ఏపీలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ | Heavy Rains Likely In Andhra Pradesh For Two Days | Sakshi
Sakshi News home page

ఏపీలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌

Oct 14 2025 7:31 AM | Updated on Oct 14 2025 8:57 AM

Heavy Rains Likely In Andhra Pradesh For Two Days

సాక్షి, విశాఖపట్నం: కోస్తాంధ్ర పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మరో రెండు రోజుల పాటు ఏపీలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఏలూరు, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. నెల్లూరు, కర్నూలు, అనంతపురం, తిరుపతిలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది.

పిడుగుపాటుకు ఇంజినీరింగ్‌ విద్యార్థి మృతి
చిత్తూరు రూరల్‌: పిడుగుపా­టు­కు ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన ఆదివా­రం రాత్రి చిత్తూరు మండలం అనంతాపురం పంచాయతీ ఏ.జంగాలపల్లిలో చోటుచేసుకుంది. ఏ.జంగాలపల్లి గ్రామానికి చెందిన చిట్టి­బాబు నాయుడు కుమారుడు లతీష్‌కుమార్‌ (20) చిత్తూరు నగ­రంలోని ఓ ప్రైవేటు కాలేజీలో బీటెక్‌ ద్వితీయ సంవత్సరం చదువు­తున్నాడు. ఆదివారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షం కురిసింది. ఆ సమయంలో ఇంటి మిద్దెపైకి వెళ్లిన లతీష్‌­కుమార్‌ పిడుగుపాటుకు గురయ్యాడు.

పిడుగు శబ్దానికి జేబులో పేలిన ఫోన్‌
అల్లూరి జిల్లా: పిడుగు­పా­టు శబ్దానికి జేబులో ఉన్న సెల్‌­ఫోన్‌ పేలిపోయి గిరిజ­నుడికి తీవ్ర గాయాలయ్యా­యి. అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలంలోని అత్యంత మారుమూల భూసిపుట్టు పంచాయతీ తోట­లా­మెట్ట గ్రామానికి చెందిన గిరిజనుడు తాలబు మోహ­న్‌­రావు(58) ఆదివారం సాయంత్రం గ్రామం నుంచి గాల్లెల­పుట్టుకు వెళ్తుండగా మార్గం మధ్యలో భారీ వర్షం కురిసింది. అక్కడే పిడుగు కూడా ప­డింది. ఈ శబ్దానికి ప్యాంట్‌ జేబులో ఉన్న సెల్‌ఫోన్‌ ఒక్క­సారిగా పేలిపోయింది. మోహ­న్‌­రావు పొట్ట కుడి భాగం తీవ్రంగా కాలింది. దీనిని గమనించిన స్థానికులు ప్రైవేట్‌ వాహనంలో ముంచంగిపుట్టు సీహెచ్‌సీకి తరలించారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement