పోస్టు ఫార్వర్డ్‌ చేశాడని 26 కేసులు | Tdp govt vendetta against social media activists | Sakshi
Sakshi News home page

పోస్టు ఫార్వర్డ్‌ చేశాడని 26 కేసులు

Dec 16 2025 6:04 AM | Updated on Dec 16 2025 6:04 AM

Tdp govt vendetta against social media activists

హైదరాబాద్‌లో బద్వేలుకు చెందిన సోషల్‌ మీడియా యాక్టివిస్టు అరెస్టు

కుమార్తె ఆపరేషన్‌ కోసం దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌ రాక 

లుకౌట్‌ నోటీసు ఉండటంతో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అదుపులోకి  

భయాందోళనలో కుటుంబ సభ్యులు

బద్వేలు అర్బన్‌/సాక్షి, హైదరాబాద్‌ సిటీ బ్యూరో: సోషల్‌ మీడియా యాక్టివిస్టులపై కూటమి ప్రభుత్వ కక్ష సాధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. సుమారు ఏడాదిన్నర క్రితం సోషల్‌ మీడియాలో ఓ పోస్టును ఫార్వర్డ్‌ చేశాడని నమోదైన ఓ కేసులో వైఎస్సార్‌ కడప జిల్లా బద్వేలుకు చెందిన సోషల్‌ మీడియా యాక్టివిస్టు బత్తలపల్లి శ్రీని­వాసుల­రెడ్డిని సోమవారం తెల్లవారుజామున శంషాబాద్‌ ఎయిర్‌­పోర్ట్‌ల­ో ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ అధికారులు అదు­పు­లోకి తీసుకున్నారు. అనంతరం కడప చిన్న చౌక్‌ పోలీ­సు­లకు అప్పగించారు.

బతుకుదెరువు నిమిత్తం దుబా­య్‌­­కు వెళ్లిన శ్రీనివాసులరెడ్డి.. కుమార్తె ఆపరేషన్‌ ఏర్పా­ట్ల కోసం దు­బా­య్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. ఈ విషయం తెలుసు­కున్న పోలీసులు లుకౌట్‌ నోటీసు ఉండటంతో అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసు­కు­న్న కుటుంబ సభ్యులు తమ కుమారుడికి ఏం జరుగు­తుందోనని భయాందోళనకు గురవుతున్నారు. వివరా­ల్లోకి వెళితే.. బద్వేలులోని తెలుగు­గంగ కాలనీ రోడ్డులో నివసించే రమణారెడ్డి, లక్షుమ్మ కుమారుడైన శ్రీనివాసు­ల­రెడ్డి సోషల్‌ మీడియాలో యాక్టివ్‌­గా ఉంటారు. వైఎ­స్సార్‌సీపీ అభిమాని అయిన శ్రీని­వా­సులరెడ్డి సామాజిక మాధ్యమా­ల్లో వచ్చే కూటమి ప్ర­భుత్వ వ్య­తిరేక విధానాలను షేర్‌ చేస్తుంటారు. సుమా­రు ఏ­డాదిన్నర క్రితం ఆయనపై కడపలోని ఓ పోలీసు స్టేషన్‌తో­పాటు బాపట్ల, రేపల్లె, తదితర పోలీసు స్టేషన్లలో ఏకంగా 26 కేసులు నమోదైనట్టు తెలిసింది.

కుమార్తె ఆపరేషన్‌ కోసం వచ్చి..
శ్రీనివాసులరెడ్డికి సుహిత, సుబ్బారెడ్డి అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరిలో సుహిత మూగ, అంధత్వంతో బాధ పడుతోంది. ఏడాదిన్నర క్రితం హైదరాబాద్‌లోని ఎల్‌వీ ప్రసాద్‌ ఆస్పత్రిలో ఒక కంటికి చికిత్స చేయించారు. మరో కంటికి చికిత్స చేయించేందుకు అపాయింట్‌మెంట్‌ తీసుకు­న్నారు. ఇందుకోసం దుబాయ్‌ నుంచి సోమవా­రం తెల్లవా­రుజామున హైదరాబాద్‌ వచ్చారు. శంషా­బాద్‌ ఎయిర్‌­పోర్టు­లో వెంటనే శ్రీని­వాసులరెడ్డిని పోలీసు­లు అరెస్టు చేశారు. ఈ విషయం తెలుసుకున్న బద్వేలు­లోని ఆయన తల్లిదండ్రులు, భార్య కన్నీటి పర్యంత­మయ్యారు.

తన కుమారుడికి ఏ పాపం తెలియదని, అక్రమ కేసులు పెట్టా­రని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని­కల్లో వైఎస్సార్‌సీపీ తర­పున ఏజెంట్‌గా కూర్చోవడమే తమ కుమారుడు చేసిన తప్పా అని వాపోయారు. కాగా, వైఎస్సార్‌సీపీ నాయకు­లు, కార్యకర్తలు, సోషల్‌ మీడియా యాక్టివిస్టులు అధైర్య పడొద్దని, పార్టీ తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటా­మని ఎమ్మెల్యే డాక్టర్‌ సుధ పేర్కొన్నారు. ఎమ్మెల్యే, పార్టీ లీగల్‌ సెల్‌ న్యాయవాది శ్రీనివాసులరెడ్డి కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement