breaking news
viral video
-
అందువల్లే భారత్ చాలా స్పెషల్..!
భారత్లో నివశించిన చాలామంది విదేశీయలు భారత్పై మనుసు పారేసుకుని ఇక్కడే ఉండిపోవడమే కాదు..తమ అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. ఆ కారణంగానే ఇక్కడే శాశ్వత నివాసం ఏర్పరుచుచున్నామని కూడా చెప్పారు చాలామంది. అయితే ఇప్పుడు ఆ జాబితాలోకి ఈ ఫ్రెంచ్ మహిళ కూడా చేరిపోయింది. భారత్ని ప్రత్యేకంగా చూపే విషయాలను వివరించి అందరి మనుసులు దోచుకుంది. మన దేశ గొప్ప తనాన్ని, ఔన్యత్యాన్ని రెండు మాటల్లో చాలా చక్కగా వివరించారామె. ఇంతకీ ఆమె ఏమన్నారంటే..భారతదేశంలో నివసిస్తున్న ఓ ఫ్రెంచ్ మహిళ షేర్ చేసిన పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవ్వడమే గాక అందర్నీ అమితంగా ఆకర్షించింది. తన స్వదేశమైన ఫ్రాన్సుతో భారత్ని పోలుస్తూ..ఆ విషయాల్లో ఫ్రాన్స్ కంటే భారత్ ముందు ఉందని అన్నారామె. అలాగే భారత్ని ప్రత్యేకంగా చూపించే అంశాలను సైతం ప్రస్తావించారామె. ఈ మూడు ఏంటంటే..బలమైన సమాజ భావం, దేశ సహజ సౌందర్యం, చేతితో తయారు చేసిన వస్త్రాలు. అంతేగాదు తన స్నేహితులు తరచుగా భారత్లోని సమాజ భావం గురించి చర్చిస్తారని, వాటి అంచనాల ఒత్తిడి అధికంగా ఉంటుందని వాళ్లంతా అంటుంటారని అన్నారామె. అయితే తాను దీన్ని పూర్తి చేసుకోలేనని, తాను అలా ఉండేలనని కూడా ఒప్పుకున్నారామె. అయితే ఇక్కడ ప్రజలు ఒకరినొకరు ఆదరించుకుంటూ.. సహాయసహకారాలు అందించుకోవడం చూస్తుంటే..చాలా సంతోషంగా అనిపిస్తుందని అందామె. ఇది కుందేళ్లకు ఆహారం ఇచ్చేదాంతో పోల్చారామె. అదే సమయంలో తన స్వదేశం ఫ్రాన్సుకి కూడా దాని స్వంత ప్రత్యేక ఆకర్షణలు ఉన్నాయన్నారామె. అలాగే భారత్లో ప్రతి వాతావరణాన్ని ఆస్వాదించొచ్చు. ఇక ఇక్కడ దుస్తులు ఎంతగానో ఆకట్టుకుంటాయని అంటోంది. ఎంబ్రాయిడరీ, పూసల పనిలో ఉన్న నైపుణ్యం తనను ఆశ్చర్యపరుస్తాయిని అన్నారామె. తనకు ఇక్కడ కుర్తీలు కూడా అద్బుతంగా కనిపిస్తాయిని, అవి ఫ్రాన్స్లో హైఫ్యాషన్గా పరిగణిస్తారని, ఖరీదు కూడా ఎక్కువేనని తెలిపింది. చివరగా పోస్ట్లో భారత్లో బలాలుగా భావించిన వాటిని గురించి కూడా హైలెట్ చేశారామె. నెటిజన్లను ఈ పోస్ట్ అమితంగా ఆకర్షించడమే గాక, మా దేశంలో ఈవిషయాలను ఇష్టపడటం చాలా బాగుంది అంటు పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Freldaway (@freldaway) (చదవండి: పూలమ్మే అమ్మాయి చెప్పిన గొప్ప జీవిత పాఠం..!) -
పూలమ్మే అమ్మాయి చెప్పిన గొప్ప జీవిత పాఠం..!
కొన్ని చిన్న సంఘటలను మనల్ని ఎంతగానో కదలించి..నిశబ్దమైన జీవిత పాఠాన్ని నేర్పిస్తాయి. ఆ క్షణంలో మనకు నచ్చనిది కూడా ఎందుకనో ఇష్టంగా మారుతుంది. అది మనకు అపురూపమైన క్షణంగా మారుతుంది. చుట్టూ పరిస్థితులు ఎంత హృద్యంగా ఉన్నా.. వాళ్ల ముఖాల్లోని నవ్వు మనకెంతో నేర్పిస్తుంది. అందుకు ఉదాహరణ ఈ పూలు అమ్మే అమ్మాయి. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. ఆ వీడియోలో పూలు అమ్మే అమ్మాయికి, ఒక యువతికి జరుగుతన్న చక్కటి సంభాషణ ఇది. మహెక్ షా అనే అమ్మాయి తనకెదురైన అనుభవాన్ని నెటిజన్లతో షేర్ చేసుకుంది. తనకు సాధారణంగా పూలంటే ఇష్టముండదని, అవి ఒక్కరోజులోనే వాడిపోతాయనే బాధతోనే ఇష్టపడని అన్నారామె. అందుకే తాను పూలకు చాలా చాలా దూరంగా ఉంటానని అన్నారామె. అయితే అదేం తెలియని ఆ పూలమ్మే అమ్మాయి..ఓ పువ్వుని తీసుకొచ్చి నేరుగా ఒళ్లో పెట్టేసింది. తనకు నచ్చవని చెప్పిన పర్లేదు..ఉచితంగానైనా తీసుకోండని అభ్యర్థించింది. చివరికి తాను ధర ఎంత అని అడగగానే..తోచింది ఇమ్మని కోరింది. దాంతో కొంత మొత్తం చెల్లించాను. దాంతో ఆమె ఎంతో సంతోషంతో వెనుదిరిగింది. అయితే ఆమె ఎంతో ఆప్యాయంగా నవ్వుతూ పూలు తన ఒళ్లోబెట్టిన విధానం..తనను ఆ క్షణం పూలను ఇష్టపడేలా చేసింది. పైగా ఎంతో అప్యాయంగా నవ్వతూ మాట్లాడిన ఆ అమ్మాయిని చూసి.సదా ఉల్లాసభరితంగా ఉండటం ఎలాగో తెలిసిందంటూ.. అందుకు సంబంధించిన వీడియోని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. అంతేగాదు షా ఆ వీడియోకి..ప్రపంచమంతా వ్యతిరేకంగా ఉన్న మనం మాత్రం దయగానే ప్రవర్తించాలి. అలా ఉండాటానికి మించి గొప్ప నైపుణ్యం మరోకటి లేదంటూ క్యాప్షన్ జోడించి మరి పోస్ట్ చేశారు. నెటిజన్లు..ఈ ఘటన దయకు చిరునామా, అలాగే..ఏ పనిచేసినా..నవ్వుతూ చేస్తే మనంత ధనవంతుడు మరొకరు ఉండరు అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Mahek shah (@trulymicky) (చదవండి: 50 తర్వాత ఇంట్లోనే చేసే వెయిట్లాస్ వ్యాయామాలు..!) -
ఫోన్ బ్యాటరీతో ఇలా చేయొద్దు సుమీ..! పాపం ఆ యువకుడు..
సాధారణంగా ఏ వస్తువైనా కొందరికి నోట్లోకి వెళ్లిపోవాల్సిందే. అంటే కొంతమందికి అదో అలవాటులా ఏదోక వస్తువుని నోట్లో పెట్టుకుని నములుతున్నట్లుగా చేస్తుంటారు. అయితే అది ప్రమాదకరమైనదా లేద పెట్టకూడనిదా అని ఉండదు. ఏదైతేనేం..అలా నోటిలో పెట్టి నమలాల్సిందే. ఇక్కడొక యువకుడు అలాంటి పాడు అలవాటు కారణంగానే తీవ్ర గాయలపాయాలయ్యాడు. అసలేం జరిగిందంటే..ఈ ఘటన చూశాక ఎవ్వరూ ఇలాంటి సాహసం చేసే యత్నమైతే చేయరని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడొక మొబైల్ షాప్లో యువకుడు కూర్చొని మొబైల్ ఫోన్ బ్యాటరిని నోటిలో పెట్టుకుని నమిలే ప్రయత్నం చేశాడు. అది లిథియం బ్యాటరీ కావడంతో.. ఇలా గట్టిగా నమిలాడో లేదో..అంతే ఒక్కసారిగా పెద్దశబ్దంతో కూడిన మంటలు ఎగిశాయి. అదృష్టవశాత్తు ఆ అబ్బాయికి ఏం కాలేదు. కొద్దిపాటి గాయాలతో బయటపడ్డాడు. సమీపంలోని వ్యక్తులు అతడిని తక్షణమే ఆస్పత్రికి తరలించారు. ఇక ఆ మండుతున్న బ్యాటరీని అక్కడున్న మరో వ్యక్తి కాస్త ధైర్యం చేసి బయటకు విసిరే ప్రయత్నం చేశాడు. దాంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. బ్యాటరీలను ఇలా నోట్లో పెట్టుకోకూడదని, అందులోనూ లిథియం అధిక శక్తిని నిల్వ చేస్తుందని దాంతో అస్సలు ఆడుకోవద్దని హెచ్చరిస్తూ పోస్టులు పెట్టారు.Shocking incident inside a mobile shop when a boy began chewing on a Lithium Phone Battery. Within seconds, the battery exploded, leaving him seriously injured. The injured boy was rushed for medical treatment pic.twitter.com/03MeyXz28p— Rosy (@rose_k01) February 5, 2026 (చదవండి: తస్మాత్ జాగ్రత్త..! ఎల్లప్పుడూ.."మంచి" ఆరోగ్యానికి ముప్పు..!) -
బైకర్పై దూకి.. లాక్కెల్లి చంపిన పెద్దపులి
అరుణాచల్ ప్రదేశ్లో అరుదైన విషాదం చోటుచేసుకుంది. బైక్పై వెళ్తున్న ఓ హెడ్ కానిస్టేబుల్పై పెద్దపులి దాడి చేసి ప్రాణం తీసింది. అయితే ఈ ఘటన జరిగిన రెండ్రోజులకే ఓ పులి అనూహ్యంగా తుపాకీ తూటా గాయంతో చనిపోయిన స్థితిలో కనిపించింది. దీంతో ఇది కానిస్టేబుల్ మరణానికి ప్రతీకార దాడినా? లేదంటే వేటగాళ్ల పనా? అనే అనుమానాలు తలెత్తాయి. అరుణాచల్ ప్రదేశ్ పోలీస్ విభాగంలో చిక్సెంగ్ మాన్పుంగ్ రేడియో ఆపరేటర్గా విధులు నిర్వహించాడు. లోయర్ దిబాంగ్ వ్యాలీ జిల్లా మయోడియాలో ఆయన డ్యూటీ నిర్వహించేవాడు. ఫిబ్రవరి 3వ తేదీ సాయంత్రం అనిని నుంచి తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో.. రోయింగ్ రహదారిపై ఘోరం జరిగింది. బైక్పై వెళ్తున్న టైంలో ఓ పెద్దపులి హఠాత్తుగా ఆయనపై దాడి చేసింది. ఆ దారిన వెళ్లే వాహనదారులు.. రోడ్డు పక్కన బైక్ పడి ఉండడం చూసి యాక్సిడెంట్ కావొచ్చని పట్టించుకోకుండా వెళ్లిపోయారు. తెల్లవారి అటుగా వెళ్లిన వాళ్లకు.. పక్కన పొదల్లో రక్తపు మడుగులో ఆయన మృతదేహం కనిపించింది. వాళ్లు పోలీసులకు సమాచారం అందించగా.. అది పెద్దపులి చేసిన దాడిగా నిర్ధారించుకున్నారు. చిక్సెంగ్ మరణంతో పోలీస్ శాఖలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన తర్వాత అటవీశాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఓ ఆడపులి మూడు కూనలతో ఆ ప్రాంతంలో సంచరిస్తుందని గుర్తించారు. కూనల్ని రక్షించుకునే క్రమంలోనే అది దాడి చేసి చంపి ఉంటుందని భావించారు. అరుణాచల్ ప్రదేశ్లో మనుషులపై పులులు దాడులు చేయడం అత్యంత అరుదు. దీంతో స్థానిక ప్రజల్లో భయాందోళనలను రేకెత్తించింది. A female tiger was found unalive with a gunshot injury near Mayudia in Arunachal Pradesh’s Lower Dibang Valley, just two days after a police head constable was attacked and lost his life on the Roing–Anini road. Authorities are probing who shot the tiger, why it was harmed and… pic.twitter.com/EIQWPpSf7W— The Sentinel (@Sentinel_Assam) February 6, 2026 ఈ ఘటనతో మయోడియా ప్రాంతంలో రాత్రి పూట ద్విచక్ర ప్రయాణాలపై నిషేధం విధించారు. అయితే.. రెండు రోజుల తర్వాత అదే ప్రాంతంలో ఒక పులి మృతదేహం తుపాకీ గాయాలతో కనుగొన్నారు. ఇది ప్రతీకార చర్య కావచ్చని అనుమానం వ్యక్తమవుతోంది. అదే సమయంలో వేటగాళ్ల దాడి అయ్యి ఉండొచ్చన్న కోణంలోనూ దర్యాప్తు జరుపుతున్నారు.ఈ మధ్యకాలంలో మయోడియా–మెహావో వన్యప్రాణి సంరక్షణ ప్రాంతం పరిసరాల్లో పులుల సంచారం పెరిగిందని అధికారులు చెబుతున్నారు. అయితే.. చిక్సెంగ్ మాన్పుంగ్ను చంపింది చనిపోయిన పులినేనా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు.. సోషల్ మీడియాలో రోడ్డు మీద పులులు రాత్రి పూట సంచరించడం, వాహనాలను వెంబడించడం వైరల్ అవుతోంది. బైకర్ల మీదకు పులి దూకిన వీడియోను చిక్సెంగ్ మాన్పుంగ్ దాడి వీడియో అంటూ వైరల్ చేస్తున్నారు. అటుగా ఓ వాహనంలో వెళ్లే వాళ్లు ఆ వీడియో తీసినట్లు ప్రచారం చేస్తున్నారు. అయితే అధికారులు ఇవేం అధికారిక వీడియోలు అని చెప్పడం లేదు. వైరల్ అవుతున్న పులి వీడియోలు ఏఐవి కావని.. వేరే సందర్భాల్లో తీసినవని తెలుస్తోంది. ⚠️ Stay Alert, Stay Alive 🐅Suspected tiger attack claims life ofpolice constable in Arunachal Pradesh. pic.twitter.com/7Dg4DA0CaV— अक्स (@Vickyaarya007_) February 6, 2026 -
ర్యాపిడో డ్రైవర్కు షాకిచ్చిన మహిళ.. ఇదో వింత కథ!
ర్యాపిడో.. వాడుకున్న వాళ్లకి వాడుకున్నంత అంటే ఇదేనేమో. ఇప్పటి వరకు మనుషుల డ్రాపింగ్, పికప్, పార్సిల్, ఫుడ్ సర్వీసులకే బైక్లను బుక్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. కానీ, తాజాగా ఓ మహిళ చేసిన పనికి ర్యాపిడో బైక్ డ్రైవర్ ఖంగుతిన్నాడు. చెత్త బాక్స్ను ఇచ్చి.. పడేయమని చెప్పడం వివాదానికి దారి తీసింది. దీంతో, సదరు మహిళపై నెటిజన్లు మండిపడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఈ ఘటనకు సంబంధించి కరణ్ నిషాద్ అనే యువకుడు ఈ వింత అనుభవాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పంచుకున్నాడు. వీడియో ప్రకారం..‘ర్యాపిడో పోర్టర్ సర్వీస్ ద్వారా ఒక మహిళ బైక్ బుక్ చేసింది. అనంతరం, సదరు మహిళ వద్దకు వచ్చిన డెలివరీ బాయ్కు ఒక సీలు చేసిన కార్డ్బోర్డ్ బాక్స్ను అప్పగించింది. లోపల వస్తువులు ఉన్నాయని భావించిన కరణ్.. పేమెంట్ గురించి అడిగాడు. ఇంతలో పేమెంట్ ఆన్లైన్లో చెల్లించినట్లు ఆమె సమాధానమిచ్చింది. అనంతరం, అతను ఆ పార్శిల్ను తీసుకుని డ్రాప్ లొకేషన్కు బయలుదేరాడు.తీరా లోకేషన్కు చేరుకోగానే.. అక్కడ ఎవరూ కనిపించలేదు. అక్కడంగా నిర్మానుష్యంగా చెత్తా చెదారాలతో నిండిపోయి ఉంది. ఒక పెద్ద చెత్త కుప్ప మాత్రమే ఉంది. దీంతో, ఎవరికి పార్సిల్ ఇవ్వాలో అర్థం కాక అతను వెంటనే సదరు మహిళకు ఫోన్ చేశాడు. ‘మేడమ్, ఇక్కడ ఎవరూ లేరు.. ఈ ప్యాకెట్ ఎవరికి అందజేయాలి?’ అని ప్రశ్నించాడు. దానికి ఆమె ఇచ్చిన సమాధానం విని అతను షాక్కు గురయ్యాడు. ‘అందులో ఉన్నదంతా చెత్తే.. అక్కడ పారేయండి’ అని ఆమె చాలా నిర్లక్ష్యంగా బదులిచ్చింది. ఆమె మాటలు విన్న కరణ్ ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. మనం ఏ కాలంలో ఉన్నాం? ఇప్పుడు ఇతరుల ఇంటి చెత్తను కూడా మేమే డెలివరీ చేయాలా? అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. View this post on Instagram A post shared by Karan Nishad (@karannishadd1)దీంతో, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. డెలివరీ యాప్లను ఇలాంటి పనులకు వాడటం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కొందరు దీనిపై ఫన్నీ కామెంట్స్ చేస్తుండగా.. మరికొందరు మాత్రం మండిపడుతున్నారు. కష్టపడి పని చేసే డెలివరీ భాగస్వాములను ఇలా తక్కువ చేసి చూడటం కరెక్ట్ కాదని కామెంట్స్ చేస్తున్నారు. కనీస మర్యాద ఉందా? అని ప్రశ్నిస్తున్నారు. అయితే, ఈ ఘటన ఎక్కడ జరిగింది అనే విషయం మాత్రం తెలియరాలేదు. -
ప్లీజ్ కూల్డ్రింక్స్కి దూరంగా ఉండండి..!
శీతల పానీయాలు తాగొద్దని వైద్యులు పదేపదే సూచిస్తుంటారు. ఈ కార్బోనేటెడ్ డ్రింక్స్ ఫ్యాటీ లివర్, కిడ్నీ సంబంధిత అనారోగాల బారిన పడేలా చేస్తుందని ఆరోగ్య నిపుణుల సదా హెచ్చరిస్తుంటారు. అయినాసరే ఏం కాదులే అంటూ తేలిగ్గా కొట్టిపారేస్తూ..తాగేస్తుంటారు చాలామంది. అయితే అది ఎలా ఆరోగ్యాన్ని సమస్యల కోరల్లో చిక్కుకునేలా చేస్తోంది అస్సలు గ్రహించం అంటూ ఇక్కడొక వ్యక్తి కన్నీరుమున్నీరు విలపిస్తున్న కథ వింటే కచ్చితంగా విస్తుపోతారు. అంతేగాదు ఈ కూల్డ్రింక్స్ తాగాలా వద్దా అనే సందేహం కచ్చితంగా ఎదురవ్వుతుంది. ఎందుకంటే..నెట్టింట వైరల్ అవ్వుతున్న ఓ వీడియో అందర్నీ ఆలోచింపచేశాలా ఆకర్షిస్తోంది. ఆ వీడియోలో ఓ వ్యక్తి శీతల పానీయాలు తాగడం మానేయండి అంటూ వేడుకుంటున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. తన తముమ్మడు అలాంటి పానీయాలు తాగే ఆరోగ్యం పాడుచేసుకున్నాడంటూ భావోద్వేగం మాట్లాడటం చూడొచ్చు. అతడి ఆరోగ్యం దారుణంగా పాడైందని, ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయని తెలిపాడు. దాంతో తన కుటుంబం తీవ్ర ఇబ్బందులో పడిందని పేర్కొన్నాడు. తన తమ్ముడిలా ఎవ్వరూ ఆరోగ్యం పాడుచేసుకోకండి అని కోరడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. అంతేగాదు ఈ శీతల పానీయాన్ని విషంగా పేర్కొన్నాడు. దీని కారణంగా తన సోదరుడు జీవితం పాడైందంటూ కన్నీరుమున్నీరు విలపించాడు ఆ వ్యక్తి వీడియోలో. చాలామంది నెటిజన్లు అవును ఇది మంచిది కాదని తెలిసి విషాన్ని తాగుతున్నామని అంగీకరించారు. ఈ ఘటన అందరికి కనువిప్పు అని పేర్కొంటూ కొందరు పోస్టులు పెట్టగా, మరికొందరు మాత్రం అతను రోజు కూల్డ్రింక్స్ తాగుతున్నాడని తెలిసినప్పుడూ ఎందుకు అదుపుచేయలేకపోయారు అని విమర్శిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Updated Bharat.in™ | Latest News (@updatedbharat.in) (చదవండి: 'బరువు తగ్గించే జైలు'..! ఏకంగా మిలటరీ రేంజ్ శిక్షణ..12 గంటల వ్యాయామాలు..) -
కడపలో ప్రాణం తీసిన రీల్స్ పిచ్చి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: సోషల్ మీడియాలో లైకులు, షేరులు.. పాపులారిటీ కోసం కొందరు చేసే ప్రయత్నాలు విసుగు పుట్టిస్తుంటాయి. ఈ క్రమంలో ఓ యువకుడు రీల్స్ పిచ్చితో ప్రాణాలు పొగొట్టుకున్నాడు. జిల్లా కేంద్రంలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. ముబారక్(20) తన స్నేహితుడితో కలిసి బైక్ స్టంట్ చేస్తూ రీల్స్ చేస్తుంటాడు. వాటికి కొద్ది కొదద్దిగా వ్యూస్ రావడం ప్రారంభించింది. దీంతో ఎక్కువ వ్యూస్ రావాలనే ఆశతో మితిమీరి స్టంట్స్ చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో.. బైక్పై విన్యాసాలు చేస్తూ అదుపు తప్పి పడిపోయాడు. ఈ ఘటనలో ముబారక్ అక్కడికక్కడే మరణించాడు. వెనకాల కూర్చున్న మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో.. మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తరలించారు. ఈ ఘటనలో స్కూటీ తక్కుతుక్కుగా ధ్వంసం కావడం ప్రమాద తీవ్రతకు అద్దం పడుతోంది. -
మళ్లీ పెళ్లి చేసుకుంటారా..? వృద్ధ మహిళలు ఏమన్నారో తెలుసా..!
"పెళ్లి" అంటే నూరేళ్ల పంట..ఎన్నో జన్మల బంధం అని చెబుతుంటారు. కానీ ఇప్పుడు అది అబద్దమా అనిపిస్తుంది. చాలామంది ఆ అనుభవాన్ని గడించిన వివాహిత మహిళలు ఆ పేరు ఎత్తితేనే..హడలిపోతున్నారు.,విముఖత చూపిస్తున్నారు. సరదాకైనా..మళ్లీ వయసు వెనక్కి వెళ్లితే.. పెళ్లి చేసుకుంటారా అని మాటవరసకు అడిగితేనే..బాబోయ్ అన్నట్లుగా ఇస్తున్న సమాధానాల తీరు చూస్తే..పెళ్లీడుకి వచ్చిన వాళ్లు సైతం చేసుకోవాలా? వద్దా? అనేలా ఉన్నాయి వారి మాటలు. బాలీవుడ్ నటి, ట్రావెల్ వ్లాగర్ షెహనాజ్ తన పర్యాటక అనుభవాలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంటారామె. కంటెంట్ క్రియేటర్గా ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్ చేస్తుంటారామె. అలానే ఈసారి పెళ్లై ఎన్నో వసంతాలు గడిచిపోయినా.. వృద్ద మహిళలను ఆటపట్టించే కొంటే ప్రశ్నతో పలకరించారు. అయితే వాళ్లందరి సమాధానాలు చూసి షెహనాజ్ విస్తుపోయింది. ఇంతకీ ఆ వివాహిత వృద్ధ మహిళను ఆమె ఏం అడిగారంటే..ఈ రోజు గనుక మీ ఏజ్ వెనక్కి వచ్చి..20 ఏళ్లు అయితే "మళ్లీ పెళ్లి చేసుకుంటారా"? అని ప్రశ్నించింది. అందుకు ఒకరేమో..ఒక్కసారి చాలు..ఇంకోసారి అస్సలు వద్దు అని చెప్పగా, మరొకరు పైళ్లిపై అంతగా ఆసక్తి లేదని, అది బానిసత్వానికి మరోపేరు అని తేల్చి చెప్పేశారు. ఇంకొందరు..మంచి పాఠం నేర్చుకోవాలంటే తప్పకుండా పెళ్లిచేసుకోవాలని అన్నారు. దానికి షెహనాజ్ ఏ పాఠం అని కుతుహలంగా ప్రశ్నించగా..అచ్చం కభీ ఖుషీ కభీ గమ్ మూవీలా కొన్ని సార్లు సంతోషం, కొన్నిసార్లు దుఃఖం అని చెప్పారు. చాలామటుకు పెళ్లిని అదొక సర్దుబాటుగా అభివర్ణించారు. ఒకరు మాత్రం ఆర్మీ ఆఫీసర్ని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతాను, ఎందుకంటే..జీవితంపై పూర్తి అవగాహన ఉంటుందని అన్నారామె. అయితే ఆ సీనియర్ మహిళలంతా పెళ్లిపై అలా ఎందుకు చెప్పారంటే..వాళ్ల కాలంలో చాలామంది మహిళలు ఉద్యోగాలు చేయకుండా గృహిణులుగా జీవితం గడిపామని, ఇంట్లో చాలా బాధ్యతలు ఉండేవని చెప్పడం విశేషం. ఆ సమాధానాలన్ని విని షెహనాజ్ చమత్కారంగా అందుకే తాను పెళ్లిచేసుకోలేదని అంది. వెంటనే అక్కడున్న మహిళ నవ్వుతూ..ఆ..! అది సరైన నిర్ణయం అని సమర్థించడం విశేషం.(చదవండి: సేవలో అతడికి సాటిలేరెవ్వరూ..! చేసేది డెలివరీ బాయ్ జాబ్ కానీ..) -
చిల్లీ పెప్పర్స్ స్పా..! వెరైటీ థెరపీలు..
పర్యాటన అనగానే..చాలామంది స్కైడైవింగ్, జలపాతాలు, ప్రకృతి అందాల కోసం అన్వేషిస్తుంటారు. మరికొందరు మానసిక ప్రశాంతతను అందించే ధ్యానానికి సంబంధిన పర్యాట ప్రదేశాలను వెతుకుతారు. ఇంకొందరు ఆరోగ్యం కోసమే..సేద తీరే థెరపీలందించే స్పాల కోసం సర్చ్ చేస్తుంటారు. అలాంటి వారి కోసం ఈ ప్రత్యేక స్పాలు. ఇంతవరకు చూడని, అనుభవం పొందని వెరైటీ స్పాలు. ఇవి బాడీకి విశ్రాంతినిచ్చే థెరపీల్లాంటి స్పాలు. ముఖ్యంగా చలికాలంలో సందర్శనకు బెస్ట్ స్పాలుగా పేర్కొనవచ్చు. ఎక్కడున్నాయంటే..అలాంటి ప్రత్యేక స్పాల కోసం చైనాలోని హార్బిన్ నగరంలోకి వాలిపోవాల్సిందే. ఇక్కడ ఉండే ప్రతి స్పా ఓ అద్భుతం. ఇలాంటి విచిత్రమైనవి ఎక్కడ ఉండవేమో అన్నంతగా ఆకర్షణగా ఉంటాయి ఈ స్పాలు. ఘాటెక్కించే స్పా చిల్లీ పెప్పర్స్ స్పా. మొత్తం ఎర్రటి పచ్చిమిర్చితో ఉండే పూల్ చూసి నోటమాటరాదు. ఓర్నీ ఇందులో స్నానం చేయడం సాధ్యమవుతుందా అనే సందేహం కలుగుతుంది. కానీ ఇది ఒకరకమైన బాడీ చికిత్స కోసమేనట. ముఖ్యంగా చలికాలంలో వేడి మిరపకాయలతో కూడిన నీటిలో స్నానం చేయడం వల్ల శరీరానికి వెచ్చదనం కలగడటమేగాక చురుగ్గా ఉండేలా చేస్తుందని నమ్ముతారట అక్కడి చైనా ప్రజలు. అక్కడ ఆ పూల్లోని ఎర్రటి మిరపకాయలు, ఇతర ఘాటైన పదార్థాలతో ఎర్రగా ఉంటుందట నీరు. దీంతోపాటు ప్రత్యేకమైన ఫిష్ స్పా కూడా ఉంది. ఇందులోని చిన్న చేపలు పాదాలకు పెడిక్యూర్ చేస్తాయి. దీంతోపాటు కొన్ని బహిరంగా హాట్ టబ్లు కూడా ఉన్నాయి. ఇక ఈ ప్రదేశంలో మంచు మద్య సహజంగా ఏర్పడిన ఆర్కిటిక్ స్పా ఒకటి ఉంది. ఇది 103 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉంటుందట. అంతేగాదు ఈ ప్రదేశం ఐస్ పెస్టివెల్కి నిలయం కూడా. ఈ స్పాలన్నీ పర్యాటకులకు మంచి ఆహ్లాదాన్ని, విశ్రాంతి తోపాటు బాడీకి ఒకవిధమైన చికిత్సను అందిస్తాయి. View this post on Instagram A post shared by Jordan Egbert (@counting.countries) (చదవండి: సేవలో అతడికి సాటిలేరెవ్వరూ..! చేసేది డెలివరీ బాయ్ జాబ్ కానీ..) -
అనసూయ డైలీ రొటీన్ ఇదే.. పోస్ట్ వైరల్ (ఫొటోలు)
-
భర్తను చితకబాదేసిన భార్య, వైరల్ వీడియో
భర్తపై భార్య దారుణంగా దాడిచేసిన వీడియో ఒకటి ఆందోళన పుట్టిస్తోంది. కుటుంబ సభ్యులు చుట్టూ ఉన్నప్పటికీ ,అతనిపై హింసకు పాల్పడిన వైనం నెట్టింట భర్తలపై భార్యల హింసగురించి చర్చకు దారి తీసింది.ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది.సోషల్ మీడియా పోస్ట్ల ప్రకారం, సీసీ కెమెరాలో బాధితుడ్ని కొడుతున్న దృశ్యలు నమోదయ్యాయి. తన భార్య నిర్వాకాన్ని రికార్డు చేసేందుకు,ఆధారాలు సేకరించడానికి బాధితుడు తన భార్యపై గదిలో రహస్య కెమెరాను అమర్చాడట. ఈ వీడియోను క్లిప్లో, ఆ మహిళ ఆ వ్యక్తిని మంచంపైకి విసిరి, అతనిపైకి ఎగిరి దూకి, రెండు చేతులతోనూ పిడి గుద్దుల వర్షం కురిపించింది. ఇంతలో మహిళ గదిలోకి వెళ్లి జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించింది, కానీ ఫలించలేదు. ఒక బిడ్డను ఎత్తుకుని ఉన్న మరో వ్యక్తి కూడా గదిలోకి వెళ్లాడు. అయినా బాధితుడిపై దాడి కొనసాగుతూనే ఉంది.దీంతో నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. భార్యల వేధింపులు తాళలేక తనువు చాలించిన అతుల్ సుభాష్,మానవ్ శర్మ ఉదంతాన్ని గుర్తుకు తెస్తుందని వ్యాఖ్యానించారు. 2025లో ఏప్రిల్లో పోస్ట్ అయిన ఈ వీడియో వైరల్గా మారింది. ఈ ఘటన ఎక్కడిది, బాధితుడు ఎవరు? అనే వివరాలపై ఎలాంటి ధృవీకరణ లేదు. ఇదీ చదవండి: నంబర్ ప్లేట్ కోసం రూ. 2.08 కోట్లు : ఎవరో తెలుసా?నెటిజనుల స్పందనఆమెపై కేసు నమోదు చేయాలని కొంతమంది కోరగా, గృహ హింస నుండి పురుషులను రక్షించడానికి, అలాంటి మహిళలను శిక్షించడానికి ఎటువంటి చట్టాలు లేవని వాపోయారు. అదే పురుషుడు మహిళపై దాడిచేస్తే పదేళ్ల దాకా జైలు శిక్ష పడుతుందని వ్యాఖ్యానించారు.పేలవమైన చట్టాలు, అవినీతి న్యాయమూర్తులు, న్యాయ వ్యవస్థ బాధితుడిగా మారుతున్న ప్రతి పురుషుడికి మనం అధికారం ఇవ్వాలి.అలాగే ప్రతి పురుషుడిని ఆత్మహత్యకు పాల్పడేలా చేస్తున్న ఇలాంటి మహిళలకు గుణపాఠం నేర్పాలి. వేధింపులకు గురవుతున్న వివాహిత పురుషుడు అన్ని అడ్డంకులకు వ్యతిరేకంగా పోరాడాలి. అంతకానీ ఎప్పుడూ ఆత్మహత్య చేసుకోవద్దు అని ఒక నెటిజన్ కోరడం గమనార్హం.అయితే వీడియో రికార్డు చేస్తున్నాడు కాబట్టి అతను కావాలనే ప్రతిఘటించడం లేదని కమెంట్ కూడా కనిపించింది. ఇదీ చదవండి : అత్యాశతో బంగారం కొంటున్నారా? ఎంత ముప్పో తెలుసా?Video source @mishrag47 . There is no domestic violence laws to protect men, no laws to severely punish such women. If man raise his hands on women simp men at once oppose him. #MenToo #GenderBiasedlaws #RejectWaqfBill #WaqfAmendmentBill #MuskanRastogi #IPL2025 #ToxicFeminism pic.twitter.com/KFoR0Ikf1Z— Saurabh Bahuguna46 (@bahuguna46) April 2, 2025 -
పాక్ ఆటగాడిపై ఆగ్రహంతో ఊగిపోయిన వైభవ్ సూర్యవంశీ
అండర్-19 ప్రపంచకప్లో నిన్న జరిగిన కీలకమైన సూపర్ సిక్స్ మ్యాచ్లో భారత్ పాకిస్తాన్పై 58 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి సెమీస్లోని ప్రవేశించింది. ఈ దెబ్బతో పాక్ టోర్నీ నుంచి నిష్క్రమించి, ఇంటిబాట పట్టింది. ఫిబ్రవరి 4న జరిగే రెండో సెమీస్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. 3న జరిగే తొలి సెమీస్లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ అమీతుమీ తేల్చుకుంటాయి.ఇదిలా ఉంటే, నిన్నటి భారత్-పాక్ మ్యాచ్కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్మీడియాలో వైరలవుతుంది. ఇందులో భారత చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ పాక్ ఆటగాడు అలీ బలోచ్పై ఊగిపోతూ కనిపించాడు. Vihaan sprinting like Usain boult to save a Pakistani player from Vaibhav Suryavanshi. 😭https://t.co/2thurxK3QC— Gangadhar (@90_andypycroft) February 1, 2026పాక్ ఇన్నింగ్స్ 37వ ఓవర్లో విహాన్ మల్హోత్రా బలోచ్ను ఔట్ చేసిన తర్వాత సూర్యవంశీ అతనిపైకి దూసుకెళ్లాడు. విహాన్ వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చాడు. ఆ సమయంలో వైభవ్ ఉగ్రం చూస్తే పాక్ ప్లేయర్ బుర్ర బద్దలు కొట్టేలా అనిపించింది. దీనికి సంబంధించిన వీడియోనే ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తుంది.మరోసారిపహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ మధ్య క్రికెట్ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అప్పటి నుంచి జరిగిన ప్రతి క్రికెట్ మ్యాచ్లో భారత ఆటగాళ్లు పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. తాజా మ్యాచ్లోనూ అదే పరిస్థితి కొనసాగింది. ఇరు జట్ల ఆటగాళ్లు మ్యాచ్ అయిపోగానే ఎవరి దారిన వాళ్లు పెవిలియన్ వైపు వెళ్లారు.నిన్నటి మ్యాచ్ పూర్తి వివరాల్లోకి వెళితే... తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 49.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది. వేదాంత్ త్రివేది (68) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో భారత్కు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ఆఖర్లో కనిష్క్ చౌహాన్ (35), ఖిలన్ పటేల్ (21) కీలక ఇన్నింగ్స్లు ఆడారు.భారత బ్యాటర్లలో ఆరోన్ జార్జ్ (16), కెప్టెన్ ఆయుశ్ మాత్రే (0), అభిగ్యాన్ కుందు (16), దీపేశ్ దేవేంద్రన్ (1) విఫలం కాగా.. వైభవ్ సూర్యవంశీ (30), విహాన్ మల్హోత్రా (21), అంబ్రిష్ (29) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.పాక్ బౌలర్లలో అబ్దుల్ సుభాన్ 3, మొహమ్మద్ సయ్యద్ 2, అలీ రజా, అహ్మద్ హుసేన్, మొమిన్ ఖమార్, అలీ హస్సన్ బలోచ్ తలో వికెట్ తీశారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో పాక్ తొలుత విజయం దిశగా సాగింది. అయితే మధ్యలో భారత స్పిన్నర్లు ఖిలన్ పటేల్ (9.2-1-35-3), ఆయుశ్ మాత్రే (8-0-21-3), కనిష్క్ చౌహాన్ (10-1-30-1), విహాన్ మల్హాత్రా (4-0-15-1) చెలరేగడంతో పాక్కు ఓటమి తప్పలేదు. పేసర్లు అంబ్రిష్ (5-0-26-1), హెనిల్ పటేల్ (5-0-30-1) కూడా రాణించడంతో పాక్ 46.2 ఓవర్లలో 194 పరుగులకే ఆలౌటైంది.పాక్ ఇన్నింగ్స్లో ఉస్మాన్ ఖాన్ (66) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. హమ్జా జహూర్ (42), కెప్టెన్ ఫర్హాన్ యూసఫ్ (38) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించగా.. మిగతా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. -
మాటే మంత్రమై.. ఆ బిడ్డకు ఊపిరి పోసింది..!
కోమాలో ఉన్న వ్యక్తుల కుటుంబాలకు ఈ ఘటన సరికొత్త ఆశను అందిస్తోంది. అచ్చం సినిమాని తలపించే సన్నివేశంలా..ఈ కేసులో ఆ బిడ్డ కోమా నుంచి బయటపడ్డాడు. వైద్యులు సైతం చేతులెత్తేశారు. కానీ మాటలు, సందేశాలే మంత్రాలుగా మారి మిరాకిల్ చేశాయి. ఆ బిడ్డకు ఊపిరిపోసి..కోమా నుంచి పూర్తిగా బయటపడేలా చేశాయి. ఆ తల్లి కళ్లల్లో ఆనందం వెల్లివెరిసేలా చేశాయి. అసలేం జరిగిందంటే..ఈ అద్భుత ఘటన చైనాలో చోటు చేసుకుంది. చైనాలోని హునాన్ ప్రావిన్స్లోని యుయాంగ్కు చెందిన ఎనిమిదేళ్ల బాలుడు లియుచుక్కి నవంబర్ 2025లో జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆ రోడ్డు ప్రమాదంలో చిన్నారి చుక్కికి మెదడు, ఊపిరితిత్తులకు తీవ్ర గాయలయ్యాయి. దాంతో పరిస్థితి విషమంగా మారి కోమాలోకి వెళ్లిపోయాడు. వైద్యులు సైతం కోమా నుంచి బయటడే అవకాశాలు తక్కువని అని తేల్చి చెప్పేశారు. కానీ ఆ బాలుడు తల్లి ఆశ వదులుకోలేదు. వైద్యుల సూచనల మేరకు అతడికి రోజు సుపరిచితమైన శబ్దాలు, మాటలు..వినేలా వాతావరణం కల్పించాలని చెప్పారు. దాంతో ఆ బాలుడు పాఠశాల ఉపాధ్యాయులను సంప్రదించి వారి మద్దతు..స్కూల్లో అసెంబ్లీలో ప్లే అయ్యే సాంగ్స్, ప్రార్థన గీతాలు వినిపించేలా చేసింది. అలాగే వీడియో కాల్ ద్వారా ఆ బాలుడి స్నేహితుల మాటలు అతనికి వినిపించేలా చేసింది ఆ బాలుడి తల్లి. రోజు అతడి స్నేహితులు.. రేయ్..! చుక్కి కళ్లుతెరవరా.., మాతో మాట్లాడరా, ఫుట్బాల్ ఆడదాం త్వరగా లేగు అన్న మాటలు ఆ బాలుడిలో స్పందన తెప్పించాయి. ఆ తల్లి అలా అతడి క్లాస్మేట్స్ మాటలు రోజు వినేలా చేయడంతో.. అతడి పరిస్థితిలో మార్పు రావడం మొదలైంది. అంతేగాదు 45 రోజుల కోమా అనంతరం తొలిసారిగా కనురెప్పలు కదపడం ప్రారంభించాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు తన ఉపాద్యాయుడి గొంతు విని నవ్వాడు. అలా 55వ రోజుకి స్పృహలోకి వచ్చి తన ఎడమ చేతిని కదిపాడు. తన పాఠశాల సంగీతం, సహ విద్యార్థులు సందేశాల రికార్డింగ్ ఆ బాలుడుని కోమా నుంచి బయటపడటానికి, కోలుకోవడానికి హెల్ప్ అయ్యింది. అందుకు సంబంధించిన వీడియో ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించేలా కదిస్తోంది. A touching story😭😭An 8-year-old boy in Hunan, #China, woke from a 55-day coma after hearing the collected messages of love and well wishes from classmates🥺🥺It's the power of #friendship and #hope. ❤️ pic.twitter.com/M8sEcX8o9Z— GeoSight (互fo) (@ShanxiDaily) January 22, 2026 (చదవండి: ఒబెసిటీ డాక్టర్ వెయిట్లాస్ స్టోరీ..! కేవలం 18 నెలల్లో 56 కిలోలు..) -
ఆ బామ్మకు ఏ కష్టం వచ్చిందో..! పాపం 89 ఏళ్ల వయసులో..
కొన్ని ఘటనలు ఎంతో ఆలోచించేలా చేస్తాయి. కొత్త స్ఫూర్తిని నింపుతాయి. చిన్న చిన్న సమస్యలకే బెంబేలెత్తే మనం, ఇలాంటి బామ్మను చూసి ఎంతో ప్రేరణ పొందుతాం. కష్టం ఏదైతేనేం..దాన్ని అధిగమించేలా నవ్వుతూ మనపని మనం ఎలా చేసుకుంటూ పోవాలో ఈ బామ్మని చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. ఆత్మగౌరవం అనే మాటకు అసలైన అర్థంలా అనిపిస్తుంది ఈ బామ్మ జీవన విధానం..ఆ బామ్మ పేరు 89 ఏళ్ల కమలాబెన్ మెహతా. ముంబై లోకల్ రైళ్లలో నిశబ్దంగా బ్రాస్లెట్లు అమ్ముతు ఉంటుందామె. ఆమెను చూడగానే ఈ వయసులో ఇంతలా కష్టపడుతుందా అని ఆశ్చర్యం వేస్తుంది. అయితే ఆమె ఎవరి నుంచి సానుభూతిని, దాతృత్వాన్ని ఆశించకుండా కష్టపడుతున్న తీరు నిజంగా మనసుని కదిలిస్తుంది. చనిపోయేదాక ఆత్మగౌరవానికి భంగం కలగకుండా బతకడం అంటే ఇదే కదా అనిపిస్తుంది ఆ బామ్మని చూస్తే. అందుకు సంబంధించిన పోస్ట్ని ఓ ప్రయాణికుడు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అతడు ఆమెతో మాటలు కలపగా తనపేరు కమలాబెన్ అని, తన వయసు 89 ఏళ్లని ఆ బామ్మ చెప్పిందని పోస్ట్లో పేర్కొన్నాడు. తన కుటుంబంతో కలిసి జీవించడానికి తన వంతుగా ఎంతో కొంత డబ్బులు ఇచ్చేందుకే ఈ పని చేస్తున్నట్లు తెలపింది. తాను ముంబైలోని నలసోపారాలో నివశిస్తున్నట్లు పేర్కొంది. ఆమెకు సాయం చేయాలని.. తన దగ్గరున్న బ్రాస్లెట్లు కొందామనుకున్నా.. అంత మొత్తం లేకపోవడంతో ఆ బామ్మ ఇంటి అడ్రస్ అడగగా, ఆమె అందుకు నిరాకరించింది. పైగా తన కుటుంబ తన వల్ల అవమానపాలు కాకూడదు అంటూ అక్కడ నుంచి మౌనంగా నిష్క్రమించిందని పోస్లో రాసుకొచ్చాడు సదరు ప్రయాణికుడు. నిజానికి ఆ వయసులో ఈ బామ్మ ఏ రకంగానైనా సంపాదించొచ్చు. కానీ తన ఆత్మగౌరవం కోసం శరీరం సహకరించి వృద్ధాప్యంలో కూడా అచంచలమైన పట్టుదలతో చేతితో తయారు చేసిన బ్రాస్లెట్లు అమ్ముతూ సంపాదించాలనుకోవడం నిజంగా ప్రశంసనీయం..స్ఫూర్తిదాయకం. చివరి క్షణం వరకు తలెత్తుకునే బతకాలి కానీ, చేయిచాచి కాదు అని చెంపపగిలేట్టు సమాధానమిచ్చే ఘటన ఇది. ఇంకెందుకు ఆలస్యం నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోపై మీరు ఓలుక్కేయండి మరి. View this post on Instagram A post shared by Meeta Tushit Shah (@meetatushitshah) (చదవండి: అరుదైన ఘనత సాధించిన తొలి మహిళ..! ఏకంగా ఐదు హిమాలయాలు..) -
దురంధర్ రంభ హో ఫీవర్ 70 ఏళ్ల వయసులో స్టన్నింగ్ డ్యాన్స్ వైరల్ వీడియో
ఆనందాన్ని వ్యక్తం చేయడానికి, జీవితంలో వర్తమాన క్షణాలను ఆస్వాదించడానికి వయసుతో పనేముంది. సమయం, సందర్భం కలిసి వస్తే మనసు నాట్యమయూరే అవుతుంది. ఇక నాట్యంలో ఆరితేరిన వారైతే.. ఇక చెప్పేదేముంది ఉరిమే ఉత్సాహంతో ఉర్రూతలూగాల్సిందే. ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నా ఈ వీడియోను చూస్తే ఎంతటివరైనా కాలు కదపాల్సిందే.. పక్కా.! ఆ సోషల్ మీడియా సెన్సేషన్ మరెవ్వరో కాదు బాలీవుడ్ వెండితెరపై ఒకప్పుడు తన డ్యాన్స్తో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన నటి కల్పనా అయ్యర్. వయసు 70 ఏళ్లు అయితేనేం అందమైన డ్యాన్స్తో మరోసారి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. తన కరియర్లో ఐకానిక్ సాంగ్ ‘రంభా హో హో హో’ పాటకు అత్యంత అద్భుతంగా నృత్యం చేశారు. తాజాగా ఈ పాటను దురంధర్లో వాడుకోవడంతో మరింత ఇంట్రస్టింగ్మారింది. దురంధర్ సినిమా అటు కలెక్షన్లనుంచి ఇటు వివాదాల కారనంగా అనేక కారణాలతో వార్తల్లో నిలిచింది. ఐకానిక్ రెట్రో పాట 'రంభ హో' వాడుకోవడం వాటిలో ఒకటి.1981లో వచ్చిన 'అర్మాన్' చిత్రంలో ఈ పాటలో నటించిన సీనియర్ నటి కల్పనా అయ్యర్, దాదాపు 40 ఏళ్ల తరువాత ఆ మ్యాజిక్ను పునఃసృష్టించారు. దీంతొ అభిమానులు నాస్టాల్జియాతో పులకరించారు. స్వయంగా కల్పనా తన ఇన్స్టాఖాతాలో శుక్రవారం ఈ వీడియోను షేర్ చేశారు. ఈ సందర్భంగా ఆమె ఇలా అన్నారు. “ఒక స్నేహితురాలు నాకు ఈ క్లిప్ను పంపింది, ఇది నిన్న రాత్రిది, ఇలా చేశానని ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను.. చాలా కాలంగా డ్యాన్స్ చేయలేదు. ఇది చాలా ప్రత్యేకమైన సాయంత్రం. సిద్ధాంత్ పెళ్లి.” అని ఆమె పేర్కొన్నారు. నలుపు-బంగారు బ్లౌజ్ ఊదా రంగు పట్టు చీరలో ఆమె స్టెప్పులుకు సోషల్ మీడియా ఫిదా అవుతోంది. దీంతో సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా కల్పనా అయ్యర్పై ప్రశంసల జల్లుకురుస్తోంది ఎవరీ కల్పనా అయ్యర్బాలీవుడ్లో విలన్ పాత్రలకు, ముఖ్యంగా 'హమ్ సాథ్ సాథ్ హై' చిత్రంలో తన నటనకు బాగా గుర్తుండిపోయే కల్పనా అయ్యర్, మిస్ ఇండియా 1978 పోటీలో మొదటి రన్నరప్గా నిలిచారు. ఆ తర్వాత ఆమె మిస్ వరల్డ్ 1978లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి, టాప్ 15 సెమీ-ఫైనలిస్టులలో ఒకరిగా నిలిచారు. ఎక్కువగా బోల్డ్ అండ్ గ్లామరస్ పాత్రలను పోషించారు. 1980 నాటి 'ప్యారా దుష్మన్' చిత్రంలోని "హరి ఓం హరి", ఆ తర్వాత 1981లో 'అర్మాన్' చిత్రంలోని "రంభ హో" వంటి జనాదరణ పొందిన డ్యాన్స్ నంబర్లతో డ్యాన్సింగ్ క్వీన్గా పాపులర్ అయ్యారు. View this post on Instagram A post shared by striloka (@strilokaa) -
తండ్రి ప్రేమ..! కీ ప్యాడ్ ఫోన్ అయితేనేం..
ఎన్ని డబ్బులున్న కొనలేనివి చాలనే ఉంటాయి. ముఖ్యంగా తల్లిదండ్రులు ప్రేమ.. నోచుక్నుపిల్లలందరూ చాలా అదృష్టవంతులే. కంటిపాపలా కాచుకునే వాళ్లకు మించిన స్వచ్ఛమైన ప్రేమ ఎక్కడ కానరాదు. అలాంటి భావోద్వేగ సన్నివేశమే నెట్టింట వైరల్గా మారింది. అతడి వద్ద ఖరీదైన గాడ్జెట్ లేకపోతేనేం..తన కూతురి కళను పొందుపర్చుకోవాలన్న అతడి తాపత్రయం అందరి మనసులను గెలుచుకుంది. ఇది కథ తండ్రి ప్రేమ అనిపించేలా ఉంది ఆ ఘటన.అందుకు సంబంధించిన వీడియోని జితేందర్ సారస్వత్ ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేయడంతో నెట్టింట వైరల్గా మారింది. రిపబ్లిక్ డే వేడుకల నేపథంయలో కూతురు పాఠశాలలో పలు ఈవెంట్లు నిర్వహించారు. అందులో భాగంగా ఒక డ్యాన్స్ కార్యక్రమంలో కూతురు అద్భుతంగా నృత్యం చేస్తోంది. అయితే ఆ తండ్రి తన కూతురు డ్యాన్స్ని ఓ చిన్న కీప్యాడ్ఫోన్లో రికార్డు చేసేందుకు అక్కడే ఉన్న చిన్నారుల జన సముహానికి వెనుకవైపు నిలబడి ప్రయత్నిస్తున్నాడు. ఆ ఫోన్ని చూసి ఎగతాళి చేస్తారేమోనన్న భయంతో జాగ్రత్తగా రికార్డు చేసుకుంటున్న తీరు అందరి హృదయాలను తాకింది. ఆ వీడియోకి జితేందర్ మా సోదరు అందరు హృదయాలను గెలుచుకున్నాడు. అతడు కొత్త ఫోన్ తీసుకోవాలంటారా..మా ఈ కొత్త రీల్ని చూసి చెప్పండి అంటూ పోస్ట్ చేశాడు. తల్లిదండ్రుల ప్రేమ ముందు ఖరీదైన గాడ్జెట్లతో పని ఏమందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తూ పోస్ట్ చేయడం విశేషం. View this post on Instagram A post shared by Jitendar Sarswat (@sarswatjitendar) (చదవండి: హార్డ్వర్క్ చేయకపోతే..ఎవ్వరు కాపాడలేరు..! నెట్టింట వైరల్గా పోస్ట్) -
వీడియో వైరల్: మంచుకొండల్లో అరుదైన క్షణాలు..
ఒక మంచు చిరుత (Panthera uncia) చేసిన అరుదైన వేట దృశ్యం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. హిమాచల్ ప్రదేశ్లోని కిబ్బర్ గ్రామంలో అత్యంత ఎత్తైన ప్రాంతంలో జరిగిన ఈ ఘటనను వైల్డ్లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆండ్రెస్ నోవాలెస్ తన కెమెరాలో బంధించారు. భారీ హిమపాతం తర్వాత ఆకాశం నిర్మలంగా మారిన సమయంలో కిబ్బర్ లోయ మంచుతో కప్పబడి ఉన్నప్పుడు ఈ ఘటన జరిగింది.ఓ మంచు చిరుత తన రెండు పిల్లలను లోయ కింద వదిలిపెట్టి.. ఒంటరిగా కొండ పైకి వెళ్లి అక్కడ మేత మేస్తున్న ఐబెక్స్(అడవి మేక జాతి) మందపై దాడి చేసింది. ఒక పెద్ద ఐబెక్స్ను లక్ష్యంగా చేసుకుని దానిపైకి దూకింది. ఐబెక్స్ తనను తాను రక్షించుకోవడానికి అత్యంత వేగంగా పరుగెత్తింది. ఈ క్రమంలో రెండు జంతువుల మధ్య పెనుగులాట జరిగింది. ఒక దశలో రెండు జంతువులు లోయ అంచున మృత్యువుకు అతి సమీపంలోకి వెళ్లాయి. అయితే, సరిగ్గా ఆ సమయంలో చిరుత పట్టు సడలడంతో.. ఐబెక్స్ చాకచక్యంగా దిశ మార్చుకుని అక్కడి నుండి తప్పించుకుంది.ఆండ్రెస్ నోవాలెస్ ఈ అనుభవాన్ని పంచుకుంటూ.. తన జీవితంలోనే అత్యుత్తమ క్షణంగా అభివర్ణించారు. హిమాలయాల్లో మనుగడ సాగించడం ఎంత కఠినమో, ఎంత ప్రమాదకరమో ఈ ఘటన నిరూపిస్తుందని పేర్కొన్నారు. ఈ వీడియో ఇప్పటికే ఎనిమిది లక్షలకు పైగా వ్యూస్ సాధించింది. ఇది అద్భుతం.. ప్రకృతి అసలైన రూపం ఇది" అంటూ నెటిజన్లు ఈ వీడియోపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. View this post on Instagram A post shared by Andres Novales (@andresnovales_wildlife) -
కుక్క కోసం రూ. 15 లక్షలా..? ఎన్నారై దంపతులు..
శునకాలను చాలమంది ఎంతో ఇష్టంగా పెంచుకుంటారు. వాటిని ఎంత ప్రేమగా, లాలనగా చూస్తోరో తెలిసిందే. కానీ మరీ ఇంతలా పెంపుడు జంతువు కోసం డబ్బు ఖర్చే చేసిన వాళ్లను చూసుండరు. అది కూడా లక్షల్లో అంటే..ఇదేం పిచ్చిరా బాబు అనేస్తాం. కానీ ఈ ఎన్నారై దంపతులు అది కేవలం కుక్క కాదు తమ బిడ్డ అని చెబుతుండటం విశేషం. ఇంతకీ ఆ ఎన్నారై దంపతులు ఆ కుక్క కోసం ఎందుకు అంతలా ఖర్చు చేశారంటే..ఎన్నారై దంపతులు దివ్య, జాన్లు తమ కుక్క కోసం ఎంతలా కష్టపడి భారత్ నుంచి ఆస్ట్రేలియాకు తెచ్చుకున్నామో 'కహానీ ఆఫ్ టేల్స్' అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో వివరించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్కు చెందిన ఈ జంట ఆస్ట్రేలియా వెళ్లాలనుకున్నప్పుడూ..తామెంతో ప్రేమగా పెంచుకున్న స్కై అనే కుక్కని కూడా తమతోపాటే తెచ్చుకోవాలని అనుకున్నారు. అయితే భారత్ నుంచి కుక్క నేరుగా ఆస్ట్రేలియాకు తెచ్చుకోవడానికి అక్కడి ప్రభుత్వం అనుమతించదు. భారతదేశం నుంచి వచ్చే కుక్కలు ర్యాబిస్ లేని దేశంలో ఆరు నెలలపాటు ఉంచాలి. అప్పుడే దాన్ని ఆస్ట్రేలియాకి తీసుకురావడానికి అనుమితిస్తుంది అక్కడ ప్రభుత్వం. పైగా ఆ తతంగం అంతా చాలా వ్యయప్రయాసలతో కూడుకున్నది. అయినప్పటికీ తగ్గేదే లే అంటూ..ఈ జంట దుబాయ్లో తమ ప్రియమైన కుక్కతో కలిసి ఆరు నెలలు ఉన్నారు. మొత్తం ప్రక్రియకు 190 రోజులు పట్టింది. చాలా పేపర్ వర్క్, పలు పశువైద్య పరీక్షలు, టీకాలు, క్వారంటైన్ ఫీజులు అన్ని పూర్తయ్యాక..తాము ముగ్గురం కలిసి అనుకున్నట్లుగానే ఆస్ట్రేలియా వెళ్లే క్షణం రానే వచ్చింది. ఆక్షణం తమకెంతో అపురూపమైనదని, ఎన్నో త్యాగాలు, వ్యయప్రయాసాలు తర్వాత దక్కిన ఉద్విగ్నభరిత క్షణం అంటూ ఇన్స్టాగ్రామ్లో తమ భావోద్వేగ ప్రయాణాన్ని షేర్ చేసుకున్నారు. ఇంతకీ ఆ ఎన్నారై జంట ఆ కుక్క కోసం ఎంత ఖర్చు చేశారో వింటే షాకవ్వడం ఖాయం. ఎందుకంటే ఆ కుక్క కోసమే దాదాపు రూ. 15 లక్షలకు పైనే ఖర్చు చేశారట. పైగా ఆ దంపతులు ఇదేం పిచ్చి వ్యామోహం అనుకోవచ్చు. కానీ అది తమకు కేవలం కుక్క కాదని..తమ బిడ్డేనని..అందువల్ల ఇలా చేశామని ఆ దంపతులు పోస్ట్లో పేర్కొనడం విశేషం. View this post on Instagram A post shared by Kahaanioftails (@kahaanioftails) (చదవండి: ఎవరీ సోఫీ రెయిన్? సోషల్ మీడియా సాయంతో అన్ని కోట్లా..!) -
4 రోజులుగా గడ్డకట్టే చలిలో యజమాని మృతదేహానికి కాపలా
-
ఎవరీ సోఫీ రెయిన్? కంటెంట్ క్రియేటర్గా అన్ని కోట్లా..!
కంటెంట్ క్రియేటర్గా చాలామంది రాణిస్తున్నారు. కొందరు వేలల్లో ఆర్జిస్తే..ఇంకొందరు లక్షల్లో సంపాదిస్తున్నారు. కానీ కోట్లలలో సంపాదించడం గురించి విన్నారా..?. ఔను ఇది నిజం. జస్ట్ కంటెంట్ క్రియేటర్గా ఆ రేంజ్లో సంపాదనా..!? అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే ఆ అమ్మాయి తాను చెబుతోందంతా నిజం అంటూ ఏవిధంగా ఆమె ఆన్లైన్ ఫ్లాట్ఫామ్లలో కోట్లలో ఆర్జిస్తోంది ఆధారాలతో సహా ఇన్స్టాగ్రామ్ వేదికగా వివరించింది. ప్రముఖ అమెరికన్ ఓన్లీఫ్యాన్స్ క్రియేటర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సోఫీ రెయిన్ వివిధ ఆన్లైన్ ఫ్లాట్ఫామ్ల ద్వారా సుమారు రూ. 930 కోట్లకు పైనే సంపాదిస్తున్నానని వెల్లడించింది. అందుకు సంబంధించిన ఆధారాలతో సహా స్కీన్షాట్లతో చూపించింది. మొత్తంగా ఆల్టైమ్ ఆదాయం ఎంత ఉంటుందో స్క్రీన్ షీట్ తీసి మరి చూపించింది. తాను అబద్ధం చెప్పడం లేదని, ఈ విజయం అసాధారమైనది మాత్రం కాదని చెప్పుకొచ్చింది. సగటు కంటెంట్ క్రియేటర్ నెలకు దగ్గర దగ్గర రూ. 13 వేలుదాక సంపాదించగలడని..తాను మాత్రం వాళ్లందరికంటే అధిక మొత్తంలో ఆర్జిస్తున్నానని ధీమాగా చెబుతోంది. అందుకు అపారమైన లక్తోపాటు..లక్షలాది ఫాలోవర్స్ కూడా చాలా అవసరమని పేర్కొంది. 2024 ఏడాదికే తాను రూ. 359 కోట్లు దాక ఆర్జించినట్లు వెల్లడించింది. జస్ట్ ఆన్లైన్ వీడియోలతో స్టార్ జేసన్ టాటమ్ వంటి ప్రొఫెషనల్ అథ్లెట్ల వార్షిక జీతాలను అధిగమించింది. ఆమె తన ఆదాయంలో కొంత ప్రైవేట్ జెట్లు, కార్ల కోసం ఖర్చు చేసినా..కొంత భాగాన్ని మాత్రం తండ్రి అప్పులు తీర్చడానికి ఉపయోగించడం విశేషం. అయితే రెయిన్ 70% సంపాదనను పెట్టుబడుల్లో పెట్టినట్లు పేర్కొంది. ఎవరీమె..?సోఫీ రెయిన్ 21 ఏళ్ల అమెరికన్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ , కంటెంట్ క్రియేటర్, ఓన్లీఫ్యాన్స్ వంటి సోషల మీడియా అకౌంట్లతో బాగా గుర్తింపు దక్కించుకుంది. అక్కడ ఆమె తన తన సబ్స్క్రైబర్లతో ప్రత్యేకమైన కంటెంట్ను పంచుకుంటుంది. 2004లో ఫ్లోరిడాలోని మయామిలో జన్మించిన సోఫీ, ఓన్లీఫ్యాన్స్లో 11 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లు ఉండగా, ఇన్స్టాగ్రామ్లో 8 మిలియన్ల మంది ఫాలోవర్లతో సహా బహుళ ప్లాట్ఫామ్లలో భారీ ఫాలోయింగ్ను సంపాదించుకుంది.సోఫీ తన కెరీర్ని వెయిటర్గా ప్రారంభించింది, కానీ ఆమె బాస్, ఓన్లీఫ్యాన్స్ వంటి సోషల్మీడియా ఖాతాల సాయంతో మంచి పేరు, గుర్తింపు తెచ్చుకుంది. ఆమె తన కంటెంట్ క్రియేటివిటీ, మాటల ఆకర్షణ సాయంతో ఎక్కువమంది సబ్స్కైబర్లను ఆకర్షించింది. ఆమె కంటెంట్ పరంగానే కాకుండా సన్నిహిత ఫోటోషూట్ల విషయంలోనూ అత్యంత కేర్ఫుల్గా ఉంటుందామె. ప్రస్తుతం ఆమె బాప్హౌస్ కలెక్టివ్ కంటెంట్ క్రియేటర్ వ్యవస్థాకురాలు కూడా. (చదవండి: 'రాజా బేటా సిండ్రోమ్': 50 ఏళ్ల పైబడ్డ కూడా..) -
'రాజా బేటా సిండ్రోమ్': 50 ఏళ్లు పైబడ్డ కూడా..
మనషుల ప్రవర్తనలు చాలామటుకు చుట్టూ ఉన్న మనుషులు లేదా అతడు పెరిగిన కుటుంబ వాతావరణంపై ఆధారపడి ఉంటుంది. అది అతడి అభ్యున్నతికి ఉపకరించేలా ఉంటే పర్లేదు..తనేం చేసినా కరెక్ట్ అనే ధోరణిలో ఉంటే చాలా సమస్యలు ఎదురవ్వుతాయి. ముఖ్యంగా మగపిల్లలను తల్లులు ఎంతలా గారాబం చేస్తుంటారంటే..వాళ్లేం చేసినా కరెక్ట్, ఆడపిల్ల వరకు వచ్చేటప్పటికీ..పరాయి ఇంటికి వెళ్లాల్సింది బాధ్యతతో వ్యవహరించాలన్నట్లుగా పెంచుతారు. బాధ్యతల విషయంలో ఇద్దరు సమానం అన్న ఆలోచన లేమి..ఎంతటి పరిస్థితికి దారితీస్తుందంటే..కట్టుకున్న భార్యతోపాటు, చుట్టు ఉన్నవాళ్లకు, అలాగే తనకు సమస్యగా మారిపోతాడు. మొగ్గగా ఉన్నప్పుడే ఆ ధోరణి సరవ్వాలి లేదంటే పరిస్థితి ఎలా ఉంటుందనేందుకు ఈ వృద్ధుడే ఉదాహరణ..ముంబై విమానాశ్రయంలో ఓ మహిళ తనకు ఎదురైన అనుభవాన్ని ఇన్స్ట్రాగ్రామ్ వేదికగా ఇలా వివరించింది. ఆ పోస్ట్లో ఎయిర్పోర్ట్లో ఓ 50 ఏళ్ల వ్యక్తి రెండు క్యూల వద్దకు వచ్చాడు. అవి ఎయిర్ ఇండియా, ఇండిగో కోసం ఉన్న క్యూలు. అయితే ఆ వ్యక్తి తప్పుగా క్యూలో నిలబడి ఉండటంతో..సరిదిద్దే ప్రయత్నం చేశారు. ఇది ఆ క్యూ కాదు అని చెబుతున్నందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తూ..అరవడం మొదలుపెట్టాడు. దాంతో అక్కడున్న వాళ్లు ఏం మాట్లాడలేక అలా చూస్తుండిపోయారు. ఇంతలో అతడి కుటుంబం జోక్యం చేసుకుని అతడిని శాంత పరిచేంతవరకు అక్కడ గందరగోళ వాతావరణం సృష్టించాడు. అదంతా చూశాక.. సదరు మహిళ ఇలాంటి మానసిక ప్రవర్తనను రాజా బేటా సిండ్రోమ్గా పేర్కొంది. ఇదేమి మానసిక రోగం కాదని, చిన్నప్పటి నుంచి తానేం చేసిన కరెక్ట్ అనే ధోరణిలో పెరిగిన వాళ్లు ఇలా వింతగా ప్రవర్తిస్తుంటారని, దీని కారణంగా చుట్టూ ఉన్నవాళ్లకు, తనకు సమస్యలు సృష్టిస్తారని అన్నారామె. దక్షిణాది కుటుంబాలలో ముఖ్యంగా పురుషలలో ఈ ధోరణి ఉంటుందని, అందుకు తల్లులు, వారి కుటుంబ ఆలోచన విధానమేనని అన్నారామె. అబ్బాయి కాస్త ఎక్కువ, అమ్మాయిలు కాస్త తక్కువ అనే భావజాలంతో ఉండే కుటుంబాలలో పురుషల మనస్తత్వం ఇలానే ఉంటుందని అన్నారు. దయచేసి ఇలాంటి ప్రవర్తనను దూరం చేసుకోండి లేదంటే..నెమ్మదిగా ఒక సమయానికి మనుషులు దూరమైపోతారంటూ పోస్ట్ని ముగించింది. నెటిజన్లు కూడా తమ కుటుంబంలోని వ్యక్తులు గురించి వివరిస్తూ..తమ అనుభవాలను షేర్ చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Snowy Rahi | Therapist (@sitwith_rahi) (చదవండి: రుద్ర హెలికాప్టర్ని నడిపిన తొలి మహిళా పైలట్..! ఒంటరి తల్లి..) -
ఎమోషనల్ అవ్వకండి.. ఆ పెంగ్విన్ అసలు కథ ఇదే
-
సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఒంటిరి పెంగ్విన్ వీడియో
-
అక్క కోసమని వెళ్లి.. అనంతలోకాలకు!
అమెరికా లాంటి కొన్ని దేశాల్లో.. పిల్లలను స్కూల్ బస్సులు ఎక్కించేటప్పుడు లేదంటే దింపేటప్పుడు రోడ్డుపై ట్రాఫిక్ దానంతట అదే ఆగిపోతుంది. పిల్లలు కొద్దిదూరం వెళ్లిన తర్వాతే వాహనాలు ముందుకు కదులుతాయి. అక్కడ ఎలాంటి ట్రాఫిక్ సిగ్నల్స్.. లేదంటే పోలీసు అవసరం ఉండదు. పిల్లల సేఫ్టీ అనేది అక్కడి ప్రజల జీవనశైలిలో ఇదొక భాగమైపోయింది. కానీ, మన దేశంలో.. !ముంబై నగరంలో అంతా చూస్తుండగానే ఘోరం జరిగింది. స్కూల్ బస్సు దిగిన ఓ చిన్నారిని ఆమె నాయనమ్మ రోడ్డు దాటిస్తున్న క్రమంలో.. బస్సు ముందుకు వచ్చింది. ఈ ప్రమాదంలో ఆ పెద్దావిడ చేతిలో ఉన్న ఏడాది పసికందు ప్రాణం విడిచింది. ఆమెకూ తీవ్ర గాయాలయ్యాయి. అదృష్టవశాత్తు ఆ చిన్నారి మాత్రం ప్రాణాలతో బయటపడింది. మంగళవారం మధ్యాహ్నాం ఖేట్వాడీ ఏరియాలోని గిర్గావ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. చంద్రకళ అనే పెద్దావిడ తన ఏడాది మనవడిని చంకలో వేసుకుని.. స్కూల్ నుంచి వచ్చే మనవరాలిని ఇంటికి తెచ్చేందుకు వెళ్లింది. అయితే ముగ్గురూ బస్సు ముందు నుంచి రోడ్డు దాటుతుండగా.. డ్రైవర్ అది గమనించకుండా ముందుకు పోనిచ్చాడు. బస్సు ఢీ కొట్టి ముగ్గురూ కింద పడిపోయారు. చిన్నారి పక్కకు పడిపోగా.. చంద్రకళ, ఆమె ఏడాది మనవడి మీదుగా బస్సు వెళ్లింది. వెంటనే డ్రైవర్ బ్రేకులు వేయగా.. స్థానికులు అప్రమత్తమై వాళ్లను బయటకు తీసే ప్రయత్నం చేశారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. ఏడాది చిన్నారి అప్పటికే మరణించగా.. గాయపడిన చంద్రకళను ఆస్పత్రికి తరలించారు. డీబీ మార్గ్ పోలీసులు స్కూల్బస్సు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన తాలుకా దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీల్లో నమోదు కాగా.. అవి ఇప్పుడు బయటకు వచ్చాయి. ఈ వీడియోలోని దృశ్యాలు మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయొచ్చు.मुंबई में स्कूली बस ने ही दो बच्चों और उनकीअभिभावक को कुचल दिया! एक बच्चे की मौत हो गई दूसरा घायल है। अभिभावक भी बस के नीचे आ गई और वो भी गंभीर रूप से घायल है। मैं जानता हूं कि ये भारत है अमेरिका नहीं लेकिन फिर भी ये लिख रहा हूं कि जब भी अमेरिका जाता हूं, देखता हूं और आप भी… pic.twitter.com/RHcmGOUmEp— Umashankar Singh उमाशंकर सिंह (@umashankarsingh) January 28, 2026 -
కశ్మీర్లో విరుచుకుపడ్డ మంచు గడ్డలు.. వీడియో వైరల్
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో భారీగా మంచు కురుస్తోంది. ఏకధాటిగా కురుస్తున్న మంచు, శీతల గాలుల కారణంగా స్థానికులు గజగజా వణికిపోతున్నారు. బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు.. కశ్మీర్లోని సోన్మార్గ్లో మంచు గడ్డలు విరిచిపడ్డాయి. దీంతో, అక్కడున్న టూరిస్ట్ రిసార్ట్ దెబ్బతిన్నది. దీనికి సంబంధించిన వీడియో సోషల మీడియాలో వైరల్గా మారింది.వివరాల ప్రకారం.. జమ్ముకశ్మీర్లోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన సోన్మార్గ్లో మంగళవారం రాత్రి తీవ్రస్థాయిలో హిమపాతం సంభవించింది. మంచు గడ్డలు, పెళ్లలు (అవలాంచీ) ఏర్పడ్డాయి. రాత్రి 10:12 గంటల సమయంలో సెంట్రల్ గందర్బల్ జిల్లాలోని రిసార్టుల మీద అవలాంచీ విరుచుకుపడ్డింది. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఉప్పెనలా అవలాంచీ భవనాలను కప్పేయడం ఇందులో కనిపిస్తోంది.అయితే, ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు వెల్లడించారు. రిసార్టుల్లో ఉండేవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ ప్రాంతంలో ప్రమాదకర అవలాంచీ సంభవించే అవకాశం ఉందని సోమవారం నాడే హెచ్చరికలు జారీ అయ్యాయి. 24 గంటలుగా సోన్మార్గ్తో పాటు కశ్మీర్ లోయలోని అనేక ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ హిమపాతం సంభవించిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మరోవైపు.. హిమాలయాల పశ్చిమ ప్రాంతం మీదుగా వీస్తున్న గాలుల ప్రభావం వల్ల చలి అమాంతంగా పెరిగినట్లు భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. శ్రీనగర్, గుల్మార్గ్, పహల్గామ్, అనంతనాగ్, కార్గిల్, సోన్మార్గ్, కుప్వారా, పుల్వామా, బేతాబ్ వ్యాలీ, పట్నిటాప్, పూంఛ్, కిష్తవార్ ప్రాంతాల్లో రోడ్ల మీద రెండు నుంచి మూడు అడుగుల ఎత్తులో మంచు పేరుకుపోతోంది.Dapaan there's been an avalanche in Sonamarg. Praying for everyone's safety. 🙏🏻 pic.twitter.com/aIqALHSq21— Basharat Rehan🇵🇸 (@BasharatRehan1) January 28, 2026శ్రీనగర్లో భారీగా మంచు కురుస్తున్న కారణంగా శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 50 విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఈ మేరకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(AAI) ఓ ప్రకటన విడుదల చేసింది. విమానాశ్రయంలో వాతావరణం ప్రతికూలంగా ఉందని, మంచు కురుస్తూనే ఉందని ఏఏఐ పేర్కొంది. దీంతో శ్రీనగర్కు రావాల్సిన 25.. అక్కడి నుంచి బయలుదేరాల్సిన మరో 25 విమానాలను రద్దు చేసినట్లు తెలిపింది. విమానాల రద్దు కారణంగా అక్కడికి వెళ్లిన అనేక మంది పర్యాటకులు శ్రీనగర్లోనే చిక్కుకుపోయారు. -
కెనడియన్ సిటిజన్ షిప్ వేడుక : చీరలో ‘దివ్య’ ముస్తాబు
ఏదైనా ప్రత్యేక సందర్భం అనగానే మహిళలకు ముందుగా గుర్తొచ్చే దుస్తులు చీర. అలా కెనడా పౌరసత్వం తీసుకునే సందర్భంగా మహారాష్ట్రకు చెందిన మహిళ ఈ వేడుకను మరింత ప్రత్యేకంగా నిలిచిపోవాలని భావించింది. తమ ప్రాంతానికి చెందిన చీర, ముస్తాబులో స్పెషల్గా కనిపించాలని నిర్ణయించుకుంది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది పలువురిని ఆకట్టుకుంటోంది.మహారాష్ట్రకు చెందిన దివ్య లాట్లికర్ కెనడా పౌరసత్వ ప్రమాణ స్వీకారోత్సవానికి నౌవారీ చీరతో హాజరై అందర్నీ ఆకర్షించారు. తన సొంత రాష్ట్రం నుండి వచ్చిన సాంప్రదాయ చీరను ధరించి, నుదిటిపై బిందీతో ముస్తాబైంది. ఈ వేడుకును ఇన్స్టాగ్రామ్లో ఆమె పంచకుంది. నౌవారీ చీర ధరించడం తన జీవితంలోని అత్యంత ముఖ్యమైన క్షణాలలో ఒకటని ఆమె తన పోస్ట్లో పేర్కొన్నారు. ఈ చీర బలం, గౌరవం, సహనం, కొనసాగింపుకు చిహ్నం అని ఆమె అన్నారు. పౌరసత్వ ప్రమాణాన్ని స్వీకరిస్తూ, సర్టిఫికేట్ అందుకుంటున్న ఆ క్షణం ఆమెలో ఇన్నేళ్ల కృషి, సంకల్పం ప్రతిబింబించింది.ఇదీ చదవండి: నిపా వైరస్ కలకలం : ఎయిర్పోర్ట్స్లో హై అలర్ట్ఇన్స్టాగ్రామ్లో వీడియోను పంచుకుంటూ, దివ్య దేశం పట్ల తనకున్న ప్రేమను వ్యక్తం చేసింది. తాను ఉన్న చోట ఉండటం గర్వంగా ఉందని, అలాగే ఏ దేశమేగినా, పుట్టిన నేలను మర్చిపోకూడదని, మూలాలను సజీవంగా ఉంచుకోవడం తనకెంతో గర్వకారణమని వ్యాఖ్యానించారు. View this post on Instagram A post shared by Divya (@divyalotlikar) ఆ వేడుకలో ఆమె ధరించిన చీర, సాంప్రదాయ వేషధారణపై సోషల్ మీడియా వినియోగదారులు ప్రశంసలు కురిపించారు. చాలా సహజంగా, అందంగా ఆత్మవిశ్వాసంతో కనిపించారంటూ దివ్యను కొనియాడారు. అచ్చమైన మరాఠీ అమ్మాయిలా ఉన్నారన్నారు. అలాగే తన అమెరికా పౌరసత్వ స్వీకరణ సందర్బంగా తాను కూడా మరాఠీ దుస్తులు ధరిస్తానని, మంచి ఐడియా ఇచ్చినందుకు థ్యాంక్స్ అంటూ మరొకరు వ్యాఖ్యానించడం విశేషం. -
వీడియో: హచికో గుర్తుందా..? అలాంటి విశ్వాసమే ఇది! కానీ..
హిమాచల్ ప్రదేశ్లో చోటుచేసుకున్న ఈ హృదయవిదారక ఘటన.. హచికో కథను గుర్తు చేసింది.. తన యజమాని మరణించిన తర్వాత కూడా.. దాదాపు పదేళ్లు ప్రతిరోజూ షిబుయా రైల్వే స్టేషన్ వద్ద అతని కోసం ఎదురుచూసిన హచికో కథ జపాన్ అంతటా, తరువాత ప్రపంచవ్యాప్తంగా నిబద్ధత, విశ్వాసానికి ప్రతీకగా నిలిచింది. హచికో కథ ఆధారంగా Hachi: A Dog’s Tale(2009) అనే హాలీవుడ్ సినిమా రూపొందించారు. అలాగే 777 చార్లీ.. ఆ చిత్రంలో పెంపుడు కుక్కతో ఓ వ్యక్తికి ఉన్న అనుబంధాన్ని ఎంత గొప్పగా చూపించారో తెలిసిందే.మనుషులు, జంతువులకు మధ్య ఉండే విడదీయలేని బంధానికి నిదర్శనంగా నిలిచిన ఘటన.. హిమాచల్ ప్రదేశ్లోని చంబా జిల్లా భర్మౌర్లో వెలుగులోకి వచ్చింది. బయట అడుగుపెట్టడానికే మనుషులు భయపడేంతటి గడ్డకట్టే చలిలో.. భారీ మంచు కురుస్తున్నా.. తన చనిపోయిన యజమాని వెంటే నాలుగు రోజుల పాటు ఉండిపోయింది ఓ పిట్బుల్ శునకం..భర్మౌర్లోని భర్మణి ఆలయం సమీపంలో యువకులు విక్షిత్ రానా, పియూష్ అదృశ్యమయ్యారు. ప్రతికూల వాతావరణం కారణంగా వారు మంచులో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. నాలుగు రోజుల తర్వాత సహాయక బృందాలు, స్థానిక గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకున్నప్పుడు అక్కడ కనిపించిన దృశ్యం అందరినీ కన్నీరు పెట్టించింది. పియూష్ మృతదేహం మంచు పొరల కింద కూరుకుపోయి ఉండగా, అతని పెంపుడు కుక్క మాత్రం అతని పక్కనే కూర్చుని ఉంది.खोने का दर्द... कैसे करे बयानभारी फीट बर्फबारी में भी नहीं छोड़ा साथ, 4 दिन भूखा-प्यासा मालिक के शव की निगरानी करता रहा#chamba #dog pic.twitter.com/elMS11O7xZ— Pravin Yadav/प्रवीण यादव (@pravinyadav) January 26, 2026 ఆ నాలుగు రోజుల పాటు ఆహారం ముట్టని ఆ మూగజీవి.. కనీసం ఆ ప్రదేశం నుంచి కూడా కదల్లేదు. గడ్డకట్టే గాలులను, మంచు తుఫానును తట్టుకుంటూ.. తన యజమాని మృతదేహాన్ని అడవి జంతువుల బారి నుంచి కాపలా కాసింది. రెస్క్యూ బృందం మృతదేహాన్ని తీసుకెళ్లడానికి ప్రయత్నించినప్పుడు.. ఆ కుక్క మొదట దూకుడుగా ప్రవర్తించింది. గుర్తు తెలియని వ్యక్తులు తన యజమానికి హాని చేయడానికి వచ్చారమోనని భావించింది. చివరకు సహాయక బృందం ఎంతో ఓపికతో ఆ కుక్కను శాంతింపజేసి, తాము సహాయం చేయడానికే వచ్చామని నమ్మించడంతో ఆ శునకం వెనక్కి తగ్గింది. జంతువుల ప్రేమ, విశ్వాసం మరణం తర్వాత కూడా నిలిచి ఉంటాయని ఈ ఘటన నిరూపించింది. -
ప్రియుడ్ని పెట్టెలో దాచిన ప్రియురాలు
-
'చల్లటి ఫలుడా'ని ఆస్వాదిస్తున్న సునీతా విలియమ్స్..!
భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ ఇటీవల కేరళను సందర్శించారు. అక్కడ ఆమె వెర్మిసెల్లి(సేమ్యాలు)తో చేసిన చల్లటి డెజర్ట్ని ఆస్వాదిస్తునన్న వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఆ వీడియోలో సునీతా పీచ్రంగు టీ షర్ట్ ధరించి తన చుట్టూ ఉన్న వ్యక్తులతో సరదాగా గడుపుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వీడియోని ఫలుడా నేషన్ అనే అవుట్లెట్ స్టోర్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ..ఈ క్షణం ఎప్పటికీ మర్చిపోలేం. సునీతా విలియమ్స్ని ఫలూడాకు స్వాగతించడం ఎంత గౌరవం. అంతరిక్షం నుంచి మా స్టోర్కి ఆ ఆలోచన మమ్మల్ని విస్మయానికిలోను చేస్తోంది.ఆమె మా రుచులన పంచుకోవడం..అదోక గొప్ప వరంగానూ, గర్వంగానూ ఉంది". అని పోస్ట్లో పేర్కొంది. ఈ వీడియోకి మిలియన్స్కు పైగా వ్యూస్ రావడమే గాక, ఆకామంత ఎత్తుగా కలలు కనడం నేర్పిన వ్యక్తి అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. కాగా, సునీతా 27 ఏళ్ల సేవల అనంతరం ఇటీవలే నాసా నుంచి పదవీ విరమణ చేశారు. ఆమె అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో మూడు మిషన్లు పూర్తి చేసిన ఘనత ఆమెది. అలాగే ఆమె కెరీర్లో మానవ అంతరిక్ష ప్రయాణ రికార్డులను నెలకొల్పారామె. View this post on Instagram A post shared by Falooda Nation (@faloodanation.in) (చదవండి: ఇంటిపేరే ‘బెంగళూరు’..!) -
ఇంటిపేరే ‘బెంగళూరు’..!
కొన్ని ఇంటి పేర్లు, ఊర్లు, గ్రామాల పేర్లుగా ఉండటం చూశాం. అంతేగానీ మెట్రో నగరాల్లాంటి మహా నగరాల పేరే ఇంటిపేరుగా ఉండటం గురించి విన్నారా?. వాట్ సీటీ పేరు ఇంటి పేరుగానా అని అనుకోకండి. ఇది నమ్మక తప్పని నిజం. ఓ మహిళ ఇంటిపేరే బెంగళూరు. ఎందుకలా వింటే.. ఆలోచన వేరేలెవెల్ అని అంటారు. మరి ఆ పేరు ఎందుకు పెట్టుకుందో ఆమె చకచక చదివేయండి మరి..!.బెంగళూరుకు చెందిన విప్రా బెంగళూరు అనే మహిళ తను పుట్టి.. పెరిగిన నగరంతో ముడిపడి ఉన్న జ్ఞాపకాలను ఓ వీడియో రూపంలో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ఇది నెటిజన్ల దృష్టిని అమితంగా ఆకర్షించడమేకాదు ఆమె తాత ఆలోచనకు ఫిదా అయ్యారు కూడా. మీ తాతగారి ముందుచూపుకి హ్యాట్సాఫ్ అంటూ ప్రశంసల జల్లు కురిపించారు. ఆమె తన వాయిస్ ఓవర్తో వివరించి వ్యక్తిగత కథ అందరి మనసులను తాకింది. ఆ వీడియోలో క్లిప్లో విప్రా ఇలా చెప్పడం ప్రారంభించింది. తన ఇంటి పేరు బెంగళూరు అని ఉండటం గమనించారా. ఇదేంటని అనుకుంటున్నారా..?. అయితే నగరం పేరు ఇంటిపేరుగా ఎలా మారిందో మీకు తెలియాలి అంటూ వివరించడం మొదలుపెట్టింది ఆమె.."మా తాతయ్య నిజానికి తన పిల్లలకు అంటే మా నాన్నకు ఇంటి పేరు పెట్టలేదు. ప్రజలు వారి ఇంటి పేరుని బట్టి వారి నేపథ్యం, హోదాను అంచనా వేస్తారనే ఉద్దేశంతో తన పిల్లలకు ఇంటిపేరు పెట్టేందుకు ఇష్టపడ లేదు. దాంతో మా నాన్నకు ఇంటిపేరు లేదు. ఇక నా వద్దకు వచ్చేటప్పటికీ..ఇంటి పేరు తప్పనిసరి కావడంతో..నేను పుట్టిన బెంగుళూరు నగరమే నా ఇంటి పేరుగా మారింది అని వివరించింది "విప్రా బెంగళూరు. ఈ మహిళ కథ తన తాతయ్య సామాజిక కట్టుబడులకు దూరంగా ఉంచడానికి ఆయన ఎలాంటి స్పృహతో వ్యవహరించారో అవగతమవుతోంది. తన పిల్లలకు ఇంటి పేరు పెట్టకుండా..వ్యక్తిగతంగా వారి నేపథ్యం, గుర్తింపుతోనే బతికేలా చేసేందుకు ఆయన ప్రయత్నించిన తీరు నిజంగా ప్రశంసనీయం. అలాగే ఇంటి పేరు తప్పనిరి పరిస్థితులో తను పుట్టిన నగరమే తన గుర్తింపుగా మార్చుకోవడం కూడా తాత ఆశయాలకు అనుగుణంగా చాలా అర్థవంతంగా ఉంది కదూ..!. నెటిజన్లు కూడా ఆ మహిళ ఇంటి పేరు వెనుక ఉన్న ఆలోచన చాలా గొప్పగా, ఆదర్శంగా ఉందంటూ ఆమె తాతపై ప్రశంసల వర్షం కురిపిస్తూ.. పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Vipra Bangalore (@vip_z_z) (చదవండి: ఒత్తిడికి మూలం డబ్బేనా..!) -
పాచిపోయిన పప్పు, కంపు గొట్టే కూర : వందే భారత్ రైల్లో ఫుడ్పై వైరల్ వీడియో
వందే భారత్ స్లీపర్ రైళ్ల ప్రారంభోత్సవం తర్వాత ఆహార నాణ్యతపై మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. తమకు పాడైపోయిన ఆహారాన్ని అందిస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. దీనికి సంబంధించి ప్రయాణీకులు క్యాటరింగ్ సిబ్బందితో తలపడుతున్నవీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వందే భారత్ రైళ్లలో ఆహార నాణ్యతపై మరో కొత్త దుమారం చెలరేగింది.కోల్కతాకు వెళ్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్కు చెందినవిగా ఈ వీడియోలో అన్లైన్ షేర్ అవుతున్నాయి. దీని ప్రకారం ఇది తినడానికి పనికి వచ్చే ఆహారమైనా అని ప్రశ్నిస్తూ క్యాటరింగ్ సిబ్బందితో ప్రయాణీకులు వాదనకు దిగారు.తమ ఆహార ప్యాకెట్లను తిరిగిచ్చారు. “ఈ పప్పు చూడండి కుళ్ళిపోయింది, కూర కంపు కొడుతోంది అంటూ ఒక ప్రయాణికుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. సెమీ-హై-స్పీడ్ రైళ్లలో అధిక ధరల పాటు భోజనానికి ప్రయాణికులకు ప్రీమియం ధరలు వసూలు చేస్తారని మండిపడ్డారు.WATCH | Passengers on the Kolkata bound Vande Bharat Express allege they were served rotten, foul smelling food onboard. pic.twitter.com/RLvps0Ze1O— The News Drill™ (@thenewsdrill) January 25, 2026 దీంతో వందే భారత్ పేరుతో తీసుకొచ్చిన సెమీ-హై-స్పీడ్ భారతదేశ ప్రధాన రైళ్లలో ఆహార ప్రమాణాలపై మరోసారి చర్చకు తెరలేచింది. చాలామంది వినియోగదారులు ఇలాంటి అనుభవాలను కామెంట్లలో హెరెత్తించారు. ఈ సమస్య ఒకే రూట్కే పరిమితం కాదని ఎక్కడ చూసినా ఇదే తంతు అని విమర్శించారు. వారణాసి-పట్నా వందేభారత్ ఎక్స్ప్రెస్లో జరిగిన ఇలాంటి సంఘటనను ఒక యూజర్ గుర్తు చేసుకుంటూ, ప్రయాణీకులు ఎక్కువ చెల్లించినప్పటికీ మెరుగైన సేవలు ఎందుకు అందడం లేదని ప్రశ్నించారు. అధిక ఛార్జీలు చెల్లిస్తున్నాం దీనిపై మనం ఎందుకు ప్రశ్నించకూడదు అని మరొకరు రాశారు. మరికొందరు పరిష్కారాలను సూచించారు. నాణ్యమైన ఫుడ్ అందించలేకపోతేఇండియన్ రైల్వేలు భోజనాన్ని అందించడం పూర్తిగా నిలిపివేయాలని కొందరు వాదించారు. ఇలాంటి ఫుడ్ తీసుకోవద్దు, బిస్కెట్లు, చిప్స్ వంటి ప్యాక్ చేసిన ఆహారాన్ని మాత్రమే తినండి" అని ఒకరు సూచించారు, వందే భారత్ రూట్లలో ఆహారం పేరుకే ప్రీమియం, క్వాలిటీ యావరేజ్ కంటే తక్కువే అని కామెంట్ చేయడం గమనార్హం. ఇదీ చదవండి: ఏడాదికి రూ. 39 కోట్లు : ఈ బిజినెస్ గురించి తెలుసా? We've made efforts to include local cuisine in our menu. On 22/01/26 first day run, after receiving feedback, we withdrew the Assamese-style dal from some passengers due to its tangy flavor and offered alternative meals. The menu has been revised since and we're receiving… https://t.co/SjnDDxnADY— IRCTC (@IRCTCofficial) January 26, 2026 IRCTC వివరణ మరోవైపు ఈ ఆరోపణలను ఖండిస్తూ IRCTC ఒక ప్రకటన జారీ చేసింది. వందేభారత్ రైళ్లలో అందించే ఆహారం, ప్రారంభం, వాణిజ్య ప్రకటనల సమయంలో ఎంత నాణ్యంగా ఉండో ఇపుడు కూడా అలాగే ఉంటుందని తెలిపింది. పప్పు, బియ్యం లేదా పులావ్, కూరగాయలు లేదా పన్నీర్ గ్రేవీ, పొడి కూరగాయలు, చపాతీ లేదా స్వీట్ను భోజనంలో అందిస్తారని, స్థానిక ఆహారాన్ని అందించేందుకు ఒక గొప్ప క్యాటరింగ్ సంస్థ బాధ్యత వహిస్తోందని కూడా ఐఆర్సీటీసీ వివరించింది. ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్న ఒకవీడియోను కూడా ట్వీట్ చేసింది. -
గజగజలాడే చలిలో వెచ్చదనంతో కూడిన దయ..!
గజగజలాడే చలిలే కాసింత వెచ్చదనం ఇచ్చే హాయి అంత ఇంత కాదు. వసంత పంచమి తర్వాత హిమచల్ప్రదేశ్ వంటి హిమాలయ పర్వత ప్రాంతాల్లో దట్టమైన హిమపాతంతో పరుచుకున్న సంగతి తెలిసింది. అక్కడున్న చాలా గ్రామాలు మంచుదుప్పటి కప్పుకున్నాయా..? అన్నంతగా మంచు కురుస్తుంది. పాపం పర్యాటకులు హిమాచల్ ప్రదేశ్లోని మనాలిలో ఈ మంచు తుఫానులో చిక్కుకున్నారు.వారి కార్లన్నీ రోడ్లపై దిగ్బంధించి ఉన్నాయి. విద్యుత్, నీటి సరఫరా అంతరాయంతో బిక్కుబిక్కుమంటున్నారు అక్కడి పర్యాటకులు. ఈ విపత్కర సమయంలో స్థానికులు స్పందించిన విధానం నెటిజన్లు హృదయాలను దోచుకుంది. ఇటీవల సోషల్ మీడియా పుణ్యమా అని ప్రతీది రీల్స్లా మారిపోయింది. కానీ ఇక్కడ స్థానికి మహిళలు చాలా నిశబ్దంగా మంచు తుఫానులో చిక్కుకున్న పర్యాటకులకు వెచ్చటి చాయ్ని అందించి స్వాంతన చేకూర్చారు. మనాలీ సమీపంలోని గోజ్రా గ్రామానికి చెందిన స్థానిక మహిళలు గడ్డకట్టిన వాహనాల్లో చిక్కుకున్న ప్రయాణికులకు సహాయం చేయడానికి వేడినీటి ప్లాస్క్లతో బయటకు వచ్చి వారికి సర్వ్ చేయడం విశేషం. ఎక్కడా.. హడావిడి గానీ హంగామా గానీ లేదు..సౌమ్యంగా సహాయం చేస్తున్న విధానం అందరి మనసులకు హత్తుకుంది. గణతంత్రపు దినోత్సవం ప్లస్ వారాంతపు సెలవు కలిసిరావడంతో మనాలికి పర్యాటకుల తాకిడి ఎక్కువైంది. సరిగ్గా దానికి తగ్గట్టు కఠినమైన వాతావరణం ఇబ్బంది పెడితే.. స్థానికులు మాత్రం ఆతిథ్యంతో 'స్వచ్ఛమైన హిమచల్ స్ఫూర్తి'ని కనబర్చి మానవత్వం చాటుకోవడం అందర్నీ ఆకర్షించింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా ఇది పర్యాటకానికి సంబంధించిన రీల్స్ కాదు..నిశబ్దంగా చెబుతున్న మానవత్వపు చర్య ఇది అంటూ పోస్టులు పెట్టారు. The most beautiful video on Tourism Day.Local women serving hot tea to tourists stranded in Manali’s snowfall traffic jam. No noise, no show off, just warmth and kindness.Across tourist states, one thing stays common. Be polite, be gentle, and people will always step up to… pic.twitter.com/gmxhGX3mt9— Nikhil saini (@iNikhilsaini) January 25, 2026 (చదవండి: 'ఒంటరి పెంగ్విన్'..ఇంత స్ఫూర్తిని రగలించిందా..!) -
ఇదేం బౌలింగ్ సామీ.. నిప్పులు చెరిగిన బుమ్రా
గౌహతిలోని బర్సాపరా క్రికెట్ స్టేడియంలో న్యూజిలాండ్తో ఇవాళ (జనవరి 25) జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా నిప్పులు చెరుగుతున్నాడు. ఈ మ్యాచ్లో అర్షదీప్ సింగ్ స్థానంలో బరిలోకి దిగిన బుమ్రా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న భారత్ న్యూజిలాండ్ను ఇబ్బంది పెడుతోంది. 14.4 ఓవర్లు పూర్తయ్యే సరికి ఆ జట్టు 112 పరుగులు చేసి సగం వికెట్లు కోల్పోయింది. కాన్వే (1), సీఫర్ట్ (12), రచిన్ రవీంద్ర (4), చాప్మన్ (32), డారిల్ మిచెల్ (14) ఔట్ కాగా.. గ్లెన్ ఫిలిప్స్ (48), సాంట్నర్ క్రీజ్లో ఉన్నారు.భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా 2 వికెట్లు పడగొట్టగా.. హర్షిత్ రాణా, బిష్ణోయ్, బుమ్రా తలో వికెట్ తీశారు. వీరిలో బిష్ణోయ్, బుమ్రా అత్యంత కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుండగా.. మిగతా వారు పర్వాలేదనిపిస్తున్నారు. ఇప్పటివరకు బౌలింగ్ చేసిన దాంట్లో కుల్దీప్ యాదవ్ (3-0-32-0) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. దూబే కూడా ఓ ఓవర్ వేసి 13 పరుగులిచ్చాడు.గాల్లో నాట్యంఇన్నింగ్స్ 6వ ఓవర్ తొలి బంతికి బుమ్రా అద్భుతం చేశాడు. ఫుల్ లెంగ్త్ బంతిని డిఫెండ్ చేసుకునే క్రమంలో సీఫర్ట్ పూర్తిగా విఫలమయ్యాడు. దీంతో బంతి సీఫర్ట్ బ్యాట్ను ఆఫ్ స్టంప్ను గిరాటు వేసింది. బుమ్రా సంధించిన వేగానికి వికెట్ కాసేపే గాల్లో నాట్యం చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరలవుతుంది.A PEACH FROM THE BEST BOWLER OF GENERATION - BUMRAH 😍 pic.twitter.com/QyUNGzYLS1— Johns. (@CricCrazyJohns) January 25, 2026రెండు మార్పులతో బరిలోకి దిగిన టీమిండియాఈ మ్యాచ్ కోసం భారత్ రెండు మార్పులు చేసింది. అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి స్థానాల్లో జస్ప్రీత్ బుమ్రా, రవి బిష్ణోయ్ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు న్యూజిలాండ్ కూడా ఈ మ్యాచ్ కోసం ఓ మార్పు చేసింది. జకరీ ఫౌల్క్స్ స్థానంలో కైల్ జేమీసన్ తుది జట్టులోకి వచ్చాడు. కాగా, ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ తొలి రెండు మ్యాచ్ల్లో గెలిచి 2-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. ఈ మ్యాచ్లో కూడా టీమిండియా గెలిస్తే, మరో రెండు మ్యాచ్లు మిగిలుండగానే సిరీస్ కైవసం చేసుకుంటుంది.తుది జట్లు..న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, టిమ్ సీఫెర్ట్(w), రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్(c), కైల్ జామీసన్, మాట్ హెన్రీ, ఇష్ సోధీ, జాకబ్ డఫీభారత్: సంజు శాంసన్(w), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(c), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా -
'ఒంటరి పెంగ్విన్'..ఇంత స్ఫూర్తిని రగిలించిందా..!
ఓ డాక్యుమెంటరీ నుంచి వచ్చిన ఒంటరి నిహిలిస్ట్ పెంగ్విన్ క్లిప్ ఇప్పటికీ వైరల్ అవ్వుతూ స్ఫూర్తిని రగిలిస్తూ..యావత్తు ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. అంతేగాదు అసలేంటీ ఒంటరి పెంగ్విన్ కథ అని నెట్టింట చర్చలు లేవెనెత్తాయి. ఇది తిరుగుబాటుకు, ధైర్యానికి, పట్టుదలకు కేరాఫ్గా నిలిచింది. అందరు జీవిస్తారు కానీ ఈ ఎగరలేని పక్షి బతకాలని కోరుకుంటుందంటూ..ప్రేరణను అందించే కథలన్నీ గుట్టుగట్టలుగా ుపుట్టుకొచ్చేస్తుండటం విశేషం. ఇంతకీ ఈ ఒంటరి పెంగ్విన్ వెనుకున్న కథేంటంటే..!.నిజానికి పెంగ్విన్లు గుంపులు గుంపులు సంచరిస్తుంటాయి. కానీ ఇక్కడ వీడియోలోనిపెంగ్విన్ మాత్రం నా దారి రహదారి అంటూ..విభిన్నంగా వెళ్తోంది. అది కూడా అది వెళ్లే రూటు ఆహారం దొరికే ప్రదేశం కానేకాదు. సముద్రం వైపుకి వెళ్తున్న గుంపుని వదిలేసి మరి ఒంటరిగా వెళ్తుండటం అందర్నీ ఆకర్షించింది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం గ్రీన్ల్యాండ్ని స్వాధీనం చేసుకుంటారనే బెదిరింపులకు ఆద్యం పోసేలా ఈ ఒంటరి పెంగ్విన్ను కలిగి ఉన్న AI- రూపొందించిన చిత్రాన్ని కూడా పంచుకున్నారు. అంతేకాదు చాట్జీపీటీ సైతం పెంగ్విన్ ఒంటరిగా అలా ఎందుకు వెళ్తుందో సర్చ్ చేయగా..ఈ క్లిప్ వన్యప్రాణులను చూడలేదని పేర్కొనడం గమనార్హం. 2007లో చిత్రీకరించిన డాక్యుమెంటరీ వీడియోలో అంటార్కిటికాలో చిత్రీకరణ జరుగుతున్నప్పుడు, మనుషులను చూసి భయపడిన పెంగ్విన్ల గుంపు ఆహారం కోసం సముద్రం వైపు పరిగెత్తాయి.కానీ, ఒక్క 'అడిలీ పెంగ్విన్' (Adelie Penguin) మాత్రం ఆహారం కోసం, తన మనుగడ కోసం కాకుండా ఒంటరిగా 70 కి.మీ దూరంలో ఉన్న పర్వతం వైపుకి దూరంగా వెళ్తుండటాన్ని చూపిస్తుంది. ఈ డాక్యుమెంట్ని ప్రఖ్యాత దర్శకుడు వెర్నర్ హెర్జోగ్ రూపొందించారు. ఆయన ఈ పెంగ్విన్ వాక్ని డెత్మార్చ్ అని పిలిచాడు. ఎందుకంటే ఆ పెంగ్విన్ పర్వతం వైపుకి వెళ్తే చలికి ప్రాణాలు పోతాయి, పైగా అక్కడ ఆహారం కూడా దొరకదు. వెర్నర్ హెర్జోగ్, ఆ పెంగ్విన్ దారికి అడ్డుగా నిలబడ్డారు. దానిని పట్టుకుని మళ్ళీ పెంగ్విన్ల గుంపులో కలిపారు. View this post on Instagram A post shared by ज़िन्दगी गुलज़ार है ! (@zindagi.gulzar.h) కానీ, ఆ పెంగ్విన్ మాత్రం పట్టుదలతో మళ్ళీ గుంపు నుండి బయటకు వచ్చి అదే పర్వతం వైపు తన ప్రయాణాన్ని కొనసాగించింది. చావు తప్పదని తెలిసినా వెనక్కి తగ్గలేదు. ఆ ెపెంగ్విన్ గుండెధైర్యానికి ఫిదా అయిన నెటిజన్లు తమ జీవితాలతో పోల్చి చూసుకుంటున్నారు. పైగా దాన్నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని అంటుండుంటం విశేషం.గుంపులో గోవింద అన్నట్లుగా కాకుండా స్పెషల్గా ఉండాలని, గెలుపో ఓటమో తనకంటూ ఒక ప్రత్యేక మార్గాన్ని ఎంచుకోవడం ఎలా అనేందుకు ఈ పెంగ్విన్ ఒక రోల్మోడల్ అని కొందరు చెబుతున్నారు. మరి ొకొందరు ఈ పెంగ్విన్ డిప్రెషన్లో ఉందంటూ భావోద్వేగంగా పోస్టులు పెట్టారు. ాకానీ ఎక్కువమంది మాత్రం ఎగరలేని పక్షి అయినప్పటికీ..కాలినడకన పర్వత శిఖరాన్ని అందుకోవాలనే పట్టుదలకు సలాం అంటూ కితాబులు ఇచ్చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by @reels.olizzzz (చదవండి: కొండల నుంచి సభకు..!) -
వణికించే చలిలో పెళ్లి..అక్షింతలుగా హిమపాతం..!
వణికించే చలిలో పెళ్లి తంతు గురించి సినిమాల్లోనే చూసుంటాం. అందులో హీరో హీరోయిన్లు గడ్డకట్టిన మంచుని ఆస్వాదిస్తూ..గ్రాండ్గా పెళ్లి చేసుకుంటున్నట్లు చూపిస్తుంటారు. కానీ రియల్గా మాత్రం అంత ఎంజాయ్ఫుల్గా ఉండదు. ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోపై లుక్కేయండి మరి..ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్ జిల్లాలో భారీ హిమపాతం నడుమ ఓ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఆ జంట వసంత పంచమి రోజున పెళ్లి చేసుకున్నారు. అదే రోజున ఆ ప్రాంతంలో తొలి భారీ హిమపాతం కురిసింది. ఈ వివహ వేడుక ప్రసిద్ధిగాంచిన త్రియుగినారాయణ్ ఆలయంలో వైభవోపతంగా జరిగింది. ఈ త్రియుగినారాయణ్ ఆలయంలోనే సాక్షాత్తు ఆ పరమశివుడు, పార్వతిదేవి పెళ్లి చేసుకున్నారని భక్తులు విశ్వసిస్తుంటారు. అందువల్ల చాలామంది భక్తులు తమ దాంపత్యం బాగుండాలని, తాము కలకాలం కలిసి ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ ఆలయంలోనే పెళ్లిళ్లు చేసుకుంటుంటారు. అయితే పెళ్లి తర్వాత ఆ నూతన దంపతులు దట్టమైన మంచులో నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యం అత్యద్భుతంగా ఉంది. వారి పెళ్లిని ఆశ్వీరదిస్తూ..ప్రకృతి ఈవిధంగా పూల వర్షంలా హిమపాతాన్ని ఆ దంపతులపై కురిపిస్తుందా అన్నట్లుగా ఉంది ఆ దృశ్యం. ఇక ఈ వేడుకలో వధువు ప్రకాశవంతమైన ఎర్రటి లెహంగాలో మెరిసిపోతుండగా, వరుడు షేర్వేనీ విత్ జాకెట్ ధరించాడు. గజగజలాడిస్తున్న కఠిన వాతావరణాన్ని చూసి ఆ జంట ఆనందం వ్యక్తం చేస్తూ..ఇది ఆ దేవుడి ఆశీర్వాదంగా భావిస్తున్నాం ఆనందంగా చెబుతుండటం విశేషం. ఇదిలా ఉండగా, శుక్రవారం, ఉత్తరాఖండ్లో ఈ ఏడాదిలో తొలి హిమపాతం కురిసింది. ఉత్తరాఖండ్లోని గర్వాల్, కుమావోన్ డివిజన్లలోని బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి, ఔలి, ముస్సోరీ, చక్రతా, ధనౌల్టి, మున్సియారి వంటి వివిధ ప్రదేశాలలో భారీ హిమపాతం సంభవించింది. నైనిటాల్లోని చైనా పీక్, కిల్బరీ, అల్మోరాలోని దునగిరి, పౌరీలోని తర్కేశ్వర్ వంటి ఎత్తైన ప్రాంతాలు పూర్తిగా దట్టమైన మంచుదుప్పటితో కప్పబడ్డాయి. View this post on Instagram A post shared by mahendrasemwal (@mahendrasemwal1) (చదవండి: గౌరవానికి అసలైన అర్థం..! ఆ బైకర్ చేసిన పనికి..) -
ప్రపంచాన్ని కదిలించిన పెంగ్విన్ కథ ఇదే
-
గౌరవానికి అసలైన అర్థం..! ఆ బైకర్ చేసిన పనికి..
ఒక్క మాట కూడా మాట్లాడకుండా నిశబ్దంగా కూడా ఇతరులు మన్ననలను అందుకోవచ్చు. అందుకు నిదర్శనం ఈ నిశబ్ధ సన్నివేశం. నిజానికి అక్కడ ఆ వ్యక్తి చేసింది చిన్న పనే అయినే..ఎందరో హృదయాలను గెలుచుకుంది..నీ ఉదారమైన మనసుకి సెల్యూట్..నవ్వు గ్రేట్ భయ్యా అంటూ నెటిజన్లు పొగడ్తల వర్షం కురింపించారు. అంత గొప్ప పని ఏం చేశాడతడు అంటే..ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఎలాంటి సంభాషణ లేకుండా జరిగిన చిన్ని నిశబ్ద దృశ్యాన్ని కారులో ఉన్న రిషి పాండే అనే వ్యక్తి రికార్డుచేసి సోషల్ మీడియోలో పోస్ట్ చేయడంతో నెట్టింట వైరల్గా మారింది.కరెక్ట్ రెడ్ సిగ్నల్ పడగానే వాహనాలు ఆగి ఉన్నాయి..ఇంతలో ఓ సాదారణ సైక్లిస్ట్కి అక్కడ సమీపంలో ఆగి ఉన్న సూపర్ బైక్పై ఫోటో దిగాలనిపించింది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా..సూపర్ బైక్ని నడుపుతున్న బైకర్ని అడిగిమరి దాన్ని నడుపుతున్నట్టు ఫోటో తీసుకుంటాడు. సదరు బైకరే ఆ సైక్లిస్ట్ ఫోజులను క్లిక్మనిపించాడు. ఆ తర్వాత ఆ సైక్లిస్ట్ చిన్ని చిరునవ్వుతో బైక్ అతడికి ఇచ్చేసి వెళ్లిపోతున్న విధానం..బైకర్ని గౌరవిస్తున్నట్లుగానూ, అటు అతడు ఫుల్ హ్యాపీ అన్నట్లుగా ఉంది. ఇదంత కారులోంచి గమనిస్తున్న రిషి పాండే అనే వ్యక్తికి ఎంతో నచ్చి సైలంట్గా మొత్తం ఆ అందమైన దృశ్యాన్ని రికార్డు చేసి మరి నెట్టింట షేర్ చేశాడు. నెటిజన్ల సైతం అతడి విశాల మనసుకి ఫిదా అవ్వడమే గాక..గౌరవానికి అసలైన అర్థం ఈ కమనీయ దృశ్యం అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Rishi Pandey (@thewisestfool_rishi) (చదవండి: అబుదాబిలో కరీనా లుక్స్ అద్బుతః..! ఆ జాకెట్ అంత ఖరీదా..) -
ట్రెండింగ్లో 'ఒంటరి పెంగ్విన్'.. ఇంతకీ ఏంటి దీని స్టోరీ?
గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో 'పెంగ్విన్' స్టోరీ ఒకటి తెగ వైరల్ అవుతోంది. కొన్ని పెంగ్విన్స్ గుంపుగా సముద్రం వైపు వెళ్తుండగా.. ఒకటి మాత్రం ఒంటరిగా మంచు పర్వతాల్లోకి వెళ్తున్న వీడియో ఇది. చాలామంది దీనికి రిలేట్ అవుతున్నారు. తమని తాము ఆ ఒంటరి పెంగ్విన్లో చూసుకుంటున్నారు. ఇంతకీ ఈ సింగిల్ పెంగ్విన్ స్టోరీ ఏంటి? అసలేమైంది?(ఇదీ చదవండి: శోభిత 'చీకటిలో' సినిమా రివ్యూ)పెంగ్విన్ వీడియో.. సాధారణ వైరల్ వీడియో అయితే కాదు. దీని వెనక పెద్ద బ్యాక్ స్టోరీనే ఉంది. టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఐదేళ్ల క్రితం తన మ్యూజింగ్స్లో ఒంటరి పెంగ్విన్ గురించి చెప్పుకొచ్చాడు. సందర్భం ఏంటో తెలీదు గానీ ఇప్పుడు మరోసారి అది వైరల్ అవుతోంది. అంటార్కిటికాలో పెంగ్విన్స్ అన్నీ నివసిస్తుంటాయి. వీటి జీవన విధానం చాలా సింపుల్. సముద్రంలో ఉంటాయి. లేదంటే కాలనీల్లో ఉంటూ మిగతా పెంగ్విన్స్తో కలిసి పిల్లల్ని కంటూ ఉంటాయి. ట్రెండింగ్ అవుతున్న ఒంటరి పెంగ్విన్ వెనక మాత్రం కళ్లు చెమర్చే కథ ఉందట! మనుషులకే పరిమితమైన ప్రేమ, విరహం, వైరాగ్యం అనే ఎమోషన్స్ మూగజీవుల్లోనూ ఉంటాయని ఈ పెంగ్విన్ స్టోరీ చెప్పకనే చెబుతోంది.డైరెక్టర్ పూరీ జగన్నాథ్ చెప్పిన దానిబట్టి చూస్తే.. సాధారణంగా మగ పెంగ్విన్ తన భాగస్వామి పట్ల చాలా నమ్మకంగా ఉంటుంది. ఒకసారి జత కుదిరితే చనిపోయే వరకు ఆ బంధాన్ని వదులుకోదు. ఒకవేళ ఆడ పెంగ్విన్.. ఆ నమ్మకాన్ని వంచిస్తే లేదా బంధాన్ని బ్రేక్ చేస్తే మాత్రం మగ పెంగ్విన్ ఆ వియోగాన్ని తట్టుకోలేదు. ఈ ఒంటరి పెంగ్విన్ కూడా అలానే బంధం నుంచి దూరమైనట్లు తెలుస్తోంది. అందుకే మిగతా వాటితో కాకుండా ఒంటరిగా పర్వతాల వైపు వెళ్లదలుచుకున్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ హిట్ 'సర్వం మాయ'.. తెలుగులో స్ట్రీమింగ్)ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పెంగ్విన్ వీడియో బిట్.. 2007లో ప్రఖ్యాత దర్శకుడు వెర్నర్ హెర్జోగ్ తీసిన 'ఎన్కౌంటర్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్' అనే డాక్యుమెంటరీలోనిది. పరిశోధకుడు డాక్టర్ ఐన్లీతో కలిసి వెర్నర్.. అంటార్కిటికాలో ఓ పెంగ్విన్ గుంపుని గమనించినప్పుడు.. ఈ ఒంటరి పెంగ్విన్ని చూశారు. మిగతా పెంగ్విన్లు అన్నీ సముద్రం వైపు ఆహారం కోసం కదులుతుంటే..ఈ ఒంటరి పెంగ్విన్ మాత్రం కాసేపు అక్కడే ఆగిపోయింది. వెనక్కి తిరిగి దాదాపు 70 కిలోమీటర్లు దూరంలో ఉన్న మధ్యభాగం వైపు నడవటం మొదలుపెట్టింది. అది దారితప్పిందేమో అనుకుని తీసుకొచ్చి గుంపులో కలిపినా తిరిగి పర్వత ప్రాంతాల వైపు వెళ్లింది. దీంతో ఏదో విషయంలో అది మోసపోయిందని, జీవితంలో బాగా విసిపోయిందని.. అందుకే ఒంటరి దారిని ఎంచుకుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం ప్రేమలో విఫలమైందని అంటున్నారు.సోషల్ మీడియా.. ఈ ఒంటరి జీవికి 'నిహిలిస్ట్ పెంగ్విన్' అని పేరు పెట్టింది. ప్రస్తుతం జీవితం చాలా ఒత్తిడిగా మారిపోయిందని భావించే చాలామంది.. తమని తాము ఈ పెంగ్విన్లో చూసుకుంటున్నారు. ఎమోషనల్ అవుతున్నారు. పోటీతత్వం, బాధ్యతలు, జీవితంలో అలసట వల్ల 'ఇక చాలు' అని విషయాన్ని ఆ పెంగ్విన్ ప్రవర్తన ప్రతిబింబిస్తోందని మాట్లాడుకుంటున్నారు. ఏదేమైనా ఓ ఒంటరి పెంగ్విన్ వీడియో.. ఇంతలా సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం విశేషమే!(ఇదీ చదవండి: మృణాల్-ధనుష్ పెళ్లి చేసేశారు.. వీడియో వైరల్)The Original 🐧 Story 🙂#penguin pic.twitter.com/TR6L5Adm7Q— THE LITTLE SQUIRREL 🇮🇳🚩🐿️⚡️ (@ReadwithLS) January 23, 2026 -
సెలబ్రిటీలను సైతం ఇన్స్పైర్ చేసిన 70 ఏళ్ల బామ్మ
అనుకున్నది సాధించేందుకు,అద్భుతాల సృష్టించేందుకు వయసుతో పనిలేదని నిరూపిస్తున్నారు లేటు వయసు సిటిజన్లు. ఇటీవల ఉత్తర ప్రదేశ్కు చెందిన 70 ఏళ్ల వినోద్ కుమార్ శర్మ తొలి వ్లాగ్లొ అద్భుతమైన వ్యూస్ సాధించి వార్తల్లో నిలిచాడు. ఏదో సరదాగా చేసిన వ్లాగ కేవలం 72 గంటల్లోనే 3 కోట్ల వ్యూస్ సాధించడం అంటే మామూలు విషయం కాదు. సంకల్ప ఉంటే సాధ్యం కానిది ఏదీ లేదంటూ నిరూపిస్తున్న మరో 70 ఏళ్ళ మహిళ ప్రస్తుతం నెట్టింట సందడిగా మారారు.ఇన్స్టాగ్రామ్ బయో ప్రకారం, సంగ్వాన్ 68 సంవత్సరాల వయసులో వెయిట్ లిఫ్టింగ్ ప్రారంభించారు. ఆమె ఆర్థరైటిస్ పేషెంట్ , ప్రొఫెషనల్ పవర్ లిఫ్టర్. రోష్ని దేవి సంగ్వాన్ (70) ప్రొఫెషనల్ పవర్ లిఫ్టర్గా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఆర్థరైటిస్తో బాధపడుతున్నప్పటికీ తన బలాన్ని, శక్తిని ప్రదర్శిస్తూ.. ప్రజలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఆమె దృఢ సంకల్పం సోషల్ మీడియా వినియోగదారులను మాత్రమే కాకుండా నటుడు సునీల్ శెట్టితో సహా ప్రముఖులను కూడా ప్రేరణగా నిలిచింది.ఇదీ చదవండి: పెప్సికో ఇండియా కీలక బాధ్యతల్లో సవితా బాలచంద్రన్ప్రొఫెషనల్ పవర్ లిఫ్టర్ అయిన రోష్ణి దేవి సంగ్వాన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన కొత్త వీడియో 14 మిలియన్లకు పైగా వ్యూస్తో తెగ వైరల్ అవుతోంది. ఇన్స్టాగ్రామ్ రీల్లో సన్నీ డియోల్, అహాన్ శెట్టి , వరుణ్ ధావన్ కీలక పాత్రల్లో నటించిన కొత్త చిత్రం బోర్డర్ 2 మూవీలోని ఘర్ కబ్ ఆవోగే పాటకు సెట్ చేశారు. సునీల్ శెట్టి , సన్నీ డియోల్ ఈ రీల్పై వ్యాఖ్యానిస్తే, 40 ఏళ్ల తరువాత సినిమా హాల్లో బోర్డర్ 2 సినిమా చూస్తుంది అనే క్యాప్షన్తో ఈ వీడియో పోస్ట్ కావడం విశేషం. దీంతో "మీరు చాలా స్ఫూర్తి మంతులు. జై హింద్ జై భారత్," సునీల్ శెట్టి వ్యాఖ్యానించారు. చాలా బావుంది మేడమ్ అంటూ ఆయన కుమారుడు అహన్ శెట్టి కూడా స్పందించారు. View this post on Instagram A post shared by Roshni Devi Sangwan (@weightliftermummy)కాగా రోష్ణి దేవి సంగ్వాన్ ఇన్స్టాగ్రామ్లో 116 వేలకు పైగా అనుచరులను కలిగి ఉన్నారు. సంగ్వాన్ 103 కిలోల బరువును డెడ్లిఫ్టింగ్ చేయడం గమనార్హం. కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్తో బాధపడుతున్నఆమె, జీవనశైలిలో మార్పులు, కష్టమైనవ్యాయామం సవాలుతో కూడుకున్నది అయినప్పటికీ, శరీరం చెప్పినట్టుగా విని కాలక్రమేణా తన బలాన్ని తిరిగి పొందగలిగినట్టు చెప్పారు. -
మాజీ క్రికెటర్తో హార్దిక్ పాండ్యా గొడవ!?.. వీడియో వైరల్
న్యూజిలాండ్తో టీ20 సిరీస్తో టీమిండియాలో పునరాగమనం చేశాడు ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా. ఆసియా టీ20 కప్-2025 సందర్భంగా గాయపడిన అతడు పూర్తిగా కోలుకుని దేశీ క్రికెట్లో సొంత జట్టు బరోడా తరఫున బరిలో దిగినప్పటికీ.. కివీస్తో వన్డే సిరీస్ నుంచి మేనేజ్మెంట్ అతడికి విశ్రాంతినిచ్చింది.మొత్తంగా రెండు వికెట్లుఈ క్రమంలో నాగ్పూర్లో న్యూజిలాండ్తో తొలి టీ20 సందర్భంగా బుధవారం రీఎంట్రీ ఇచ్చిన హార్దిక్.. ఆ మ్యాచ్లో 16 బంతుల్లో 25 పరుగులు చేయడంతో పాటు.. ఒక వికెట్ తీశాడు. తాజాగా రాయ్పూర్లో శుక్రవారం నాటి రెండో టీ20లోనూ ఒక వికెట్ పడగొట్టిన ఈ పేస్ ఆల్రౌండర్కు బ్యాటింగ్ చేయాల్సిన అవసరం రాలేదు.వన్డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (32 బంతుల్లో 76), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (37 బంతుల్లో 82 నాటౌట్).. ఆల్రౌండర్ శివం దూబే (18 బంతుల్లో 36 నాటౌట్) ధనాధన్ దంచికొట్టడంతో భారత్ 15.2 ఓవర్లలోనే కివీస్ విధించిన 209 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.మురళీ కార్తిక్తో గొడవ?ఇదిలా ఉంటే.. హార్దిక్ పాండ్యాకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రెండో టీ20కి ముందు అతడు.. మాజీ క్రికెటర్, కామెంటేటర్ మురళీ కార్తిక్తో గొడవపడినట్లు తెలుస్తోంది. బ్యాట్తో హార్దిక్ మైదానంలోకి వస్తుండగా.. మురళీ కార్తిక్ అతడిని పలకరించాడు.ఇంతలోనే కోపోద్రిక్తుడైన హార్దిక్ అతడితో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో మురళీ కార్తిక్ వివరించే ప్రయత్నం చేయగా.. హార్దిక్ మాత్రం మాటల బాణాలు వదులుతూనే ఉన్నట్లు కనిపించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, వీరిద్దరు ఏ విషయంపై గొడవపడ్డారు? అసలేం జరిగింది? అన్నది మాత్రం తెలియరాలేదు. హార్దిక్ అభిమానులు మాత్రం మురళీ కార్తిక్ ఏదో అడగకూడని విషయం అడిగినందుకే ఇలా రియాక్ట్ అయి ఉంటారని కామెంట్లు చేస్తున్నారు.చదవండి: ఇషాన్ ఏం తిన్నాడో ఏమో.. నాకైతే కోపమొచ్చింది: సూర్య కుమార్🚨 Hardik Pandya angry at Murali Kartik – Hardik Pandya had an argument with Murali Kartik before the IND vs NZ 2nd ODI in Raipur. pic.twitter.com/axpjLykXfY— Sonu (@Cricket_live247) January 23, 2026 -
జస్ట్ మిస్.. రీల్స్ పిచ్చికి ప్రాణాలు గాల్లో కలిసిపోయేవే!
-
బెడ్రూమ్ నుంచి సరాసరి పీఎస్కు..
ఓరీ నా కొడకో.. నీకు ఎంత కష్టం వచ్చిందిరో అంటూ ఆ తల్లి పరిగెత్తుకుంటూ కొడుకు బెడ్రూమ్ వైపు గబగబా పరుగులు తీసింది. అక్కడ కనిపించిన దృశ్యంతో ఆమె, గ్రామస్తులు షాక్ తిన్నారు. అతన్ని ఓ మంచానికి కట్టేసింది అతని భార్య. ముదనష్టపుది అంటూ కోడలి గురించి గొణుక్కుంటూనే ఆ అత్త పెద్దమనుషుల సాయంతో కొడుకు చేతులకు కట్టిన తాడుల్ని విడిపించింది. ఇక్కడి నుంచి అసలు హైడ్రామా నడిచింది.. ఉత్తర ప్రదేశ్ అలీగఢ్లో నేరుగా బెడ్రూమ్ నుంచి టప్పల్ పోలీస్ స్టేషన్కు చేరిన పంచాయితీ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. తన కొడుకును కోడలు హింసిస్తోందని.. తాజాగా మంచానికి కట్టేసిందని.. గట్టిగా మందలిస్తే తనకు తుపాకీ చూపించిందంటూ ఓ ఫొటోను పోలీసులకు అందించిందా అత్త. అందులో కోడలు యిస్టైల్గా పిస్టల్తో ఫోజు ఇచ్చింది. దీంతో.. కోడలిని పీఎస్కు పిలిపించుకున్న పోలీసులు అసలు విషయంపై ఆరా తీశారు. అయితే తాను అలా చేయడానికి బలమైన కారణం ఉందని ఆమె చెప్పుకొచ్చింది. రోజూ తాగి వచ్చి తన భర్త ప్రదీప్ తనను హింసిస్తున్నాడని.. ఇరుగుపొరుగువాళ్లనూ బండ బూతులు తిడుతున్నారని సోనీ వాపోయింది. నాలుగేళ్ల కిందట తమ వివాహం అయ్యందని.. గత రెండేళ్లుగా కట్నం కోసం వేధిస్తూ వస్తున్నాడని చెప్పింది. ఈ క్రమంలోనే తాగుబోతు భర్త తీరుతో విసిగిపోయి అలా మంచానికి కట్టేశానని చెప్పిందామె. అదే సమయంలో ఆ తుపాకీ నకిలీదని తేలింది. దీంతో ఆ అత్త షాక్ తింది. దీంతో.. ఆ అత్తాకోడళ్లకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ప్రస్తుతానికైతే.. నెట్టింట ప్రదీప్ను మంచానికి కట్టి అత్తతో సోని గొడవపడుతున్న వీడియో వైరల్ అవుతోంది.UP Woman Ties Husband To Bed, Mother-In-Law Shows Cops Her Pic With Gun https://t.co/8I6zGHEmMl pic.twitter.com/uCp3h2XqJK— NDTV (@ndtv) January 23, 2026 -
శవం సడెన్గా కాళ్లు పైకి లేపింది...ఇదిగో వీడియో!
శ్మశానంలో ఒంటరిగా ఉంటానని పందెం కాసి,చిన్ అలికిడికే ప్రాణాలు పోగొట్టుకున్న గాథలు గురించి విన్నాం. దెయ్యాలతో మాట్లాడే భేతాళ కథలు విన్నాం. కానీ చనిపోయిన తరవాత శవాలు కదులుతాయని, వాటి శరీర భాగాల్లో ఒక్కసారిగా చలనం వస్తుందని తెలుసా? చాలా అరుదే అయినప్పటికీ కొన్ని ప్రత్యేక కారణాల వల్ల శవాల్లో ఇలా కదలికలు కనిపిస్తాయట. అంత మాత్రాన ప్రాణం తిరిగి వచ్చినట్టు కాదు. మరి అదేంటో చూద్దాం.⚠️ Why Bodies Sometimes Move After Death The Lazarus Sign Explained pic.twitter.com/VrsrYqhg9u— OANASA (@OANASA_X_) January 22, 2026మార్చురీలో లేదా చనిపోయిన తర్వాతమృతదేహాలు కదలడం వినడానికి కొంత భయానకంగా అనిపించినప్పటికీ, దీని వెనుక శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. దీనిని సైన్స్ భాషలో "లాజరస్ సైన్" (Lazarus Sign) లేదా "పోస్ట్మార్టం మూవ్మెంట్స్" (Postmortem movements) అని పిలుస్తారు. మృతదేహాలు కదలడానికి ప్రధాన కారణాలుకండరాల సంకోచం (Muscle Contraction) మనిషి చనిపోయిన తర్వాత కూడా శరీరంలోని కణాలు వెంటనే చనిపోవు. నరాలలో మిగిలి ఉన్న విద్యుత్ సంకేతాలు లేదా కండరాలలో నిల్వ ఉన్న క్యాల్షియం వల్ల కండరాలు అకస్మాత్తుగా సంకోచించవచ్చు. దీనివల్ల కాళ్లు లేదా చేతులు స్వల్పంగా కదిలినట్లు అనిపిస్తుంది.రిగర్ మోర్టిస్ (Rigor Mortis) : మరణం తర్వాత శరీరం గట్టిపడటాన్ని 'రిగర్ మోర్టిస్' అంటారు. ఈ ప్రక్రియలో రసాయన మార్పుల వల్ల కండరాలు బిగుసుకుపోతాయి. ఈ సమయంలో శరీరం ఒక స్థితి నుండి మరో స్థితికి మారినప్పుడు (ఉదాహరణకు వేళ్లు ముడుచుకోవడం) అది కదలికలా కనిపిస్తుంది.వాయువుల విడుదల (Gas Accumulation): శరీరం కుళ్ళిపోయే క్రమంలో (Decomposition) లోపల బ్యాక్టీరియా వల్ల గ్యాస్ విడుదలవుతుంది. ఈ వాయువుల ఒత్తిడి వల్ల మృతదేహం ఉబ్బడం, కొద్దిగా పక్కకు తిరగడం లేదా నోటి నుండి శబ్దాలు రావడం (Death Rattle) వంటివి జరుగుతాయి.వెన్నెముక రిఫ్లెక్స్ (Spinal Reflexes) : కొన్నిసార్లు మెదడు చనిపోయినా, వెన్నెముకలోని నాడులు (Spinal cord neurons) ఇంకా ఉత్తేజితంగానే ఉండవచ్చు. దీనివల్ల మృతదేహం అకస్మాత్తుగా చేతులు పైకి ఎత్తడం వంటివి చేస్తుంది. దీనినే పైన చెప్పుకున్న లాజరస్ సైన్ అంటారు.అయితే వైద్యులు మరణాన్ని నిర్ధారించిన తర్వాత ఇలాంటి కదలికలు సహజమంటారు శాస్త్రవేత్తలు. ఇవి కేవలం భౌతిక , రసాయన మార్పులే తప్ప, ప్రాణం రావడం వల్ల జరిగేవి కాదని స్పష్టంగా చెబుతారు. -
అందుకేనా జపాన్ అంత క్లీన్గా ఉంటోంది..!
అత్యంత పరిశుభమైన దేశాల్లో ఒకటి జపాన్. చాలా పరిశుభ్రంగా ఉడే దేశాల్లో కూడా ఎక్కడో ఒక విషయంలో అధ్వాన్నంగా ఉంటుందేమో గానీ జపాన్ మాత్రం సూది మొనంత ధూళి కూడా కనిపించకుండా అందాల మెరిసిపోతుంది. అంత పరిశుభ్రంగానా అని అంతా ఆశ్యర్యపరిచేలా ఉంటుంది. అంతలా స్వచ్ఛత ఉండాలంటే..అక్కడ అందరిలో యూనిట్ కంటే..ఎలాంటి మనసతత్వం ఉంటే ఇది సాధ్యమైందో తెలిస్తే అవాక్కవుతారు. ఆ కారణం తెలుసుకున్నా..పాటించాలంటే కాస్త కష్టమే..!జపాన్ అంత శుభ్రంగా ఉండటానికి ఆ మానస్తత్వమే కారణమంటూ అక్కడ జరిగిన ఓ సంఘటను భారతీయ మహిళ ఊర్వశి రికార్డు చేసి మరి నెట్టింట షేర్ చేశారు. ఆమె షేర్ చేసిన వీడియోలో ఎవరో ఒక రెస్టారెంట్ వెలుపల వాంతులు చేసుకుంటున్నట్లు కనిపిస్తుంది. అయితే అలాంటివి మనదేశంలో చాలా కామన్..సాయంత్ర దాక అది అలానే ఉంటుంది. రేపు రోడ్లు ఊడ్చేవాళ్లు వచ్చేదాక అంతే పరిస్థితి అన్నట్లు ఉంటుంది. కానీ జపాన్లో ఆ రెస్టారెంట్ సిబ్బందిలో ఒకరు బయటకు వచ్చి ఏ మాత్రం అసహ్యించుకోకుండా నేరుగా చేతులతోనే క్లీన్ చేయడం విశేషం. పైగా అతడి ముఖంలో ఎలాంటి చిరాకు, అసహ్యం కనిపించలేదు. ఏదో తన పని తాను చేసుకున్నట్లుగా చాలా నిశబ్దంగా క్లీన్ చేసి వెళ్లిపోవడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆ వీడియోకి ఊర్వశి అక్కడ ధూళి కంటే మనస్తత్వం అత్యంత ముఖ్యం అనే క్యాప్షన్ జోడించి మరి నెట్టింట పోస్ట్ చేశారు. అక్కడ దాన్ని ప్రజా బాద్యతగా భావించి క్లీన్ చేస్తారు కాబట్టే జపాన్ అంత శుభ్రంగా ఉంటోంది అని మెచ్చుకుంటూ పోస్టులు పెట్టారు నెటిజన్లు. View this post on Instagram A post shared by Urvashi in Japan ⛩️🎏 (@uruchan_in_japan) (చదవండి: పెరిమెనోపాజ్ సమయంలో బరువు తగ్గాలంటే...!) -
ధోబీ ఘాట్లో కొరియన్ పిల్లల పనీ, పాటా : వైరల్ వీడియో
పిల్లలు పెంపకంలో తల్లిదండ్రులకు కచ్చితంగా కొన్ని సూత్రాలను పాటించాలి. తమలాగా తమ పిల్లలు కష్టపడకూడదనే ఉద్దేశంతో వాళ్లకి ఏ కష్టం తెలియకుండా, అడిగిందల్లా క్షణాల్లో కళ్ల ముందర ఉంచుతూ, కాలు కందకుండా పెంచాలని భావిస్తుంటారు. నిజానికి ఈ విధానం వల్ల పిల్లల్లో సోమరితనం, కష్టపడి సాధించాలనే తపన సామర్థ్యం, తగ్గిపోయే అవకాశాలు చాలా ఉన్నాయంటారు చైల్డ్ సైకియాట్రిస్టులు. అందుకే పిల్లలకు బాల్యం నుంచే శ్రమ విలువ, గౌరవం తెలిసేలా చేయాలి. ఒక విదేశీ మహిళ, తన బిడ్డలతో ఇలానే చేస్తోంది అంటే నమ్ముతారా? దీనికి సంబంధించి ఒక వీడియో నెట్టింట విశేషంగా నిలిచింది.‘వోనీ_బ్రదర్స్' అనే ఇన్స్టా ఖాతాలో భారతీయ పనిపద్ధతులు, జీవనశైలిని కొరియన్ కుటుంబానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. దీని ప్రకారం వివిధ భారతీయ అనుభవాలు, ఆహారాలు, లేదా ప్రయాణ విశేషాలు కాకుండా ఆ కుటుంబం తమ పిల్లలకు చేతులతో బట్టలు ఉతకడంలో ఉండే కష్టాన్ని చూపించాలని నిర్ణయించుకుంది. అలా ఇద్దరు చిన్న కొరియన్ పిల్లలు ముంబైలోని ప్రసిద్ధ ధోబీ ఘాట్కి వచ్చి, మురికి బట్టలకు బండకేసి బాది ఉతికారు. తల్లి కూడా దగ్గరే నిలబడి, వారితో పాటు బట్టలు ఉతకడం కూడా ఈ వీడియోలో చూడవచ్చు. దీనికి ముందు అక్కడి కార్మికులు బట్టలను శుభ్రం చేయడం, ఉతకడం లాంటి పనులను పిల్లలు జాగ్రత్తగా పరిశీలించడం విశేషం. "ధోబీ ఘాట్లో కొరియన్ పిల్లలు. నిజమైన భారతీయ జీవితాన్ని గడుపుతున్నారు. ధోబీ ఘాట్. నిజమైన పని, నిజమైన గౌరవం," అనే క్యాప్షన్తో షేర్ అయిన ఈ వీడియో నెటిజనులను బాగా ఆకట్టుకుంటోంది. View this post on Instagram A post shared by Jung ae Um🇰🇷 living in India🇮🇳 (@wonny_brothers)> ఇదీ చదవండి: క్రూర హంతకుల జైలు ప్రేమ, పెళ్లి : 15 రోజుల పెరోల్కాగా వోనీ_బ్రదర్స్ భారతదేశంలో మొదటిసారిగా పానీ పూరీని ప్రయత్నించిన వీడియో వైరల్ అయింది. అలాగే ఈ బ్రదర్స్లో ఒకరు సూపర్ సింగర్ జూనియర్ 9 పోటీదారు మైత్రేయన్తో కలిసి "కనిమా"అనే తమిళ పాటకు డాన్స్ చేస్తూ ఆన్లైన్లో అందరి దృష్టినీ ఆకర్షించారు. దీనిపై ఇది కేవలం రీల్స్ కోసం చేసినట్లు అనిపించవచ్చు గానీ, తల్లిదండ్రులు పిల్లలకు నేర్పే ఒక జీవిత పాఠం. దీనిని తేలికగా తీసుకోకూడదు," అని వ్యాఖ్యానించారు. -
వీడియో: చిన్నోడా.. అలసిపోయి ఉంటావ్!
