ఐపీఎల్-2026 సీజన్లో కీలక పోరుకు రంగం సిద్దమైంది. రాయ్పూర్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇరు జట్లు కూడా చెరో మార్పుతో బరిలోకి దిగాయి.
కేకేఆర్ స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గాయం కారణంగా ఈ మ్యాచ్కు దూరమయ్యాడు. అతడి స్ధానంలో సౌరభ్ దూబే తుది జట్టులోకి వచ్చాడు. అదేవిధంగా ఆర్సీబీ జట్టులో వెంకటేశ్ అయ్యర్కు ఛాన్స్ లభించింది. కాగా వర్షం కారణంగా ఈ మ్యాచ్ రాత్రి 8:45 గంటలకు ప్రారంభం కానుంది. అలస్యంగా ప్రారంభమవుతున్నప్పటికి ఓవర్లను మాత్రం కుదించలేదు.
తుది జట్లు
కోల్కతా నైట్ రైడర్స్: అజింక్యా రహానే (కెప్టెన్), ఫిన్ అలెన్, కామెరాన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ (వికెట్ కీపర్), రోవ్మన్ పావెల్, మనీష్ పాండే, రింకు సింగ్, సునీల్ నరైన్, అనుకూల్ రాయ్, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : జాకబ్ బెథెల్, విరాట్ కోహ్లి, రజత్ పాటిదార్(కెప్టెన్), జితేష్ శర్మ(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, వెంకటేష్ అయ్యర్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, రసిఖ్ సలాం దార్, జాకబ్ డఫీ, జోష్ హాజిల్వుడ్
చదవండి: NZ vs ENG: ఇంగ్లండ్ జట్టులో ఇటలీ క్రికెటర్ 'గే'


