breaking news
viral video
-
8 ఏళ్లు కష్టపడ్డా.. చెంపపై పదే పదే కొట్టుకున్న నటుడు
సినిమా ఇండస్ట్రీలో రాణించడం అంత ఈజీ కాదు. కొందరికి త్వరగా అవకాశాలు వస్తే..మరికొందరికి ఏళ్లు పడతాయి. అయినా కూడా ఫ్యాషన్తో కొంతమంది చిత్రపరిశ్రమను వదిలిపెట్టి రారు. తమ టాలెంట్ని నిరూపించుకునేందుకు ఒక్క చాన్స్ వచ్చినా చాలు అంటూ ఆశగా ఎదురు చూస్తుంటారు. అలా ఓ నటుడికి 8 ఏళ్ల తర్వాత బిగ్స్క్రీన్పై చూసుకునే అవకాశం వచ్చింది. తన కల నిజం కావడంతో.. స్టేజ్పైనే భావోద్వేగానికి లోనయ్యాడు. అన్షు, వాసవి గణేశన్ జంటగా నటించిన తాజా చిత్రం ‘హుషార్ పిట్టలు’. ఇందులో భాను అనే నటుడు కీలక పాత్ర పోషించాడు. ఆగస్టు 15న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిన్న ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భాను మాట్లాడుతూ.. ఎమోషనల్ అయ్యాడు. ‘సినిమాల్లో రావడానికి 8 ఏళ్లు కష్టపడ్డా. ఎంతమంది హేళన చేసిన భరించా. స్క్రీన్ మీద నన్ను నేను చూసుకొని నమ్మలేకపోతున్నా. నేను అంత పెద్ద స్క్రీన్మీద ఉన్నానా.. ఇది కలనా, నిజమా’ అంటూ చెంపపై పదేపదే కొట్టుకున్నాడు. దీంతో స్టేజ్ మీద ఉన్నవాళ్లంతా షాక్ అయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. -
లైవ్ మ్యాచ్.. హఠాత్తుగా పిడుగు; ఫుట్బాలర్ మృత్యువాత!
దక్షిణ థాయ్లాండ్లో ఫుట్బాల్ ఆటలో విషాదం నెలకొంది. గోలోక్ ఎఫ్ఏ కప్-2026 సెమీఫైనల్ సందర్భంగా లైవ్ మ్యాచ్ జరుగు తుండగా, హఠాత్తుగా మైదానంలో పిడుగు పడింది. ఈ విషాదకర ఘటనలో 24 ఏళ్ల ఫుట్బాలర్ సోఫ్వాన్ మృతి చెందగా, మరో 12 మంది ఆటగాళ్లు తీవ్రంగా గాయపడ్డారు. పిడుగుపడిన భయానక దృశ్యాలు కెమెరాల్లో రికార్డయ్యాయి.పిడుగుపాటుకు మైదానంలోనే కుప్పకూలిన సోఫ్వాన్కు సహచర ఆటగాళ్లు, అత్యవసర మెడికల్ బృందం సీపీఆర్ చేసేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే అతడు మరణించినట్లు తేలింది. ఇక పిడుగు పాటుకు గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఈ ప్రమాదంలో గాయపడిన 12 మంది ఆటగాళ్లలో ఒక మలేషియా క్రీడాకారుడు కూడా ఉన్నాడని, ప్రస్తుతం వారంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని స్థానిక పోలీస్ చీఫ్ థున్ సిరిఖుంట్ తెలిపారు. మరణించిన వింగర్ సొఫ్వాన్ అవాయే ఇటీవలే థాయ్ థర్డ్- టియర్ క్లబ్ అయిన 'యాలా ఎఫ్సీ'కి సైన్ చేశాడు. అతని హఠాన్మరణం పట్ల యాలా ఎఫ్సీ యాజమాన్యం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, అతని కుటుంబ సభ్యులకు తమ సంతాపాన్ని ప్రకటించింది. ఇక దక్షిణ థాయ్లాండ్ సరిహద్దులో జరిగే ఫుట్బాల్ టోర్నమెంట్లలో అతిపెద్ద టోర్నీ ఇదే. ఈ టోర్నీలో థాయ్లాండ్ సహా మలేషియా ఆటగాళ్లు కూడా తలపడుతుంటారు. అయితే మ్యాచ్కు ముందు భారీ వర్షం కురిసినట్లు తెలుస్తోంది. వర్షం ఆగిపోవడంతో మ్యాచ్ నిర్వహించామని, ఇలా హఠాత్తుగా పిడుగు మైదానంలో పడుతుందని ఊహించలేకపోయామని, ఎంతో భవిష్యత్తు ఉన్న సోఫ్వాన్ను కోల్పోవడం బాధాకరమని గోలోక్ క్లబ్ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు.🇹🇭 Horrifying moment from Thailand when a freak lightning strike kills a football player and injures 12 others during a match pic.twitter.com/lAwYJxhtUo— Visegrád 24 (@visegrad24) August 5, 2026పిడుగు ప్రమాదాలు కొత్తేమీ కాదుఇక థాయ్లాండ్లో ఇలాంటి పిడుగుపాటు ప్రమాదాలు జరగడం కొత్తేమీ కాదు. డిసీజ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ నివేదిక ప్రకారం.. 2020 నుండి 2024 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా దాదాపు 283 మంది పిడుగుపాటుకు గురయ్యారు, వారిలో చాలా మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది మే నెలలోనే లంపాంగ్, ఉథాయ్ థానీ ప్రావిన్సులలో వేర్వేరు ఘటనల్లో పిడుగుపడి గర్భిణి సహా ముగ్గురు మరణించారు. Safwan Awae, a player of a Thai League 3 club, has tragically 𝐏𝐀𝐒𝐒𝐄𝐃 𝐀𝐖𝐀𝐘 after being struck by lightning while playing a game in the Kolok FA Cup in Thailand. 💔Our thoughts and prayers go out to his family & friends. 🙏 pic.twitter.com/Rkc11bLflp— CentreGoals. (@centregoals) August 5, 2026Read: టీ20 క్రికెట్లో జోస్ బట్లర్ ప్రపంచ రికార్డు -
షాపింగ్ కోసం ఏకంగా హెలికాప్టర్ ..!విస్తుపోయిన అధికారులు
షాపింగ్ కోసం ఇక్కడొక అమెరికా వ్యక్తి ఏకంగా హెలికాప్టర్లో ప్రయాణించాడు. ఈ ఘటన అమెరికాలోని రోసెండాల్ గ్రామంలో చోటు చేసుకుంది. స్టానిక అవుట్ డోర్ సామాగ్రి దుకాణమైన 'కాబెలాస్'కు వెళ్లేందుకు విస్కాన్సిన్కు చెందిన 69 ఏళ్ల వ్యక్తి హెలికాప్టర్లో వెళ్లాడు. అతడు సుదీర్ఘ ప్రయాణాన్ని నివారించేందుకు ఇలా చేసినట్లు సమాచారం. అయితే ఆ హెలికాప్టర్ను నేరుగా పార్కింగ్ స్థలంలో ల్యాండ్ చేయడంతో ఒక్కసారిగా స్థానికులు, అధికారులు ఆశ్చర్యపోయారు. రోసెండాల్ గ్రామం నుంచి బయలుదేరిన పైలట్ తన అసాధారణ జర్నీ గురించి వివరిస్తూ.. హైవేపై డ్రైవింగ్ చేయడానికి చాలా సమయం పడుతుందని తేలికగా పేర్కొన్నారు. రిచ్ఫీల్డ్ గ్రామంలోని కాబెలాస్ పార్కింగ్ స్థలంలో హెలికాప్టర్ దిగినట్లు సమాచారం రావడంతో వాషింగ్టన్ కౌంటీ షెరీఫ్ డిప్యూటీలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. పైలట్తో మాట్లాడిన తర్వాత, రోసెండేల్కు చెందిన 69 ఏళ్ల వ్యక్తి ఇలా తన ప్రైవేట్ హెలికాప్టర్లో ప్రయాణించినట్లు గ్రహించారు. చాలా దూరం జర్నీ ఉంటుందని చెప్పడంతోనే ఇలా హెలికాప్టర్లో తీసుకువచ్చినట్లు అధికారులకు పైలట్ తెలిపాడు. అంతేగాదు ఆ పైలట్కు లైసెన్స్ ఉంది. అలాగే సురక్షితంగా ల్యాండ్ అయ్యాడు కూడా. అన్ని నిబంధనలను పాటించే హెలికాప్టర్ని నడిపనట్లు తేలింది. అలాగే అతడు ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని తేలడంతో ఎటువంటి అరెస్టులు వంటి చర్యలు తీసుకోలేదని వెల్లడించారు అధికారులు. నెటిజన్లు కూడా ప్రతి ఒక్కరికీ ఎగిరే విమానం ఉంటే ఎంత బాగుండును అంటూ కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. (చదవండి: ‘ఏడు’ ఏడుపు కాదు.. అదృష్టం తెచ్చిపెట్టింది -
డ్రోన్ వెంటాడింది.. చేతులు జోడించినా కనికరించలేదు!
ఉక్రెయిన్లో భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. కూరగాయలు విక్రయిస్తున్న ఓ సాధారణ పౌరుడిని డ్రోన్ వెంటాడి దాడి చేసిన వీడియోను ఉక్రెయిన్ విడుదల చేసింది. చేతులు జోడించి ప్రాణాలు కాపాడాలని వేడుకున్నా.. డ్రోన్ అతడిని వెంబడించింది. చివరకు అతని మీద పడిపోయి పేలినట్లు వీడియోలో కనిపిస్తోంది.వీడియోలో ఓ వ్యక్తి వీధిలో పరుగులు తీస్తూ డ్రోన్ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. డ్రోన్ అతడిని చుట్టుముట్టి వెంటాడగా.. అతడు ఓ వాహనం చుట్టూ తిరుగుతూ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. చివరకు డ్రోన్ అతడి సమీపంలో పేలినట్లు కనిపించింది. ఈ దాడిలో ఆ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడని తెలుస్తోంది. అయితే అతడికి గాయాలయ్యాని.. ఆ షాక్ నుంచి ఇంకా కోలుకోలేకపోతున్నాడని వైద్యులు వెల్లడించినట్లు సమాచారం.Today, many were shocked by yet another video of the drone “safari” Russians are carrying out against civilians in Kherson. A Russian drone deliberately hunted down a man selling vegetables and detonated right next to him. The Russians even admitted to the crime, showing zero… pic.twitter.com/uGjC7esFwR— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) August 4, 2026ఈ ఘటనను ఉక్రెయిన్ తీవ్రంగా ఖండించింది. పౌరులను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లను ఉపయోగించడం యుద్ధ నేరమని పేర్కొంది.ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఇది రష్యా డ్రోన్ దాడికి నిదర్శనమని ఆరోపించారు. దక్షిణ ఉక్రెయిన్లోని ఖెర్సన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. అయితే ఇది సరిగ్గా ఎప్పుడు జరిగిందనేది మాత్రం ఆయన వెల్లడించలేదు. ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రి సిబిహా దీనిని “కిరాతక చర్య”గా అభివర్ణిస్తూ.. పౌరులను భయభ్రాంతులకు గురిచేసే ఉద్దేశంతోనే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలపై రష్యా ఇంకా స్పందించలేదు. యుద్ధ ప్రాంతాల్లో డ్రోన్ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో.. సాంకేతిక ఆయుధాలు సాధారణ పౌరుల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయనే ఆందోళనలు మరోసారి తెరపైకి వచ్చాయి. తాజాగా ఉక్రెయిన్ రష్యా భూభాగంలో జరిపిన దాడుల్లో.. చిన్నారులు సహా పదుల సంఖ్యలో మృత్యువాత పడ్డారు. ఓ వైపు యుద్ధం కొనసాగుతుండగా.. మరోవైపు పౌరులపై దాడుల ఆరోపణలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. -
పోలీస్ బైక్పై రాపిడో బిజినెస్ వరంగల్లో వైరల్
హనుమకొండ: పోలీసుల వేగవంతమైన విధుల నిర్వహణ కోసం ప్రభుత్వం అందించిన అధికారిక ద్విచక్ర వాహనం.. రోడ్లపై ర్యాపిడో బైక్గా కనిపిస్తే ఎలా ఉంటుంది? వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. పోలీసు శాఖకు కేటాయించిన అధికారిక బైక్ను ర్యాపిడో సేవల కోసం వినియోగిస్తున్నట్లు ఓ వీడియో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు వెంటనే విచారణకు ఆదేశించారు.వరంగల్లో పోలీస్ బైక్పై ర్యాపిడో బిజినెస్ pic.twitter.com/uvWb20Nx1E— Telugu Scribe (@TeluguScribe) August 4, 2026 సమాచారం ప్రకారం.. హనుమకొండలోని అంబేద్కర్ జంక్షన్ నుంచి సుబేదారి జంక్షన్కు వెళ్లేందుకు ఓ వ్యక్తి ర్యాపిడో బైక్ను బుక్ చేసుకున్నాడు. కొద్దిసేపటికే వచ్చిన బైక్పై పోలీసు శాఖ అధికారిక గుర్తులు ఉండటాన్ని గమనించి ప్రయాణికుడు ఆశ్చర్యపోయాడు. బైక్ గురించి రైడర్ను ప్రశ్నించగా, ఆ బైక్ తన పోలీసు స్నేహితుడిదని, తాను ర్యాపిడో సేవల కోసం ఉపయోగిస్తున్నానని చెప్పినట్లు సమాచారం. ఈ సంభాషణను ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.వైరల్ అయిన వీడియోలో కనిపించిన TS 09 PC 2795 నంబర్ గల బ్లూ కోట్స్ పోలీసు ద్విచక్ర వాహనం వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఎనుమాముల పోలీస్ స్టేషన్కు కేటాయించినదిగా గుర్తించారు. -
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్
శ్రీలంకతో రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు టీమిండియా సిద్ధమవుతోంది. కెప్టెన్ శుభ్మన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టుకు శ్రీలంకలో కఠిన పరీక్ష ఎదురుకానుంది. అక్కడి స్పిన్ పిచ్లు భారత బ్యాటర్లకు సవాళ్లు విసరనున్నాయి. ఈ పరీక్షను ఎదుర్కొనేందుకు స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్తో సిద్ధమవుతున్నాడు.KL Rahul practicing in tough pitches for the Sri Lanka Test series ⏳💪 pic.twitter.com/XkgjNnqzYd— Johns. (@CricCrazyJohns) August 4, 2026ధూళి పిచ్పై బ్యాటింగ్శ్రీలంకలో సహజంగా ధూళి పిచ్లు ఉంటాయి. వీటిపై స్పిన్నర్లను ఎదుర్కోవడం కష్టంగా ఉంటుంది. ఈ సమస్యను అధిగమించేందుకు రాహుల్ ప్రత్యేక సాధన చేస్తున్నాడు. సాధనలో అతడు స్పిన్ బౌలింగ్ను ఇబ్బంది లేకుండా ఆడుతున్న వీడియో ఒకటి సోషల్మీడియాలో వైరలవుతోంది.రాహుల్ ముంబైలోని ఓ ప్రత్యేక ప్రాక్టీస్ సదుపాయంలో ఈ సాధన చేసినట్లు సమాచారం. అతడితో పాటు ఓపెనింగ్ భాగస్వామి యశస్వి జైస్వాల్ కూడా ప్రాక్టీస్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది.కొలంబోలో ల్యాండ్ అయిన టీమిండియాభారత జట్టు మంగళవారం మధ్యాహ్నం కొలంబో చేరుకుంది. సాయి సుదర్శన్ మాత్రం బెంగళూరులోనే ఉన్నాడు. అతడు తర్వాత జట్టుతో కలవనున్నాడు. ఆగస్టు 7 నుంచి 9 వరకు భారత్ మూడు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడనుంది.Shubman Gill & Yashasvi Jaiswal having fun time in Sri Lanka ❤️- The future duo of World Cricket. pic.twitter.com/fuobQjGarS— Johns. (@CricCrazyJohns) August 4, 2026ఆ తర్వాత ఆగస్టు 15న గాలేలో తొలి టెస్టు ప్రారంభమవుతుంది. రెండో టెస్టు ఆగస్టు 23న కొలంబోలో మొదలవుతుంది.ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో భారత్ ఐదో స్థానంలో ఉంది. టీమిండియా బంగ్లాదేశ్ కంటే వెనుకబడి ఉండటం ఆందోళన కలిగించే అంశం. అయితే ఈ సైకిల్లో భారత్కు ఇంకా మూడు సిరీస్లు మిగిలి ఉన్నాయి. -
మనుషుల్ని ఇలా ప్రేమిద్దాం డ్యూడ్.. పోయేదేముంది?
ముంబైలోని కేల్కర్ కళాశాలలో జరిగిన ఓ సాధారణ పుట్టినరోజు వేడుక సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ విద్యార్థులు చేసుకున్న ఈ వేడుక తమ సహ విద్యార్థి పుట్టినరోజుకి సంబంధించింది కాదు. కాంటీన్లో పని చేసే ఉద్యోగికి పుట్టినరోజు వేడుక నిర్వహించి విద్యార్థులు ఆశ్చర్యపరిచారు. ఆ విద్యార్థులకు సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తాయి. దయ చూపాలంటే పెద్ద పెద్ద పనులు చేయాల్సిన అవసరం లేదని, చిన్న మంచి పని చేసినా చాలని చాలామంది కామెంట్లు చేశారు. ఈ వీడియో చూసిన పూర్వ విద్యార్థులు కూడా కళాశాల కాంటీన్తో తమ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో అజింక్య భుజ్బల్ అనే యూజర్ షేర్ చేశారు. "ఎక్కడికి వెళ్లినా ఆనందాన్ని పంచి వస్తాను" అని పేర్కొన్నారు.వీడియోలో కేల్కర్ కళాశాల విద్యార్థులు కాంటీన్ భయ్యా చుట్టూ చేరి చప్పట్లు కొడుతూ "హ్యాపీ బర్త్డే" పాట పాడారు. ఊహించని ఈ వేడుక చూసి ఆయన ఆప్యాయంగా చిరునవ్వు చిందించారు. విద్యార్థుల ప్రేమాభిమానాలకు ఆయన భావోద్వేగానికి గురైనట్లు కనిపించారు.వీడియోలో... "మా కాంటీన్ భయ్యా పుట్టినరోజు జరిపాం. #స్ప్రెడ్ లవ్ ఎఫ్టీ కేల్కరైట్స్" అని రాసి ఉంది. ఈ వీడియో కింద వచ్చిన కామెంట్లలో విద్యార్థుల ఆలోచనను చాలామంది ప్రశంసించారు. "అందరి ప్రేమను పొందిన వ్యక్తి.. అజాత శత్రువు" అని ఓ యూజర్ పేర్కొన్నారు. "భీమ్రాజ్ ఎంత ముద్దుగా ఉన్నాడు" అని మరో వ్యక్తి అనన్నారు. "ఈ కాంటీన్తో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి" అని ఇంకొకరు కామెంట్ చేశారు. View this post on Instagram A post shared by Ajinkya Bhujbal (@bhujbal_ajinkya18) -
ఇదీ మన మధ్యతరగతి పిల్లల పరిస్థితి
చదువు కోసం చాలామంది చిన్నారులు ఎన్నో కష్టాలు పడుతున్నారు. ఓ ప్రాంతంలో కొందరు ఎన్నో కిలోమీటర్లు నడుస్తారు. మరో ప్రాంతంలో ఇంకొందరు కొండలు, అడవులు దాటి పాఠశాలకు చేరుకుంటారు. మధ్యప్రదేశ్లోని విదిశా జిల్లాలో పాఠశాల విద్యార్థులు అంతకంటే ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటూ బడికి వెళ్లాల్సి వస్తోంది. ఇక్కడ పాఠశాల చిన్నారులు ప్రతిరోజు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న బేత్వా నదిని కాలినడకన దాటి పాఠశాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఎదురవుతోంది.ఇందుకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పలువురు చిన్నారులు నది మధ్యలో ఉన్న ఇరుకైన స్టాప్ డ్యామ్పై సమతుల్యం పాటిస్తూ నడుస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు ఉద్ధృ తంగా ప్రవహిస్తున్న నీరు, మరోవైపు పాఠశాలకు చేరాల్సిన అవసరం. చిన్న పొరపాటు జరిగినా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది.ప్రమాదాన్ని ఎందుకు ఎదుర్కొంటున్నారు?జిల్లా పాలనాధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ వీడియో విదిశా జిల్లాలోని పాలోహ్ గ్రామానికి చెందింది. వీడియోలో కనిపిస్తున్న చిన్నారులు కరువా గ్రామ నివాసులు. వారు పాలోహ్ ఉన్నత పాఠశాలలో చదువుతున్నారు. వీరు రహదారి మార్గంలో పాఠశాలకు వెళ్లాలంటే ప్రతిరోజూ అదనంగా 8 నుంచి 10 కిలోమీటర్లు ప్రయాణించాలి. అందుకే స్టాప్ డ్యామ్ దాటి పాఠశాలకు చేరుకుంటున్నారు.గత 4-5 ఏళ్లుగా ఇదే దారితాము గత 4- 5 ఏళ్లుగా ఇదే దారిలో పాఠశాలకు వెళ్తున్నామని చిన్నారులు చెప్పారు. ఇదే అతి దగ్గర దారి అని, మరో మార్గంలో వెళ్తే చాలా దూరం ఉండటంతో ప్రతిరోజు ఆ దారిలో వెళ్లడం కష్టమని వివరించారు. వీడియో వైరల్ అయిన తర్వాత పాలనాధికారులు స్పందించారు. విదిశా ఉప విభాగ పాలనాధికారి క్షితిజ్ శర్మ మాట్లాడుతూ.. చిన్నారులు సురక్షిత మార్గంలో పాఠశాలకు వెళ్లి రావడానికి సైకిళ్లు ఇస్తామని చెప్పారు. నదిపై తాత్కాలిక వంతెన నిర్మాణానికి ప్రతిపాదన పంపినట్టు చెప్పుకొచ్చారు. ప్రభావిత గ్రామాల దగ్గర కొత్త పాఠశాల ప్రారంభించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నామని, చిన్నారులు ప్రాణాలకు ముప్పు తెచ్చుకుని నది దాటాల్సిన అవసరం లేకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నల వర్షంవీడియో బయటకు వచ్చిన తర్వాత పాలనాధికారులు, విద్యాశాఖపై ప్రజలు ప్రశ్నలు లేవనెత్తారు. చిన్నారులు ఇన్నేళ్లుగా ఇలాగే పాఠశాలకు వెళ్తుంటే ముందే చర్యలు ఎందుకు తీసుకోలేదని పలువురు ప్రశ్నించారు. వీడియో వైరల్ అయ్యేవరకు పాలనాధికారులు ఎందుకు వేచి చూశారని, ఇంతకు ముందే ఏం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఉదయ్నిధి బాత్రూంలో ఉన్నారు.. కాస్త ఆగండి
డీఎంకే నేత, తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయ్నిధి స్టాలిన్ అరెస్టు రాష్ట్ర రాజకీయాల్లో మరింత వేడి పెంచింది. ఆయనను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు చెన్నైలోని నివాసానికి వెళ్లిన సమయంలో చోటుచేసుకున్న ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పోలీసులను కాస్త ఆగాలంటూ ఉదయ్నిధి భార్య కృతికా విజ్ఞప్తి చేసిన దృశ్యాలు చర్చకు దారితీశాయి.తంజావూరులో కావేరీ నీటి వివాదంపై జరిగిన డీఎంకే నిరసన కార్యక్రమంలో ఉదయ్నిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై వివాదం చెలరేగింది. ఆయన వ్యాఖ్యలు మహిళలను కించపరిచేలా ఉన్నాయని.. సీఎం విజయ్ను అవమానించేలా ఉన్నాయని ఫిర్యాదులు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయ్నిధిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ఆయన నివాసానికి చేరుకున్నారు.వైరల్గా మారిన వీడియోలో.. పోలీసులు ఉదయ్నిధిని కలిసేందుకు ఆయన ఇంట్లో వేచి ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ సమయంలో కృతికా ఉదయ్నిధి, డీఎంకే నేత మా. సుబ్రమణియన్ పోలీసులతో మాట్లాడుతున్న దృశ్యాలు రికార్డయ్యాయి. “ఆయన టాయిలెట్లో ఉన్నారు. కాస్త సమయం ఇవ్వండి” అంటూ కృతికా పోలీసులను కోరారు. మరికొన్ని నిమిషాలు ఆగాలని విజ్ఞప్తి చేశారు.On Cam: Moments Before Udhayanidhi Stalin Arrest- TIMES NOW accesses the sequence of events- On Cam: Udhayanidhi's wife argues with policemen@dharannniii & @DEKAMEGHNA breaks down the details. pic.twitter.com/WMdaMW0r99— TIMES NOW (@TimesNow) August 4, 2026 VIDEO CREDITS:TimesNowదీనికి స్పందించిన ఓ పోలీసు అధికారి.. తాము చట్టపరమైన విధులు నిర్వహించేందుకు వచ్చామని, ఎక్కువ సమయం వేచి ఉండలేమని పేర్కొన్నారు. “ఎంతసేపు వేచి ఉండాలి? ఇది మా విధి. మేం చట్టాన్ని ఉల్లంఘించడం లేదు” అంటూ ఆయన చెప్పినట్లు వీడియోలో వినిపిస్తోంది.మా. సుబ్రమణియన్ కూడా పోలీసులను మరికొంత సమయం ఇవ్వాలని కోరారు. ఉదయ్నిధి సిద్ధమయ్యే వరకు వేచి ఉండాలని, న్యాయవాది కూడా వస్తారని చెప్పారు. అలాగే ఉదయ్నిధిని తంజావూరుకు తీసుకెళ్లాల్సి ఉందని.. దాదాపు ఎనిమిది గంటల ప్రయాణం ఉంటుందని, బయలుదేరే ముందు కొంత సమయం ఇవ్వాలని మంత్రి కోరినట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు మాత్రం అనంతంగా వేచి ఉండలేమని స్పష్టం చేశారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందేనని తెలిపారు.கைது செய்து தஞ்சாவூர் அழைத்து செல்லப்படும் எதிர்க்கட்சி தலைவர்.. ஜன்னல் ஓரத்தில் பெரும் யோசனையோடு அமர்ந்து செல்லும் உதயநிதிDMK | Udhayanidhi Arrest | Udhayanidhi Speech | #NewsTamil24x7 #UdhayanidhiStalin #PoliceArrest pic.twitter.com/6afl9S9XCo— News Tamil 24x7 (@NewsTamilTV24x7) August 4, 2026ఏ కేసులో అరెస్ట్?కావేరీ నీటి సమస్యపై తంజావూరులో జరిగిన డీఎంకే నిరసనలో ఉదయ్నిధి చేసిన ఓ వ్యాఖ్య వివాదానికి కారణమైంది. నిరసన సమయంలో కొందరు కార్యకర్తలు నటి త్రిష పేరును ప్రస్తావించగా.. ఉదయ్నిధి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ వ్యవహారంలో పోలీసులు పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మహిళ గౌరవాన్ని కించపరిచేలా వ్యవహరించడం, ఉద్దేశపూర్వక అవమానం, బెదిరింపులు, కుట్ర తదితర ఆరోపణలతో పాటు తమిళనాడు మహిళల వేధింపుల నిరోధక చట్టం, ఐటీ చట్టంలోని సెక్షన్లను కూడా చేర్చినట్లు సమాచారం.రాజకీయంగా ముదిరిన వివాదంఉదయ్నిధి అరెస్టు వ్యవహారం తమిళనాడు రాజకీయాల్లో కొత్త దుమారానికి దారితీసింది. అధికార టీవీకే, బీజేపీ నేతలు ఉదయ్నిధిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు డీఎంకే మాత్రం ఈ కేసును రాజకీయ కక్ష సాధింపుగా అభివర్ణిస్తోంది. కావేరీ సమస్య నుంచి దృష్టి మళ్లించేందుకే ఈ వివాదాన్ని పెద్దదిగా చేస్తున్నారని డీఎంకే వర్గాలు ఆరోపిస్తున్నాయి. -
మా వాళ్లు 30 మంది ఖతమయ్యారు.. భారత్ పనే ఇది!
పాకిస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (LeT)కు చెందిన ఓ ఆపరేటివ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. గత మూడు, నాలుగేళ్లలో తమ సంస్థకు చెందిన 30 మందికి పైగా సభ్యులు పాకిస్థాన్లోని వివిధ ప్రాంతాల్లో హతమైనట్లు ఆ సంస్థ ప్రతినిధి రిజ్వాన్ హనీఫ్ పేర్కొన్నాడు. అయితే ఈ హత్యల వెనుక భారత నిఘా సంస్థలు ఉన్నాయని అతడు ఆరోపించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఓ వీడియోలో రిజ్వాన్ హనీఫ్ మాట్లాడుతూ.. పాకిస్థాన్లోని పలు ప్రాంతాల్లో లష్కరే తోయిబా సభ్యులు లక్ష్యంగా దాడులకు గురయ్యారని పేర్కొన్నాడు. పెషావర్, కరాచీ, రావల్పిండి, ముజఫరాబాద్, రావలకోట్ వంటి ప్రాంతాల్లో తమకు చెందిన వ్యక్తులు మరణించారని చెప్పాడు.“గత మూడు నుంచి నాలుగేళ్లలో 30 మందికి పైగా మా సభ్యులు భారత నిఘా ఏజెంట్ల చేతిలో హతమయ్యారు” అని అతడు వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఈ ఘటనలను అతడు “తెలియని గన్మెన్ మోడల్”unknown gunman modelగా అభివర్ణించాడు.Lashkar-E-Taiba's First Ever Explosive Admission 🔥🔥🔥Lashkar-e-Taiba/JKUM terrorist Rizwan Hanif openly admits that more than 30 members of the outfit were eliminated by unknown gunmen (Indian agents), across Peshawar, Karachi, Rawalpindi, Rawalakot and Muzaffarabad over the… pic.twitter.com/gXr0jIeYmH— OsintTV 📺 (@OsintTV) August 3, 2026అయితే ఈ ఆరోపణలకు సంబంధించి భారత ప్రభుత్వంగానీ, ఇటు భద్రతా సంస్థలు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. పాకిస్థాన్ తరచూ ఈ దాడులకు భారత్ను కారణంగా చూపుతుండగా.. న్యూఢిల్లీ వర్గాలు మాత్రం ఈ ఆరోపణలను ఎప్పటికప్పుడు తిరస్కరిస్తూ వస్తున్నాయి.తొలిసారి.. ఒప్పుకోలులష్కరే తోయిబా అనుబంధ వ్యక్తి ఒకరు తమ సంస్థకు చెందిన ఇంతమంది సభ్యులు వరుసగా హతమైనట్లు బహిరంగంగా మాట్లాడటం ఇదే తొలిసారి అని భద్రతా వర్గాలు చెబుతున్నాయి. గత కొన్నేళ్లుగా పాకిస్థాన్లో పలువురు ఉగ్రవాదులు గుర్తు తెలియని వ్యక్తుల దాడుల్లో మరణించిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనల వెనుక ఎవరు ఉన్నారనే దానిపై మాత్రం స్పష్టత లేదు. ఎలా పుట్టింది లష్కరే తోయిబా?లష్కరే తోయిబా పాకిస్థాన్లో ఏర్పాటైన ఉగ్రవాద సంస్థ. 1980ల చివర్లో హఫీజ్ మహ్మద్ సయీద్, జఫర్ ఇక్బాల్, అబ్దుల్లా అజామ్లు ఈ సంస్థను స్థాపించారు. తొలినాళ్లలో ఇది మర్కజ్-ఉద్-దవా-వల్-ఇర్షాద్ అనే సంస్థకు అనుబంధంగా పనిచేసింది. సోవియట్-ఆఫ్ఘన్ యుద్ధం సమయంలో ఏర్పాటైన ఈ సంస్థ.. ఆ తర్వాత తన కార్యకలాపాలను జమ్మూ కశ్మీర్పై కేంద్రీకరించింది. కశ్మీర్లో సాయుధ పోరాటం పేరుతో ఉగ్ర కార్యకలాపాలు నిర్వహిస్తూ వచ్చిందని భారత్ ఆరోపిస్తోంది.ముంబై దాడులతో ప్రపంచ దృష్టిలోకిలష్కరే తోయిబా పేరు 2008 ముంబై ఉగ్రదాడుల తర్వాత ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా చర్చకు వచ్చింది. ముంబైలోని తాజ్ హోటల్, ఛత్రపతి శివాజీ టెర్మినస్, నరిమన్ హౌస్ సహా పలు ప్రాంతాల్లో జరిగిన ఈ దాడుల్లో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడుల వెనుక లష్కరే తోయిబా హస్తం ఉందని భారత్ ఆరోపించింది. అనంతరం ఐక్యరాజ్యసమితి, అమెరికా సహా పలు దేశాలు ఈ సంస్థను ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చాయి.భారత్, పాశ్చాత్య దేశాలు లష్కరే తోయిబాకు పాకిస్థాన్లోని కొన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోందని గతంలో ఆరోపించాయి. అయితే పాకిస్థాన్ ఈ ఆరోపణలను ఖండిస్తూ వచ్చింది.విద్వేష వ్యాఖ్యలపై వివాదంతాజాగా వైరల్ అవుతున్న వీడియోలో కనిపించిన రిజ్వాన్ హనీఫ్.. గతంలోనూ ఇతర మతాలపై అభ్యంతరకర, విద్వేషపూరిత వ్యాఖ్యలు కూడా ఉన్నట్లు సమాచారం. ఉగ్రవాద సంస్థలు మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టి మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తాయని భద్రతా నిపుణులు చెబుతున్నారు.అసలు ఎవరి హస్తం?లష్కరే తోయిబా సభ్యులుగా చెప్పబడుతున్న వ్యక్తుల హత్యల వెనుక ఎవరు ఉన్నారనే అంశంపై ఇప్పటివరకు అధికారిక నిర్ధారణ లేదు. అయితే రిజ్వాన్ హనీఫ్ వ్యాఖ్యలు పాకిస్థాన్లో ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలు, వాటిపై జరుగుతున్న దాడులపై మరోసారి చర్చకు తెరలేపాయి. భారత్ షరామామూలుగానే ఈ ఆరోపణలను ఖండించే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. -
గర్భంలోనే నాన్న మాటలకు స్పందించింది..షాక్లో తండ్రి! వీడియో వైరల్
సినిమాల్లోనూ, టీవీల్లోనూ చూస్తుంటాం ఇలాంటి ఘటనలు. హీరో ప్రెగ్నెంట్తో ఉన్న హీరోయిన్ కడుపు దగ్గరగా వచ్చి మాట్లాడుతుంటే..కిక్ ఇవ్వడం, స్పందించడం వంటివి చూస్తుంటాం. అలాంటి అరుదైన దృశ్యం రియల్గా చోటుచేసుకుంది. పేరెంట్స్ సైతం విస్తుపోయారు తమ పుట్టబోయే పాపాయి స్పందన చూసి..ఈ విచిత్ర ఘటన కెనడాలో చోటు చేసుకుంది. లియా ఒలివెరా అనే మహిళ తన భాగస్వామితో కలిసి ఒక సాధారణ ప్రినేటల్ అల్ట్రాసౌండ్ చెకప్ కోసం ఆసుపత్రికి వెళ్లారు. స్కానింగ్ జరుగుతున్న సమయంలో ఆ మహిళ భర్త ఎంతో ప్రేమగా ఆమె కడుపుపై ముద్దుపెట్టుకుని తమ కాబోయే పాపతో మాట్లాడడం ప్రారంభించారు. "గుడ్ మార్నింగ్.. హ్యాపీ శనివారం, నీకు ఆకలిగా ఉందా?" అంటూ ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. అయితే ఆ తండ్రి గొంతు విని వెంటనే.. అల్ట్రాసౌండ్ స్క్రీన్ పై కనిపించిన చిన్నారి ముఖంలో అద్భుతమైన మార్పు చూసి అక్కడున్ను వారంతా కంగుతిన్నారు. నాన్న మాటలకు ఆ పాపాయి చిరునవ్వుతూ స్పందించింది. ఆ అద్భుతమైన దృశ్యాన్ని కెమెరాలో బంధించి..సోషల్ మీడియాలో పంచుకున్నారు. దాంతో ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఈ మేరకు తల్లి లియా ఒలివెరా మాట్లాడుతూ.. తన జీవితంలో ఇది ఎప్పటికీ మర్చిపోలేని మధుర జ్ఞాపకం అంటూ భావోద్వేగానికి గురైంది. పుట్టబోయే బిడ్డతో పేరెంట్స్కి ఎంతలా బాండింగ్ ఉంటుందో ఈ ఘటన నిరూపించిందంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఇది యాదృశ్చికమైనదే అయినా..ఈ అద్భుత దృశ్యం వేలాది మంది హృదయాలను గెలుచుకోని..అందరి ముఖాల్లో నవ్వులు విరిసేలా చేసింది. My heart ❤️❤️❤️Baby girl in mommy’s tummy smiles BIG the moment she hears her daddy’s voice during ultrasound.“Behold, children are a heritage from the Lord, the fruit of the womb a reward. Like arrows in the hand of a warrior are the children of one's youth. Blessed is the… pic.twitter.com/BYJkLDcnw1— MJTruthUltra (@MJTruthUltra) July 31, 2026 (చదవండి: తొలి లేడీ డిటెక్టివ్..! ఆఖరికి పెళ్లి గురించి కూడా...) -
నో రన్నింగ్, నో కార్డియో..! జస్ట్ 20 నిమిషాల నడకతో 24 కిలోలు..
బరువు తగ్గడం అనేది వ్యాయామలు, చక్కటి డైట్, మంచి ఆహారపు అలవాట్లతోనే సాధ్యం కాదు. చేసే వ్యాయామాలు కాస్త తెలివిగా చేస్తేనే శరరీంలో సత్వర మార్పులు చూడగలం. ఒకటే దినచర్యకు బాడీ అలవాటు పడి.. పెద్దగా బరువులో ఎలాంటి ప్రభావం ఉండదు. పైగా ఇంతలా చేస్తున్నా..బరువులో మార్పు కనిపించక..మధ్యలోనే వెయిట్లాస్ జర్నీకి స్వస్తి పలుకుతుంటారు చాలామంది. అలాంటి వాళ్లు ఈ ఫిట్ఇన్ఫ్లుయెన్సర్లా తెలివిగా చేస్తే..అమాంతం బరువు తగ్గడమే గాక స్లిమ్ అవుతారు. మరి ఆ ట్రిక్ ఏంటో చూద్దామా..!.బరువు తగ్గడంలో అందరూ తక్కువ తినడం, ఎక్కువ కదలడం, నిలకడగా ఉండటం వంటి సులభమైన కామన్ సూత్రం పాటిస్తుంటారు. ఇలా నెలల తరబడి, ఇదే వర్కౌట్ రొటీన్ని అనుసరిస్తుంటారు. కానీ వెయిట్ మెషిన్లో బరువులో పెద్దగా మార్పు కనిపించక నిరాశ చెందుతుంటారు. ఆ విషయం గురించి ఫిటెనెస్ కంటెంట్ క్రియేటర్ మాట్లాడుతూ..తన వెయిట్లాస్ జర్నీలో కూడా ఇలాంటి సమస్యనే ఎదుర్కొన్నట్లు వివరించారు. తాను కూడా ఉదయం 6 గంటలకు ప్రతిరోజూ మూడు నెలల పాటు 45 నిమిషాలు ట్రెడ్మిల్పై చేసినా..తన బరువులో పెద్దగా మార్పులు కనిపించక వదిలేశానని పంచుకున్నారు. ప్రతిరోజూ డెడికేటెడ్గా వ్యాయామాలు చేస్తున్నప్పటికీ..కనిపించేంతగా కొలెస్ట్రాల్ తగ్గలేదని, బట్టలు సరిపోయే విధానంలో అస్సలు మార్పు కనపించలేదని చెప్పుకొచ్చారు. తన సమస్య వ్యాయామం చేయడం కాదని, ఒకేరకమైన వ్యాయమాన్ని అదేపనిగా చేయడమే అసలు సమస్య అని తెలిసందంటున్నాడు. శరీరం ఆ దినచర్యకు అలవాటుపడిపోయి..రాను రాను పెద్దగా ప్రభావం చూపించలేదని అన్నారు. అందుకే ట్రెడ్మిల్పై 45 నిమిషాలు గడపడానికి బదులుగా, వాలు స్థాయిలను మారుస్తూ 20 నిమిషాల పాటు వాలుగా నడిచే దినచర్యకు మారినట్లు తెలిపారు. ఈ వర్కౌట్లలో పరుగుల లేదు. మరి ఎలా చేస్తున్నారంటే..వాలుగా నడక: వేగం 3.5, వాలు 8, 5 నిమిషాల పాటు.నిటారుగా ఎక్కడం: వేగం 3.0, వాలు 12, 5 నిమిషాల పాటు.పవర్ వాక్: వేగం 3.8, వాలు 6, 5 నిమిషాల పాటు.కూల్ డౌన్: వేగం 2.5, వాలు 0, 2 నిమిషాల పాటు.ఈ పద్ధతికి మారిన కేవలం రెండు వారాల్లోనే తనలో స్పష్టమైన మార్పులు కనిపించాయని చెప్పారు. కష్టపడి పనిచేయడం కాదు, తెలివిగా చేస్తే బరువు తగ్గడం మంచి ఫలితాలు అందుకుంటారని అన్నారు. ఆవిధంగానే తాను 89 కిలోల నుంచి 65 కిలోలకు తగ్గినట్లు పేర్కొన్నారు. అయితే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ తర్వాత గానీ లేదా ఉదయాన్నే లేవగానే గానీ, ఈ రొటీన్ను వారానికి మూడు నుంచి ఐదు సార్లు చేయాలని లోజేష్ సూచిస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం స్మార్ట్గా వర్కైట్లు చేసి స్లిమ్గా మారిపోండి త్వరగా..!. View this post on Instagram A post shared by 𝙇𝙊𝙅𝙀𝙎𝙃 (@im_lojeshofficial)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: అధిక ప్రోటీన్ ఆహారంతో జస్ట్ 60 రోజుల్లో 22 కేజీలు..! సహాయపడిన డైట్ ఇదే..) -
3 పిల్లలతో కారు ముందుకు పులి.. చూస్తే ఊపిరి ఆగినంత పని..
ముంబై: అడవి సఫారీకి వెళ్లిన ఒక కుటుంబానికి తిరిగి వస్తున్న సమయంలో జీవితాంతం మర్చిపోలేని ఓ దృశ్యం కనపడింది. మహారాష్ట్రలోని తాడోబా-అంధారి టైగర్ రిజర్వ్లో ఒక ఆడపులి తన మూడు చిన్న పిల్లలతో రోడ్డు దాటుతూ కనిపించింది. ఈ అరుదైన క్షణానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.ఈ వీడియోను కంటెంట్ క్రియేటర్ అంకుశ్ జిజిల్వార్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. జులై 15 సాయంత్రం తన కుటుంబం పద్మాపూర్ గేట్ నుంచి తాడోబా-అంధారి టైగర్ రిజర్వ్లో సఫారీ కోసం ప్రవేశించిందని ఆయన తెలిపారు. అంకుశ్ తెలిపిన వివరాల ప్రకారం.. వారు మొహర్లీ గ్రామం దగ్గరకు చేరుకున్నప్పుడు రోడ్డు పక్కన కొన్ని వాహనాలు నిలిపి ఉండటం చూశారు. మొదట పులి అడవిలోకి వెళ్లిపోయిందని అనుకున్నారు. కానీ సాయంత్రం 7.03 గంటలకు అకస్మాత్తుగా ఎత్తైన గడ్డి మధ్య నుంచి ఆడపులి ‘ఛోటీ మధు’ బయటకు వచ్చింది.కొన్ని సెకన్ల తర్వాత గడ్డి మధ్య నుంచి ఒక్కొక్కటిగా దాని మూడు పిల్లలు కూడా బయటకు వచ్చాయి. వీడియోలో ఆడపులి ఎంతో ప్రశాంతంగా తన పిల్లలను రోడ్డు దాటిస్తున్నట్లు కనిపించింది. ఈ దృశ్యాన్ని చూసిన అక్కడ ఉన్న వారంతా మంత్రముగ్ధులయ్యారు.ఈ సమయంలో ఒక బైక్పై వెళ్తున్న వ్యక్తి అనుకోకుండా ఆడపులి వైపు వెళ్లడం ప్రారంభించాడు. అంకుశ్ వెంటనే తన కారు హెడ్లైట్ను వెలిగించి అతడిని అప్రమత్తం చేశారు. బైకర్ సమయానికి ఆగి సురక్షితంగా పులికి దూరం పాటించాడు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగలేదు.అంకుశ్ స్పందిస్తూ.. అడవి వాతావరణంలో ఇంత దగ్గరగా ఆడపులిని తన మూడు పిల్లలతో చూడటం తమ జీవితంలో అత్యంత గుర్తుండిపోయే అనుభవాల్లో ఒకటని తెలిపారు. ఇలాంటి క్షణాలు అడవులు, వన్యప్రాణుల సంరక్షణ ప్రాముఖ్యతను కూడా గుర్తు చేస్తాయని చెప్పారు. Instagramలో ఈ పోస్ట్ని వీక్షించండి Ankush Jizilwar | Chandrapur Today (@ankushjizilwar) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది -
హార్దిక్ మాజీ భార్యపై తీవ్ర విమర్శలు!
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా మాజీ భార్య నటాషా స్టాంకోవిచ్ ప్రవర్తన పట్ల సోషల్ మీడియాలో అభిమానులు విమర్శల వర్షం కురిపించారు. బిచ్చగాళ్లతో నటాషా ప్రవర్తించిన తీరుపై క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయంలోకి వెళితే.. నటాషా స్టాంకోవిచ్ తన బాయ్ఫ్రెండ్ అలెగ్జాండర్ అలెక్స్తో కలిసి ఒక హోటల్కు వెళ్లింది. లంచ్ అనంతరం బయటికి వస్తున్న నటాషాతో కొంతమంది ఫొటోలు దిగారు. ఇదే సమయంలో అక్కడికి పిల్లలతో కలిసి బిక్షాటన చేస్తున్న మహిళల వచ్చారు. తమకు సాయం చేయమని నటాషాను అడిగినప్పటికీ, వారిని పట్టించుకోకుండా తన కారు ఎక్కి అక్కడినుంచి వెళ్లిపోవడం కెమెరాలకు చిక్కింది. ఇంకేముంది, అసలే తమ అభిమాన క్రికెటర్ను మోసం చేసి తెగదెంపులు చేసుకున్న నటాషా ఎక్కడ దొరుకుతుందా అని కాచుకు కూర్చుకున్న కొంతమంది విమర్శల వర్షం కురిపించారు. 'ఇదేం పద్దతి.. ఫొటోలకు ఫోజివ్వడం తెలుసు కాని ఒక రూపాయి ధర్మం చేయాలన్న కనీస జ్ఞానం లేదా' అని కామెంట్ల రూపంలో నటాషాను దెప్పిపొడిచారు. అయితే గతంలో పాండ్యాతో కలిసి ఉన్నప్పుడు ఇదే నటాషా పేద వాళ్లకు సాయం చేయడంలో ముందు వరుసలో ఉండడం గమనార్హం.సెర్బియాకు చెందిన నటాషా స్టాంకోవిచ్ 2013లో భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో పరిచయం ఏర్పడింది. అనతి కాలంలో ఆ పరిచయం ప్రేమగా మారింది. హార్దిక్, నటాషా ప్రేమలో ఉన్నారనే వార్తలు ప్రచారంలో ఉండగానే ఆమె గర్భం దాల్చింది. తండ్రి కాబోతున్నట్లు హార్దిక్ పాండ్యా అధికారికంగా ప్రకటించి, అభిమానులతో తన సంతోషాన్ని పంచుకున్నాడు. ఆ తర్వాత 2020లో హార్దిక్ పాండ్యా, నటాషా వివాహం జరిగింది. పెళ్లి తర్వాత నటనకు గుడ్ బై చెప్పేసిన నటాషా కుమారుడి పెంపకంపైనే దృష్టి సారించింది.వివాహం తర్వాత కొంత కాలం వీరి జీవితం ఆనందంగా సాగింది. ట్రిప్పులు, అగస్త్యతో ఆటలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులతో ఆనందాన్ని పంచుకున్నారు. వివాహం అయిన నాలుగేళ్ల తర్వాత (2024)లో పాండ్యా, నటాషా మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో హార్దిక్ పాండ్యా ‘విడాకుల’పై అధికారిక ప్రకటన చేశాడు. భార్య నటాషా స్టాంకోవిచ్తో విడిపోతున్నట్లు ప్రకటించాడు. 4 ఏళ్ల దాంపత్య జీవితం అనంతరం నటాషా, తాను విడిపోవడానికే నిర్ణయం తీసుకున్నామని వెల్లడించాడు.విడిపోయినప్పటికీ తమ కుమారుడు అతస్త్యకు కో-పేరెంట్స్గా ఉంటామని స్పష్టత ఇచ్చాడు. हार्दिक पांड्या की पूर्व पत्नी नताशा अब पहले जैसी नहीं रहीं। Natasa अपने बॉयफ्रेंड "Aleksandar Alex Ilic' के साथ एक होटल से बाहर निकली।तभी वहां मौजूद कुछ भिखारियों ने उनसे मदद के लिए पैसे मांगे।लेकिन नताशा बिना रुके सीधे अपनी गाड़ी में बैठकर वहां से निकल गईं।भिखारी बस… pic.twitter.com/RfBOplXnxV— ʀᴜᴅʜʀᴀ ʏᴀᴅᴀᴠ🇮🇳 (@Rudhrayadav001) August 1, 2026Read: 'అసంపూర్ణంగా భారతదేశ చిత్రపఠం.. ఎందుకీ వివక్ష?' -
ఒక్కసారి అంటుకుంటే వదలదు.. ఆక్టోపస్ ఇలా పట్టేస్తే..?
సముద్రంలో ఈదుతున్న ఓ వ్యక్తిని అకస్మాత్తుగా ఆక్టోపస్ పట్టేసింది. అతను దాని నుంచి బయటపడేందుకు చాలాసార్లు ప్రయత్నించాడు. కానీ ఆక్టోపస్ పట్టును వదల్లేదు. చివరకు దాన్ని తొలగించేందుకు అతను గుద్దులు గుద్దాడు. ఈ ఘటన తర్వాత ప్రజల్లో ఒక ప్రశ్న తలెత్తింది. ఆక్టోపస్ మనుషులకు ఎందుకు అంటుకుంటుంది? అది దాడి చేస్తుందా? లేక దీని వెనుక మరో కారణం ఉందా? ఆక్టోపస్ అంటుకుంటే ఏం చేయాలో చూద్దాం..ఆక్టోపస్ పట్టు అంటే ఉడుంపట్టువంటిదే. అయితే శాస్త్రవేత్తలు చెప్పిన వివరాల ప్రకారం.. అది సాధారణంగా మనుషులపై దాడి చేయదు. అది మనిషికి అంటుకుంటే మాత్రం సాధారణంగా భయపడతాం. మనల్ని రక్షించుకునే ప్రయత్నం వంటివి చేస్తుంటారు. ఆక్టోపస్ అంటుకుంటే ఏమి చేయాలనే విషయాన్ని తెలుసుకోవడం కూడా ముఖ్యం.ఎందుకు అంటుకుంటుంది?నిపుణుల ప్రకారం.. ఆక్టోపస్ మనుషులను వేటాడదు. తన చుట్టూ ఉన్న వస్తువులను తాకి వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. కొన్ని సందర్భాల్లో ఆసక్తితో మనిషిని పట్టుకుంటుంది. ఆక్టోపస్కు 8 భుజాలు ఉంటాయి. ప్రతి భుజంపై చిన్న చిన్న సక్షన్ కప్లు ఉంటాయి. అంటే గాలి లేదా నీటి ఒత్తిడితో ఉపరితలంపై గట్టిగా అతుక్కునే వలయాకార నిర్మాణాలు. ఇవే ఏ వస్తువునైనా గట్టిగా పట్టుకునేందుకు సహాయపడతాయి. పెద్ద ఆక్టోపస్ శరీరంపై 2,000కి పైగా సక్షన్ కప్లు ఉండొచ్చు. అందుకే దాని పట్టు చాలా బలంగా ఉంటుంది. దాని నుంచి బయటపడటం సులభం కాదు.ఆక్టోపస్ అంటుకుంటే ఏమి చేయాలి?నిపుణుల సూచనల ప్రకారం.. ముందుగా భయపడకూడదు. బలంగా లాగితే దాని పట్టు ఇంకా బలపడే అవకాశం ఉంది. దాని భుజాల అంచులను నెమ్మదిగా విడదీయడానికి ప్రయత్నించాలి. సమీపంలో లైఫ్గార్డ్ ఉంటే వారి సహాయం తీసుకోవాలి. ఆక్టోపస్ నీటి బయట మీ శరీరానికి అంటుకుని ఉంటే, ఆ అవయవాన్ని మళ్లీ సముద్రం లేదా నీటిలోకి తీసుకెళ్లాలి. నీరు తగిలిన వెంటనే అది సాధారణంగా ఈదుకుంటూ దూరంగా వెళ్లిపోతుంది. కొన్ని సందర్భాల్లో ఆక్టోపస్ను నెమ్మదిగా వెనక్కి జరిపితే అది స్వయంగా వదిలేస్తుంది. ఆక్టోపస్ అంత ప్రత్యేకం ఎందుకు?ప్రపంచంలో 300 కంటే ఎక్కువ ఆక్టోపస్ జాతులు ఉన్నాయి. ఇది అత్యంత తెలివైన సముద్ర జీవుల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇది తన రంగును మార్చుకోగలదు. చాలా చిన్న ప్రదేశం నుంచి కూడా బయటకు రావచ్చు. ప్రమాదం ఎదురైతే సిరా వంటి ద్రవాన్ని విడుదల చేసి తప్పించుకుంటుంది. దీని భుజాలపై ఉన్న సక్షన్ కప్లు కేవలం పట్టుకోవడానికే కాదు, చుట్టూ ఉన్న వస్తువులను గుర్తించేందుకు కూడా సహాయపడతాయి.I'm officially never swimming ever again pic.twitter.com/CclCE8wXJI— Mario Nawfal (@MarioNawfal) August 1, 2026 -
ఆవేళ ఆమె నడక నేర్పితే..ఈ రోజు ఆకాశంలోకి..!
తల్లినే విమానంలో ప్రయాణికురాలిగా తీసుకువెళ్లితే ఆ పైలట్కి కలిగే ఆనందం మాటలకందనిది. ఆ సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకోవడంతో నెట్టింట వైరల్గా మారింది. పైలట్ తనిష్ అరోరా ఈ వీడియోని పోస్ట్ చేశారు. కొడుకు కాక్పిట్లో కూర్చొని ఉండగా తల్లి విమానం ఎక్కుతున్న భావోద్వేగ కణాన్ని రికార్డు చేశారు. ఆ రోజుని తన కెరీర్లోని అత్యంత స్పెషల్డేగా పేర్కొన్నాడు. విమానాశ్రయానికి బయలుదేరే ముందు, అతను తన తల్లిని ఈ ప్రయాణం గురించి ఎలా అనిపిస్తుందని అడగడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. అందుకు ఆమె తన కొడుకు నడుపుతున్న విమానంలో మొదటిసారిగా ప్రయాణిస్తున్నందుకు చాలా ఎగ్జైటింగ్ ఉందని నవ్వుతూ చెబుతుంది. విమానాశ్రయానికి చేరుకుని, ఆమె చెక్-ఇన్ పూర్తి చేసిన తర్వాత, అరోరా విమానంలో తన తల్లిని మళ్లీ కలిశాడు. టేకాఫ్కు ముందు, తనకు ఏమైనా సలహాలు ఉన్నాయా? అని ప్రశ్నించగా..సురక్షితంగా నడపమని చెబుతుండటం స్పష్టంగా వీడియోలో కనిపిస్తుంది. కానీ అరోరా చిన్నప్పుడు నడక నేర్పిన అమ్మను ఇవాళ ఆకాశంలోకి స్వయంగా తీసుకువెళ్లడం తనకు లభించిన గొప్ప అవకాశంగా పేర్కొన్నాడు. ఫ్లైట్ జర్నీ తర్వాత ఎలా అనిపించింది అని మళ్లీ అమ్మని అడగగా, నా కొడుకు నడిపే విమానంలో ప్రయాణించడం చాలా గర్వంగా ఉందని బదులిస్తుందామె. చివరగా తన కెరీర్లో వేలాది మంది ప్రయాణికులను విమానంలో తీసుకువెళ్లినప్పటికీ, తన తల్లి ఎప్పటికీ తనకిష్టమైన ప్రయాణికురాలిగానే ఉంటుందంటూ తన వీడియో సంభాషణను ముగించాడు. ఈ వీడియోకి క్యాప్షన్ కూడా ఆమె మొదటి అడుగులు ఎలా వేయాలో నేర్పితే..ఈరోజు ఆమెను ఆకాశంలోకి తీసుకువెళ్లే అవకాశం నాకు లభించింది. ఎప్పటికీ ఆమె నాకిష్టమైన ప్రయాణికురాలు అనే క్యాప్షన్ జోడించి మరీ పోస్ట్ చేశాడు. ఈ భావోద్వేగభరితమైన వీడియో నెటిజన్లను అమితంగా ఆకర్షించింది. View this post on Instagram A post shared by Tanish Arora (@tanisharora09) (చదవండి: అందాల పోటీల్లో తళుక్కుమన్న స్వగతికా పాణిగ్రాహి) -
మోదీజీ క్షమించండి.. ఇదే నా మొదటి, చివరి తప్పు బాలిక వీడియో వైరల్
-
‘అది భరతనాట్యం కాదు’.. ప్రభుదేవాపై నటి షాకింగ్ కామెంట్స్
భారతీయ సినీ నృత్యానికి కొత్త శైలిని పరిచయం చేసిన కొరియోగ్రాఫర్, నటుడు ప్రభుదేవా. ముఖ్యంగా 1990, 2000 దశకాల్లో తన వినూత్నమైన కొరియోగ్రఫీతో ఆయన ఓ కొత్త ట్రెండ్ను తీసుకొచ్చారు. తన ప్రత్యేకమైన స్టైల్, అద్భుతమైన డ్యాన్స్ మూవ్స్తో దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న ఆయన.. తాజాగా ఓ నృత్య ప్రదర్శనతో వివాదంలో చిక్కుకున్నారు.చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన చేసిన నాట్యప్రదర్శనపై ప్రముఖ నటి, డ్యాన్సర్ ప్రీతి సంజీవ్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ప్రభుదేవా లాంటి ప్రముఖ డ్యాన్సర్ నుంచి ఇలాంటి తప్పును ఊహించలేదు అంటూ ఆమె చేసిన కామెంట్లు.. ఆయన అభిమానులను ఒకింత షాక్కు గురి చేశాయి. అసలేం జరిగిందంటే.. பிரபு தேவா பரதநாட்டியம் ஆடி இப்போ தான் பாக்குறேன் 🧐 pic.twitter.com/ke3sAkXEzO— ⚡𝘼𝘽𝙎𝙊𝙇𝙐𝙏𝙀𝙇𝙔 ©️𝙄𝙉𝙀𝙈𝘼 (@Absolutlycinema) July 30, 2026గురు శ్రీ ఉడిపి లక్ష్మీనారాయణ 100వ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుదేవా భరతనాట్యం ప్రదర్శించారు. తన గురువుకు నివాళిగా ఆయన ప్రకటించగా.. పలువురు దానిని ప్రశంసించారు. అయితే.. ప్రీతి సంజీవ్ మాత్రం ఇలాంటి తప్పు ఊహించలేదు అంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుదేవా ప్రదర్శనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నటి, డ్యాన్సర్ ప్రీతి సంజీవ్ స్పందించారు. శాస్త్రీయ నృత్యమైన భరతనాట్యాన్ని సరైన పద్ధతిలో ప్రదర్శించడం చాలా ముఖ్యమని ఆమె పేర్కొన్నారు. “క్లాసికల్ డ్యాన్స్ను చాలాసార్లు తప్పుగా ప్రదర్శించినా ప్రజలు ప్రశ్నించకుండా ప్రశంసిస్తుంటారు. ప్రభుదేవా లాంటి ప్రముఖ డ్యాన్సర్ నుంచి ఇలాంటి తప్పును ఊహించలేదు” అంటూ ఆమె వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. ఇలాంటి అవకాశాలను భరతనాట్యంలో ఎన్నో ఏళ్లుగా శిక్షణ పొందుతున్న యువ కళాకారులకు ఇస్తే మరింత ప్రోత్సాహంగా ఉండేదని అభిప్రాయపడ్డారు. ప్రీతి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో డ్యాన్స్ వర్గాల్లో చర్చ మొదలైంది. ప్రభుదేవాకు మద్దతుగా పలువురు వచ్చారు. ఇది పోటీ కోసం చేసిన భరతనాట్య ప్రదర్శన కాదని.. తన గురువుకు అంకితంగా చేసిన నివాళి మాత్రమేనని పేర్కొన్నారు.ప్రభుదేవా భారతీయ నృత్య రంగానికి చేసిన సేవలను గుర్తు చేస్తూ.. ఆయన ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దని అభిమానులు చెబుతున్నారు. ఒక కళాకారుడి ప్రదర్శనను కేవలం సాంకేతిక అంశాల కోణంలో కాకుండా భావం, సందర్భం ఆధారంగా కూడా చూడాలని అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో ఆమె అడిగిన దాంట్లో తప్పేం లేదని కొందరు అన్నారు. శాస్త్రీయ నృత్యాలను ఎంతవరకు సంప్రదాయ పద్ధతుల్లోనే ప్రదర్శించాలి? కళాకారులకు ప్రయోగాల స్వేచ్ఛ ఎంత ఉండాలి? అనే అంశాలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.కొరియోగ్రాఫర్గా మాత్రమే కాకుండా నటుడిగా, దర్శకుడిగా కూడా ప్రభుదేవా గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళం, తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమల్లో ఆయన ఎన్నో విజయాలు సాధించారు. ఆయన స్పీడ్ స్టెప్పులు, ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్, స్టెప్పులు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో అభిమానులు ఆయనను ‘ఇండియన్ మైకేల్ జాక్సన్’గా పిలవడం ప్రారంభించారు. -
గుండెపోటు అనుకుని ఎడాపెడా సీపీఆర్.. ఆసుపత్రిలో బిగ్ ట్విస్ట్!
ఓ ప్రాణాన్ని కాపాడాలన్న ఆత్రం.. ఓ పొరపాటు అంచనా.. చివరకు ఊహించని గాయాలకు దారితీసింది. రోడ్డుపై కుప్పకూలిన ఓ టీచర్ను గుండెపోటు వచ్చిందని భావించిన ఇద్దరు యువకులు ఆమెకు వెంటనే CPR చేశారు. కానీ, ఆసుపత్రికి వెళ్లాక అసలు విషయం బయటపడింది. ఆమెకు గుండెపోటు రాలేదు.. అయితే తప్పుడు విధానంలో చేసిన CPR కారణంగా రెండు పక్కటెముకలు విరిగిపోయాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.వివరాల ప్రకారం.. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని కైలారస్లో ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా, తీవ్ర ఎండ వేడిమి కారణంగా టీచర్ లలిత స్కూటీపై వెళ్తుండగా ఒక్కసారిగా తల తిరిగింది. దీంతో, వాహనంపై నుంచి అదుపుతప్పి కిందపడిపోయారు. క్షణాల్లోనే ఆమె చుట్టూ జనం గుమిగూడారు. ఇంతలో అక్కడే ఉన్న ఇద్దరు యువకులు పరిస్థితిని చూసి ఆమెకు గుండెపోటు వచ్చిందని భావించారు. ఆలస్యం చేస్తే ప్రాణాపాయం ఉంటుందని అనుకుని వెంటనే CPR చేయడం ప్రారంభించారు. ప్రాణాలు కాపాడాలనే ఆందోళనలో పదేపదే ఛాతీపై ఒత్తిడి చేశారు.Madhya Pradesh: A teacher, Lalita, collapsed from her scooter in Kailaras due to extreme heat. Bystanders mistook it for a heart attack and began CPR without checking her condition. Doctors later confirmed she had not suffered a heart attack, and unnecessary CPR allegedly left… pic.twitter.com/4BP0oGpVU8— investmoneymag.com (@InvestMoneyMag) July 31, 2026కానీ, వారికి CPR చేసే సరైన పద్ధతి తెలియకపోవడంతో అదే ఆమెకు మరో సమస్యగా మారింది. కొంత సమయం తర్వాత లలితను ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించగా.. గుండెపోటు ఆనవాళ్లు కనిపించలేదు. ఎండ వేడి, నీరసం కారణంగానే ఆమె స్పృహ కోల్పోయినట్లు గుర్తించారు. అయితే, వైద్య పరీక్షల్లో మరో విషయం బయటపడింది. CPR సమయంలో అధిక ఒత్తిడి కారణంగా ఆమెకు రెండు పక్కటెముకలు విరిగినట్లు వైద్యులు గుర్తించారు.ప్రాణం కాపాడాలన్న ఉద్దేశంతో చేసిన ప్రయత్నం ఆమెకు ఇలా ఊహించని గాయాలకు దారితీసింది. అత్యవసర పరిస్థితుల్లో CPR ఎంతో కీలకమైనప్పటికీ, దాన్ని సరైన పద్ధతిలో చేయడం అంతే ముఖ్యం. శిక్షణ లేకుండా చేసే ప్రయత్నాలు కొన్నిసార్లు ప్రాణాలను కాపాడటానికి బదులుగా కొత్త సమస్యలను సృష్టించే అవకాశం ఉందని ఈ ఘటన మరోసారి గుర్తుచేసింది.हे भगवान..चक्कर आने से गिरी शिक्षिका को हार्ट अटैक समझकर CPR दिया गया, जिससे उनकी दो पसलियां टूट गईं।मध्य प्रदेश के कैलारस में शिक्षिका ललिता गर्मी के कारण स्कूटी से गिर गईं। वहां मौजूद दो युवकों ने उन्हें हार्ट अटैक समझकर लगातार CPR देना शुरू कर दिया।#MPNews #मध्यप्रदेश… pic.twitter.com/ghvAmrxVuh— Om singh (@ompratapsingh0) July 31, 2026 -
క్యాచ్ మిస్ కొంపముంచింది.. జట్టును గెలిపించిన జెమీమా!
హండ్రెడ్ వుమెన్స్ కాంపిటీషన్ 2026లో భారత బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ విధ్వంసం జోరుగా కొనసాగుతోంది. టోర్నీలో సదరన్ బ్రేవ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న జెమీమా వరుసగా మూడో మ్యాచ్లోనూ మెరిసింది. గురువారం రాత్రి బర్మింగ్హమ్ ఫోనిక్స్తో జరిగిన మ్యాచ్లో 24 పరుగుల తేడాతో సదరన్ బ్రేవ్ వరుసగా నాలుగో విజయాన్ని అందుకొని టేబుల్ టాపర్లుగా నిలవగా, ఇప్పటివరకు ఆడిన అన్ని మ్యాచ్ల్లోనూ ఓటమి చవిచూసిన బర్మింగ్హమ్ మాత్రం విజయం కోసం చకోర పక్షిలా ఎదురుచూస్తూనే ఉంది. అయితే సదరన్ బ్రేవ్ విజయంలో జెమీమా మరోసారి కీలకపాత్ర పోషించింది. ఆఖర్లో బ్యాటింగ్కు వచ్చిన జెమీమా 18 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 28 పరుగులతో అజేయంగా నిలిచింది. అయితే క్రీజులోకి వచ్చిన వెంటనే క్యాచ్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న జెమీమా తనకు వచ్చిన రెండో చాన్స్ను రెండు చేతులా ఒడిసిపట్టింది. మూడు ఫోర్లతో చివర్లో సదరన్ బ్రేవ్ భారీ స్కోరు చేయడంలో సహాయపడింది. ఒకవేళ జెమీమా ఆరంభంలోనే ఔటయ్యి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదేమో. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన సదరన్ బ్రేవ్ వుమెన్ జట్టు 100 బంతుల్లో 3 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. ఓపెనర్లు మయియా బౌచర్ (31 బంతుల్లో 45), లిజెల్లే లీ (28 బంతుల్లో 43) ధాటిగా ఆడారు. వీరిద్దరు ఔటైన తర్వాత జెమీమా (18 బంతుల్లో 28 నాటౌట్) అజేయంగా నిలిచింది. బర్మింగ్హమ్ బౌలర్లలో లారెన్ ఫైలర్, అలానా కింగ్, అలిస్ కాప్సీ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం బర్మింగ్హమ్ ఫోనిక్స్ 100 బంతుల్లో 5 వికెట్ల నష్టానికి 116 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్ డేవినా పెర్రిన్ (43 బంతుల్లో 52) అర్ధసెంచరీ వృథాగా మారగా, టామీ బ్యూమౌంట్ (22) పర్వాలేదనిపించింది. సదరన్ బౌలర్లలో సోఫీ మొలినెక్స్ రెండు వికెట్లు తీయగా, టిల్లీ కొర్టీన్, సారా గ్లెన్, లారెన్ బెల్లు తలా ఒక వికెట్ తీశారు. Never give #JemimahRodrigues a second chance! 🫣She powered three boundaries to wrap up the innings on a high for Southern Brave! ⚡#TheHundred 2026 👉 Southern Brave vs Birmingham Phoenix | LIVE NOW pic.twitter.com/KqBGgsVVen— Star Sports (@StarSportsIndia) July 30, 2026Read: రహానే వీడ్కోలుపై లేటుగా స్పందించిన రోహిత్! -
మోదీపై వ్యాఖ్యల వివాదం.. ఎవరీ రుచికా సింగ్?
ఢిల్లీలోని జంతర్ మంతర్లో నీట్ నిరసనల సందర్భంగా రెచ్చిపోయిన యువతికి పెద్ద షాక్ తగిలింది. దేశ ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకుగానూ ఆమెపై తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు. ‘‘రాజ్యాంగ పదవి గౌరవాన్ని ఆమె వ్యాఖ్యలు దెబ్బతీశాయని.. ప్రజా శాంతికి భంగం కలిగించే ఉద్దేశంతో ఉన్నాయని’’ ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.కాక్రోచ్ పార్టీ నిరసనల్లో పాల్గొన్న ఆ యువతి.. జూలై 23-24 తేదీల మధ్య ఈ వీడియో తీసినట్లు పోలీసులు తెలిపారు. ఆ సమయంలో ఆమె ప్రధాని మోదీపై అభ్యంతరకర భాష ఉపయోగించింది. మోదీని గద్దె దిగిపోవాలని.. యువత ఆ పని చేయాలంటూ అసభ్య పదజాలంతో దూషించింది. ఆ సమయంలో కొందరు ఆందోళనకారులు ఆమెను సెల్ఫోన్లతో వీడియోలు తీసిన మరింత రెచ్చిగొట్టినట్లు కనిపించింది. అవి విపరీతంగా వైరల్ కావడంతో పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు స్వచ్చందంగా ఈ వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించారు.జీరో ఎఫ్ఐఆర్ నమోదుసుప్రీంకోర్టు న్యాయవాది స్మృతి సింగ్ చందేల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా జూలై 29న నోయిడాలోని ఎక్స్ప్రెస్వే పోలీస్ స్టేషన్లో జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది. భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్లు 352, 353(1), 356(1) కింద కేసు నమోదు చేశారు. ఉద్దేశపూర్వకంగా అవమానించడం ద్వారా ప్రజా శాంతికి భంగం కలిగించడం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, పరువునష్టం వంటి అంశాలపై అభియోగాలు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఫిర్యాదులో.. సదరు యువతి చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ పదవి గౌరవాన్ని దెబ్బతీయడమే కాకుండా, ద్వేషాన్ని వ్యాప్తి చేసి ప్రజా శాంతికి విఘాతం కలిగించే ఉద్దేశంతో ఉన్నాయని పేర్కొన్నారు. అంతేకాదు.. ఆ వీడియోలో ఆమె ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ పేరును కూడా ప్రస్తావించడం గమనార్హం. ఎవరీ అమ్మాయి?.. జంతర్ మంతర్ నిరసనల్లో ప్రధాని మోదీపై వ్యాఖ్యలు చేసిన యువతిని నోయిడాకు చెందిన రుచికా సింగ్గా గుర్తించారు. 25 ఏళ్ల రుచిక.. విద్యార్హతలు ఏంటో స్పష్టత లేదు. అయితే ఆమె మోడల్గా, ఇన్ఫ్లుయెన్సర్గా రాణిస్తున్నట్లు సమాచారం. విద్యా వ్యవస్థకు సంబంధించిన అంశాలు, విద్యార్థుల సమస్యలపై జరిగిన ఈ నిరసనలో భాగంగా ఆమె.. ఇలా అభ్యంతరక వ్యాఖ్యలతో దేశ ప్రధానిని తిట్టడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది.ఢిల్లీ పోలీసులకు బదిలీజంతర్ మంతర్ ప్రాంతం ఢిల్లీ పోలీసుల పరిధిలో ఉండటంతో నోయిడాలో నమోదైన జీరో ఎఫ్ఐఆర్ను ఢిల్లీ పోలీసులకు బదిలీ చేశారు. ఈ కేసును ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం ఐఎఫ్ఎస్ఓ (Intelligence Fusion and Strategic Operations) పరిశీలిస్తోంది. నిరసనకు సంబంధించిన వీడియోలు, సోషల్ మీడియా పోస్టులను పోలీసులు పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆమెను అరెస్ట్ చేశారా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.సోషల్ మీడియా ఖాతాలకు నోటీసులుఈ వ్యవహారంలో ఇప్పటికే పలు సోషల్ మీడియా ఖాతాలకు ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అభ్యంతరకరమైన, పరువునష్టం కలిగించే కంటెంట్ను షేర్ చేశారన్న ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఎక్స్ (X) వేదికకు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చి సంబంధిత పోస్టులను తొలగించడం లేదంటే వాటి యాక్సెస్ను నిలిపివేయడం, దర్యాప్తు కోసం ఎలక్ట్రానిక్ రికార్డులను భద్రపరచాలని కోరినట్లు సమాచారం. -
ఎలుక ఎంత పనిచేసింది.. 10 లక్షల వజ్రాల నగలు..
సాక్షి, బెంగళూరు: తలుపులు పగలలేదు.. షట్టర్కు గీత కూడా పడలేదు.. దుకాణంలోకి ఎవరూ చొరబడిన ఆనవాళ్లు లేవు. కానీ ఉదయం వచ్చి చూసేసరికి రూ.10 లక్షల విలువైన వజ్రాల నగలు మాయమయ్యాయి. దీంతో నగల దుకాణం యజమాని గుండె ఆగినంత పనైంది. చివరకు సీసీటీవీ ఫుటేజీ చూస్తే అసలు దొంగను చూసి అంతా నోరెళ్లబెట్టారు. ఎందుకంటే ఆ 'మాస్టర్మైండ్' ఒక చిన్న ఎలుక!కర్ణాటకలోని తుమకూరు నగరంలోని కాల్టెక్స్ సర్కిల్లో ఉన్న విశ్వాస్ జ్యువెలరీలో ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం దుకాణం తెరిచిన యజమాని, కౌంటర్పై ఉన్న 50 గ్రాములకు పైగా వజ్రాల నగలు, 10 ఉంగరాలు, మూడు నెక్లెస్లు కనిపించకపోవడంతో షాక్కు గురయ్యారు. వాటి విలువ సుమారు రూ.10 లక్షలు.ఎవరూ లోపలికి రాకపోవడంతో సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. రాత్రి వేళ గోడలోని చిన్న రంధ్రం గుండా లోపలికి వచ్చిన ఓ ఎలుక, ఒక్కో నగను నోటితో లాక్కెళ్లి తన బొరియలో దాచిపెడుతున్న దృశ్యాలు కనిపించాయి. ఎలుక జాడను అనుసరించి బొరియను తవ్వి చూడగా.. కనిపించకుండా పోయిన 10 ఉంగరాలు, మూడు నెక్లెస్లు సహా అన్ని వజ్రాల నగలు అక్కడే లభించాయి. దీంతో యజమాని ఊపిరి పీల్చుకున్నారు. నగలన్నీ తిరిగి దొరకడంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. సినిమాల్లోనే కనిపించే సన్నివేశాన్ని తలపించిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.🐀 Rat becomes 'gold thief' near Bengaluru, drags ₹10 lakh worth of jewellery into its burrow; all ornaments recovered! pic.twitter.com/QYZlFeM9zz— HOSUR UPDATES (@hosurupdates) July 30, 2026 -
జూనియర్ ఏబీ విధ్వంసం.. బంతిని చూడకుండానే!
హండ్రెడ్ మెన్స్ కాంపిటీషన్లో లండన్ స్పిరిట్ తొలి విజయాన్ని నమోదు చేసింది. బుధవారం ఎంఐ లండన్తో జరిగిన మ్యాచ్లో లండన్ స్పిరిట్స్ 7 వికెట్ల తేడాతో విజయం అందుకుంది. మ్యాచ్లో ప్రిటోరియస్ సంచలన ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అయితే ప్రిటోరియస్తో పాటు జూనియర్ డివిలియర్స్ డెవాల్డ్ బ్రెవిడ్ ఇన్నింగ్స్ కూడా మ్యాచ్లో హైలైట్ అని చెప్పొచ్చు.18 బంతుల్లోనే 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 పరుగులు చేసి అజేయంగా నిలిచిన బ్రెవిస్ జట్టుకు విజయాన్ని అందించాడు. అయితే ఇన్నింగ్స్లో డెవాల్డ్ బ్రెవిస్ కొట్టిన నో-లుక్ సిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇన్నింగ్స్ 68వ బంతికి ఈ అద్భుతం చోటుచేసకుంది. ఓలీ స్టోన్ వేసిన బంతిని ముందే అంచనా వేసిన డెవాల్డ్ బ్రెవిస్ మిడ్ వికెట్ మీదుగా భారీ సిక్సర్ కొట్టాడు. ఈ క్రమంలో బంతి స్టాండ్స్ దిశగా వెళ్తున్న సమయంలో డెవాల్డ్ బ్రెవిస్ ఒక్కసారి కూడా తాను కొట్టిన షాట్ను చూడకుండా గ్రౌండ్నే చూడడం హైలైట్గా మారింది. ఇది చూసిన అభిమానులు @నీ కాన్ఫిడెన్స్కు సలాం.. బ్రెవిస్*, ఇదెక్కడి మాస్ రా మావ.. అని కామెంట్లు పెట్టేశారు. ఇంకెందుకు ఆలస్యం బ్రెవిస్ నో లుక్ సిక్స్ను మీరు కూడా వీక్షించండి. ఇక మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ లండన్ 100 బంతుల్లో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. విల్ జాక్స్ (44 బంతుల్లో 65), రూథర్ఫోర్డ్ (19 బంతుల్లో 41) ధాటిగా ఆడారు. లండన్ స్పిరిట్ బౌలర్లలో జేమీ ఓవర్టన్ 3 వికెట్లు తీయగా, ఆండ్రూ టై, జేమ్స్ కోల్స్ చెరొక వికెట్ తీశారు.అనంతరం లండన్ స్పిరిట్ మరో 11 బంతులు మిగిలి ఉండగానే మూడు వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ప్రిటోరియస్ (28 బంతుల్లో 64), బ్రెవిస్ (18 బంతుల్లో 37 నాటౌట్) భారీ ఇన్నింగ్స్లతో జట్టుకు విజయాన్ని అందించారు. Simply sensational from Dewald Brevis 🤯Watch his head position as he hits the ball...#TheHundred pic.twitter.com/eWOtOJlVXo— The Hundred (@thehundred) July 29, 2026Dewald Brevis. No-look six. Enjoy. 🥶 pic.twitter.com/qgQoBKwvkz— Lord's Cricket Ground (@HomeOfCricket) July 29, 2026Read: రహానే రిటైర్మెంట్పై బీసీసీఐ తొలి స్పందన -
నా ముఖం ఎవరూ పగలకొట్టలేదు : జగపతి బాబు వీడియో
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే టాలీవుడ్ నటుల్లో జగపతి బాబు ఒకరు. షూటింగ్ విశేషాలతో పాటు తన పర్సనల్ లైఫ్కి సంబంధించిన సరదా విషయాలను అభిమానులతో పంచుకోవడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. సోషల్ మీడియాలో ఆయన పెట్టే పోస్టులు ఎంత సరదాగా, వైవిధ్యంగా ఉంటాయో అందరికీ తెలిసిందే. తాజాగా ఆయన తన ఎక్స్ ఖాతాలో పంచుకున్న ఒక వంటల వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.అప్పుడప్పుడు తనకు ఇష్టమైన వంటలు చేస్తూ అలరించే జగపతి బాబు, ఈసారి ఇంట్లోనే స్వయంగా బిస్కెట్స్ తయారు చేశారు. ఓవెన్ నుంచి వేడి వేడి బిస్కెట్లను బయటకు తీస్తూ డిఫరెంట్ లుక్లో కనిపించిన ఆయన, వాటిని రుచి చూస్తూ మురిసిపోయారు. ఈ వీడియోకి ఆయన పెట్టిన క్యాప్షన్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ‘నా పెద్ద అమ్మాయి దగ్గర చూసి ఈ బిస్కెట్ల తయారీ కాపీ కొట్టాను’ అంటూ జగపతి బాబు నవ్వులు పూయించారు. తనదైన మార్క్ హ్యూమర్తో ఆయన ఇచ్చిన ఈ స్టేట్మెంట్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.ఈ పోస్ట్పై అభిమానులు, నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘మాస్ అండ్ క్లాస్ కుకింగ్ జగ్గు భాయ్’, ‘కాపీ కొట్టినా మీ స్టైలే వేరు సార్’ అంటూ సరదా కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ 'బిస్కెట్ రెసిపీ' వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ముఖానికి సర్జరీ..వీడియో నవ్వులు పూయిస్తున్నా.. అందులో జగపతి బాబు ముఖం చూస్తే మాత్రం కాస్త తేడాగా అనిపిస్తుంది. ఆయన కళ్లకింద నల్లగా ఉంది. అలాగే లుక్ కూడా డిఫరెంట్గా ఉంది. దీనిపై వీడియోలోనే జగపతి బాబు వివవరణ ఇచ్చాడు. ‘నా ముఖం ఎవడో పగలగొట్టినట్లు ఉంది. కానీ ఎవడూ కొట్టలేదు. నేనే సర్జరీ చేయించుకున్నాను. బాగానే ఉన్నాను’ అని జగ్గూ భాయ్ తనదైన స్టైల్లో క్లారిటీ ఇచ్చాడు. Malli malli cheputhunna, idhi kooda ma pedda ammayi cheppinattu copy paste cheseysa 🤪 pic.twitter.com/gVmgCQxQ6D— Jaggu Bhai (@IamJagguBhai) July 29, 2026 -
బెల్జియంలో గర్బా : పారిశ్రామిక వేత్త హర్ష్ గోయెంకా స్పందన
ఇటీవలికాలంలో విదేశాల్లో భారతీయులు చేసే కొన్ని నృత్యాల చుట్టూ జరుగుతున్న వివాదాలు రేగుతున్నాయి. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాలలో జనాలకు ఇబ్బంది కలిగించే ప్రదేశాలలో ‘గర్బా’ డ్యాన్స్ చేయడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పౌర స్పృహ (Civic sense) పాటించడం లేదనే దుమారం రేగింది. అయితే 'గెంట్స్ ఫీస్టెన్ 2026' (Gentse Feesten 2026) పండుగ వేడుకలపై పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా ఎక్స్ వేదికగా ఒక ఇంట్రస్టింగ్ వీడియోను పంచుకున్నారు.జూలై 26న బెల్జియంలో జరిగిన ఈ ఈవెంట్ భిన్నంగా నిలిచింది. ఈ వీడియోలో భారతీయులతో పాటు స్థానిక విదేశీయులు కూడా ఎంతో ఉత్సాహంగా, సంతోషంగా కలిసి గర్బా అడుగులు వేశారు అంటూ దీనికి సంబంధించిన వీడియోను గోయోంకా షేర్ చేశారు. గర్బా డ్యాన్స్పై నెట్టింట వెల్లువెత్తిన విమర్శల మధ్య ఐక్యత, సంబరం, కమ్యూనిటీ స్పిరిట్కు నిజమైన ప్రతీక గర్బా అని గుర్తుచేసే చక్కటి సంఘటన ఇది అని పేర్కొన్నారు.నెటిజన్ల స్పందనలుఈవీడియోపై కూడా నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. సంగీతంలో దమ్ముంటే విమర్శకులు కూడా సర్కిల్లో వచ్చి డ్యాన్స్ చేయాల్సిందే అని కొందరు వ్యాఖ్యానించారు. సార్వజనిక సాధారణ జీవితానికి ఆటంకం కలిగించనంత వరకు ఇది మంచిదే. ఎయిర్పోర్టులు, హైవేలపై డ్యాన్సులు చేయడం మాత్రం సరికాదు అని కొందరు సూచించారు. ఏ పనికైనా ఒక సమయం, సందర్భం ఉంటాయి అన్నారు మరికొందరు. బెల్జియంలో గర్బా ప్రదర్శించడం ఇదే మొదటిసారి కాకపోయినా, ఇటీవల భారతీయుల పబ్లిక్ ప్రవర్తనపై వస్తున్న విమర్శల నేపథ్యంలో ఈ ఘటన భారతీయ సంస్కృతిని విదేశాల్లో ఎంతో అందంగా చాటిచెప్పేలా నిలిచింది.Amid the flood of Garba criticism online, here’s a heartwarming reminder that the true spirit of Garba is inclusion, celebration, and community. pic.twitter.com/CIlDcQrhEP— Harsh Goenka (@hvgoenka) July 29, 2026ఇదీ చదవండి: చెఫ్ అవుదామనుకుని స్టార్ హీరో : కళ్లు చెదిరే కార్లు, ఆస్తులుగతంలో విమర్శలకు దారితీసిన ఘటనలునిలిపి ఉంచిన విమానం పక్కన టార్మాక్పై ప్రయాణికులు గర్బా డ్యాన్స్ చేయడం.చైనాలోని చారిత్రాత్మక గ్రేట్ వాల్ ఆఫ్ చైనా వద్ద ప్రదేశంలో నృత్యం చేసిన ఘటనకొండచరియలు విరిగిపడి ఒకవైపు వాహనాలు నిలిచిపోయి ఒక వైపు జనం ఇబ్బందులు పడుతోంటే, మరోవైపు రోడ్డుపై డ్యాన్స్ చేయడం విమర్శలకు తావిచ్చింది. అలాగే కొచ్చి వాటర్లో కదులుతున్న ఫెర్రీ బోటులో గర్బా చేయడంపై కూడా విమర్శలు చెలరేగాయి.ఇదీ చదవండి : భార్యతో జస్ట్ 90 సెకన్లు : వ్యాపారవేత్త ఆదిత్య ఆసక్తికర వ్యాఖ్యలు -
అమ్మ కోసం ఆవిష్కరణ..సాక్షాత్తు సీఎం సైతం ఫిదా!
అమ్మ రోజువారీ పనుల్లో కష్టాన్ని చూసి తను సాయం చేయాలనుకోలేదు. కానీ టెక్నాలజీ సాయంతో ఆమెకు సహకరించే ఆవిష్కరణలు చేశాడు. అందుకోసం పెద్ద పెద్ధ ఖరీదైన పరికరాలను కూడా ఉపయోగించలేదు. చుట్టూ ఉండే వస్తువులు, పనికిరాని కార్డుబోర్డులాంటి వాటితోనే అద్భుత ఆవిష్కరణలు చేసి అందరి దృష్టిని ఆకర్షించడమే కాదు శెభాష్ అని ప్రశంసలందుకుంటున్నాడు. అతడే కేరళకు చెందిన 12 ఏళ్ల లెవిన్ పౌలోస్. రోజువారీ సమస్యలను పరిష్కరించడానికి రూపొందించిన అతడి చేసిన ఆవిష్కరణలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. వాటలో కొన్ని వాక్యూమ్ క్లీనర్, ఒక బటన్ నొక్కగానే కర్టెన్లను తెరిచి మూసే మోటార్తో నడిచే ఆటోమేటెడ్ కర్టెన్ సిస్టమ్, అలాగే స్టవ్ నుంచి దూరంగా వెళ్లిన ఆటోమేటిగ్గా గరిట పట్టుకుని తిప్పే ఆటోమేటిక్ ఫుడ్ స్టిరర్ తదితరాలు. ఆచరణాత్మకమైన రూపకల్పన, రోజువారీ పనుల్లో ఉపయోగపడే అతడి ఆవిష్కరణలు అందర్నీ అబ్బురపరుస్తున్నాయి. వీటన్నింటి తోపాటు తాజాగా పారేసిన కార్డ్బోర్డ్తో నిర్మించిన ఒక హ్యూమనాయిడ్ రోబోట్, అతడి క్రియేటివిటీకి, ఇంజనీరింగ్ నైపుణ్యలను నిదర్శనం. పూర్వినయోగ వస్తువులు, ప్రాథమిక ఎలక్ట్రానిక్ భాగాలతో ఆకర్షణీయంగా రూపొందించడం విశేషం. అతడు రూపొందించిన ఈ రోబోట్ తన తల్లికి రోజువారీ పనులలో ఉపయోగపడుతుంది. ఇవననీ తన తల్లి పడే కష్టాన్ని చూసి చేసిన అద్భుతమైన ఆవిష్కరణలు. పొద్దున లేస్తే ఇంటి పనులతో, వంటతో అమ్మ పడుతున్న అలసటను తగ్గించాలనే ఉద్దేశంతో చేసినవే. అంతేగాదు అతడి ఆవిష్కరణల కారణంగా సాక్షాత్తు తన రాష్ట్ర సీఎంనే కలిసే అవకాశం దక్కించుకున్నాడు. ఆయన సైతం అతడి ప్రతిభకు ఫిదా అవ్వుతూ ప్రశంసల వర్షం కురిపించారు. లెనిన్ కథ యువతను సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం వంటి (STEM) రంగాలను ఆచరణాత్మక అభ్యాసం ద్వారా అన్వేషించేలా చేస్తున్నాడు. అంతేగాదు లెవిన్ ఆవిష్కరణలు విద్యావేత్తలు, టెక్నాలజీ ఔత్సాహికులు, సోషల్ మీడియా వినియోగాదారులందరినీ ఆకట్టుకుంది. పైగా ఉత్సుకత, పట్టుదల సమయస్ఫూర్తి సాధారణ గృహోపకరణాలను అద్భుతమైన ఆవిష్కరణలుగా ఎలా మారుస్తుందో చూపించింది. View this post on Instagram A post shared by levin paulose (@ppv931680) (చదవండి: నందన్-రోహిణి నీలేకనిల ప్రేమ కథ: అలా మొదలైంది..!) -
బోరున వర్షం.. వీఐపీనే గొప్ప!
జోరున వర్షం.. బస్ షెల్టర్లో నిల్చున్న ప్రజలు.. ఇంతలో వీఐపీ కాన్వాయ్ వస్తుందనే సమాచారం. అక్కడ ఉండకూడదంటూ ప్రజల్ని పోలీసులు పక్కకు తరిమేసిన దృశ్యాలు. దీనికి సంబంధించిన 23 సెకన్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.వర్షం కురుస్తున్న సమయంలో బస్ షెల్టర్లో ఆశ్రయం పొందుతున్న ప్రయాణికులు, ద్విచక్ర వాహనదారులను పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరుతూ బయటకు పంపించారు. కొందరిని నెట్టివేస్తున్నట్లు వీడియోలో కనిపించడం వివాదానికి కారణమైంది. రాజస్థాన్ జైపూర్లోని జేఎల్ఎన్ మార్గ్లో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.వీఐపీ ప్రోటోకాల్.. ప్రజల హక్కుల కంటే పెద్దదా?ప్రజల పన్నుల డబ్బుతో నిర్మించిన బస్ షెల్టర్లోనే ప్రజలకు చోటు లేకుండా చేయడం ఏంటంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. వీఐపీ భద్రత పేరుతో సామాన్యుల ఇబ్బందులను పట్టించుకోకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.Indian policemen are removing people from under the shed because some lowlife VIP is about to pass by. Feudalism is not a system. It is about the DNA. People don't rebel and vote for psychopaths. Policemen from the lower caste implement what they claimed to have suffered.…— Jayant Bhandari (@JayantBhandari5) July 29, 2026సోషల్ మీడియా వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ స్పందిస్తూ..“ప్రజల పన్నుల డబ్బుతో నిర్మించిన బస్ స్టాప్లో కూడా ప్రజలు నిలబడలేని పరిస్థితి వచ్చింది. కారణం.. వీఐపీ ప్రోటోకాల్” అంటూ విమర్శించింది. “భారీ వర్షంలో తలదాచుకునేందుకు బస్ షెల్టర్లో ఉన్న పాదచారులు, బైక్ రైడర్లను ప్రజల రక్షకులుగా ఉండాల్సిన పోలీసులే బయటకు పంపించడం సిగ్గుచేటు. వీఐపీ ప్రోటోకాల్ మానవత్వం కంటే గొప్పదా? లేక సామాన్యుడికి ఆశ్రయం పొందే హక్కు లేదా?” అంటూ ప్రశ్నించింది.సోషల్ మీడియాలో దుమారంఈ ఘటనపై నెటిజన్లు కూడా మండిపడుతున్నారు. ప్రజల కోసం ఏర్పాటు చేసిన సదుపాయాలను వీఐపీ రాకపోకల కోసం అడ్డుకోవడంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. వీఐపీ భద్రత అవసరమే అయినప్పటికీ.. సాధారణ ప్రజల పట్ల కనీస మానవత్వం, గౌరవం పాటించాల్సిందేనని పలువురు కామెంట్లు చేస్తున్నారు.అయితే ఈ ఘటనపై రాజస్థాన్ పోలీసుల నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది. అలాగే ఆ కాన్వాయ్ ఎవరిదన్న వివరాలు కూడా ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. -
హ్యాట్సాఫ్ మేడం..! ఆ ఐడియాకి మాటల్లేవ్ అంతే..
వృత్తి కొందరికీ ఒక ప్యాషన్ అయితే..వాళ్లు అందులో చూపించే క్రియేటివీ మాములగా ఉండదు. ఏ పనిచేసినా..అది అద్భుతంగా ఆలోచనాత్మకంగా ఉంటుంది. అందుకు ఉదాహరణ ఈ ఉపాధ్యాయురాలు. పెద్ద పెద్ద క్రియేటివిటీలతో పనిలేదు. కాస్త అభిరుచితో చాలా సింపుల్గా కూడా అద్భుతం సృష్టించొచ్చు. అదే చూపించింది ఈ ఢిల్లీ ఉపాధ్యాయురాలు. విద్యార్థులు రెగ్యులర్గా క్లాస్కి వచ్చేలా చేసేందుకు ఆమె సృజనాత్మకంగా ఆలోచించిన తీరు తెలిస్తే నోటమాటరాదు. అందుకోసం ఏం పెద్ద పరికరాలు, ఎలక్ట్రానిక్ వస్తువులేం ఉపయోగించలేదు. జస్ట్ ఒక పేపర్ బోర్డు, చిన్న చిన్న అగ్గిపెట్టెలతోటే అంతా చేశారామె. వాళ్లంతా తమ హాజరును తామే వేసుకునేలా అవకాశం ఇచ్చి..బాధ్యతగా వ్యవహరించేలా చేసింది. ముఖ్యంగా రోజూ వచ్చేలా నిబద్ధతను మెదళ్లులో నాటినట్లుగా చేసిన పని అందర్నీ అమితంగా ఆకర్షించింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఆ వీడియోలో మొదట ఉపాధ్యాయురాలు తరగతి గదిలోకి ప్రవేశించగా..వెనుక విద్యార్థులు ఒక్కొక్కరుగా లోపలికి వచ్చారు.లోపలికి ప్రవేశించిన వెంటనే, ఆమె చేసిన మొదటి పని, చేతితో తయారు చేసిన ఆ స్వీయ-హాజరు బోర్డుపై తన హాజరును గుర్తించడం. ఆ టీచర్నే అనుసరిస్తూ..మిగతా విద్యార్థులంతా స్వీయంగా తమ హాజరును నమోదు చేసుకున్నారు. అందుకోసం ఒక పెద్ద బోర్డుపై చిన్న అగిపెట్టెలను పెట్టి..వాటిపై ప్రతి విద్యార్థి ఫోటో ఉండేలా చేశారు. దానిలోపల బాక్స్లో పీ "P" అనే అక్షరాన్ని ఉంచారు. క్లాస్కి వచ్చిన వాళ్లంతా ఆ బోర్డుపై ఉన్న అగ్గిపెట్టెని ఓపెన్ చేసి P" అనే అక్షరాన్ని బయటకు కనిపించేలా పెడతారు. రానివాళ్లు పెట్టేపై ఆటోమేటిగ్గా కనిపిస్తున్న "O" అనే అక్షరం కనిపిస్తుంది. ఆమె ఈ వీడియోని సోషల్ మీడియాలో పంచుకుంటూ నా చిన్నారులు బాధ్యత తీసుకుంటున్నారు అనే క్యాప్షన్ జోడించి మరి పోస్ట్ చేశారు. నెటిజన్లు కూడా అద్భుతమైన ఆలోచన..బాధ్యతా భావాన్ని పెంచేలా ప్రోత్సహిస్తున్నారంటూ పోస్టులు పెట్టారు.(చదవండి: ఈ క్షణం కోసమే ఎదురుచూశా..! ఉప్పొంగి పోయిన తల్లిదండ్రులు..) -
ఈ క్షణం కోసమే ఎదురుచూశా..! ఉప్పొంగి పోయిన తల్లిదండ్రులు..
మన కోసం ఎన్నో త్యాగాలు చేసే, సర్వసం మనకు ధారపోసే కన్నవాళ్లను ఎంతో బాగా చూసుకోవాలని కోరుకుంటారు చాలామంది పిల్లలు. అందుకోసం తమ వంతుగా చేయాల్సిదంతా చేస్తుంటారు బిడ్డలు. అలానే ఈ మహిళ కూడా తన పేరెంట్స్కి గొప్ప అనుభవం ఇవ్వాలని అనుకుంది. అందుకని వాళ్లని ఎప్పటికైన మంచి పర్యాట ప్రదేశానికి తీసుకువెళ్లాలనుకుంది. అనుకున్నట్లుగానే కల నేరవేర్చుకోవడంతో ఆ పట్టరాని సంతోషాన్ని ఇలా సోషల్ మీడియా వేదికగా వీడియో రూపంలో పంచుకుంది. ఆ మహిళా ప్రియాంక అనే ఎన్నారై. ఆమె ఈ వీడియోని ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు. తన తల్లిదండ్రులను అమెరికాలోని ప్రసిద్ధ నయగరా జలపాతానికి తీసుకువెళ్లాలని అనుకుంది. ఆ జలపాతాన్ని దగ్గరగా వీక్షించే అనుభవం ఇవ్వాలని ఎన్నాళ్ల నుంచో అనుకుంది. ఆ డ్రీమ్ నెరవేరడమే గాక తన తల్లిదండ్రులు 'మెయిడ్ ఆఫ్ ది మిస్ట్' బోట్ టూర్లో పాల్గొంటూ ఉధృతంగా పడుతున్న జలపాతాన్ని చూస్తున్న వీడియోని ఇలా సోషల్ మీడియాలో పంచుకుంది. ఒక చల్లని తుంపర్లు, దట్టమైన పొగమంచు మధ్య అందమైన దృశ్యాన్ని వీక్షించారు. వర్షం నుంచి రక్షించే రెయిన్ పాంచోలు ధరించి ప్రియాంక తల్లిదండ్రులు పడవలో జలపాతం సమీపం వరకు వెళ్తున్న దృశ్యాలు స్ఫష్టంగా కనిపిస్తున్నాయి. ఆమె పేరెంట్స్ కనువిందు చేస్తున్న ఆ దృశ్యాన్ని వీక్షిస్తూ..ఉప్పొంగిపోయారు. ఆ ప్రకృతి అందాన్ని అంత దగ్గర చూసి సంతోషం, ఆశ్చర్యం కలగలసిన భావాలు వాళ్ల ముఖాల్లో స్పష్టంగా కనిపించాయి వీడియోలో. ఆమె ఆ వీడియోని పోస్ట్ చేస్తూ..ఈ క్షణం కోసం ఎన్నో ఏళ్లు ఎదురు చూశా. పేరెంట్స్ని కచ్చితంగా ఇక్కడ తీసుకురావాలని అనుకున్నా. ఆ కల ఈవేళ నిజమైంది. ఇది అత్యంత హృద్యమైన క్షణం అంటూ క్యాప్షన్ ఇచ్చి మరి పోస్ట్ చేసింది. నెటిజన్లు కూడా చాలా బాగుంది మేడం, నిజంగా ఇది హృద్యంగా ఉంది అంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Priyanka | Indian in the US (@thatbrownbanni.usa) (చదవండి: మిస్ టీన్ యూనివర్స్ ఇండియా విజేతగా ప్రసుచి పాండా) -
ఏసీ రైలు బోగీలో దీప ధూపాలతో పూజ : నెటిజన్లు ఫైర్
సాక్షి,న్యూఢిల్లీ : రైలు ప్రయాణంలో జరిగిన ఒక వింతలు, విడ్డూరలాలతో ప్రమాదకరమైన వీడియోలు ఇటీవలి కాలంలో పరిపాటిగా మారిపోయాయి. కదులుతున్న రైలు ఏసీ బోగీలో ఒక ప్రయాణీకుడు నూనె ప్రమిదలో దీపారాధన, ధూపంతో పూజలు చేసిన వింత సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఎక్స్లో షేర్ చేసిన వీడియోప్రకారం బనియన్, ధోతీ ధరించిన వ్యక్తి రైలు ఏసీ కంపార్ట్మెంట్లోని అప్పర్ బెర్త్పై మత కార్యక్రమాలు నిర్వహించాడు. ఏకంగా ధూపదీప నైవేద్యాలతో చేతులు జోడించి పూజ చేసిన వైనం తోటి ప్రయాణీకుల్లో అలజడి రేపింది. ఇది ప్రయాణికుల భద్రతకు తీవ్ర ముప్పు అని, మంటలు లేదా పొగ కారణంగా ఫైర్ అలారం మోగే ప్రమాదం ఉందని తోటి ప్రయాణికులు వారించారు.వీడియో తీస్తున్న ప్రయాణికుడు ఆ వ్యక్తిని "పండిత్ జీ" అని వరుసగా పిలుస్తూ ప్రశ్నించి నప్పటికీ, ఆయన ఏమాత్రం పట్టించుకోకుండా పూజలోనే మునిగిపోయాడు. ఆయన తమతో వచ్చిన పండితుడు కాదని మిగిలిన ప్యాసింజెర్స్ కూడా చెప్పారు. అనంతరంధూపం నుంచి వచ్చే పొగ వల్ల ఏసీ బోగీలోని 'ఫైర్ అలారమ్' మోగే అవకాశం ఉందనీ, పైగా వెలుగుతున్న ప్రమిద వల్ల రైలులో ప్రమాదవశాత్తు నిప్పు అంటుకునే ప్రమాదం ఉందని గట్టిగా హెచ్చరించాడు.ఇదీ చదవండి: రైల్వే ప్లాట్ఫాంమీద పడుకునే స్థాయినుంచి, రూ.1.69 లక్షల కోట్ల కంపెనీ!🚆A video circulating on social media shows a passenger performing prayers on the upper berth of an AC train coach while lighting incense sticks and an oil lamp.A fellow passenger reportedly intervened, explaining that such acts can be dangerous. Smoke may trigger the train's… pic.twitter.com/79SrmBnAdW— Jharkhand Rail Users (@JharkhandRail) July 26, 2026నెటిజన్ల ఆగ్రహంఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు రైల్వే భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు: మత స్వేచ్ఛ వేరు, భద్రత వేరు, ఎవరి నమ్మకాలు, ఆచారాలు వారికి ఉన్నప్పటికీ, వందలమంది ప్రయాణించే ప్రజా రవాణా వ్యవస్థల్లో ఇలాంటి నిప్పుతో కూడిన పూజలు చేయడం అత్యంత ప్రమాదకరమని నెటిజన్లు స్పష్టం చేశారు.ఇదీ చదవండి: ఏడేళ్లు భర్త వేళ్లు కొరుకుతూ...చివరకు ‘ఐ లవ్యూ’ చెప్పాడు!రైల్వే మంత్రిత్వ శాఖ (@RailMinIndia) వెంటనే ఈ విషయంపై దృష్టి సారించి, ఆ వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీని వలన ఏదైనా అగ్నిప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు. ఇది చాలా ప్రమాదకరం. ఇతనిపై భారీగా జరిమానాతోపాటు, రైలు ప్రయాణాలు చేయకుండా నిషేధించి జైలుకు పంపాలని పలువురు కామెంట్ చేశారు.ఈ ఘటనపై రైల్వే అధికారులు విచారణ చేపట్టారు.ఇదీ చదవండి: గర్భిణీ సహా ముగ్గురిపై కత్తులతో దాడి: డ్యూటీ ఆఫీసర్కు హ్యాట్సాఫ్ -
Viral Video: వీడి భక్తి తగలెయ్యా... AC కోచ్ లో అగరుబత్తి.. దీపం..!
-
మీ కుక్క తప్పిపోయి ఐదేళ్ల తర్వాత తిరిగొస్తే ఇలా ఉంటుంది!
వాషింగ్టన్: అమెరికాలోని నెబ్రాస్కా రాష్ట్రానికి చెందిన ఓ కుటుంబం తప్పిపోయిన పెంపుడు కుక్కను ఐదేళ్ల తర్వాత తిరిగి కలుసుకుంది. ఇంటి నుంచి 600 మైళ్లకు పైగా దూరంలో ఉన్న ఇండియానా రాష్ట్రంలోని ఓ ట్రక్ స్టాప్ వెనుక ఆ కుక్క దొరికింది. 2021లో ఇన్మాకులాడా జాక్మన్ కుటుంబం నెబ్రాస్కాలోని లింకన్ పట్టణంలో నివసిస్తున్న సమయంలో వారి పెంపుడు కుక్క ‘‘చాంగ్’’ ఇంటి నుంచి తప్పించుకుంది. నెలల తరబడి చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా దాని ఆచూకీ దొరకలేదు. కొన్నాళ్ల తర్వాత ఆ కుటుంబం ‘‘చె చె’’ అనే మరో కుక్కను తెచ్చుకుని పెంచుకుంటోంది. అయినా ‘‘చాంగ్’’ ఎప్పుడో ఒకరోజు తిరిగి వస్తుందనే ఆశను మాత్రం వదులుకోలేదు."నేను ఇంకా దాని కోసం వెతికేదాన్ని. మా పాత కాలనీకి వెళ్లి, ఎవరైనా దాన్ని తీసుకుని నడిపిస్తున్నారా, లేక ఎక్కడైనా తిరుగుతోందా అని చూసేవాళ్లం" అని జాక్మన్ స్థానిక మీడియా సంస్థ డబ్ల్యూకేఆర్సీకి తెలిపారు. ఐదేళ్ల తర్వాత జాక్మన్కు ఆమె స్నేహితురాలు సామాజిక మాధ్యమంలో వచ్చిన ఓ పోస్టును పంపింది. లింకన్ పట్టణానికి సుమారు 642 మైళ్ల దూరంలో ఉన్న ఇండియానాలోని ఓ ట్రక్ స్టాప్ వెనుక చాంగ్ కనిపించినట్టు అందులో ఉంది.వెంటనే జాక్మన్ హెండ్రిక్స్ కౌంటీ జంతు సంరక్షణ కేంద్రాన్ని సంప్రదించి చాంగ్ తమదేనని తెలిపింది. అయితే ఒక సమస్య ఎదురైంది. చాంగ్కు ఎవరో దానికి మైక్రోచిప్ అమర్చారు. జంతు సంరక్షణ కేంద్రం సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. కొత్త మైక్రోచిప్లో నమోదు అయిన వ్యక్తికి సమాచారం ఇచ్చి, స్పందించేందుకు 3 రోజుల గడువు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ గడువులోగా ఎవరూ ముందుకు రాకపోతే చాంగ్ను జాక్మన్కు అప్పగించవచ్చని చెప్పారు."మరో వ్యక్తి మమ్మల్ని సంప్రదించకూడదని అక్కడి సిబ్బంది అంతా ఆశిస్తూ, ప్రార్థిస్తూ ఉన్నామని చెప్పారు" అని జాక్మన్ గుర్తుచేసుకున్నారు. 3 రోజుల గడువులో ఎవరూ స్పందించలేదు. దీంతో చాంగ్ను మళ్లీ దత్తత తీసుకునేందుకు జాక్మన్కు అనుమతి లభించింది. ఆమె ఇండియానాకు వెళ్లి చాంగ్ను ఇంటికి తీసుకొచ్చింది.జంతు సంరక్షణ కేంద్రం విడుదల చేసిన వీడియోలో.. 5 ఏళ్ల తర్వాత యజమానిని చూసిన చాంగ్ తొలుత అయోమయంలో కనిపించింది. కొద్దిసేపటి తర్వాత జాక్మన్ను హత్తుకుంది. ఆ తర్వాత ‘‘చె చె’’ను కూడా కలుసుకుంది. "ఆశను ఎప్పుడూ వదులుకోకండి. ఐదేళ్ల తర్వాత అయినా మేము చాంగ్ను తిరిగి కనుగొన్నాం" అని జాక్మన్ డబ్ల్యూకేఆర్సీకి తెలిపారు. -
కసి మీదున్న సూర్యకుమార్.. 3 గంటల్లో వెయ్యి బంతులా!
టీమిండియా టీ20 స్పెషలిస్ట్, మాజీ కెప్టెన్ సూర్యకుమార్ కసిగా కనిపిస్తున్నాడు. పేలవ ఫామ్తో జట్టులో చోటు కోల్పోయిన సూర్యకుమార్ రీఎంట్రీ కోసం తెగ కష్టపడుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం ముంబైలోని వాసూ పరన్జేప్ క్రికెట్ అకాడమీలో సూర్యకుమార్ మూడు గంటల పాటు నెట్స్లో సాధన చేశాడు. దాదాపు 3 గంటల పాటు వెయ్యి బంతులు ఎదుర్కొన్న సూర్యకుమార్ వినూత్న షాట్లు ఆడి అలరించాడు. మళ్లీ టీమిండియాలో ఎప్పుడెప్పుడు అడుగుపెడదామా అన్నంతగా సూర్యలో కసి కనిపిస్తుంది. నెట్స్లో చెమటోడ్చిన వీడియోను ఎక్స్లో పంచుకున్న సూర్య.. ‘సండే ఫన్డే. క్విక్ రన్. 3 గంటల పాటు వెయ్యి బంతులు ఆడాను. మంచి ఫీల్ వచ్చింది’ అని క్యాప్షన్ జత చేశాడు. తాజాగా శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో టీమిండియా 3-0తో జింబాబ్వేను క్లీన్స్వీప్ చేసింది. ఇక 35 ఏళ్ల సూర్యకుమార్ టీమిండియా కెప్టెన్గా 2026 టీ20 ప్రపంచకప్ను అందుకున్నాడు. అయితే బ్యాటర్గా విఫలమవుతూ వచ్చిన సూర్యకుమార్ ఐపీఎల్లోనూ పేలవ ప్రదర్శన కనబరిచాడు. దీంతో టీ20 కెప్టెన్సీ పదవిని కోల్పోయిన సూర్యకుమార్కు జట్టులోనూ చోటు ప్రశ్నార్థకంగా మారింది. అయితే సూర్య టీమిండియాలో చోటు కోల్పోయిన తర్వాత మహారాజ ట్రోఫీలో తన బ్యాటింగ్తో అదరగొట్టాడు. అప్పటినుంచి టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలని ఉవ్విళ్లూరుతున్న సూర్యకుమార్ కఠోర సాధన కొనసాగిస్తున్నాడు. Sunday was fun. Quick run 🏃🏾 Batted around 1000 balls for 3 hours. Felt good 💪 pic.twitter.com/x6wH9Ebpmv— Surya Kumar Yadav (@surya_14kumar) July 26, 2026Read: మీరాబాయి స్వర్ణ పతకం వెనుక కన్నీటిగాథ! -
మహిళతో అసభ్య ప్రవర్తన.. బస్సులోనే దాడి
బనశంకరి: బెంగళూరు బీఎంటీసీ బస్సుల్లో గొడవలు కొత్త కాదు. ఇప్పుడో రగడ వైరల్ అయ్యింది. ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడని యువతితో పాటు బస్సు డ్రైవరు అతన్ని చితకబాదారు. సంపిగేహళ్లి పోలీసులు సుమోటోగా కేసు నమోదుచేశారు. వివరాలు.. ఈ నెల 24వ తేదీ మద్యాహ్నం 12:42 సమయంలో బీఎంటీసీ బస్సు మాన్యతా టెక్పార్కు వైపు వెళ్తోంది. ఓ యువతిని నిందితుడు కావాలనే తాకాడని ఆమె కోపంతో అతన్ని కేకలు వేసింది. తరువాత డ్రైవరుకు చెప్పింది. దీంతో ఇద్దరూ కలిసి అతన్ని బస్సులో మూలకు తోసి బట్టలు విప్పి చితకబాదారు. డ్రైవరు కాలితో ఎడాపెడా కొట్టాడు. చివరకు అతడు బస్సులో నుంచి దిగి పారిపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సదరు వ్యక్తిని మతిస్థిమితం లేనివానిగా భావిస్తున్నారు. తరచూ సిటీ బస్సుల్లో ప్రయాణిస్తూ ఆకతాయిగా ప్రవర్తిస్తుంటాడని సమాచారం. యువతి ధైర్యంగా అతనికి గుణపాఠం చెప్పిందని కొందరు నెటిజన్లు అన్నారు. మరికొందరు అతన్ని అంత ఘోరంగా కొట్టడం సరికాదని పేర్కొన్నారు. ఆ వ్యక్తిని పట్టుకుని విచారించడానికి పోలీసులు గాలింపు చేపట్టారు.A woman faced sexual harassment by a copassenger on a #BMTC bus near Manyata Tech Park in #Bengaluru.After she confronted the accused, the BMTC driver locked the bus doors to stop him from fleeing and assaulted him. A video of the incident has gone viral. #Karnataka pic.twitter.com/MhXMNMZs4e— Imran Khan (@KeypadGuerilla) July 25, 2026 -
రాజీనామా ఖుషీ.. హుషారుగా స్టెప్పులేసిన సీజేపీ లీడర్స్
నీట్ పేపర్ లీకేజీ.. విద్యార్థుల ఆత్మహత్యలు.. మంత్రి రాజీనామా అంశంతో ఆందోళనలు చేపట్టిన కాక్రోచ్ జనతా పార్టీ తమ డిమాండ్లు నెరవేరడంతో రిలాక్స్ అయ్యింది. గత రాత్రి ఓ ఫైవ్స్టార్ హోటల్లో ఆ పార్టీ నేతలు, పలువురు స్టూడెంట్స్ గ్రాండ్గా పార్టీ చేసుకున్నట్లు తెలుస్తోంది. రకరకాల వంటకాలతో.. డీజే పాటలతో హుషారెత్తించే స్టెప్పులేశారు. అయితే.. ఖుషీగా వాళ్లు చేసిన ఆ పార్టీపై ఇప్పుడు దుమారం రేగుతోంది.కొందరు అమ్మాయిలు(సీజేపీ ప్రతినిధులు/నీట్ అభ్యర్థులు?!) జోష్గా డ్యాన్సులు చేయగా.. అటు చర్చల్లో పాల్గొన్న అశుతోష్ రాంకా, సౌరబ్ దాస్ ఇద్దరూ కూడా హుషారుగా వాళ్లతో కలిసి స్టెప్పులు కలిపారు. అందరూ కలిసి హోటల్లో సంబురాల్లో మునిగిపోయారు. మరోవైపు.. సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే ఓ మూలన కూర్చుని పార్టీ చూస్తున్నట్లు వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. రాజీనామా సందర్భంగా ఖుషీ అంటూ ఆ పార్టీ అధికారిక ఎక్స్ ఖాతా నుంచే ఈ వీడియో(Resignation की ख़ुशी) పోస్ట్ కావడం గమనార్హం.Resignation की ख़ुशी 🥹 pic.twitter.com/QT4Y5j4cy6— Cockroach Janta Party (@CJP_for_India) July 26, 2026అయితే ఈ వీడియోపై పలువురు అభ్యంతరాలు.. ఇంకొందరు తిట్టిపోస్తున్నారు. నిరసనల్లో పాల్గొన్న కొందరు విద్యార్థులకు పార్లమెంట్ మార్చ్ సందర్భంగా గాయాలైన సంగతి తెలిసిందే. వాళ్లు కోలుకోకముందే కాక్రోచ్ నాయకత్వంలో ఉన్నవాళ్లు ఇలా పార్టీ చేసుకోవడానికి కొందరు తీవ్రంగా తప్పు బడుతున్నారు. నీట్ కారణంగా దేశవ్యాప్తంగా పలువురు అభ్యర్థులు బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో అసలు ఉద్యమం ఉద్దేశాన్ని నీరుగార్చేలా వీళ్ల తీరు ఉందంటూ మండిపడుతున్నారు.అదే సమయంలో యాంటీ నెటిజన్లు మాత్రం.. ఇది కాక్రోచ్ల నిజ స్వరూపం అంటూ మండిపడుతున్నారు. నిరసనల్లో ఆందోళనకారులకు అరటిపండ్లు, బ్రెడ్ పకోడీలు పంచుతూ గుర్తింపు పొందిన జునైద్ అనే యువకుడి గురించి కూడా పోస్టులు వైరల్ అవుతున్నాయి. ‘అభిజీత్ దీప్కే నా కాల్స్కు స్పందించడం లేదు’.. అంటూ అతను కంటతడి పెట్టిన ఓ వీడియో బాగా వైరల్ అవుతోంది. షాదాబ్ సైఫీ సైతం ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఆ జోష్ పార్టీలో కనిపించకపోవడంతో.. ఇలాంటి కొందరిని కేవలం తమ అవసరాలే దీప్కే వాడుకున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక వాంగ్చుక్ ప్రస్తావన లేకుండానే.. గత రెండ్రోజులుగా సీజేపీ వ్యవహరిస్తుండడమూ విమర్శలకు తావిస్తోంది. మరోవైపు.. అభిజీత్ దీప్కే తనకు టైఫాయిడ్ సోకిందని ట్రీట్మెంట్ ఫొటోలను వైరల్ చేశాడని.. కానీ సాయంత్రానికే ఇంటికి దగ్గర్లో ఉన్న హోటల్లో పన్నీర్ టిక్కా తింటూ ఎంజాయి చేస్తున్నాంటూ ఇంకొందరు మండిపడుతున్నారు. అయితే ఇటు ఈ యువతకు మద్దతుగా పోస్టులు చేసేవాళ్లు కొందరు కనిపిస్తున్నారు. -
షాకింగ్ వీడియో.. పడుకున్న రైతు షర్టులో దూరిన పాము
-
కామన్వెల్త్ గేమ్స్లో అపశ్రుతి.. జిమ్నాస్టిక్స్లో భయానక దృశ్యం!
కామన్వెల్త్ గేమ్స్లో అపశ్రుతి చోటుచేసుకుంది. జిమ్నాస్టిక్స్ ఫైనల్ ఈవెంట్ సందర్భంగా ఇంగ్లండ్ జిమ్నాస్ట్ గాబ్రియెల్ లాంగ్టన్ హారిజంటల్ బార్పై పట్టు కోల్పోయి తలకిందులుగా మ్యాట్పైకి జారిపడ్డాడు. దీంతో అతడి మెడకు, తలకు తీవ్ర గాయాలయ్యాయి. సపోర్ట్ స్టాఫ్ వచ్చి లాంగ్టన్కు అత్యవసర చికిత్స అందించారు. Photo Credit: CWG 2026 Twitterఆ తర్వాత లాంగ్టన్ లేవడానికి ఇబ్బంది పడడంతో స్ట్రెచర్పై ఆసుపత్రికి తరలించారు. లాంగ్టన్ కిందపడడంతో కాసేపు భయానక వాతావరణం నెలకొనడంతో పోటీలు నిలిపివేశారు. ఇప్పటికే గాయంతో ఆరుసార్లు ఒలింపిక్ విజేత మాక్స్ విట్లాక్ దూరమవ్వడంతో అతడి స్థానంలో లాంగ్టన్కు అవకాశమిచ్చారు.వరుసగా నాలుగో కామన్వెల్త్ గేమ్స్ పురుషుల టీం టైటిల్ కోసం ఇంగ్లండ్ ప్రయత్నిస్తున్న సమయంలో చివరి రౌండ్లో లాంగ్టన్ గాయపడడం ఇంగ్లండ్ను దెబ్బతీసింది. ఆ తర్వాత లాంగ్టన్ లేకుండానే పోటీలు పూర్తి చేసిన ఇంగ్లండ్ రెండో స్థానంలో నిలిచి వెండి పతకం గెలుచుకోగా, కెనడా, ఆస్ట్రేలియా జట్లు స్వర్ణ, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నాయి. Photo Credit: CWG 2026 Twitterఇక గాబ్రియెల్ లాంగ్టన్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని ఇంగ్లండ్ టీమ్ ప్రకటించింది. అతడి పరిస్థితి మెరుగ్గానే ఉందని, కోలుకోవడానికి కాస్త సమయం పడుతుందని తెలిపింది. లాంగ్టన్ గాయాలతో పోటీకి దూరమైనప్పటికీ, తన జట్టు సిల్వర్ మెడల్ సాధించడంతో సభ్యులతో కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని ఆశిస్తున్నట్లు ఇంగ్లం్ టీమ్ వెల్లడించింది. 🚨NEWS: English gymnast Gabriel Langton has been rushed to hospital after suffering a major fall during the Commonwealth Games pic.twitter.com/bXsMusO5fF— Basil the Great (@BasilTheGreat) July 25, 2026చదవండి: ఆటలోనే కాదు ఆ విషయంలోనూ మెస్సీ కింగే! -
ముగ్గురు అక్కాచెల్లెళ్లను పెళ్లాడిన యువకుడు
-
విచారం వద్దు... అవి ఘోస్ట్ జాబ్స్ అయినా కావచ్చు!
అద్భుతమైన ప్రతిభ ఉన్నప్పటికీ చాలామందికి ఉద్యోగం దొరకడం కష్టం కావచ్చు. దీనికి కారణం వారికి సరైన మార్గదర్శకత్వం లేకపోవడమే. ఈ నేపథ్యంలో దేవ్శ్రీ అనే టెకీ ‘జాబ్ సెర్చ్ టిప్స్’పై ఇన్స్టాగ్రామ్లో చేసిన పోస్ట్ వైరల్గా మారింది.‘జాబ్ సెర్చ్ టిప్స్ తెలుసుకోవడానికి నాకు చాలాకాలం పట్టింది. మీరు మాత్రం త్వరగా నేర్చుకుంటారు’ అంటున్న దేవ్శ్రీ శాలరీ... రెండు కోట్లు! మన దేశంలో ఒక కంపెనీలో సాధారణ జీతం నుండి అమెరికాలో అధిక ఆదాయం గల ఉద్యోగాన్ని ఎలా సంపాదించిందో వివరిస్తూ దేవ్శ్రీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టింది. పుణెలో డిగ్రీ చేసిన దేవ్శ్రీ ఒక చిన్న కంపెనీలో చేరి తన కెరీర్ ప్రారంభించింది. అయితే అక్కడే ఉండిపోవాలనుకోలేదు.ఒక్కో మెట్టు ఎక్కుతూ పెద్ద కంపెనీలో ఉద్యోగం సాధించింది. ప్రస్తుతం ఆర్థికంగా ఉన్నతస్థితిలో ఉంది. ‘నేను ఈ స్థితిలో ఉంటానని కలలో కూడా ఊహించలేదు’ అంటున్న దేవ్శ్రీ నిరుద్యోగులకు, తాము చేస్తున్న ఉద్యోగం నుంచి మరో మెట్టు ఎక్కాలనుకునేవారికి సోషల్ మీడియా వేదికగా సలహాలు ఇచ్చింది.వృత్తిపరమైన తన ఎదుగుదలను స్టెప్ బై స్టెప్ వివరించడమే కాదు...ఎవరైనా సరే తమ కెరీర్ను వేగవంతం చేసుకోవడానికి అనుసరించదగిన వ్యూహాల గురించి కూడా ప్రస్తావించింది.‘ఆ వ్యూహాలను అర్థం చేసుకోవడానికి నాకు మూడు సంవత్సరాలు పట్టింది. కాని మీరు వాటిని మూడు నెలల్లోనే అమలు చేయవచ్చు’ అంటుంది దేవ్శ్రీ. కేవలం ఉద్యోగ దరఖాస్తుపై మాత్రమే ఆధారపడకుండా రిక్రూటర్ల దృష్టిలో పడడం గురించి ఆమె ప్రస్తావించింది. ‘లింక్డ్ ఇన్ ద్వారా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోమని మీకు చాలామంది చెబుతుంటారు.అయితే మీలోని ప్రతిభను గ్రహించి రిక్రూటర్లే మిమ్మల్ని సంప్రదిస్తే అది మీకు అదనపు ప్రయోజనం. మీరు దరఖాస్తు చేసుకునే ఉద్యోగాలలో దాదాపు 30 శాతం ఘోస్ట్ జాబ్స్. నిజానికి ఆ ఉద్యోగాలు ఖాళీగా ఉండవు. అయితే ఉద్యోగావకాశం రాకపోవడంతో తనను తిరస్కరించారని చాలామంది భావిస్తుంటారు’ అంటుంది దేవ్శ్రీ.రెజ్యూమ్ అనేది ఎలా ఉండాలి? ఇంటర్వ్యూ వ్యూహాలేమిటి?.... మొదలైన వాటి గురించి తన పోస్ట్లో ప్రస్తావించింది దేవ్శ్రీ. ‘ఏ కంపెనీకైతే ఇంటర్వ్యూకు వెళుతున్నామో, ఆ కంపెనీ గురించి అన్ని కోణాలలో తెలుసుకోవడం, ఆ కంపెనీ ఎదుర్కొనే సమస్యలపై అవగాహన ఉండడం అనేది మనకు ఉపకరిస్తుంది’ అని చెబుతోంది దేవ్శ్రీ.ఘోస్ట్ జాబ్స్ అంటే?ఘోస్ట్ జాబ్స్ లేదా ఫాంటమ్ జాబ్స్ అంటే... తక్షణమే భర్తీ చేయాలనే ఉద్దేశం లేకుండా కంపెనీలు ఆన్లైన్లో ఇచ్చే ఉద్యోగ ప్రకటనలు. ప్రతిభావంతులైన ఉద్యోగులను తీసుకుంటున్నట్లు భ్రమ కలిగించడం. పోటీ కంపెనీల జీతాల గురించి అధ్యయనం చేయడం... మొదలైన వ్యూహాత్మక కారణాల వల్ల ఘోస్ట్ జాబ్స్ లేదా ఉత్తుత్తి జాబ్స్ను కంపెనీలు సృష్టిస్తుంటాయి. -
రాజుల కాలం కాదు.. ముగ్గురంటే ఎలా బాసూ!
“భయ్యా.. పెళ్లి చేసుకున్నావా?”“అవును..”“కంగ్రాట్స్.. సంతోషంగా ఉన్నావా?”“అదే అర్థం కావడం లేదు బాబూ.. సంతోషమో.. సవాలో!”“అదేందన్నా.. ఎందుకలా అంటున్నావ్?”“ఒక్కరిని మెప్పించడమే కష్టంగా ఉంటుంది కదా.. అలాంటిది ముగ్గురి మనసులు గెలవాలంటే రోజులో 24 గంటలు సరిపోతాయా చెప్పు!”ఇది ఏదో సినిమా కథ కాదు.. ఉత్తరప్రదేశ్లో వైరల్గా మారిన ఓ పెళ్లి కథ. సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ పరిచయమైన ఓ యువకుడు.. ఆ పరిచయమే చివరకు పెళ్లి బంధంగా మారిందని చెబుతున్న ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఒకే వ్యక్తిని వివాహం చేసుకున్నారన్న వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో.. ఈ పెళ్లి నిజమేనా? చట్టబద్ధమేనా? అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. View this post on Instagram A post shared by Rajput girl (@ak_rajput9990)కెమెరామెన్ నుంచి భర్త వరకు..ఉత్తరప్రదేశ్లోని అమ్రోహా జిల్లాకు చెందిన సరోజ్, సావిత్రి, సంతోష్ సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లుగా పనిచేస్తున్నారు. వారి వీడియోలకు కెమెరామెన్గా పనిచేసిన వికాస్ అలియాస్ విక్కుతో పరిచయం ఏర్పడింది. మొదట రీల్స్లో భర్త పాత్ర పోషించిన వికాస్.. చివరకు నిజ జీవితంలోనే వారి జీవిత భాగస్వామిగా మారాడు. పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయటకు రావడంతో ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. మొదట అంతా ఇదేదో సోషల్ మీడియా స్టంట్ అనుకున్నారు. కానీ ముగ్గురు సోదరీమణులు స్వయంగా స్పందిస్తూ.. “ఇది నిజమైన పెళ్లి. మా ఇష్టంతో తీసుకున్న నిర్ణయం” అని తెలిపారు.విడిపోవడం ఎందుకని..ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. ఇద్దరు సొంత రక్తం. మరొకరు.. ఆ ఇంట్లోనే పెరిగారు. చిన్నప్పటి నుంచి ముగ్గురం కలిసే పెరిగామని చెబుతున్నారు. వేర్వేరు కుటుంబాల్లోకి వెళ్లిపోవడం ఇష్టం లేకే ఒకే వ్యక్తిని వివాహం చేసుకున్నామని వెల్లడించారు. “మేమంతా పెద్దవాళ్లమే. మా జీవితంపై నిర్ణయం తీసుకునే హక్కు మాకు ఉంది” అంటూ వారు స్పష్టం చేశారు. వికాస్ కూడా వారి నిర్ణయానికి అంగీకరించాడని, అందరూ కలిసి ఉండాలనే ఉద్దేశంతోనే ఈ వివాహం జరిగిందని తెలిపారు. సరే.. మనసులు కలిశాయి.. మరి చట్టం?ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. “ప్రేమకు హద్దులు ఉండవు” అని వారు చెబుతున్నా.. చట్టానికి మాత్రం కొన్ని పరిమితులు ఉంటాయి. భారతీయ చట్టాల ప్రకారం హిందూ వివాహ చట్టం ఒక వ్యక్తికి ఒకేసారి ఒక భార్య ఉండే విధానాన్ని గుర్తిస్తుంది. అంటే.. ఇలాంటి వివాహం చట్టపరంగా చెల్లుబాటు అవుతుందా? అధికారికంగా నమోదు జరిగిందా? అన్న అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కూడా వివరాలు సేకరిస్తున్నారు. View this post on Instagram A post shared by Rajput girl (@ak_rajput9990)“రాజుల కాలం వేరు.. ఇప్పటి చట్టాలు వేరు”ఈ పెళ్లిపై ప్రశ్నలు రావడంతో ముగ్గురు సోదరీమణులు పాతకాలపు ఉదాహరణలు చెబుతున్నారు. రాజులకు ఒకటి కంటే ఎక్కువ మంది భార్యలు ఉండేవారని పేర్కొంటున్నారు. కానీ న్యాయ నిపుణుల ప్రకారం.. చారిత్రక ఆచారాలు, ప్రస్తుత చట్టాలు ఒకేలా ఉండవు.రీల్ లైఫ్ బాగుంది.. రియల్ లైఫ్ ఎలా?సోషల్ మీడియాలో ఓ వీడియోకు లక్షల వ్యూస్ రావచ్చు. కానీ నిజ జీవితంలో ఒక బంధాన్ని కొనసాగించాలంటే ప్రేమతో పాటు బాధ్యత, అవగాహన కూడా అవసరం. ఇప్పటివరకు ఈ కథలో అందరి మాట ఒక్కటే.. “మేము సంతోషంగా ఉన్నాం. సోషల్ మీడియా ఆదాయంతో కుటుంబాన్ని నడిపిస్తున్నాం. మొగుడి పేరిట కాస్త భూమి ఉంది” అని. కానీ అసలు పరీక్ష మాత్రం ముందుంది. రీల్లో కలిసి కనిపించడం సులువు.. రియల్ లైఫ్లో కలిసి నడవడమే అసలు సవాల్!. -
మళ్లీ వస్తే డ్రగ్స్ కేసు పెడ్తా.. CJP లీడర్స్ కు పోలీస్ వార్నింగ్
-
నో లగ్జరీ కార్లు, నో బ్రాండెడ్ బట్టలు..! వైరల్గా ఆ జంట ఆర్థిక సూత్రాలు..
ప్రస్తుతం ఆన్లైన్ షాపింగ్, ఆఫర్ల పుణ్యమా అని..అవసరం ఉన్నా లేకపోయినా..కొనడం ఒక వ్యసనంగా మారిందని చెప్పాలి. దాంతో కొన్ని కుటుంబాలు ఆర్థిక సమస్యల్లో చిక్కుకుని సతమవుతున్నాయి కూడా. అయినా కూడా ఈ జాడ్యం వదిలించుకోలేరు. చూడగానే కంటికి నచ్చితే చాలు కొనేయాల్సిందే అన్న మనస్తత్వం ఉంటే ..ఆర్థిక కష్టాలు కూడా ఆ రేంజ్లోనే ఉంటాయని చెబుతుంటారు ఆర్థిక నిపుణులు. ఇప్పుడిదంతా ఎందుకంటే ఓ జంట మాత్రం ఆర్థికంగా బేషుగ్గా ఉండాలంటే ఈ విధానం ఫాలో అయితే చాలు అంటూ చెప్పిన ఆర్థిక సూత్రాలు నెట్టింట తెగ వైరల్గా మారాయి. వాళ్లు వేటి మీద పెట్టుబడులు పెడుతున్నారో చూస్తే విస్తుపోతాం కూడా. అంతా విలాసవంతమైన వాటి కోసం చూస్తే..వాళ్లు మాత్రం జీవితానికి కీలకమైన దానిపై పెట్టుబడులు పెడుతూ అందర్నీ ఆలోచింప చేశారు. ఇంతకీ ఆ దంపతులు వేటి మీద పెట్టుబడులు పెడుతున్నారంటే..డబ్బు విషయానికి వస్తే, ప్రతి ఒక్కరికీ వేర్వేరు ప్రాధాన్యతలు ఉంటాయి. కొందరు భవిష్యత్తు కోసం పొదుపు చేసి పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడితే, మరికొందరు తక్షణ ఆనందాల కోసం ఖర్చు చేస్తూ సంతోషంగా ఉండేందుకు ప్రాధాన్యత ఇస్తుంటారు. వర్తమానాన్ని సద్వినియోగం చేసుకోవాంటే నచ్చిన వాటిపై ఖర్చు చేయాల్సందేనన్నది కొందరి వ్యక్తుల నమ్మకం. అయితే చాలామంది రేపటికోసం ప్రణాళిక తోపాటు ప్రస్తుత జీవితాన్ని ఆస్వాదించేలా సమతుల్యతకు పెద్దపీట వేస్తారు. అలానే చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నా మేఘ, శుభమ్లు. ఒక పసిబిడ్డ, ఒక పెంపుడు కుక్క, రెండు పూర్తికాల ఉద్యోగాలతో తమ కుటుంబాన్ని ఎలా నడిపిస్తున్నారో ఇన్స్టాగ్రామ్ వీడియోతో పంచుకుంటూ అందర్నీ ఆకర్షించారు. ఆ దంపతులు అనుసరించే విధానం..అందరికీ నచ్చడం విశేషం. వాళ్లు తమ కుటుంబాన్ని నడిపించేందుకు ఫాలో అవుతున్న ఆర్థిక తత్వం గురించి మాట్లాడారు. తాము హోదాల కంటే సౌకర్యానికి, జీవన నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. విలాసవంతమైన కార్లు, డిజైనర్ దుస్తులు లేదా ఖరీదైన ఆభరణాలు కొనడానికి బదులుగా, తమ కుమార్తెతో ఎక్కువ సమయం గడిపే నివాస సముదాయంపై పెట్టుబడులు పెట్టేందుకు ఇష్టపడతామని అన్నారు. ప్రతి వేసవిలో ఒక అంతర్జాతీయ విహారయాత్రను ప్లాన్ చేసుకోవడం, ఏడాదిలో అనేకసార్లు తమ ప్రాంతంలోని విహారయాత్రాలు చేయడం, ముఖ్యంగా పండుగల సమయంలో తల్లిదండ్రల ఇంటికి వెళ్లడం వంటివి ఒక నియమంగా పెట్టుకుంటామని చెప్పారు. ఇక ఆరోగ్యం, ఫిట్నెస్ అవసరమైన పెట్టుబడులుగా పరిగనిస్తామని అన్నారు. అందుకే ఆరోగ్యోకరమైన ఆహారం, జిమ్ సభ్యుత్వం, ఆరోగ్య సంరక్షణపై ఖర్చులు పెడతామని అన్నారు. ప్రతి ఏడాది పెట్టుబడులను పెంచుతూ..పెట్టుబడి ఫోర్టఫోలియో వృద్ధికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. చివరగా స్వల్పకాలిక, దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకోవడం ద్వారా సంపదను నిర్మించడంపై దృష్టి పెడతామని చెప్పారు. అలాగే తాము తమ ఖర్చుల, ఆర్థిక బాధ్యతలను పంచుకుంటామని అన్నారు. మేఘా అద్దె, యుటిలిటీ బిల్లులు, గృహ సిబ్బంది జీతాలు వంటి స్థిరమైన నెలవారీ ఖర్చులు చూసుకుంటుండగా, శుభం కిరాణా సామాగ్రి, ప్రయాణం, క్రెడిట్తో సహా మారే ఖర్చులను చూసుకుంటాడని అన్నారు. ఈ ఆర్థిక నియమాలు అందరికీ వర్తించేవని చెప్పడం లేదని కేవలం ఆర్థికంగా ధీమాగా ఉండేందుకు, ఒక చిన్న కుటుంబానికి అత్యంత అనుకులమైన ఒక విధానమని చెప్పారు. View this post on Instagram A post shared by Megha & Shubham | Couple | Fitness journey (@the12absproject) (చదవండి: వెయ్యి ఇంజెక్షన్లు, రెండు గర్భస్రావాలు..! ఐవీఎఫ్ జర్నీపై నటి షాకింగ్ వ్యాఖ్యలు) -
ఆమె విద్యార్థి కానే కాదు!
జోరున వర్షం కురుస్తోంది.. చుట్టూ పోలీసులు ఉన్నారు.. ఎదురుగా ఆందోళనకారులను తీసుకెళ్తున్న పోలీస్ వ్యాన్ నెమ్మదిగా ముందుకు కదులుతోంది. లాఠీ దెబ్బలకు భయపడి యువకులంతా చెల్లాచెదురైపోతున్నారు. హఠాత్తుగా దూసుకొచ్చిన ఓ యువతి.. ఆ వ్యాన్కు అడ్డుగా నిలబడింది. ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకుండా తన నిరసనను వ్యక్తం చేసింది. ఆ ఒక్క క్షణం.. ఆమె ధైర్యం.. ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.నీట్ సహా పోటీ పరీక్షల అవకతవకలకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు.. ఢిల్లీ నుంచి మిగతా రాష్ట్రాలకు విస్తరించాయి. ఈ క్రమంలో ముంబైలో జరిగిన ఆందోళనల్లో ఓ యువతి చూపించిన తెగువ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. విమర్శకులను పక్కనపెడితే.. ఆమె చూపిన ధైర్యం పలువురి ప్రశంసలు అందుకుంటోంది. విద్యార్థులను తరలిస్తున్న పోలీస్ వాహనానికి అడ్డుగా నిలిచిన ఆమె వీడియో వైరల్గా మారింది.“వాళ్లు విద్యార్థులు.. వాళ్ల గొంతు వినాలి”బుధవారం దాదర్లోని శివాజీ పార్క్ సమీపంలో జరిగిన నిరసనల్లో రిహియా యాదవ్ పాల్గొన్నారు. విద్యార్థులను అదుపులోకి తీసుకుని తరలిస్తున్న పోలీస్ వ్యాన్ను ఆమె వర్షంలో నిలబడి అడ్డుకున్నారు. హూడీ, క్యాప్ ధరించిన ఆమె వ్యాన్ ముందు నిలబడగా.. చుట్టూ ఉన్న పలువురు ఆమెకు మద్దతుగా నినాదాలు చేశారు.ఈ ఘటనపై రిహియా మాట్లాడుతూ.. ‘‘పోలీసులు తమ బాధ్యతను సరిగా నిర్వర్తించకపోతే.. ప్రజల బాధ్యతను ప్రజలమే తీసుకోవాల్సి వస్తుంది’’ అని వ్యాఖ్యానించారు. తాను విద్యార్థిని కాకపోయినా.. విద్యార్థుల పోరాటానికి మద్దతుగా నిలుస్తున్నానని స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై జరిగిన పోలీసుల చర్య సరైంది కాదని ఆమె అన్నారు.Meet Rhiya Ahir [IG: rhiyaahir]👏One fearless young woman stood in front of a police van during the Mumbai student protests, refusing to back down.Courage can't be bought. Justice can't be silenced. Salute to her. 🫡🫡 pic.twitter.com/c9oAvhQPeq— زماں (@Delhiite_) July 22, 2026ఒక్క అడుగు.. ఓ సందేశంరిహియా చేసిన పని కేవలం ఓ నిరసన చర్యగా మాత్రమే కాకుండా.. మహిళల ధైర్యానికి ప్రతీకగా మారింది. సాధారణంగా ఆందోళనల్లో మహిళల పాత్రపై ఎన్నో చర్చలు జరుగుతుంటాయి. కానీ రిహియా మాత్రం “ప్రశ్నించేందుకు ధైర్యం ఉంటే మార్పు సాధ్యమే” అనే సందేశాన్ని ఇచ్చారు. ఆమె వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో పలువురు ఆమెను అభినందించారు. కొందరు ఆమెను “ముంబై హీ(షీ)రో”గా అభివర్ణించారు. ప్రముఖ హాస్యనటుడు రోహన్ జోషి కూడా ముంబై యువత నిరసన తీరును ప్రశంసిస్తూ పోస్టు చేశారు.ఎవరీ రిహియా యాదవ్?రిహియా యాదవ్ కేవలం నిరసనకారిణి మాత్రమే కాదు. ఆమె ఓ నటి, మోడల్, వ్యాపారవేత్తగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె సోషల్ మీడియా ప్రొఫైల్ ప్రకారం.. మ్యూజిక్ వీడియోల్లో నటించారు. అంతేకాకుండా చేతితో తయారు చేసే దుస్తుల కోసం ‘రిహియాసత్’ పేరుతో ఓ వ్యక్తిగత బ్రాండ్ను నిర్వహిస్తున్నారు. సృజనాత్మక రంగంలో తనదైన ముద్ర వేస్తూనే.. సామాజిక అంశాలపై కూడా స్పందించడం ఆమె ప్రత్యేకతగా నిలుస్తోంది.మహిళా సాధికారతకు ఓ ప్రతీకగా..మహిళా సాధికారత అంటే కేవలం అవకాశాలు పొందడం మాత్రమే కాదు.. అవసరమైన సమయంలో తన అభిప్రాయాన్ని ధైర్యంగా వ్యక్తం చేయడం కూడా. రిహియా యాదవ్ ఘటన అదే విషయాన్ని మరోసారి గుర్తు చేసింది. ఒక మహిళ ముందుకు వచ్చి నిలబడితే.. అది కేవలం ఒక నిరసన కాదు.. మరెందరికో ధైర్యాన్ని ఇచ్చే సందేశంగా మారుతుందనే దానికి రిహియా ఉదాహరణగా నిలించిందనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. -
వావ్.. ఇలాంటి భర్త ప్రతి అమ్మాయికీ దొరకాలి..
బిడ్డ పుట్టడం తల్లికే కాదు, తండ్రికీ ఎంతో ప్రత్యేకమైన క్షణం. ఇది జీవితంలో అత్యంత అద్భుతమైన అనుభవాల్లో ఒకటి. అయితే ప్రసవ ప్రక్రియ తల్లికి ఎంతో బాధాకరమైనది. ఆ బాధను శరీరంలో ఎన్నో ఎముకలు విరిగిన నొప్పితో పోలుస్తుంటారు. కానీ ప్రేమగా చూసుకునే జీవిత భాగస్వామి ఉంటే ఆ బాధ కూడా తక్కువగా అనిపిస్తుంది. అలాంటి దృశ్యమే ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లోని ఓ ప్రసూతి వార్డులో కనిపించింది. నవజాత శిశువును చూడకముందే, ప్రసవ వేదనను భరించిన తన భార్య వద్దకు ఓ భర్త పరుగెత్తి వెళ్లాడు.ప్రయాగ్రాజ్కు చెందిన ప్రసూతి, స్త్రీరోగ నిపుణురాలు డాక్టర్ ఉమ్ముల్ ఖైర్ ఫాతిమా తన అధికారిక సామాజిక మాధ్యమ ఖాతాలో ఈ వీడియోను పంచుకున్నారు. వీడియోలో డాక్టర్ నవజాత శిశువును చేతుల్లో పట్టుకుని భర్తను గదిలోకి పిలిచారు. సాధారణంగా తండ్రి ముందుగా బిడ్డను ఎత్తుకుంటాడని అందరూ భావిస్తారు. కానీ ఈ వీడియోలో భిన్నంగా జరిగింది.గదిలోకి వచ్చిన ఆ వ్యక్తి, ఆ శిశువును పట్టించుకోకుండా నేరుగా తన భార్య వద్దకు వెళ్లాడు. బిడ్డ గది ప్రవేశద్వారం దగ్గరే ఉన్నా, అతను ముందుగా భార్యను గట్టిగా కౌగిలించుకుని చెంపపై ముద్దు పెట్టాడు. ప్రసవ వేదన నుంచి బయటపడిన ఆమె భావోద్వేగానికి గురైంది. ఇద్దరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తర్వాత ఆ వ్యక్తి డాక్టర్కు ధన్యవాదాలు తెలిపి, తన భార్యతో కలిసి బిడ్డను ప్రేమగా చూసుకున్నాడు. సామాజిక మాధ్యమాల్లో ఆ అతడిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయింది. వేల సంఖ్యలో లైక్లు, కామెంట్లు, షేర్లు వచ్చాయి. ఓ నెటిజన్ స్పందిస్తూ.. "దేవుడా... ఇలాంటి జీవిత భాగస్వామి అందరికీ దొరకాలి" అని పేర్కొన్నాడు. Instagramలో ఈ పోస్ట్ని వీక్షించండి Ummul Khair Fatma (@drnaazfatima) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది -
ఎనిమిదో వింత.. ఫిఫా కప్పుతో వస్తే టమాటలతో సత్కారమా!
ఒక దేశం తరఫున క్రీడాకారులు లేదా జట్లు ఏదైనా చాంపియన్షిప్ లేదా ట్రోఫీలు కొల్లగొడితే సత్కారాలు, సన్మానాలతో హడావిడి చేస్తుంటారు. మన భారత్ కూడా ఇందుకు అతీతమేమి కాదు. కానీ స్పెయిన్లోని ఒక ప్రావిన్స్లో మాత్రం అక్కడి నుంచి ఏ ఆటగాడు ఎంత పెద్ద ఘనత సాధించినా పూలతో స్వాగతాలు, శాలువాలతో సన్మానాలు గట్రా చేయరు. దీనికి బదులుగా అక్కడి సంప్రదాయం ప్రకారం ఆటగాళ్ల బరువుకు సమానంగా టమాటలను ఇచ్చి సత్కరించడం ఆనవాయితీగా వస్తోంది. తాజాగా ఫిఫా గెలిచిన స్పెయిన్ జట్టులో సభ్యులైన మిడ్ఫీల్డర్స్ గావీ, పాబియానా రూయిజ్లను ఇదే తరహాలో సత్కరించడంతో వినూత్న సంప్రదాయం వెలుగులోకి వచ్చింది.ఫిఫా ప్రపంచకప్ చాంపియన్గా నిలిచిన స్పెయిన్ స్వదేశంలో ఘనస్వాగతం లభించింది. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్లో 20 లక్షలకు పైగా అభిమానులు ఒక్కచోట చేరి స్పెయిన్ విజయోత్సవాల్లో ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. 16 ఏళ్ల తర్వాత రెండో ఫిఫా టైటిల్ సాధించిన స్పెయిన్ జట్టు ఆటగాళ్లకు అభిమానులు నీరాజనాలు పట్టారు. దీనికి సంబంధించిన సెలబ్రేషన్ వీడియోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరలయ్యాయి. అయితే స్పెయిన్ మిడ్ ఫీల్డర్స్ ఫాబియన్ రూయిజ్, పాబ్లో గవీరా (గవీ)లకు తమ ఫ్రావిన్స్ అయిన లాస్ పలాసియోస్ వై విల్లాఫ్రాంకా పాలకమండలి కూడా వినూత్నరీతిలో స్వాగతం పలికింది. ఆటగాళ్ల బరువుకు సమానంగా టమాటాలను వారికి అందించడం వైరల్గా మారింది.పురాతన సంప్రదాయం..కాగా ఈ ప్రావిన్స్లో టమాట పంట అధికంగా ఉంటుందట. అందుకే ఆ ప్రావిన్స్ నుంచి ఎవరు ఎలాంటి గొప్ప పనులు లేదా ప్రావిన్స్కు గౌరవం తెచ్చే పనులు చేస్తే టమాటాలను గిఫ్ట్గా అందిస్తారట. ఇలా చేస్తే వారి వ్యాపారం బాగుంటుందని వారి నమ్మకం. తాజాగా ఫిఫా ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యులుగా ఉన్న రూయిజ్, గావీలను ఇలా సత్కరించారు. అంతేకాదు వీరి ప్రావిన్స్లోని నగ2రంలో ఉన్న రెండు ఫుట్బాల్ మైదానాలకు వీరిద్దరు పేర్లు పెట్టాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఆ స్టేడియాలకు మారిస్మస్, సాన్ సెబాస్టియన్ అనే పేర్లు ఉన్నాయి. ఫాబియానా రూయిజ్ లాస్ పాలాసియోస్ తరఫున ఫుట్బాల్ కెరీర్ను ప్రారంభించగా, ఆరేళ్ల వయసులోనే గావి లాలి లైయరా బాలోంపె తరఫున ఫుట్బాల్ ఆడడం ప్రారంభించాడు. ఇక ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్లో స్పెయిన్ 1-0 తేడాతో అర్జెంటీనాపై విజయాన్ని సాధించి రెండోసారి ఫిఫా టైటిల్ను అందుకుంది. ▶️Esto ya es tradicional en Los Palacios y Villafranca🍅Gavi y Fabián Ruiz reciben su peso en tomates📹@AlvarooSVQ @ZonaMixta__ pic.twitter.com/PyPKDOk99U— BeSoccer (@besoccer_ES) July 21, 2026 Read: అచ్చొచ్చిన గేమ్స్ తొలగింపు.. కామన్వెల్త్లో భారత్ షెడ్యూల్ ఇదే -
రోడ్డుపక్కన చిన్న ఫుడ్ స్టాల్.. మరీ ఇంతగా సంపాదిస్తున్నాడేంటీ?
రోడ్డుపక్కన ఫుడ్ స్టాల్ నడిపే వ్యక్తి నెలవారీ ఆదాయం గురించి తెలుసుకున్న ఓ అమ్మాయి ఆశ్చర్యపోయింది. ఇందుకు సంబంధించిని వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాంప్రదాయ ఉద్యోగాలపై ఉన్న అభిప్రాయాలు, రోడ్డుపక్కన వ్యాపారం చేసే వారిపై ఉన్న భావనలపై చర్చ మొదలయ్యేలా చేసింది ఈ వీడియో. ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేసిన వీడియోలో ఒక డిజిటల్ కంటెంట్ క్రియేటర్ చిరుతిళ్లు అమ్మే ఫుడ్ స్టాల్ను సందర్శించింది. అతను నెలకు సుమారు రూ.1.5 లక్షలు సంపాదిస్తున్నాడని తెలుసుకుని ఆమె ఆశ్చర్యపోయింది. తన జీతం మాత్రం చెప్పుకునే స్థాయిలో లేదని సరదాగా చెప్పింది."రోడ్డుపక్కన బండి పెట్టి అమ్మితే ఏమి వస్తుంది? అని అనుకునే వారు ఈ వీడియో చూసి తమ ఆలోచన మార్చుకోవాలి" అని డిజిటల్ కంటెంట్ క్రియేటర్ కోమల్ నేగి ఇన్స్టాగ్రామ్లో రాసింది. వీడియో ప్రారంభంలో కోమల్ నేగి రోడ్డుపక్కన ఉన్న ఒక ఫుడ్ స్టాల్ను చూపించింది. అక్కడ ఒక వ్యక్తి మ్యాగీ, ఛోలే-కుల్చే వంటి వంటకాలు అమ్ముతున్నాడు. అతనితో మాట్లాడిన సమయంలోనే నెలకు ఎంత సంపాదిస్తున్నాడో చెప్పాడు.సోషల్ మీడియాలో స్పందన ఈ వీడియో చూసిన చాలామంది నవ్వు ఎమోజీలతో స్పందించారు. ఒకరు "అతను నాకు ఉద్యోగం ఇస్తాడా?" అని కామెంట్ చేశారు. ఇంకొకరు "ఆదాయపు పన్ను లేదు, అద్దె లేదు" అని పేర్కొన్నారు. ఇంకొకరు "అతను కష్టమైన శారీరక శ్రమ చేస్తున్నాడు. నువ్వు చేయడం లేదు. ఈ పోలిక సరైంది కాదు" అని రాశారు. View this post on Instagram A post shared by Komalnegi🦋 (@bykomal_raw) -
ఎవరీ డాక్టర్ దీప్తి శర్మ? వైద్య విద్యలో ఏకంగా 19 పతకాలు..
గోల్డె మెడలిస్ట్ గురించి విని ఉంటారు గానీ ఏకంగా ఇన్ని గోల్డ్ మెడల్స్ సాధించిన వాళ్లను ఉండరు. అత్యంత అరుదు. అలాంటి అరుదైన ఘనతను సాధించింది. ఉత్తరప్రదేశ్కు చెందిన యువ డాక్టర్. వైద్య విద్యలోనే ఇన్ని పతకాలు సాధించడం విశేషం. డాక్టర్ కావాలన్న చిన్న నాటి కోరికను సాకారం చేసుకోవడమే కాదు..వైద్య విద్యను అభ్యసిస్తున్న కాలేజీకే గర్వకారణంగా నిలిచేలా ప్రతిభను చాటుకుని ప్రశంసలందుకుంటోందామె.ఆ అమ్మాయే ఉత్తరప్రదేశ్లోని మజఫర్పూర్కు చెందిన రిటైర్డ్ ఎయిర్ఫోర్స్ అధికారి కుమార్తె దీప్తి శర్మ. ఇటీవలే కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ (కేజీఎంయూ) నుంచి వైద్య విద్యను పూర్తి చేసిన యువ పట్టభద్రురాలు. ఆ ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమంలో, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఉత్తర ప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్ ఇతర ప్రముఖుల సమక్షంలో మొత్తం 19 మెడల్స్ అందుకుంది. ఇన్ని పతకాలు ఆమెనే ఎలా వరించాయంటే..ఎంబీబీఎస్ ఫైనల్ ప్రొఫెషనల్ పరీక్షలో అత్యధిక మార్కులు సాధించినందుకు ప్రతిష్టాత్మకమైన హెవెట్ గోల్డ్ మెడల్, అన్ని ఎంబీబీఎస్ ప్రొఫెషనల్ పరీక్షలలో అత్యధిక మొత్తం మార్కులు సాధించినందుకు ఛాన్సలర్ గోల్డ్ మెడల్, అన్ని MBBS పరీక్షలలో అత్యధిక సంఖ్యలో గౌరవాలు, సర్టిఫికేట్లు పొందినందుకు యూనివర్సిటీ ఆనర్స్ గోల్డ్ మెడల్తో సహా మొత్తం 19 పతకాలను సాధించింది. వాటిలో 11 బంగారు పతకాలే.అంతేగాదు విశ్వవిద్యాలయ చరిత్రలోఆ పతకాలలో హెవెట్ గోల్డ్ మెడల్, ఛాన్సలర్ గోల్డ్ మెడల్ రెండింటిని గెలుపొందిన ఏడవ విద్యార్థిగా నిలవడం విశేషం. ఈ మేరకు దీప్తి మాట్లాడుతూ..గడిపిన ప్రత గంట కష్టానికి దక్కిన ప్రతిఫలంగా పేర్కొందామె. ఇన్ని పతకాలు గెలుపొందడం కన్నా.. పేరెంట్స్ పొందుతున్న సంతోషమే తనని ఉక్కిరిబిక్కిరి చేస్తోందని చెప్పింది. తన వైద్య విద్య ప్రారంభమైన రోజులను గుర్తు చేసుకుంటూ..2021లో సరిగ్గా మహమ్మారి సమయంలో ఇంటర్ నీట్ రెండిటినీ పూర్తి చేశాను. నీట్లో తొలిప్రయత్నంలోనే ఉత్తీర్ణత సాధించి కేజీఎంయూ (KGMU)లో సీటు సంపాదించడం ఒక కల నిజమైనట్లుగా ఎంత సంబరపడ్డానో మర్చిపోనంటోందామె. ఆ సమయంలో తన పేరెంట్స్ ఎలా సంబరాలు చేసుకున్నారో మర్చిపోనని భావోద్వేగంగా చెబుతోంది. ఇంటర్న్గా చేస్తున్నప్పుడూ.. తన దృష్టిని పాఠ్యపుస్తకాల నుంచి రోగుల సంరక్షణ వైపుకి ఎలా మళ్లించిదో కూడా వెల్లడించింది. ఈ ప్రశంసలన్నీ తన కెరీర్కు ఒక నాంది మాత్రమేనని అంటోందామె. అవార్డులు, సర్టిఫికెట్లు కేవలం ఒక ఆరంభం మాత్రమేన అనడానికి ఇదొక నిదర్శనం అని అంటోంది. ఒక ఇంటర్న్గా రోజుల రోగులను కలుస్తాను, వాళ్లు తమ డాక్టర్ని చూసినప్పుడు వాళ్ల కళ్లల్లో కనిపించే ఆశ అనే మెరుపు ఆ అంచనాలకు అనుగుణంగా జీవించడంపై ఫోకస్ పెట్టేలా చేస్తుందని చెబుతోంది. వాళ్లు నాపై ఉంచిన నమ్మకాన్ని నిజం చేసేలా స్వస్థత చేకూరేలా చేయడం తన కర్తవ్యమని అంటోంది. అంతేగాదు గందరగోళం కన్నా..స్థిరత్వమే మేలు అని నొక్కి చెబుతోంది. ఏం చదివినా..పూర్తి ఏకాగ్రతతో చదవడం,పునశ్చరణే అత్యంత కీలకం అని చెబుతోంది. కేవల మనం వేసుకున్న ప్లాన్ని విజయవంతం చేయడం కోసమే ఆందోళన పడండి తప్ప..ఇంకేం అవసరం లేదని అంటోంది. అదనపు ఒత్తిడిని నివారించి, మనస్సుని ప్రశాంతంగా ఉంచుకుంటే..ప్రతిదీ దానంతట అదే సర్దుకుంటుందని చెబుతోందామె. భవిష్యత్తులో పునశ్చరణే కీలకం! మాస్టర్స్ డిగ్రీని అభ్యసించినా, సొంత క్లినిక్ను ప్రారంభించినా, లేదా ప్రభుత్వ ఆసుపత్రిలో సేవను కొనసాగించినా, ఒక విషయం మాత్రం నిశ్చయం..అది ఆమె ఇప్పుడే వైద్య ప్రస్థానాన్ని ప్రారంభిస్తున్న వైద్యురాలు అనేది. View this post on Instagram A post shared by Dr. Deepti Sharma (@deepti._bhardwaj) (చదవండి: భర్త డ్రీమ్ కోసం..పేరెంటింగ్ బాధ్యతలన్నీ ఆమెపైనే! పోస్ట్ వైరల్) -
మెస్సీ సేనకు ఘనస్వాగతం.. కానీ చిన్న ట్విస్ట్!
ఫిఫా ప్రపంచకప్ 2026లో రన్నరప్గా నిలిచిన అర్జెంటీనాకు స్వదేశంలో ఘన స్వాగతం లభించింది. భారత కాలమాన ప్రకారం మంగళవారం తెల్లవారుజామున మెస్సీ సేన అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ ఎయిర్పోర్టులో అడుగుపెట్టింది. ముందుగా బ్యూనస్ ఎయిర్స్లోని ఐజా అంతర్జాతీయ ఎయిర్పోర్టుకు చేరుకున్న ఆటగాళ్లు, కోచ్, సహాయక సిబ్బందికి మూడు ప్రత్యేక ఓపెన్టాప్ బస్సులను ఏర్పాటు చేశారు. Phot Credit: FIFA Twitterఈ క్రమంలో ఎయిర్పోర్టు నుంచి సెంట్రల్ బ్యూనస్ ఎయిర్స్కు చేరుకునే దారిలో అభిమానులు పోటెత్తారు. ఇసుకేస్తే రాలనంతగా జనంతో రాజధాని వీధులు నిండిపోయాయి. మ్యూజిక్ చాంటింగ్స్, ర్యాప్ సాంగ్స్తో వీధులన్నీ హోరెత్తిపోయాయి. భారీగా తరలివచ్చిన అభిమానులను చూసిన అర్జెంటీనా ఆటగాళ్లు బస్ క్యాబిన్ డోర్లను ఓపెన్ చేసి బయటకు వచ్చి అభివాదం చేశారు. చేతిలో ఫిఫా ట్రోఫీలకు బదులు వాళ్లు సాధించిన సిల్వర్ మెడల్స్, సిల్వర్ ట్రోఫీలను చూసే అభిమానులు మురిసిపోయారు. ట్రోపీలు ఎవడికి కావాలి.. మీ ఆటతో మనసులు గెలిచారు అని అభిమానులు తమ సందేశాలు వినిపించారు.'కమాన్ అర్జెంటీనా' అని నినాదాలతో హోరెత్తించారు. అయితే ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. Phot Credit: FIFA Twitterఅర్జెంటీనా సారథి లియోనల్ మెస్సీ జట్టుతో ప్రయాణం చేయలేదు. తన కుటుంబం కూడా తనతోనే ఉండడంతో మెస్సీ అమెరికాలోనే ఉండిపోయాడు. ఇంటర్ మియామి క్లబ్ తరఫున ఆడుతున్న మెస్సీ కొంత బ్రేక్ తర్వాత మళ్లీ ఆ క్లబ్తో జాయిన్ అవ్వనున్నాడు. దీంతో ఫిఫా ప్రపంచకప్ తర్వాత మెస్సీ స్వదేశానికి వస్తాడని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. తమ ఆరాధ్య దైవాన్ని లైవ్లో చూడాలని ఆశించిన అభిమానులకు భంగపాటు ఎదురైంది. Phot Credit: FIFA Twitterఅయితే తాను రాకున్నా తాను సాధించిన సిల్వర్ బూట్ను మాత్రం అభిమానులకు కానుకగా జట్టుతో పాటే పంపించాడు. గోల్కీపర్ ఎమిలియో మార్టినేజ్ సహా నికోలస్ ఒటమెండి, మిడ్ఫీల్డర్ లియాండ్రో పరెడెస్, అలెక్సిక్మాక్ అలిస్టర్, నికోలస్ గొంజలెజ్, సహా అర్జెంటీనా ఆటగాళ్లు తమను చూసేందుకు వచ్చిన అభిమానులను ఉద్దేశించి అభివాదం చేస్తూ కృతజ్ఞతలు చెప్పడం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Phot Credit: FIFA Twitterఇక ఫిఫా ప్రపంచకప్ 2026లో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన అర్జెంటీనా ఫైనల్లో స్పెయిన్ చేతిలో 1-0తో పరాజయం చవిచూసింది. ఫెర్నాండేజ్ రెడ్కార్డుకు గురవ్వడంతో పది మందితోనే ఆడిన అర్జెంటీనా మ్యాచ్ను లాక్కొచ్చింది. ఫిఫా టోర్నీ అంతటా అర్జెంటీనా జట్టును తన భుజస్కందాలపై మోసిన మెస్సీ ఫైనల్ మ్యాచ్లో ప్రభావం చూపలేకపోయాడు. అయితే టోర్నీ ఆసాంతం అసాధారణ ఆటను కనబరిచిన మెస్సీ 8 గోల్స్తో సిల్వర్ బూట్ను సొంతం చేసుకున్నాడు. వచ్చే ఫిఫా ప్రపంచకప్ (2030)లో మెస్సీ ఆడడం అనుమానమే కాబట్టి తమ ఆరాధ్య ఆటగాడిని చివరిసారి అర్జెంటీనా జాతీయ జెర్సీలో చూడాలని ఆశించిన అభిమానులకు మాత్రం నిరాశే ఎదురైంది. 🇦🇷💙 ¡GRACIAS POR TODO, SELECCIÓN!📹 @Argentina pic.twitter.com/fzzLE6k1Be— TyC Sports (@TyCSports) July 21, 2026Despite the World Cup final loss, thousands of Argentine fans were there to welcome their heroes home. Respect. 🫡 🇦🇷🩵 pic.twitter.com/Bo9UfU60nL— MC (@CrewsMat10) July 20, 2026Argentina 🩵 pic.twitter.com/gn9ZhMuDP3— Selección Argentina in English (@AFASeleccionEN) July 20, 2026Read: అర్జెంటీనా ఓటమి.. మెస్సీ భావోద్వేగ లేఖ -
Viral Video: వైన్స్ షాపులోకి దూరిన చిరుత... ప్రాణాలకు తెగించి..
-
వైన్స్ షాపులో ఐదు గంటల హైడ్రామా! ప్రాణాలకు తెగించి..
ఉదయం వేళ.. అంతా సాధారణంగానే సాగుతోంది. షాప్లో పనులు చేసుకుంటున్న సిబ్బందికి కాసేపట్లో ఎదురుకాబోయే ప్రమాదం గురించి అసలు ఊహే లేదు. ఇంతలో ఒక్కసారిగా.. ఆకోశ్రంతో ఉన్న ఓ చిరుత అక్కడికి దూసుకొచ్చింది. క్షణాల్లోనే ప్రశాంతంగా ఉన్న ప్రదేశం భయానకంగా మారిపోయింది. ఎదురుగా క్రూర మృగం.. తప్పించుకునే అవకాశం దాదాపు లేదు. అప్పటికే చిరుత దాడిలో గాయపడిన ఓ వ్యక్తి పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. అయితే.. ఆ సమయంలో ఓ సేల్స్మెన్ చూపించిన ధైర్యం అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రాణాలకు తెగించి తీసుకున్న ఒక్క నిర్ణయంతో అతడు పెద్ద ప్రమాదాన్ని తప్పించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఈ ఘటన రాజస్థాన్లోని టోంక్ జిల్లా టోడారాయ్సింగ్ పట్టణంలో సోమవారం (జూలై 20) ఉదయం చోటుచేసుకుంది. ఉదయం సుమారు 8.45 గంటల సమయంలో స్థానిక ప్రాంతంలోని పొదల్లో చిరుత దాక్కుని ఉన్నట్లు గుర్తించారు. అటవీ వాలంటీర్ రాకేష్ దాన్ని గుర్తించి దగ్గరకు వెళ్లాడు. చిరుతను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తుండగానే.. అది ఒక్కసారిగా అతడిపై దాడి చేసింది. చిరుత దాడితో స్థానికులు అప్రమత్తమయ్యారు. అయితే అప్పటికే ఆ జంతువు అక్కడి నుంచి తప్పించుకుని సమీపంలోని ఓ లిక్కర్ షాప్ వైపు పరుగులు తీసింది.చిరుత ఒక్కసారిగా షాప్లోకి దూసుకురావడంతో అక్కడి వారంతా షాక్కు గురయ్యారు. మొదట షాప్ యజమాని ఫతే లాల్ కోలీపై అది దాడి చేసింది. ఆ తర్వాత లోపల ఉన్న సేల్స్మెన్ సంజయ్ గుర్జర్పై విరుచుకుపడింది. చిరుత దాడిలో సంజయ్కు ముక్కు, భుజం, చేతులపై గాయాలయ్యాయి. అయినప్పటికీ అతడు భయంతో కుప్పకూలిపోలేదు. పరిస్థితిని అర్థం చేసుకుని వెంటనే తెగువ చూపి సమయస్ఫూర్తిని ప్రదర్శించాడు.చిరుతను బయటకు వదిలేస్తే చుట్టుపక్కల ఉన్న ప్రజలకు ప్రమాదం తప్పదని సంజయ్ గ్రహించాడు. ఆ క్షణంలో తన ప్రాణాలను పణంగా పెట్టి షాప్ షట్టర్ను కిందికి దించాడు. దీంతో చిరుత లోపలే చిక్కుకుపోయింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. జైపూర్ నుంచి ప్రత్యేక రెస్క్యూ బృందాన్ని రప్పించారు. దాదాపు ఐదు గంటల పాటు సాగిన ఆపరేషన్ తర్వాత చిరుతకు మత్తు మందు ఇచ్చి సురక్షితంగా పట్టుకున్నారు.ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. షాప్లో చిరుత సంచరించిన తీరు, రెస్క్యూ ఆపరేషన్, సేల్స్మెన్ ధైర్యం నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఒకవైపు నాలుగు కాళ్ల మృగం.. మరోవైపు గాయాలతో ఉన్న పరిస్థితి.. అయినప్పటికీ సరైన సమయంలో తీసుకున్న నిర్ణయంతో సంజయ్ పెద్ద ప్రమాదాన్ని అడ్డుకున్నాడు. చిరుతను బంధించింది అటవీ శాఖ బృందమే అయినా.. ఆ ఐదు గంటల హైడ్రామాలో తొలి హీరో మాత్రం సేల్స్మెన్ సంజయ్ గుర్జర్నే అని స్థానికులు ప్రశంసిస్తున్నారు. Leopard attacks man inside wine shop in Todaraisingh, Tonk, Rajasthan caught on CCTV pic.twitter.com/agUYH14EBL— Ghar Ke Kalesh (@gharkekalesh) July 20, 2026 -
‘కేతన్ నా హీరో.. చాలా కేరింగ్’.. పొగడ్తలు గుప్పించిన సియా!
ఒకప్పుడు ప్రేమ, అనుబంధానికి గుర్తుగా నిలిచిన ఓ వీడియో.. ఇప్పుడు తీవ్ర చర్చకు కారణమవుతోంది. పుణే లోహ్గఢ్ కేసులో నిందితురాలు సియా గోయల్ కేతన్ అగర్వాల్ను పొడుగుతూ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోను నెటిజన్లు చూసి నెటిజన్లు.. పాపం కేతన్, అంత మంచోడిని చంపడానికి చేతులెలా వచ్చాయి? అని సియాను తిట్టుకుంటున్నారు. ఆ వీడియో కేతన్-సియా నిశ్చితార్థ వేడుకలోది. వేదికపై కేతన్, సియా కలిసి ఉన్న సమయంలో అక్కడున్న ఒకావిడ ఓ ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. అప్పటికే సియా కేతన్ను తన హీరో అని, ఆ హీరో నెంబర్ 1 అని వ్యాఖ్యానించింది. “కాబోయే భర్తగా కేతన్లో మీకు బాగా నచ్చిన విషయం ఏంటి? అతడిని మీ హీరో నంబర్ వన్గా భావించడానికి కారణం?” అని ప్రశ్నించారు. దీనికి సియా చిరునవ్వుతో.. “కేతన్ చాలా కేరింగ్, చాలా మంచివాడు” అంటూ సమాధానం ఇచ్చింది. ఆ మాటలు విన్న కేతన్ నవ్వుతూ స్పందించగా.. అక్కడున్న వారంతా చప్పట్లు కొట్టారు. అప్పట్లో ప్రేమగా కనిపించిన ఈ క్షణాలు.. ఇప్పుడు కేతన్ మృతి కేసు నేపథ్యంలో మరో కోణంలో చర్చకు వస్తున్నాయి.'Ketan Agarwal Is Caring & Kind,' Said Siya Goyal During Engagement Ceremony pic.twitter.com/xMy79rhfQg— Pune First (@Pune_First) July 20, 2026పుణెకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ జూన్ 18న లోహగఢ్ కోట సమీపంలోని లోయలో పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తొలుత ఇది ప్రమాదంగా భావించినప్పటికీ.. పుణె రూరల్ పోలీసులు చేపట్టిన దర్యాప్తులో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. వివాహంపై అసంతృప్తితో ఉన్న సియా గోయల్ (20), ఆమె స్నేహితుడు చేతన్ చౌదరి (22) కలిసి ముందస్తు ప్రణాళికతో ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. ఫొటో షూట్ పేరుతో కేతన్ను లోహగఢ్ కోటకు తీసుకెళ్లి.. అక్కడి లోయలోకి తోసినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు తెలుస్తోంది. ఘటనను ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాదు.. అంతకు ముందు(జూన్ 14న) ఇదే ప్రాంతంలో కేతన్ను చంపేందుకు మరోసారి ప్రయత్నం జరిగినట్లు కూడా తెలుస్తోంది. పుణే కేతన్ అగర్వాల్ కేసు దేశవ్యాప్తంగా సంచలన చర్చకు దారి తీసింది. కాబోయేవాడిని ప్రియుడి సాయంతో హతమార్చడం.. రకరకాల చర్చలకు దారి తీసింది. ఈ తరుణంలో కేసు దర్యాప్తు కొనసాగుతుండగా.. కేతన్ను తోసి చంపింది సియానా? లేదంటే చేతనా? అనేది స్పష్టత రావాల్సి ఉంది. విచారణలో పోలీసులును సియా, చేతన్లు ఏ వివరాలు చెప్పుకుండా ముప్పు తిప్పలు పెడుతున్నట్లు సమాచారం. అంతేకాదు.. పోలీసులు ఆమెను విచారణ కోసం పలు ప్రాంతాలకు తీసుకెళ్తున్న సమయంలోనూ మీడియా ముందు ఆటిట్యూడ్ ప్రదర్శిస్తూ వస్తోంది. సియా తప్పు చేస్తే కఠినంగా శిక్షించాలంటున్న ఆమె కుటుంబం.. మరోవైపు బెయిల్ కోసం ప్రయత్నిస్తుండడం గమనార్హం. అయితే దర్యాప్తు ఆలస్యం అవుతుండడంతో ఆమె బెయిల్ దక్కవచ్చనే ఆందోళన వ్యక్తం చేస్తోంది కేతన్ కుటుంబం. సియా కేతన్ కలిసి దిగిన ఫొటోలు, సరదాగా గడిపిన వీడియోలు.. ఇప్పుడు “కేతన్ మంచోడు.. కేరింగ్” అని చెప్పిన వ్యక్తికి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటూ వైరల్ అవుతున్న ఆ వీడియోపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. అంత మంచోడికి విషయం చెబితే సరిపోయేది కదా.. ఎందుకు చంపేశావ్? అని కామెంట్లలో సియాను తిట్టి పోస్తున్నారు. -
బుడ్డోడా మజాకా.. సవతి సోదరుడైనా తమ్ముడంటే ప్రాణం!
ఫిఫా ప్రపంచకప్ విజేతగా స్పెయిన్ నిలవడంతో ఆ జట్టు సంబరాలు మాములుగా లేవు. 16 ఏళ్ల తర్వాత రెండోసారి ఫిఫా టైటిల్ గెలవడంతో స్పెయిన్లో సంబురాలు అంబరాన్ని అంటాయి. ఇక స్పెయిన్ ఆటగాళ్ల ఆనందానికి అవదుల్లేకుండా పోయాయి. అయితే ఈ ఫిఫా టోర్నీలో ఒక బుడ్డోడు మాత్రం యమా క్రేజ్ సంపాదించాడు. ఆ బుడ్డోడు ఎవరో కాదు స్పెయిన్ స్టార్ లామినె యమాల్ చిన్న తమ్ముడు కీన్. సవతి తల్లికి పుట్టినోడయినప్పటికీ కీన్ను యమాల్ సొంత తమ్ముడిలా, కొడుకులా భావిస్తుంటాడు. మూడేళ్ల వయసున్న కీన్ 2026 ఫిఫా ప్రపంచకప్లో స్పెయిన్ ఆడిన ప్రతీ మ్యాచ్కు తన తల్లితో కలిసి హాజరయ్యాడు. ప్రతీ మ్యాచ్ను స్టాండ్స్ నుంచి వీక్షించిన కీన్ తన అన్న ఆటను తెగ ఎంజాయ్ చేసేవాడు. Photo Credit: FIFA Twitterఅంతేకాదు స్పెయిన్ తాము ఆడిన ప్రతీ మ్యాచ్లో విజయం సాధించిన తర్వాత యమాల్ తన సోదరుడిని ఒడిలో తీసుకొని ఆడుకోవడం ఆనవాయితీగా చేసుకున్నాడు. ఫైనల్ మ్యాచ్ తర్వాత కూడా యమాల్ దీనిని కంటిన్యూ చేశాడు. తన అన్న కప్ గెలవడంతో తమ్ముడికి సంతోషం ఆగలేదు. గ్రౌండ్ అంతా తనదే అన్నట్లుగా మైదానం నలుమూలలా పరిగెడుతూ సందడి చేశాడు. Photo Credit: FIFA Twitterఈ సందర్భంగా అన్న లామినె యమాల్ను కూడా కాసేపు ఆట పట్టించాడు. ట్రోఫీ సెలబ్రేషన్స్ అనంతరం కప్పు తన చేతిలోకి తీసుకున్న యమాల్ తన కుటుంబం దగ్గరకు వచ్చి తమ్ముడితో కలిసి ఫొటోలుకు ఫోజివ్వడం వైరల్గా మారింది. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఫిఫా పైనల్ మ్యాచ్లో స్పెయిన్ 1-0 తేడాతో అర్జెంటీనాపై విజయం సాధించి ట్రోఫీని అందుకుంది. Lamine Yamal ve kardeşi. pic.twitter.com/gpcwLCiKvz— Pusholder (@pusholder) July 20, 2026 Lamine Yamal celebrating with his brother 🤗 pic.twitter.com/sd8Jg8smgZ— B/R Football (@brfootball) July 19, 2026 It's Keyne's world and we're just living in it 🤣 pic.twitter.com/Qk4I9BAuX4— B/R Football (@brfootball) July 19, 2026చదవండి: దేశవాళీ టోర్నీ.. సూర్యకుమార్కు మరో అవమానం! -
కొట్టుకున్న అర్జెంటీనా, స్పెయిన్ ఆటగాళ్లు.. ఏం జరిగింది?
ఫిఫా ప్రపంచకప్ 2026 విజేతగా స్పెయిన్ అవతరించింది. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఫైనల్లో స్పెయిన్ 1-0 తేడాతో అర్జెంటీనాపై విజయం సాధించి రెండోసారి ఫిఫా విశ్వవిజేతగా నిలిచింది. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత మైదానంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఓటమి షాక్లో ఉన్న అర్జెంటీనా ఆటగాళ్లు సహనం కోల్పోయి స్పెయిన్ ఆటగాళ్లతో గొడవకు దిగారు. చిలికి చిలికి గాలి వానలా మారిన గొడవ తన్నుకునేంత వరకు వెళ్లింది. దీంతో అప్పటివరకు రణరంగంలా కనిపించిన మైదానం యుద్ధభూమిని తలపించింది. పరిస్థితి పూర్తిగా అదుపు తప్పడంతో అర్జెంటీనా హెడ్ కోచ్తో పాటు సపోర్ట్ స్టాఫ్ మైదానంలోకి పరుగెత్తుకుంటూ వచ్చారు. ఆటగాళ్లను విడదీసి పరిస్థితిని శాంతింపజేయడానికి ప్రయత్నించినప్పటికీ చాలాసేపు ఉద్రిక్తత కొనసాగింది. ఈ ఘర్షణలో అర్జెంటీనా మిడ్ ఫీల్డర్ లియాండ్రో పరేడెస్.. స్పెయిన్ ఆటగాళ్లు గావీ, ఎరిక్ గార్సియాలతో వాగ్వాదానికి దిగినట్లు వీడియోలో కనిపించింది. ఆ సమయంలో పరేడెస్ ప్రత్యర్థి ఆటగాడిని తోసివేయడంతో పాటు చేయి చేసుకున్న దృశ్యాలు కెమెరాల్లో రికార్డయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఈ గొడవను ఫిఫా తీవ్రంగా పరిగణించింది. ఘర్షణకు కారణమైన లియాండ్రో పరెడేస్పై రెడ్ కార్డు చూపించి క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. దీంతో ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్లో రెడ్ కార్డు అందుకున్న రెండో ఆటగాడిగా పరేడెస్ నిలిచాడు. అంతకుముందు మ్యాచ్ జరుగుతున్న సమయంలో అర్జెంటీనా స్టార్ మిడ్ఫీల్డర్ ఎంజో ఫెర్నాండెజ్ కూడా రెడ్ కార్డు అందుకున్నాడు. ఈసారి ఫిఫా ప్రపంచకప్లో ఆఖరి అంకం దాకా హీరోగా నిలిచిన అర్జెంటీనా ఈ ఒక్క ఘటనతో విలన్గా మారిపోయింది. 🚨🥊 Full scenes after final whistle.@MickyJnr__ 🎥 pic.twitter.com/ZXCvAFkHwy— Fabrizio Romano (@FabrizioRomano) July 20, 2026Read: అర్జెంటీనా గెలవదని 14 కోట్లు పందెం.. డ్రేక్ శాపం ఫలిస్తుందా? -
సాధారణ బైక్ నుంచి బీఎండబ్ల్యూ రేంజ్కి..!
సాధారణ స్థితి నుంచి ఉన్నత స్థాయికి చేరుకుంటే ఆ ఫీల్ ఆ ఆనందం మాటలకందనిది. ఒక్కసారిగి వెనుతిరిగి చూసుకుంటే..ఇంత పెద్దస్థాయికి ఎలా చేరుకున్నాను అని ఆశ్చర్యం, గర్వం ఒకేసారి కలుగుతాయి. అంతేగాదు అందుకోసం మనవాళ్లు చేసిన త్యాగాలు కళ్లుముందు మెదలడమే కాదు..అందుకు తగ్గట్టుగా ప్రయోజకుడై వాళ్లను బాగా చూసుకుంటే..అంతకుమించిన సంతృప్తి ఇంకొకటి ఉండదు. ఆ ఆనందాన్నే ఓఎన్నారై ఇన్స్టాగ్రామ్ వేదికగా వీడియో షేర్ చేయడంతో నెట్టింట వైరల్గా మారింది.మధురకు చెందిన ఎన్నారై అమిత్ కశ్యప్ షేర్ చేసిన వీడియో నెట్టింట హాట్టాపిక్గా మారింది. భారతదేశంలోని సాధారణ బైక్ నుంచి అమెరికాలో బీఎండబ్ల్యూ కొనుగోలు చేసే రేంజ్కి తాను ఎలా చేరుకున్నాడో ఇన్స్టాగ్రామ్ రీల్లో పంచుకున్నాడు. ఒకప్పుడు భారతదేశంలో తన వద్ద ఒక బైక్ మాత్రమే ఉండేదని, కానీ ఈరోజు అమెరికాలో తన సొంత ఇంటి గ్యారేజ్లో కారుని పార్క్ చేస్తున్నానని అని చెప్పడం ఎంతో గర్వంగా ఉంది అన్నాడు. ఉత్తరప్రదేశ్లోని మధురకు చెందిన తాను ప్రస్తుతం అమెరికాలో టెక్సాస్లో నివశిస్తున్నట్లు పేర్కొన్నాడు. తన పేరెంట్స్ కోసం అమెరికాలో ఒక ఇల్లు కొన్నట్లు తెలిపాడు. అమెరికా రోడ్లపై బీఎండబ్ల్యూ కారుని నడపడమే కాదు, అందులో మా అమ్మనాన్నలతో కలిసి ప్రయాణిస్తున్నానని అన్నారు. అంతేగాదు తాను కట్టిన ఇల్లుని అమ్మకు బహుమతిగా ఇచ్చినట్లు తెలిపారు కూడా. తను ఈ రోజు ఈ ఉన్నత స్థాయిలో ఉన్నానంటే అందుకు తన పేరెంట్స్ చేసిన త్యాగాలేనని గుర్తుచేసుక్న్ననారు. డబ్బు ఆదా చేసేందుకు తన తల్లి మట్టిపొయ్యి మీద వంట చేయడంతో సహా, ఎన్నెన్నో త్యాగాలు చేశారు. తమ సొత ఖర్చులు తగ్గించుకుని, అప్పులు చేసి మరి మంచి స్కూల్కి పంపించారని, అలాగే ఇంజనీరింగ్ ఫీజుల కోసం ప్రతి పైసాను ఎలా కూడబెట్టేవారో తాను ఇప్పటికీ మర్చిపోనని అన్నారు. అంతేగాదు అలా మట్టిపోయ్యి మీద వండుతున్నప్పుడు ఆ పొగతో ఆమె పడ్డ బాధ ఇప్పటికీ గుర్తుందని భావోద్వేగంగా మాట్లాడారు. అంతేగాదు ఆ పరిస్థితుల్లో ఏదో ఒక రోజు మంచి స్థాయికి చేరుకుని మా కుటుంబానికి ఉన్న మధ్యతరగతి అన్న ముద్రను మార్చేయాలని ఎంత బలంగా అనుకునేవాడో నాటి సంఘటనలను గుర్తుతెచ్చుకుని మరీ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇవాళ తాను మంచిహోదాకు చేరుకుని ఆ కలను నిజం చేసుకున్నా.. అని సగర్వంగా చెబుతూ వీడియోని ముగించారు. అంతేగాదు కశ్యప్ సక్సెస్ జర్నీపై నెటిజన్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. ఓపికగా, నిలకడగా ఉంటే విజయ తథ్యం అదే కశ్యప్ చేసి చూపించారని పలువురు పొగడ్తల వర్షం కురిపించారు. View this post on Instagram A post shared by Amit Kashyap (@amitkashyap._) (చదవండి: రన్నింగ్ జస్ట్ ఫిట్నెస్ కాదు! అంతకుమించి..) -
47 మిలియన్ల వ్యూస్తో ప్రమీల’కు భారీ క్రేజ్!
తెలుగు పల్లె సంస్కృతిలో జానపద పాటలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. గ్రామీణ ప్రజల జీవన విధానం, ప్రేమ, అనుబంధాలు, బాధలు, భావోద్వేగాలు ఈ పాటల్లో ప్రతిబింబిస్తాయి. కాలం మారుతున్నా జానపద గీతాలపై ప్రజల అభిమానం ఏమాత్రం తగ్గడం లేదు. దీనికి తాజా నిదర్శనంగా “ప్రమీల” జానపద పాట నిలుస్తోంది.పల్లె జీవనాన్ని, ప్రేమలోని స్వచ్ఛతను, మనసులో దాగిన భావాలను అద్భుతంగా ఆవిష్కరించిన ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. శ్రోతల నుంచి భారీ స్పందన అందుకుంటున్న ఈ గీతానికి ఏకంగా 47 మిలియన్లకు పైగా వీక్షణలు (4 కోట్ల 70 లక్షల వ్యూస్) రావడం విశేషం.“ప్రమీల” జానపద పాట ఒక అందమైన ప్రేమకథను ఆధారంగా చేసుకున్న పల్లె గేయంగా ప్రజల్లో ప్రాచుర్యం పొందింది. ఈ పాటలో ప్రేమికుల మధ్య ఉన్న అనురాగం, ఒకరినొకరు కలుసుకోవాలనే ఆరాటం, దూరం వల్ల కలిగే వేదనను హృదయాన్ని తాకేలా చిత్రీకరించారు. ప్రమీల అనే యువతి, ఆమెను ప్రేమించే యువకుడు ఒకరినొకరు కలుసుకోవాలని కోరుకుంటారు. కానీ వారి మధ్య ఉన్న పరిస్థితులు, దూరాలు, కుటుంబ పరిమితులు వారి ప్రేమకు అడ్డుగా నిలుస్తాయి. ప్రమీలను చూడాలని, తన ప్రేమను వ్యక్తం చేయాలని యువకుడు తపన పడుతుంటాడు. మరోవైపు ప్రమీల కూడా తన మనసులోని ప్రేమను దాచుకోలేక భావోద్వేగానికి లోనవుతుంది.ఈ పాటలోని పల్లె వాతావరణం, సహజమైన పదాలు, ప్రేమలోని స్వచ్ఛమైన భావాలు శ్రోతలను ఆకట్టుకున్నాయి. అందుకే “ప్రమీల” జానపద గీతం తరాలు దాటుతూ ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.(పాట కోసం ఇక్కడ కీక్ చేయండి) -
తల తెగినా ఫైటింగ్ ఆగలేదు.. భవిష్యత్తు యుద్ధానికి జస్ట్ ట్రైలర్?
చైనాలో జరిగిన ఓ హ్యూమనాయిడ్ రోబో పోరాట కార్యక్రమం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. పోటీలో పాల్గొన్న ఓ రోబో ప్రత్యర్థి దాడిలో తన తలను కోల్పోయినప్పటికీ, కొన్ని క్షణాల పాటు పోరాటాన్ని కొనసాగించడం ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసింది.ఈ ఘటన చైనాలో నిర్వహించిన హ్యూమనాయిడ్ రోబో కాంబాట్ ఈవెంట్లో చోటుచేసుకుంది. ఫైట్ సమయంలో రెండు రోబోలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ప్రత్యర్థి రోబో ఇచ్చిన బలమైన దెబ్బకు ఒక రోబో తల భాగం విరిగిపోయింది. సాధారణంగా యంత్రం పనిచేయడం ఆగిపోతుందని అందరూ భావించినప్పటికీ, ఆ రోబో తన కదలికలను కొనసాగిస్తూ పోరాటం చేసింది.Robot lost its head mid-fight and kept swinging anyway 😂pic.twitter.com/KnMaFDsr2n— Tansu Yegen (@TansuYegen) July 17, 2026రోబో తల భాగం లేకుండానే ముందుకు కదులుతూ దాడులు చేయడం చూసిన ప్రేక్షకులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ దృశ్యాలు వీడియో రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పలువురు దీనిని సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో కనిపించే ‘టెర్మినేటర్’ సన్నివేశాలను తలపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. అయితే, ఈ ఘటన రోబోటిక్స్ రంగంలో జరుగుతున్న వేగవంతమైన అభివృద్ధిని కూడా చూపిస్తోంది. హ్యూమనాయిడ్ రోబోలు మనుషుల మాదిరిగా నడవడం, సమతుల్యత పాటించడం, క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రోగ్రామ్ చేసిన విధంగా స్పందించడం వంటి సామర్థ్యాలను సాధిస్తున్నాయి.ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హ్యూమనాయిడ్ రోబోల అభివృద్ధిపై టెక్నాలజీ కంపెనీలు, పరిశోధనా సంస్థలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. భవిష్యత్తులో ఈ రోబోలు పరిశ్రమలు, సేవా రంగాలు, అత్యవసర పరిస్థితుల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. చైనాలో జరిగిన ఈ రోబో ఫైట్ మాత్రం ఒక విషయం స్పష్టం చేసింది. యంత్రాల ప్రపంచం ఊహించిన దానికంటే వేగంగా ముందుకు సాగుతోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. -
మహిళల భద్రతపైనా అదే హైడ్రామా
సాక్షి ప్రతినిధి, గుంటూరు: మహిళల జోలికి వస్తే అదే చివరి రోజవుతుందని చెప్పే సీఎం చంద్రబాబు, మహిళల జోలికి రావాలంటేనే వెన్నులో వణుకు పుట్టాలని పెద్ద పెద్ద మాటలు చెప్పే డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్, మహిళల జోలికి వస్తే ఎంతటివారినైనా ఊరుకోమని చెప్పే హోంమంత్రి అనిత, మహిళా ఎమ్మెల్యేగా ఉన్న గళ్లా మాధవి... గుంటూరు నగరంలో సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా టీడీపీ నేత మల్లెల వెంకటరమణమూర్తి, నీళ్ల కుళాయి విషయంలో తనకు రూ.10 వేల కప్పం కట్టలేదనే అక్కసుతో నడిరోడ్డుపై ఓ మహిళను వివస్త్రను చేసి తీవ్రంగా కొడుతూ హింసించినప్పటికీ తగిన చర్యలు తీసుకోలేదనే తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీడియో వెలుగులోకి రావడంతోనే... తొలుత విషయాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసినప్పటికీ, మహిళను వివస్త్రను చేసి కొడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో రావడం, ‘సాక్షి’ బయటపెట్టడంతో రాజకీయ డ్రామాకు తెర తీశారు. ఓపక్క 15న ఘటన జరిగితే, 16వ తేదీన బాధితులు తనను కలిశారని చెబుతున్న వెస్ట్ ఎమ్మెల్యే గళ్లా మాధవి.. ఇంత అమానుష ఘటనకు కారకులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోలేదు. 17వ తేదీ రాత్రి వరకు ఎందుకు తాత్సారం చేశారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాజీ ప్రయత్నాలు చేసిన టీడీపీ నేతలు అవి ఫలించకపోవడం, వీడియోలు బయటకు రావడంతో ఇక చేసేదిలేక పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామని కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 15వ తేదీన సంఘటన జరిగితే, 18వ తేదీ వరకు హోంమంత్రి గానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు గానీ ఈ విషయంపై స్పందించకపోవడం చూస్తుంటే వీరికి మహిళల భద్రత పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోంది. ఇదేదో మారుమూల ప్రాంతంలో జరిగిన సంఘటన కాదు. జిల్లా కేంద్రమైన గుంటూరు నడిబొడ్డున ఇంత దారుణం జరుగుతుంటే ఇంటెలిజెన్స్ ఏం చేస్తోంది? కనీసం హోంమంత్రికి సమాచారం లేదా? ఉన్నా టీడీపీ నేతలు చేసిన దారుణంపై స్పందించేందుకు మనసు రాలేదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏం చేసినా మనవారైతే ఓకే.. చిన్న చిన్న సంఘటనలకే నిందితులను రోడ్లపై తిప్పడం, థర్డ్ డిగ్రీ ప్రయోగించి హింసించడం వంటివి చేసే పోలీసు యంత్రాంగం.. రేంజ్ ఐజీ, జిల్లా ఎస్పీ కార్యాలయాలకు కూతవేటు దూరంలో ఉన్న కృష్ణబాబు కాలనీలో ఓ మహిళను వివస్త్రను చేసి దారుణంగా కొట్టిన ఘటనకు పాల్పడిన నిందితుల విషయంలో మాత్రం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళను అంత దారుణంగా హింసించిన నిందితులను కనీసం ప్రెస్మీట్లో కూడా చూపించకుండా, దొంగచాటుగా అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం చూస్తుంటే పక్షపాత వైఖరి తేలుతోంది. ఎంతటి నేరం చేసినా వారు అధికార పారీ్టకి చెందిన వారైతే చాలు పోలీసులు సైతం ప్రత్యేక ప్రేమ చూపుతున్నారనేది స్పష్టమవుతోంది.ఇంత ఆలస్యమా? సంఘటన జరిగి మూడు రోజులు దాటిన తర్వాత మహిళల పట్ల అపార ప్రేమ ఉన్నట్లు, వారి భద్రత విషయంలో తాము చిత్తశుద్ధితో ఉన్నట్లు నటించడంలో అధికార పార్టీ నేతలు ఒకరికొకరు పోటీ పడుతున్నారు. ఎమ్మెల్యే గళ్లా మాధవి నుంచి సీఎం చంద్రబాబు వరకు మూడు రోజులపాటు నిద్ర నటించి, వీడియోలు బయటకు రాగానే ఉలిక్కిపడి నామమాత్రంగా చర్యలు తీసుకున్నారు. తామేదో ఈ సంఘటనపై సీరియస్గా ఉన్నట్లు రాజకీయ డ్రామాలు ఆడుతున్నారు. ఇందులో భాగంగా ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత కూడా అరెస్టు చేయని పోలీసులు... వీడియోలు బయటకు రాగానే ఏకంగా ఏకంగా జిల్లా ఎస్పీ శనివారం రాత్రి మహిళా కమిషన్ చైర్పర్సన్తో కలసి బాధితురాలి ఇంటికి వచ్చ మరీ విచారణ చేయడం గమనార్హం. వీడియోలు బయటకు వచ్చేంత వరకు కనీసం దారుణ ఘటనకు కారకుడైన టీడీపీ నేత, ఆయన బంధువులను అరెస్టు చేయకపోవడం చూస్తుంటే ఈ అమానవీయ ఘటనపై ఏ స్థాయిలో స్పందించారో అర్థమవుతోంది. చివరకు సీఐను వీఆర్కు పంపి చేతులు దులుపుకొన్నారనే విమర్శలు వస్తున్నాయి. -
క్రిస్ గేల్ కాళ్లు మొక్కిన బ్రావో.. వీడియో వైరల్
అమెరికా వేదికగా మేజర్ క్రికెట్ లీగ్ (ఎంఎల్సీ)-2026 తుది అంకానికి చేరుకుంది. ఒక్లాండ్ వేదికగా శనివారం రాత్రి లాస్ ఏంజెల్స్ నైట్ రైడర్స్- వాషింగ్టన్ ఫ్రీడం టైటిల్ పోరులో తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో మెగా ఫైనల్కు ముందు ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.క్రిస్ గేల్ కాళ్లు మొక్కిన బ్రావోలాస్ ఏంజెల్స్ నైట్ రైడర్స్ హెడ్కోచ్ డ్వెయిన్ బ్రావో.. యూనివర్సల్ బాస్ క్రిస్గేల్ను కలుసుకున్నాడు. ఈ సందర్భంగా గేల్ను ఆహ్వానిస్తూ అతడి పాదాలకు నమస్కరించాడు బ్రావో. అంతేకాదు యూనివర్సల్ బాస్ను అక్కడున్న వారికి చూపిస్తూ.. ‘Original GOAT’ (అసలైన గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్టైమ్)గా అభివర్ణించాడు.ఈ క్రమంలో గేల్ బ్రావో ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నాడు. ఈ ఇద్దరు వెస్టిండీస్ దిగ్గజాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా బ్రావో మార్గదర్శనంలో లాస్ ఏంజెల్స్ నైట్ రైడర్స్ MLCలో తొలిసారి ప్లే ఆఫ్స్ చేరడమే కాకుండా.. ఏకంగా ఫైనల్లోనూ అడుగుపెట్టింది.విండీస్ వీరులదే హవాక్వాలిఫయర్-1లో ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ను ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఇందులో వెస్టిండీస్ స్టార్ ఆండ్రీ రసెల్ది కీలక పాత్ర. సీజన్ ఆసాంతం.. ముఖ్యంగా డెత్ ఓవర్లలో అద్భుతమైన బౌలింగ్తో రసెల్ ఆకట్టుకున్నాడు. వైవిధ్యమైన బంతులతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు.ఇప్పటికి పది మ్యాచ్లలో కలిపి రసెల్ 18 వికెట్లు కూల్చాడు. ఇక లాస్ ఏంజెల్స్ జట్టుకు మరో విండీస్ ఆటగాడు జేసన్ హోల్డర్ కెప్టెన్గా ఉండటం విశేషం. ఇక విండీస్ మరో ప్లేయర్ సునిల్ నరైన్ సైతం ఈ సీజన్లో అత్యుత్తమంగా బౌలింగ్ చేశాడు. మరోవైపు.. రోవ్మన్ పావెల్ విధ్వంసకర బ్యాటింగ్తో తనదైన శైలిలో ఫినిషింగ్ టచ్ ఇచ్చి మ్యాచ్లు గెలిపించాడు.మొత్తంగా విండీస్ వీరులంతా కలిసి తొలిసారి లాస్ ఏంజెల్స్ జట్టును తొలిసారి ఫైనల్కు చేర్చగా.. క్రిస్ గేల్ వారిని ఉత్సాహపరిచేందుకు మైదానానికి వచ్చినట్లు తెలుస్తోంది. గేల్- బ్రావోకు సంబంధించిన మూమెంట్స్ అభిమానులు తెగ ఆకర్షిస్తున్నాయి.ఇద్దరూ ఇద్దరే..కాగా 42 ఏళ్ల బ్రావో వెస్టిండీస్ తరఫున 2004- 2021 మధ్య అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. మొత్తంగా 40 టెస్టులు, 164 వన్డేలు, 91 టీ20 మ్యాచ్లు ఆడిన ఈ బ్యాటింగ్ ఆల్రౌండర్.. ఆయా ఫార్మాట్లలో వరుసగా 2200, 2968, 1255 పరుగులు సాధించాడు. ఈ రైటార్మ్ పేస్ బౌలర్ ఖాతాలో టెస్టుల్లో 86, వన్డేల్లో 199, టీ20లలో 78 వికెట్లు ఉన్నాయి.మరోవైపు.. 46 ఏళ్ల క్రిస్ గేల్ 1999- 2021 మధ్య విండీస్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. 103 టెస్టులు, 301 వన్డేలు, 79 టీ20 మ్యాచ్లు ఆడిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. టెస్టుల్లో 7215, వన్డేల్లో 10480, టీ20లలో 1899 పరుగులు రాబట్టాడు. తన అద్భుతమైన బ్యాటింగ్ నైపుణ్యాలతో యూనివర్సల్ బాస్గా గేల్ గుర్తింపు పొందాడు.చదవండి: IND vs ENG: వాషీ అవుట్.. రీప్లేస్మెంట్ను ప్రకటించిన బీసీసీఐ View this post on Instagram A post shared by Cognizant Major League Cricket (@mlc) -
స్టీరింగ్ చేతిలో.. సడన్గా డ్రైవర్ మాయం!
కొన్నిసార్లు ప్రమాదాలు కూడా నవ్వులు పూయిస్తాయి. అలాంటి ఓ ఫన్నీ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సరదా ట్రిప్లో భాగంగా గోల్ఫ్ కార్ట్ నడుపుతున్న ఓ యువతి.. రోడ్డుపై ఫోకస్ కోల్పోవడంతో చివరకు వాహనం నేరుగా పొదల్లోకి వెళ్లిపోయింది.వైరల్గా మారిన 13 సెకన్ల వీడియోలో.. కొందరు గోల్ఫ్ కార్ట్లో ప్రయాణిస్తున్నట్లు కనిపిస్తుంది. ఆకులతో నిండిన సన్నని దారిలో కార్ట్ వెళ్తుండగా.. డ్రైవర్ ఒక్కసారిగా రోడ్డుపై దృష్టి కోల్పోయింది. పక్కనే ఉన్న యువతి కింద పడిపోగా.. డ్రైవింగ్ చేస్తున్న సంగతి మరిచిపోయి కంగారులో స్టీరింగ్ వదిలేసింది. కింద పడిన యువతి కోసం ఈమె కూడా దూకేసింది. వెనక కూర్చున్నవాళ్లు ఆ షాకింగ్ పరిణామాన్ని తొంగి చూస్తూ ఉండిపోయారు. మరి డ్రైవర్ మాయమైతే.. వాహనం నడిపేదెవరు?.. అందుకే వాహనం అదుపు తప్పి పక్కనే ఉన్న పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. అయితే ప్రయాణికుల్లో ఒకరు ఒక్కసారిగా కిందకు జారిపడటం, ఆ వెంటనే డ్రైవర్ సీట్లో యువతి కూడా దూకేయడం.. ఆ వీడియోను మరింత వినోదంగా మార్చింది.did she forget she was the driver 🥲 pic.twitter.com/cjAKlyYGZR— Peché Africa 🇿🇦 (@pmcafrica) July 17, 2026వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. “డ్రైవర్ అని మర్చిపోయి పార్టీకి వచ్చిందా?” అంటూ కొందరు సరదాగా స్పందించగా.. మరికొందరు “రోడ్డుపై చూపు ఎప్పుడూ ముందే ఉండాలి” అంటూ జాగ్రత్తలు సూచించారు.మిలియన్లకు పైగా వ్యూస్.. కామెంట్ల వర్షంపెచే ఆఫ్రికా షేర్ చేసిన ఈ వీడియోకు సోషల్ మీడియాలో భారీ స్పందన వచ్చింది. లక్షల సంఖ్యలో లైక్స్, షేర్స్ రావడంతో పాటు.. ఈ ఘటనపై మీమ్స్ కూడా పుట్టుకొచ్చాయి. కొందరు దీనిని జీవితానికి ఉదాహరణగా పోల్చుతూ.. “దృష్టి ఎక్కడ ఉంటే ప్రయాణం కూడా అక్కడికే వెళ్తుంది” అంటూ ఫన్నీ కామెంట్లు చేశారు.ఈ ఘటన సరదాగా ముగిసినప్పటికీ.. వాహనం నడిపేటప్పుడు దృష్టి మరల్చడం ఎంత ప్రమాదకరమో మరోసారి గుర్తుచేసింది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో.. ఈ గోల్ఫ్ కార్ట్ ప్రమాదం ఇప్పుడు సోషల్ మీడియాలో నవ్వుల పండుగగా మారింది. “రోడ్డుపై డ్రైవింగ్.. పార్టీలో డ్యాన్స్ కాదు!” అంటూ నెటిజన్లు ఈ వీడియోకు ఫన్నీ టచ్ ఇస్తున్నారు. -
అర్జెంటీనా ఫ్యాన్స్ దుశ్చర్య.. ఇంగ్లండ్కు అవమానం!
ఫిఫా ప్రపంచకప్లో అర్జెంటీనా ఫైనల్ చేరిన తర్వాత ఆ దేశ అభిమానుల సంబురాలు శ్రుతిమించాయి. ఆట వరకు గెలుపోటములు సహజమైనప్పటికీ అర్జెంటీనా ఫ్యాన్స్ మాత్రం ఇంగ్లండ్ జాతీయ జెండాను కిందపడేసి కాళ్లతో తొక్కి ఓవరాక్షన్కు పాల్పడ్డారు. విషయంలోకి వెళితే.. అర్జెంటీనా సెమీస్ గెలిచిన తర్వాత ఆ దేశంలో అభిమానుల సంబురాలు మిన్నంటాయి. అర్జెంటీనా రాజధాని బ్రూనస్ ఎయిర్స్ వీధుల్లోకి భారీగా తరలివచ్చిన ఫ్యాన్స్.. నృత్యాలు, అరుపులతో చెవుల మోత మోగించారు. ఈ నేపథ్యంలో వేడుకల్లో కొంతమంది అభిమానులు హద్దు మీరారు. ఇంగ్లండ్ జాతీయ జెండాను పోలిన ఒక పప్పెట్ను కిందపడేసి, దానిపై ఇంగ్లండ్ జాతీయ జెండాను ఉంచారు. ఇంగ్లండ్ జెండాపై ఉమ్మివేయడంతో పాటు చాలా మంది ఆ జెండాను కాళ్ల కిందేసి తొక్కిన దృశ్యాలు, వీడియోలు బయటికి వచ్చాయి. దీంతో అర్జెంటీనా ఫుట్బాల్ అభిమానుల చర్య పట్ల ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత ఏర్పడుతోంది. ‘అభిమానం ఉండడం మంచిదే కానీ అది హద్దుమీరకూడదు’ అని కామెంట్లు చేస్తున్నారు. ఫిఫా సెమీస్లో విజయం తర్వాత మెస్సీ బృందం సంబరాల్లో తేలిపోగా.. ఇంగ్లండ్ జట్టు తీవ్ర నిరాశలో మునిగిపోయింది. సెలబ్రేషన్స్ సమయంలో అర్జెంటీనా మిడ్ఫీల్డర్ గియోవని లో సెల్సో అత్యుత్సాహం ప్రదర్శించాడు. ‘ఫాక్ల్యాండ్స్ అర్జెంటీనా’దే అని రాసి ఉన్న ఫ్లెక్సీని ప్రదర్శించాడు. అతడితో పాటు కెప్టెన్ లియోనల్ మెస్సీ సహా మిగతా ఆటగాళ్లు ఆ బ్యానర్ చూపిస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలో అర్జెంటీనా ఆటగాళ్ల చర్య వివాదానికి దారితీసింది.అసలు వివాదం ఏమిటి?అర్జెంటీనా తూర్పు తీర ప్రాంతానికి దాదాపుగా 480 కిలోమీటర్ల దూరంలో ఫాక్లాండ్ దీవులు ఉన్నాయి. ఈ దీవులను 1774లో అప్పటి బ్రిటన్ ప్రభుత్వం తమవిగా చెప్పుకొంది. ఇక 1832లో వీటిని పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకుంది. అయితే, 1982లో అర్జెంటీనాలోని సైనిక ప్రభుత్వం ఫాక్లాండ్ దీవుల కోసం ఘర్షణకు దిగింది.దీంతో ఇంగ్లండ్- అర్జెంటీనా మధ్య నాడు ఏప్రిల్ నుంచి జూన్ మధ్య తీవ్రస్థాయిలో యుద్ధం జరిగింది. అయితే, ఇంగ్లండ్ ధాటికి తాళలేక ఆఖరికి అర్జెంటీనా బలగాలు లొంగిపోవడంతో ఉద్రిక్తతలకు తెరపడింది. ఈ ఘర్షణలో దాదాపు 649 మంది అర్జెంటీనా సైనికులు బలైపోయారు. అదే విధంగా 255 మంది బ్రిటిష్ సైనికులు, ముగ్గురు సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారు.మ్యాచ్ విషయానికొస్తే గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన సెమీఫైనల్లో అర్జెంటీనా 2-1 తేడాతో ఇంగ్లండ్పై విజయాన్ని అందుకొని వరుసగా రెండో ఫిఫాలో ఫైనల్లో అడుగుపెట్టింది. ఆదివారం జరగనున్న ఫైనల్లో స్పెయిన్తో అర్జెంటీనా తలపడనుంది. Argentina fans spat on and trampled the England flag under their feet. pic.twitter.com/pfPzzgZkIV— The Resonance (@Partisan_12) July 16, 2026చదవండి: ‘రోహిత్ రిటైర్మెంట్పై కోహ్లి రియాక్షన్ వైరల్!’ -
ఏకంగా 10 అడుగుల కోబ్రా : చున్నీలా మెడలో చుట్టేసుకుంది
బిహార్లో వర్షాలతో నదుల నీటిమట్టం పెరగడం సర్వసాధారణం. ప్రస్తుతం పశ్చిమ చంపారన్ జిల్లాలో గండక్ నది నీటిమట్టం పెరుగుతుండటంతో, వన్యప్రాణులు జనావాసాల్లోకి రావడం మొదలుపెట్టాయి. ఈ క్రమంలోనే ఏకంగా 10అడుగుల పొడవైన విషపూరితమైన కోబ్రా ఒకరి ఇంట్లోకి వచ్చింది. దీంతో ఒక్కసారిగా అక్కడంతా ఆందోళన నెలకొంది. కానీ తక్షణమే 'స్నేక్ లేడీ' రంగంలో దూకడంతో అంతా సద్దు మణిగింది.దీనికి సంబంధించిన వీడియో నెట్టింగ తెగ చక్కర్లు కొడుతోంది. పశ్చిమ చంపారన్లోని వాల్మీకినగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన వెలుగుచూసింది. గ్రామానికి చెందిన మున్నీ లాల్ అనే వ్యక్తి ఇంట్లోకి దాదాపు 10 అడుగుల పొడవైన భారీ విషసర్పం దూరింది. ఇంట్లో అంత పెద్ద పాము బుసలు కొట్టడం చూసి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా భయంతో కేకలు వేశారు. ఆ శబ్దాలు విని చుట్టుపక్కల గ్రామస్తులు కూడా అక్కడికి చేరుకోవడంతో ఆ ప్రాంతంలో కాసేపు తీవ్ర భయాందోళనలు, గందరగోళం నెలకొన్నాయి.जिन महिला के गले में आप किंग कोबरा देख रहे हैं वो हैं बिहार के बगहा में वाल्मीकिनगर की जानकी देवी और लोग उन्हें 'स्नेक लेडी' के नाम से जानते हैं. वाल्मीकिनगर के विशाहा गांव में उस समय अफरा-तफरी मच गई, जब एक आदमी के घर में करीब 10 फीट लंबा जहरीला किंग कोबरा निकल आया. तुरंत… pic.twitter.com/hna8qso1S8— Kishor Joshi (@KishorJoshi02) July 16, 2026 ఇదీ చదవండి: మూడో పెళ్లి : ఫత్వా, లవ్ జిహాద్ ఆరోపణలపై స్పందించిన ఆమీర్మహిళా స్నేక్ క్యాచర్ 'జానకి దేవి'ఇంట్లో పాము ఉన్న సమాచారం అందుకున్న స్థానిక మహిళా సర్ప మిత్ర (స్నేక్ క్యాచర్), స్నేక్ లేడీ తక్షణమే అక్కడికి చేరుకున్నారు. ఆమె ఏమాత్రం భయపడకుండా, చాలా చాకచక్యంగా ఆ భారీ కోబ్రాను పట్టుకున్నారు. పాము పొడవు చాలా ఎక్కువగా ఉండటంతో, ఆమె దాని తల భాగాన్ని చేత్తో పట్టుకుని, మిగిలిన శరీరాన్ని తన మెడలో దుపట్టా లాగా వేసుకుని అడవి వైపు బయలుదేరారు. ఈ దృశ్యం చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. అనంతరం ఆ పామును సురక్షితంగా వాల్మీకినగర్ అటవీ ప్రాంతంలో వదిలేశారు. దీంతో అటు మనుషులకు, ఇటు ఆ వన్యప్రాణికి ఎలాంటి హాని జరగకుండా కథ సుఖాంతమైంది.ఇదీ చదవండి: రూ. 150 కోట్ల ఆస్తి, తండ్రిని కాల్చి చంపిన పెద్ద కొడుకుఅటవీ శాఖ అధికారుల విజ్ఞప్తినేపాల్ నుండి వచ్చే వరద నీరు, అడవుల్లో నీరు చేరడం వల్ల పాములు, ఇతర వన్యప్రాణులు సురక్షిత ప్రాంతాల కోసం జనావాసాల్లోకి వస్తున్నాయని అటవీశాఖ తెలిపింది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇళ్ల చుట్టుపక్కల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పాములు కనిపిస్తే వాటిని చంపకుండా, వెంటనే అటవీ శాఖకు లేదా శిక్షణ పొందిన స్నేక్ క్యాచర్లకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఇదీ చదవండి: ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు : వాంగ్చుక్ భావోద్వేగ సందేశం -
అక్కడ చిన్నారులకు..చిన్నప్పటి నుంచే ఆ జీవన నైపుణ్యాలు..!
విదేశీయలు మన భారతీయ పెంపకాన్ని మెచ్చుకుంటూ.. ఇక్కడ సంస్కృతికి అనుగుణంగా తమ పిల్లలను పెంచుకుంటామని చెప్పడం గురించి విన్నాం. కొందరు ఏకంగా ఇక్కడే తమ పిల్లల పెంపకం కోసం స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు కూడా. తాజాగా నెట్టింట వైరల్ అవుతున్న పోస్ట్ అందుకు పూర్తి విభిన్నం. ఆ పోస్ట్లో ఒక భారతీయ మహిళ విదేశీయుల నుంచి ఈ పేరెంటింగ్ టిప్స్ నేర్చుకున్నా అంటూ తన యూరప్ పర్యటన గురించి పంచుకుంది. ఇంతకీ ఏంటా పేరెంటింగ్ చిట్కాలంటే..తరుచుగా తల్లుల ఆరోగ్యం గురించి మాట్లాడే డాక్టర్ సుఖ్మణి గుంబర్ నెలరోజుల యూరప్ పర్యటనలో నేర్చుకున్న విలువైన పెంపకపు చిట్కాలివే అంటూ ఓ వీడియోని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ఆ వీడియోలో ఆమె యూరోపియన్ పెంపకపు శైలులు, ఆధునిక పోకడలకు ఎలా భిన్నంగా ఉంటాయో సోషల్ మీడియా వేదికగా పేర్కొంది. పిల్లల పెంపకం అంటే తరుచుగా రోజువారీ పనులను మరింత సులభతరం చేసుకోవడమేనని అంటోందామె. అంతేగాదు తను అక్కడ గమనించి తెలుసుకున్న ఆ ఐదు పేరెంటింగ్ టిప్స్ పిల్లల పెంపకంలో అద్భుతంగా పనిచేస్తాయని చెబుతోంది. ఆ ఐదు ఇవే..పిల్లలను మన రోజువారీ పనుల్లో భాగం చేసుకోవాలని సూచిస్తోంది. కేఫ్లలో భోజనం చేయడం దగ్గర నుంచి రోజువారీ జర్నీలో ఇలా ప్రతి కార్యకలాపంలో వారిని భాగస్వామ్యులను చేయాలని అంటోందామె. తద్వారా సర్దుకుపోవడం, ఓపికతో ఉండటం నేర్చుకుంటారట.నిరంత స్క్రీన్ సమయాలు, క్రమబద్ధమైన ఆటలే కాకుండా బోరుగా ఫీలయ్యేలా చేయడం కూడా మంచిదేనట పిల్లకు. అది విసుగుని పరిచయం చేసి, సహనంతో వ్యవహరించే జీవిత నైపుణ్యాన్ని అందిస్తుందట.బహింరంగ ప్రదేశాల్లో అంటే రెస్టారెంట్లు లేదా ఫంక్షన్స్లలో వాళ్లతో కలిసి భోజనం చేయాలి. దాంతో బయటకొచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలి, ఎలా మర్యాదగా నడుచుకోవాలో నేర్చుకుంటారని చెబుతోంది.అలాగే పిల్లలు తినే విషయంలో పెద్దలను అనుకరిస్తారు. ఒక్కోసారి మీరు తినేవే తింటానని పట్టుబట్టే ప్రయత్నం చేస్తుంటారు. అలాంటప్పడు మొదట మీరే తినకుండా.. ఆయా ఆహారాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తే ఆటోమేటిగ్గా వాళ్లు కూడా తమను తాము నియంత్రించడానికి ప్రయత్నిస్తారట.భారతీయ తల్లిదండ్రులు పిల్లలు బహిరంగ ప్రదేశాల్లో గనుక మారాం చేస్తూ.. ఏడుస్తుంటే గాబరపడుతుంటారు. అదే యూరోపియన్ పేరెంట్స్ ఎలాంటి ఆందోళన లేకుండా కూల్గా వ్యవహరిస్తూ..ప్రశాంతంగా పిల్లలతో మాట్లాడతారని అంటోంది. మన రోజువారి కార్యపాలలో వారిని భాగం చేస్తూ..సర్దుకుపోవడం, మర్యాదగా నడుచుకోవడం, ఓపికతో వ్యవహరించడం నేర్పిస్తే ..స్వతంత్ర వ్యక్తులుగా పెరగడానికి అవకాశం దొరకుతుందని డాక్టర్ గంబర్ చెబుతోంది. నెటిజన్లు కూడా ఆమె పోస్ట్కి మద్దతిస్తూ..సరిగ్గా చెప్పారంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Dr.Sukhmani Gumber | Motherhood & Wellness (@dr.sukhmanigumber) (చదవండి: మామ్ వెయిట్లాస్ స్టోరీ..! 103 కిలోలు నుంచి 71 కిలోలకు..) -
మామ్ వెయిట్లాస్ స్టోరీ..! 103 కిలోలు నుంచి 71 కిలోలకు..
వెయిట్లాస్ ఒక్కోక్కరూ ఒక్కో విధానం అనుసరిస్తూ బరువు తగ్గుతారు. బరువు తగ్గించుకోవడమే కాదు దాన్ని అదుపులో ఉంచుకునేలా మెయింటైన్ చేయడమే అత్యంత ముఖ్యం అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. శరీరానికి అనుగుణంగా, నిలకడైన జీవనశైలితో నిధానంగా బరువు తగ్గడం అన్ని విధాల మేలు అని అందరికీ తెలిసిందే. ఆ విధంగానే ఈ ఇన్ఫ్లుయెన్సర్ మామ్ అనుసరించి ఏకంగా 32 కిలోలు తగ్గింది. అంతేగాదు అందుకోసం తాను ఏమి అనుసరించిందో కూడా ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చసుకుంది. మరి అవేంటో చూద్దామా.!.శాన్ డియాగోకు చెందిన ఇన్ఫ్లుయెన్సర్, తానియా అనే పిల్లల తల్లి వెయిట్లాస్ జర్నీ ఇది. ఆమె 103 కిలోల నుంచి 71 కిలోలకు తగ్గిన జర్నీని షేర్ చేసుకుంది. అంతలా 32 కిలోలు తగ్గడానికి సులభమైన నిలకడైన అలవాట్లే కారణమని అంటోంది. తాను ప్రధానంగా ఆరోగ్యకరమైన ఆహారం తినడం, వ్యాయామం చేయడంపై దృష్టిసారించానని అంటోంది. మూడేళ్లలో దీన్ని సాధించానని పేర్కొంది. తాను వెయిట్ట్రైనింగ్, యోగ ద్వారా బరువు తగ్గినట్లు పోస్ట్లో తెలిపింది. ఇంట్లోనే సులభంగా బరువు తగ్గాలంటే ఐదు పనులు చేయాలని వెల్లడించింది. అవేంటంటే..ప్రోటీన్రోజుకు 3 సార్లు కనీసం 30 గ్రాముల ప్రోటీన్ తీసుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించింది. ప్రాసెస్ చేసిన ప్రోటీన్ల కంటే..సహజసిద్ధమైన వాటికే ప్రాధాన్యత ఇచ్చానని తెలిపింది. బరువు తగ్గాలనుకుంటే రోజుకి శరీరానికి తగినంత ప్రోటీన్ మస్ట్ అని అంటోందామె.వ్యాయామంలో సౌలభ్యం..ఒక తల్లిగా, ఖచ్చితమైన' వ్యాయామ సమయం కోసం వెతకడం మానేశాను. కొన్ని రోజులు ఉదయం 5 గంటలకు, కొన్ని రోజులు నా బిడ్డ నిద్రపోతున్నప్పుడు మధ్యాహ్నం 3 గంటలకు, మరికొన్ని రోజులు అందరూ నిద్రపోయిన తర్వాత రాత్రి 9 గంటలకు కూడా వ్యాయామం చేశానని ఆమె చెప్పుకొచ్చింది. తన ఉద్దేశ్యంలో క్రమంతప్పకుండా చేయగలిగే సమయమే ఉత్తమమైన వ్యాయామ సమయం అని చెబుతోందామె. కచ్చితమైన షెడ్యూల్ అంటూ టై వేస్ట చేయొద్దని హెచ్చరించింది. జీవితానుగుణంగా కదలికలు ఉండేలా చూసుకోవడమే ముఖ్యం అని అంటోందామె. బరువులు ఎత్తడంతమకు సాధ్యమైనంత బరువును ఎత్తాలి. వారానికి 3 సార్లు బరువులు ఎత్తాలి. తక్కువ బరువుతో ప్రారంభించండి, క్రమబద్ధతను పెంచుకోమని చెబుతోంది. అలాగే పూర్తి శరీర వ్యాయామాలపై దృష్టి పెట్టండి, నెమ్మదిగా బరువులను పెంచుతూ పోవాలని సూచించింది.శరీరానికి తగినంత నీరు..హైడ్రేటెడ్గా ఉన్నారని నిర్ధారించుకోండి. రీర బరువులో సగం ఔన్సుల నీటిని తాగాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది.ఉదాహరణకు:బరువు 120 పౌండ్లు అయితే, రోజుకు 60 ఔన్సులు తాగాలని లక్ష్యంగా పెట్టుకోండి. హైడ్రేటెడ్గా ఉండటం శక్తికి, కోలుకోవడానికి మద్దతు ఇస్తుంది, అలాగు అత్యుత్తమ పనితీరును కనబరచడానికి సహాయపడుతుంది.నిద్రవీలైనంత నాణ్యమైన నిద్రను లక్ష్యంగా పెట్టుకోండి. ప్రసవానంతర దశలో ఉంటే, కొన్ని రాత్రులు పరిపూర్ణంగా ఉండకపోవచ్చని అయినప్పటికీ ఫర్వాలేదని అంటోందామె. అలాంటి తల్లులు వీలైనప్పుడల్లా విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వండి, ఎందుకంటే కోలుకోవడం, కొవ్వు తగ్గడం, కండరాల నిర్మాణం, మొత్తం ఆరోగ్యం అన్నీ దానిపైనే ఆధారపడి ఉంటాయి.ఇలా కనీసం ఆరు నుంచి 12 వారాల పాటు ప్రయత్నించి చూస్తే..కచ్చితంగా మనలోని మార్పు మనమే స్వయంగా చూస్తామని నమ్మకంగా చెబుతోంది. అంతేగాదు ఇలా క్రమంతప్పకుండా చేస్తే..ఆలోచనా విధానంలో మార్పు తోపాటు శరీరం కూడా బలంగా మారడాన్ని చూస్తామని అంటోంది.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by TaniaUnplugged | Yoga&More (@taniaunplugged) (చదవండి: అత్యంత క్లిష్టమైన అరుదైన కణితిని విజయవంతంగా తొలగించిన వైద్యులు) -
చీరతో విదేశీ వనిత పాట్లు..! ఆ మహిళా కానిస్టేబుల్..
నెట్టింట చక్కెర్లు కొడుతున్న వీడియో..మన దేశ ఆతిథ్యం తోపాటు, మన భారతీయ చీర గొప్పదనాన్ని చాటింది. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్ల అమితంగా ఆకర్షిస్తోంది. ఆ వీడియోలో ఆగ్రాలలోని తాజ్మహల్వద్ద ఒక అర్జెంటిన పర్యాటకురాలికి చీర సరిచేసుకోవడంలో సహాయం చేస్తుండటం స్పష్టంగా కనిపిస్తోంది. సాంప్రదాయ వస్త్రధారణ తెలియని ఆ పర్యాటకురాలు యూపీ పోలీసులకు ధన్యవాదాలు అని తెలపడంతో ఒక్కసారిగా ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. తన పోలీసులు విధులకు మించి సాయం చేయడానికి ముందుకు వచ్చిన సదరు కానిస్టేబుల్పై ప్రశంసలు వెల్లువెత్తాయి. అంతేగాదు భారతదేశా అతిథ్యం, పర్యాటకుల పట్ల స్నేహపూర్వకమైన పోలీసింగ్ని హైలెంట్ చేశారు మేడం అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురింపించారు. అలాగే కొందరు నెటిజన్లు తాజ్ మహల్ సందర్శన సమయంలో చీర ధరించి భారతీయ సంస్కృతిని స్వీకరించినందుకు ఆ విదేశీ మహిళను కూడా అభినందిస్తూ పోస్టులు పెట్టారు. కాగా, ఈఘటన యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన తాజ్మహల పశ్చిద్వారా వద్ద చోటు చేసుకుంది. దీనిపై యూపీ పోలీసు అధికారుల కూడా స్పందించారు. అవసరమైనప్పుడు దేశీయ , అంతర్జాతీయ పర్యాటకులిద్దరికీ సహాయం అందించేలా తాజ్ సెక్యూరిటీ పోలీస్ సిబ్బందిని ప్రోత్సహిస్తుందని అధికారులు తెలిపారు. View this post on Instagram A post shared by BENARAS GLOBAL TIMES (@benarasglobaltimes) (చదవండి: కుమారుడి సర్ప్రైజ్ గిఫ్ట్..! కన్నీటి సంద్రంలో తండ్రి) -
కుమారుడి సర్ప్రైజ్ గిఫ్ట్..! కన్నీటి సంద్రంలో తండ్రి
తలిదండ్రులు తమ పిల్లల చదవుల కోసం, వారి ఉన్నతి కోసం ఎన్నెన్నో త్యాగాలు చేస్తారు. పిల్లల మంచి భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమ పడతారు. ఆ బిడ్డ ప్రయోజకుడై వాళ్ల కష్టాన్ని గుర్తించి..కోల్పోయిన వాటిని తిరిగి ఇవ్వగలిగితే..ఆ పేరెంట్స్కి మించిన అదృష్టవంతులు మరెవ్వరూ ఉండరు. అలాంటి ఆనందాన్నే తిరిగి ఇచ్చాడు కేరళకు దీప్ నీలమ్. అంతేగాదు కుమారుడి ఊహించని చర్యకు ఆ తండ్రి కళ్లలలో నీళ్లు తిరిగాయ్.అసలేం జరిగిందంటే..కేరళకు దీప్ నీలిమ్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన వీడియో నెటిజన్లకు తెగ ఆకట్టుకుంది. ఆ వీడియోలో తనను ఎప్పటికీ వీడిపోని జ్ఞాపకాలతో మొదలవుతుంది. అతన పాఠశాలలో చదువుతున్నప్పుడు తన తండ్రి తాను ఎప్పటికీ ఎస్యూవీని కొనని అమ్మతో చెప్పడం విన్నానని చెప్పుకొచ్చాడు.ఎందుకంటే తన చదువుకి పెట్టుబడి కోసం తక్కువ ఖరీదైన కారుతో సరిపెట్టుకున్నట్లు తెలిపాడు. అయితే తాను కచ్చితంగా ఆయన పదవీవిరమణ సమయానికి తన డ్రీమ్ వాహనాన్ని కొంటానని తండ్రికి వాగ్దానం చేసినట్లు చెప్పుకొచ్చాడు నీలిమ్. ఆరోజు నుంచే తన తండ్రి కోరికను ఎలాగైన నెరవేర్చాలని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాడట. అయితే అనుకోకుండా తన జీవితం కాస్త ముందుగానే ఆ అవకాశం ఇచ్చిందని చెప్పాడు. తాను ఐఐఎం కోజికోడ్ నుంచి పట్టభద్రుడైన కేవలం ఆరు నెలలకే, తన చిన్ననాటి వాగ్దానం నిజం చేసుకోగలిగానని ఆనందంగా చెప్పాడు. ఎందుకంటే తాను కేపీఎంజీలో జాబ్ సంపాదించడంతో అది సులభమైందని అన్నాడు. అందుకే తన తండ్రి కోరికను నెరవేర్చిన క్షణం చిరస్మరణీయం ఉండేలా టెస్ట్ డ్రైవ్ చేద్దామనే నెపంతో ఆయనను ఒక కార్ షోరూమ్కు తీసుకువెళ్లినట్లు చెప్పాడు. ఆ ఎస్యూవీ వాహనం చూశాక గానీ ఆ తండ్రికి తెలియలేదు అప్పటికే కొడుకు ఆ కారుని కొనుగులు చేసినట్లు. అంతే ఒక్క క్షణం సంభ్రమాశ్చర్యాలకు లోనవ్వుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అంతేగాదు నీలమ్ ఇది తనకు జాబ్ ఆఫర్, ప్రమోషన్ కంటే ఎక్కువ ఆనందాన్ని ఇచ్చే విషయం అంటూ తన పోస్ట్ని ముగించాడు. పైగా నీలమ్ ఆ వీడియోకి తమ కలల కన్నా పిల్లల కలలకే ప్రాధాన్యత ఇచ్చే ప్రతి తల్లిదండ్రులకు తలవంచి నమస్కరిస్తున్నా అని క్యాప్షన్ జోడించి మరి పోస్ట్ చేశాడు. నెటిజన్లు నీలమ్పై ప్రశంసల వర్షం కురిపిస్తూ..ఈ పోస్ట్ మా పేరెంట్స్ త్యాగాలను గుర్తు చేసిందంటూ భావోద్వేగంగా పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Dip Nilim | IIM Kozhikode (@miles.and.mindset__) (చదవండి: స్లోవేకియా నాయకుడు రిచర్డ్ 'థేకువా స్వీట్'రుచికి ఫిదా! ఎలా తయారు చేస్తారంటే..) -
స్లోవేకియా నాయకుడు రిచర్డ్ 'థేకువా స్వీట్'రుచికి ఫిదా!
ప్రధాని నరేంద్ర మోదీ తన స్లోవేకియా పర్యటన సందర్భంగా ఆ దేశ జాతీయ మండలి ఛైర్మన్ రిచర్డ్ రాసికి థేకువాను గిప్ట్గా ఇచ్చారు. ఆ తర్వాతా ఆ నాయకుడు ఆ మిఠాయి పెట్టలోని థేకువా స్వీట్ని రుచి చూసిన వీడియోని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ నేపథ్యంలో ఆ మిఠాయి అందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది. ఆ వీడియోలో ప్రధాని మోదీ నుంచి తాను అందుకున్న ఈ సాంప్రదాయ మిఠాయిల పెట్టేను తన ఫాలోవర్లకు చూపించారు. ఆ సంప్రదాయ చెక్పెట్టెను తెరుస్తూ..ఇలాంటి బహుమతులు ఇవ్వాలన్న ఆలోచనే అత్యద్భుతమని కొనియాడారు. ఇది సాధారణ దౌత్య బహుమతులకు అతీతమైనదని అన్నారు. ఆ స్వీట్ని బిస్కెట్లతో పోలుస్తూ.థేకువా రుచి చూశారు. అంతేగాదు ఆ స్వీట్ రుచికి ఫిదా అయ్యారు కూడా. మరి ఈ సందర్భంగా ఆ స్వీట్ తయారీ, ఏ ప్రాంతాల వారు ఎక్కువగా ఆస్వాదిస్తారు వంటి విషయాలు గురించి సవివరంగా తెలుసుకుందామా..!.ఇది బయట కరకరలాడుతూ, లోపల కొద్దిగా మెత్తగా, పొడిపొడిగా ఉంటుంది. ఈ తీపి వంటకానికి 'థోక్నా' అనే హిందీ పదం నుంచి ఆ పేరు వచ్చిందని చెబుతుంటారు పాకశాస్త్ర నిపుణులు. థేకువా అంటే ..థేకువా (Thఆkuwa) అనేది భారతదేశంలోని బీహార్, ఉత్తరప్రదేశ్, నేపాల్ ప్రాంతాలలో ఎంతో ప్రాచుర్యం పొందిన సాంప్రదాయ తియ్యటి బిస్కెట్ లేదా వంటకం. దీనిని ముఖ్యంగా ఛత్ పూజ (Chhath Puja) వంటి పవిత్రమైన పండుగలలో నైవేద్యంగా తయారు చేస్తారు. దీన్ని ప్రధానంగా గోధుమ పిండి, బెల్లం, నెయ్యి, సోంపు గింజలు, యాలకులు , కొబ్బరి తురుముతో తయారు చేస్తారు. కావాలనుకుంటే తరిగిన డ్రైఫ్రూట్స్ను కూడా కలుపుతారు. తయారీ విధానం..ముందుగా ఒక పెద్ద గిన్నెలో గోధుమ పిండి, చిటికెడు ఉప్పు, సోంపు గింజలు, తురిమిన కొబ్బరి, యాలకుల పొడిని కలపాలి. ఆ తర్వాత నెయ్యిని పోసి కలపాలి. పిండిని ముద్దగా అయ్యేంత వరకు నెయ్యి వేసి కలపాలి. ఆ తర్వాత బెల్లాన్ని నీటిలో కరిగించి పాకంలా కాకుండా జస్ట్ బెల్లం కరిగేంత వరకు మరిగించాలి. ఆతర్వాత ఆ బెల్లం నీళ్లు వేస్తూ..నిరంతర కలుపుతూ చపాతీ పిండిలా చేసుకోవాలి. ఆ తర్వాత చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని బిస్కెట్ల మాదిరిగా చేతులతో ఒత్తాలి. కావాలనుకుంటే ఫోర్క్ లేదా ఏదైన డిజైన్ని రూపొందించుకోవచ్చు. అలా అన్నింటిని చేయాలి. అలాగే ఆ పిండి ముద్దలు ఆరిపోకుండా బట్ట కప్పాలి. ఆ తర్వాత వాటిని నూనెలో డీప్ఫ్రై చేస్తే సరి. అంతే ఎంతో రుచికరమైన థేకువా రెడీ. ఇంకెందుకు ఆలస్యం ట్రై చేసి చూడండి మరి. ముఖ్యంగా వర్షాకాలం, శీతకాలం సాయంత్రం సమయంలో టీ తాగుతూ వీటిని తింటుంటారు.Diplomacy is also about the small gestures that bring people closer. During @narendramodi’s visit to Slovakia, I received traditional Thekua from Bihar and presented him with Slovak spa wafers inscribed in Hindi. Such moments strengthen the ties between our countries. 🇸🇰🤝🇮🇳 pic.twitter.com/dgBlOlNYMO— Richard Raši (@Richard_Rasi) July 14, 2026 (చదవండి: ఆరోగ్యం క్షీణిస్తున్నా..నిరాహార దీక్షలోనే సోనమ్! అన్ని రోజులు ఆహారం తీసుకోకపోతే..) -
స్టార్ హీరో ఇంట్లోకి ఏలియన్స్.. వీడియో వైరల్
హాలీవుడ్ ప్రముఖ నటుడు, ఆస్కార్ నామినీ జేమ్స్ ఫ్రాంకో సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక వీడియో ఇప్పుడు నెట్ ఇంట తీవ్ర దుమారం రేపుతోంది. తన కొత్త టిక్టాక్ ఖాతా ద్వారా ఆయన పంచుకున్న ఈ వీడియోలో... ఏలియన్స్ తనను అనుసరిస్తున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ వీడియో బయటకు వచ్చిన వెంటనే నెటిజన్లు, ఆయన అభిమానులు తీవ్రస్థాయిలో విమర్శలు, ట్రోలింగ్ మొదలుపెట్టారు. అసలు ఫ్రాంకో మానసిక స్థితి బాగుందో లేదోనంటూ పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.అసలేం జరిగింది?జులై 13న జేమ్స్ ఫ్రాంకో తాను ఒక పెద్ద సత్యాన్ని ప్రపంచానికి వెల్లడించబోతున్నట్లు ప్రకటించి అందరిలోనూ ఆసక్తి రేకెత్తించారు.ఆ తర్వాత విడుదల చేసిన వీడియోలో.. తన ఇంట్లో కొన్ని వింత విషయాలను కనుగొన్నట్లు చెప్పారు. ఇది తనకు ఇష్టం లేకపోయినా తనపై బలవంతంగా రుద్దబడిందని పేర్కొన్నారు. నిజాలు బయటపెట్టకుండా ఉండేందుకు తనకు బెదిరింపులు కూడా వచ్చాయని, ప్రజలు తనను పిచ్చివాడిగా ముద్ర వేస్తున్నారని ఫ్రాంకో ఆరోపించారు.ఆ వీడియోలో ఏముంది?ఫ్రాంకో తన ల్యాప్టాప్లో రికార్డ్ చేసిన కొన్ని 'బ్లాక్ అండ్ వైట్' దృశ్యాలను ఈ వీడియోలో చూపించారు. అందులో ఒక ఏలియన్ చెట్టు వెనుక దాక్కుని, కిటికీ గుండా లోపలికి చూస్తున్నట్లు కనిపిస్తుంది. అంతేకాకుండా, ఆ జీవి యొక్క పొడవైన వేళ్లు కిటికీపై నొక్కుతున్న దృశ్యాలు కూడా స్పష్టంగా అందులో రికార్డ్ అయ్యాయి.ఫేక్ వీడియోఈ వీడియో వైరల్ అయినప్పటికీ, నెటిజన్లు మాత్రం దీన్ని అస్సలు నమ్మడం లేదు.‘ఇది పూర్తిగా నకిలీ వీడియో. హాలోవీన్ దుకాణం నుండి కొనుగోలు చేసిన ఒక చౌకైన మాస్క్ను ఎవరో ధరించి ఈ డ్రామా ఆడుతున్నారు’ అని విమర్శకులు కొట్టిపారేస్తున్నారు.మరికొందరు, ఈ వీడియోను ఇంకాస్త స్పష్టంగా చూడాలంటే తమ ఛానెల్కు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలని కోరడంపై తీవ్రంగా మండిపడుతున్నారు. డబ్బులు సంపాదించడానికి ఇదొక మోసపూరిత చర్య అని ఫైర్ అవుతున్నారు.సినిమా ప్రమోషన్స్ కోసమా?'127 అవర్స్' వంటి అద్భుతమైన చిత్రంతో ఆస్కార్ నామినేషన్ అందుకున్న జేమ్స్ ఫ్రాంకో లాంటి నటుడు ఇలాంటి చౌకబారు పనులు ఎందుకు చేస్తారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే, త్వరలో విడుదల కానున్న ఆయన సరికొత్త చిత్రం 'లవ్ మీట్స్ ఇన్ ది సన్షైన్' ప్రమోషన్లో భాగంగానే ఈ 'పబ్లిసిటీ స్టంట్' చేసి ఉంటారని సినీ పరిశ్రమలో గట్టిగా చర్చ నడుస్తోంది. గతంలో కూడా ఫ్రాంకో ఇలాంటి ఫ్రాంక్ వీడియోలు చేసి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన దాఖలాలు ఉన్నాయి.James Franco Drops His Alien Footage. Crystal clear alien in 4k. James Franco poker face.Either the footage is real or James Franco lost his mind. pic.twitter.com/dDksbGShbe— Good Morning UFO (@goodmorningufo) July 13, 2026 -
ప్లీజ్ పట్టుచీరను ఎలా ఉతకాలో చెప్పరు..!: ఓ విదేశీ మహిళ అభ్యర్థన
మహిళామణులకు పట్టు చీర అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అదివాళ్లకు ఒక వస్త్రం మాత్రమే కాదు ఒక హుందాతనాన్ని, పండుగ వాతావరణాన్ని అందించే జ్ఞాపకాల చీర. ఆ చీరలో వాళ్లకు ఏళ్ల తరబడి పదిలంగా దాచుకున్న జ్ఞాపకాలు ఉంటాయి. అలాంటి చీర భారతీయ మహిళలకే కాదు విదేశీ వనితల మనసులను సైతం గెలుచుకుంది. అలాంటి మన భారతీయ పట్టుచీరను కొనుకున్న ఓ విదేశీ మహిళ దాన్ని ఎలా ఉతకాలో తెలియక ఇబ్బందిపడుతున్నా..దయచేసి ఏదైన సలహా ఇవ్వరు అంటూ వీడియో రికార్డు చేసి మరి సోషల్ మీడియాలో షేర్ చేసింది.నెట్టింట పంచుకున్న వీడియోలో ఆ విదేశీ మహిళ భారతీయ మహిళలను ఉద్దేశించి ఒక అభ్యర్థన చేసింది. తన అందమైన పట్టు చీరను చూపిస్తూ..దాని లేబుల్పై డ్రైక్లీనింగ్ చేసి ఉతకాలని ఉంది. అయితే తాను ఉండే ఆస్ట్రేలియన్ బుష్లో డైక్లీనింగ్ సర్వీస్ సమీపంలో లేదని, అందువల్ల ఈ పట్టుచీరను ఎలా ఉతకాలో సలహా ఇవ్వరా ప్లీజ్ అని కోరింది. తాను ఆస్ట్రేలియాలోని ఓ మారుమూల ప్రాంతంలో ఉంటానని, అందువల్ల ఇది పాడవ్వకుండా ఎలా ఉతకాలో చక్కటి చిట్కా గానీ సలహా గానీ చెప్పమని అభ్యర్థించిందామె. తాను భారత పర్యటనలో ఈ అందమైన చీర కొన్నానని చెప్పింది. ఈ సున్నితమైన పట్టు వస్త్రంపై ఉన్న క్లిష్టమైన ఎంబ్రాయిడరీ కారణంగా ఉతకడానికి భయపడుతున్నట్లు పేర్కొంది. ఉతకడంలో ఏ చిన్న పొరపాటు జరిగినా..చీర మొత్తం పాడైపోతుంది, అందువల్ల ఎలా ఉతకాలో నేర్పించరు అంటూ తన వీడియోని ముగించింది. అంతేగాదు అందుకు సంబంధించిన చిట్కాలు, సలహాలు కామెంట్ బాక్స్లో పంచుకోమని, తాను వినడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చింది. అలాగే ఎల్లప్పుడూ తన అనుమానాలు, సందేహాలు నివృత్తి చేసే ఆన్లైన్ కమ్యూనిటీకి ధన్యావాదాలు కూడా చెప్పారామె. ఆమె అభ్యర్థనకు నెటిజన్లు స్పందించడమే కాదు పలు రకాల సలహాలు, సూచనలు అందించారు. చాలామంది మహిళలు కఠినమైన డిటర్జెంట్కి బదులుగా షాంపుతో ఉతికి నీడలో ఆరేసి భద్రపరచుకుంటే సరిపోతుందని సలహాలు ఇచ్చారు. అంతేగాదు బ్రష్ ఉపయోగించొద్దని, చేతులతోనే సున్నితంగా రుద్దమని కూడా సూచించారు. View this post on Instagram A post shared by Lea Murray (@lea_murray90) (చదవండి: శస్త్ర చికిత్స లేకుండా ఏఐ ఎండోమెట్రియోసిస్ను నిర్థారించగలదా? బ్రయాన్ జాన్సన్ గర్లఫ్రెండ్..) -
బాబు సభ నుంచి వెళ్ళిపోతున్న జనం వైరల్ అవుతున్న వీడియో
-
మంటల్లో కారు.. ఢిల్లీ టన్నెల్లో టెక్నాలజీతో తప్పిన ముప్పు!
రోడ్డు ప్రమాదాలు, వాహనాల్లో అగ్నిప్రమాదాలు పెరుగుతున్న వేళ.. సకాలంలో స్పందించడమే ప్రాణాలను కాపాడే కీలక అంశంగా మారింది. అయితే చాలా సందర్భాల్లో మానవ ప్రమేయంతో అప్రమత్తమయ్యేలోపే మంటలు వేగంగా వ్యాపించి భారీ నష్టం జరుగుతోంది. అగ్నిమాపక సిబ్బంది చేరుకునే సమయానికి పరిస్థితి అదుపు తప్పుతున్న ఘటనలు కూడా చూస్తూనే ఉన్నాం. కానీ ఆధునిక సాంకేతికతతో ఏర్పాటు చేసిన భద్రతా వ్యవస్థలు ఎంత వేగంగా పనిచేస్తాయో చూపించే ఘటన ఒకటి ఇప్పుడు వైరల్గా మారింది. దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోని గురుగ్రామ్–ద్వారకా ఎక్స్ప్రెస్వేలోని ఎయిర్పోర్ట్ టన్నెల్లో ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగగా.. అక్కడి ఆటోమేటిక్ ఫైర్ సేఫ్టీ సిస్టమ్ క్షణాల్లో స్పందించింది. టన్నెల్లో ప్రయాణిస్తున్న ఓ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే దట్టమైన పొగ వ్యాపించింది. దీంతో టన్నెల్లో ఉన్న వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.అయితే ప్రమాదాన్ని గుర్తించేందుకు మనుషులపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా.. టన్నెల్లో ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ ఫైర్ డిటెక్షన్ అండ్ సప్రెషన్ సిస్టమ్ వెంటనే పనిచేసింది. మంటలు గుర్తించిన వెంటనే స్ప్రింక్లర్లు యాక్టివేట్ అయి నీటిని వెదజల్లాయి. దీంతో మంటలు పెద్దగా వ్యాపించకముందే అదుపులోకి వచ్చాయి.ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. కారులో ఉన్నవారు సురక్షితంగా బయటపడినట్లు సమాచారం. అయితే మంటల కారణంగా వెలువడిన పొగతో కొంతసేపు టన్నెల్ పరిసరాల్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత రాకపోకలను పునరుద్ధరించారు.A car caught fire today inside the Airport Tunnel on the Gurugram–Dwarka Expressway, filling the tunnel with smoke.As visibility dropped, vehicles halted outside the tunnel, while the tunnel's automatic fire safety system activated immediately, switching on the sprinklers. The… pic.twitter.com/MfmL8Ouavb— Megh Updates 🚨™ (@MeghUpdates) July 13, 2026టెక్నాలజీ ఉంటే ఎంత తేడా?సాధారణంగా టన్నెల్లలో అగ్నిప్రమాదాలు అత్యంత ప్రమాదకరమైనవి. పరిమిత స్థలం, పొగ వేగంగా వ్యాపించడం, అత్యవసర సమయంలో బయటకు రావడంలో ఇబ్బందులు కారణంగా పరిస్థితి తీవ్రంగా మారే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆటోమేటిక్ భద్రతా వ్యవస్థలు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే స్పందించడం వల్ల మంటలు విస్తరించకుండా అడ్డుకోవచ్చు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మంటలు చెలరేగిన వెంటనే టన్నెల్ సేఫ్టీ సిస్టమ్ యాక్టివేట్ కావడం, స్ప్రింక్లర్లు పనిచేయడం చూసి.. అత్యవసర సమయాల్లో ఆధునిక టెక్నాలజీ ఎంత కీలకమో నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. -
దుబాయ్ లో కంప్యూటర్ జాబ్ అంటే ఏంటో బయటపెట్టిన తెలుగోడు
-
కదులుతున్న రైలులో పూజలు..! వీడియో వైరల్..
రైలు బోగినే హనీమూన్ సూట్గా మార్చిన ఘటన మరువక ముందే మరో రైలు ఘటన నెట్టింట వైరల్గా మారింది. కదులుతున్న రైలులో పూజ పరమైన కార్యక్రమాలు జరుగుతున్న వీడియో..నెట్టించ చర్చలకు దారితీసింది. భారతీయ రైల్వేలోనే ఇలాంటి వాటికి అనుమతి ఉంటుందా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆ వీడియలోఓ ప్రయాణికులు రైలు కోచ్ లోపల మతపరమైన పూజ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు స్పష్టంగా కనిపించడంతోనే ఇలా కదులుతున్న రైలు ఇలాంటి ఆచారాలు నిర్వహించుకోవచ్చా అనే ప్రశ్నలు వెల్లువెత్తాయి. ఈ ఘటన ఉత్తర మధ్య రైల్వేలో చోటు చేసుకుంది. అయితే రైలులో ఇలాంటి వాటికి అనుమతి ఉంటుందా అని అంతా అనుమానాలు వ్యక్తం చేశారు. దీనిపై ఉత్తర రైల్వే ఇలా వివరణ ఇచ్చింది. ఈ వైరల్ వీడియో ఘటనతో ఉత్తరరైల్లే ఇలా వివరణ ఇచ్చింది. ఐఆర్సిటిసి (IRCTC) ద్వారా వాణిజ్య బుకింగ్ ద్వారా ప్రేవేట్గా బుక్ చేసుకున్న సెలూన్ కోచ్గా పేర్కొది. అందులోనే ఈ మతపరమైన ఆచారాలు జరిగినట్లు ఉత్తర రైల్వే స్పష్టం చేసింది. ఆ కార్యక్రమం సాధారణ ప్యాసింజర్ కోచ్లో కాకుండా IRCTC ద్వారా ఒక ప్రైవేట్ వ్యక్తి బుక్ చేసుకున్న సెలూన్ కోచ్లో జరిగిందని తెలిపింది. ఈ సెలూన్ కోచ్ అనేది సీనియర్ రైల్వే అధికారులు, వీఐపీల కోసం ఉద్దేశించిన విలాసవంతమైన ప్రైవేట్ బోగీ. ఇందులో ఎయిర్ కండిషన్డ్ బెడ్రూమ్లు, ఒక చిన్న వంటగది, లివింగ్, డైనింగ్ రూమ్ల తోకూడిన వాష్రూమ్ సౌకర్యాలు ఉంటాయి. ఆ వ్యక్తి ఈ వాణిజ్య రిజర్వేషన్ కోసం అడ్వాన్స్గా రూ. 3 లక్షలకు పైగా జమ చేసినట్లు పేర్కొంది. ఈ సెలూన్ కోచ్ను జూలై 10న న్యూఢిల్లీ (NDLS) నుంచి ముంబై (BDTS)కి వన్-వే ప్రయాణం కోసం రైలు నెం. 12926 పశ్చిమ్ ఎక్స్ప్రెస్కు జతచేయాల్సి ఉందని వెల్లడించింది. అదే సమయంలో ప్రయాణికుల భద్రత, రైళ్లు సజావుగా నడపడం తమ అత్యంత ప్రాధాన్యత అని రైల్వే అదికారులు నొక్కి చెప్పారు. Hello @AshwiniVaishnaw, was this approved by @RailMinIndia? If so, What is the procedure? pic.twitter.com/9VUJP53lJQ— Mohammed Zubair (@zoo_bear) July 12, 2026 (చదవండి: 15 ఏళ్లకే చదువుకి మానేసింది..! కట్చేస్తే రూ 7 వేల కోట్ల కంపెనీ..) -
ఇషాన్ కిషన్ గొప్ప మనసు
భారత వికెట్కీపర్-బ్యాటర్ ఇషాన్ కిషన్ తన మానవత్వాన్ని చాటుతూ పాకిస్థాన్కు చెందిన ప్రత్యేక అవసరాలున్న (శారీరక వైకల్యం) ఓ అభిమానికి మరపురాని అనుభూతిని అందించాడు. ఇంగ్లండ్తో జరిగిన ఐదో, చివరి టీ20 మ్యాచ్కు ముందు చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.VIDEO OF THE DAY.....!!!! ❤️ - Ishan Kishan specially came over to meet a Pakistan fan. A lovely gesture. 👏 pic.twitter.com/xwjPxiX3dz— Sheri. (@CallMeSheri1_) July 12, 2026మ్యాచ్కు ముందు వార్మప్కు వెళ్లే క్రమంలో స్టేడియంలో ఉన్న సదరు అభిమానిని గమనించిన ఇషాన్ కిషన్ స్వయంగా అతడి వద్దకు వెళ్లాడు. అతడితో చేతులు కలిపి, చిరునవ్వుతో పలకరిస్తూ కొద్దిసేపు ఆప్యాయంగా మాట్లాడాడు. ఈ అనూహ్యమైన ఆత్మీయతతో ఆ అభిమాని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ వీడియోకు సోషల్ మీడియాలో విశేష స్పందన లభిస్తోంది. నెటిజన్లు ఇషాన్ మంచి మనసుకు ఫిదా అవుతున్నారు. దేశాల మధ్య విభేదాలను పక్కకు పెట్టి మంచి మనసు చాటుకున్నాడని అంటున్నారు.ఇదిలా ఉంటే, ఐదో టీ20లోనూ టీమిండియాకు ఇంగ్లండ్ చేతిలో భంగపాటే ఎదురైంది. ఈ ఓటమితో భారత జట్టు 0-4 తేడాతో సిరీస్ను కోల్పోయింది.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేయగా.. భారత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులకే పరిమితమై, 56 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఇంగ్లండ్ తరఫున జోస్ బట్లర్ (64 బంతుల్లో 131; 12 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడగా.. కెప్టెన్ హ్యారీ బ్రూక్ (45 బంతుల్లో 95 నాటౌట్; 4 ఫోర్లు, 8 సిక్సర్లు) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. భారత ఇన్నింగ్స్లో ఇషాన్ కిషన్ (56), తిలక్ వర్మ (53) అర్ద సెంచరీలతో రాణించారు. -
‘మర్యాదగా మాట్లాడండి’.. మెస్సీ మాస్ వార్నింగ్!
అర్జెంటీనా సూపర్స్టార్ లియోనల్ మెస్సీ ఫిఫా ప్రపంచకప్లో తొలిసారి ఆగ్రహం ప్రదర్శించాడు. ఎదుటివారు ఎంత రెచ్చగొట్టినా తన చిరునవ్వుతోనే సమాధానం చెప్పే మెస్సీ తొలిసారి కంట్రోల్ తప్పాడు. స్విట్జర్లాండ్తో క్వార్టర్ ఫైనల్ సందర్భంగా ‘మర్యాదగా మాట్లాడండి’ అంటూ మ్యాచ్ రిఫరీకి మెస్సీ వార్నింగ్ ఇవ్వడం ఆసక్తి కలిగించింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. విషయంలోకి వెళితే.. స్విట్జర్లాండ్ ఫ్రీ కిక్కు సిద్ధమవుతున్న సమయంలో అర్జెంటీనా ఆటగాళ్లు డిఫెన్సివ్ వాల్ ఏర్పాటు చేశారు. ఆ సమయంలో మెస్సీని నిబంధనల ప్రకారం కొంత వెనక్కి వెళ్లాలని పోర్చుగల్ రిఫరీ జోవో పిన్హీరో సూచించారు. అయితే రిఫరీ మాట్లాడిన తీరు నచ్చకపోవడంతో మెస్సీ అసహనం వ్యక్తం చేశాడు. ‘నాతో మర్యాదగా మాట్లాడండి. నన్ను అగౌరవపరచొద్దు. నేను మీతో గౌరవంగా మాట్లాడాను.. మీరు కూడా అలాగే మాట్లాడండి’ అంటూ మెస్సీ రిఫరీకి చెబుతున్నట్లు మైక్లో రికార్డయ్యాయి. ఈ ఫిఫాలో ప్రతీ మ్యాచ్లోనూ కనీసం ఒక్క గోల్ అయినా కొట్టిన మెస్సీ స్విట్జర్లాండ్తో మ్యాచ్లో మాత్రం గోల్ సాధించలేదు. అయితే ఒక అసిస్ట్తో మెస్సీ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. మ్యాచ్ విషయానికొస్తే స్విట్జర్లాండ్పై విజయంతో అర్జెంటీనా సెమీఫైనల్లో అడుగుపెట్టింది. ఆదివారం ఉదయం జరిగిన క్వార్టర్ ఫైనల్లో అర్జెంటీనా 3-1 తేడాతో స్విట్జర్లాండ్పై విజయం సాధించింది. ఆట అదనపు సమయంలో రెండు గోల్స్ చేసిన అర్జెంటీనా స్విట్జర్లాండ్పై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. అర్జెంటీనా తరఫున అలెక్సిస్ మాక్ అలిస్టర్ (10వ నిమిషం), జులియన్ అల్వరెజ్ (112వ నిమిషం), లుటారో మార్టినేజ్ (121వ నిమిషం) అదనపు సమయంలో గోల్ చేశాడు. స్విట్జర్లాండ్ తరఫున డాన్ నోయే (67వ నిమిషంలో) గోల్ కొట్టాడు. “HABLÁ BIEN, NO FALTES EL RESPETO. A MÍ HÁBLAME BIEN”.Lionel #Messi, al árbitro portugués. 🤬🇦🇷 pic.twitter.com/fxMHSPMvLe— treintaytres (@GRUPOTRESTRES) July 12, 2026చదవండి: అర్జెంటీనా దిగ్గజం కన్నుమూత.. విషాదంలో మెస్సీ సేన -
రహస్య కదలికలు.. భూమిపై ఏలియన్స్ నిఘా?
భూమిపై గ్రహాంతరవాసులు (ఏలియన్స్) నిఘా పెట్టాయా? వారి అంతరిక్ష నౌకలే (యూఎఫ్వోలు) మన ఆకాశంలో సంచరిస్తున్నాయా?? దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉన్న ఈ ప్రశ్నలకు మరోసారి ఊతమిచ్చేలా అమెరికా రక్షణ శాఖ (పెంటగాన్) తాజాగా విడుదల చేసిన ఫైల్స్ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. "నేను 28 ఏళ్లుగా సైన్యంలో సేవలందిస్తున్నా. కానీ, ఎన్నడూ ఇలాంటి వస్తువును నేను ఎప్పుడూ చూడలేదు’’ అని ఓ మాజీ సైనిక పైలట్ పేర్కొనడం, అణు ఆయుధ కేంద్రం వద్ద రహస్య వస్తువు సంచరించిన ఘటన, చైనా సమీపంలో తాజాగా నమోదైన వీడియోలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీశాయి.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఏడాది జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మేరకు.. తాజాగా పెంటగాన్ మొత్తం 40 రికార్డులను బహిర్గతం చేసింది. వీటిలో 14 పత్రాలు, 19 వీడియోలు, నాలుగు ఆడియో ఫైల్స్, మూడు చిత్రాలు ఉన్నాయి. ఈ సమాచారం పెంటగాన్తో పాటు నాసా, సీఐఏ, ఎఫ్బీఐ, ఇంధన శాఖ వంటి కీలక అమెరికా ప్రభుత్వ సంస్థల నుంచి సేకరించింది. విడుదలైన వీడియోల్లో పశ్చిమ పసిఫిక్, అట్లాంటిక్, మధ్యప్రాచ్య ప్రాంతాల్లో అమెరికా సైనిక కెమెరాలు రికార్డు చేసిన దృశ్యాలు ఉన్నాయి.The Creepiest UFO Video Ever Released By The White House 👽🛸🇺🇸What is that thing? Is it an ALIEN? 😱DOW-UAP-PR116, Unresolved UAP Report, Atlantic Ocean, 2020 pic.twitter.com/vOabmCyBb6— Interstellar (@InterstellarUAP) July 10, 2026ఈ ఫైల్స్లో అత్యంత ఆసక్తికరమైనది 2019లో నమోదైన ఒక ఘటన. అమెరికా తూర్పు ప్రాంతంలో శిక్షణ విమానయానం నిర్వహిస్తున్న ఓ సైనిక పైలట్, మరో నలుగురు సిబ్బంది తమ విమానం కిందుగా అత్యంత వేగంగా కదులుతున్న ఓ గుర్తుతెలియని వస్తువును గమనించారు. దాదాపు 10 నుంచి 15 సెకన్ల పాటు దానిని కెమెరాతో ట్రాక్ చేశారు. జూమ్ చేసి స్పష్టంగా చిత్రీకరించేలోపే ఆ వస్తువు క్షణాల్లో కెమెరా పరిధి దాటి అదృశ్యమైంది. తర్వాత వీడియోను పరిశీలించగా అది దీర్ఘచతురస్రాకారంలో (Rectangular) ఉన్నట్లు గుర్తించారు.దీనిపై సదరు పైలట్ తన నివేదికలో.. "ఎయిర్ఫోర్స్, నేవీలో 28 ఏళ్లుగా పనిచేస్తున్నా.. ఇలాంటి విమాన లక్షణాలున్న వస్తువును నేను ఎప్పుడూ చూడలేదు" అని పేర్కొనడం విశేషం.దెబ్బకు అణ్వాయుధ కేంద్రంలో లాక్డౌన్!మరో ఫైల్లో అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని పాంటెక్స్ అణు ఆయుధ కేంద్రం వద్ద 2015లో చోటుచేసుకున్న ఘటనను వెల్లడించారు. ఆ సమయంలో భద్రతా సిబ్బంది.. ఎలాంటి శబ్దం లేకుండా, ఇంజిన్కు సంబంధించిన ఆనవాళ్లు కనిపించకుండా గాల్లో కదులుతున్న ఓ గుర్తుతెలియని వస్తువును గుర్తించారు. దాంతో మొత్తం అణు కేంద్రాన్ని వెంటనే లాక్డౌన్ చేసి, బైనాక్యులర్లతో ఆ వస్తువును వెంబడించారు. అయితే అది ఏమిటో ఇప్పటికీ గుర్తించలేకపోయినట్లు నివేదికలో పేర్కొన్నారు.చైనా సమీపంలో తాజా కదలికలుఈసారి విడుదలైన ఫైల్స్లో అత్యంత తాజా సమాచారం 2025లో చైనా సమీప సముద్ర ప్రాంతాల్లో నమోదైన ఘటనలకు సంబంధించినది. అమెరికా ఇండో-పసిఫిక్ కమాండ్కు చెందిన సెన్సార్లు ఎల్లో సీ ప్రాంతంలో ఆరు కోణాల నక్షత్రం ఆకారంలో కనిపించిన ఓ విచిత్ర వస్తువును గుర్తించాయి. మరో వీడియోలో తూర్పు చైనా సముద్రం (ఈస్ట్ చైనా సీ) ప్రాంతంలో నిమిషాల పాటు కదులుతున్న మరో గుర్తుతెలియని వస్తువు రికార్డైంది.అలాగే 2023లో చిత్రీకరించిన మరో వీడియోలో.. ఓ రహస్య వస్తువు అమెరికా సైనిక విమానంలోని ఎలక్ట్రో-ఆప్టికల్, ఇన్ఫ్రారెడ్ సెన్సార్ల పనితీరును ప్రభావితం చేసినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి.ఏలియన్స్ ఉన్నాయా?పెంటగాన్ విడుదల చేసిన ఫైల్స్లో.. ఈ వస్తువులు గ్రహాంతరవాసులకు చెందినవే అని ఎక్కడా నిర్ధారించలేదు. అదే సమయంలో అవి ఏమిటో కూడా స్పష్టమైన వివరణ ఇవ్వలేదు. అందుకే వీటిని అధికారికంగా యూఏపీ (Unidentified Anomalous Phenomena)గా పేర్కొంది.మిస్టరీ మరింత ముదిరిందిగత కొన్నేళ్లుగా అమెరికా ప్రభుత్వం యూఎఫ్వోలకు సంబంధించిన పలు రహస్య పత్రాలను దశలవారీగా బయటపెడుతోంది. అయితే తాజా ఫైల్స్లో మాజీ సైనిక పైలట్ వాంగ్మూలం, అణు ఆయుధ కేంద్రంలో గుర్తుతెలియని వస్తువు సంచారం, చైనా సమీపంలో నమోదైన తాజా వీడియోలు ఉండటంతో.. "భూమిపై నిజంగానే ఏలియన్స్ నిఘా ఉందా? లేదంటే మనకు ఇంకా తెలియని అత్యాధునిక సాంకేతికతేనా?" అన్న ప్రశ్నలు మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం ఈ రహస్యం మాత్రం ఇంకా వీడలేదు. -
ఓర్నీ దీని వేషాలో.. చచ్చినట్టు ఎంత నాటకం ఆడింది!
-
56 ఏళ్ల వయసులో మాస్టర్ డిగ్రీ..! పట్టరాని సంతోషంలో కుమార్తె..
భర్తను కోల్పోయి ఒంటిరి తల్లిగా పిల్లలను పెంచుతున్న ఓ మహిళ సాధించిన అసాధారణ విజయ గాథ నెట్టింట వైరల్గా మారింది. ఆమె కుమార్తె షేర్ చేసిన ఈ పోస్ట్ అందర్నీ అమితంగా ఆకర్షించడమే గాక.. మహిళలు ఏదైనా చేయగలరు అని నిరూపించింది. ఒకపక్క పిల్లలు బాధ్యత, కుటుంబ నిర్వహణ, ఉద్యోగం అన్ని చూసుకుంటూనే తన కలను నెరవేర్చుకోవడం అంటే మాటలు కాదు. సాధారణ విషయం అంతకన్నా కాదు. మరి ఆమె ఎలా సాధ్యం చేసిందంటే..56 ఏళ్ల తల్లికి దుబాయ్కు చెందిన కంటెంట్ క్రియేటర్ నుమయా కారు సోషల్మీడియా వేదికగా హృదయపూర్వక నివాళి అర్పిస్తూ ఇలా రాసుకొచ్చింది. దశాబ్దాలుగా కుటుంబ అభ్యున్నతికి పాటుపడిన తన తల్లి ఇవాళ తన చిరకాల కోరికను నెరవేర్చుకుందంటూ అందుకు సంబంధించిన వీడియోని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. భర్తను కోల్పోయి ఒంటరిగా పిల్లలను పెంచుతూ..ఓ పక్క తల్లిదండ్రులను కూడా పోగొట్టుకుని పుట్టెడు బాధను దిగమింగుతూ.. కుటుంబ బాధ్యతలను నిర్వర్తించిన స్ట్రాంగెస్ట్ విమెన్. అధిక ఒత్తిడితో కూడిన ఉద్యోగాన్ని కూడా సమతుల్యం చేసుకుంటూ..కుటుంబాన్ని చక్కదిద్దిన మహిళ ఇవాళ తన చిరకాల కోరికను నెరవేర్చుకుని ఎందరికో ఆదర్శంగా నిలిచింది. తన జీవితం మొత్తం తన పిల్లల కోసమే బతికింది. నాన్న చనిపోయాక..తొమ్మిదేళ్లుగా అమ్మగా నాన్నగా వ్యవహరించి..ఒంటరిగా ఆ బాధను మొత్తం మోసిన ధీర వనిత. పూర్తి సమయం పనిచేస్తూ పిల్లలను పెంచింది. ఏళ్ల తరబడి మూసి ఉంచిన ఒక ప్రభుత్వ పాఠశాలకు తొలి ప్రిన్స్పాల్గా నియమాకం అందుకుంది. ఇన్నేళ్లకు తన కోసం ఆలోచించడం మొదలు పెట్టి..మాస్టర్ డిగ్రీని పూర్తి చేసి, తన కలను సాకారం చేసుకుంది. "అమ్మా.. ఈ డిగ్రీ నీదే. ఒక కూతురుగా నాకెంతో గర్వంగా ఉంది. ఆమె గ్రాడ్యుయేషన్ డేలో తాను లేకపోవడం ఎంతో బాధగా ఉందని, అయినప్పటికీ ఒక కుమార్తెగా గర్వించే క్షణం ఇది అని" పోస్ట్లో రాసుకొచ్చింది. ప్రస్తుతం తాను వేరే దేశంలో ఉన్నానంటే అందుకు ఆమెనే కారణం, అది ఆమె కోరుకున్న జీవితమే అని పేర్కొంది. "అమ్మా..నిజమైన బలం, నిస్వార్థ ప్రేమ ఎలా ఉంటాయో చూపిచావు. నేను మీలో కనీసం సగం అయిన ఉండగలిగితే బాగుండు. ఈ డిగ్రీ ఈదే. దీనికి మీకంటే ఎక్కువ అర్హులు ఎవరూ లేరు అంటూ తనపోస్టుని ముగించింది." నెటిజన్లు కూడా మీ కలలను సాకారం చేసుకోవడానికి ఎప్పుడు ఆలస్యం కాదు అంటూ..సదరు తల్లికి శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Numaya Karu✨Dubai Content Creator ✨ (@double_n_karu) (చదవండి: 'సలాం సాబ్'.. 80 ఏళ్ల వ్యక్తిపై ఆనంద్ మహీంద్రా ప్రశంసల జల్లు!) -
'సలాం సాబ్'.. 80 ఏళ్ల వ్యక్తిపై ఆనంద్ మహీంద్రా ప్రశంసల జల్లు!
కొన్ని మనసుకు తాకే కొంగొత్త విషయాలు చూస్తే..స్ఫూర్తిదాయకమైన పాటలను గుర్తుకుతెస్తాయి. అందుకు నిదర్శనం పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన పోస్ట్. ఎప్పటిలానే ఈ సారి ప్రేరణ కలిగించే కథతో మనముందుకు వచ్చారు. అయితే ఈ పోస్ట్ అత్యంత ప్రత్యేకం, అందర్నీ చైతన్యపరిచే గొప్ప విషయం కూడా. ఇంతకీ ఆయన పోస్ట్లో ఎవరి గురించి రాసుకొచ్చారంటే..మన పరిసరాలను, నగరాలను దేశాన్ని శుభ్రంగా ఉంచుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత. కానీ మనం తరచుగా విస్మరించే విషయాల విలువను గుర్తు చేసేలా ఒక వ్యక్తి దృఢ సంకల్పం కనులముందు కనిపించేంత వరకు తెలియదు. అలాంటి వ్యక్తే ఈ 80 ఏళ్ల ఐరిష్ వ్యక్తి కారోన్ రాన్స్లీ . పదేళ్లకు పైగా గుర్తింపుకు నోచుకోని మెట్లబావులను శుభ్రం చేస్తూ సాంప్రదాయ నీటి నిర్మాణాల పట్ల తిరిగి చూసేలా అందరి దృష్టిని ఆకర్షించారు. స్థానికంగా "పాగల్ సాబ్"గా పిలిచే రాన్స్లీ నిర్లక్ష్యానికి గురైన మెట్లబావులు, మెట్టు కలిగిని నీటి కుంటల తదితర నిర్మాణాలను తన స్వహాస్తాలతో పునరుద్ధరించారు. ఆయన నిస్వార్థ సేవ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్మహీంద్రాను సైతం కదిలించింది. ఆ మహానుభావుడి కృషికి ఫిదా అవ్వతూ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ప్రశంసలు కురిపించారు. చాలా మంది జోధ్పూర్ పురాతన మెట్ల బావుల అందాన్ని చూసి మురిసిపోతుంటారే తప్ప..రాన్స్ లీ మాదిరిగా కనుమరుగైపోయేలా అధ్వాన్నంగా ఉన్న వాటి స్థితిని గుర్తించారు. ఆయన అద్భుతమైన వాస్తు శిల్పం, చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ఆ నీటి బావులు వ్యర్థాలతో నిండిపోయి..వాటివైపు కన్నెత్తి చూడలేని స్థితిలో ఉన్న వాటిని చూసి చలించిపోయారు అయితే ఆయన తాను ఒక పర్యాటకుడిలా చూసి వెళ్లిపోవాలని అనుకోకపోవడం విశేషం.వాటిని పునరుద్ధరించే బాధ్యతను చేపట్టాలని నిర్ణయించకోవడమే గాక ఆ దిశగా చర్యలు చేపట్టారు. అలా మొత్తం పదేళ్లు ఆ మెట్లబావుల సంరక్షణకే తన జీవితాన్ని అంకితం చేశారంటూ సోషల్ మీడియా ఎక్స్ పోస్ట్లో రాసుకొచ్చారు. అంతేగాదు వారసత్వ సంపదను పరిరక్షించడానికి నిపుణులుగా లేదా ఒకే ప్రదేశానికి చెందినవారై ఉండాల్సిన అవసరం లేదని చెప్పే సంఘనట ఇది అన్నారు. అంకితభావం ఉన్న ఎవరైనా భారతదేశంలోని చారిత్రక కట్టడాలను పరిరక్షించడంలో తన వంతు సహకారం అందించగలరని అన్నారు. ఈ సందర్భంగా ప్రసిద్ధ చాంద్బావిని పరిరక్షించడానికి జరుగుతున్న ప్రయత్నాలను ప్రశంసిస్తూ..భారతదేశం అంతటా ఉన్న వాలంటీర్లు, పర్యావరణ పరిరక్షకులు, ఎన్జీవోలు, గ్రామీణ సంఘాలు ఇలాంటి చారిత్ర కట్టడాల కోసం చేస్తున్న కృషిని గుర్తుకుతెచ్చుకున్నారు. అంతేగాదు జోధ్పూర్ పై రాన్స్ లీకి ఉన్న ప్రేమకు, వారసత్వం పట్ల ఉన్న నిస్వార్థ సేవకు, అభిరుచికి మనస్ఫూర్తిగా సెల్యూట్ చేస్తున్నా.. ఆయన పని ఇంతటితో ఆగకూడదు అంటూ పోస్ట్ని ముగించారు. నెటిజన్లు కూడా ఆ ఐరిష్ వ్యక్తి నిబద్ధతను, నిస్వార్థంగా చేస్తున్న అతడి ప్రయత్నాలను కొనియాడారుమెట్ల బావుల ప్రాముఖ్యత..మెట్లబావులు కేవలం రాతితో కట్టిన పాత కట్టడాలు మాత్రమే కాదు. శతాబ్దాలుగా, ముఖ్యంగా నీటి కొరత ఎప్పుడూ ఒక సవాలుగా ఉన్న రాజస్థాన్ వంటి ప్రాంతాలలో, ఇవి కీలక పాత్ర పోషించాయి. మెట్ల బావులు కేవలం నీటి వనరులుగానే కాకుండా, ప్రజలు సమావేశమై.. ఒకరితో ఒకరు అనుబంధం పెంచుకునే ప్రదేశాలుగా కూడా మారాయి. ఇవి ఆ కాలంలోని టెక్నాలజీ, నాటి తరం వారి ఇంజనీరింగ్ నైపుణ్యాలు, సాంస్కృతిక సంప్రదాయాలకు కొలమానం. కాగా, రాన్సీలీ ఒక మీడియా ఇంటర్వ్యూలో తన ప్రయత్నం గురించి ఇలా వివరించారు. తాను 2014లో జోధ్పూర్కి వచ్చినప్పుడు ఈ అందమైన మెట్లబావులను చూశానని చెప్పారు. అయితే వాటిలో కొన్ని నీటి నిల్వ వ్యవస్థలు శిథిలావస్థకు చేరుకోవడం చూసి దిగ్బ్రాంతి చెందానన్నారు. ఆ నేపథ్యంలోనే ఈ ప్రదేశాలను శుభ్రంచేసి మంచి స్థితిలోకి వచ్చేలా తన వంతు కృషిని చేశానని అన్నారు. ఇదంతా తన స్వహస్తాలతోనే చేశానని తెలిపారు..They nicknamed 80 year old Irishman, Caron Rawnsley, ‘Paagal Saab’ for his obsession with cleaning Jodhpur’s Bawris & Jhalaras. Fortunately, today, you don’t need to be either ‘paagal’ or ‘phirang’ to devote yourself to reviving India’s stepwells. Earlier this year, I had… pic.twitter.com/xKTUzO72Zx— anand mahindra (@anandmahindra) July 10, 2026(చదవండి: ప్లీజ్ మంచి తల్లిగా మారండి..! ఆ తర్వాతే ఇంకేదైనా..) -
వినాశనానికి చేరువలో ప్రపంచం! చరిత్ర దాచిన నిజం
-
ఒళ్లు మండిన గాఫ్.. బదులు తీర్చుకుంటానని హెచ్చరిక!
ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీలో మహిళల సింగిల్స్లో అమెరికా స్టార్ కోకో గాఫ్ ప్రయాణం సెమీస్లోనే ముగిసింది. గురువారం జరిగిన సింగిల్స్ క్వార్టర్స్లో చెక్ రిపబ్లిక్కు చెందిన ముచోవా 6-2, 1-6, 7-6 (12/10)తో గాఫ్పై విజయాన్ని అందుకొని ఫైనల్లో ప్రవేశించింది. అయితే మ్యాచ్ ఓటమి తర్వాత గాఫ్పై విమర్శలు వచ్చాయి. వింబుల్డన్లో సెమీస్లో నిష్క్రమించడంపై కొంతమంది పనిగట్టుకొని ఆమెను హేళన చేస్తూ అసభ్యకర కామెంట్లు పెట్టారు. అప్పటికే ఓటమి బాధలో ఉన్న 22 ఏళ్ల గాఫ్కు కొంతమంది పెట్టిన కామెంట్లకు ఒళ్లు మండిపోయింది. దీంతో తనను ఎవరైతే విమర్శించారో వారికి తనదైన శైలిలో ఘాటుగా సమాధానమిచ్చింది. 'కొంతమంది నాపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడంతో పాటు సందేశాలు పంపించారు. ఏం పర్వాలేదు. ఇలాంటి విమర్శలు, ట్రోల్స్ మనల్ని మరింత బలంగా ఫుంజుకోవడానికి ప్రేరేపిస్తాయి. ఈసారి వింబుల్డన్లో నేనే ఓడిపోయి ఉండొచ్చు. కానీ తర్వాతి ఏడాది గెలిచి నన్ను విమర్శించిన వారికి నా విజయాన్ని ట్యాగ్ చేసి గట్టి సమాధానం ఇవ్వాలనుకుంటున్నా' అని గాఫ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో పేర్కొంది. ఇక కోకో గాఫ్ తన కెరీర్లో 2023 యూఎస్ ఓపెన్తో పాటు 2025 ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టైటిల్స్ను కైవసం చేసుకుంది. ఈసారి వింబుల్డన్ గ్రాండ్స్లామ్తో మూడో టైటిల్ ఖాతాలో వేసుకుంటుందని ఆశించినప్పటికీ కోకో గాఫ్ సెమీస్కు పరిమితమైంది.Coco Gauff on the hate comments she’s receiving after her loss to Muchova“I already got some hate comments and stuff but it’s ok. It just makes you stronger. Bettors who are mad, the usual. But whatever, I’ll come on the winning end next time, I’ll be sure to tag ‘em.”… pic.twitter.com/agaqRnVHnz— The Tennis Letter (@TheTennisLetter) July 9, 2026Read: నేపాల్తో చారిత్రక క్రికెట్ సిరీస్.. వైభవ్కు ప్రమోషన్! -
6 నిమిషాల్లో 43 చెప్పుదెబ్బలు!
తాను చేస్తున్న వెదవ పనిని ఎవరూ చూడడం లేదనుకుని రెచ్చిపోయాడో బ్యూటీ పార్లర్ యజమాని. అతడి కుటిల పన్నాగాన్ని సీక్రెట్ కెమెరా బట్టబయలు చేసింది. దీంతో మనోడు కట్టుకథతో కవర్ చేసేందుకు ప్రయత్నించగా చెప్పు దెబ్బలతో బుద్ధిచెప్పారు బాధిత మహిళలు. 6 నిమిషాల్లో 43 చెప్పుదెబ్బలు కొట్టి చాకిరేవు పెట్టేశారు. అతడిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రాజస్థాన్లోని చూరూ జిల్లాలోని సాదుల్పూర్ ప్రాంతంలో ఉన్న ఓ బ్యూటీ పార్లర్లో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.అసలేం జరిగింది?బ్యూటీ పార్లర్లోని తాగేనీటిలో యజమాని భవానీ శంకర్ ఖత్రి ఏదో కలుపుతున్నట్టు రహస్య కెమెరా ద్వారా గుర్తించిన నలుగురు మహిళా ఉద్యోగులు అతడిని చెప్పులతో ఎడాపెడా వాయించేశారు. ఈ దృశ్యాలు కూడా వీడియోలో రికార్డయ్యాయి. జూన్ 29న ఈ ఘటన చోటు చేసుకుంది. దురుద్దేశంతోనే తాగునీటిలో మత్తు పదార్థం కలిపేందుకు అతడు ప్రయత్నించాడని వారు ఆరోపించారు. ఈ మేరకు రాజ్గఢ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.తాగునీటిలో భవానీ శంకర్ ఏదో కలుపుతున్నాడనే అనుమానం జూన్ 27నే తాము కనిపెట్టామని, అతడిని ఆధారాలతో పట్టించాలనే రహస్య కెమెరా పెట్టామని బాధిత యువతులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. కొద్ది రోజులుగా అతడి వ్యవహారశైలిలో మార్పు వచ్చిందని వెల్లడించారు. గతంలో బ్యూటీపార్లర్ జమాఖర్చులు చూసుకోవడానికి అప్పుడప్పుడు మాత్రమే వచ్చేవాడని, కొన్ని రోజుల నుంచి తరచుగా రావడం చేస్తున్నాడని తెలిపారు. తాగే నీటిలో మత్తు మందు కలుపుతున్నాడనే అనుమానం రావడంతో ఫోన్లో రహస్యంగా వీడియో తీయడంతో దొరికిపోయాడని వివరించారు.పోలీసులు ఏమన్నారు?భవానీ శంకర్ అనుమానాస్పద వ్యవహారంపై యువతుల నుంచి తమకు ఫిర్యాదు అందిందని రాజ్గఢ్ పోలీస్ స్టేషన్ అధికారి రాజేష్ సిహాగ్ మీడియాకు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని, చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. భవానీ శంకర్ నిజంగా మత్తు మందు కలిపాడా, లేదా అనేది విచారణలో తేలుతుందని చెప్పారు.చదవండి: రైలు బోగీనే హనిమూన్ సూట్!'మత్తు మందు కాదు ఆవాలు'తనపై నలుగురు యువతలు చేసిన ఆరోపణలను భవానీ శంకర్ ఖత్రి తోసిపుచ్చాడు. కొంతకాలంగా తన పార్లర్ వ్యాపారం సరిగా నడవడం లేదని, అందుకే పసుపు కలిపిన ఆవాలు పార్లర్లో ఉంచానని చెప్పుకొచ్చాడు. అలాగే తాగే నీటిలో తాను కలిపింది గంగాజలం అని, అందరూ అనుకుంటున్నట్టుగా మత్తు పదార్థం కాదని చెప్పాడు. అతడు చెప్పింది వాస్తమో, కాదో పోలీసులే తేల్చాలి. తాగే నీటిలో మత్తుమందు కలిపి లైంగిక దాడిరాజస్థాన్లోని చురు జిల్లాలో ఓ బ్యూటీ పార్లర్ యజమాని భవానీ శంకర్ తాము తాగే నీటిలో మత్తుమందు కలిపి, తమపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడనే నిజాన్ని నలుగురు మహిళా ఉద్యోగులు కనిపెట్టారు. రహస్య కెమెరా ద్వారా అతడు నీళ్లలో మత్తు బిళ్ళలు… pic.twitter.com/liglkzNEp3— greatandhra (@greatandhranews) July 9, 2026 -
రైలు బోగీనే హనీమూన్ సూట్!.. వైరల్ వీడియోపై విమర్శలు
ముంబై: కొత్తగా పెళ్లైన ఓ జంట తమ తొలి రైలు ప్రయాణాన్ని జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకంగా మార్చుకోవాలనుకుంది. అందుకోసం రైలులోని కూపేను ఏకంగా హనీమూన్ సూట్లా అలంకరించింది. గులాబీ బెలూన్లు, పూలమాలలు, గులాబీ రేకులు, "ఐ లవ్ యూ" బోర్డుతో కూపేను అందంగా తీర్చిదిద్దింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం.. విమర్శలు వెల్లువెత్తడంతో రైల్వే స్పందించాల్సి వచ్చింది.. జూలై 6న ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్–పండర్పూర్ నందిగ్రామ్ ఎక్స్ప్రెస్ జల్నా స్టేషన్కు చేరుకున్న సమయంలో ఈ ఘటన జరిగింది. బయటకు చెందిన డెకరేషన్ సిబ్బందిని రైలులోకి అనుమతించి, ప్రయాణికుల కూపేను ప్రత్యేకంగా అలంకరించారు. కొద్దిసేపటికే ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.వీడియోలు వైరల్ కావడంతో దక్షిణ మధ్య రైల్వే వెంటనే విచారణకు ఆదేశించింది. ప్రయాణికులు తమ సీట్లు లేదంటే కూపేను చిన్నపాటి వ్యక్తిగత అలంకరణలతో అందంగా మార్చుకోవడంపై ఎలాంటి అభ్యంతరం లేదని అధికారులు చెబుతున్నారు. అయితే అనుమతి లేకుండా బయటి వ్యక్తులను రైలులోకి తీసుకురావడం, భారీగా అలంకరణలు చేయడం మాత్రం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు.ఈ ఘటనలో అసలు తప్పు కొత్త దంపతులది కాదని, భద్రతా నిబంధనలు పాటించకుండా బయటి వ్యక్తులను అనుమతించిన సిబ్బందిదేనని రైల్వే భావిస్తోంది. దీంతో విధుల్లో ఉన్న ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (టీటీఈ)ను సస్పెండ్ చేశారు. అలాగే అనుమతి ఎలా ఇచ్చారు? భద్రతా తనిఖీలు ఎందుకు విఫలమయ్యాయి? అనే అంశాలపై శాఖాపరమైన విచారణ కొనసాగుతోంది.కొత్త దంపతులపై మాత్రం ఎలాంటి జరిమానా లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకోలేదు. రైల్వే దృష్టి మొత్తం భద్రతా నిబంధనల ఉల్లంఘనపైనే ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.ఇక సోషల్ మీడియాలో మాత్రం ఈ ఘటన హాట్టాపిక్గా మారింది. కొందరు "ఇలాంటి సర్ప్రైజ్ జీవితంలో ఒక్కసారే వస్తుంది" అంటూ కొత్త దంపతుల ఆలోచనను మెచ్చుకోగా, మరికొందరు ప్రజా రవాణా వ్యవస్థలో ఇలాంటి ఏర్పాట్లకు అనుమతి ఇవ్వడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఇంకొందరు సరదాగా ఈ రైలుకు "సుహాగ్రాత్ ఎక్స్ప్రెస్" అని పేరు పెట్టి మీమ్స్ సృష్టించారు.Hello @AshwiniVaishnaw, does Indian Railways permit passengers to use a First AC coach for a suhagraat? pic.twitter.com/nDUQMkxEyt— Dr Nimo Yadav 2.0 (@DrNimoYadav) July 8, 2026ఒక జంట తమ ప్రయాణాన్ని ప్రత్యేకంగా మార్చుకోవాలన్న ప్రయత్నం.. చివరకు రైల్వే భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తి అధికారుల విచారణ వరకు వెళ్లడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.Honeymoon coach on Indian Railways. Ticket checker suspended. South Central Zone A couple travelling in Train No. 11002 Nandigram express on 6/7/26 had privately engaged a decorator online to decorate their 1st AC coupe. The decorator's entry into the coach was… pic.twitter.com/1ati4A13G4— Rajendra B. Aklekar (@rajtoday) July 8, 2026 -
ఒక్క బిస్కెట్ తినడం వల్ల..! కోటి రూపాయల ఉద్యోగం పోయింది! ఈ వీడియో చూడండి
-
'చిల్లర' అని నవ్వొద్దు.. మొత్తం రూ.1.10 లక్షలు.. వాటితోనే బైక్ కొని..
బిల్లు చెల్లించాలంటే సాధారణంగా నోట్లు, డిజిటల్ చెల్లింపులు లేదా బ్యాంకు లావాదేవీలే గుర్తుకొస్తాయి. కానీ కొందరు మాత్రం తమ ఆలోచనతో అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. రోజూ కొద్దికొద్దిగా దాచుకున్న నాణేలు కూడా పెద్ద మొత్తంగా మారుతాయని నిరూపిస్తూ, ఓ వ్యక్తి చేసిన పని ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చాలామంది చిన్నచూపు చూసే నాణేలే అతడి కలను నెరవేర్చే సాధనంగా మారాయి. ఎన్నో రోజుల పాటు ఓర్పుతో కూడబెట్టిన ప్రతి రూ.10 నాణేలే చివరకు కొత్త వాహనం కొనుగోలుకు ఉపయోగపడ్డాయి.తెలంగాణలోని యాదాద్రి-భువనగిరి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి రూ.10 నాణేలతో మొత్తం రూ.1.10 లక్షలు చెల్లించి బైక్ కొనుగోలు చేశాడు. చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన కొండె రఘుపతి.. చిట్యాలలోని శ్రీ వినాయక మోటార్స్లో రూ. 10 నాణేలతోనే స్ప్లెండర్ ప్లస్ మోటార్సైకిల్ కొనుగోలు చేశాడు.ఒకేసారి లక్ష రూపాయలకు పైగా విలువైన నాణేలను చూసి షోరూమ్ సిబ్బంది కూడా ఆశ్చర్యపోయారు. ఆ నాణేలను లెక్కించడానికి కాస్త సమయం తీసుకున్నా, చివరకు లావాదేవీ విజయవంతంగా పూర్తైంది. ఈ ఘటన చూసిన స్థానికులు కూడా ఆ వ్యక్తి పట్టుదలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. చిన్న మొత్తాలను కూడా నిర్లక్ష్యం చేయకుండా దాచుకుంటే పెద్ద లక్ష్యాలను చేరుకోవచ్చని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. VIDEO | A man from Telangana’s Yadadri-Bhuvanagiri district grabbed attention by purchasing a bike after paying the entire amount of Rs 1.10 lakh in Rs 10 coins.Konde Raghupathi, a resident of Veliminedu village in Chityala mandal, bought a Splendor Plus motorcycle from Sri… pic.twitter.com/OY7gN0jajD— Press Trust of India (@PTI_News) July 8, 2026 -
మళ్ళీ కలుద్దాం... మీరు ఎప్పుడూ కలవరు.. ఇది గ్యారంటీ కారణం ఇదే
-
పార్క్లో బామ్మ ఫుల్ స్వింగ్.. చూస్తున్న వాళ్లకు ఫుల్ షాక్..
బెంగళూరులోని ఓ పార్క్లో ఓ వృద్ధురాలు అవుట్డోర్ జిమ్ యంత్రాన్ని అత్యంత వేగంగా ఉపయోగిస్తున్న వీడియో వైరల్ అయింది. బెంగళూరుకు చెందిన ఎక్స్ వినియోగదారు సందీప్ పార్శ్వనాథ్ పంచుకున్నారు ఈ 10 సెకన్ల వీడియో. ఆ మహిళ ఎయిర్ స్వింగ్ యంత్రాన్ని చాలా వేగంగా ముందుకు, వెనక్కి ఊగిస్తూ ఉపయోగిస్తున్నట్టు కనిపించింది. అక్కడ ఉన్న పిల్లలతో పాటు మరికొందరు చూస్తూ కనిపించారు.పర్యవేక్షణ లేకుండా ఈ పరికరాన్ని ఉపయోగించడం సురక్షితమేనా అని తన పోస్టులోని శీర్షికలో పార్శ్వనాథ్ ప్రశ్నించారు. పార్కుల్లో ఏర్పాటు చేసిన వ్యాయామ పరికరాల పక్కన భద్రతా సూచనలు ఏర్పాటు చేయాలని సోషల్ మీడియా వినియోగదారులు కోరుతున్నారు."పర్యవేక్షణ లేకుండా ఇది ప్రమాదకరం కాదా? ఏదైనా జరిగితే బాధ్యత ఎవరు తీసుకుంటారు? పార్కుల్లో ఉన్న ప్రతి అవుట్డోర్ జిమ్ పరికరం పక్కన స్పష్టమైన వినియోగ మార్గదర్శకాలు, భద్రతా సూచనల బోర్డులు బీబీఎంపీ ఏర్పాటు చేయాలి" అని పేర్కొన్నారు.అవుట్డోర్ జిమ్ పరికరాల పక్కన స్పష్టమైన వినియోగ సూచనలు, భద్రతా బోర్డులు ఏర్పాటు చేయాలని పార్శ్వనాథ్ బృహత్ బెంగళూరు మహానగర పాలికను కోరారు. ముఖ్యంగా వృద్ధులు పర్యవేక్షణ లేకుండా వాటిని ఉపయోగిస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. Is this not dangerous without supervision! Who will take responsibility if something happens. BBMP should install clear usage guidelines and safety instructions on boards next to each outdoor gym equipment in parks. pic.twitter.com/iUvFUI50tJ— Sandeep Parswanath (@sarpame) July 6, 2026 -
ఈ రిక్షా తరహాలోనే ఏటీఎంలు హ్యాక్?
న్యూఢిల్లీ: మొబైల్ యాప్ల ద్వారా ఈ రిక్షాలను నిలిపివేసిన తరహాలోనే, ఇప్పుడు ఏటీఎం మిషన్లను కూడా ఫోన్ యాప్ సహాయంతో బంద్ చేయవచ్చంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కొందరు వ్యక్తులు ‘బీఏటీ- బీఎంఎస్’ లాంటి ఇంటర్ఫేస్ కలిగిన యాప్ ద్వారా ఏటీఎంను ఆన్, ఆఫ్ చేస్తున్నట్లు చూపించారు. అయితే సాంకేతిక నిపుణులు ఈ వాదనను పూర్తిగా కొట్టిపారేశారు.ఇటీవల ఈ రిక్షాలలో ఉపయోగించిన చైనీస్ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ (బీఎంఎస్) భద్రతా లోపాల కారణంగా వాటిని యాప్ ద్వారా నియంత్రించడం సాధ్యమైంది. దీనిపై స్పందించిన భారత ప్రభుత్వం ఆ యాప్లను బ్లాక్ చేసింది. కానీ ఏటీఎంల భద్రతా వ్యవస్థ అత్యంత కట్టుదిట్టంగా ఉంటుంది. ఇవి బ్యాంకుల సొంత నెట్వర్క్, వీపీఎన్, బహుళ అంచెల సెక్యూరిటీ ఫైర్వాల్స్పై పనిచేస్తాయి. కాబట్టి బ్లూటూత్ లేదా థర్డ్ పార్టీ యాప్ల ద్వారా ఏటీఎంలను హ్యాక్ చేయడం లేదా నియంత్రించడం అసాధ్యమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వైరల్ వీడియోలోని ఏటీఎం అనుకోకుండా రీబూట్ అవుతున్న సమయంలో, వ్యూస్ కోసం టైమింగ్ మ్యాచ్ చేసి ఈ తప్పుడు ప్రచారానికి తెరలేపి ఉంటారని భావిస్తున్నారు. -
ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్.. డీజీపీ సీవీ ఆనంద్ స్పందన ఇదే!
టీజీ20 లీగ్లో భాగంగా రంగారెడ్డి రైజర్స్తో జరిగిన మ్యాచ్లో అన్వితా ఖమ్మం ఏసెస్ ఆటగాడు మికిల్ జైస్వాల్ స్టన్నింగ్ క్యాచ్తో మెరిశాడు. రంగారెడ్డి రైజర్స్ 139 పరుగుల వద్ద ఉన్నప్పుడు హర్షిత్ సాయి బౌలింగ్లో నితిన్ సాయి యాదవ్ భారీ షాట్కు యత్నించాడు. అయితే బౌండరీ లైన్ వద్ద కాచుకు కూర్చున్న మికిల్ జైస్వాల్ తనను తాను బ్యాలెన్సింగ్ చేసుకుంటూ ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. ఈ క్రమంలో బౌండరీ లైన్కు తగలకుండా అలాగే నిలబడ్డాడు. మికిల్ జైస్వాల్ క్యాచ్ విన్యాసం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే మికిల్ జైస్వాల్ స్టన్నింగ్ క్యాచ్పై తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ స్పందించారు. '1982లో లీగ్ క్రికెట్ ఆడడం ప్రారంభించాను. అప్పటినుంచి ఇప్పటిదాకా నా జీవితంలో ఇలాంటి స్టన్నింగ్ క్యాచ్ చూడలేదు. ఇక్కడ అద్భుతమైన విషయమేంటంటే.. మికిల్ జైస్వాల్ బౌండరీ దాటకుండా, బ్యాలెన్స్ కోల్పోకుండా క్యాచ్ పట్టిన విధానం హైలైట్గా మారింది. మరి దీనిపై మీరు ఏం కామెంట్ చేస్తారో చెప్పండి' అని పేర్కొన్నారు. మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన రంగారెడ్డి రైజర్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఆదిత్య జవ్వాజి (43), గ్నానా రెడ్డి (36) రాణించారు. ఖమ్మం బౌలర్లలో సీవీ మిలింద్ మూడు వికెట్లు తీయగా, హర్షిత్ సాయి, వేద్ రెడ్డి చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం ఖమ్మం ఏసెస్ 17.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసి గెలుపొందింది. కొనిదెల హిమతేజ (45), మికిల్ జైస్వాల్ (30), ఆఖర్లో కెప్టెన్ సీవీ మిలింద్ (29 నాటౌట్) రాణించారు.Just see this catch taken by Mickil Jaiswal in the TGT20 match yesterday in the Uppal stadium in the match between Khammam Aces and Ranga Reddy Risers .I have never seen a better catch than this ever since I first started playing league cricket in 1982 , even in all types of… pic.twitter.com/2J8isD0gHh— CV Anand IPS (@CVAnandIPS) July 5, 2026 -
దుఃఖాన్నే శక్తిగా మార్చింది..! స్ఫూర్తిగా నిలిచింది
మనకే ఈ కష్టాలు అనుకుంటాం. కానీ ఏ ఒక్కరిని పలకరించినా లేక మాటలు కలిపినా..మనమే నయం అనిపిస్తుంది, పైగా ధైర్యంగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తాం కూడా. అలాంటి కన్నీటి కథే ఇది. ఒంటరిగా పోరాడుతూ అలిసిపోయినా ఓ రిటైర్డ్ మహిళా టీచర్ కన్నీటి వ్యథ. ఇంతటి స్థితిలో కూడా ఆశను వదులుకోనంటూ సరికొత్త జీవితానికి నాంది పలికి అండగా నిలిచే సంతోషాన్ని వెతుక్కుంటూ సాగిపోతోంది. నిజంగా ఆమె ధైర్యానికి మాటల్లేవ్ అంతే..!.ఆ మహిళే హర్యానాకు చెందిన సునీతా చౌదరి తన కథను సోషల్ మీడియా వేదికగా పంచుకుందిలా. అందరి అమ్మాయిల్లానే 20 ఏళ్ల వయసులో మీరట్లో పెళ్లి చేసుకుంది. ఆమె భర్త ఒక న్యాయవాది. ఆయనొక స్కూల్ని కూడా నడిపేవారు. ఆ తర్వాత కొన్నేళ్లకు సునీతా ఆ పాఠశాల్లోనే బోధించడం ప్రారంభించిది. చాలామంది అమ్మాయిల్లానే ఆమె కూడా తన భర్తతో సంతోషకరమైన జీవితాన్ని గడపాలనుకుంది. కానీ కొన్నేళ్లకే ఊహించని విధంగా కష్టాలు ఒకదానివెంట ఒకటిగా ఎదురయ్యాయి. ముఖ్యంగా ఆమెకు అత్తమామల అండ లేకపోవడంతో చాలా సమస్యలు ఎదుర్కొంది. మొదటి గర్భధారణ సమయంలో ఎవ్వరి మద్దతు లభించలేదామెకు. ఆ పట్టణం కూడా కొత్త అవ్వడంతో ఎవ్వరిని సహాయం అడగాలో తెలియని స్థితి. సరిగ్గా ఆ సమయంలో ఉమ్మనీరు లీక్ అయ్యి..ఆస్పత్రిలో చేరేందుకు ఒంటరిగా వెళ్లిన ఘటన ఇప్పటికీ మర్చిపోనంటోందామె. అక్కడ ఎవరో ఇద్దరు మహిళలు చూసి క్లినిక్ తీసుకువెళ్లారు..అక్కడ తనని పరీక్షించి సెలైన్ ఎక్కించారని, ఆ తర్వాత ఆ విషయాన్ని స్కూల్లో ఉన్న భర్తకు చేరవేశానని చెప్పుకొచ్చారు. ఆయన వచ్చి మెరుగైన ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ మొదటి బిడ్డకు జన్మనిచ్చానని అన్నారు. అలాగే సెకండ్ ప్రెగ్నెన్సీలో సైతం తన పరిస్థితి బాగోలేదని ఆ సమయంలో తన భర్త రూర్కీలో ఉన్నారని తెలిపింది. అత్తగారు ఇంట్లోనే ఉన్నప్పటికీ ఆమె ముందుకు రాలేదని, తన మామగారే పక్కింటావిడిని పిలుచుకొచ్చారని చెప్పుకొచ్చింది. సరిగ్గా తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో ప్రసవం జరిగిందని, ఆ తర్వాత ఏమైనా తిన్నవా అని అడిగేవారే లేరంటూ కన్నీళ్లు పెట్టుకుంది. చివరికి ఉదయం 5 గంటలకు తనే లేచి పాలు కాసి పాల సీసాలో పోసి పెద్ద కొడుక్కి పట్టించానని ఆవేదనగా చెప్పింది. ఇక మూడో ప్రసవం సమయంలో అస్సలు మద్దతు లేదని, తన భర్త పక్కనే ఉన్నా..ఎన్ని పనులు అని చేయగలరని ఆక్రోశంగా చెప్పుకొచ్చింది. అయితే ఆ ప్రెగ్నెన్సీ తర్వాత చాలా కాలం పాటు అనారోగ్యంతో బాధపడ్డానని, టైఫాయిడ్, క్షయ వంటి వ్యాధుల అటాక్ అయ్యాయని, చూసుకునేవారు లేరని బాధగా తెలిపింది. ఇంకోవైపు పుట్టిన పాప చాలా బలహీనంగా ఉండటంతో తీవ్రమైన కామెర్లతో బాధపడింది. దీనికి తోడు హర్ట్లో హోల్ ఉన్నట్లు వైద్యులు నిర్థారించడంతో పెద్దపీడుగు పడ్డట్లు అనిపించిందని తన బాధను ఏకరవు పెట్టింది. చివరికి ఏదోలా ఆ చిన్నారికి విజయవంతంగా ఆపరేషన్ చేయించాం కదా ఇక కష్టాలకు పులిస్టాప్ పడింది అనుకుంటే..విధి మరోలా తలిచింది. సరిగ్గా ఆ తర్వాత\భర్త అనారోగ్యం బారిన పడ్డారు. ఆయనకు కేన్సర్ ఉన్నట్లు తెలిసింది. పైగా ఎలాంటి వైద్య బీమా లేకపోవడంతో పిల్లల చదువులు, ట్యూషన్లు, స్కూల్ వ్యవహారాలు తదితర ఇంటి బాధ్యతన్నీ తానే స్వయంగా చూసుకోక తప్పలేదు. పోనీ భర్తకు ఆపరేషన్ చేయించి బతికుంచి కుంటే మరోసారి విధి కన్నెర్రజేసిందంటూ తన బాధన వివరించింది. ఈసారి యాక్సిడెంట్ రూపంలో వచ్చి..తన భర్తను మరోసారిఆస్పత్రి పాలయ్యేలా చేసింది. దీంతో ఆయన ఆరోగ్యం మరింత క్షీణించి మూత్రపిండాలు దెబ్బతిన్నాయి. చివరిక ఆయన డయాలిసిస్పై ఆధారపడి జీవించాల్సి వచ్చింది. అంత కష్టంలోనూ అత్తమామల నుంచి ఎలాంటి సహయా సహకారాలు లభించలేదని వాపోయింది. ఆయన కోసం తన వల్ల అయ్యిందంతా చేసినా..చిరికి ఆయన 52 ఏళ్ల వయసులో తనను వదిలి వెళ్లిపోయారని బాధగా చెప్పింది. ఆ తర్వాత కరోనా వచ్చి..ఇంట్లోనే బంధీగా మార్చింది. ఇక అప్పటికే శారీరకంగా, మానసికంగా అలిసిపోయాను, ఆర్థికంగా దెబ్బతిన్నాను. పోనీ మా వద్ద డబ్బు తీసుకున్నవాళ్లు సైతం మొండిచేయి చూపించారు. ఇక ఆ క్లిష్ట సమయంలో ఎందుకోసం బతకాలి ఏంటీ జీవితం..అని చాలా విరక్తిగా అనిపించింది. దాంతో జీవితాన్ని ముగించేద్దాం అనే కఠిన నిర్ణయం కూడా తీసుకున్నా. సరిగ్గా ఆ సమయంలోనే ఆమె యూటర్న్ తీసుకుని.. ఉపాధ్యాయురాలిగా బోధించే వృత్తిలో ఉన్న నాకు బోధించడమే తెలుసు..ఓడిపోవడం కాదు అని తనకు తనే ధైర్యం చెప్పుకుంది. తక్షణమే చనిపోయిన తన భర్త ఫోన్ని చేతికి తీసుకుని దీనిలోనే తన సంతోషాన్ని వెతుక్కోవాలని నిర్ణయించుకుంది. ఎలాగో లాక్డౌన్ కావడంతో..సోషల్ మీడియాలో రీల్స్ చేద్దాం అని డిసైడ్ అయ్యింది. అప్పటికీ ఆమెకు 60 ఏళ్లు టీచర్గా పదవీ విరణమ చేశారు కూడా. కానీ ఎలా మొదలుపెట్టాలి, ఏం చేయాలో తెలియలేదు. దాంతో తన కథనే సోషల్ మీడియాలో పంచుకోవడం మొదలు పెట్టింది. తన ఆవేదనను బంధువులు, కుటుంబ సభ్యులు అర్థం చేసుకోలేకపోతేనేం..నెటిజన్ల మనసును తాకింది, అమితంగా ఆకర్షించింది కూడా. వాళ్లంతా ఆమెను సూపర్ ఉమెన్ అంటూ మా సపోర్ట్ మీకే అమ్మ అన్న మాటలు ఆమెకు ఊపిరిపోశాయి. దాంతో మరిన్ని వీడియోలు నెట్టింట షేర్ చేయడం మొదలు పెట్టింది. ప్రతీదీ వైరల్ అవ్వడమే గాక సుమారు 2.5 లక్షల మంది ఫాలోవర్లు ఉండటం విశేషం. ఈ సోషల్ మీడియా తనకు ఎవ్వరూ లేరనే బాధ తీర్చి..,ఇంతమంది మద్దితిచ్చేలా ఓ పెద్ద కుటుంబాన్ని కానుకగా ఇచ్చిందని ఆనందంగా చెప్పుకొచ్చింది సునీతా. కానీ భర్తను కోల్పోయిన బాధ మాత్రం తనను ఎప్పటికీ వీడదంటూ తన స్టోరీను ముగించింది. ఆమె కథ దుఃఖాన్ని శక్తిగా మార్చుకోవడం ఎలా అని చెప్పే స్ఫూర్తిదాయకమైన కథ. ఇలానే అందరి జీవితాల్లో కష్టాలు ఒకదాని వెంట ఒకటి వస్తుంటాయి..ఎంత ధైర్యంగా ఫేస్ చేశామన్నదే ముఖ్యం కానీ..నాకే ఎందుకు అన్న ప్రశ్నకు తావివ్వకూడదనే సందేశాన్ని ఇస్తోంది కదూ..!. View this post on Instagram A post shared by Sunita Chaudhry (@retired_sunita) (చదవండి: ఆ రోజు అమ్మ ఆభరణాలు అమ్మడం వల్లే.. ఇవాళ ఏకంగా రూ. 1.9 కోట్లు..) -
ఫ్లైట్లో కూతుర్ని అలా చూసి.. తల్లిదండ్రులు షాక్! ఎందుకలా చెప్పావ్..
అమ్మనాన్నలకు ఏ పిల్లలైనా.. మంచి సర్ప్రైజ్ ఇవ్వాలనే ప్రయత్నిస్తారు. మంచి జాబ్ సాధించో లేక తాను చేస్తున్న ఆఫీస్కి చెప్పకుండా తీసుకువెళ్లడమే మరేదైనా నచ్చిన గిఫ్ట్ ఇచ్చో సంబరపడతారు. ఆ తర్వాత వాళ్ల కళ్లల్లో కనిపించే ఆనందం, గర్వం ఎప్పటికీ మర్చిపోలేని గొప్ప అనుభవం. అలాంటి సంతోషాన్ని పొందింది ఈ ఫ్లైట్ అటెండెంట్. ముందుగా ఆ మహిళా ఫ్లైట్ అటెండెంట్ తన తల్లిదండ్రలుకు తాను వేరే ఫ్లైట్లో ఉంటానని అబద్ధం చెబుతుంది. కానీ ఆమె తన పేరెంట్స్ వెళ్తున్న ఫ్లైట్లోనే అటెండెంట్గా విధులు నిర్వర్తించనుంది. కానీ అది చెప్పకుండా విమానంలో వాళ్ల రాక కోసం ఉత్కంఠభరితంగా ఆమె ఎదురు చూస్తుంది. ఇంతలో వాళ్లు రానే వస్తారు. అక్కడ కూతుర్ని అలా చూసి షాకవ్వుతారు. మరి ఎందుకు అబద్దం చెప్పావురా అని కూతుర్ని అడుగుతుంది ఆమె తల్లి. ఆ తల్లిదండ్రులిద్దరు డ్యూటీలో ఉన్న తమ కూతర్ని చూసి ఒక్క క్షణం సంభ్రమాశ్చర్యలకు లోనవ్వడమే కాదు, గర్వంగా పీలవ్వుతారు. ఆమె అందుకు సంబంధించిన ఘటనను వివరిస్తూ.."తాను వాళ్ల క్యాబిన్ క్రూ అని గ్రహించే క్షణం కోసం ఆత్రుతగా ఎదురు చూశా. ఇది నిజంగా వెలకట్టలేనిది. తన తల్లిదండ్రల కళ్లల్లో ఆ గర్వాన్ని చూసేందుకే ఇలా చేశా. ఈ జర్నీ అత్యంత సృతృప్తినిచ్చే క్షణం ఇదే అంటూ అందుకు సంబంధించిన వీడియోని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ..పోస్ట్లో రాసుకొచ్చింది". అంతేగాదు ఆ పోస్ట్లో తన తల్లిదండ్రులు ఎప్పుడూ తాను క్యాబిన్ క్రూ అవ్వాలని కలలు కనేవారని, ప్రతి సుఖదుఃఖంలో తనకు అండగా నిలిచారని చెప్పుకొచ్చింది. ఈసర్ప్రైజ్ వారికోసం మాత్రేమ కాదు..అత్యంత కీలకమైన సమయంలో తనను నమ్మినందుకు కృతజ్ఞతలు చెప్పడాని ఇలా చేశా. వారు నాపై నమ్మకాన్ని కోల్పోనందు వల్లే ఈ రోజు తాను ఈ స్థాయిలో ఉన్నానని రాసుకొచ్చింది. ఈ వీడియోపై నెటిజన్ల నుంచి ఆత్మీయ స్పందనలు వెల్లువెత్తాయి. ఇలాంటి సర్ప్రైజ్ని పేరెంట్స్ ఎన్నటికీ మర్చిపలేరంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Moon🧿 (@sushmita__nath_) (చదవండి: లగ్జరీ కారు యజమాని పెద్దమనసు..! ఆ ఆటో డ్రైవర్ కోసం..) -
లగ్జరీ కారు యజమాని పెద్దమనసు..! ఆ ఆటో డ్రైవర్ కోసం..
లగ్జరీ కారులు నడిపే వాళ్లు ఏ రేంజ్లో ఉంటారో తెలిసిందే. అంత సులభంగా ఓ సాదాసీదా వ్యక్తులతో మాటలు కలపడం అత్యంత అరుదు. అలాంటిది సరదాగా వాళ్ల వస్తువులను ఒక్కసారి ట్రై చేస్తాం అని అడగడం అంత సులభం కానే కాదు. ఒక వేళ అడిగినా.. ఇస్తారని గ్యారంటీ లేదు. కానీ ఈ లంబోర్ఘిని యజమాని తన గొప్ప మనసును చాటుకుని..నెట్టింట నెటిజన్లను ఫిదా చేశాడు. అసలేం జరిగిందంటే..రాకేష్ కుమార్ అనే వ్యక్తి ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియోని పంచుకున్నారు. ఆ వీడియోలో అతను లంబోర్ఘినిని నడుపుతుండగా రోడ్డుపై ఒక ఆటోరిక్షాను గమనిస్తాడు. సాధారణంగా మొదలైన పరిచయం తర్వాత..ఆ డ్రైవర్ నెమ్మదిగా తన మనసులోని మాటను బయటపెడతాడు. వెంటనే యజమాని ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా సమ్మతి తెలపడమే కాకుండా ఇరువురు వాళ్ల వాహనాల తాళాలను మార్చుకుంటారు. ఆ డ్రైవర్ చక్కగా లంబోర్ఘిని నడుపుతూ తన కోరికని తీర్చుకుంటాడు. ఇక సదరు యజమాని ఏ మాత్రం ఇబ్బంది పడకుండా ఆ ఆటో రిక్షాను డ్రైవ్ చేస్తాడు కూడా. అక్కడితో వీడియో ముగుస్తుంది. ఇక కుమార్ ఈ వీడియోని షేర్ చేస్తూ..ఈ మరపురాని క్షణం కోసం నేను నా లంబోర్ఘినిని పణంగా పెట్టాను! నిజం చెప్పాలంటే, అతని ఆటో నడపడం నన్ను బాగా కదిలించింది. ఆటో మీటర్ డబ్బులు కట్టడమే ఒక సవాలుగా ఉన్న నా కష్టాల రోజుల్లోకి ఇది నన్ను తీసుకువెళ్ళింది అనే క్యాప్షన్ జోడించి మరి పోస్ట్ చేశాడు. ఈ క్లిప్పై విశేషమైన స్పందన వచ్చింది. ఆ ఆటో డ్రైవర్ ముఖం నవ్వుతో వికసించగా, ..ఈ యజమాని గొప్ప మనసు దయకు మాటల్లేవ్ అంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by RAKESH KUMAR (@rakesh_knv) (చదవండి: Aamir Khan And Gauri Spratt : అలా మొదలైంది వారి ప్రేమ కథ..! 25 ఏళ్ల క్రితమే..) -
Viral Video: గుండె జారిపోయే సీన్.. జునాగఢ్ గుంత ప్రమాదం..
-
నాన్నకు ప్రేమతో..! వైరల్గా కూమార్తె పోస్ట్..
అందర్నీ ఆలోచింపచేసేలా నెట్టింట చక్కెర్లు కొడుతున్న పోస్ట్ నెటిజన్లను అమితంగా ఆకర్షిస్తోంది. తల్లిదండ్రులు పిల్లల కోసం ఎంతలా తమ సర్వస్వం ధారపోస్తారో తెలియజేసే ఓ కూతురు పోస్ట్ ఇది. ఆమె పోస్ట్లో నాన్న త్యాగాలు గురించి రాసిన విధం చూడగానే ఠక్కున జూనియర్ ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో మూవీలోనిఏ కష్టమేదురోచ్చినాకన్నీళ్ళు ఎదిరించినా ఆనందం అనే ఉయ్యాలలో నను పెంచిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో..నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీ క్షణం అనే పాట గుర్తుకొస్తుంది. అంత భావోద్వేగంగా నాన్న గురించి రాసుకొచ్చిందామె పోస్ట్లో.ఇన్స్టాగ్రామ్ 'Growing with Artha' అనే ఖాతాలో షేర్ చేసిన వీడియలో ఈ విషయాలను పంచుకున్నారు. ఈ వీడియో వేలాదిమంది మనసులను తాకింది. ఆ కూతురు పోస్ట్లో తన తండ్రి గురించి ఇలా రాసుకొచ్చింది. " మా నాన్న 35 ఏళ్లకు పైగా ఆటో రిక్షాని నడుపుతున్నారు. అందువల్లే తనకు తనకు మంచి విద్య, స్వతంత్ర, మంచి కెరీర్ లభించాయని అంటోంది. నర్సరీ స్థాయి నుంచి డిగ్రీ వరకు నా చదువు ఆయన కఠిన శ్రమ వల్లే సాధ్యమైంది. మా చుట్టుపక్కల చాలా మంది తమ కూతుళ్ల పెళ్లిళ్ల కోసం డబ్బు దాచుకుంటున్న సమయంలో, మా నాన్న మాత్రం మా చదువుపై పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నారు. కానీ ఆయన నాకు ఇచ్చిన అత్యంత గొప్ప బహుమతి విద్య కాదు, స్వతంత్రత. నాకు ఒక ఒక సోదరి కూడా ఉంది. ఆడపిల్లలమని ఎలాంటి ఆంక్షలు విధించలేదు. ఒంటిరిగా ప్రయాణించడం నుంచి సొంత నిర్ణయాలు తీసుకోవడం, ఆత్మవిశ్వాసంతో జీవితాన్ని ఎదుర్కోవడం వంటి విషయాల వరకు ప్రతిదాంట్లో మాపై నమ్మకం ఉంచారు. తాను తన సోదరి ఇద్దరం కెరీర్లో బాగా రాణించాం. కోవిడ్ మహమ్మారి సమయంలో, తమ తల్లిదండ్రులకు ఏదైనా తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఒక వ్యవసాయ క్షేత్రాన్ని (ఫామ్) ప్రారంభించాం అప్పటి నుంచి, ఆయన దాని బాగోగులు స్వయంగా చూసుకుంటున్నారు. ఆ తర్వాత నాకు పెళ్లై తల్లిగా మారాక ఉద్యోగం కొనసాగించాలా వద్ద అనే క్లిష్టమైన నిర్ణయం తీసుకునే సమయంలో కూడా నాకు అండగా నిలిచారు. పైగా నా కెరీర్ని వదులుకోవద్దని ప్రోత్సహించారు. బిడ్డ పెంపకంలో మేము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఉద్యోగం మానేయకు' అని చెప్పారు. అంతేకాకుండా, నాతో ఉండటానికి మా అమ్మను పంపించారు. నేను ఆఫీసుకి వెళ్ళినప్పుడు నా కూతురిని చూసుకోవడానికి మా అమ్మ ప్రతి వారం బెంగళూరుకు వస్తుంటారు. ఆమె తల్లి బిడ్డను చూసుకోవడంలో సహాయం చేస్తుండగా, ఆమె తండ్రి ఇంట్లో అన్ని పనులూ ఒంటరిగా చూసుకుంటారని ఆ పోస్ట్లో పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి చెందిన కిరాణా దుకాణాన్ని నడుపుతారు, పొలాన్ని చూసుకుంటారు, వంట చేస్తారు, దాంతోపాటు పగటిపూట తన ఆటో నడుపుతూ సాయంత్రం తిరిగి వచ్చి దుకాణాన్ని తెరుస్తారు. దీన్ని బట్టి నాకో విషయం అర్థమైది. తల్లిదండ్రులు ఇచ్చే గొప్ప బహుమతి డబ్బు కాదు, ఒక బిడ్డను స్వతంత్రంగా పెంచి తర్వాత వారికి అండగా నిలబడటమే. నాకు మాత్రం ప్రతి అడుగులోనూ అండగా నిలిచారు అందుకు మా నాన్న సదా ధన్యావాదాలు. అంటూ పోస్ట్ని ముగించింది. నెటిజన్ల సైతం ఆమె పోస్ట్ మద్దతిస్తూ..నిజమైన హీరో నాన్నే అంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Growing with Artha (@arthasfirstbites) (చదవండి: యుద్ధం భర్తను దూరం చేస్తే..సాంకేతికత చేరువ చేసింది!) -
ఏం జరిగినా వెనక్కి తగ్గేది లేదన్న సందేశం..!
-
"బాల్పాయింట్ పెన్" రూపొందించింది ఓ 'జర్నలిస్ట్’ అని తెలుసా..?
మన జేబులో ఒదిగిపోయే ఒక చిన్న వస్తువు ప్రపంచ రూపురేఖలను మార్చేస్తుందని ఎవరైనా ఊహించారా..? స్కూల్ బ్యాగుల నుంచి ఆఫీస్ డెస్క్ల వరకు ప్రతిచోటా దర్శనమిచ్చే 'బాల్పాయింట్ పెన్' వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. నిత్యం మనం రాసేందుకు ఉపయోగించే ఈ చవకైన సాధనం, ఒక జర్నలిస్ట్ పడిన చిన్న ఇబ్బంది, ఆయన చేసిన సునిశిత పరిశీలనల నుంచే పుట్టుకొచ్చింది.ఒకప్పుడు రాయడం అంటే అంత సులువైన విషయం కాదు. బాల్పాయింట్ పెన్నులు రాకముందు ప్రపంచమంతా 'ఫౌంటెన్ పెన్నుల'పైనే ఆధారపడేది. అవి చూడటానికి ఎంతో రాజసంగా, అందంగా ఉండేవి కానీ, వాటితో ఉన్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. ఆ పెన్నుల నిబ్ గుండా సిరా సజావుగా ప్రవహించాలంటే, సిరా చాలా పలుచగా, నీళ్లలా ఉండాలి. దీనివల్ల కాగితంపై రాయగానే సిరా త్వరగా ఆరేది కాదు. కాస్త చేయి తగిలినా లేదా పేజీ తిప్పినా అక్షరాలన్నీ చెరిగిపోయి, కాగితం మొత్తం నల్లటి మరకలతో మురికిగా మారిపోయేది.లాస్లో బీరో అనే జర్నలిస్ట్..ముఖ్యంగా వార్తా సంస్థల్లో అత్యంత వేగంగా నోట్స్ రాసుకోవాల్సిన పాత్రికేయులకు ఈ సిరా ఒలికిపోవడం, మరకలు పడటం అనేది ఒక పెద్ద చికాకుగా మారేది. హంగేరీకి చెందిన లాస్లో బీరో అనే జర్నలిస్ట్ కూడా ప్రతిరోజూ ఇదే సమస్యతో విసిగిపోయారు. అయితే, 1938లో ఒకరోజు ఆయన న్యూస్రూమ్లో కూర్చుని ఆలోచిస్తున్నప్పుడు ఒక ఆసక్తికరమైన విషయాన్ని గమనించారు. పెద్ద పెద్ద రొటేటరీ మిషన్లపై ముద్రితమై వస్తున్న వార్తాపత్రికలలోని సిరా తక్షణమే ఆరిపోతోంది. పత్రికను పట్టుకున్నా చేతులకు నల్లటి మరకలు అంటడం లేదు. కానీ, తన ఫౌంటెన్ పెన్ సిరా మాత్రం చాలా సేపటి వరకు తడిగానే ఉంటోంది."వార్తాపత్రికల ముద్రణకు ఉపయోగించే సిరా అంత త్వరగా ఎలా ఆరిపోతోంది..?" అనే చిన్న ప్రశ్న బీరో మైండ్లో ఒక పెద్ద ఆలోచనకు పునాది వేసింది. వార్తాపత్రికల్లో వాడే సిరా వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకునేందుకు బీరో పరిశోధనలు ప్రారంభించారు. ఆ సిరా చాలా చిక్కగా ఉండటం వల్లే కాగితం దాన్ని త్వరగా పీల్చుకుంటుందని, ఫలితంగా అది వెంటనే ఆరిపోతుందని గ్రహించారు. అయితే, ఆ చిక్కటి సిరాను నేరుగా తన ఫౌంటెన్ పెన్నులో పోసి రాయడానికి ప్రయత్నించినప్పుడు మరో సమస్య ఎదురైంది.సిరాను మార్చితే..చిక్కదనం వల్ల ఆ సిరా పెన్ నిబ్ను పూర్తిగా మూసివేసింది. అంటే, కేవలం సిరాను మార్చితే సరిపోదు, రాయడానికి వాడే పరికరం సాంకేతికతను పూర్తిగా మార్చాలని బీరో నిర్ణయించుకున్నారు. సిరా ప్రవాహాన్ని నియంత్రించడానికి బీరో ఒక అద్భుతమైన ఆలోచన చేశారు. పెన్ కొన భాగంలో నిబ్కు బదులుగా, స్వేచ్ఛగా తిరగగలిగే ఒక చిన్న లోహపు బంతిని (Tiny Rotating Ball) అమర్చారు. పెన్నును కాగితంపై పెట్టి రాస్తున్నప్పుడు, ఆ బంతి గుండ్రంగా తిరుగుతుంది. అలా తిరిగినప్పుడు పెన్ లోపల ఉన్న గొట్టం (కార్ట్రిడ్జ్) నుంచి చిక్కటి సిరాను ఆ బంతి తన వైపుకు తీసుకుంటుంది. బాల్ తర్వాతి రౌండ్ తిరగగానే ఆ సిరాను కాగితంపైకి సున్నితంగా రాస్తుంది. ఈ చిన్న బాల్ ఐడియా ఒకేసారి అన్ని సమస్యలనూ పరిష్కరించే సింది. ఇది సిరా లీక్ అవ్వకుండా అడ్డుకుంది, ప్రవాహాన్ని నియంత్రించింది, అన్నింటికీ మించి త్వరగా ఆరిపోయే చిక్కటి సిరాను ఉపయోగించేలా చేసింది.ప్రపంచంలోనే మొట్టమొదటి..ఇదే ప్రపంచంలోనే మొట్టమొదటి విజయవంతమైన బాల్పాయింట్ పెన్..! బాల్పాయింట్ పెన్ సిరా ప్రత్యేక రసాయన నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ఇది పెన్ను లోపల ఉన్నంత కాలం ఎండిపోకుండా స్థిరంగా ఉంటుంది, కానీ కాగితాన్ని తాకగానే గాల్లోని తేమను గ్రహించి తక్షణమే ఆరిపోతుంది.లాస్లో బీరో తన వ్యక్తిగత చికాకును దూరం చేసుకోవడానికి కనుగొన్న ఈ చిన్న పరికరం, కొద్ది కాలంలోనే ప్రపంచవ్యాప్త వ్రాత అలవాట్లను మార్చేసింది. ఫౌంటెన్ పెన్నుల లాగా వీటికి పదే పదే సిరా సీసాల నుంచి ఇంక్ నింపాల్సిన అవసరం లేదు, లీక్ అవుతుందనే భయం లేదు. ఎక్కువ కాలం మన్నిక రావడం, ధర కూడా చాలా తక్కువగా ఉండటంతో ఇవి పాఠశాలలు, బ్యాంకులు, ఆఫీసులకు వేగంగా విస్తరించాయి. ఈ రోజు మన చేతిలో ఎంతో సులభంగా కదలాడే బాల్ పెన్ వెనుక ఒక జర్నలిస్ట్ సృజనాత్మకత, నిశిత పరిశీలన దాగి ఉన్నాయి. చిన్న చిన్న ఇబ్బందులే కొన్నిసార్లు ప్రపంచాన్ని మార్చే గొప్ప ఆవిష్కరణలకు దారితీస్తాయని చెప్పడానికి లాస్లో బీరో కథే ఒక నిలువెత్తు నిదర్శనం..!- పసుపులేటి వెంకటేశ్వరరావు. (చదవండి: తొమ్మిదేళ్లకే ప్రపంచ గుర్తింపు..! ఏకంగా ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ ఆహ్వానం ..) -
యూఎస్లో రూ. 85 వేల టాబ్లెట్, ఇండియాలో రూ.35లకే
భారతదేశం, అమెరికా మధ్య వైద్య ఖర్చుల్లో తేడాలపై గతంలో అనేక కథనాలు చూశాం. తాజాగా ఒక అమెరికన్ మహిళ మరో ఇంట్రస్టింగ్ స్టోరీని పోస్ట్ చేశారు. ఇండియా, యూఎస్లోని వైద్య ధరల మధ్య భారీ వ్యత్యాసాన్ని ప్రస్తావిస్తూ అమెరికాలో తమని దోచుకుంటున్నారంటూ ఆమె పోస్ట్ చేసిన ఇన్స్టాగ్రామ్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.వైరల్ వీడియో విశేషాలు'లిజ్' అనే అమెరికన్ మహిళ "ఇండియన్ వర్సెస్ అమెరికన్ హెల్త్కేర్" అనే టైటిల్తో ఒక వీడియోను పోస్ట్ చేసింది. అమెరికాతో పోలిస్తే భారతదేశంలో వైద్య ఖర్చులు చాలా తక్కువని, అమెరికాలో ప్రజలను 'దోచుకుంటున్నారని' ఆరోపించింది. ఇందుకు 'రెవ్లిమిడ్' (Revlimid) అనే టాబ్లెట్ ధరను ఆమె ఉదాహరణగా చూపింది.తన అత్తగారి బ్లడ్ క్యాన్సర్ చికిత్సకు వాడే టాబ్లెట్ ధర అమెరికాay 900 డాలర్లు (సుమారు రూ. 85,000) ఉండగా, భారతదేశంలో దీని జెనరిక్ ప్రత్యామ్నాయం కేవలం 30 సెంట్ల నుండి 3 డాలర్ల (రూ. 35 నుండి రూ. 300) లోపే లభిస్తోందని వెల్లడించింది. ఈ వీడియోకు ఇప్పటికే దాదాపు 8 లక్షల వ్యూస్ వచ్చాయి. భారతదేశంలోని చౌకైన వైద్య విధానంపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. అలాగే ఇక్కడి ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచిత క్యాన్సర్ చికిత్స కూడా అందుబాటులో ఉందని ఒక యూజర్ పేర్కొనగా, అమెరికన్లు భారత్కు వచ్చి మందులు కొనుగోలు చేసినా ప్రయాణ ఖర్చులు పోను డబ్బులు మిగులు తాయని మరొకరు కామెంట్ చేశారు.ఇదీ చదవండి: కేతన్ హత్య : కోడ్వర్డ్స్ , ఎమోజీలతో సియా ‘సీక్రెట్ చాట్స్’ View this post on Instagram A post shared by Liz & Shiv (@spicygori)గత నెలలో 'విక్టోరియా' అనే మరో అమెరికన్ మహిళ కూడా యూఎస్ హెల్త్కేర్ సిస్టమ్ను ఒక "స్కామ్" అని అభివర్ణించింది. అమెరికాలో ఆమెకు అత్యవసరమైన మందును ఇన్సూరెన్స్ కంపెనీ కవర్ చేయకపోవడంతో, అక్కడ వెయ్య డాలర్లు పలికే ఆ మందును, ఇండియాలోని తయారీదారు నుండి నేరుగా కేవలం 25 డాలర్లకే కొనుగోలు చేయగలిగింది. అమెరికాలో సామాన్య ప్రజలను పూర్తిగా మోసం చేస్తున్నారని, ఇంత భారీ మొత్తంలో అదనపు డబ్బు ఎవరి జేబుల్లోకి వెళ్తోందని ఆమె ప్రశ్నించిన సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: నాడు డెలివరీ బాయ్.. నేడు రెండు AI స్టార్టప్స్కు ఫౌండర్! -
ఇరాన్లో భావోద్వేగ దృశ్యాలు.. ఖమేనీకి కన్నీటి నివాళి
ఇరాన్ రాజధాని టెహ్రాన్లో భావోద్వేగ వాతావరణం నెలకొంది. మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ తుదివీడ్కోలు కార్యక్రమానికి దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. గ్రాండ్ మోసల్లా ప్రాంగణం కన్నీళ్లు, నినాదాలు, సంతాప సందేశాలతో శోకసంద్రంగా మారింది. ప్రార్థన మందిరం వద్ద నిశ్శబ్దం అలుముకోగా.. ఖమేనీ పార్థివదేహం రాకతో ఆ ప్రాంతంలో రోదనలు మిన్నంటాయి.ఖమేనీ భౌతికకాయాన్ని జాతీయ జెండాతో కప్పి ప్రాంగణానికి తీసుకురాగా, ఆయన తలపై ఉండే నల్ల టర్బన్ను కూడా సంప్రదాయంగా ఉంచారు. కుటుంబ సభ్యుల పార్థివదేహాలను ప్రత్యేక పేటికల్లో ఆయన పక్కపక్కనే ఉంచారు. ఈ క్రమంలో అత్యంత భావోద్వేగ దృశ్యంగా ఆయన 14 నెలల మనవరాలు జహ్రా మొహమ్మది గోల్పాయెగాని చిన్న శవపేటికను ప్రత్యేకంగా ప్రదర్శించారు. జాతీయ జెండాతో కప్పిన ఆ చిన్న పేటిక పక్కనే ఆమె ఫోటోను ఉంచడంతో అక్కడున్నవారు తీవ్రంగా భావోద్వేగానికి లోనయ్యారు. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాకర్ ఘలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి సహా పలువురు ఉన్నతాధికారులు భావోద్వేగాన్ని నియంత్రించుకోలేక కన్నీరు పెట్టుకున్నారు.Un cadre du cercueil de la martyre Zahra Mohammadi Golpayegani, #petite-fille du Guide suprême martyr de la Révolution islamique, à la Mosalla de #Téhéran.#بدرقه_آقای_شهید_ایران#باید_برخاست#NousDevonsNousSoulever#MartyrKhamenei pic.twitter.com/8JemW4zW4A— Iran en France (@IRANinFRANCE) July 3, 2026ఫిబ్రవరి 28న అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. అప్పటి నుంచి భద్రపరచిన భౌతికకాయాన్ని ఇప్పుడు ఆరు రోజుల పాటు జరిగే సంతాప కార్యక్రమాల కోసం ప్రజల సందర్శనార్థం ఉంచారు.టెహ్రాన్లోని గ్రాండ్ మోసల్లా వద్దకు వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. గేట్లు తెరవగానే భారీ జనసంద్రం లోపలికి ప్రవేశించింది. అమెరికాకు వ్యతిరేక నినాదాలతో పాటు ప్రతీకారాన్ని సూచించే ఎరుపు రంగు జెండాలు ప్రదర్శించారు. మరోవైపు.. ‘‘అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను హతమార్చాలని, అమెరికాపై ప్రతీకారం తీర్చుకోవాలని’’ వేలమంది నినాదాలు చేస్తూ.. ఫ్లకార్డులు ప్రదర్శించడం చర్చనీయాంశమైంది.ఈ సంతాప కార్యక్రమానికి దాదాపు 100 దేశాల నుంచి ప్రతినిధులు హాజరైనట్లు సమాచారం. భారత్ సహా రష్యా, పాకిస్థాన్, టర్కీ తదితర దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. మొత్తం రెండు కోట్ల మంది వివిధ దశల్లో ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారని అంచనా వేశారు. అధికారులు కఠిన భద్రతా ఏర్పాట్లు చేశారు.ఖమేనీ భౌతికకాయం టెహ్రాన్లో సోమవారం వరకు ఉంచి, అనంతరం ఖోమ్కు తరలించనున్నారు. మంగళవారం కర్బలా, నజాఫ్ వంటి పవిత్ర నగరాల మీదుగా ప్రయాణించి, చివరగా గురువారం ఆయన స్వస్థలమైన మష్హద్లో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ ఆరు రోజుల సంతాప యాత్రతో ఇరాన్ అంతటా శోక వాతావరణం కొనసాగుతోంది. Mohammad Bagher Ghalibaf cries during the farewell ceremony of Ali Khamenei. pic.twitter.com/i4DC5OgM2y— Raz Zimmt (@RZimmt) July 3, 2026 -
భార్యపై ఇంత ప్రేమా..!
ఇటీవల కాలంలో కొన్ని ఘటనలు భార్యభర్తల మధ్య అనుబంధాలు ఎంత పాశవికంగా మారుతున్నాయో చూస్తూనే ఉన్నాం. డబ్బు మీద ఉన్న ప్రేమ మనుషుల మీద లేదు అనేంతగా బంధాలు తయారయ్యాయి. ఆ తరుణంలో నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..ప్రేమకు సరికొత్త అర్థం చెప్పేలా హృదయాన్ని తాకుతోంది. ఆ వీడియోలో ఒక ఆటో డ్రైవర్ తన ఆటో మొత్తాన్ని దివంగత భార్య ఫోటోలతో నింపేశాడు. కంటెంట్ క్రియేటర్ ఆశిష్ మాథ్యు ఈ వీడియోని షేర్ చేశారు. ఆ కంటెంట్ క్రియేటర్ ఆటోడ్రైవర్తో సంభాషిస్తూ ఉండటం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇద్దరూ మాట్లాడుకుంటూ కనిపిస్తారు వీడియోలో. అతను ఫోటో వైపు చూపిస్తూ ఎవరని ప్రశ్నించగా..ఆ ఆటోడ్రైవర్ ఆమె తన భార్య అని చెబుతాడు. ఆమె చనిపోయి ఎనిమిదేళ్లు అవుతోందని, అయినప్పటికీ ఇప్పటికీ ఆమెను మర్చిపోలేకపోతున్నానని బాధగా చెప్పాడు. అలాగే తనకు కొడుకు కోడలు, ఆరుగురు మనవళ్లు ఉన్నారని కూడా వెల్లడించాడు. తన కుమారుడు తనను ఇంట్లోనే ఉండమని చెబుతుంటాడని, అయితే ఇంట్లోనే ఉంటే ఆమె ఆలోచనలే వస్తాయని, తన మనసంతా ఆమె చుట్టూనే తిరుగుతందని తెలిపాడు. అందుకనే ప్రతిరోజూ ఆటో నడుపుతూ..కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటూ..మనసుని పనిపై నిమగ్నమయ్యేలా చేసుకుంటూ బాధను మర్చిపోతానని భావోద్వేగంగా చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత ఆయన ప్రయాణం కొనసాగుతూనే ఉంది. ఆ కంటెంట్ క్రియేటర్ ఆ వీడియోకి ‘అతడి ప్రేమ భాష’ అనేక్యాప్షన్ జోడించి మరీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. నెటిజన్లు కూడా మంచి సందేశాత్మకమైన వీడియోని షేర్ చేశాశ్ బ్రో అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by asish matthew (@asishmatthew.exe) (చదవండి: ఆటిజం పిల్లలను పెంచే పేరెంటింగ్ టిప్స్..! వైరల్గా ఓ తల్లి గైడెన్స్..) -
ఆటిజం పిల్లలను పెంచే పేరెంటింగ్ టిప్స్..! వైరల్గా ఓ తల్లి గైడెన్స్..
న్యూరోడైవర్జెంట్ పిల్లలను పెంచడం అనేది అత్యంత సవాళ్లతో కూడుకున్నది. అయితే వీళ్ల పెంపకం ప్రతి పేరెంట్కు.. భావోద్వేగాలు, అనుబంధం, నమ్మకం వంటి వాటిని అర్థం చేసుకోవడానికి కొత్త మార్గాలను అందిస్తుంని అంటున్నారు కంటెంట్ క్రియేటర్ ఫాతిమా. ఆమె తన ఆటింజ ఉన్న కొడుకుతో ఒక అద్భుతమైన పేరెంటింగ్ టిప్ని పంచుకున్నారు. ఆ వీడియోలో ఒక జర్నీ దృశ్యాన్ని పంచుకున్నారు. అలాంటి ఆటిజం పిల్లల పెంపక విధానంలో నియంత్రణ, భావోద్వేగ భద్రత, సహనం ప్రాముఖ్యతలను నొక్కి చెబుతోంది. ఇవి అలాంటి పిల్లల పెంపకంలో అత్యంత కీలకమైనవి అంటూ..ఇలా వివరించింది పోస్ట్లో.ఆటిజం ఉన్న పిల్లలకు పెద్ద శబ్దాలు, పరిచయం లేని ముఖాలు, ఆకస్మిక ఇంద్రియ మార్పుల కారణంగా బహిరంగ ప్రదేశాలు తరచుగా ఆందోళనను ప్రేరేపిస్తాయి. తద్వారా వాళ్లు విపరీతమైన ఒత్తిడికి గురవ్వుతారు. దాన్నే కంటెంట్ క్రియేటర్ తన ఆటిజం కొడుకు జర్నీలో ఎలా ఫీలవ్వుతున్నాడో వీడియోలో స్పష్టంగా చూపిస్తుంది. ముందుగా ఆ ఒత్తిడిని తగ్గించేలా..వాళ్లకు సురక్షితమైన ప్రదేశాన్ని కనుగొనాలి, ఆ తర్వాత అతని చుట్టూ ఉన్నవారికి ఎలాంటి హాని జరగకుండా చూసుకోవాలని నొక్కి చెబుతున్నారు. " వీడియోలో ఆ కార్యక్రమంలో మొట్టమొదటగా చేయాల్సింది బిడ్డకు ప్రశాంతమైన వాతావరణాన్ని అందించడం. శారీరక, భావోద్వేగ భద్రత రెండూ ఆటిజం పెంపకానికి గట్ట పునాది. అందుకోసం కౌంట్డౌన్ స్టార్ట్ చేయమని ప్రోత్సహించాలి. ఇది కేవలం లెక్కించడం కాదు, ఆటిజం ఉన్న పిల్లలకు సూచనలను లేదా భావోద్వేగ మార్పులను గ్రహించడానికి ఎక్కువ సమయం పడుతుంది. అందువల్ల ఇలా కౌంట్డౌన్ సంభాషణ బలవంతం కాకుండా తమకేదో సహాయం చేస్తున్నారనే భరోసా అందిస్తుంది వాళ్లకు. ఆ తర్వాత కొవ్వొత్తి ఊదే పద్ధతిని ఫాలో అవ్వాలి. చిన్నారికి తన శ్వాసను నెమ్మదింప చేసేలా కొవ్వొత్తి ఊదుతున్నట్లు చేయమని చెప్పాలి. ఇది శరీరం ఒత్తిడి ప్రతిస్పందనను నియంత్రించడంలో సహాయపడుతుంది. పైగా ఆ చిన్నారి ఒక అంశంపై దృష్టిపెట్టేలా చేస్తుంది కూడా. ఆ తర్వాత ఆ చిన్నారిని దగ్గరకు తీసుకుని హగ్ చేసుకోవాలి. ఇక్కడ వాళ్లకు సహ నియంత్రణ అనే భావోద్వేగ సమతుల్యతను అందిచడానికి వాళ్లను ఆలింగనం చేసుకోవాలి. అది వాళ్లకు సురక్షితంగా ఉన్నావు, మనం వాళ్లతో ఉన్నామనే ఫీల్ని అందిస్తుందట. ఇలాంటి దృశ్య, శారీరక సంకేతలు ఆటిజం ఉన్న పిల్లల్లో భావోద్వేగ నియంత్రణను సులభతరం చేస్తాయి." అంటూ తన వీడియోని ముగించింది లియా ఫాతిమా. ఆమె పేరెంటింగ్ చిట్కా..అలాంటి బిడ్డల పట్ల ఓర్పు, సానుభూతి, భావోద్వేగ భద్రత ఎంత అవసరమో తెలియజేయడమే కాకుండా..ఆటిజం ఉన్న పిల్లల పెంపకానికి సృజనాత్మకత, సౌమ్యత, అవగాహన అవసరం అని నొక్కి చెబుతోంది. చూడటానికి సింపుల్గా కనిపించే ఈ టెక్నిక్లు..ఆటిజం పిల్లల్లో అద్భుతమైన మార్పుని తీసుకొచ్చే అద్భుత సాధనాలు కదూ..!. View this post on Instagram A post shared by Lea Fatima (@lea_fatima8) (చదవండి: పేదరికం మేకలు కాయిస్తే.. జానపద కళతో పద్మశ్రీ వరించింది) -
పుణే కేసు: అసభ్య సైగ చేసిన సియా.. వీడియో వైరల్
పుణే: యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది. లోహగఢ్ ఫోర్ట్ సమీపంలోని లోయలో అతన్ని ఎవరు తోసి చంపారన్న అంశంపై పోలీసులు ఇప్పటికీ స్పష్టమైన నిర్ధారణకు రాలేకపోయారు. ప్రత్యక్ష సాక్షులు లేకపోవడం, దర్యాప్తులో పరస్పర విరుద్ధమైన వాదనలు బయటపడుతుండటంతో కేసు మరింత సంక్లిష్టంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాన నిందితురాలిగా ఉన్న సియా గోయల్ మరోసారి వివాదంలో చిక్కుకుంది.క్రైమ్ రీక్రియేషన్లో భాగంగా.. పోలీసులు ఆమెను తన నివాసానికి తీసుకెళ్లారు. ఆ సమయంలో బయటకు తీసుకువస్తున్న సమయంలో మీడియా ఎదుట ఆమె మిడిల్ ఫింగర్(అసభ్య సైగ) చూపింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తూ ఆమె ప్రవర్తనను తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇదే సమయంలో కేసు దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. Pune, Maharashtra: Siya Goyal, accused in the Ketan Agarwal murder case, was taken by Pune Rural Police to her Market Yard residence for investigation. After the investigation was completed, while leaving the house, Siya Goyal allegedly made obscene gestures and showed the middle… pic.twitter.com/mHnQKlfRrq— IANS (@ians_india) July 2, 2026జూన్ 18న పుణే సమీపంలోని లోహ్గఢ్ కోట వద్ద కేతన్ అగర్వాల్ అనుమానాస్పద రీతిలో మరణించాడు. మొదట ఈ ఘటనను ప్రమాదవశాత్తు మరణంగా నమోదు చేసినప్పటికీ.. దర్యాప్తులో ఇది ఒక ప్లాన్ ప్రకారం జరిగిన హత్యగా తేలింది. సియా గోయల్, కేతన్ అగర్వాల్ కుటుంబాలు ముందే వివాహాన్ని ఖరారు చేశాయి. నవంబర్లో పెళ్లి జరగాల్సి ఉండగా.. ప్రియుడు చేతన్తో కలిసి కేతన్ను సియా హతమార్చింది. అయితే.. కేసులో ఎవరు నిజంగా కేతన్ను లోయలోకి తోశారన్న అంశంపై స్పష్టత లేకపోవడంతో పోలీసులు లై డిటెక్టర్ పరీక్ష అవసరమని కోర్టును అభ్యర్థించారు. నిందితులు మౌనం వహిస్తున్నందున దర్యాప్తుకు ఇది కీలకంగా మారిందని అధికారులు చెబుతున్నారు. అయితే నిందితురాలి సమ్మతి తప్పనిసరి అని ఆమె తరఫు న్యాయవాది పేర్కొన్నారు. పాలీగ్రాఫ్ పరీక్ష ఫలితాలు ప్రత్యక్ష సాక్ష్యాలుగా పరిగణించబడవని, అవి కేవలం దర్యాప్తును ముందుకు తీసుకెళ్లేందుకు సహాయపడతాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. కోర్టు తీర్పుపై సస్పెన్స్ కొనసాగుతోంది.మరోవైపు దర్యాప్తులో కీలకంగా జనవరి నుంచి జూన్ వరకు సియా–చేతన్ మధ్య 2,000కు పైగా కాల్స్ జరిగినట్లు కాల్ డేటా విశ్లేషణలో బయటపడింది. ఘటన అనంతరం కేతన్ మొబైల్ ఫోన్ కొంతసేపు సియా వద్దే ఉన్నట్లు సాంకేతిక ఆధారాలు కూడా లభించినట్లు సమాచారం. 33 డిగ్రీల ఎండలోనూ చేతన్ హుడీ ధరించి అనుమానాస్పదంగా తిరుగుతున్న సీసీటీవీ దృశ్యాలు కూడా పోలీసులు గుర్తించారు.దర్యాప్తులో భాగంగా పోలీసులు రెండు దశల్లో ఘటన స్థలంలో సీన్ రీక్రియేషన్ నిర్వహించారు. సియా సమక్షంలో డమ్మీ సాయంతో ఒకసారి, చేతన్ను తీసుకెళ్లి మరోసారి లోహగఢ్ ఫోర్ట్ వద్ద సంఘటనను పునర్నిర్మించినట్లు సమాచారం. ప్రత్యక్ష సాక్షులు లేకపోవడంతో ఫోరెన్సిక్ విశ్లేషణ, డిజిటల్ ఆధారాల రికవరీపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఈ కేసును ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించింది. భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 103 (హత్య), 61 (కుట్ర) కింద కేసు నమోదు కాగా, నిందితుల పోలీస్ కస్టడీ కొనసాగుతోంది. ఒకవైపు నిందితురాలి వీడియో సోషల్ మీడియాలో దుమారం రేపుతుండగా, మరోవైపు లై డిటెక్టర్ టెస్ట్ కోసం పోలీసులు చేస్తున్న ప్రయత్నం ఈ కేసును మరింత కీలక దిశలోకి తీసుకెళ్లింది. -
క్రేజీ కపుల్ ఇద్దరు కలిసి ఏం చేశారో చూడండి
-
వర్షపు నీటిలో పరీక్షల ప్రశ్నపత్రాలు
బిహార్లో పాఠశాల త్రైమాసిక పరీక్షలకు ఇంకా కొన్ని రోజులే సమయం ఉండగా, బక్సర్లోని ఓ విద్యా కేంద్రంలో ప్రశ్నపత్రాలు, ఖాళీ జవాబు పత్రాల కట్టలు వర్షపు నీటిలో తేలుతూ కనిపించాయి. ఈ ఘటనపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. పరీక్షా సామగ్రి నిర్వహణ తీరు ఉండాల్సింది ఇలాగేనా? అని విమర్శలు వస్తున్నాయి.ఈ ప్రశ్నపత్రాలు, ఖాళీ జవాబు పత్రాలను 9, 10, 12 తరగతుల త్రైమాసిక పరీక్షల కోసం బిహార్ బోర్డు పంపింది. అవి బక్సర్లోని బునియాది పాఠశాలకు చేరాయని ప్రధానోపాధ్యాయులకు సమాచారం ఇచ్చి, వచ్చి తీసుకెళ్లాలని సూచించారు.వైరల్ దృశ్యాలు.. ప్రజల్లో ఆగ్రహంఅయితే, భారీ వర్షంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన వీడియోల్లో ప్రశ్నపత్రాలు, జవాబు పత్రాల కట్టలు నీటిలో పడి కనిపించాయి. ఇంత కీలకమైన పరీక్షా సామగ్రిని వర్షంలో నిర్లక్ష్యంగా వదిలేశారని పలువురు అధికారులపై విమర్శలు చేశారు. ఈ దృశ్యాలు వేగంగా వైరల్ అయ్యాయి. సున్నితమైన పరీక్షా సామగ్రి వర్షంలోకొట్టుకుపోయేలా ఎలా చేశారంటూ నెటిజన్లు ప్రశ్నించారు. చాలామంది దృష్టిలో ఈ ఘటన రాష్ట్ర విద్యా వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రతీకగా మారింది. మరోవైపు, పరీక్షా సామగ్రికి ఎలాంటి నష్టం జరగలేదని విద్యాశాఖ అధికారులు చెప్పారు. అకస్మాత్తుగా వర్షం పడటంతో కట్టలు నీటిలో కనిపించినా, ప్రశ్నపత్రాలు, జవాబు పత్రాలు సురక్షితంగానే ఉన్నాయని, పరీక్షలపై ఎలాంటి ప్రభావం ఉండదని తెలిపారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా మెరుగైన భద్రతా చర్యలు చేపట్టాలని డిమాండ్లు వస్తున్నాయి. View this post on Instagram A post shared by Bharat Desh (@desh) -
దుబాయ్లో మిడిల్ కాస్ల్ ఫ్యామిలీ నెల ఖర్చు ఇదీ : వైరల్ వీడియో
దుబాయ్లో నివసిస్తున్న ఒక భారతీయ జంట తమ నెలవారీ ఖర్చులకు సంబంధించిన వివరాలను పంచుకుంటూ ఇన్స్టాలో ఒక వీడియోను షేర్ చేశారు. ఒక మధ్యతరగతి కుటుంబం సౌకర్యవంతంగా జీవించడానికి నెలకు దాదారు నెలకు సుమారుగా 13,000 నుండి 14,000 దిర్హామ్లు (రూ. 3.6 లక్షలు) ఖర్చు అవుతోందని పేర్కొనడం వైరల్గా మారింది.ఇటీవలి కాలంలో ఐటీ, ఇతర వృత్తి నిపుణులు తమ జీతాలు, నెలవారీ ఖర్చులు, పొదుపు గురించి వివరాలను పంచుకునే వీడియోలు, పోస్టులు చాలా కామన్గా మారిపోయాయి. ఇవి వైరల్ అవుతుంటాయి కూడా. అలా ఇన్స్టాగ్రామ్లో @vis_and_vadapav అనే ఐడీతో పోస్ట్లు చేసే ఒక భారతీయ జంట తమ బడ్జెట్ కేవలం రోజువారీ జీవనానికి మాత్రమేనని, ఇందులో ప్రయాణాలు, షాపింగ్ లేదా విహారయాత్రలు చేర్చలేదని చెప్పారు. "దుబాయ్లో నివసిస్తున్న ఒక జంటగా మాకు అయ్యే ఖర్చు ఇదిగో... దయచేసి గమనించండి’’ అంటూ పోస్ట్ చేశారు. నెలకు దాదాపు రూ.3.3 లక్షల నుండి రూ.3.6 లక్షలు ఖర్చవుతుందని లెక్కలతో సహా వివరించారు. ఇందులో షాపింగ్, విహారయాత్రలు (ట్రావెలింగ్) , పండగ సెలవుల ఖర్చులు చేర్చలేదని, ఇవి కేవలం రోజువారీ ఖర్చులని పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Desis in Dubai | Priyanka (@visa_and_vadapav) ముఖ్యంగా ఇంటి రుణంకు లక్షన్నర; కరెంట్, నీరు, ఇతర బిల్లుల కోసం రూ. 39వేలు ఖర్చు చేస్తారు. ఇక ఫుడ్ కోసం మరో 39వేల రూపాయలు ఖర్చవుతాయి. వీటితోపాటు కారు, పెట్రోల్ ఖర్చులు, పనిమనిషి ఖర్చులు ఇలా మొత్తం నెలకు రూ. 3.3 లక్షలు- 3.6 లక్షలవుతాయి. దీంతో పాటు భార్య ఉద్యోగ నిమిత్తం వారంలో కొన్ని రోజులు దుబాయ్ నుండి అబుదాబికి ప్రయాణించాల్సి రావడంతో ఆమె ప్రయాణానికే నెలకు రూ. 50 వేల వరకు ఖర్చవుతుందని తెలిపారు.ఇదీ చదవండి: ఉద్యోగం Vs సంసారం : సింగిల్ మదర్ సునీత సక్సెస్ స్టోరీదీంతో దుబాయ్లో లైఫ్ స్టైల్, కాస్ట్ ఆఫ్ లివింగ్పై నెట్టింట పెద్ద చర్చకు దారితీసింది. నిజం చెప్పినందుకు ధన్యవాదాలు అంటే కొంతమంది కామెంట్ చేశారు. ఎందుకంటే దుబాయ్లో నెలకు 400-500 దిర్హామ్లకే బతికేయచ్చంటూ చాలామంది తప్పుడు సమాచారం ఇస్తుంటారని, కానీ ఈ జంట దుబాయ్ జీవితం గురించిన అసలు నిజాన్ని, వాస్తవిక చిత్రాన్ని చూపించారని ఒక యూజర్ కామెంట్ చేశారు."దిర్హామ్లలో ఏడుపు వస్తోంది" అంటూ మరొకరు సరదాగా కామెంట్ చేయగా, మెజారిటీ నెటిజన్లు ఈ ఖర్చులు చాలా ప్రాక్టికల్గా ఉన్నాయని అంగీకరించారు.ఇదీ చదవండి: యజమాని కోసం బ్లాక్ కోబ్రాతో పెంపుడు కుక్క పోరాటం, కానీ -
యజమాని కోసం బ్లాక్ కోబ్రాతో పెంపుడు కుక్క పోరాటం, కానీ
పెట్ డాగ్స్ తమ యజమానిని, అతని కుటుంబాన్ని కాపాడేందుకు ఎంతటి సాహసానికైనా పూనుకుంటాయి.. ఈ పోరాటంలో ప్రాణాలను సైతం ఫణంగా పెడతాయి. తాజాగా హర్యానాలో తన యజమానిని కాపాడటం కోసం ఒక పెంపుడు కుక్క తాచు పాముతో పోరాడి ప్రాణాలు కోల్పోయిన హృదయవిదారక ఘటనకు సంబంధించిన వీడియో పలువుర్ని ఆకట్టుకుంటోంది.హర్యానాలోని కర్నాల్ జిల్లా నిసింగ్ ప్రాంతంలో తన యజమానిని కాపాడేందుకు 'జిమ్మీ' అనే తొమ్మిదేళ్ల పెంపుడు కుక్క నల్లతాచుపాముతో వీరోచితంగా పోరాడింది. పాము పలుమార్లు కాటు వేసినప్పటికీ వెనక్కి తగ్గకుండా పోరాడి, చివరకు ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. అసలేం జరిగిందంటే? ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో యజమాని సుమిత్ ఠాకూర్ తన రెండు పెంపుడు కుక్కలైన 'జిమ్మీ', 'మాక్స్'లను వాకింగ్కు తీసుకెళ్తుండగా ఇంటి ప్రధాన ద్వారం (గేట్) వద్దకు ఒక పెద్ద నల్ల తాచుపాము దూసుకొచ్చింది. సుమిత్ స్పందించే లోపే రెండు కుక్కలు పాము వైపు దూసుకెళ్లాయి. జిమ్మీ మరో క్షణం ఆలోచించకుండా ముందుకు దూకింది. పడగ విప్పి బుసలుకొడుతున్న తాచుపాముపైకి లంఘించింది. ఈ భీకర పోరాటంలో పాము జిమ్మీ నోటిపై, ఒక కాలుపై తీవ్రంగా కాటు వేసింది. అయినా జిమ్మీ వెనక్కి తగ్గకుండా పోరాడుతూనే ఉంది. మరో కుక్క 'మాక్స్' ఆ పాము ఇంటి లోపలికి వెళ్లకుండా చుట్టూ తిరుగుతూ అడ్డుకుంది. 8 నిమిషాల్లోనే విషాదం పాము కాటు వేసిన కొద్ది నిమిషాల్లోనే జిమ్మీ శరీరంపై విషప్రభావం చూపడం ప్రారంభమైంది. సుమిత్ చూస్తుండగానే కేవలం 8 నిమిషాల్లో జిమ్మీ పరిస్థితి విషమించింది. సుమిత్ వెంటనే పశువైద్యుడిని పిలిపించినప్పటికీ, వైద్యం అందేలోపే జిమ్మీ కన్నుమూసింది. ఈ లోపల పాము ఒక గోడ వెనుకకు పోయింది. వెంటనే స్నేక్ రెస్క్యూవర్ను పిలిపించి ఆ తాచుపామును పట్టుకుని అడవిలో వదిలేశారు. A Hero With Four Paws❤️ 🐾HUMANS DO NOT DESERVE DOGS 🐕📍Karnal, Haryana9-year-old pet Jimmy took on a black cobra to save his family. Bitten repeatedly, his loyalty cost him his life.Rest easy, brave soul. 💔 pic.twitter.com/uPICiHIqRq— The Lie Lamaa 🏹 (@The_LieLamaa) July 1, 2026కన్నీటి వీడ్కోలు కుటుంబంలో ఒకడిగా పెరిగిన తన జిమ్మీ ఇక లేదని లేదని తెలిసి సుమిత్ ఠాకూర్ కన్నీరు మున్నీరుగా విలపించాడు. తనను కాపాడటం కోసం జిమ్మీ తన ప్రాణాలొడ్డిందని భావోద్వేగానికి లోనయ్యారు. తొమ్మిదేళ్లుగా తమ కుటుంబంలో ఒక సభ్యుడిగా ఉన్న జిమ్మీని ఎండాకాలం, చలికాలంలో ఎంతో అపురూపంగా చూసుకున్నామని గుర్తు చేసుకున్నారు. మరోవైపు జిమ్మీ చూపిన విశ్వాసం, ధైర్య సాహసాలను, త్యాగాన్ని స్థానికులతో పాటు నెటిజన్లు కొనియాడుతున్నారు.ఇదీ చదవండి: షాకింగ్ : భారతీయ నావికుడి బాడీలో అవయవాలన్నీ మాయం! -
రెస్టారెంట్లో రచ్చ రచ్చ చేసిన ఫ్యామిలీ
వియత్నాంలోని ఓ భారతీయ రెస్టారెంట్లో ఓ భారతీయ కుటుంబం ప్రవర్తించిన తీరు వివాదానికి దారితీసింది. హో చి మిన్ సిటీలో ఉన్న రెస్టారెంట్లో ఓ భారతీయ కుటుంబం పలు వస్తువులను ధ్వంసం చేసింది. రెస్టారెంట్ సిబ్బందిని బెదిరించింది.నగరంలోని డిస్ట్రిక్ట్ 1 పర్యాటక ప్రాంతంలో ఉన్న బాంబే బైట్స్ హెచ్సీఎమ్ అనే ప్రముఖ భారతీయ రెస్టారెంట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. భోజనం చేయడానికి వచ్చిన ఓ కుటుంబంలోని ఇద్దరు పిల్లలు వెళ్తున్న సమయంలో టిష్యూ పేపర్లను విసిరారు. ఆ పిల్లలు వాటిని విసరడం ఆపాలని సిబ్బంది కోరారు. దీంతో ఆ పిల్లల తల్లిదండ్రులకు రెస్టారెంట్పై కోపం వచ్చింది.రెస్టారెంట్ సిబ్బందికి సహకరించాల్సింది పోయి ఆ కుటుంబం వారితో ఘర్షణకు దిగింది. రెస్టారెంట్ యజమాని ఐశ్వర్య ఖన్నా సింగ్ మాట్లాడుతూ.. ఆస్తిని ధ్వంసం చేశారని, సిబ్బందిని మాటలతో దూషించారని, ఇన్ఫ్లుయెన్సర్లమని చెప్పి బెదిరించారని ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు, పత్రాలు తమ వద్ద భద్రంగా ఉన్నాయని యాజమాన్యం తెలిపింది."ఒక విషయం స్పష్టంగా చెబుతున్నాం. రెస్టారెంట్ పిల్లలు ఆడుకునే ప్రదేశం కాదు. ఇన్ఫ్లుయెన్సర్ హోదా ఉన్నంత మాత్రాన ఇటువంటివి తగవు. పౌర బాధ్యత అంటే పిల్లలకు జవాబుదారీతనం నేర్పించడం, ప్రజల ఆస్తిని గౌరవించడం, ప్రతి ఒక్కరూ సురక్షితంగా, ప్రశాంతంగా ఉండేందుకు నియమాలను పాటించడం. ఈ విలువలను పట్టించుకోకపోతే సిబ్బంది, ఇతర అతిథులు, వ్యాపారం అన్నీ ప్రభావితమవుతాయి" అని ఐశ్వర్య ఖన్నా సింగ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు.రెస్టారెంట్ అన్ని ప్రాంతాల నుంచి వచ్చే అతిథులను స్వాగతిస్తుందని, అయితే ప్రతి ఒక్కరూ గౌరవప్రదంగా ప్రవర్తించాలని స్పష్టం చేసింది. ఆస్తిని ధ్వంసం చేయడం, క్రమశిక్షణ లేకుండా ప్రవర్తించడం, సిబ్బందిని బెదిరించడం సహించబోమని తెలిపింది. "అతిథి సత్కారం మా పని. కనీస మర్యాద ప్రతి ఒక్కరి బాధ్యత" అని తన ప్రకటనలో పేర్కొంది. View this post on Instagram A post shared by Aishwarya Khanna Singh (@kaishwarya.s.98) -
రైలు డోరు దగ్గరున్న యువతికి సైగలు.. దిమ్మతిరిగే ట్విస్ట్!
న్యూఢిల్లీ: వివేక్ ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్న రూపాలీ దీక్షిత్ అనే మహిళా ప్రయాణికురాలిని చూసి రైల్వే ట్రాక్పై నిలుచున్న ఒక వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. జూన్ 29న దంకుని(పశ్చిమ బెంగాల్) జంక్షన్ వైపు రైలు వెళ్తున్న సమయంలో, రైలు గేటు దగ్గర నిలబడిన ఆమెకు సదరు వ్యక్తి అసభ్య సైగలు చేశాడు. దీనిని గమనించిన ఆ మహిళ వీడియో తీసి, సామాజిక మాధ్యమాల ద్వారా రైల్వే శాఖ, ‘రైల్ మదద్’, ‘ఆర్పీఎఫ్’ అధికారులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదుపై రైల్వే రక్షణ దళం తక్షణమే స్పందించి, తదుపరి చర్యల కోసం కేసును హౌరా డివిజన్కు బదిలీ చేసింది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా ఆర్పీఎఫ్ ఈస్టర్న్ రైల్వే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ప్రస్తుతం ఈ ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు. తుది నివేదిక రావాల్సి ఉంది. మరోవైపు సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియోపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడి చర్యను పలువురు తీవ్రంగా ఖండించగా, కొందరు నెటిజన్లు బాధితురాలి ప్రయాణ విధానాన్ని ప్రశ్నిస్తూ విమర్శలకు దిగారు. అయితే దుస్తులు లేదా నిలబడే స్థలాన్ని బట్టి మహిళలపై వేధింపులను సమర్థించలేమని మరికొందరు ప్రయాణికులు, నెటిజన్లు అంటున్నారు. Today I was travel in Vivek Express when I Stand at coach door ,this guy behave badly and giving me sign of Sexual .He was Travelling in a 15228- SMVT Express in 2nd General coach from Engine and now he was reaching to Dankuni Jn.@RailMadad @RailMinIndia @RailwaySeva @RPF_INDIA pic.twitter.com/bMp4J61Czg— Rupali Dixit 🇮🇳 (@GhumakkadLaali) June 29, 2026 -
పాత స్నేహితుడు ఎదురైతే.. ఫీలింగ్స్ ఇంతలా ఉంటాయా?
ఏళ్ల తరబడి దూరమైన ఇద్దరు స్కూల్ స్నేహితులు మళ్లీ కలుసుకున్న క్షణం... ఒకరినొకరు చూసుకుని భావోద్వేగానికి లోనైన దృశ్యం. సాధారణంగా హృదయాలను తాకాల్సిన ఆ 42 సెకన్ల వీడియో.. సోషల్ మీడియాలో మాత్రం భిన్నమైన చర్చకు తెరలేపింది. కొందరు దాన్ని స్వచ్ఛమైన స్నేహానికి నిదర్శనంగా కొనియాడితే.. మరికొందరు అనుమానాల కోణంలో చూడడంతో రచ్చ రచ్చగా మారింది..సోషల్ మీడియాను ఓ వైరల్ వీడియో కుదిపేస్తోంది. వీడియోలో ఓ మహిళ 14 ఏళ్ల తర్వాత తన పాత స్కూల్ స్నేహితుడిని కలుస్తుంది. అతను విదేశాల్లో సెటిల్ అయ్యాడట. తన వివాహానికి కూడా రాలేదట. తనకంటే తన కూతురు ఆ అంకుల్ను కలవడానికి ఎగ్జయిటింగ్గా ఉందని వీడియో షేర్ చేసింది. పైగా తనను ఇంకా చిన్నపిల్లలా ట్రీట్ చేస్తూ.. తన కూతురితో పాటు తనకూ లాలీపాప్ ఇచ్చాడని సంబురంగా చెప్పింది. ఒకరినొకరు చూసుకున్న వెంటనే ఇద్దరూ ఆనందంతో ఆప్యాయంగా పలకరించుకోవడం కనిపిస్తుంది. చివర్లో.. ఆనాడు.. ఈనాడు అంటూ ఓ ఫొటోను ఉంచిందామె. ఆ వీడియో ఎక్కడిది? అందులో ఉంది ఎవరు? అనే దానిపై ఎలాంటి స్పష్టత లేదు. కానీ, ఈ దృశ్యాన్ని చూసిన కొందరు నెటిజన్లు, ఆమె ఉత్సాహాన్ని ప్రశ్నిస్తూ వివాహిత మహిళ ఇలా ఒంటరిగా కలవడం సరైందేనా? అని సందేహాలు వ్యక్తం చేశారు.ఇంజినీర్ ఆదిత్య అనే ఎక్స్ (X) యూజర్ ఈ 42 సెకన్ల వీడియోను.. మీ ఆయన్ని తల్చుకుంటే బాధగా ఉంది "Feeling sad for her husband" అనే క్యాప్షన్తో పోస్ట్ చేశారు. దీంతో వీడియో క్షణాల్లో వైరల్గా మారింది. మిలియన్ పైగా వ్యూస్.. వేలాది లైక్లను సొంతం చేసుకోవడమే కాకుండా, కామెంట్ల రూపంలో పెద్ద చర్చకు దారితీసింది.అయితే మెజారిటీ నెటిజన్లు మాత్రం ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. "ప్రతి పురుషుడు–మహిళ మధ్య ఉండే బంధాన్ని ప్రేమగా చూడాల్సిన అవసరం లేదు", "14 ఏళ్ల తర్వాత స్నేహితుడిని కలిస్తే అలాంటి ఆనందం సహజమే", "ఇది ఎంతో స్వచ్ఛమైన స్నేహం" అంటూ ఆమెకు మద్దతుగా నిలిచారు. పైగా కూడా బిడ్డను తీసుకెళ్లడం గురించి ప్రధానంగా ప్రస్తావించారు.Feeling sad for her husband pic.twitter.com/rCsgNH95Og— Aditya (@adityacasm_) June 29, 2026కొందరు నేరుగా వీడియోను పోస్ట్ చేసిన వ్యక్తినే విమర్శించారు. "నీ తల్లిని తల్చుకుంటే బాధగా ఉంది.. ఎలాంటి కొడుకును కన్నదో ఆమె", "నీ భార్యను తల్చుకుంటేనే బాధగా ఉంది", "అరేయ్.. అసలు నీ ఆలోచనా విధానమే బాగోలేదురా", "స్వచ్ఛమైన స్నేహాన్ని కూడా తప్పుగా చూడొద్దు" అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.మరికొందరు "ద్వేషపూరిత క్యాప్షన్ను పక్కన పెడితే వీడియో మాత్రం ఎంతో హృద్యంగా ఉంది" అంటూ స్పందించారు.ఈ ఘటనతో మరోసారి పెళ్లైన ఓ మహిళ, ఓ పురుషుడి మధ్య స్వచ్ఛమైన స్నేహం ఉండగలదా? అనే అంశంపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఒక వర్గం ప్రతి బంధాన్ని అనుమానంతో చూడకూడదని వాదిస్తుంటే, మరొక వర్గం సామాజిక పరిమితుల గురించి మాట్లాడుతోంది. మొత్తానికి, ఇద్దరు పాత స్నేహితుల భావోద్వేగ కలయికగా మొదలైన ఈ వీడియో... ఇప్పుడు స్నేహం, నమ్మకం, సామాజిక దృక్పథం గురించి దేశవ్యాప్తంగా ఆన్లైన్ చర్చకు కేంద్రబిందువుగా మారింది. -
విధి లోయలోకి లాగితే... అదృష్టం వెనక్కి తీసుకొచ్చింది!
ఒక్క క్షణం ముందు వరకు అదొక సాధారణ ప్రయాణం.. మరుసటి క్షణమే మృత్యువుతో పోరాటం. కళ్లముందే కొండచరియలు విరిగిపడి బైక్తో సహా అతడిని లోయవైపు ఈడ్చుకెళ్లాయి. ‘అరే పాపం..’ అని అంతా అనుకునేలోపే.. ఏదో అద్భుతం జరిగినట్లు అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. చావును కళ్లారా చూసి తిరిగి వచ్చిన ఈ ఉత్కంఠభరిత ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.ఈశాన్య భారతదేశాన్ని గత కొన్ని రోజులుగా కుండపోత వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కొండ ప్రాంతాల్లో రహదారులు బురదమయంగా మారడమే కాకుండా.. తరచూ కొండచరియలు విరిగిపడుతున్నాయి. జూన్ 28న ఓ బైకర్ అత్యంత ఇరుకైన కొండ మార్గంలో జాగ్రత్తగా ప్రయాణిస్తున్నాడు. అప్పటికే రహదారిపై బురద పేరుకుపోయి, ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. అయినా నెమ్మదిగా ముందుకు సాగుతుండగా.. ఒక్కసారిగా కొండచరియ విరిగిపడింది.ఏం జరుగుతోందో అర్థం చేసుకునేలోపే.. భారీ మట్టి, రాళ్లతో పాటు బైక్, బైకర్ కూడా లోయవైపు జారిపోయారు. కొన్ని క్షణాల పాటు అతడు మట్టిపెళ్లల మధ్య కనిపించకుండా పోవడంతో అక్కడున్నవారంతా ప్రాణాలు దక్కడం అసాధ్యమేనని భావించారు. కొండచరియలు కిందకు దూసుకెళ్లి అక్కడే ఓ నదిలో చేరడంతో భారీగా దుమ్ము, మట్టి మేఘాలు ఎగిసిపడ్డాయి.అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఆ బైకర్ సురక్షితంగా బయటపడ్డాడు. అతడికి ఎలాంటి గాయాలు కాకపోవడం మరింత ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ దృశ్యాలను అక్కడున్న వారు వీడియోగా చిత్రీకరించగా.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. అరుణాచల్ప్రదేశ్లోని లోయర్ సియాంగ్ జిల్లాలోని సీజీ లోయలో ఈ ఘటన చోటుచేసుకుంది.🇮🇳 Absolutely terrifying footage from India shows a biker being swept away as a massive landslide tears down a mountainside after relentless rain in Arunachal Pradesh.The landslide also blocked the Siji River.Against all odds, the biker survived without injuries. A miracle…— Mario Nawfal (@MarioNawfal) June 29, 2026వీడియో చూసిన నెటిజన్లు "ఇది రెండో జన్మ", "అతడి అదృష్టం అసాధారణం", "లాటరీ టికెట్ కొనాలి" అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం వర్షాకాలంలో కొండ ప్రాంతాల్లో ప్రయాణించే వారు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. విధి తన పని చేయాలనుకుంది... అదృష్టం అడ్డొచ్చింది. క్షణాల్లో లోయలోకి జారిపోయిన ఆ బైకర్.. చివరి క్షణంలో చావునే మోసం చేసి సురక్షితంగా బయటపడ్డాడు అని ఎక్కువ మంది కామెంట్లు చేస్తున్నారు.ఈ ఘటన మరోసారి ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాకాల ప్రమాదాల తీవ్రతను గుర్తు చేసింది. భారీ వర్షాల కారణంగా కొండచరియలు ఎప్పుడు విరిగిపడతాయో చెప్పలేని పరిస్థితి నెలకొనడంతో.. అధికారులు అత్యవసరమైతే తప్ప కొండ ప్రాంతాల్లో ప్రయాణాలు చేయవద్దని హెచ్చరిస్తున్నారు. -
ఐవీఎఫ్ ప్రయాణం అంత ఈజీ కాదు..! ఏకంగా 150 ఇంజెక్షన్లు..
బాలీవుడ్ నటి, మోడల్ అనుష్క రంజన్ తన ఐవీఎఫ్ జర్నీ గురించి సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. త్వరలో అమ్మ కాబోతున్న ఈ నటి ఐవీఎఫ్ అంటే ఆషామాషి కాదని అంటోంది. ఆ ప్రక్రియని మానసిక, శారీరక బాధల్ని అనుభవించే భయానక స్థితిగా పేర్కోంది. నిజానికి పిల్లలు లేరంటే ఐవీఎఫ్ అని నోటితో చెప్పినంత ఈజీకాదు ఫేస్ చేయడం అని అంటోంది. చాలా ఏళ్లుగా ఇది పూర్తిగా తెలియని నిషిద్ధ అంశంగా ఉండిపోయింది. అసలు ఇదేంటి, ఎలా చేస్తారు అనేదానిపై అందరకీ అవగాహన ఉండాలంటూ తన అనుభవాన్ని షేర్ చేసుకుందామె.నటి అనుష్కరంజన్ ఇన్స్టాగ్రామ్ వీడియోలో తన భర్త ఆదిత్య సీల్తో కలిసి కుటుంబ జీవితాన్ని ప్రారంభించే ప్రయత్నంలో ఉన్న ఆమె తాను ఎదుర్కొన్న సవాళ్ల గురించి సవివరంగా వెల్లడించింంది. ఐవీఎఫ్ జర్నీ అంత సులభం కాదని అంటోంది. ఈ పద్ధతిలో తీసుకునే ఇంజెక్షన్లు, మందుల సంఖ్య ఒక మహిళకు మాటలు కాదు అని అన్నారు. ఒకవేళ ఆ స్త్రీకి కుటుంబ ఒత్తిడి తోపాటు భావోద్వేగ ఒత్తిడి కూడా తోడైతే ఈ ప్రక్రియ మరింత సవాలుగా మారుతుందని అంటున్నారు. అయితే ఆ విషయంలో తన కుటుంబానికి చాలా రుణపడి ఉంటానని అంది. ఎందుకంటే వాళ్లంతా తనకు ఈ జర్నీలో ఎంతో అండగా నిలిచారని చెప్పారామె. తాను తన భర్త 2023-24 నుంచి సంతానం గురించి ఆలోచించడం ప్రారంభించామని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత తన సోదరి సలహా మేరకు వైద్యులను సంప్రదించగా.. పరీక్ష ఫలితాలన్ని సరిగ్గా వచ్చినప్పటికీ..తాము సహజంగా గర్భం దాల్చలేమని తేల్చి చెప్పారు. తదుపరి చర్యగా ఐవీఎఫ్(IVF) వైపుకి వెళ్లమని సూచించారు. ఐవీఎఫ్ అంటే మీ శరీరంలో ఏదో లోపం ఉందని కాదు. ఇది కేవలం శరీరానికి శరీరం, జీవితానికి జీవితం, వ్యక్తికి వ్యక్తి మధ్య జరిగే ప్రక్రియ అని అంటోందామె. అంతేగాదు అందుకోసం తాను దగ్గర దగ్గర సుమారు 150కి పైగా ఇంజెక్షన్లు తీసుకుని ఉంటానని అన్నారామె. వాటిలో ఒక ఇంజెక్షన్ ఎంత చిక్కగా ఉందంటే..అది ఇస్తున్నప్పుడల్లా నొప్పితే ఏడ్చేదాన్ని అని చెప్పుకొచ్చారామె. అంతేగాదు ఈ ప్రక్రియ తర్వాత మహిళల దృఢసంకల్పం పట్ల అపారమైన గౌరవం కలిగిందని చెబుతోంది. అంతేగాదు ఐవీఎఫ్ అప్రోచ్ అవుతున్న ప్రతి మహిళ ఆ ప్రక్రియలో ఎదురయ్యే ప్రతిదానికి సిద్ధంగా ఉండేలా శక్తిమంతంగా ఉండాలంటూ తన పోస్ట్ని ముగించిందామె. View this post on Instagram A post shared by Just Pakao (@anushka.and.aditya) (చదవండి: ఆమె కారణంగానే ఆ ఉద్యోగం..! ఆవేళ బంగారు గాజులు..) -
ఒక్క క్షణం.. ఒక మలుపు.. నలుగురి ప్రాణాలు బలి
-
రైల్వేస్టేషన్లో హైడ్రామా.. ప్రయాణికుడికి చితకబాదిన ఎస్ఐ
ప్రయాణికులను కాపాడాల్సిన రైల్వే పోలీసే.. క్షణికావేశంలో మితిమీరి ప్రవర్తించారు. సామాన్య పౌరులపై ప్రతాపం చూపించాడు. రైల్వే స్టేషన్లో వందలాది మంది చూస్తుండగానే జుట్టు పట్టుకుని వెనక్కి లాగి, కిందకు నెట్టేసి విచక్షణారహితంగా కొట్టాడు. ఈ దారుణాన్ని పక్కనే ఉన్న ఒక మహిళా ప్రయాణికురాలు ధైర్యంగా తన ఫోన్లో రికార్డ్ చేయడంతో వీడియో వైరల్గా మారింది. అనంతరం, ఈ ఘటనకు కారణమైన సదరు ఉద్యోగిని అధికారులు బదిలీ చేశారు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గుజరాత్లోని సూరత్ నగరంలోని అత్యంత రద్దీగా ఉండే ఉధ్నా రైల్వే స్టేషన్లో ఈ ఘటన జరిగింది. ఆదివారం ఉదయం 8:30 గంటల ప్రాంతంలో బీహార్లోని జయనగర్ వెళ్లే ఒక ప్రత్యేక రైలు (Special Train) ఉధ్నా రైల్వే స్టేషన్కు చేరుకుంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో ప్లాట్ఫారమ్ మొత్తం కిక్కిరిసిపోయింది. ఆ సమయంలో ప్రయాణికులను క్రమబద్ధీకరించడానికి, వారు రైలును క్యూ లైన్లలో ఎక్కేలా చూడటానికి రైల్వే పోలీసులు అక్కడ విధులు నిర్వహిస్తున్నారు. అయితే, ఒక ప్రయాణికుడు రద్దీ కారణంగా క్యూ లైన్ను దాటి నేరుగా రైలు పెట్టెలోకి ఎక్కేందుకు ప్రయత్నించాడు.ఇది గమనించిన ఉధ్నా రైల్వే స్టేషన్ జీఆర్పీ సబ్ఇన్స్పెక్టర్ ఆర్.ఎమ్.రాథోడ్ ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయాడు. సదరు ప్రయాణికుడిని పట్టుకుని బూతులు తిట్టాడు. అంతటితో ఆగకుండా.. అతని జుట్టు పట్టుకుని వెనక్కి లాగి, కిందకు నెట్టేసి విచక్షణారహితంగా కొట్టాడు. ఈ దారుణాన్ని పక్కనే ఉన్న ఒక మహిళా ప్రయాణికురాలు ధైర్యంగా తన ఫోన్లో రికార్డ్ చేసింది. సదరు వ్యక్తి ఎలాంటి తప్పు చేయలేదని, తన గ్రామానికి వెళ్తుండగా పోలీసులు ఉద్దేశపూర్వకంగా, ఎలాంటి ఉసిగొల్పు లేకుండానే దాడికి తెగబడ్డారని ఆమె ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేస్తూ చెప్పడం వినిపించింది. పోలీసుల అరాచకాన్ని చూసి భయపడిపోయిన ఇతర ప్రయాణికులు అక్కడి నుంచి వెనక్కి పరిగెత్తడం కూడా ఆ వీడియోలో రికార్డయ్యింది.అనంతరం, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో, నెటిజన్లు.. సామాన్య పౌరులపై పోలీసుల ప్రవర్తన ఇలాగేనా ఉండేది? అంటూ మండిపడుతున్నారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత రావడంతో సూరత్ రైల్వే పోలీస్ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించారు. దీంతో, దిద్దుబాటు చర్యలకు దిగిన రైల్వే అధికారులు.. ప్రయాణికుడి పట్ల అంతటి అమానవీయంగా ప్రవర్తించిన అధికారిని ఉధ్నా స్టేషన్ నుండి తక్షణమే వడోదర జీఆర్పీ ప్రధాన కార్యాలయానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశామని తెలిపారు. కేవలం బదిలీతోనే సరిపెట్టకుండా, అతనిపై కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా ఉన్నత స్థాయి శాఖాపరమైన విచారణకు కూడా ఆదేశించామని డిప్యూటీ సూపరింటెండెంట్ స్పష్టం చేశారు. -
బస్స్టాపే పాఠశాలగా..!
కొంతమంది నిస్వార్థ సేవకు కేరాఫ్గా ఉంటారు. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సేవలందిస్తూ..నిశబ్దంగా ఉంటారు. వారి సేవ ప్రజలో, మరెవరూ చూసి గుర్తించి చెబితే గానీ తెలియదు. అయినా మంచి పనికి హంగామా, ఆర్భాటాలతో పని ఉండదనిపిస్తుంది అలాంటి వాళ్లను చూస్తే. అచ్చం అలాంటి నిస్వార్థ సేవనే చేసున్నాడో వ్యక్తి అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఆ వీడియోని చూస్తే మానవత్వంపై నమ్మకం వస్తుంది. స్వార్థపూరిత ప్రప్రంచంలో నిస్వార్థం మిణమిణకుమంటూ ఇంకా ఉందని అనిపిస్తుంది. ఆ వీడియోలో గురుగ్రామ్కు చెందిన ఒక వ్యక్తి బస్స్టాప్ వద్ద పేద పిల్లల సముహానికి పాఠాలు చెబుతుంటాడు. ఆ వీడియోలో పిల్లలంతా నేలపై చాప మీద కూర్చొని పుస్తకాలు, నోట్బుక్లతో కనిపించగా, మరొక చిన్నారి బోర్డుపై ఏదో రాస్తూ కనిపిస్తుంది. అలాగే ఉపాధ్యాయుడి కనిపిస్తున్న వ్యక్తి పిల్లల వెనుక నిలబడి వారేవిధంగా నేర్చుకుంటున్నారో నిశితంగా పరిశీలిస్తుండటం చూడొచ్చు. ఈ తతంగం మొత్తం అటుగా వెళ్తున్న కారులోని ఒక ప్రయాణికుడు రికార్డు చూసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. ఆ వ్యక్తి నిస్వార్థమైన పని చూని ముగ్ధుడవ్వడమే కాదు ఆ వ్యక్తిని అభినందించినట్లు తెలిపాడు. అక్కడున్న పిల్లలు కూడా ట్రాఫిక్ని, వాహనాలను ఏమి పట్టించుకోకుండా చదువుపై దృష్టిసారించడం విశేషం. ఇలా బహిరంగ ప్రదేశాన్ని తరగతి గదిగా మార్చి, చదువుకోవడానికి వచ్చే పేద పిల్లలకు పాఠాలు చెబుతున్నారు. మనుసుకు హత్తుకునే ఈ దృశ్యంపై ప్రశంసలు వెల్లువెత్తాయి. తరగతి గది నాలుగు గోడల మధ్యే కాకుండా, ఆరు బయట కూడా విద్యను అభ్యసించవచ్చని ఈ సంఘటన గుర్తుచేస్తుందని చాలామంది నెటిజన్లు కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by The Global Hues (@theglobalhues) (చదవండి: జస్ట్ 24 వారాల్లో 25 కిలోలు తగ్గింది..! నిలకడగా ఆ మూడు అలవాట్లు..) -
టోక్యో: సిగ్నల్ పడలేదు.. ఎర్ర చీర చూసి ఆగిపోయారంతే!
టోక్యో: జపాన్ రాజధాని టోక్యో వీధుల్లో ఒక అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. భారతీయ సంప్రదాయ చీరకట్టు గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా ఒక భారతీయ మహిళ చేసిన ప్రయత్నం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. సాధారణంగా వెస్ట్రన్, మోడ్రన్ దుస్తులకు అలవాటు పడిన జపాన్ ప్రజల మధ్యలోకి, ఒక భారతీయ నారి ఎర్రటి చీర కట్టుకుని అడుగుపెట్టడంతో అక్కడి స్థానికులు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. ఈ అరుదైన దృశ్యాన్ని చూసి వారు చూపు తిప్పుకోలేకపోయారు.వైరల్ వీడియో విశేషాలు‘wanderfullyflying’ అనే ఇన్స్టాగ్రామ్ పేజీలో కాజల్ అనే భారతీయ మహిళ ఈ వీడియోను పంచుకున్నారు. ఆమె జపాన్ వీధుల్లో ఎంతో హుందాగా, ఆత్మవిశ్వాసంతో ఎర్రటి చీర ధరించి నడుస్తూ కనిపించారు. మోడ్రన్ ప్రపంచంలో నివసించే జపనీయులకు ఈ సాంప్రదాయ చీరకట్టు ఒక సరికొత్త అనుభూతిని ఇచ్చింది. ఆమె నడుస్తుంటే దారి పొడుగునా జనం ఆగి మరీ ఆమె వైపు చూడటం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.స్థానికుల ఆశ్చర్యం.. సెల్ఫీల సందడిఈ వీడియో కేవలం సాధారణ చూపులకే పరిమితం కాలేదు. కాజల్ చీరకట్టును చూసి ముగ్ధులైన స్థానికులు కొందరు ఆమెతో మాట్లాడటానికి ముందుకు వచ్చారు. అంతేకాదు, భారత్కు చెందిన ఈ సాంప్రదాయ దుస్తుల అందాన్ని మెచ్చుకుంటూ, ఆమెతో కలిసి ఫోటోలు, సెల్ఫీలు దిగడానికి ఆసక్తి చూపించారు. విదేశీయులు మన సంస్కృతిని ఇంతగా గౌరవించడం, ఆనందించడం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.సంస్కృతిని అనుసంధానిస్తూ..చీర అనేది కేవలం ఒక వస్త్రం మాత్రమే కాదు.. అది మన భారత సంస్కృతికి ప్రతీక అని కాజల్ తన పోస్ట్లో పేర్కొన్నారు. వేర్వేరు దేశాల ప్రజలను, వారి భావాలను ఒకచోట చేర్చడానికి, పరస్పరం అనుసంధానించడానికి సంస్కృతి అనేది ఒక అందమైన మార్గమని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ వైరల్ వీడియో ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్లో మిలియన్ల కొద్దీ వీక్షణలతో దూసుకుపోతూ, భారతీయ సంస్కృతి వైభవాన్ని అంతర్జాతీయ స్థాయిలో మరోసారి చాటిచెబుతోంది. -
అంత ఎత్తున రైలింగ్పై నిలబడి.. గంగలో దూకబోయిన యువతి
ఒక్క క్షణం ఆలస్యమై ఉంటే... ఓ ప్రాణం గంగలో కలిసిపోయేది. వంతెన రైలింగ్పై నిలబడి కిందకు దూకేందుకు సిద్ధమైంది ఓ యువతి. కింద వందలాది మంది చూస్తున్నారు.. కానీ ఎవరూ దగ్గరకు వెళ్లలేకపోయారు. చివరికి ఓ యువకుడు ప్రాణాలకు తెగించి చేసిన సాహసం... ఆ యువతి ప్రాణాన్ని నిలబెట్టింది. అసలు ఆమె ఆత్మహత్యకు ఎందుకు ప్రయత్నించింది? ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో జరిగిన ఆ ఉత్కంఠభరిత ఘటన గురించి తెలుసుకుందాం...వారణాసిలోని మాలవీయ వంతెనపైకి డార్జిలింగ్, నార్త్ పాయింట్ టుక్వార్కు చెందిన 23 ఏళ్ల యువతి ఎక్కింది. గంగానదిలో దూకేందుకు ప్రయత్నించింది. అక్కడ పెద్ద సంఖ్యలో ప్రజలు చేరుకుని ఆమెను కిందకు దిగాలని సూచనలు చేశారు. అయినప్పటికీ ఆ యువతి దిగలేదు. అదే సమయంలో ఓ యువకుడు వంతెన రైలింగ్పైకి ఎక్కి, వెనుక నుంచి ఆమెను పట్టుకుని సురక్షితంగా కాపాడాడు. ఆ తర్వాత మరొకరు కూడా వంతెనపైకి ఎక్కి ఆమెను పట్టుకున్నారు.ఈ ఘటన మొత్తం వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. యువతి గంగా నదిలో దూకుతానంటూ దాదాపు గంట పాటు అక్కడే నిలబడి అరుస్తూ కనిపించింది. దీంతో వంతెనపై వెళ్లే, వచ్చే వారి రద్దీ పెరిగింది. సమాచారం అందిన 25 నిమిషాల తర్వాత పోలీసులు అక్కడికి చేరుకుని జనాన్ని అక్కడి నుంచి పంపించేశారు.ఆదంపూర్ పోలీసు ఔట్పోస్ట్ ఇన్ఛార్జి ప్రశాంత్ పాండే తెలిపిన వివరాల ప్రకారం.. ఆ యువతి ఓ ఇన్ఫ్లూయెన్సర్. తన స్నేహితుడి మాటలతో మనస్తాపానికి గురై ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చిన పోలీసులు, ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. View this post on Instagram A post shared by Policenama (@policenamaa) -
షాకింగ్: షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియల్లో ఉగ్రనేతలు?!
మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ సోదరుడు షాహిద్ అక్తర్ అంత్యక్రియలు ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఈ కార్యక్రమంలో లష్కర్-ఎ-తోయిబా (LeT) కీలక నేతలు, అందునా 2025 పహల్గామ్ దాడి అనుమానిత కీలక సూత్రధారి సైఫుల్లా కసూరి సహా పలువురు హాజరైనట్లు వీడియోలు వైరల్ అవుతున్నాయి.Ex Cricketer Shoaib Akhtar's Brother died of heart attack!Shahid Akhtar's funeral was attended by PMML Islamabad President Inam ur Rehman Kamboh and other LeT terrorists.PMML serves as a proxy for LeT. Why Were LeT Leaders/Terrorists There? pic.twitter.com/ldJiocolCl— Megh Updates 🚨™ (@MeghUpdates) June 27, 2026సైఫుల్లా కసూరి గతంలో భారత్పై పలు తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన వ్యక్తిగా గుర్తింపు పొందాడు. 26/11 తరహా దాడుల గురించి, సముద్ర మార్గ దాడుల గురించి అతను చేసిన వ్యాఖ్యలు భద్రతా వర్గాల్లో ఆందోళన కలిగించాయి. పహల్గామ్ దాడికి ఇతనే సూత్రధారి అయ్యి ఉండొచ్చన్న అనుమానాలు సైతం బలంగా ఉన్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోలతో అతని కార్యకలాపాలు మరోసారి చర్చలోకి వచ్చాయి. ఎల్ఈటీకి రాజకీయ ముఖచిత్రంగా భావించే పాకిస్తాన్ మార్కాజీ ముస్లిం లీగ్ (PMML) ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు సమాచారం.జూన్ 24న గుండెపోటుతో అక్తర్ సోదరుడు మరణించారు. ఆయన కూడా మాజీ క్రికెటరే. గురువారం ఇస్లామాబాద్లోని హెచ్-8 గ్రేవ్యార్డ్లో అంత్యక్రియలు జరిగాయి. ఆ సమయంలో ప్రార్థనల సమయంలోనే వాళ్లంతా అక్కడ హల్చల్ చేశారు. అయితే.. క్రికెట్లో రావల్పిండి ఎక్స్ప్రెస్గా పేరున్న షోయబ్ అక్తర్.. భారత్ను ద్వేషించేలా మాట్లాడరు!. కానీ దాయాదుల పోరు సందర్భాల్లో ఎమోషనల్, ఫైర్డ్ కామెంట్స్ చేస్తారు. అదే సమయంలో భారత క్రికెట్ సిస్టమ్ను చాలాసార్లు ఓపెన్గా ప్రశంసించారు కూడా. అయితే షోయబ్ అక్తర్కు వాళ్లకు సంబంధాలు ఉన్నాయా? లేదంటే షాహిద్ అక్తర్కు వాళ్లు దగ్గరా?.. ఇప్పటివరకు షోయబ్ అక్తర్ నుంచిగానీ.. ఆయన కుటుంబం నుంచి ఎటువంటి అధికారిక స్పందన వెలువడలేదు. Prominent figures and terrorists linked to Lashkar-e-Taiba (LeT) openly attended the funeral of Shahid Akhtar, the elder brother of former Pakistani cricketer Shoaib Akhtar, in Islamabad. pic.twitter.com/Src3ftlmf1— Vyom Pallav 🇮🇳 (@VyomPallav) June 27, 2026అలాగే పాకిస్తాన్ ప్రభుత్వం లేదంటే స్థానిక భద్రతా సంస్థల నుంచి కూడా అధికారిక ప్రకటన రాలేదు. కానీ, పాక్ జాతీయ అసెంబ్లీ స్పీకర్ సర్దార్ అయాజ్ సాధిక్ కూడా అంత్యక్రియలకు హాజరు కావడం గమనార్హం. అయితే సోషల్ మీడియాలో మాత్రం నిషేధిత సంస్థల నేతల వీడియోలు వైరల్ అవుతూ తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. సాధారణంగా అత్యంత రహస్యంగా, నీడల్లో కనిపించే ఈ నెట్వర్క్ సభ్యులు ఓ పబ్లిక్ ఈవెంట్లో ఇలా ప్రత్యక్షమవడం అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారి తీసింది. ఇదే సమయంలో అంతర్జాతీయ స్థాయిలో నిషేధాలు ఉన్నప్పటికీ ఈ ఉగ్రసంస్థలు పాక్లో రాజకీయ ముసుగులో కొనసాగుతున్నాయా? అనే ప్రశ్నలు మళ్లీ తెరపైకి వచ్చాయి. ఈ సంఘటన పాకిస్తాన్లో ఉగ్ర నెట్వర్క్ ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గలేదన్న విమర్శలకు బలం చేకూరుస్తోంది.భారత్ గతంలో చేపట్టిన చర్యలు, సరిహద్దు భద్రతా చర్యల నేపథ్యంలో ఈ తాజా పరిణామాలు మరింత సున్నితంగా మారాయి. ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న ప్రాంతీయ భద్రతా సమీకరణాల్లో ఈ ఘటన కొత్త చర్చకు దారి తీసింది. పరిశీలకులు మాత్రం.. నిషేధిత సంస్థలు పూర్తిగా కనుమరుగుకాకుండా “పాలిటికల్ షెల్టర్” లేదా “ఫ్రంట్ ఆర్గనైజేషన్స్” ద్వారా కొనసాగుతున్న అవకాశం ఉందని అంటున్నారు.LeT నెట్వర్క్ నేపథ్యంలష్కర్-ఎ-తోయిబా అనేది 1990ల చివర్లో ఏర్పడిన ఉగ్ర సంస్థగా గుర్తింపు పొందింది. భారత్లో 2008 ముంబై దాడులు సహా పలు భారీ దాడుల్లో ఈ సంస్థ పేరు వెలుగులోకి వచ్చింది. అంతర్జాతీయంగా ఇది నిషేధిత ఉగ్ర సంస్థగా గుర్తించబడింది. సైఫుల్లా కసూరి వంటి నేతలు ఈ సంస్థలో కీలక కమాండ్ స్థాయిలో ఉన్నారని భద్రతా విశ్లేషణలు చెబుతున్నాయి. -
మిస్టర్ బీస్ట్ రికార్డు!
జూన్ 12న ‘మిస్టర్ బీస్ట్’, యూట్యూబ్లో 50 కోట్ల సబ్స్క్రైబర్లకు చేరుకున్న మొదటి చానల్గా రికార్డు సృష్టించింది. ఈ చానల్ కంటెంట్ క్రియేటర్ జేమ్స్ డొనాల్డ్సన్ సంపాదన ఏడాదికి రూ.700 కోట్లకు పైమాటే. -
చిక్కుల్లో విజయ్ మంత్రి.. డీఎంకే ఎంట్రీతో ముదిరిన వివాదం
చేతిలో ఏటీఎం కార్డు.. మొబైల్ స్క్రీన్పై తెల్లటి పొడి.. కరెన్సీ నోటు.. ఆ పక్కనే నవ్వులు చిందిస్తున్న అమ్మాయి.. ఇదంతా చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. టీవీకే ఎమ్మెల్యే, తమిళనాడు మంత్రి డీ శరత్కుమార్కు డ్రగ్స్ అలవాటు ఉందా? అంటూ పలువురు పశ్నిస్తున్నారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక ర్యాలీలో స్వయంగా సీఎం విజయ్ పాల్గొన్న వేళ.. ఈ వీడియో బయటకు రావడం తమిళనాట కలకలం రేపింది.తమిళనాడు మానవ వనరుల నిర్వహణ శాఖ మంత్రి డి. శరత్కుమార్కు సంబంధించిన ఓ వ్యక్తిగత వీడియో నెట్టింట వైరల్గా మారింది. వీడియోలో మంత్రి ఏటీఎం కార్డుతో మొబైల్ స్క్రీన్పై తెల్లటి పొడి వంటి పదార్థాన్ని నలిపినట్లు కనిపిస్తోంది. పక్కనే రూ.500 నోటు కూడా ఉండటంతో పలువురు సోషల్ మీడియా వినియోగదారులు అది మాదకద్రవ్యమేనని ఆరోపించారు. కొందరు ఆయన రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ వీడియోపై శరత్ వివరణ ఇచ్చుకున్నారు. ఆ వీడియో పాతదని.. ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా చెన్నైలోని చెపాక్ స్టేడియంలో తీసిందని.. దానిని తాను ఇన్స్టాగ్రామ్ 'క్లోజ్ ఫ్రెండ్స్' స్టోరీలో షేర్ చేశానని.. అది ఇప్పుడు వైరల్ అవుతోందని అన్నారాయన. Old video of TVK Minister Sarathkumar is viral online where he was caught using drugs during IPL.He gave an explanation that it was some tablet/ milk power for his baby. But where is the baby and wife here?(1/n)pic.twitter.com/T6LXICsYUp— GeoMedicus (@dr_harish_s) June 26, 2026ఇక డ్రగ్స్ ఆరోపణలపై స్పందించిన శరత్కుమార్.. భార్య, చిన్న కుమార్తెతో కలిసి వీడియో విడుదల చేశారు. ఈ ఘటన రెండేళ్ల క్రితం జరిగిందని.. అప్పటికి తన కుమార్తెకు ఏడాదిన్నర వయసు మాత్రమేనని చెప్పారు. అనారోగ్యంతో ఉన్న చిన్నారి మాత్ర మింగకపోవడంతో, వైద్యుడి సూచన మేరకు మాత్రను పొడిచేసి ద్రవంలో కలిపి ఇవ్వాలని నిర్ణయించామని వివరించారు. వీడియోలో కనిపిస్తున్నది అదే మాత్ర అని, దీనిపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.Did a #TamilNadu minister really get caught handling drugs during an #IPL match? An old video of Tamil Nadu Minister for Human Resources Management D. Sarathkumar has resurfaced online, triggering drug-related allegations on social media.The clip shows the minister using a bank… pic.twitter.com/gBZ7aKR2lX— The New Indian Express (@NewIndianXpress) June 26, 2026అయితే ఈ వివరణతో వివాదం ఆగలేదు. డీఎంకే అధికార ప్రతినిధి శరవణన్ అన్నాదురై స్పందిస్తూ.. వీడియోలో కనిపించిన తీరు డ్రగ్స్ తీసుకునే విధానాన్ని పోలి ఉందని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి విజయ్ ఇప్పటికే రాష్ట్రంలో డ్రగ్స్కు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టారని.. అలాంటి సమయంలో మంత్రిపై వచ్చిన అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు.ఈ వివాదంపై బీజేపీ కూడా స్పందించింది. మంత్రి శరత్కుమార్ వివరణ ఇచ్చినప్పటికీ, వైరల్ వీడియోపై పోలీసులు దర్యాప్తు చేసి నిజానిజాలు బయటపెట్టాలని బీజేపీ నేత నారాయణన్ తిరుపతి డిమాండ్ చేశారు.గత నెలలోనే మంత్రి పదవి చేపట్టిన శరత్కుమార్కు ఈ వివాదం రాజకీయంగా ఇబ్బందికరంగా మారింది. ముఖ్యంగా డ్రగ్స్కు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న సమయంలో ఈ వీడియో వైరల్ కావడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. వీడియోలో కనిపించేది నిజంగా డ్రగ్సా? లేక మంత్రి చెబుతున్నట్లుగా చిన్నారికి ఇచ్చే మందేనా? అనే అంశంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చ సాగుతోంది. -
స్కూల్ వ్యాను వెళ్తుండగా రోడ్డుపై పడిపోయిన ఐదుగురు విద్యార్థులు
బెంగళూరులోని కేఆర్ పుర సమీపంలోని గాయత్రి లేఔట్ వద్ద శుక్రవారం ఉదయం ప్రయాణిస్తున్న ఓ ప్రైవేట్ స్కూల్ వ్యాన్ వెనుక తలుపు మధ్యలోనే తెరుచుకోవడంతో ఐదుగురు విద్యార్థులు రోడ్డుపై పడిపోయారు. ఈ ఘటనలో ముగ్గురు పిల్లలకు గాయాలయ్యాయి.పిల్లలు వ్యాన్ వెనుక భాగంలో కూర్చున్నారు. ప్రయాణం సాగుతుండగా వెనుక తలుపు ఒక్కసారిగా తెరుచుకోవడంతో వారు రోడ్డుపై పడిపోయారు. అదృష్టవశాత్తూ వెనుక నుంచి ఏ వాహనం రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.తర్వాత ట్రాఫిక్ పోలీసులు వ్యాన్ను స్వాధీనం చేసుకున్నారు. వ్యాన్ బయలుదేరే ముందు వెనుక తలుపును సరిగా మూయకపోవడమే ఈ ఘటనకు కారణమై ఉండొచ్చని తెలుస్తోంది. అసలు ఏం జరిగిందన్న విషయంపై దర్యాప్తు సాగుతోంది.కొన్ని ప్రాంతాల్లో స్కూళ్ల నుంచి పిల్లలు వ్యాన్లు, ఆటోల్లో అనుమతించిన పరిమితికి మించి కూర్చొని వెళ్తూ కనపడుతుంటారు. ఈ ఏడాది ఆరంభంలో ఝార్ఖండ్లోని హర్ము రోడ్డుపై 10 మందికిపైగా విద్యార్థులను తీసుకెళ్తున్న ఓ ఆటో బోల్తా పడింది. అయితే ఏ చిన్నారికీ తీవ్రమైన గాయాలు కాలేదు.అనుమతించిన పరిమితికి మించి విద్యార్థులను తరలించే తీరుపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు ఎదురవుతున్నాయి. స్కూల్ రవాణా వాహనాలపై సరిపడా తనిఖీలు జరుగుతున్నాయా? అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు."భారత్లో 10 మంది పిల్లలు కూర్చునే సామర్థ్యం ఉన్న స్కూల్ వ్యాన్లో 20 మందిని ఎక్కిస్తున్నారు. ఇలా వారి ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారు. ఇలాంటి వ్యాన్లపై పోలీసులు జరిమానా విధించడం నేను ఇప్పటివరకు చూడలేదు" అని ఓ వ్యక్తి ఎక్స్లో కామెంట్ చేశాడు. -
ఓరి మీ దుంపతెగా.. ఇదేం ప్రీవెడ్డింగ్ షూట్ రాబాబూ!
-
వ్యాక్సిన్ తీసుకుంది.. స్పాట్లో కుప్పకూలింది!
ముంబై: మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో 17 ఏళ్ల బాలిక టీకా తీసుకున్న కొద్ది నిమిషాల్లోనే కుప్పకూలి మరణించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డు కావడంతో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే, టీకా తీసుకున్న వెంటనే మరణం సంభవించినప్పటికీ, టీకానే మరణానికి కారణమని ఇప్పటివరకు ఎలాంటి నిర్ధారణ కాలేదని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. పూర్తి స్థాయి వైద్య, ఫోరెన్సిక్, శాస్త్రీయ దర్యాప్తు అనంతరమే అసలు కారణం వెల్లడవుతుందని అధికారులు తెలిపారు.ఘటన ఎలా జరిగింది?నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బుధవారం సాధారణ రోగనిరోధక టీకాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 17 ఏళ్ల బాలికకు టెటానస్–డిఫ్తీరియా (Td) బూస్టర్ టీకా ఇచ్చారు. మధ్యాహ్నం సుమారు 12:40 గంటలకు టీకా తీసుకున్న అనంతరం ఆమె కొద్దిసేపు వైద్యుల పరిశీలనలో ఉండి బయటకు వచ్చింది. ఆ తర్వాత సమీపంలోని మెడికల్ షాప్ వద్దకు వెళ్లిన ఆమె ఒక్కసారిగా అస్వస్థతకు గురైంది. తల తిరుగుతోందని చెప్పిన కొద్ది క్షణాల్లోనే స్పృహ తప్పి రోడ్డుపై కుప్పకూలింది. పడిపోయే సమయంలో తలకు తీవ్రంగా గాయమైనట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. స్థానికులు వెంటనే ఆమెను సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు.సీసీటీవీలో రికార్డైన ఘటనఈ మొత్తం ఘటన సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యింది. వీడియోలో బాలిక సాధారణంగా నడుచుకుంటూ వస్తుండగా, ఒక్కసారిగా తూలి కిందపడిపోవడం కనిపిస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ కావడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. అయితే, బాలిక మరణానికి టీకానే కారణమని సోషల్ మీడియాలో అనేక ప్రచారాలు జరుగుతున్నప్పటికీ, అధికారులు వాటిని ఖండించారు. ఆరోగ్య శాఖ అధికారులు స్పష్టం చేసిన వివరాల మేరకు.. ప్రస్తుతం టీకా వల్లే మరణం సంభవించిందని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఇది టీకా వల్ల వచ్చిన అరుదైన ప్రతికూల ప్రతిస్పందనా? లేక ముందుగా ఉన్న గుండె సంబంధిత లేదా ఇతర ఆరోగ్య సమస్య వల్ల జరిగిందా?. లేదా కిందపడినప్పుడు తలకు తగిలిన గాయం కారణమా? అనే కోణాల్లో అన్ని అంశాలను పరిశీలిస్తున్నట్టు తెలిపారు.Nashik - A tragic and shocking incident has sent shockwaves through Nashik, where a 17-year-old girl died within minutes after receiving a routine vaccination. Shravani Anil Patil collapsed shortly after being administered the TT vaccine — meant to prevent tetanus, often given in… pic.twitter.com/iBVVxIsTWh— NextMinute News (@nextminutenews7) June 25, 2026టీకా బ్యాచ్ నిలిపివేత.. ఈ ఘటన అనంతరం అప్రమత్తమైన అధికారులు. ప్రజల్లో అనుమానాలు తలెత్తకుండా ఉండేందుకు, బాలికకు ఇచ్చిన అదే టీకా బ్యాచ్ వినియోగాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. ఆ బ్యాచ్కు చెందిన నమూనాలను ప్రభుత్వ ప్రయోగశాలకు పంపించారు. వాటి నాణ్యత, భద్రతపై ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు, అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. అదే టీకా సీసా నుంచి మరో ఆరుగురికి టీకాలు ఇచ్చారు. వీరిలో నలుగురు గర్భిణులు, ఒక 16 ఏళ్ల బాలిక, ఒక 10 ఏళ్ల బాలుడు ఉన్నారు. వారిలో ఇప్పటివరకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు నమోదు కాలేదు. అదే టీకా బ్యాచ్కు చెందిన డోసులతో ఈ ప్రాంతంలో ఇప్పటికే దాదాపు 120 మందికి టీకాలు ఇచ్చారు. వారిలో కూడా ఎలాంటి తీవ్రమైన ప్రతికూల ప్రభావాలు నమోదుకాలేదని అధికారులు తెలిపారు.కుటుంబ సభ్యుల ఆరోపణలుమృతురాలి కుటుంబ సభ్యులు మాత్రం టీకా తీసుకున్న వెంటనే తమ కుమార్తె కుప్పకూలిందని, అందువల్ల ఈ మరణానికి టీకానే కారణమై ఉండొచ్చని ఆరోపిస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఘటనపై న్యాయపరమైన విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో యువతి ఘటనను అత్యంత సీరియస్గా తీసుకున్న ఆరోగ్య శాఖ పలు స్థాయిల్లో విచారణ ప్రారంభించింది. ఇందులో భాగంగా యువతికి పూర్తి స్థాయి పోస్ట్మార్టం నిర్వహించారు. రక్తం, ఇతర జీవ నమూనాలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు. టీకా బ్యాచ్ నాణ్యతపై ప్రత్యేక ప్రయోగశాల పరీక్షలు జరుగుతున్నాయి. అవసరమైతే ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మార్గదర్శకాల ప్రకారం కూడా కేసును విశ్లేషించనున్నారు.ఆరోగ్య శాఖ ఏమంటోంది?ఈ ఘటన నేపథ్యంలో ఆరోగ్య శాఖ ప్రజలకు కీలక సూచనలు చేసింది. సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దు. అధికారిక నివేదికలు వెలువడే వరకు టీకాలపై అపోహలు సృష్టించవద్దు. టీకాలు ఇప్పటికీ ప్రజారోగ్య పరిరక్షణలో అత్యంత కీలకమైనవేనని అధికారులు స్పష్టం చేశారు. కాగా, పోస్ట్మార్టం, ఫోరెన్సిక్, ప్రయోగశాల నివేదికలు వచ్చిన తర్వాతే బాలిక మరణానికి గల అసలు కారణంపై అధికారికంగా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
అడవిలో ఆగిన ట్రాఫిక్… సైరన్లేకుండా వీఐపీ ఎంట్రీ!
అడవులు తగ్గిపోతున్నాయి, రోడ్లు విస్తరిస్తున్నాయి… ఈ రెండు ప్రపంచాలు కలిసిన చోట తరచూ కనిపించేది ఘర్షణే. కానీ అప్పుడప్పుడూ అలాంటి చోటే మనసును తాకే చిన్న మానవత్వపు క్షణాలు కూడా పుట్టుకొస్తాయి. అలాంటి ఓ దృశ్యమే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అడవి అంచున ఉన్న ఓ రహదారిపై సాధారణంగా వాహనాలు రద్దీగా వెళ్తున్నాయి. ఆ రోజు కూడా అలాగే ట్రాఫిక్ సహజంగానే సాగుతోంది. కానీ ఒక్కసారిగా అడవి వైపు నుంచి ఓ భారీ దంతం కలిగిన ఏనుగు దాగుడు మూతలాడుతోంది. అది రోడ్డు దాటాల్సిన సమయం. అందుకే అలా!. ఆ క్షణంలో వాహనాల వేగం ఆగిపోయింది… కానీ అది ట్రాఫిక్ జామ్ కాదు, ఒక బాధ్యత ఆగిన క్షణం.అక్కడ విధుల్లో ఉన్న ఫారెస్ట్ గార్డ్ వెంటనే స్పందించాడు. ఎలాంటి ఆలస్యం లేకుండా రోడ్డుమధ్యకు వచ్చి చేతులతో సంకేతాలు ఇస్తూ వాహనాలను నిలిపివేశాడు. సాధారణంగా ఇలాంటి ఆపడం వీఐపీ కాన్వాయ్ల కోసం చూస్తాం. కానీ ఇక్కడ కారణం వేరే. ఆ రోడ్డు మీద ప్రయాణించే ప్రతి మనిషికి అతను ఒకే సందేశం ఇచ్చాడు.వాహనాలు నిలిచిపోయాయి. ఇంజిన్ల శబ్దం కొద్దిసేపు తగ్గిపోయింది. ఆ నిశ్శబ్దంలో ఏనుగు ఎలాంటి భయమూ లేకుండా మామూలుగానే రోడ్డుపైకి వచ్చింది. ఎటువంటి ఆందోళన లేకుండా అది ఒక్క అడుగు తర్వాత ఒక్క అడుగు వేస్తూ మరో వైపు అడవిలోకి సాగిపోయింది. మనుషుల ప్రపంచం ఆ క్షణం కోసం పూర్తిగా ఆగిపోయింది.. కానీ ప్రకృతి మాత్రం తన మార్గంలో ప్రశాంతంగా సాగిపోయింది.A forest guard halts traffic, not for a VIP convoy, but for a wild elephant to cross the road.Sometimes the road belongs to those who were here long before us.This is how humans and wildlife can coexist. pic.twitter.com/Dc1aNZWnfU— Manas Muduli (@manas_muduli) June 25, 2026ఈ మొత్తం దృశ్యాన్ని ఒక వాహనంలో నుంచి ఎవరో వీడియో తీశారు. ఆ వీడియోను మానస్ ముదులి అనే యూజర్ సోషల్ మీడియాలో పంచుకోవడంతో అది క్షణాల్లో వైరల్ అయింది. ఆయన చేసిన వ్యాఖ్య కూడా అందరి హృదయాలను తాకింది. “ఇది వీఐపీ కోసం ఆపిన ట్రాఫిక్ కాదు… మన కంటే ముందే ఇక్కడ ఉన్న జీవి కోసం ఇచ్చిన గౌరవం” అన్న భావం ఆ వీడియోలో స్పష్టంగా కనిపించింది.ఈ వైరల్ వీడియో ఎప్పుడు? ఎక్కడ? చిత్రీకరించారనే దానిపై క్లారిటీ లేదు. వీడియోను షేర్ చేసిన మానస్ ముదులి సాధారణంగా ఒడిశా, తూర్పు భారతదేశంలోని వన్యప్రాణుల అంశాలపై పోస్టులు చేస్తుంటారు. అయితే ఈ వీడియోలో.. యూనిఫాం, రహదారి, అడవి వాతావరణం చూస్తే ఇది ఏనుగుల కారిడార్ ప్రాంతాల్లో తీసిన వీడియోగా తెలుస్తోంది. నెటిజన్లను మాత్రం ఆకట్టుకుంటోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు భావోద్వేగానికి లోనయ్యారు. కొందరు ఇది నిజమైన మానవత్వం అన్నారు. మరికొందరు మనిషి–ప్రకృతి సహజీవనానికి ఇది చిన్న కానీ బలమైన ఉదాహరణ అని అభిప్రాయపడ్డారు. ఫారెస్ట్ గార్డ్ తీసుకున్న నిర్ణయాన్ని చాలామంది ధైర్యంగా, సరైన చర్యగా అభినందించారు. అభివృద్ధి పేరుతో అడవులు కుంచించుకుపోతున్న ఈ రోజుల్లో.. వన్యప్రాణులు తమ సహజ మార్గాల్లో ప్రయాణించడానికి కూడా కష్టపడాల్సిన పరిస్థితి ఉంది. అలాంటి సందర్భాల్లో ఇలాంటి చిన్న జాగ్రత్తలే కదా పెద్ద ప్రమాదాలను నివారించేది!. -
కొన్నిసెకన్ల తేడాతో భారీ భూకంపాలు.. వెనిజులాలో భారీ విధ్వంసం
-
జనసేన నేత సంచలన వీడియో లీక్.. ఇది చూసి షాక్ అవుతున్న జనం
-
థానా రామయ్య... నువ్వు చాలా గ్రేటయ్యా!
నీళ్లు కూడా వ్యాపారంగా మారిన ఈరోజుల్లో డెబ్బై ఏడేళ్ల థానా రామ్ గురించి తెలుసుకుంటే బాగుంటుంది. రాజస్థాన్కు చెందిన థానా రామ్ గత రెండు దశాబ్దాలుగా బాటసారులకు ఉచిత నీరు అందిస్తున్నాడు. బార్మర్లోని రద్దీ రహదారి వెంబడి రోడ్డు దాటుతున్న ప్రజలకు చల్లటి తాగు నీరు బాటిళ్లను అందిస్తుంటాడు. ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఈ వీడియో వైరల్ అయింది.బార్మర్–బటాడు మార్గంలో బస్సు ప్రయాణీకులు, ట్యాక్సీ డ్రైవర్లు, బాటసారుల కోసం ప్రతిరోజూ ఖాళీ బాటిల్స్లో చల్లటి తాగునీరు నింపుతూ కనిపిస్తాడు థానా రామ్. వేసవిలో ఉష్ణోగ్రతలు రోజూ 45 నుంచి 46 డిగ్రీల సెల్సియస్ చేరుకునే ఈ ప్రాంతంలో థానా రామ్ చేసే సహాయం ఎంతోమందికి ఉపశమనాన్ని ఇస్తోంది. ఈ పని కోసం ఆయన విరాళాల సేకరించడం లేదు. తాను చేస్తున్న పనికి ప్రచారం రావాలని కూడా అనుకోలేదు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలోకి రావడంతో చాలామందికి థానా రామ్ గురించి తెలిసింది. -
కూల్ డ్రింక్ ఇస్తేనే ఫోన్ ఇస్తా అంటున్న కోతి
-
వృద్ధ కళాకారుడి బతుకుపోరాటం.. అండగా ఆనంద్ మహీంద్ర
చప్పట్లు కొట్టే ప్రేక్షకులు లేరు. పెద్ద వేదిక లేదు. కానీ చేతిలో వయోలిన్, హృదయంలో సంగీతం మాత్రం ఇప్పటికీ అలాగే ఉన్నాయి. వీధుల్లో దశాబ్దాలుగా వయోలిన్ వాయిస్తూ జీవనం సాగిస్తున్న 80 ఏళ్ల భగవాన్ మల్లిక్ కథ ఇప్పుడు దేశవ్యాప్తంగా హృదయాలను కదిలిస్తోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సైతం ఆయన పరిస్థితికి చలించి సాయం చేయడానికి ముందుకు రావడంతో ఈ కథ మరింత మందికి చేరింది.పశ్చిమ బెంగాల్లోని కోల్కతాకు చెందిన భగవాన్ మాలిక్.. యుక్తవయసులోనే తల్లిదండ్రులను కోల్పోయారు. అయితే తండ్రి నేర్పించిన సంగీతమే ఆయనకు ఆధారం అయింది. అప్పటి నుంచి ఇప్పటివరకు వీధుల్లో వయోలిన్ వాయిస్తూ వచ్చిన డబ్బుతోనే జీవనం సాగిస్తున్నారు. వయసు 80 దాటినా, కంటి చూపు మందగించినా, చేతిలోని వయోలిన్ పాతబడిపోయి శిథిలావస్థకు చేరినా ఆయన సంగీత ప్రయాణం మాత్రం ఆగలేదు.ప్రతిరోజూ సాయంత్రం నుంచి రాత్రి వరకు కోల్కతాలోని న్యూ టౌన్ ప్రాంతంలో వయోలిన్ వాయిస్తూ కనిపించే మల్లిక్ రోజుకు వంద రూపాయల వరకే సంపాదిస్తున్నారని తెలుస్తోంది. ఆయన భార్య కూడా తరచూ పక్కనే కూర్చొని తోడుగా ఉంటోంది. అద్దె ఇంట్లో జీవిస్తున్న ఈ వృద్ధ దంపతుల పరిస్థితిని.. కంటెంట్ క్రియేటర్ ఆరాధనా చటర్జీ సోషల్ మీడియాలో పంచుకోవడంతో కథనం వైరల్గా మారింది.ఈ వీడియోను చూసిన ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా(Anand Mahindra) స్పందిస్తూ, “ఆయన సంగీతంపై ఉన్న అభిరుచి నన్ను కదిలించింది. నేను కూడా సాయం చేయాలనుకుంటున్నాను. ఆయనకు ఎలా సహాయం చేయాలో వివరాలు కావాలి” అని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆయన స్పందనతో మరింత మంది భగవాన్ మల్లిక్ పరిస్థితి గురించి తెలుసుకుని సహాయం చేసేందుకు ముందుకొచ్చారు.I’d like to contribute, along with many others, who I know will be moved by his passion…The video didn’t seem to provide details of how & where. https://t.co/hAkvZDbWev— anand mahindra (@anandmahindra) June 24, 2026ఇప్పటికే ఆరాధనా చటర్జీ మల్లిక్కు కొత్త వయోలిన్ను బహుమతిగా అందించడమే కాకుండా, ప్రజల సహకారంతో లక్ష రూపాయల నిధులు కూడా సమీకరించినట్లు వెల్లడించారు. ఒక సాధారణ వీడియోతో మొదలైన ఈ ప్రయత్నం ఇప్పుడు దేశవ్యాప్తంగా మానవత్వానికి నిదర్శనంగా మారింది. దశాబ్దాలుగా జీవన పోరాటంలో సంగీతాన్ని ఆయుధంగా మార్చుకున్న భగవాన్ మల్లిక్ కథ... ప్రతిభకు వయసు అడ్డుకాదని, నిజమైన కళాకారుడు పరిస్థితులు ఎంత కఠినమైనా తన కళను వదలడని మరోసారి గుర్తు చేస్తోంది. -
వెనెజువెలా, జపాన్లో భారీ భూకంపాలు.. సునామీ హెచ్చరిక జారీ
భారీ భూకంపాలతో వెనెజువెలా, జపాన్ దేశాలు చిగురుటాకులా వణికిపోయాయి. భయంతో జనాలు బయటకు పరుగులు తీశారు. పలు చోట్ల భవనాలు కుప్పకూలిపోగాa.. ప్రాణ నష్టం సైతం వాటిల్లినట్లు తెలుస్తోంది. వెవెజువెలాలో నిమిషాల వ్యవధిలోనే శక్తివంతమైన రెండు ప్రకంపనలు సంభవించాయి. దీంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. వెనిజులాలో సుమారు 7.5, 7.1 తీవ్రతలతో(రిక్టర్ స్కేలుపై)తో వరుసగా రెండు శక్తిమంతమైన ప్రకంపనలు వచ్చాయి. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో.. మోంటాల్బాన్ ప్రాంతంలో 13.2 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమైంది. దీని ప్రభావం కొలంబియా, కారకాస్లో కనిపించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కరేబియన్ తీర ప్రాంతానికి సునామీ హెచ్చరిక జారీ చేసినట్లు అమెరికా సునామీ కేంద్రం తెలిపింది. ఒక ప్రత్యక్ష సాక్షి తెలిపిన వివరాల ప్రకారం.. కొన్ని అపార్ట్మెంట్లలో పగుళ్లు ఏర్పడ్డాయి, అద్దాలు పగిలిపోయాయి.A powerful 7.1-magnitude earthquake just struck Altamira, Caracas, Venezuela. pic.twitter.com/wFsX2GwrHs— Weather Monitor (@WeatherMonitors) June 24, 2026వెనిజులాలో సంభవించిన భూకంపం కారణంగా ప్యూర్టో రికో, అమెరికా వర్జిన్ దీవులకు సునామీ ముప్పు ఉందని సునామీ హెచ్చరిక కేంద్రం తెలిపింది. అయితే అమెరికా తీర ప్రాంతాలకు ఎలాంటి సునామీ హెచ్చరిక జారీ చేయలేదని పేర్కొంది.“అందుబాటులో ఉన్న సమాచారాన్ని పరిశీలించిన తర్వాత, సముద్ర మట్టం హెచ్చుతగ్గులు, బలమైన సముద్ర ప్రవాహాల కారణంగా ప్యూర్టో రికో, వర్జిన్ దీవులకు సునామీ ముప్పు పొంచి ఉంది. ఇవి తీర ప్రాంతాలు, బీచ్లు, నౌకాశ్రయాలు, తీర జలాల్లో ప్రమాదకరంగా మారవచ్చు” అని తెలిపింది. ఇక, జపాన్లో 6.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇక్కడి నష్టం వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది. MORE: Multiple structures have reportedly collapsed after a strong earthquake struck Caracas. https://t.co/r1EaakspGy— Breaking911 (@Breaking911) June 24, 2026WATCH: Terrifying Moment Powerful 7.1-Magnitude Earthquake Rocks Caracas, Venezuela pic.twitter.com/D9A5cXEV6e— Breaking911 (@Breaking911) June 24, 2026 -
రూ.1.49 కోట్ల విలువైన రేంజ్ రోవర్ గోవిందా.. ఎవర్రా మీరంతా?
యూకేలోని ఉత్తర యార్క్షైర్లోని స్కార్బరో బీచ్లో ఇసుకలో ఇరుక్కుపోయిన ఒక వ్యాన్ను కాపాడేందుకు ఓ రేంజ్ రోవర్ యజమాని ప్రయత్నించాడు. అయితే, ఆ ప్రయత్నం ఘోరంగా విఫలమైంది. సుమారు $1,58,000 (దాదాపు రూ.1.49 కోట్లు) విలువైన రేంజ్ రోవర్ కూడా ఇసుకలో ఇరుక్కుపోయింది. సముద్ర అలలు పెరిగాయి. రేంజ్రోవర్తో పాటు వ్యాన్ కూడా మునిగిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అంత విలువైన రేంజ్ రోవర్ను సముద్రం వద్ద అటువంటి పనులకు వాడినందుకు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.తీరప్రాంతంలో ఇరుక్కుపోయిన ట్రాన్సిట్ వ్యాన్ను బయటకు లాగేందుకు రేంజ్ రోవర్ వాహనం ప్రయత్నిస్తున్న దృశ్యాలు వీడియోలో కనిపించాయి. మొదట వ్యాన్ చక్రాలను ప్లాస్టిక్ పారతో తవ్వి బయటకు తీయడానికి కొందరు ప్రయత్నించారు. రేంజ్ రోవర్ అక్కడికి చేరుకోగానే పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. కానీ ఆ ప్రయత్నం తిరగబడింది. ఇసుకపై నడిచే ప్రత్యేక విధానం ఉన్నప్పటికీ ఆ విలాసవంతమైన ఎస్యూవీ కూడా ఇరుక్కుపోయింది. సాయంత్రానికి సముద్ర అలలు పెరగడంతో రెండు వాహనాలు నీటిలో మునిగిపోయాయి. వాటిలో పైకప్పులు, ఒక యాంటెన్నా మాత్రమే నీటిమీద కనిపించాయి. స్థానికులు ఇచ్చిన సలహాలను యజమానులు పట్టించుకోకుండా, స్వయంగా వాహనాలను బయటకు తీయడానికి ప్రయత్నించారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.ప్రత్యక్ష సాక్షి చెప్పిందేమిటంటే?ప్రత్యక్ష సాక్షి సామీ హెల్వెల్ మాట్లాడుతూ.. “కొంతమంది స్థానికులు అక్కడికి వెళ్లి, జెట్ స్కీల సాయంతో ఇసుక నుంచి బయటకు తీయాలని సూచించారు. కానీ వారితో వారు మర్యాదగా మాట్లాడలేదు. తమకు ఏం చేయాలో తెలుసన్న అహంభావం కనపడింది. మొదట జెట్ స్కీలను వ్యాన్కు కట్టారు. అది లాగడానికి ఏ మాత్రం ఉపయోగపడలేదు. అది పూర్తిగా అవివేకం. నా మామ కోసం నేను ఆ వీడియో తీశాను. వారు వాహనాలను బయటకు తీయడానికి చేసిన ప్రయత్నాలు ఎంత హాస్యాస్పదంగా ఉన్నాయో చూసి ఆయనకు నవ్వు వస్తుందని అనుకున్నాను” అని చెప్పారు. తర్వాత అధికారులు అలలు తగ్గిన తర్వాత వాటిని బయటకు తీశారు. View this post on Instagram A post shared by North Yorkshire Weather Updates (@northyorkshireweatherupdates) -
స్టేడియం వద్ద తొక్కిసలాట.. మదిలోకి చిన్నస్వామి భయానక ఘటన!
జార్ఖండ్ టీ20 లీగ్ ఫైనల్ సందర్భంగా మంగళవారం సాయంత్రం తీవ్ర కలకలం రేగింది. జేఎస్సీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వెలుపల భారీ జనసందోహం కారణంగా తొక్కిసలాట జరగడంతో పలువురు అభిమానులు గాయపడ్డారు. టోర్నీ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే ఈ దురదృష్టకర సంఘటన చోటుచేసుకుంది.ఫైనల్ పోరును ప్రత్యక్షంగా చూసేందుకు స్టేడియం నిర్వాహకులు ఉచిత ప్రవేశం కల్పించడమే ఈ గందరగోళానికి దారి తీసింది. ఉచితం కావడంతో ఊహించని స్థాయిలో దాదాపు లక్ష మందికి పైగా ప్రేక్షకులు ఒకేసారి స్టేడియం గేట్ల వద్దకు తరలివచ్చారు. లోపలికి వెళ్లే క్రమంలో ఒక్కసారిగా తొక్కిసలాట జరగడంతో కొందరు అదుపుతప్పి కిందపడిపోయారు. అయితే వెలుపల ఇంతటి ఉద్రిక్తత నెలకొన్నప్పటికీ, మైదానం లోపల జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ మాత్రం ఎలాంటి అంతరాయం లేకుండా సాగింది. ఈ ఘటనపై జార్ఖండ్ ఆరోగ్య శాఖ మంత్రి ఇర్ఫాన్ అన్సారీ అత్యంత వేగంగా స్పందించారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన ఉచిత వైద్యం అందించేందుకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు. పరిస్థితి అదుపులోనే ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆరోగ్య శాఖ సహాయక చర్యలను పర్యవేక్షిస్తోందని మంత్రి హామీ ఇచ్చారు.అయితే తాజాగా జార్ఖండ్ టీ20లీగ్లో ఫైనల్ మ్యాచ్ సందర్భంగా స్టేడియం బయట జరిగిన తొక్కిసలాట గతేడాది చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాటను గుర్తుకుతెచ్చిందని కొందరు అభిమానులు పేర్కొన్నారు. స్టేడియం వద్ద చెప్పులు చిందర వందరగా పడి ఉండడం తమకు ఆ కాళరాత్రిని గుర్తు చేసిందని పలువురు వాపోయారు. 2025లో చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట (ఫైల్)అయితే అదృష్టవశాత్తూ ప్రాణనష్టం లేకపోవడం కాస్త ఉపశమనం కలిగించే అంశమని వెల్లడించారు. ఇక 2025 ఐపీఎల్లో విజేతగా నిలిచిన ఆర్సీబీ విజయోత్సవాలు చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించారు. అయితే ఊహించని విధంగా ఎక్కువ మంది అభిమానులు రావడంతో పరిస్థితి పూర్తిగా అదుపుతప్పింది. దీంతో తొక్కిసలాట జరగడంతో దాదాపు 11 మంది మృతి చెందగా, దాదాపు 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.ఇక జార్ఖండ్ టీ20 లీగ్ విజేతగా చోటా నాగ్పూర్ రాయల్స్ నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన జంషెడ్పూర్ స్టీలర్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. హర్ష్ రానా (24 బంతుల్లో 64) మెరుపు అర్ధశతకం సాధించాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన చోటా నాగ్పూర్ 16 బంతులు మిగిలి ఉండగానే మూడు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఇండియా-ఏ తరఫున అదరగొట్టిన కుమార్ కుషాగ్ర 39 బంతుల్లోనే 78 పరుగులు చేసి విజయంలో కీలకపాత్ర పోషించాడు. #WATCH | Jharkhand: A stampede-like situation arose at the JSCA Stadium in Ranchi during the final match of the Jharkhand T20 League due to an unexpectedly large crowd. More details awaitedJharkhand Health Minister Irfan Ansari says- Hospitals have also been alerted for the… pic.twitter.com/CqlfHjTrC3— ANI (@ANI) June 23, 2026చదవండి: నాకౌట్కు కొలంబియా.. ప్రత్యేక ఆకర్షణ మాత్రం అతడే! -
విజయ్ ఫ్యాన్స్.. ఎంతకు తెగించార్రా?
సినీ తారలపై అభిమానులకు ఉండే ప్రేమ ఒక్కోసారి ఊహలకు రెక్కలు తొడుగుతుంది. సోషల్ మీడియా, ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆ ఊహలు వీడియోల రూపంలోనూ ప్రత్యక్షమవుతున్నాయి. తాజాగా అగ్రనటుడి నుంచి ముఖ్యమంత్రిగా ఎదిగిన విజయ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు రూపొందించిన ఓ ఏఐ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అందులో కనిపించిన సన్నివేశాలు నెటిజన్లను నవ్విస్తుండగా.. అభిమానుల క్రియేటివిటీపై చర్చకు దారి తీస్తున్నాయి.తమిళ సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో విజయ్, నటి త్రిష పేర్లు తరచూ చర్చలో నిలుస్తున్నాయి. సీక్రెట్ ట్రిప్పులు.. కానుకలు, పరోక్షంగా సోషల్ మీడియా పోస్టులతో తొలినాళ్లలో చర్చనీయాంశమయ్యాయి. ఆ తర్వాత విజయ్ భార్య సంగీత కోర్టు మెట్లు ఎక్కడంతో ఈ అంశం అధికారికంగా బయటకు వచ్చింది. ఈ విషయంలో ఇరువైపుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ఈ మధ్యలోఇద్దరూ కలిసి ఓ వివాహ వేడుకకు హాజరు కావడం, విజయ్ నెగ్గాక స్వయంగా ఇంటికి వెళ్లి కంగ్రాట్స్ చెప్పడం.. ప్రమాణ స్వీకారంలో త్రిష హడావిడి.. ఇవన్నీ ఒకదాని వెంట మరొకటి ఈ హిట్ పెయిర్ గురించి మాట్లాడుకునేలా చేశాయి. ఈ నేపథ్యంలో జూన్ 22న విజయ్ పుట్టినరోజు సందర్భంగా త్రిష శుభాకాంక్షలు ఏ రేంజ్లో చెబుతుందో? అనే ఆసక్తి అభిమానుల్లో కనిపించింది. అయితే.. ఇన్స్టాలో అన్ఫాలో కావడం, విషెస్ తెలియజేయకపోవడం.. విజయ్-సంగీత మధ్య రాజీ కోసం పెద్దలు ప్రయత్నిస్తున్నారంటూ కథనాలు రావడం అప్పటిదాకా సాగిన చర్చను మరో దారి తీసుకెళ్లింది. HBDCMJosephVijay pic.twitter.com/2jAKGDrMNP— vattikoti vishnu (@vattikotivishnu) June 24, 2026 విజయ్ త్రిష బ్రేకప్ అయ్యిందంటూ గాలి కబుర్లు చక్కర్లు కొట్టాయి. అయితే వాటికి చెక్ పెడుతూ.. ఒక రోజు ఆలస్యంగా త్రిష విజయ్కి బర్త్డే విషెస్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో మళ్లీ చర్చ మొదలైంది. అయితే.. త్రిష షేర్ చేసిన విజయ్ కేక్ కటింగ్ ఫొటో పాతదా? కొత్తదా? అనేదానికి ఎలాంటి స్పష్టత లేదు. అయితే.. ఈ ఫొటో ఆధారంగా తీసుకున్న కొందరు అభిమానులు ఏఐ సాయంతో దాన్ని యానిమేటెడ్ వీడియోగా మార్చారు. అయితే అక్కడితో ఆగకుండా తమ ఊహాశక్తికి మరింత పని చెప్పారు. వీడియోలో కేక్ కటింగ్ జరుగుతుండగా అకస్మాత్తుగా ఓ వ్యక్తి వచ్చి త్రిషను అక్కడి నుంచి ఎత్తుకెళ్లినట్లు చూపించారు. ఆ తర్వాత విజయ్ కుటుంబ సభ్యులు సడన్ ఎంట్రీ ఇచ్చినట్లు, అందరూ కలిసి బర్త్డే వేడుకలో పాల్గొన్నట్లు సన్నివేశాలు జోడించారు.వైరల్గా మారిన ఏఐ వీడియోవీడియోలో విజయ్ భార్య సంగీత, కొడుకు జేసన్ సంజయ్, కూతురు దివ్య సాషా ఆయనతో కేక్ కట్ చేయించి సరదాగా ఉన్నట్లు ఉంది. ఈ వీడియో పూర్తిగా వినోదాత్మక కోణంలో రూపొందించిన ఏఐ క్రియేషన్ అయినప్పటికీ.. అది సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. కొందరు అభిమానులు దీనిని సరదాగా తీసుకుంటూ షేర్ చేస్తుండగా, మరికొందరు “ఫ్యాన్స్ ఊహాశక్తికి హద్దులే లేవు” అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంకొందరు ఆ ఊహ నిజమైతే ఎంత బాగుండో అనుకుంటున్నారు.ఏఐ ఎరాలో అభిమానుల క్రియేటివిటీగతంలో అభిమానులు పోస్టర్లు, ఫ్లెక్సీలు, ఫ్యాన్ మేడ్ వీడియోలతో తమ అభిమానాన్ని చాటుకునేవారు. ఇప్పుడు ఏఐ టూల్స్ అందుబాటులోకి రావడంతో నిమిషాల్లో కొత్త కథలు, కొత్త సన్నివేశాలు సృష్టిస్తున్నారు. డైరెక్టర్ల చెర నుంచి తప్పించి తమ ఫేవరెట్ హీరోలను ఫ్లాపులను అడ్డుకున్నట్లు, అలాగే సినిమాల్లో కీలక మలుపులను మార్చేసి.. కథ సుఖాంతాలు చేసినట్లు.. ఇలాంటి వీడియోలు ఈ మధ్యకాలంలో వైరల్ అవుతున్నాయి. అలా కథకు తమకు ఎలాంటి సంబంధం లేకపోయినా.. తమకు నచ్చిన ముగింపును వీడియో రూపంలో చూపిస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ తరహాలోనే విజయ్ వీడియోలు వైరల్ అవుతున్నాయి.அட பாவிண்களா 😭😭😭😭pic.twitter.com/xrz0klnzFd— Kanchipuram Vijay FaN (@VfcKanchipuram) June 24, 2026సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విజయ్ ఫ్యామిలీ వీడియో పూర్తిగా ‘‘ఏఐ ద్వారా రూపొందించిన ఫ్యాన్ మేడ్ కంటెంట్’’ మాత్రమే. ఎవరి వ్యక్తిగత జీవితాలు వాళ్లవి. ఇందులో చూపించిన సంఘటనలు, పాత్రల ప్రవర్తన, సన్నివేశాలకు వాస్తవ సంఘటనలతో సంబంధం లేదు. అభిమానుల ఊహాశక్తితో రూపొందించిన వినోదాత్మక వీడియోగా దీనిని చూడాలి. -
వహ్! స్మార్ట్ఫోన్లకు శ్రాద్ధం పెట్టారు... సైబర్ నేరాలకు సమాధి కట్టారు!!
స్మార్ట్ఫోన్.. మనిషి జీవితాన్ని సులభతరం చేసింది. అందులో ఎలాంటి సందేహమూ అక్కర్లేదు. కానీ అదే.. కొన్నిసార్లు వ్యసనంగా మారి కుటుంబ బంధాలను దెబ్బతీస్తోందన్న ఆందోళనలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా యువతలో ఆన్లైన్ మోసాలు, సైబర్ నేరాలు, సోషల్ మీడియా వ్యసనాలకు కారణమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో.. ఓ పల్లెటూరు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.సైబర్ నేరాలకు దూరంగా ఉంటాం.. వాటి బారిన పడబోం.. అంటూ ఖరీదైన స్మార్ట్ఫోన్లను పగలగొట్టారు ఇక్కడో ఊరి ప్రజలు. పైగా సామూహికంగా వాళ్లంతా ప్రతిజ్ఞ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. హర్యానాలోని నుహ్ జిల్లాలో ఉన్న సుఖ్పురి గ్రామంలో ఇటీవల జరిగిందీ ఘటన. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. వీడియోలో పలువురు యువకులు తమ ఖరీదైన స్మార్ట్ఫోన్లను నేలకేసి కొడుతూ ధ్వంసం చేస్తూ కనిపించారు. మొత్తం 55 ఫోన్లను ధ్వంసం చేసినట్లు సమాచారం. గ్రామ పంచాయతీ తీసుకున్న నిర్ణయం మేరకు గ్రామంలో స్మార్ట్ఫోన్ల వినియోగంపై పూర్తిస్థాయి నిషేధం విధించారు. ఇకపై కీప్యాడ్ ఫోన్లనే ఉపయోగించాలని నిర్ణయించారు. యువత సైబర్ నేరాల బారిన పడకుండా చూడటం, స్మార్ట్ఫోన్ వ్యసనాన్ని తగ్గించడం, నిజాయితీతో కూడిన జీవన విధానాన్ని ప్రోత్సహించడమే లక్ష్యమని గ్రామ పెద్దలు చెబుతున్నారు.నుహ్ జిల్లా ఎస్పీ డాక్టర్ అర్పిత్ జైన్ ఇటీవల నేరాల్లో పాల్గొంటున్న వ్యక్తులు మార్పు దిశగా అడుగులు వేయాలని ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ కార్యక్రమం ప్రభావంతో గ్రామ యువకులు ఈ ప్రతీకాత్మక నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. గతంలో నేర కార్యకలాపాలతో సంబంధాలు ఉన్నవారు కూడా ఇకపై అలాంటి వాటికి దూరంగా ఉంటామని బహిరంగంగా ప్రమాణం చేశారు.ఈ కార్యక్రమానికి పోలీసులు కూడా హాజరయ్యారు. నేరస్తులపై చర్యలు తీసుకోవడం మాత్రమే కాదు, మార్పు కోరుకునే వారికి అవకాశాలు కల్పించడం కూడా తమ బాధ్యతేనని వారు పేర్కొన్నారు. సాధారణ జీవితంలోకి తిరిగి రావాలనుకునే వారికి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.గ్రామస్తుల అభిప్రాయం ప్రకారం.. స్మార్ట్ఫోన్ వ్యసనం వల్ల యువతలో తప్పుదోవ పట్టే ధోరణి పెరుగుతోంది. కొందరు గ్రామస్తులు అయితే మొబైల్ ఫోన్ల కారణంగా కుటుంబాల్లో విభేదాలు పెరిగాయని, కొన్ని కుటుంబాలు విచ్ఛిన్నమయ్యాయని కూడా పేర్కొన్నారు. అందుకే నేర ప్రపంచంతో ఉన్న అన్ని సంబంధాలను తెంచుకోవాలని గ్రామం నిర్ణయించింది.నుహ్ జిల్లా గత కొన్నేళ్లుగా సైబర్ నేరాలకు కేంద్రంగా మారిందన్న ఆరోపణలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా నమోదవుతున్న సైబర్ మోసాల్లో గణనీయమైన కేసులు ఈ ప్రాంతంతోనూ సంబంధం ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. నిరుద్యోగం, పేదరికం, తక్కువ ధరలో లభిస్తున్న స్మార్ట్ఫోన్లు, వేగవంతమైన ఇంటర్నెట్ సదుపాయం కారణంగా కొందరు యువకులు సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఫిషింగ్ కాల్స్, ఆన్లైన్ మోసాల వైపు ఆకర్షితులవుతున్నారని అధికారులు విశ్లేషిస్తున్నారు.అయితే అదే జిల్లాకు చెందిన సుఖ్పురి గ్రామం మాత్రం వేరే దారి ఎంచుకుంది. స్మార్ట్ఫోన్ను పగలగొట్టడం ద్వారా సమస్య అంతమవుతుందా లేదా అన్నది పక్కన పెడితే... యువతను నేరాల నుంచి దూరం పెట్టాలనే సంకల్పానికి ఇది ప్రతీకగా నిలిచింది. సాంకేతికతతో వస్తున్న సవాళ్లకు తమదైన పరిష్కారం వెతికిన ఓ ఊరు తీసుకున్న నిర్ణయంగా ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. -
వేడుకల పేరిట వికృతం.. మహిళలే టార్గెట్గా మారారా?
ఫ్రాన్స్లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. సంగీతం, సంబరాలు, ఆనందానికి ప్రతీకగా నిలిచే భారీ ప్రజా వేడుకలు ఎంత ప్రమాదకరంగా మారవచ్చో ఫ్రాన్స్లో జరిగిన తాజా ఘటన మరోసారి ప్రపంచానికి గుర్తు చేసింది. లక్షలాది మంది పాల్గొన్న వార్షిక సంగీత ఉత్సవంలో మహిళలతో అనుచిత ప్రవర్తన, లైంగిక దాడుల ఆరోపణలు, కత్తిపోట్ల ఘటనలు చోటుచేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనల నేపథ్యంలో ఫ్రెంచ్ పోలీసులు 240 మందిని అదుపులోకి తీసుకున్నారు.ఫ్రాన్స్లో ప్రతి ఏడాది నిర్వహించే ప్రముఖ సంగీత ఉత్సవం ఫెటే డీలా ముసిక్యూ(Fête de la Musique) వేడుక ఈసారి విషాదకర ఘటనలతో వార్తల్లో నిలిచింది. దేశవ్యాప్తంగా జరిగిన వేడుకల్లో 145 మంది సూదులతో గుచ్చినట్లు ఫిర్యాదులు చేయగా, మహిళలపై లైంగిక దాడులు, హింసాత్మక ఘటనల ఆరోపణలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనల నేపథ్యంలో ఫ్రెంచ్ పోలీసులు 240 మందిని అదుపులోకి తీసుకున్నారు.According to reports, several incidents of violence and vandalism occurred last night during the annual "Music Festival" in Paris. pic.twitter.com/08murQ3w8c— Yumiko (@sin3950) June 22, 2026జూన్ 21న నిర్వహించిన ఈ ఉత్సవానికి లక్షలాది మంది హాజరయ్యారు. అయితే వేడుకల సమయంలో అనేక మంది మహిళలు, యువతులు తమకు గుర్తుతెలియని వ్యక్తులు సూదులతో గుచ్చారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తం 145 కేసులు నమోదవగా, వాటిలో 13 ఘటనలు పారిస్లోనే చోటుచేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. బాధితుల్లో కొందరిని ఆసుపత్రులకు తరలించి టాక్సికాలజీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. సూదుల్లో మత్తు పదార్థాలు ఉన్నాయా లేదా అనే విషయంపై దర్యాప్తు కొనసాగుతోంది.Every year, France's Fête de la Musique ends the same way. This year: violence, thefts, sexual assaults, vandalism, and over 240 arrests.THIS TELLS YOU MORE ABOUT THE FRENCH POLITICAL CLASS THAT ENDORSES THE FÊTE THAN IT DOES THE FÊTE DE LA MUSIQUE.pic.twitter.com/ITQIUS8p5u— Steve Hanke (@steve_hanke) June 22, 2026వేడుకలకు ముందు సోషల్ మీడియా వేదికలపై మహిళలను లక్ష్యంగా చేసుకోవాలంటూ కొన్ని పోస్టులు వైరల్ కావడం ఆందోళన కలిగించింది. ఆ హెచ్చరికల తర్వాతే ఈ ఘటనలు చోటుచేసుకోవడంతో పోలీసులు కుట్ర కోణంలోనూ విచారణ చేపట్టారు. ఇదిలా ఉండగా, ఉత్సవాల సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనల్లో పలువురు గాయపడ్డారు. ఒక 17 ఏళ్ల యువకుడు కత్తిపోట్లతో ఆసుపత్రిలో చేరగా, మొత్తం 14 మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. 13 మంది భద్రతా సిబ్బంది కూడా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలు ఫ్రాన్స్లో మహిళల భద్రత, భారీ ప్రజా వేడుకల నిర్వహణపై మరోసారి చర్చకు దారితీశాయి. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఘటనలపై దర్యాప్తు కొనసాగుతోంది. అయితే ఇప్పటివరకు దాడుల వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం ఏమిటన్నది స్పష్టంగా తెలియరాలేదు.France’s annual Fête de la Musique was marred by widespread disorder overnight, with authorities making 243 arrests across the country. pic.twitter.com/9BW8oWf2K1— theshadeborough (@theshadeborough) June 23, 2026ప్రతి సంవత్సరం లక్షలాది మంది పాల్గొనే ఈ ఉత్సవం ఫ్రాన్స్ సంస్కృతికి ప్రతీకగా భావిస్తారు. వీధులు, పార్కులు, ప్రజా ప్రదేశాలు సంగీతంతో మార్మోగే ఈ వేడుక ఈసారి మాత్రం భద్రతా లోపాలపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తింది. ఒకప్పుడు సంగీత సంబరాలకు ప్రతీకగా నిలిచిన ఈ ఉత్సవం.. ఈసారి మాత్రం భయం, ఆందోళన, భద్రతా వైఫల్యాల చర్చలకు కేంద్రబిందువుగా మారింది. మహిళల భద్రత, భారీ ప్రజా కార్యక్రమాల్లో భద్రతా ఏర్పాట్లు, సోషల్ మీడియా ద్వారా వ్యాపిస్తున్న హింసాత్మక పిలుపులపై ఫ్రాన్స్ ప్రభుత్వం మరింత కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
అగ్నిపర్వతం బుసలు.. ప్రాణాల కోసం పరుగులు!
Volcan de Fuego.. అమెరికాలో అగ్నిపర్వతం బద్ధలైంది. గ్వాటెమాలాలో అగ్నిపర్వతం నుంచి భారీగా బూడిద, పొగ, వేడి లావా వెలువడింది. ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగసిపడిన బూడిద మేఘాలు, పేలుళ్ల వంటి శబ్దాలతో అక్కడి వాతావరణం భయానకంగా మారింది. దీంతో సమీపంలో ఉన్న పర్యాటకులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు.వివరాల మేరకు.. సెంట్రల్ అమెరికా (Centrel America)లోని గ్వాటెమాలా (Guatemala)లో వోల్కన్ డీఫ్యూగో (Volcan Defugo) అగ్నిపర్వతం బద్ధలైంది. ఈ క్రమంలో అగ్నిపర్వతం నుంచి ఒక్కసారిగా మంటలు వెలువడ్డాయి. ఏకంగా 33 వేల అడుగుల ఎత్తు పొగలు విరజిమ్మాయి. అగ్నిపర్వతం నుంచి ఒక్కసారిగా మంటలు, మండుతున్న రాళ్లు బుల్లెట్లలా దూసుకొచ్చాయి. దాంతో ఆ పర్వత పరిసరాల్లో ఉన్న పర్యాటకులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. ఒక్కసారిగా అక్కడ భయానక వాతావరణం నెలకొంది.#Video 🧗🏽♀️🌋 Circula en redes sociales un video en donde durante el ascenso de un grupo de excursionistas al Volcán de Fuego, en #Guatemala, el coloso registró una erupción repentina que lanzó ceniza, rocas y material volcánico. pic.twitter.com/zhNlXA4lpp— Canal 13 Oaxaca (@canal13oaxaca) June 22, 2026 ఒక వీడియోలో ఒక పర్యాటకుడు ‘ఓరి దేవుడా, ఇది మరీ దారుణం. పరుగెత్తండి, పరుగెత్తండి..!’ అని అరుస్తూ పరుగులు తీశాడని స్థానికులు తెలిపారు. ఒక పర్యాటకుడు కుక్కను పట్టుకుని సురక్షిత ప్రదేశానికి తీసుకువెళుతుండగా.. మరికొందరు కింద పడుతున్న శిథిలాల నుంచి తమను తాము కాపాడుకోవడానికి ప్రయత్నించినట్లు న్యూయార్క్ పోస్ట్ తెలిపింది. కాగా, గ్వాటెమాల నగరానికి నైరుతి దిశలో సుమారు 43 కిలోమీటర్ల దూరంలో ఈ వోల్కాన్ డి ఫ్యూగో అగ్నిపర్వతం ఉన్నది. గ్వాటెమాలాలో అత్యంత చురుకైన అగ్నిపర్వతంగా ఇది పరిగణించబడుతుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.Guatemala: Drone footage of the first seconds of the Fuego volcano eruption. pic.twitter.com/ClBvGCrmT7— ((Hurkle Durkling)) 🇺🇸 🤟 🇮🇱 (@durklinghurkle) June 22, 2026అగ్నిపర్వత కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రమాద ప్రాంతాలకు వెళ్లొద్దని పర్యాటకులకు సూచనలు జారీ చేశారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, అవసరమైతే మరిన్ని భద్రతా చర్యలు చేపడతామని వెల్లడించారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు సంభవించలేదు. అయితే ప్రకృతి విపత్తులు ఎంత ఆకస్మికంగా సంభవిస్తాయో ఈ ఘటన మరోసారి గుర్తు చేసిందని నిపుణులు పేర్కొంటున్నారు. పర్యాటకుల గుండెల్లో గుబులు పుట్టించిన ఈ ఘటన ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.🌋 Lo que comenzó como una excursión terminó en una carrera por la supervivencia.Un grupo de senderistas fue sorprendido por una repentina erupción del Volcán de Fuego, en #Guatemala. Las imágenes muestran cómo los excursionistas corren para ponerse a salvo mientras columnas de… pic.twitter.com/mg6LJ0QfBc— GlobaLAT (@globaLATvideo) June 22, 2026 -
టీమిండియా జెర్సీ అందుకోగానే బుడ్జోడు ఏం అన్నాడంటే
-
నందు పెద్ద నంగనాచి డబ్బులు ఇచ్చేదాకా.. ఎలా మోసం చేశారంటే
-
లక్ అంటే వీరిదే : కారు నుజ్జు నుజ్జు, షాకింగ్ సీసీటీవీ విజువల్స్
కేరళలోని తిరువనంతపురంలోని కిలిమనూర్ వద్ద MC రోడ్డు వద్ద క్షణాల్లో మృత్యుముఖం నుంచి తప్పించుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఆగి ఉన్న కారును వేగంగా వచ్చిన ఒక ట్రైలర్ ట్రక్బలంగా ఢీకొట్టింది. అయితే అదృష్టవశాత్తూ తల్లీబిడ్డల తోపాటు, తండ్రి కూడా ఆ భయంకరమైన ప్రమాదం నుంచి ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. ఇది చూసి చాలామంది ఆశ్చర్యపోయారురోడ్డు పక్కన నిలిపిన కారు నుండి ఓ మహిళ తన బిడ్డతో దిగిన మరుక్షణమే, వెనుక నుండి వచ్చిన ట్రక్కు ఆ కారును బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు తునాతునాకలైపోయింది. కానీ కారులో ఉన్న వారిద్దరికీ ఎటువంటి తీవ్ర గాయాలు కాలేదు. ఈ భయంకరమైన సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.जाको राखे साइयाँ मार सके ना कोईA mother and child had a miraculous narrow escape📍KERALA pic.twitter.com/gYmHVUg1zx— Karan Singh / करन सिंह (@Journo_Karan) June 22, 2026 నిజంగా లక్ అంటే వీరిదే అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా వాహనం నడిపినందుకు గాను ట్రక్ డ్రైవర్పై పోలీసులు కేసు నమోదు చేసి, ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. ఇదీ చదవండి: ఆ పిక్స్ అందుకే పోస్ట్ చేయలేదు, కానీ బీచ్లో బికినీ కాక..? -
37 ఏళ్ల ఎదురుచూపు.. విధి ఆడిన వింత నాటకం!
“పిల్లలు సెటిల్ అయిపోయారు. హమ్మయ్యా.. ఇంక రిటైర్మెంట్ తర్వాత హాయిగా జీవిద్దాం” అని ఎన్నో కలలు కనే వాళ్లు ఉంటారు. కానీ ఆ కలలన్నీ నిజం కావడానికి జీవితం అవకాశం ఇస్తుందనే గ్యారంటీ లేదు. 37 ఏళ్ల పాటు ఉద్యోగానికే జీవితాన్ని అంకితం చేసిన ఓ పెద్దాయన.. తన జీవితంలోని అరుదైన క్షణం కోసం ఎదురు చూశాడు. కానీ, విధి వింత నాటకం ఆడింది. ఓ వైద్యురాలు సోషల్ మీడియాలో పంచుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.68 ఏళ్ల ఓ వ్యక్తి ఇటీవల గుండెపోటుతో ఆస్పత్రిలో చేరగా.. వైద్యులు ఎంత ప్రయత్నించినా ప్రాణాలు కాపాడలేకపోయారు. అయితే ఆయన మరణం కంటే ఎక్కువగా అందరినీ కలచివేసింది ఆయన భార్య చెప్పిన విషయం.వైద్యురాలు డాక్టర్ ధివ్య ధ్యానా సోషల్ మీడియాలో వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆ పెద్దాయన కేవలం రెండు నెలల క్రితమే ఉద్యోగ విరమణ పొందాడు. అదే కంపెనీలో ఏకంగా 37 సంవత్సరాలు పనిచేశాడు. ఉద్యోగ జీవితమంతా కుటుంబ పోషణకే ప్రాధాన్యం ఇచ్చాడు. భార్య, ముగ్గురు పిల్లల భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమించాడు. ఈ క్రమంలో కుటుంబ విహారయాత్రలు, స్నేహితులతో పర్యటనలు, వ్యక్తిగత ఆనందాలన్నింటినీ వాయిదా వేస్తూ వచ్చాడు. “ఇప్పుడు కష్టపడతాను.. రిటైర్ అయిన తర్వాత జీవితాన్ని ఎంజాయ్ చేస్తాను” అని భార్యకు తరచూ చెప్పేవాడట.చివరకు రిటైర్మెంట్ వచ్చిన తర్వాత భార్యతో కలిసి నెల రోజుల పాటు ప్రపంచాన్ని చుట్టేయాలని నిర్ణయించుకున్నాడు. ఆగస్టులో జరగాల్సిన ఆ పర్యటన కోసం టికెట్లు, హోటల్ బుకింగ్లు సహా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. కానీ ఆ కలల యాత్ర ప్రారంభం కాకముందే ఆయన గుండెపోటుతో మరణించాడు.ఈ ఘటనను వివరిస్తూ డాక్టర్ ధివ్య ధ్యానా భావోద్వేగానికి గురయ్యారు. “37 ఏళ్ల కష్టానికి ప్రతిఫలంగా జీవితాన్ని ఆస్వాదించాలనుకున్న వ్యక్తి.. ఆ క్షణం వచ్చేలోపే వెళ్లిపోయాడు. ఇలాగే ఎంతో మంది తమ సమయం, ఆరోగ్యం, స్వేచ్ఛను త్యాగం చేస్తూ భవిష్యత్తు కోసం మాత్రమే జీవిస్తున్నారు” అని పేర్కొన్నారామె.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వేలాది మంది నెటిజన్లు స్పందిస్తూ.. తమ కుటుంబాల్లోనూ ఇలాంటి కథలు ఉన్నాయని కామెంట్లు చేస్తున్నారు. రిటైర్మెంట్ తర్వాత జీవితాన్ని ఆస్వాదిద్దామనుకుని.. ఆ అవకాశమే దక్కని బంధువులు, స్నేహితుల గురించి గుర్తుచేసుకుంటున్నారు. View this post on Instagram A post shared by Dr Dhivya Dhyana (@drdhivyadhyana)జీవితం ఎప్పుడూ మన ప్రణాళికల ప్రకారం సాగదని.. భవిష్యత్తు కోసం వర్తమానాన్ని పూర్తిగా త్యాగం చేయడం సరైనది కాదని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. పని, బాధ్యతలు ఎంత ముఖ్యమైనవైనా.. కుటుంబంతో గడిపే సమయం, ఆరోగ్యం, చిన్న చిన్న ఆనందాలు కూడా అంతే విలువైనవని నిపుణులు సూచిస్తున్నారు. -
తమిళనాడులో టోర్నడో బీభత్సం.. భారత్లోనే అరుదైన ఘటన
చెన్నై: తమిళనాడులో అరుదైన టోర్నడో ఒకటి దర్శనమిచ్చింది. తుత్తూకుడిలో భారీ మేఘాల మధ్య నుంచి నేల వరకు విస్తరించిన సుడిగాలి ఆకారపు ఫన్నెల్ (Funnel Cloud) కనిపించింది. వాతావరణ నిపుణులు దీనిని అరుదైన టోర్నడో ఘటనగా గుర్తించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.భారత్లో టోర్నడోలు కనిపించడం చాలా అరుదు. టోర్నడోలు సాధారణంగా అమెరికాలోని "టోర్నడో అలీ" ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తాయి. అయితే దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా తమిళనాడులో ఇలాంటి ఘటనలు దాదాపు కనిపించవు. అందుకే తుత్తూకుడిలో నమోదైన ఈ దృశ్యం వాతావరణ శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది.Fascinating view of rare tornado taken from #Thoothukudi Airport parking space. The Tornado emerged at Vagaikulam recks damage to a toll plaza on Thoothukudi - Tirunelveli National Highway, before disappearing at airport. @xpresstn @NewIndianXpress #Tornado pic.twitter.com/wWhOhIJy6u— Godson Wisely Dass (@tnie_godson) June 21, 2026ఆదివారం సాయంత్రం తూత్తుకుడి ప్రాంతంలో తీవ్ర ఉరుములు, మెరుపులతో కూడిన వర్ష మేఘాలు ఏర్పడ్డాయి. ఆ సమయంలో వాతావరణంలో అస్థిరత (Atmospheric Instability), తేమ, గాలి దిశల్లో మార్పులు కలిసి టోర్నడో ఏర్పడేందుకు అనుకూల పరిస్థితులను సృష్టించాయి. ఫలితంగా మేఘం నుంచి కిందికి దిగిన సుడిగాలి నేలను తాకి కొద్దిసేపు టోర్నడోగా మారింది. టోర్నడో బలహీనంగా ఉండటంతో కొద్దిసేపటికే చెదిరిపోయిందని అధికారులు చెబుతున్నారు. అయినప్పటికీ ఇది పూర్తిస్థాయి టోర్నడోగా గుర్తించబడటం విశేషం. దీని వల్ల టోల్ప్లాజా వద్ద కొంత ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం. தூத்துக்குடி: வாகைகுளம் பகுதியில் சுழல் காற்று.. வைரலாகும் காட்சிகள். அரிதினும் அரிதான நிகழ்வு என சுயாதீன வானிலை ஆய்வாளர் பிரதீப் ஜான் பதிவு#Thoothukudi | #Tornado pic.twitter.com/8PBBwrp8ub— PttvOnlinenews (@PttvNewsX) June 21, 2026టోర్నడో అంటే ఏమిటి?టోర్నడో అనేది ఉరుములు, మెరుపులతో కూడిన భారీ మేఘం (Thunderstorm Cloud) నుంచి నేల వరకు విస్తరించే అత్యంత వేగంగా తిరిగే గాలి స్తంభం. ఇది నేలను తాకినప్పుడు ధూళి, ఇసుక, చెత్తను పైకి లేపుతూ భయానక దృశ్యాన్ని సృష్టిస్తుంది. గంటకు వందల కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంటుంది. అయితే, భారత్లో టోర్నడోలు చాలా తక్కువగా నమోదవుతాయి. సాధారణంగా పశ్చిమ బెంగాల్, ఒడిశా, గంగా మైదాన ప్రాంతాల్లో అప్పుడప్పుడు కనిపించినా, దక్షిణ భారతదేశంలో ఇవి అత్యంత అరుదు అని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.Thoothukudi Airport 😯😲 💥 pic.twitter.com/9O9mp6JOQI— Amutha (@Amutha74247715) June 22, 2026#WATCH | Thoothukudi, Tamil Nadu | Strong cyclonic winds cause heavy damage in the region.(Visuals from the Vaagaikulam toll plaza area) pic.twitter.com/39TfpIilzs— ANI (@ANI) June 22, 2026 -
కొన్ని గంటలపాటు గాల్లో ప్రాణాలు.. ఏకంగా 60 మీటర్ల ఎత్తులో
బీజింగ్: చైనాలోని సిచువాన్ ప్రావిన్స్లో బలమైన గాలుల వల్ల నియంత్రణ కోల్పోయిన ఓ పారాగ్లైడింగ్ పైలట్ 60 మీటర్ల ఎత్తైన టవర్ క్రేన్కు చిక్కుకుని నిలిచిపోయాడు. పారాగ్లైడర్తో అతడు నాన్చోంగ్ నగరం వైపు దిగుతున్న సమయంలో గ్లైడర్ తాళ్లు క్రేన్ జిబ్కు చిక్కుకున్నాయి. ఆ భయానక దృశ్యం కెమెరాలో రికార్డు అయింది. ఈ వీడియో వీబో వంటి సోషల్ మీడియా వేదికల్లో, ఎక్స్లో వైరల్ అయింది.అత్యంత ఎత్తులో సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి ఎట్టకేలకు పారాగ్లైడర్ను సురక్షితంగా కాపాడారు. ఒక ప్రత్యక్ష సాక్షి తెలిపిన వివరాల ప్రకారం.. పైలట్ కొన్ని గంటలసేపు చిక్కుకుపోయాడు. కొన్ని స్థానిక మీడియా సంస్థలు మాత్రం సహాయక చర్యలకు కొన్ని గంటలు పట్టాయని తెలిపాయి. ఈ ఘటనపై అధికారులు ఇప్పటివరకు అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.ఈ ఘటన సాహస క్రీడల భద్రతపై పెరుగుతున్న ఆందోళనను స్పష్టం చేస్తోంది. పారాగ్లైడింగ్కు ముందస్తు అనుమతి తీసుకోవాలి. వాతావరణ పరిస్థితులు, గగనతల నిబంధనలు కచ్చితంగా పాటించాలి. ఊహించని విధంగా వీచే గాలులతో పాటు పట్టణ ప్రాంతాల్లోని భారీ నిర్మాణాలు కూడా ప్రమాదానికి దారితీయవచ్చని ఈ ఘటన స్పష్టంగా తెలియజేస్తోంది.ఇటీవల ఆస్ట్రియా ఆల్ప్స్ పర్వత ప్రాంతంలో మరో ఘటన కూడా ఈ రంగాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఓ చిన్న విమానం పారాగ్లైడర్ను ఢీకొట్టింది. ఆ దెబ్బకు పారాగ్లైడర్ వేగంగా తిరుగుతూ నేలవైపు దూసుకెళ్లింది. చివరి క్షణంలో ఆమె అత్యవసర పారాచూట్ను తెరిచి సురక్షితంగా దిగగలిగింది. ఆ ఘటన మే నెలలో ఉత్తర ఆస్ట్రియాలోని ష్మిట్టెన్హోహే పర్వతం సమీపంలో జరిగింది. ఈ ప్రాంతం పారాగ్లైడింగ్కు ప్రసిద్ధి పొందింది.🇨🇳 🚨 INCIDENT: In Nanchong, China, a paraglider reportedly became entangled in a tower crane on June 19.According to local reports, the individual was left hanging for approximately four hours before rescue operations could be completed.Authorities are said to have responded… pic.twitter.com/azXtI5orkm— 🇵🇸 Arabian (@Arabian__KGB) June 20, 2026 -
50 ఏళ్ల వయసులో కాలేజ్కి వెళ్తున్న మహిళ..!
చదువుకి వయసు పరిమితి కాదని చాలామంది నిరూపిస్తున్నారు. అదే కోవలోకి మరో మహిళ వచ్చింది. అందుకు సంబంధించి వీడియోని నెట్టింట షేర్ చేసింది.. ఆ వీడియో ‘గైస్ ఈ రోజు నాకు పరీక్ష ఉంది’ అంటూ మొదలవుతుంది. ఒక మహిళ తనకంటే చిన్న వయసు ఉన్న విద్యార్థులతో పరీక్ష కేంద్ర వైపుకి వెళ్తున్నట్లు చెబుతుండటం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. దశాబ్దాల క్రితం చదువు వదిలేసిన ఆమె పరీక్షకు సిద్దమవుతున్నప్పుడు సహజంగా విద్యార్థులు పడినట్లుగానే చిన్నపాటి టెన్షన్ ఉందని చెబుతోంది వీడియోలో. తను బ్యాక్లాగ్ పేపర్ ఒకటి క్లియర్ చేయడానికి వచ్చినట్లు వెల్లడించింది. అంతేగాదు ఆమె ఈ వీడియోకి ‘చదువుకోవడానికి వయసు పరిమితి కాదు’ అనే క్యాప్షన్ జోడించి మరి పోస్ట్ చేసింది. ఈ వీడియో నెటిజన్లను అమితంగా ఆకర్షించింది. అంతేగాదు సుదీర్ఘ విరామం తర్వాత చదువుని కొనసాగించినందుకు చాలామంది ఆ మహిళను ప్రశంసించారు. మరికొందరు ఆమె ప్రయాణం స్ఫూర్తిదాయకమని, నేర్చుకోవడానికి లక్ష్యాలను సాధించడానికి ఎప్పుడు ఆలస్యం కాదని ఆమె ఉదంతం నిరూపిస్తోందంటూ కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Manju narang (@student_at_50) (చదవండి: మేమున్నాం అనే భరోసా చాలు) -
Viral Video: గాలివాన బీభత్సం.. గాలికి కొట్టకపోయిండు
-
ఇది మామూలు రీల్ కాదు భార్య నవ్వు కోసం భర్త చేసిన రిస్క్
-
‘‘నోర్ముయ్!.. లేదా బయటకు పో.. నీ హద్దులో నువ్వు ఉండు!’’
ఐక్యరాజ్యసమితి (UN) వేదికపై దౌత్య మర్యాదలు పక్కనపడ్డాయి. ఇజ్రాయెల్ను తొలిసారిగా లైంగిక హింస, చిన్నారుల హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన బ్లాక్లిస్టులో చేర్చడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ దేశ రాయబారి డ్యానీ డానన్.. ఐరాస ఉన్నతాధికారులతో బహిరంగంగానే వాగ్వాదానికి దిగారు. ఒక దశలో "నోరు మూసుకోండి" అంటూ అధికారిణిపై కావరం ప్రదర్శించడం తీవ్ర చర్చనీయాంశమైంది.న్యూయార్క్లో శుక్రవారం "సాయుధ ఘర్షణల్లో లైంగిక హింస నిర్మూలన దినోత్సవం" సందర్భంగా ఐరాస సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ రాయబారి డ్యానీ డానన్ మాట్లాడుతూ.. ఇజ్రాయెల్ను లైంగిక హింసకు సంబంధించిన ఆరోపణల జాబితాలో చేర్చిన ఐరాస ప్రత్యేక ప్రతినిధి ప్రమీలా పాటెన్పై తీవ్ర విమర్శలు గుప్పించారు.ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుట్రెస్ ఇజ్రాయెల్ను లక్ష్యంగా చేసుకోవడంపై ఆసక్తిగా ఉన్నారని.. ప్రమీలా పాటెన్ కూడా అదే వైఖరికి లొంగిపోయారని ఆరోపించారు. అంతేకాదు, ఆమె తన పదవికి రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేశారు. డానన్ వ్యాఖ్యల మధ్యలో చిన్నారులు, సాయుధ ఘర్షణల అంశాలపై ఐరాస ప్రతినిధిగా ఉన్న వానెస్సా ఫ్రాజియర్ జోక్యం చేసుకున్నారు. వ్యక్తిగత విమర్శలు చేయవద్దని, నివేదికలో పేర్కొన్న అంశాలన్నీ ధ్రువీకరించిన ఆధారాల ఆధారంగానే నమోదు చేశామని చెప్పారు. దీనికి ఆగ్రహించిన డానన్.."మేము సభ్య దేశం. మీరు ఐరాస ఉద్యోగి మాత్రమే. మీ హద్దులో మీరుండాలి. ఇప్పుడు మీరు నోరు మూసుకోవాలి. లేదంటే బయటకు పోండి. మీ నివేదిక సిగ్గుచేటు" అంటూ తీవ్రస్థాయిలో స్పందించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.Israeli ambassador to the United Nations, Danny Danon, got in a shouting match with the U.N.'s special representative for children and armed conflict, Vanessa Frazier, after she interrupted his remarks at Friday's meeting regarding allegations that Israeli soldiers and settlers… pic.twitter.com/Qp8hEuN6HU— CBS News (@CBSNews) June 20, 2026వివాదానికి కారణం ఏంటంటే.. ఇటీవల ఐరాస విడుదల చేసిన రెండు కీలక నివేదికల్లో ఇజ్రాయెల్ను బ్లాక్లిస్టులో చేర్చింది. సాయుధ ఘర్షణల సమయంలో లైంగిక హింస, అలాగే చిన్నారులపై జరుగుతున్న ఉల్లంఘనలకు సంబంధించి ఇజ్రాయెల్పై తొలిసారిగా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు, గాజా యుద్ధం నేపథ్యంలో పాలస్తీనా చిన్నారులపై ఉల్లంఘనలు గణనీయంగా పెరిగాయని ఐరాస పేర్కొంది. ఇదే సమయంలో ఇజ్రాయెల్కు శత్రువైన హమాస్ కూడా ఈ బ్లాక్లిస్టులో కొనసాగుతోంది.ఇజ్రాయెల్ ఆగ్రహంఈ నివేదికలు వెలువడినప్పటి నుంచే ఇజ్రాయెల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. నివేదికలు పక్షపాత ధోరణితో రూపొందించబడ్డాయని ఆరోపిస్తున్న ఆ దేశం.. ఐరాస ప్రధాన కార్యదర్శి గుటెర్రెస్తో అధికారిక సంబంధాలను తెంచుకుంటామని కూడా హెచ్చరించింది.తాజా ఘటనతో ఐరాస–ఇజ్రాయెల్ మధ్య ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న సంబంధాలు మరింత దిగజారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గాజా యుద్ధం, మానవ హక్కుల ఉల్లంఘనల అంశాలపై ఇరువైపులా ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్న వేళ.. ఐరాస వేదికపై జరిగిన ఈ మాటల యుద్ధం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది. -
'నేను బాబా టిల్లూ : బాబా బైక్ స్టంట్స్ వీడియో వైరల్
సోషల్మీడియాలో రోజుకో కొత్త వింత పుట్టుకొస్తూనే ఉంటుంది. ఆశ్చర్యపరిచే, నవ్వించే ఫన్నీ వీడియోలు ఎన్నో వస్తుంటాయి. సాధారణంగా యువకులకు బైక్ లంటే చాలా క్రేజ్ ఉంటుంది, కానీ ఒక బాబా బైక్పై విన్యాసాలు చేయడం చూశారా? తాజాగా ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. కాషాయ వస్త్రాలు ధరించి, రద్దీగా ఉండే రహదారిపై చేసిన బైక్ స్టంట్స్ చేశారు. రన్నింగ్ బైక్పై బైక్ హ్యాండిల్ను చేతులతో కాకుండా ఒక కాలుతో పట్టుకుని, రెండు చేతులు గాల్లో ఊపుతూ స్టంట్స్ చేశారు. ఆయన బ్యాలెన్సింగ్ చూసి చుట్టుపక్కల వాహనదారులు కూడా నోరెళ్లబెడుతున్నారు. తెగ వైరల్ అవుతున్న ఈ వీడియోపై జనాలు ఎంతో రొమాంటిక్, ఫన్నీ కామెంట్స్ చేస్తూ బాగా లైక్ చేస్తున్నారు. ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో bittu_22k అనే అకౌంట్ నుండి షేర్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోకు 4.7 మిలియన్లకు పైగా వ్యూస్, అలాగే 1.79 లక్షలకి పైగా లైక్స్ వచ్చాయి. అయితే ఇది ఏ ప్రాంతానికి చెందిందనే వివరాలు అందుబాటులో లేవు.రన్నింగ్ బైక్పై బాబా చేసిన ఈ స్టంట్ చూసి జనాలే షాక్ అవుతున్నారు. అయితే, రోడ్డుపై ఇలాంటి స్టంట్స్ చేయడం ప్రాణాంతకం కాబట్టి, చాలా మంది దీనిని ప్రమాదకరమైన చర్యగా పేర్కొంటున్నారు.'యమరాజుతో డైరెక్ట్ కనెక్షన్' అంటూ నెటిజన్లు తెగ సెటైర్లు వేశారు. View this post on Instagram A post shared by Viral Controversy (@viralcontroversy) నెటిజన్ల ఫన్నీ కామెంట్స్"బాబాకు బహుశా యమరాజుతో డైరెక్ట్ ఫ్రెండ్షిప్ ఉన్నట్టుంది.", "నేను బాబా టిల్లూ..." అని కామెంట్ చేశారు. "బాబా గారి బైక్ బహుశా ఆటోమేటిక్ అనుకుంటా!" అని ఒకరు, "బాబా తన శక్తులన్నింటినీ ఇక్కడే వాడుతున్నారు." అని మరొకరుకామెంట్ చేశారు.నోట్ : అత్యంత ప్రమాదకరమైన ఇలాంటి స్టంట్లు చేయడం అస్సలు సరికాదు. ఇది సదరు వ్యక్తి ప్రాణాలకే కాకుండా, రోడ్డుపై వెళ్లే ఇతర వాహనదారుల ప్రాణాలకు ముప్పు తెచ్చిపెడుతుందని గమనించాలి. సో...ఇలాంటి నిర్లక్ష్యపు విన్యాసాలు ఏదో థ్రిల్ ఇస్తాయనుకోవడం పొరబాటే. కాదూ కూడదంటే కఠిన చర్యలు తప్పవని ట్రాఫిక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
షాకింగ్ : కట్టేసి, జుట్టు కత్తిరించి, పైశాచికంగా.. వీడియో వైరల్
ఛత్తీస్గఢ్లోని కోరియా జిల్లా పాండోపారా గ్రామంలో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. కట్టుకున్న భార్య, నలుగురు బిడ్డల తల్లిపై అనుమానంతో భర్త అతి దారుణంగా ప్రవర్తించిన వైనం దిగ్భ్రాంతి రేపింది. ఈ ఘోరానికి సంబంధించిన వీడియోపై నెటిజన్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రాయ్పూర్కు ఉత్తరాన సుమారు 350 కి.మీ దూరంలో ఈ ఘటనచోటు చేసుకుంది. బాధితురాలు తారా బాయి (32)కు నిందితుడు జితేంద్ర ఘసియాతో 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు. విబేధాలతో భార్యాభర్త లిద్దరు విడిగా ఉంటున్నారు. అయితే పిల్లలు మాత్రం తండ్రి వద్దే ఉంటున్నారు.భార్యపై అనుమానంతో అత్యంత అమానుషంగా దాడి చేశాడు జితేంద్ర. చేతులు కాళ్లు, కట్టేసి ఆమె పదే పదే దాడి చేశాడు. అనంతరం ఆమె జుట్టును కత్తిరించి తీవ్ర అవమానానికి గురిచేశాడు .ఈ దారుణాన్ని అడ్డుకోవాల్సింది పోయి, మరో మహిళకూడా ఆమెపై చేయి చేసుకోవడం ఈ వీడియోలో చూడొచ్చు. ఈ ఘాతుకాన్ని రికార్డ్ కూడా చేశాడు. 💔 #DalitWoman Tara Bai was brutally assaulted by her estranged husband in Chhattisgarh: tied up, beaten, head shaved, smeared with black substance & forced to drink urine. Caste & gender violence continue. Justice for Tara Bai! #StopViolence #ShotOnPaPhone #ApolloTyres pic.twitter.com/zCBduhT2oS— Kavita Kumari (@KavitaDevi5252) June 19, 2026అసలేం జరిగింది? అయితే, ఏడాది క్రితం భర్త ఆమెను వదిలేయడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఆమె, తన సామాజిక వర్గానికి చెందిన ఒక పరిచయస్తుడి ఇంట్లో ఆశ్రయం పొందుతోంది. నిందితుడు ఆమెను ఇంటి బయటకు రప్పించి, అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా చంపేస్తానని బెదిరించాడు. ఆ తర్వాత రాక్షసుడిలా మారిపోయాడు. దారుణంగా కొట్టి అమానుషంగా ప్రవర్తించడంతోపాటు, మూత్రం తాగించాడు. ఇదీ చదవండి: అచ్చం ఖడ్గం సినిమాలోలా : విద్యావ్యవస్థపై వ్యాపారవేత్త సెటైర్లుబాధితురాలు ఫిర్యాదు చేయడంతో, స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.తనపై పిడిగుద్దులు కురిపించి, తన జుట్టును కత్తిరించారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన స్థానిక పోలీసులు ఆమె భర్తపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఘటనా స్థలంలో ఉన్న ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేయడంతోపాటు, వీడియో ఫుటేజీని పరిశీలిస్తున్నామన్నారు. విచారణ అనంతరం నిందితుడిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఒక పోలీసు అధికారి ప్రకటించారు.ఇదీ చదవండి: బీమా లేకుండానే చీప్గా కాంటాక్ట్ లెన్స్ : అమెరికన్ మహిళ సంబరంఇదీ చదవండి: 60 ఏళ్లకి లవ్, 75 రోజులకే పెళ్లి : నటి లవ్ స్టోరీ -
బీమా లేకుండానే చీప్గా కాంటాక్ట్ లెన్స్ : అమెరికన్ మహిళ సంబరం
అమెరికాలో రోజు రోజుకి అస్తవ్యస్థంగా మారిపోతున్న వైద్య వ్యవస్థ, సేవల్లో జాప్యం, ఖరీదైన వైద్యంలాంటి వాటిపై ఇప్పటికే చాలా విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా ఇండియాలో హెల్త్కేర్ సిస్టం, అందిస్తున్న సేవలపై ఒక అమెరికన్ మహిళ ప్రశంసలు కురిపించడం విశేషంగా నిలిచింది. అమెరికా చూసి నేర్చుకోఅంటూ ఇన్స్టాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. అపాయింట్మెంట్ లేకుండా భారతదేశంలో కాంటాక్ట్ లెన్స్లు కొనుక్కో గలిగాను అంటూ పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది.ఆమె తన వీడియోలో వివరించిన వివరాల ప్రకారం భారతదేశంలో కాంటాక్ట్ లెన్స్ల కొనుగోలు ప్రక్రియ ఎంతో అందుబాటులోనూ, తక్కువ ధరలోనూ ఉంది.ఒక ఆప్టికల్ స్టోర్కు వెళ్లి లెన్స్లను ఆర్డర్ చేయడం, చాలా తక్కువ ధరకే వాటిని త్వరగా పొందడం వంటి విషయాలను వివరిస్తూ, ‘ఐవీ' (Ivy) అనే మహిళ తన అనుభవాన్ని పంచుకున్నారు. అమెరికా దీనిని గమనించాలని (పాఠంనేర్చుకోవాలని) ఆమె సూచించారు. బీమా లేదా ముందస్తు అపాయింట్మెంట్ లేకుండానే రూ. 2,451లకే కొనుగోలు చేసి, ఇక్కడి వైద్య సేవల లభ్యతను ఆమె కొనియాడారు.షాపింగ్ అనుభవం ఐవీ కోసం కేవలం ఒక జత కాంటాక్ట్ లెన్స్లు మాత్రమే తెచ్చుకుంది. దీంతో మరో జత కొనాలని నిర్ణయించుకుంది. కేవలం 20 నిమిషాల నడక దూరంలో ఉన్న ఒక మాల్లోని ఆప్టికల్ స్టోర్కు వెళ్లి, తన ప్రిస్క్రిప్షన్ను వారికి చూపించింది. ఆమె వాడే బ్రాండ్ లెన్స్లను సోమవారం రాత్రి కల్లా తెప్పించి ఇస్తామని స్టోర్ సిబ్బంది చెప్పారు. మరిన్ని బాక్సులు కొంటే అదనపు డిస్కౌంట్ ఇస్తామని ఆఫర్ చేసినప్పటికీ, ఆమె ఒక బాక్స్ మాత్రమే తీసుకుంది. చెప్పిన సమయానికి ఆమెకు లెన్స్లు అందడంతో ఆమె ఆనందంతో ఉబ్బితబ్బిబ్బై పోయింది.ఇదీ చదవండి: 60 ఏళ్లకి లవ్, 75 రోజులకే పెళ్లి : నటి లవ్ స్టోరీఇలా నేరుగా ఆప్టికల్ స్టోర్లోకి నడుచుకుంటూ వెళ్లి లెన్స్ కొనుక్కోవడం చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే అమెరికాలో ఇలా చేయడం అస్సలు సాధ్యం కాదు, ముఖ్యంగా ఇన్సూరెన్స్ లేకుండా అస్సలు కుదరదని ఐవీ పేర్కొంది. చాలా తక్కువ ధరకే మూడు జతలు వచ్చాయంటూ ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేసింది.నెటిజన్లు ఏమన్నారంటేఈ పోస్ట్ వైరల్ కావడంతో, అమెరికన్లకు కాంటాక్ట్ లెన్స్లు కొనడానికి కూడా ఇన్సూరెన్స్ కావాలనే విషయం తెలిసి మెజారిటీ నెటిజన్లు ఆశ్చర్యపోయారు "నిజమా! నేనైతే ఎప్పుడు పడితే ఒక మామూలు గ్లాసెస్ షాప్కి వెళ్తాను. నా కళ్లద్దాలు లూజ్ అయితే టైట్ చేయించుకుంటాను. దానికోసం ఆ షాప్ అతను ఒక్క రూపాయి కూడా తీసుకోడు, ఫ్రీగా చేస్తాడు." అని తెలిపారు. కాంటాక్ట్ లెన్స్ కోసం ఇన్సూరెన్స్ కావాలనే కాన్సెప్ట్ వినడానికే చాలా వింతగా ఉందంటూ మరొక యూజర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తమకూ ఈ విషయం తెలియదంటూ మరికొందరు కూడా విస్తుపోయారు. కాగా ఇటీవల మరొక అమెరికన్ మహిళ (విక్టోరియా) అమెరికాలో సుమారు రూ. 94వేలు ఖరీదు చేసే ముఖ్యమైన మందులను ఇండియా నుంచి కేవలం రూ. 2,350 లకే కొనుగోలు చేసానని, , అమెరికా హెల్త్కేర్ సిస్టమ్ను ఒక "స్కామ్" అని అభివర్ణించిన సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: అచ్చం ఖడ్గం సినిమాలోలా : విద్యావ్యవస్థపై వ్యాపారవేత్త సెటైర్లు -
జీ7 సదస్సులో తొమ్మిదేళ్ల చిన్నారి..! పాపం కెమెరా కంట పడకూడదని..
సంపన్న దేశాల కూటమి అయిన ‘గ్రూప్ ఆఫ్ సెవెన్’(జీ7) 52వ శిఖరాగ్ర సదస్సు సోమవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఫాన్స్లోని ఎవియాన్ లే బైన్స్లో ఈ నెల 17 వరకు సదస్సు జరగనుంది. ఈ సభ్య దేశాలతో పాటు ఆహ్వానిత హోదాలో భారత్, బ్రెజిల్, ఈజిప్టు, కెన్యా, దక్షిణ కొరియా, ఖతార్, సిరియా, ఉక్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లు సదస్సులో పాల్గొననున్నాయి. అదీగాక ఇరాన్- అమెరికా మధ్య శాంతి ఒప్పందం కుదిరిన తర్వాత జరుగుతున్న సదస్సు కావడంతో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఈ సదస్సుకి ఓ తొమ్మిదేళ్ల చిన్నారి రాక అందర్నీ ఆశ్చర్యపరిచింది. పాపం అమె కెమెరా కంట పడకుండా ఉండేందుకు పడుతున్న తపన అందర్నీ అమితంగా ఆకర్షించింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఇంతకీ ఆ చిన్నారి ఎవరంటే..ఆ ముద్దలొలికే పాప ఇటలీ ప్రధాని జార్జియా మెలోని కూమార్తె. ఫ్రాన్స్లో ఇటీవల జరుగుతున్న G7 సదస్సులో ప్రధాన ప్రపంచ సమస్యలను పరిష్కరించడానికి ప్రపంచ నాయకులు సమావేశమైనప్పుడు ఒక రసవత్తరమైన క్షణం ఎదురైంది. అందుకు సబంధించిన వీడియో అందరి హృదయాలను తాకింది. అంతేగాదు కొన్ని గంటల్లోనే ఆ చిన్నారి రాకకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అయ్యి ఎవరా అమ్మాయ్ అని చర్చలు మొదలయ్యాయి. రాజకీయ చర్చలకు అతీతంగా ఆ చిన్నారే హాట్టాపిక్గా మారడం విశేషం. ఆ వీడియోలో ఇటలీ ప్రధాని మెలోని రాగానే అధికారులకు, స్వాగత ప్రతినిధి బృంద సభ్యులకు అభివాదం చేశారు. ఆమె వెనుక నిశబ్దంగా ఉన్న గినెవ్రా జియాంబ్రూనె కెమెరాల ముందు సిగ్గుపడుతూ..తల్లి చెంత ఉండటం స్పష్టంగా కనిపిస్తుంది వీడియోలో. అయితే నెటిజన్లు నాయకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తూనే కుమార్తెను వెంటబెట్టుకుని అమ్మగా రెండూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నందుకు మెలోనిపై ప్రశంసలపై వర్షం కురిపించారు. తల్లిదండ్రులుగా మారిన ప్రపంచనాయకులంతా ఇలాంటి అనుభవాలనే ఎదుర్కొంటారు కదా అంటూ పోస్టులు పెట్టారు. కొందరు మాత్రం ఆ చిన్నారి చాలా ముద్దుగా ఉంది. ఆమెకు సురక్షితమైన ప్రదేశం ఏదో బాగా తెలుసు అని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు.Giorgia Meloni's daughter steals the spotlight by avoiding itItaly's PM's shy sidekick goes viral for hiding behind her mom as they arrive at the G7 summit in Geneva pic.twitter.com/n8gmg93Cfi— RT (@RT_com) June 17, 2026 (చదవండి: ఎలాంటి డైటింగ్ చేయకుండానే 9 కిలోలు..! ఆ నాలుగు రూల్స్ ..) -
ఎలాంటి డైటింగ్ చేయకుండానే 9 కిలోలు..! ఆ నాలుగు రూల్స్ ..
బరువు తగ్గడం అంటే స్ట్రిక్ట్ డైట్, కఠినతరమైన వ్యాయామాలు అనే భావిస్తారు. ఈ వెయిట్లాస్ జర్నీని భారం, అలసటతో కూడిన కష్టసాధ్యమైన సవాలుగా భావిస్తారు. దాంతో కొంత వరకు చేసి మధ్యలో స్వస్తి పలుకుతారు. ఫలితంగా అధిక బరువు తగ్గించుకోలేకపోతున్నాం అంటూ నిరాశనిస్ప్రుహలకు లోనవ్వుతుంటారు. ఆవిధంగా కంటే నిధానంగా శరీరం అలసటకు లోనవ్వకుండా మెరుగైన ఫలితాలు పొందాలంటే ఆ నాలుగు రూల్స్ ఫాలో అవ్వాల్సిందే అంటోంది కంటెంట్ క్రియేటర్ సుల్లివన్ డ్రేపర్. అదెలాగో ఆమె మాటల్లోనే సవివరంగా తెలుసుకుందామా..!.కంటెంట్ క్రియేటర్ సుల్లివన్ డ్రేపర్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో సులభంగా బరువు తగ్గడం ఎలాగో పంచుకున్నారు. బరువు తగ్గడం అంటే వీలైనంత తక్కువ తినడం, కాదు, అలసిపోయేంత వ్యాయామాలు చేయడం అస్సలు కాదని అంటోందామె. ఇక్కడ లక్ష్యం బరువు తగ్గడం ఒక్కటే కాదు..మొత్తం ఆరోగ్య శ్రేయస్సు అని గ్రహించమని చెబుతోంది. అందుకే సులభంగా ఇష్టపూర్వకంగా బరువు తగ్గమని పిలుపునిస్తోందామె. అలా చేసే..పొట్టిగా ఉండే తానే తొమ్మిదికేజీల వరకు తగ్గానని చెబుతోంది. తాను ఇది కఠినమైన డైటింగ్లు, తీవ్రతతో కూడిన వర్కౌట్లు చేయకుండానే సాధించానని చెబుతోంది. అందుకోసం ఈ నాలుగు రూల్స్ని పాటించానని వీడియోలో తెలిపారువెయిట్ ట్రైనింగ్కు ప్రాధాన్యత ఇవ్వడంసుల్లివన్ ప్రకారం, వర్కౌట్ తర్వాత అలసిపోతున్నాననే భావనను వెంబడించడం మానేసి, స్ట్రెంగ్త్ ట్రైనింగ్పై దృష్టి పెట్టడం ప్రారంభించినప్పుడే అతిపెద్ద మార్పు వచ్చింది. "కండరాలను పెంచుకోవడం తోటే ఆ టోన్డ్ లుక్ను ఇస్తుందని ఆమె వివరించారు.కండరాలను కాపాడుకోవడం వల్ల కాలక్రమేణా సన్నగా ఉండటం సులభం అవుతుందని, ఎందుకంటే కండర ద్రవ్యరాశికి మద్దతు ఇవ్వడానికి శరీరం ఎక్కువ శక్తిని ఉపయోగిస్తుందని ఆ కంటెంట్ క్రియేటర్ తెలిపారు. ప్రతిరోజూ వీలైనన్ని ఎక్కువ కేలరీలను బర్న్ చేయడానికి ప్రయత్నించే బదులు, ఆమె బలంగా మారడంపై దృష్టి పెట్టారు.కేలరీల లోటును ఆపడంఆమె పోస్ట్లోని అత్యంత ఆసక్తికరమైన అంశాలలో ఒకటి ఆమె ఆహారం తీసుకునే విధానం. తాను కేలరీ లోటుని ఇష్టపడనన్నారు. ఎక్కువ కాలం కేలరీల లోటులో ఉండటం వల్ల ప్రజలు అలసిపోయినట్లు అనిపించి, వారి ఫలితాలను నిలబెట్టుకోవడం కష్టతరం అవుతుందని అంటోంది. అందుకే తాను శరీరంలోని కొవ్వును కోల్పోయిన తర్వాత, ఆమె రివర్స్ డైటింగ్ విధానాన్ని అనుసరించానని, ప్రోటీన్ వినియోగాన్ని ఎక్కువగా ఉంచుతూ నెమ్మదిగా తన కేలరీల తీసుకోవడాన్ని పెంచుతానని చెప్పారు.వాకింగ్..తీవ్రమైన వర్కౌట్లు తరచుగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నప్పటికీ, సుల్లివన్ సాధారణ కదలికల ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. రోజువారీ నడకలు,తక్కువ-తీవ్రత గల కార్డియో తన శక్తి స్థాయిలను పెంచడానికి, ఆకలిని నియంత్రించడానికి, మొత్తం ఫిట్నెస్కు మద్దతు ఇవ్వడానికి సహాయపడతాయని అన్నారు. ప్రతిరోజూ కఠినమైన వర్కౌట్ దినచర్యలపై ఆధారపడకుండా, ఆమె నడకను ఒక సాధారణ అలవాటుగా మార్చుకున్నారు.తరుచుగా వెయిట్ చెక్ చేయొద్దు..చాలా మంది వెయిట్ మిషన్పై చిన్న మార్పులను చూసి వెంటనే తాము కొవ్వు పెరిగామని అనుకుంటారు. బరువులో హెచ్చుతగ్గులు ఉంటాయి. అంతమాత్రాన కొవ్వు పెరగడం కాదని అంటున్నారామె. ఆమె ఇప్పుడు ఒక ఖచ్చితమైన సంఖ్యపై దృష్టి పెట్టడానికి బదులుగా, ఆరోగ్యకరంగా బరువు తగ్గడమే తన లక్ష్యంగా నిర్ణయించుకున్నాని చెప్పారామె.ఇక్కడ సుల్లివన్ డేపర్ ప్రయాణం చిన్న, నిలకడైన అలవాట్లు దీర్ఘకాలంలో బరువు నిర్వహణను ఎంత సులభతరం చేస్తాయో తెలియజేస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం ట్రై చేసి..స్మార్ట్గా మారే ప్రయత్నం చేయండి మరి.. View this post on Instagram A post shared by sullivan draper (@sullivan.draper)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: పీసీఓఎస్తో జస్ట్ రెండు నెలల్లో తొమ్మిది కిలోలు..! కానీ ఆ ఐదు పొరపాట్లు..) -
కెనడా, ఖతార్ మ్యాచ్.. ఆ ఒక్కడి కోసం తన్నుకున్న ఆటగాళ్లు!
ఫిఫా ప్రపంచకప్లో కెనడా, ఖతార్ మ్యాచ్ ముగిసిన తర్వాత ఇరుజట్ల ఆటగాళ్లు తన్నుకోవడం చర్చనీయాంశమైంది. కెనడా 6-0తో ఖతార్పై ఘన విజయాన్ని అందుకుంది. అయితే మ్యాచ్లో కెనడా విజయం సాధించినప్పటికీ ఖతార్ ఆటగాళ్ల వైఖరిని తప్పుబట్టారు. అందుకే ఒక్కసారి మ్యాచ్లో ఫైనల్ విజిల్ రాగానే కెనడా ఆటగాళ్లు ఖతార్ జట్టువైపు దూసుకొచ్చారు. ఇరుజట్ల ఆటగాళ్లు ఒకరిపై ఒకరు దాడి చేసుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో మైదానంలోకి వచ్చిన సెక్యూరిటీ ఇరుజట్లను వేరు చేసి అక్కడినుంచి పంపించేశారు. ఈ సమయంలో మైదానంలో గందరగోళం నెలకొంది. ఈ చర్యను ఇరుజట్ల కోచ్లు తప్పుబట్టారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. మరి కెనడా ఆటగాళ్ల కోపానికి కారణం ఏంటా అని ఆరా తీస్తే.. ఖతార్ ఆటగాళ్ల తప్పిదాల వల్ల కెనడా మిడ్ఫీల్డర్ ఇస్మాయిల్ కోనె కాలు విరిగింది. నడవడానికి కూడా ఇబ్బంది పడడంతో అతడిని స్ట్రెచర్పై తీసుకెళ్లాల్సి వచ్చింది. అయితే ఇస్మాయిల్ కోనె కాలు విరగడానికి ప్రధాన కారణం ఖతార్ ఆటగాడు అస్సిమ్ మదిబో. బంతిని పాస్ అందించడానికి ఇస్మాయిల్ ప్రయత్నిస్తున్న సమయంలో అతడికి అడ్డువచ్చిన అస్సిమ్ కావాలనే తను కాలును వెనుక నుంచి అడ్డుపెట్టాడు. దీంతో కోనె కాలు బోన్ విరిగిపోయింది. ఈ దుశ్చర్యతో రిఫరీ ఖతార్ ఆటగాడికి రెడ్కార్డ్ జారీ చేశాడు. మ్యాచ్ విషయానికొస్తే ఆతిథ్య కెనడా.. ఖతార్పై పూర్తి ఆధిపత్యం కనబరిచింది. జొనాథన్ డేవిడ్ హ్యాట్రిక్ గోల్స్తో కెనడా విజయంలో కీలకపాత్ర పోషించాడు.Tempers flare between Canada and Qatar after the final whistle, leading to a player scuffle to conclude a dramatic match LIVE UPDATES: https://t.co/Hb9FJ14WLh pic.twitter.com/0z5Vqmf50Z— CTV News (@CTVNews) June 19, 2026 -
బుడతడి బిగ్ షాట్.. అమ్మ ఐఫోన్ జలసమాధి
ఈ రోజుల్లో తల్లిదండ్రులు పిల్లలతో గడిపే సమయం కంటే ఫోన్లతో గడిపే సమయమే ఎక్కువైందని చాలామంది అంటుంటారు. అయితే ఆ మాటను ఓ చిన్నారి చాలా సీరియస్గా తీసుకున్నాడేమో! తన తల్లి చేతిలో ఉన్న ఖరీదైన ఐఫోన్ను ఏకంగా సరస్సులోకి విసిరేసి "డిజిటల్ డిటాక్స్"కు శ్రీకారం చుట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియరాలేదు. వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఓ మహిళ తన కుమారుడితో కలిసి బోట్ రైడ్కు వెళ్లింది. ప్రకృతి అందాలను ఆస్వాదించడం, కొడుకుతో సరదాగా గడపడం పక్కన పెట్టి, ఆ క్షణాలను ఐఫోన్లో బంధించడంలో బిజీగా ఉంది. ఇదంతా గమనించిన చిన్నారి... "అమ్మకు ఈ ఫోన్నే ఎక్కువ ఇష్టమా? లేక నేనా?" అన్నట్లు ఒక్కసారిగా ఫోన్ లాక్కొని నేరుగా సరస్సులోకి విసిరేశాడు.ఫోన్ నీటిలో పడిపోయిన వెంటనే తల్లి ముఖంలో కనిపించిన షాక్ చూస్తే, అది సాధారణ ఫోన్ కాదని, బహుశా ఈఎంఐలు ఇంకా పూర్తికాని ఐఫోన్ అయి ఉంటుందని నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు. "బాలుడు ఏ తప్పూ చేయలేదు.. కుటుంబ సమయాన్ని కాపాడాడు". "ఆ చిన్నోడికి పర్యావరణ అవార్డు ఇవ్వాలి... కనీసం రెండు గంటలు అయినా అమ్మ సోషల్ మీడియాకు దూరమైంది", "స్టీవ్ జాబ్స్ ఉంటే ఈ వీడియో చూసి ఏడ్చేవాడు" అంటూ కామెంట్ల వర్షం కురుస్తోంది.Kid throws his mom’s iPhone into the lake during a boat ride 😂 pic.twitter.com/HJs4z7F6lt— Duniya Ke Kalesh (@yadav_army11902) June 18, 2026మరికొందరు అయితే ఆ బాలుడిని "లేక్ సెక్యూరిటీ ఫోర్స్" చీఫ్గా నియమించాలని సూచిస్తున్నారు. "బోట్లో అందరూ ప్రకృతిని చూస్తుంటే, ఒక్క అమ్మ మాత్రమే స్క్రీన్ను చూస్తోంది. అందుకే అతను కఠిన నిర్ణయం తీసుకున్నాడు" అని సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. అయితే, ఈ ఘటన తర్వాత ఆ చిన్నారికి ఐస్క్రీమ్ దొరికిందో లేదో తెలియదు గానీ, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులు మాత్రం దొరికిపోయారు. కానీ ఆ తల్లికి మాత్రం ఇప్పటికీ సరస్సు వైపు చూస్తే నీళ్లలో మునిగిపోయిన iPhone, అందులో ఉన్న ఫోటోలు, కాంటాక్టులు గుర్తుకు వస్తుండొచ్చు.


