దూసుకొచ్చిన ప్యాసింజర్‌ రైలు.. లారీ నుజ్జునుజ్జు..! | Gonda–Asansol Express crashes truck at crossing in Deoghar | Sakshi
Sakshi News home page

దూసుకొచ్చిన ప్యాసింజర్‌ రైలు.. లారీ నుజ్జునుజ్జు..!

Jan 22 2026 7:35 PM | Updated on Jan 22 2026 7:40 PM

Gonda–Asansol Express crashes truck at crossing in Deoghar

రాంచీ: జార్ఖండ్‌లో ఘోర రైలు ‍ప్రమాద ఘటన చోటుచేసుకుంది. రైల్వే క్రాసింగ్‌ వద్ద గేటు పడకపోవడంతో ట్రాక్‌పై వెళ్తున్న వాహనాలను ప్యాసింజర్‌ రైలు ఢీకొట్టింది. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. జార్ఖండ్‌లోని దేవోబంద్‌లో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

వివరాల ప్రకారం.. గోండా-అసన్‌సోల్ ఎక్స్‌ప్రెస్ రైలు గురువారం ఉదయం 9.30 గంటల సమయంలో దేవోబంద్‌ వద్దకు చేరుకుంది. ఇదే సమయంలో రైల్వే క్రాసింగ్ వద్ద గేటు వేయకపోవడంతో రోహిణి-నవాడిహ్ రైల్వే క్రాసింగ్ వద్ద రైలు పట్టాల మీదుగా పలు వాహనాలు వెళ్తున్నాయి. సరిగ్గా అదే సమయంలో రైలు గేటు వరకు వచ్చింది. కానీ, వాహనాలు మాత్రం ట్రాక్‌పైనే నిలిచిపోయి ఉన్నాయి. దీంతో, ట్రాక్‌పై ఉన్న లారీని రైలు ఢీకొట్టింది.

అయితే, అక్కడ పరిస్థితిని అర్థం చేసుకున్న లోకోపైలట్‌.. రైలుకు బ్రేకులు వేసి మెల్లగా రానిచ్చాడు. బియ్యం లోడుతో వెళ్తున్న లారీని మెల్లగా ఢీకొట్టి ఆగింది. ఆ లారీ ఒక పక్కకు ఒరిగింది. రెండు బైకులను అది ఢీకొట్టింది. అయితే ఆ బైకులపై ఉన్నవారు తృటిలో తప్పించుకున్నారు. దీంతో ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. మరోవైపు రైల్వే అధికారులు, ఆర్పీఎఫ్‌ సిబ్బంది, స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ గుమిగూడిన జనాన్ని వెళ్లగొట్టారు. ఈ ప్రమాదం నేపథ్యంలో రైళ్ల రాకపోకలను కొంతసేపు నిలిపివేశారు. ఆ తర్వాత పునరుద్ధరించారు.

అయితే సిగ్నల్‌ క్లియరెన్స్‌ లేనప్పటికీ ఆ రైలు ముందుకు కదిలిందని గేట్‌ మ్యాన్‌ ఆరోపించాడు. ఈ నేపథ్యంలో గేట్‌ పడకపోవడం, సిగ్నలింగ్‌ వ్యవస్థలో లోపాలు, లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యంపై రైల్వే అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement