పట్టాలపై నీళ్లు: పలు రైళ్ల రద్దు.. మరికొన్ని దారి మళ్లింపు | Heavy Rains in Telangana: South Central Railway Cancels and Diverts Several Trains | Sakshi
Sakshi News home page

పట్టాలపై నీళ్లు: పలు రైళ్ల రద్దు.. మరికొన్ని దారి మళ్లింపు

Aug 27 2025 6:43 PM | Updated on Aug 27 2025 9:00 PM

Several Trains Cancelled Due To Heavy Rains In Telangana

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. భారీ వర్షాలు పలు జిల్లాలను అతలాకుతలం చేస్తున్నాయి. దీంతో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేయగా, మరి కొన్నింటిని దారిమళ్లించింది. కాచిగూడ-నిజామాబాద్‌, నిజామాబాద్‌-కాచిగూడ, కరీంనగర్‌-కాచిగూడ, కాచిగూడ-మెదక్‌, మెదక్‌-కాచిగూడ, బోధన్‌-కాచిగూడ, ఆదిలాబాద్‌-తిరుపతి సర్వీసును రద్దు చేసినట్టు రైల్లే అధికారులు ప్రకటించారు.

మహబూబ్‌నగర్‌-కాచిగూడ, షాద్‌నగర్‌-కాచిగూడ సర్వీసును పాక్షింగా రద్దు చేసినట్టు అధికారులు వెల్లడించారు. కామారెడ్డి-బికనూర్-తలమడ్ల, అక్కన్నపేట్ -మెదక్ రైల్వే ట్రాక్‌ పైనుంచి ఉధృతంగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మెదక్, కామారెడ్డి జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement