రవిశాస్త్రి విశ్వాసం
దుబాయ్: వచ్చే రెండు, మూడేళ్లలో సంజూ సామ్సన్ భారత టి20 జట్టుకు కెప్టెన్గా వ్యవహరించడం ఖాయమని మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత రవిశాస్త్రి అన్నాడు. 2026 టి20 వరల్డ్ కప్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన సామ్సన్కు కెప్టెన్ అయ్యే స్థాయి, అర్హత ఉన్నాయని శాస్త్రి అభిప్రాయపడ్డాడు. ‘2028 టి20 వరల్డ్ కప్ సమయానికి సూర్యకుమార్ గురించి ఆలోచించే అవకాశం ఉండకపోవచ్చు. వచ్చే రెండేళ్లలో సూర్య ఎలా ఆడినా సరే... జట్టుకు మాత్రం కచ్చితంగా కొత్త కెప్టెన్ అవసరమే. సామ్సన్ అందుకు సరైనవాడు. ప్రాధాన్యతాక్రమంలో కూడా అతను అందరికంటే ముందున్నాడనేది నా అభిప్రాయం.
ఐపీఎల్లో అతను రాజస్తాన్ రాయల్స్కు సుదీర్ఘ కాలం సారథిగా వ్యవహరించాడు. టాపార్డర్లో విధ్వంసక బ్యాటర్గా జట్టులో అతని స్థానం తిరుగులేనిది. కాబట్టి ఇది ఆరంభం మాత్రమే. మున్ముందు సామ్సన్పై పెద్ద బాధ్యత ఉంది. టి20 వరల్డ్ కప్లో చెలరేగిన తర్వాత ఇప్పుడు ఐపీఎల్లో అతను మరింత పరిణతి చెందినట్లుగా కనిపిస్తోంది. తనపై వచ్చిన అన్ని సందేహాలను సామ్సన్ జవాబిచ్చేశాడు. భవిష్యత్తులో అతడిని నాయకుడిగా గుర్తించేందుకు ఇది సరిపోతుంది’ అని రవిశాస్త్రి విశ్లేషించాడు.


