కాంగోలో విరిగిపడ్డ కొండచరియలు.. వందల సంఖ్యలో మృతులు | 200 people died in a landslide in Congo | Sakshi
Sakshi News home page

కాంగోలో విరిగిపడ్డ కొండచరియలు.. వందల సంఖ్యలో మృతులు

Feb 1 2026 10:49 PM | Updated on Feb 1 2026 11:18 PM

200 people died in a landslide in Congo

రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో  దారుణం జరిగింది. అక్కడ మిలిషీయా గ్రూపులో కంట్రోల్‌లో ఉన్న ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి 200 మంది వరకూ మరణించారు. నాలుగు రోజుల క్రితం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఈ బుధవారం ఉత్తర కివు ‍ప్రావిన్సులోని రుబియ గనులలో బుధవారం భారీవర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి.  అయితే ప్రమాదం జరిగిన తర్వాత వెంటనే భద్రతా బలగాలు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించాయి. గాయపడిన వారిని రుబియాలోని ఆసుపత్రులకు తరలించినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ ప్రమాదంలో దాదాపు 200కుపైగా ప్రజలు ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు తెలుస్తోంది.

భారీస్థాయిలో వర్షాలు కురవడంతో చాలా మట్టుకు మృతదేహాలు బురదలో చిక్కుకుపోయాయని వాటిని వెలిక్కితీయడం కష్టమవుతుందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం జరిగిన ప్రాంతం ఎం23 అనే తిరుగుబాటు గ్రూపు ఆదీనంలో ఉంది. అయితే ఈ ఘటనపై అక్కడి ప్రభుత్వం స్పందించింది. కొండచరియలు విరిగిన ప్రమాదంలో మృతిచెందిన వారికి సంఘీబావం ప్రకటించింది. తిరుగుబాటు గ్రూపులో ఈ ప్రాంతంలోని సహాజవనరులను అక్రమంగా దోచుకుంటున్నారని ఆరోపించింది.

ఉత్తర కాంగో ప్రాంతంలో ఉన్న రుబియా ప్రాంతంలనో గనులలో అధిక స్థాయిలో ఖనిజ నిల్వలున్నాయి. దీంతో అక్కడి స్థానిక మిలిషీయా గ్రుపులకు ప్రభుత్వానికి మధ్య తరచుగా యుద్ధం జరుగుతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement