లంగర్ వేస్తుండగా గల్లంతైన యువకుడు
- ఘటనా స్థలంలో కొనసాగుతున్న సహాయక చర్యలు
ఏపీ వ్యాప్తంగా 403 మండలాలపై తుపాను ఎఫెక్ట్
ఏపీ వ్యాప్తంగా 403 మండలాలపై మోంథా తుపాను ఎఫెక్ట్
488 కంట్రోల్రూమ్లు.. 1204 పునరావాస కేంద్రాలు
తీర ప్రాంతాల్లో భారీగా ఎగిసిపడుతున్న రాకాసి అలలు
తీర ప్రాంత జిల్లాల్లో భారీగా ఈదురుగాలులు
- గంటకు 90 నుంచి 100 కి.మీ వేగంతో ఈదురుగాలులు
- ప్రకాశం జిల్లాలో కుండపోత వర్షం
- నీట మునిగిన సింగరాయకొండ పోలీస్ స్టేషన్
- ఒంగోలు సమీపంలో వరదలో కొట్టుకుపోయిన కారు
కాకినాడ:
- మోంథా తుఫాన్ ప్రభావంతో జగ్గంపేట వద్ద చెన్నై-కోల్కతా జాతీయ రహదారి పై వాహనాల రాకపోకల నిలిపివేత.
- సాధారణ పరిస్ధితులు వచ్చే వరకు వాహనాలను నడపవద్దని డ్రైవర్లకు పోలీసుల ఆదేశం.
- *హై వే పక్కనే వాహనాలను పార్క్ చేసిన భారీ వాహనదారులు.
నేడు, రేపు భారీ వర్షాలు
- ఈ రాత్రికి 17 జిల్లాలో భారీ వర్షాలు
- రేపు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు
- ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు
- కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీవర్షాలు
- ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం అక్కడక్కడ మోస్తరు నుంచి భారీవర్షాలు
తెలంగాణపై మోంథా ఎఫెక్ట్
- మోంథా తుఫాన్ ప్రభావంతో పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ ప్రకటన- హైదరాబాద్ వాతావరణ కేంద్రం
- రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణశాఖ
- ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు రెడ్ అలెర్ట్ ప్రకటన, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, హనుమకొండ, వరంగల్ మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ
- కొమరంభీం, జగిత్యాల, కరీంనగర్, సిద్దిపేట్, యాదాద్రి, నాగర్కర్నూలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ
- అర్ధరాత్రి పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం, అత్యధికంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రభావం ఉండే అవకాశం-వాతావరణశాఖ
గుడివాడలో పలు చోట్ల నేలకూలిన చెట్లు
కృష్ణాజిల్లా:
- మోంథా తుఫాన్ ఎఫెక్ట్ తో గుడివాడలో పలు చోట్ల నేలకూలిన చెట్లు
- ఫ్లై ఓవర్ బ్రిడ్జి, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి , గుడివాడ ముదినేపల్లి ప్రధాన రహదారిలో నేలకూలిన వృక్షాలు
- గుడివాడ - విజయవాడ ప్రధాన రహదారిలో మూడు చోట్ల నేల కూలిన వృక్షాలు
- రోడ్డుకి ఇరువైపులా నిలిచిపోయిన ట్రాఫిక్
- హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది
- చీకటిలోనే నేలకూలిన చెట్లను తొలగిస్తున్న ఎస్టీఆర్ఎఫ్ సిబ్బంది
- ముదినేపల్లి ప్రధాన రహదారిలో కూలిన వృక్షాలను తొలగించిన గుడివాడ రూరల్ పోలీసులు
కడపలో భారి వర్షాలకు కూలిన చెట్టు..
వైఎస్ఆర్ జిల్లా.:
- కడపలో భారి వర్షాలకు కూలిన చెట్టు..
- కార్పొరేషన్ కార్యాలయ ఆవరణంలో నేలకొరిగిన భారీ చెట్టు..
- చెట్టు కూలిన సమయంలో ఎవరు లేక పోవడంతో తప్పిన ప్రమాదం
తాడేపల్లి :
- రాత్రి 7:40 కి తీరానికి టచ్ అయిన మోంథా తుఫాను
- అంతర్వేదిపాలేనికి సమీపంలో తీరాన్ని తాకిన మోంథా తుపాన్
- గడిచిన 6 గంటల్లో గంటకు 17 కి.మీ వేగంతో కదిలిన తుపాన్
- పూర్తిగా తీరం దాటడానికి 3-4 గంటల సమయం
- తీర ప్రాంతంలో 90-100 కిమీ వేగంతో వీస్తున్న ఈదురు గాలులు
తీరాన్ని తాకిన మోంథా తుపాన్..
విశాఖ :
- తీరాన్ని తాకిన మోంథా తుపాన్..
- ప్రారంభమైన తీరాన్ని దాటే ప్రక్రియ..
- పూర్తిగా తీరాన్ని దాటడానికి..నాలుగు నుంచి ఐదు గంటల సమయం పట్టే అవకాశం..
- అమలాపురం పరిసర ప్రాంతాల్లో తీరాన్ని తాకిన మోంథా తీవ్ర తుఫాన్..
మోంథా తుఫాన్ ఎఫెక్ట్ ..బెజవాడలో హై అలర్ట్
విజయవాడ:
- మోంథా తుఫాన్ ఎఫెక్ట్ ..బెజవాడలో హై అలర్ట్
- తుఫాన్ తీరాన్ని తాకిన తర్వాత పెరగనున్న గాలుల తీవ్రత, భారీ వర్షాలు కురిసే అవకాశం
- భారీ వర్షం కురిసే అవకాశమున్న నేపధ్యంలో దుకాణాలు క్లోజ్
- మూతబడిన అన్ని వాణిజ్య , వ్యాపార సంస్థలు , షాపింగ్ మాల్స్
దిశ మార్చుకుని పయనిస్తున్న మోంథా
తాడేపల్లి:
- నెమ్మదిగా కదులుతున్న మోంథా
- మచిలీపట్నానికి 40 km దూరంలో కేంద్రీకృతం
- అంతర్వేదికి ఎగువన తీరం దాటే అవకాశం
- కొద్దిగా దిశ మార్చుకుని పయనిస్తున్న మోంథా తుఫాను
- అంతర్వేది-యానం వైపు కదులుతున్న సైక్లోన్
- తీరానికి చేరువయ్యే కొద్దీ నెమ్మదిస్తున్న తుపాను వేగం
- తీరం దాటేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం
మోంథా ఎఫెక్ట్: గరిష్టంగా 110 కిమీ వేగంతో గాలులు
- తీరం వైపుకి దూసుకొస్తున్న మోంథా తుపాను..
- కాకినాడ - బియ్యపుతిప్ప మధ్య తీవ్ర తుఫాను తీరం దాటే అవకాశం
- నర్సాపురం - కాకినాడ మధ్య తీవ్ర ప్రభావం ఉండే ఛాన్స్
- ఉత్తర వాయువ్య దిశగా కాదులుతున్న తీవ్ర తుఫాన్
- మరికాసేపట్లో ప్రారంభం కానున్న తీరం దాటే ప్రక్రియ
- గరిష్టంగా 110 కిమీ వేగంతో గాలులు ఉండే అవకాశం
- ఇప్పటికే పలు విద్యుత్ నిలిపివేత..
తాటిచెట్టు విరిగిపడి మహిళ మృతి
- మోంథా తుఫాన్ నేపథ్యంలో మామిడికుదురు మండలం మాకనపాలెంలో తాటిచెట్టు విరిగిపడి గూడపల్లి వీరవేణి అనే మహిళ మృతి
- మోంథా తుఫాన్ దెబ్బకి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నేలకొరుగుతున్న కొబ్బరి చెట్లు
- తుఫాను బీభత్సంపై కోనసీమ వాసులు ఆందోళన....
విజయనగరం:
- మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సొంత ఇలాకా గజపతినగరం నియోజకవర్గంలో అధికారుల అలసత్వం
- బొండపల్లి, గజపతినగరం తహసీల్దార్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్లను సందర్శించిన కలెక్టర్ ఎస్ రాసుందర్ రెడ్డి
- కంట్రోల్ రూమ్ విధుల కేటాయింపు, విధుల నిర్వర్తనపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన కలెక్టర్ రాసుందర్ రెడ్డి
- కంట్రోల్ రూమ్ ఏర్పాట్లు, విధుల నిర్వర్తనకు బాధ్యత వహించవలసిన తాసిల్దార్లు, పర్యవేక్షణ చేయాల్సిన మండల ప్రత్యేక అధికారులు తుఫాన్ లాంటివిపత్కర పరిస్థితులలో సరిగా వ్యవహరించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్
- ఆయా రెండు మండలాల తహసీల్దార్లుతో పాటు మండల ప్రత్యేక అధికారులకు సోకజ్ నోటీసులు జారీ చేసిన కలెక్టర్
- మొత్తంగా నలుగురికి షోకాజ్ నోటీసులు జారీ చేసిన కలెక్టర్
నంద్యాల జిల్లా :
- శ్రీశైలం మండలంలో మోంథా తుఫాన్ ప్రభావం
- తుఫాన్ ప్రభావంతో శ్రీశైలం,సుండిపెంటలలో కుండపోత వర్షం
- వర్షం ధాటికి రోడ్లన్నీ జలమయం గృహాలకే పరిమితమైన స్థానికులు ,భక్తులు
- కార్తీకమాసమైన తుఫాన్ ప్రభావంతో శ్రీశైలం మల్లన్న ఆలయానికి తగ్గిన భక్తుల రద్దీ
- వర్షం ధాటికి నిర్మానుష్యంగా మారిన ప్రధాన వీధులు
8 జిల్లాల్లో వాహనాల రాకపోకలు నిలిపివేత
విజయవాడ:
- 8 జిల్లాల్లో వాహనాల రాకపోకలు నిలిపివేత
- రాత్రి 8.30 గంటల నుండి రాకపోకలు నిలిపేయాలని కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశం
- కోనసీమ, కృష్ణా, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, అల్లూరి జిల్లాల్లో రాకపోకలు నిలిపివేత
- జాతీయ రహదారులపై వాహనాలు నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశం
- అత్యవసర వైద్య సేవలు కు మాత్రమే మినహాయింపు
- రాత్రి 8.30 నుండి ఉదయం 6 గంటల వరకు రాకపోకలు నిలిపివేత
కాకినాడ:
- కుంభబిషేకం రేవులో ఓ యువకుడు గల్లంతు
- ఏడుగురు యువకులు బోట్లకి లంగరు వేస్తున్న క్రమంలో ఓ యువకుడు గల్లంతు
- సహాయక చర్యలు చేపట్టిన అధికారులు
అంధకారంలో కృష్ణాజిల్లాలోని పలు మండలాలు
కృష్ణాజిల్లా :
- మోంథా తుఫాన్ ప్రభావంతో మచిలీపట్నం , అవనిగడ్డ , పెడన నియోజకవర్గాల్లో హై అలర్ట్
- మచిలీపట్నం , కృత్తివెన్ను , బంటుమిల్లి , పెడన , అవనిగడ్డ, నాగాయలంక , కోడూరు , మోపిదేవి, చల్లపల్లి మండలాల్లో వీస్తున్న బలమైన ఈదురుగాలులు
- ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఈదురుగాలుల ధాటికి నేలకూలిన చెట్లు
- తుఫాన్ తీరాన్ని తాకిన తర్వాత మరింతగా పెరగనున్న గాలుల తీవ్రత
- ముందుస్తుగా విద్యుత్ సరఫరా నిలిపివేత
- అంధకారంలో మచిలీపట్నం , కృత్తివెన్ను , బంటుమిల్లి , పెడన , అవనిగడ్డ, నాగాయలంక , కోడూరు , మోపిదేవి, చల్లపల్లి మండలాలు
అల్లకల్లోలంగా మారిన సముద్రం
బాపట్ల జిల్లా:
- సూర్యలంక వద్ద అల్లకల్లోలంగా మారిన సముద్రం
- పెద్ద పెద్ద శబ్దాలతో కూడిన అలలు
- భారీ ఎత్తున ఎగసిపడుతున్న అలలు
- బలమైన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం
- బీభత్సంగా మారిన సముద్రం
- తీరం వెంబడి బలమైన గాలులు వేయడంతో ప్రజలు ఎవరిని బయటికి రావద్దు అని చెప్తున్నా అధికారులు
రేపు కూడా వైఎస్సార్ జిల్లాలో పాఠశాలలకు సెలవు
వైఎస్సార్ జిల్లా:
- నిరంతరంగా వర్షం కురుస్తున్న నేపథ్యంలో రేపు కూడా జిల్లాలో పాఠశాలలకు సెలవు ప్రకటించిన కలెక్టర్ చెరుకూరి శ్రీథర్
- అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలతో పాటు కళాశాలలకు కూడా సెలవు ఇవ్వాలని సూచన
- క్షేత్రస్థాయిలో లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ నచికేత్ విశ్వనాథ్
- డ్యాముల వద్ద ఎప్పటికప్పుడు నీటిమట్టాన్ని పరిశీలిస్తూ జాగ్రత్తలు పాటించాలి.
- అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నాం.
- అత్యవసర పరిస్థితులు ఏర్పడితే టోల్ ఫ్రీ నంబర్ 112కు కాల్ చేయాలి
కూలిన భారీ చెట్టు
పశ్చిమగోదావరి జిల్లా :
- పెనుమంట్ర మండలం బ్రాహ్మణ చెరువు వైయస్ రాజశేఖర్ రెడ్డి కాలనీ వద్ద స్టేట్ హైవే నేలకొరిగిన భారీ చెట్టు.. ట్రాఫిక్ అంతరాయం
- పెనుమంట్ర ఇరిగేషన్ కార్యాలయం పై కూలిన చెట్టు
- కార్యాలయంలో సిబ్బంది ఎవరు లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం
;ప. గో: పలుచోట్ల నేలకొరిగిన చెట్లు,ఫ్లెక్సీ కటౌట్లు
పశ్చిమగోదావరి జిల్లా:
- పాలకొల్లు మోంథా తుఫాన్ ప్రభావంతో ఈదురుగాలు లతో పలుచోట్ల నేలకొరిగిన చెట్లు మరియు ఫ్లెక్సీ కటౌట్లు
- పూలపల్లి మెయిన్ రోడ్డు పై విరిగిపడిన ఓ వృక్షం వెంటనే ట్రాఫిక్ జాం కాకుండా చెట్టును రోడ్డు పక్కకు తొలగించిన అధికారులు
- పాలకొల్లు మండలం కాపువరంలో విద్యుత్ వైర్లపై ఓరిగిపడిన కొబ్బరి చెట్టు
- పాలకొల్లు మెయిన్ రోడ్ లో రోడ్డుపై ఎగిరిపడిన ఫ్లెక్సీ కటౌట్
తాడేపల్లి :
- మచిలీపట్నంకి 50 కిమీ, కాకినాడకి 130 కిమీ దూరంలో తుపాను కేంద్రీకృతం
- కాకినాడ-మచిలీపట్నం మధ్యలో తీరం దాటే అవకాశం
- తీరందాటే సమయంలో గంటకు 90-110 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు
కాకినాడ పోర్ట్కి డేంజర్ బెల్స్
కాకినాడ:
- పదో నంబర్ హెచ్చరిక జారీ చేసిన ఐ.ఎం.డీ
- తీవ్ర రూపం దాల్చి.. ఎగిసిపడుతున్న అలలు
- అల్లకల్లోలంగా మారిన సూర్యారావు పేట బీచ్, ఉప్పాడ బీచ్
పునరావాస కేంద్రాలకు తీర ప్రాంత ప్రజలు..
- పునరావాస కేంద్రాలకు తీర ప్రాంత ప్రజల తరలింపు
- APSDMA స్టేట్ కంట్రోల్ రూమ్: 112, 1070, 1800 425 0101.
- మోంథా' తుఫాన్ ప్రభావంతో కోనసీమ జిల్లాలో ఇద్దరు మృతి.
- మోంథా తుఫాన్ ఎఫెక్ట్తో ఏపీలోని తీరప్రాంతంలో అల్లకల్లోలం.
అమరావతి:
- మోంథా తుఫాన్ రాత్రి 8:30 గంటలకు తీరాన్ని తాకే అవకాశం.
- కాకినాడ-మచిలీపట్నం మధ్య తీరం దాటనున్న తుఫాన్.
- పూర్తిగా ల్యాండ్ ఫాల్ అయ్యేందుకు 2 గంటలు పట్టే అవకాశం
- తీరం దాటే సమయంలో గంటకు 90-110 కిలోమీటర్లు వేగంతో గాలులు.
- మచిలీపట్నంకు 60, కాకినాడకు 140, విశాఖకు 240 కి.మీ. దూరంలో కేంద్రీకృతం.
విశాఖ:
- తుఫాన్ కాకినాడ తీరానికి సమీపిస్తున్న నేపథ్యంలో విశాఖలో భారీ వర్షం..
- ఈదురు గాలులతో కురుస్తున్న వర్షం
కాకినాడ:
- పునరావాస కేంద్రాల్లో ఆకలితో గంగపుత్రుల పస్తులు
- ఆహరం లేకపోవడంతో ఆకలితో అలమటిస్తున్న చిన్నారులు.
- విద్యుత్ లేకపోవడంతో వెలగని లైట్లు...తిరగని ఫ్యాన్లు.
- తుఫాన్ ప్రభావంతో కొత్తపట్నం చెందిన మత్స్యకారులను ఉప్పాడ జడ్పీ హైస్కూల్ పునరావాస కేంద్రంకు తరలింపు
- ప్రాణ భయంతో ఇళ్ళు.. వాకిలి వదిలి పిల్లలతో పునరావాస కేంద్రాలకు తరలివచ్చిన గంగపుత్రులు.
నెల్లూరు జిల్లా:
- వెంకటాచలం లోని కనుపూరు చెరువు ఆనకట్టను జోరు వానలో పరిశీలించిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి
- మోంథా తుపాన్తో అత్యంత అప్రమత్తంగా ఉండాలి
- మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లొద్దని ముందు గానే కోరం..
- లోతట్టు ప్రాంతాలలో నివసించే వారిని సురక్షితం పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులకు సూచించాం
- వైఎస్ జగన్ సూచనలతో జిల్లా పార్టీ కార్యాలయం లో ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేశాం
- మోంథా తుఫాన్ వల్ల ఇబ్బంది పడేవారు హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేయ్యండి
- నాటి ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి వల్ల ఏర్పడిన సచివాలయం వ్యవస్థ ద్వారా నేడు ప్రజలకు సేవలు అందిస్తున్నారు.
- మేము అధికారంలో లేక పోయిన ప్రజలకోసం పనిచేస్తాం...
కృష్ణాజిల్లా:
- కృత్తివెన్ను పంచాయతీ వాలంక గ్రామంలో పెరిగిన గాలుల తీవ్రత
- నేల కూలిన గాలుల తీవ్రతకు కొబ్బరిచెట్టు మట్టలు
- కొబ్బరిమట్టలు పడటంతో కోవి సుబ్బారావుకు తీవ్రగాయాలు
- 108లో మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలింపు
కృష్ణాజిల్లా:
- తీరానికి సమీపంలో మోంథా తుఫాన్
- మచిలీపట్నాన్ని కమ్మేసిన కారుమబ్బులు
- తుఫాన్ ప్రభావంతో ముందుగానే విద్యుత్ నిలిపివేత
- అంధకారంలో మచిలీపట్నం
- తుఫాన్ తీరం దాటే సమయంలో 90 కిలోమీటర్ల మేర గాలులు వీచే అవకాశం
విజయవాడ:
- మోంథా తుఫాన్ నేపధ్యంలో దురగ్గుడి అధికారులు అలర్ట్
- దుర్గగుడి ఘాట్ రోడ్డు మూసివేత
- తుఫాన్ తీరం దాటాక సాధారణ పరిస్థితులు వచ్చే వరకూ ఘాట్ రోడ్డు మూసి ఉంచాలని ఈవో ఆదేశం
- కనకదుర్గానగర్ , లిఫ్ట్ మార్గం ద్వారా అమ్మవారిని దర్శించుకోవాలని భక్తులకు సూచన
ఆ జిల్లాలకు ఆకస్మిక వరదలు.. తెలంగాణలో
- ఉభయగోదావరి,కృష్ణా,గుంటూరు,ప్రకాశం జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్
- శ్రీకాకుళం, విశాఖ,విజయనగరం,నెల్లూరుకు ఫ్లాష్ ఫ్లడ్స్
- తెలంగాణలో భద్రాద్రి,ఖమ్మం జిల్లాలకు ఆకస్మిక వరదలు
భారీ నుంచి అతి భారీ వర్షాలు
- రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
- సాయంత్రం తీరం దాటనున్న మోంథా
- తీరం దాటే సమయంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు
- కాకినాడకు 140కి.మీ దూరంలో కేంద్రీకృతం
- మచిలీపట్నానికి 60కి.మీ దూరంలో మోంథా
- తీరం దాటే సమయంలో 100కి.మి వేగంతో ఈదురు గాలు
- పశ్చిమగోదావరి నుంచి నెల్లూరు వరకు భారీగా వరదలు
విశాఖ జిల్లాలో మోంథా తుపాన్ ప్రభావం
- నగరంలో కుండపోత, రాకపోకలకు తీవ్ర అంతరాయం
- విశాఖలో నీటమునిగిన బ్రిడ్జిలు
కోనసీమ జిల్లాలో ఈరురుగాలులతో కూడిన వర్షం
- పి. గన్నవరం మండలంలో వర్షాలకు వరిచేలు ేనేలమట్టం
- ప్రభుత్వం ఆదుకోవాలంటూ వేడుకుంటున్న రైతులు
కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన వర్షం
- ఉప్పాడ తీరంలో సముద్రం అల్లకల్లోలం
- ఉప్పాడ నుంచి ాకాకినాడ వెళ్లే బీచ్ రోడ్డు ధ్వంసం
- అలల తీవ్రతకు రహదారిపై ఎగిసిపడుతున్న బండరాళ్లు
కోనసీమ జిల్లాలో మోంథా తుపాను ప్రభావం
- భారీ ఈదురుగాలులతో కొబ్బరిచెట్లు నేలమట్టం
- మామిడికుదురులో తాటిచెట్టు విరిగిపడి మహిళ మృతి
- తుపాను బీభత్సంపై కోనసీమ వాసుల ఆందోళన
అనకాపల్లి :
- మెంథా తుపాన్ ఎఫెక్ట్. .
- పాయకరావుపేట నియోజకవర్గంలో మధ్యాహ్నం నుండి పుంజుకున్న వర్షాలు
- రేవుపోలవరం తీరంలో 150 మీటర్లు ముందుకు వచ్చిన సముద్రం
- అల్లకల్లోలంగా మారిన సముద్రం
- సముద్రంలో ఎగసిపడుతున్న రాకాసి అలలు
- ఒడ్డును ఉన్న తెప్పలను తాకుతున్న అలలు.
- తీరప్రాంతంలోకి ఎవరు రాకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసిన పోలీస్,మెరైన్ శాఖలు
అనకాపల్లి :
- అనకాపల్లి మండలంలో రైతులకు భారీ పంట నష్టం
- కుంచంగి, తగరంపూడి, వెంకుపాలెం గ్రామాల పరిధిలో నీట మునిగిన వరి పంట
- దాదాపు 3 వేల ఎకరాలు మునిగిపోయిందని చెప్పిన రైతులు
- ఎకరాకు రూ. 25 వేలు పెట్టుబడి పెట్టమని పూర్తి నష్టపోయామని వాపోతున్న అన్నదాతలు
పశ్చిమగోదావరి జిల్లా
- మోంథా తుపాను ప్రభావంతో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం
- తాడేపల్లిగూడెం మండలం మాధవరం వద్ద వర్షాల ధాటికి ఉప్పొంగి ప్రవహిస్తున్న ఎర్రకాలువ
- మాధవరం నుండి కంసాలిపాలెం మధ్య నిలిచిపోయిన రాకపోకలు
అనకాపల్లి
- మోంథా తుపాన్ ఎఫెక్ట్.
- చెన్నై కోలకత్తా జాతీయ రహదారిపై గోకులపాడు వద్ద కూలిన చెట్టు
- విశాఖ నుండి తుని వైపు రోడ్డులో
- గోకులపాడు నుండి ధర్మవరం వరకు భారీగా నిలిచిన ట్రాఫిక్
- ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించిన పోలీస్, హైవే అథారిటీ
ప్రకాశం
- సింగరాయకొండ మండలంలోని తీర ప్రాంత గ్రామాలలో పర్యటిస్తున్న మాజి మంత్రి ఆదిమూలపు సురేష్
- మోంథా తుఫాన్ ప్రభావంతో వేట నిలిపివేసిన మత్సకారులను ఆదుకోవాలని డిమాండ్
కృష్ణాజిల్లా
తీరం వైపు దూసుకొస్తున్న మోంథా తుఫాన్
తీరంలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న అలలు
కోడూరు మండలం పాలకాయతిప్ప , కృత్తివెన్ను మండలం, చిన్నగొల్లపాలెం, పెద్ద గొల్లపాలెం , నిడమర్రు ,వర్లగొందితిప్ప , ఇంతేరు , పార్వతీపురం తీర గ్రామాల్లో అల్లకల్లోలంగా సముద్రం
100 మీటర్లకు పైగా ముందుకు చొచ్చుకు వచ్చిన సముద్రం
తుపాన్ ధాటికి తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు
కృత్తివెన్ను ,అవనిగడ్డ ,నాగాయలంక ,మోపిదేవి, కోడూరు మండలాల్లో పెరిగిన గాలుల తీవ్రత
గాలుల ధాటికి చిగురుటాకులా వణుకుతున్న తీర ప్రాంత ప్రజలు
పశ్చిమగోదావరి జిల్లా
- మోంథా తుఫాను ప్రభావంతో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం.
- తాడేపల్లిగూడెం మండలం మాధవరం వద్ద వర్షాల ధాటికి ఉప్పొంగి ప్రవహిస్తున్న ఎర్రకాలువ.
- మాధవరం నుండి కంసాలిపాలెం మధ్య నిలిచిపోయిన రాకపోకలు
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ..
- మోంథా తుఫాన్ ప్రభావంతో అయినవిల్లి ఆదర్శనగర్ బైపాస్ రోడ్డులో కూలిన భారీ వృక్షం
- చెట్టు కూలడంతో తెగిపడిన 32 కెవి విద్యుత్ లైన్, నేలకూలిన విద్యుత్ స్తంభం
- సిబ్బంది సహాయంతో చెట్టును తొలగించిన వైఎస్సార్సీపీ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాస్
కాకినాడ జిల్లా,యానాం:
- యానాం ముందుకొస్తున్న మోంథా తుఫానుకు సంబంధించి పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామి ఆరా.
- యానాం-కాకినాడ మధ్య తుఫాను తీరం దాటే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి అని కోరిన సీఎం రంగస్వామి, ఢిల్లీ ప్రతినిధి మల్లాడి.
- పుదుచ్చేరి ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావుకు ఫోన్ చేసి తుఫాను పరిస్థితిని అడిగి తెలుసుకున్న సీఎం రంగస్వామి.
- యానాంలో పాలనపరంగా తీసుకున్న చర్యలు, పరిపాలనాధికారి, పుదుచ్చేరి నుంచి వచ్చిన ప్రత్యేక అధికారి, ఇతర సిబ్బందితో సమీక్షించిన అంశాలను సీఎంకు వివరించిన ఢిల్లీ ప్రతినిథి మల్లాడి
- తుఫానుపై ప్రభుత్వపరంగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది
- తుఫాన్ పరిస్థితి పై ఎప్పటికప్పుడు ఢిల్లీ ప్రతినిధి మల్లాడి, అధికారులు తన దృష్టికి తీసుకురావడం జరుగుతుంది- సీఎం రంగస్వామి
అంతర్వేది సమీపంలో తీరం దాటే చాన్స్
కోనసీమ జిల్లా:
- సాయంత్రం 6 తర్వాత నుంచితీరం దాటే ప్రక్రియ ొమొదలు
- అంతర్వేది సమీపంలో తీరం దాటే చాన్స్
- తూర్పుపాలెం-కేసుదాసుపాలెం గ్రామాల మధ్య ీతీరం దాటే చాన్స్
- ఏపీతీరానికి దగ్గరగా వస్తోన్న మోంథా
- రాత్రి 11 గంటలకు పూర్తిగా తీరం దాటే అవకాశం
- ఆ ఐదు గంటలు అత్యంత కీలకం
- తీర ప్రాంత ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు
- తీరం దాటే సమయంలో అతి భారీ వర్షాలు, తీవ్ర గాలులు
- విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతినే ప్రమాదం
- తుపాన్ ప్రభావిత జిల్లాల్లో రాత్రి 7 తర్వాత వాహనాలు నిలిపివేత
- 17 జిల్లాల్లో రాత్రికి నిలిచిపోనున్న రవాణా వ్యవస్థ
విజయవాడ డివిజన్ పరిధిలో 105 రైళ్లు రద్దు
విజయవాడ:
- విజయవాడ డివిజన్ పై మోంథా తుఫాన్ ఎఫెక్ట్
- పలు రైళ్లు రద్దు ,పలు రైళ్లు దారిమళ్లింపు , మరికొన్ని పునఃరుద్ధరణ
- తుఫాన్ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం
- రైల్వే భద్రతాపరంగా అన్ని చర్యలు తీసుకున్నాం
- విజయవాడ డివిజన్ పరిధిలో 105 రైళ్లు రద్దు
- 5 రైళ్లు దారి మళ్లింపు
- 17 రైళ్లు పునఃరుద్ధరణ
- ప్రతీ మేజర్ స్టేషన్ లో 24 గంటలూ అందుబాటులో ఉండేలా వార్ రూమ్ లు ఏర్పాటు
- రైల్వే ట్రాక్ పరిస్థితి ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు పెట్రోల్ మెన్ వ్యవస్థని ముమ్మరం చేశాం
- ప్రయాణీకులకు అందుబాటులో టోల్ ఫ్రీ నెంబర్లు
- ప్రయాణికుల సౌకర్యార్థం హెల్ప్ లైన్ ఏర్పాటు చేశాం
- ప్రయాణికుల టికెట్స్ క్యాన్సిలేషన్ కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశాం
- తుఫాన్ పరిస్థితుల పై ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నాం
- రేపటి పరిస్థితిని బట్టి రైళ్ల రాకపోకల్లో మార్పులు చేస్తాం
-పి.ఇ.ఎడ్విన్...అడిషనల్ డివిజనల్ రైల్వే మేనేజర్(infra),విజయవాడ
ఉప్పాడ తీరంలో అధికారుల అలెర్ట్
కాకినాడ:
- మోంథా తుఫాన్ ప్రభావంతో ఉప్పాడ తీరంలో అలెర్ట్ అయిన అధికారులు
- కొత్తపట్నం, సుబ్బంపేట గ్రామాలను చేయిస్తున్న అధికారులు
- మత్స్యకార కుటుంబాలను పునరావాస కేంద్రానికి తరలింపు
తీవ్ర తుపానుగా మారిన మోంథా
- ప్రస్తుతం మచిలీపట్నం 190, కాకినాడ కి 270, విశాఖపట్నం 340 కి. మీటర్ల దూరంలో కేంద్రీకృతం
- ఇవాళ సాయంత్రం లేదా రాత్రి మచిలీపట్నం, కళింగపట్నం వద్ద కాకినాడ వద్ద తీరం దాటే అవకాశం
- తీరం దాటే సమయంలో 90 నుంచి 110 కి. మీ వేగంతో తీరం వెంబడి ఈదురు గాలులు వీచే అవకాశం
- తీరం దాటే సమయంలో, తీరం దాటిన తర్వాత తెలంగాణ రాష్ట్రంపై ప్రభావం
- ఇవాల భారీ, అతి భారీతో పాటు భారీ వర్షాలకు అవకాశం
- ముఖ్యంగా ఉత్తర ఈశాన్య జిల్లాలపై మోంథా తుపాను ప్రభావం
- ఇవాళ పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్ జారీ
- ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు రెడ్ అలెర్ట్
- మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట, నల్గొండ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్
- కొమరం బీమ్, జగిత్యాల, కరీంనగర్, సిద్ధిపేట, జనగాం, యాదాద్రి, నాగర్ కర్నూల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్
మోంథా ఎఫెక్ట్.. ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో ఎడతెరిపిలేని వర్షాలు
- ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో మోంథా తుపాను ప్రభావంతో ఎడతెరిపిలేని వర్షాలు
- వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లో నిన్న రాత్రి నుంచి వర్షాలు
- అప్రమత్తమైన రెండు జిల్లాల యంత్రాంగం.
- ఉధృతంగా ప్రవహిస్తున్న పెన్నా నది
- మైలవరం నుంచి నీటిని కిందికి విడుదల చేసిన అధికారులు
- కడప నగరానికి బుగ్గవంక ముప్పు
- రిజర్వాయర్ నిండటంతో కిందికి నీటిని వదులుతున్న అధికారులు
- కడపలోని లోతట్టు ప్రాంతాల్లో కాలనీల వారిని అప్రమత్తం చేసిన అధికారులు
- అన్నమయ్య జిల్లాలోనూ నిండు కుండలా జలాశయాలు
- వెలిగల్లు, పించా ప్రాజెక్టుల నుంచి నీటిని కిందికి విడుదల చేస్తున్న అధికారులు
- గండికోటతో పాటు చిత్రావతి రిజర్వాయర్ల వద్ద అప్రమత్తత
- రైల్వే కోడూరులో ఉధృతంగా ప్రవహిస్తున్న గుంజనేరు
- సాయంత్రానికి భారీ వర్షాలు కురిసే అవకాశం
- జిల్లా కలెక్టరేట్లతో పాటు అన్ని రెవిన్యూ డివిజన్ కేంద్రాల్లో కంట్రోల్ రూమ్ల ఏర్పాటు
- ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందనే హెచ్చరికలతో మరింత అప్రమత్తమైన అధికారులు
దూసుకొస్తున్న మోంథా తుపాను
- రెడ్ జోన్లోకి మరో రెండు జిల్లాలు
- నెల్లూరు, తిరుపతి జిల్లాలూ రెడ్ జోన్లోకే
- కాకినాడకు 225 km దూరంలో కేంద్రీకృతం
- తీరం చేరేకొద్దీ తీవ్రరూపం దాల్చుతున్న మోంథా
- గంటకు 12 కి.మీ వేగంతో కదులుతున్న తుపాన్
- రాత్రికి కాకినాడ- మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం
- ఆ సమయంలో 100 నుండి 110 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు
- శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు అతి భారీ వర్షాలు
జలమయంగా సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి మెట్ల మార్గం
- జలమయంగా సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి మెట్ల మార్గం
- భారీ వర్షాలతో జలమయంగా మారిన సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి మెట్ల మార్గం
- భక్తులకు మెట్ల మార్గం నుండి ప్రవేశాన్ని నిలిపివేసిన దేవస్థానం అధికారులు
- తుపాను కారణంగా సింహగిరిపై తగ్గిన భక్తుల సంఖ్య
కృష్ణా జిల్లా: అల్లకల్లోలంగా మారిన సముద్రం
- మంగినపూడి బీచ్ వద్ద ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అలలు
- తీర ప్రాంతంలో పెరిగిన గాలుల తీవ్రత
- గాలులతో కూడిన మోస్తారు వర్షం
- మోంథా తుపాను ప్రభావంతో దివిసీమలో బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షం
- అవనిగడ్డ మండలం వేకనూరు వద్ద అవనిగడ్డ-నాగాయలంక ప్రధాన రహదారిపై విరిగిపడ్డ చెట్టు
- రాకపోకలకు అంతరాయం కలగడంతో చెట్టును పక్కకు తొలగించిన వాహనదారులు
మోంథా పడగ నీడలో కాకినాడ, కోనసీమ
సైక్లోన్ వాల్ 50 కి.మీ ఉంటుందని అంచనా
కాకినాడకు దక్షిణంగా తీరాన్ని తాకే అవకాశం
కాకినాడ పోర్టుకు 10వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం
కాకినాడ పోర్టుకు సమీపంగా తీవ్ర తుఫాన్ తీరాన్ని దాటుతుందని వార్నింగ్
గ్రేట్ డేంజర్ సిగ్నల్ 10 ఇటీవల కాకినాడ తీరానికి ఇవ్వడం ఇదే తొలిసారి
హుదూద్ తుపాను సమయంలో 11వ నెంబర్ జారీ చేసిన ఐఎండీ
నెల్లూరులో ముందుకొచ్చిన సముద్రం
- మోంథా తుపాను ప్రభావంతో నెల్లూరులో వర్షాలు
- మైపాడు బీచ్ వద్ద 50 మీటర్లు ముందుకొచ్చిన సముద్రం
- పర్యాటకులెవరూ అటు పక్క వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్న అధికారులు
- తీర ప్రాంతాలను మైక్ సెట్ల ద్వారా అప్రమత్తం చేస్తున్న పోలీసులు
మోంథా డేంజర్ బెల్స్
- డేంజర్ బెల్స్ మెగిస్తున్న సైక్లోన్ మోంథా
- కాకినాడ 270 కి.మీ. దూరంలో ఉన్న తీవ్ర తుపాను
- తీరాన్ని సమీపించే కొద్దీ మరింత ఉగ్రరూపం ప్రదర్శిస్తున్న మోంథా
- కాకినాడ ఉప్పాడలో అల్లకల్లోలంగా సముద్రం
- కాకినాడ పోర్టుకు గ్రేట్ డేంజర్ సిగ్నల్ (10వ నెంబర్ ప్రమాద హెచ్చరిక) జారీ
- విశాఖ గంగవరం, భీమునిపట్నం.. కళింగపట్నంలో డేంజర్ సిగ్నల్-9 జారీ
- మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం ఓడరేవులకూ 8వ ప్రమాద హెచ్చరికలు జారీ
- పోర్టుకు సమీపంలో తీవ్ర తుపాను తీరం దాటే అవకాశం
మరింత తీవ్రరూపం దాల్చిన మోంథా
- కాకినాడకు 270km దూరంలో కేంద్రీకృతం
- తీర ప్రాంతంలో పెరిగిన ఈదురు గాలులు
- సముద్రంలో ఎగసి పడుతున్న రాకాసి అలలు
- రాష్ట్రమంతటా కురుస్తున్న వర్షం
- కాకినాడ నుండి విశాఖ వరకు తీర ప్రాంతంలో భారీ వర్షాలు
- రాత్రికి తీరం దాటనున్న మోంథా
- మచిలీపట్నం-కాకినాడ మధ్య తీరం దాటే అవకాశం
- కృష్ణా, కాకినాడ, ఏలూరు, కోనసీమ జిల్లాలపై మోంథా ప్రభావం తీవ్రం
- భారీ వర్షాలు, గాలులతో ఎఫెక్ట్ అయ్యే అవకాశం
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా బలపడిన మోంథా
- గడిచిన 6 గంటల్లో గంటకు 15 కి.మీ వేగంతో కదిలిన తుపాను
- ప్రస్తుతానికి మచిలీపట్నానికి 190 కి.మీ, కాకినాడకి 270 కి.మీ, విశాఖపట్నానికి 340 కి.మీ దూరంలో కేంద్రీకృతం
- ఈ రోజు రాత్రికి కాకినాడ-మచిలీపట్నం మధ్య తీవ్ర తుపానుగా తీరం దాటే అవకాశం
- తీరం దాటే సమయంలో గంటకు 90-110 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు
- దీని ప్రభావంతో నేడు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు అతిభారీ వర్షాలు
- కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం
- ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలి
కాకినాడ తీరం దిశగా దూసుకువస్తున్న మోంథా తుపాను
- ముందు జాగ్రత్తగా జిల్లాలో మూడు హెలీపాడ్లు ఏర్పాటు
- కాకినాడ ,పిఠాపురం, తాళ్ళ రేవు లలో హెలిపాడ్లు సిద్ధం చేస్తున్న అధికారులు
- జిల్లాలో తుపాను ప్రభావిత మండలాలు 12, గ్రామాలు 67, మున్సిపాలిటీలు 5
- తుపాను ప్రభావిత ప్రాంతాలను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్న అధికారులు
- కోస్టల్ ఏరియాకీ సమీపంలో ఉన్న దాదాపు నాలుగు లక్షల మంది
- కాకినాడ నుండి విజయవాడకు 12, విశాఖపట్నానికి 8 బస్సు సర్వీసులు రద్దు
- చెన్నై, తిరుపతి, కడప, కర్నూలు, భద్రాచలం బస్సు ఇవాళ రద్దు
మోంథా ఎఫెక్ట్.. పలు విమానాలు రద్దు
ఇవాళ ఎయిర్ ఇండియాకి చెందిన విమానాలు రద్దు చేస్తున్నట్లు ఎయిర్పోర్ట్ అథారిటీ ప్రకటన
గన్నవరం ఎయిర్ పోర్టు పై మోంథా తుపాను ఎఫెక్ట్
ఉదయం 10:30 గంటల తర్వాత నిలిచిపోనున్న అన్ని విమాన సర్వీసులు
ఇప్పటికే అన్ని సర్వీసులను రద్దు చేసుకున్న ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ( మొత్తం 8 సర్వీసులు)
ఢిల్లీ, ముంబై నుంచి వచ్చే ఎయిర్ ఇండియా సర్వీసులు రద్దు (మొత్తం 3 సర్వీసులు)
ఈ ఉదయం 10:30 వరకూ మాత్రమే తమ సర్వీసులను నడపనున్న ఇండిగో సంస్థ
ఉదయం 10:30 తర్వాత అన్ని సర్వీసులను రద్దు చేసుకున్న ఇండిగో సంస్థ (మొత్తం 15 సర్వీసులు)
విమాన సర్వీసులు రద్దైన నేపధ్యంలో పాసింజర్లకు పలు సూచనలు చేసిన ఎయిర్ పోర్టు అధికారులు
ఎయిర్ పోర్టుకు వచ్చే ముందు హెల్ప్ లైన్కు ఫోన్ చేసి చెక్ చేసుకోవాలి
మోంథా తుపాను వేళ అద్భుత ఫలితాలనిస్తున్న గ్రామ సచివాలయాలు
గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చిన వైఎస్ జగన్
తీర ప్రాంత గ్రామాల్లోని సచివాలయాల్లో అవేర్నెస్ అలర్ట్ బ్రాడ్ కాస్టింగ్ టెక్నాలజీ
తుపాను హెచ్చరికల కేంద్రాలుగా మారిన గ్రామ సచివాలయాలు
గ్రామ సచివాలయాల ద్వారా మోంథా తుఫాన్ పై ప్రజలను అప్రమత్తం చేస్తున్న ప్రభుత్వం
కోస్తా జిల్లాల్లోని 26 తీర ప్రాంతా గ్రామాల్లో తుపానుపై సచివాలయాల ద్వారా ప్రజలకు హెచ్చరికలు
విద్యుత్ అంతరాయం జరిగినా 360° హార్న్ స్పీకర్ వ్యవస్థతో హెచ్చరికలు చేసేలా ఏర్పాటు
తమిళనాడులో భారీ వర్షాలు
కాంచీపురం, తిరునల్వేలి, కన్యాకుమారిలో కుండపోత
చెన్నైలో ఎడతెరిపిలేకుండా వర్షం
చెన్నై, తిరువళ్లూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన అధికారులు
తెలంగాణపై మోంథా తుపాను ఎఫెక్ట్
- తెలంగాణలోని 3 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
- పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగుకు భారీ వర్ష సూచన
- నేడు తెలంగాణలోని 21 జిల్లాలకు ఎల్లో అలర్ట్
- రేపు 4 జిల్లాలకు ఆరెంజ్, 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్
- గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు
- తమిళనాడులో భారీ వర్షాలు
- కాంచీపురం, తిరునల్వేలి, కన్యాకుమారిలో కుండపోత
- చెన్నైలో ఎడతెరిపిలేకుండా వర్షం
- చెన్నై,తిరువళ్లూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
- విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన అధికారులు
ఏపీలో తీరం అల్లకల్లోలం
- విశాఖలోని పెదజాలరిపేట తీరం వద్ద ఈదురుగాలులకు ఊగిపోతున్న చెట్లు
- కాకినాడకు చేరువలో తుపాను.. కోస్తాకు గండం
- ఏపీపై పెను ప్రభావం.. తెలంగాణలోనూ భారీ వర్షాలు
- ఏపీలో 17 జిల్లాల్లో రెడ్ అలర్ట్, తెలంగాణలో 8 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్
- విశాఖలో భారీ ఈదురు గాలులు, ఎడతెగని వర్షం
- హైదరాబాద్, విజయవాడ, విశాఖ, తిరుపతికి పలు విమానాలు రద్దు
- 30కిపైగా విమానాలు, 97 రైలు సర్వీసుల రద్దు
- కాకినాడ– అమలాపురం మధ్య బుధవారం తెల్లవారుజామున తుపాను తీరాన్ని దాటే అవకాశం
- తీరం దాటే సమయంలో గంటకు 110 కి.మీ. ప్రచండ వేగంతో గాలులు
కాకినాడ తీరంలో రాకాసి అలల హోరు..
- రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు
- కాకినాడ తీరంలో రాకాసి అలలు విరుచుకుపడుతున్నాయి
- తీవ్ర వాయుగుండం నుంచి సోమవారం ఉదయానికి తుపానుగా మారింది
- తుపాను గంటకు 13 నుంచి 18 కిలోమీటర్ల వేగంతో ఉత్తర, వాయవ్య దిశగా కదులుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది
- రాత్రి సమయానికి విశాఖకు 460 కిలోమీటర్లు, కాకినాడకు 410, చెన్నైకి 400 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది
- మంగళవారం ఉదయానికి ఇది తీవ్ర తుపానుగా మారి ముందుకు కదలనుంది.
- బుధవారం తెల్లవారు జామున కాకినాడ– అమలాపురం మధ్యలో తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

‘మోంథా’ పెను ముప్పు!
- పెను ఉప్పెనలా దూసుకొస్తోన్న మోంథా తుపాను
- ఓవైపు బలమైన ఈదురు గాలులు కకావికలం చేస్తుండగా.. జడివానలు జడిపిస్తున్నాయి
- రోడ్డు మార్గాలు జలమయం
- రైలు మార్గాలను భయపెడుతున్న ముంపు ముప్పు
- భీకర గాలులు వాయుమార్గాన్ని సైతం స్తంభింపజేస్తున్నాయి
- పెను తుపాను కారణంగా పలు విమానాలను రద్దు
- బెంగళూరు, హైదరాబాద్, చెన్నై తదితర ప్రాంతాల నుంచి విజయవాడ, విశాఖ, తిరుపతికి వచ్చే విమానాలు రద్దు
- దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే జోన్ల పరిధిలో 97 రైళ్ల రద్దు
- సముద్రం అల్ల కల్లోలం కావడంతో స్తంభించిపోయిన జల రవాణా
- పోర్టుల్లో సరుకు రవాణా కార్గో షిప్పులకు లంగరు వేశారు
- నౌకాదళానికి చెందిన నౌకలు ప్రధాన కేంద్రాలకు చేరుకున్నాయి