ప్రధాని నరేంద్ర మోదీ కేరళ పర్యటనలో ఇవాళ ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. బహిరంగ సభకు హజరైన జనాల్లో ఓ పిల్లాడు చేసిన పని మోదీ దృష్టిని ఆకర్షించింది. అంతే.. ఆ వీడియో కాస్త నెట్టింట వైరల్ అవుతోంది. తిరువనంతపురంలో శుక్రవారం ప్రధాని మోదీ సభ జరిగింది. అయితే ఒక చిన్న పిల్లాడు ప్రధాని మోదీ డ్రాయింగ్ ఫోటోను ఎత్తిపట్టి చాలా సేపు నిలబడి ఉన్నాడు. అది గమనించిన ప్రధాని మోదీ.. తన ప్రసంగాన్ని ఆపి ఆ బాలుడిని ఉద్దేశించి మాట్లాడారు. ‘‘చిన్నోడా, నువ్వు చాలా సేపు ఫోటో పట్టుకుని నిలబడ్డావు. అలసిపోయి ఉంటావ్. ఆ ఫోటోను నాకు ఇవ్వు. దాని వెనకాల నీ చిరునామా రాయు. నేను నీకు వ్యక్తిగతంగా లేఖ రాస్తాను’’ అని అన్నారు. ఈ క్రమంలో.. ఆ పిల్లాడి చేతుల్లోని ఫొటోను జాగ్రత్తగా తీసుకోవాలని తన ప్రత్యేక రక్షణ బృందం (SPG)కి సూచించారు. అది ఆ బాలుడి ప్రేమ, ఆశీర్వాదాల ప్రతీక. దాన్ని జాగ్రత్తగా తీసుకోండి అంటూ వ్యాఖ్యానించారాయన. దీంతో సభ ఒక్కసారి చప్పట్లతో మారుమోగిపోయింది. ఆ సమయంలోనే.. మరో మహిళ ఓ పెద్ద పుస్తకాన్ని ఎత్తి మోదీ వైపు ప్రదర్శించింది. మోదీ ఆమెను కూడా గుర్తించి.. ఆమె కూడా నాకు ఏదో ఇవ్వాలని అనుకుంటున్నారు. పెద్ద పుస్తకం తయారు చేసి తీసుకొచ్చారు అని అనడంతో నవ్వులు పూశాయి. ఇక కేరళ సభలో మోదీ రాజకీయ ప్రసంగంలో.. సీపీఐ(ఎం), కాంగ్రెస్లపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేరళలో మార్పు అవసరమని.. అందుకు బీజేపీని ఆశీర్వదించాలని కేరళ ప్రజలను ఆయన కోరారు. ఇప్పటికే ఆ మార్పు మొదలైందని.. ప్రజల ఆశీస్సులతోనే కేరళలో కమల వికాసం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారాయన. ఈ పర్యటనలోనే ఆయన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, కొత్త రైలు సేవలను ప్రారంభించారు. కేరళ అభివృద్ధి కోసం కేంద్రం చేస్తున్న కృషిని కేరళ ప్రజలు గుర్తిస్తున్నారని వ్యాఖ్యానించారాయన. प्रधानसेवक मोदी जी के प्रति केरला के बच्चों का प्रेम pic.twitter.com/u0tKKimQsw— Dr Neetu Dabas 🇮🇳 (@INeetuDabas) January 23, 2026 -
దూసుకొచ్చిన ప్యాసింజర్ రైలు.. లారీ నుజ్జునుజ్జు..!
రాంచీ: జార్ఖండ్లో ఘోర రైలు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. రైల్వే క్రాసింగ్ వద్ద గేటు పడకపోవడంతో ట్రాక్పై వెళ్తున్న వాహనాలను ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. జార్ఖండ్లోని దేవోబంద్లో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.వివరాల ప్రకారం.. గోండా-అసన్సోల్ ఎక్స్ప్రెస్ రైలు గురువారం ఉదయం 9.30 గంటల సమయంలో దేవోబంద్ వద్దకు చేరుకుంది. ఇదే సమయంలో రైల్వే క్రాసింగ్ వద్ద గేటు వేయకపోవడంతో రోహిణి-నవాడిహ్ రైల్వే క్రాసింగ్ వద్ద రైలు పట్టాల మీదుగా పలు వాహనాలు వెళ్తున్నాయి. సరిగ్గా అదే సమయంలో రైలు గేటు వరకు వచ్చింది. కానీ, వాహనాలు మాత్రం ట్రాక్పైనే నిలిచిపోయి ఉన్నాయి. దీంతో, ట్రాక్పై ఉన్న లారీని రైలు ఢీకొట్టింది.A tragic incident occurred on the Jasidih-Madhupur section of the Eastern Railways.Who's at fault here? #IndianRailways pic.twitter.com/DDzAezLxwD— Trains of India 🇮🇳 (@trainwalebhaiya) January 22, 2026అయితే, అక్కడ పరిస్థితిని అర్థం చేసుకున్న లోకోపైలట్.. రైలుకు బ్రేకులు వేసి మెల్లగా రానిచ్చాడు. బియ్యం లోడుతో వెళ్తున్న లారీని మెల్లగా ఢీకొట్టి ఆగింది. ఆ లారీ ఒక పక్కకు ఒరిగింది. రెండు బైకులను అది ఢీకొట్టింది. అయితే ఆ బైకులపై ఉన్నవారు తృటిలో తప్పించుకున్నారు. దీంతో ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. మరోవైపు రైల్వే అధికారులు, ఆర్పీఎఫ్ సిబ్బంది, స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ గుమిగూడిన జనాన్ని వెళ్లగొట్టారు. ఈ ప్రమాదం నేపథ్యంలో రైళ్ల రాకపోకలను కొంతసేపు నిలిపివేశారు. ఆ తర్వాత పునరుద్ధరించారు.అయితే సిగ్నల్ క్లియరెన్స్ లేనప్పటికీ ఆ రైలు ముందుకు కదిలిందని గేట్ మ్యాన్ ఆరోపించాడు. ఈ నేపథ్యంలో గేట్ పడకపోవడం, సిగ్నలింగ్ వ్యవస్థలో లోపాలు, లారీ డ్రైవర్ నిర్లక్ష్యంపై రైల్వే అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
'నాకు ముగ్గురు కూతుళ్లు.. నన్నెవరూ భయపెట్టలేరు'
‘‘నన్ను చూసి ఏడ్వకు’’, ‘‘అందరూ బాగుండాలి.. అందులో నేనుండాలి’’ ఇలాంటి ఎన్నో సందేశాలను మనం సాధారణంగా ఆటోల వెనుక, లారీల వెనుక చూస్తూంటాం. వీటితో పాటు కొన్ని ఫన్నీ కోట్లు, చిత్ర విచిత్రమైన సందేశాలు కూడా మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. వీటన్నింటికి భిన్నంగా ఒక కారు వెనుక ఆసక్తికరమైన, స్ఫూర్తిదాయకమైన కొటేషన్ ఒకటి నెట్టింట సందడిగా మారింది. అదేంటో తెలుసుకుందామా.అమ్మాయి అనగానే ‘ఆడ’ బిడ్డ అంటూ అనేక కుటుంబాలలో ఇప్పటికీ ఆడపిల్లలను భారంగా భావించే ఈ రోజుల్లో, ఈ సందేశంతో కూడిన వీడియో అందరి హృదయాలను హత్తుకుంది. View this post on Instagram A post shared by SYED KAZIM🩶 (@syed_kazimkazmi110)“మీరు నన్ను భయపెట్టలేరు. నాకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.” అన్నమెసేజ్ . దీంతోపాటు, దీని “M,” “A” “S” అనే అక్షరాలు ఉన్నాయి. అంటే అవి అతని కుమార్తెల పేర్లను సూచిస్తాయని భావిస్తున్నారు. దీంతో ఇది ప్రత్యేకంగా నిలిచింది. ఒక్కోసారి చిన్నమాటలే ఎంత శక్తివంతమైన సందేశాన్ని ఇవ్వగలవో ఇది నిరూపించింది. ఈ క్లిప్ను కరాచీకి చెందిన వ్లాగర్ ఒకరు ఇన్స్టాలో పంచుకున్నారు. తను డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, ముందు వెళ్తున్న కారు వెనుక భాగంలో దీన్ని గమనించి రికార్డ్ చేశారు. ఆ రోజు తాను చూసిన అత్యంత హృద్యమైన విషయాలలో ఇది ఒకటి అంటూ పాకిస్థాన్కు చెందిన ఒక చిన్న వీడియోను ఇన్స్టాలో ఫాలోయర్లతో పంచుకున్నారు. "ఒక తండ్రి కల" అని క్యాప్షన్తో చేసిన వ్లాగర్ ఈ పోస్ట్ ఇప్పటికే 2 కోట్లకు పైగా వ్యూస్ను సంపాదించింది.నెటిజన్ల రియాక్షన్ఇతడు మేలిమి బంగారం అని ఒకరు, మరొకరు, “ప్రతి కుమార్తెకు ఇలాంటి తండ్రి ఉండాలని కలలు కంటుంది” అని వ్యాఖ్యానించారు.“ ఆడపిల్లలను ఇప్పటికీ భారంలా చూసే సమాజంలో, ఈ వ్యక్తికి హ్యాట్సాఫ్ అని మరొకరు వ్యాఖ్యానించారు. ఒక వ్యక్తి, “పప్పా మేరీ జాన్ బచావో”, “ఎంత గర్వపడే తండ్రి,” అని ఒక వ్యక్తి ఆశ్చర్యపోగా, “ఎంత ముద్దుగా ఉంది,” “అదృష్టవంతుడు,” “మా నాన్నలాగే,” లాంటి స్పందనలు వెల్లువెత్తాయి. మరోవైపు ఒక వ్యక్తి చమత్కారంగా, “మరొకరిని కనండి, అప్పుడు మీరు వారిని MASS అని పిలవవచ్చు” అని సూచించడం విశేషం. -
వాట్ ఏ కమిట్మెంట్ బ్రో.. వైరల్ వీడియో
ఒక ముఖ్యమైన కార్యక్రమాన్ని తన కెమెరాలో బంధించేందుకు కెమెరామెన్లు పడే కష్టం మామూలుది కాదు. ప్రోగ్రాం ఏదైనా కీలకమైన అంశాలను కవర్ చేస్తూ నానా కష్టాలు పడుతూ ఉంటారు. పండుగైనా, వేడుకైనా వీడియో గ్రాఫర్లది చాలా ప్రత్యేక మైన పాత్ర. ఇందులో సందేహమేలేదు. ఉద్యమం అయినా, ఉపద్రవం అయినా, వానొచ్చినా, వరదొచ్చినా వెరవకుండా నిబద్ధతతో పనిచేయాల్సి ఉంటుంది. ఇలాంటి నిబద్ధతకు సంబంధించి ఒక వీడియో నెట్టింట తెగ సందడి చేస్తోంది.పెళ్లికూతుర్ని వేదికకు వద్దకు తీసుకొస్తున్నారు తల్లిదండ్రులు. సిగ్గుల మొగ్గవుతూ, కాబోయే భర్తను చూస్తూ మెల్లిగా అడుగులు వస్తోంది అమ్మాయి. మరోవైపు ఈ క్షణాలకోసమే ఎదురు చూస్తున్నా అన్నట్టు వరుడు కూడా ముందుకునడిచివస్తున్నాడు. ఈ అపురూపమైన దృశ్యాల్ని తన కెమెరాలో బంధిస్తూ వీడియో తీస్తున్నాడు ఒక కెమెరామెన్. అతని దృష్టి అంతా అక్కడున్న వేడుక మీదే. ఏ చిన్న మెరుపు క్షణాన్ని కూడా మిస్ అవ్వకూడదు. అదీ అతని కమిట్మెంట్. ఈ ధ్యాసలో వెనుక వున్న పూల్ని చేసుకోలేదు. దీంతో కాలు పట్టు తప్పి ఒక్క ఉదుటున అందులో పడిపోయాడు. కానీ ఏమాత్రం తొట్రుపడలేదు. పైగా ‘‘మీరు కానివ్వండి...’’ అంటూ వధూవరులకు, ఇతరులకు ఆదేశాలిస్తూ, తన పనిలో తాను నిమగ్నమైపోయాడు. దీంతో అతనికి సాయం చేద్దామని వచ్చిన మరో కెమెరామెన్ తన పనిలో మునిగిపోయాడు. అటు పెళ్లి కొడుకు కూడా కెమెరామెన్ ఇచ్చిన ధైర్యంతో వధువుకి ఉంగరం తొడిగే పనిలో ముందుకు కదిలాడు. ఈ వీడియో ఫన్నీ కమెంట్లతో నెట్టింట వైరల్ అవుతోంది. వాట్ ఏ కమిట్మెంట్ బ్రో అని నీ డెడికేష్కి సలాం అంటూ నెటిజన్లు వ్యాఖ్యానించారు. నిన్నగాక మొన్న పెళ్లి : చిలకా గోరింకల్లా ఉండాల్సిన వాళ్లుఇదీ చదవండి : అనంత్ అంబానీ మరో లగ్జరీ వాచ్, అదిరిపోయే డిజైన్, ధర ఎంత? The way he said "you guys carry on" Shows the level of passion 🤍 pic.twitter.com/PeR4mB15W6— .. (@Superoverr) January 22, 2026 -
Shocking Video: కోబ్రాను నలిపేస్తా అన్నాడు.. చివరికి
-
ఒక్క వ్లాగ్తో ఓవర్నైట్ స్టార్గా 72 ఏళ్ల తాత..!
చాలామంది సోషల్మీడియాలో స్టార్లుగా సంచలనం సృష్టించేందుకు..చాలా కష్టపడుతుంటారు. పోనీ అంతలా చేసినా..కొందరికీ లక్ కలిసిరాక, లేక కంటెంట్ బాగోకో..జనాలకు రీచ్ అవ్వడంలో విఫలమవుతుంటారు. కానీ సోషల్మీడియా గురించి ఏమి తెలియని ఈ 70 ఏళ్ల తాత నిజాయితీగా మాట్లాడిన తొలి వ్లాగ్ ప్రభంజనమే సృష్టించేలా వ్యూస్ వచ్చాయి. అలా అని అందులో ఏమి అంత గొప్పగా చెప్పిన విషయాలేం లేవు. కేవలం తన గురించి మాట్లాడిన కొద్ది మాటలే..ఎంతలా నెటిజన్లను ఆకర్షించాయో వింటో నోరెళ్లబెట్టేస్తారు.ఉత్తరప్రదేశ్కు చెందిన 70 ఏళ్ల వృద్ధుడు వినోద్ కుమార్ శర్మకు అసలు వ్లాగింగ్ గురించి ఏమి తెలియదు. కానీ చాలా ఇన్నోసెంట్గా, నిజాయితీగా ఆ విషయాన్ని వివరించిన విధానం నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది. వినద్ శర్మ పదవీ విరమణ అనంతరం తన విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా గడిపేందుకు ఈ వ్లాగ్ని ఒక మార్గంగా ఎంచుకున్నానట్లు తెలిపారు. ఆయన వీడియలో ఇలా అన్నారు. నా పేరు వినోద్ కుమార్ శర్మ. "నేను ఉత్తర ప్రదేశ్కి చెందిన వాడిని. నాకు వ్లాగ్ చేయడం రాదు. జస్ట్ కాలక్షేమపం కోసం వ్లాగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నా. నా ఈ వ్లాగ్మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. ఎందుకుంటే మీ ప్రోత్సాహం ఉంటే కదా భవిష్యత్తులో దీన్ని కొనసాగించగలను అంటూ ముగించారు." అంతే ఆ వీడియోకి ఏకంగా రెండు మిలియన్లకుపైగా లైక్లు వ్యూస్ వచ్చాయి. ఆ వృద్ధుడు వినోద్ శర్మ అమయకత్వానికి మత్ర ముగ్ధలవ్వడంతో నెటిజన్ల నుంచి విశేష స్పందన వచ్చింది. అతడిని చూడగానే మా తల్లిదండ్రలు, తాతయ్య అమ్మమలు గుర్తుకొచ్చారని, అంకుల్ మీకు మేము తోడుగా ఉంటాం అంటూ పోస్టులు వెల్లువెత్తాయి. అంతేగాదు అంకుల్ మీరు మా హృదయాలనకు కొల్లగొట్టారంటూ ప్రోత్సహించారు కూడా. మరికొందరు నేర్చుకోవడానికి వయసు అనేది అడ్డంకి కాదు అని నిరూపించారు శెభాష్ అంకుల్ అని ప్రశంసల వర్షం కురిపించారు కూడా. View this post on Instagram A post shared by Vinod Kumar Sharma (@instauncle_9) (చదవండి: బిర్యానీలలో హైదరాబాద్ బిర్యానీ రుచే వేరు..! సాక్షాత్తు జపాన్ రాయబారి సైతం..) -
సోషల్ మీడియాలో ఓ మహిళ పెట్టిన వీడియోతో వ్యక్తి ఆత్మహత్య
-
తెల్లవారుజాము నుంచే క్యూ కట్టాల్సిందే!
కొత్త ఐఫోన్ మార్కెట్లోకి వచ్చినప్పుల్లా యూపిల్ స్టోర్ల ముందు కొనుగోలుదారులు బారులు తీరుతుండడం ఇటీవల కాలంలో చూస్తున్నాం. ఐఫోన్ను ముందుగా దక్కించుకోవడానికి దుకాణాల ముందు యాపిల్ అభిమానులు గంటల తరబడి వేచివుంటారు. ఇంకా కొంతమంది అయితే ఏకంగా తెల్లవారుజాము నుంచే స్టోర్ల ముందు పడిగాపులు కాస్తుంటారు. తాజాగా ఇలాంటి దృశ్యాలు ఇండియన్ సిలికాన్వ్యాలీలో దర్శనమిచ్చాయి. అదేంటి.. కొత్త ఐఫోన్ ఏదీ మార్కెట్లోకి రాలేదు కదా అని ఆశ్చర్యపోతున్నారా?. ఈ క్యూ ఐఫోన్ల కోసం కాదు.. మరి దేనికోసం?బెంగళూరులోని ఓ దుకాణం ముందు మహిళలు పెద్ద ఎత్తున క్యూ కట్టిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వారంతా తెల్లవారుజామున 4 గంటల నుంచే షాపు ముందు వేచివున్నట్టు తెలుస్తోంది. చీరల కోసం వీరు ఇలా లైన్లో నిలబడ్డారని తెలిసి జనం ఆశ్చర్యపోతున్నారు. అయితే అవేమి ఉచితంగా ఇచ్చేవో, సగం ధరకు అమ్మేవో కాదు.. చాలా ఖరీదైన పట్టు చీరలు. ఏంటీ.. అంతేసి డబ్బులు పెట్టి కొనే కాస్ట్లీ సారీలను దక్కించుకునేందుకు ఇంత కష్టపడాలా అని జనం నోరెళ్లబెడుతున్నారు. విషయం పూర్తిగా తెలిస్తే మీరు కూడా క్యూ కడతారు!మైసూరు పట్టు చీరలను దక్కించుకునేందుకు మహిళలంతా కర్ణాటక సిల్క్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ (కేఎస్ఐసీ) షోరూం ముందు మంగళవారం ఇలా క్యూ కట్టారు. లైన్లో వేచివున్న మహిళల కోసం ప్రత్యేకంగా స్టూల్స్ కూడా వేశారు. ఒక్క చీరనైనా దక్కించుకోవాలన్నట్టుగా మహిళలు ఎదురుచూస్తున్నారు. ఈ దృశ్యాలున్న వీడియోను రాకేశ్ కృష్ణన్ సింహ అనే వ్యక్తి 'ఎక్స్'లో షేర్ చేశారు. రూ.23 వేల నుంచి రెండున్నర లక్షల రూపాయల వరకు ఖరీదు చేసే మైసూరు పట్టుచీరల కోసం మహిళలు తెల్లవారుజాము నుంచే కేఎస్ఐసీ షోరూం ముందు వేచివున్నారని తెలిపారు. క్యూలో ఉన్నవారికి టోకెన్లు కూడా ఇస్తున్నారని, టోకెన్ ఉన్నవారిని మాత్రమే దుకాణం లోపలికి అనుమతిస్తారని 'కన్నడప్రభ' తెలిపింది. అందరికీ చీరలు దక్కాలన్న ఉద్దేశంలో ఒక్కొక్కరికి ఒకటి మాత్రమే విక్రయిస్తారని వెల్లడించింది.కేఎస్ఐసీ (KSIC) మాత్రమే అసలు సిసలైన మైసూరు సిల్క్ సారీలను తయారు చేస్తోంది. దీనికి సంబంధించిన ఆధీకృత తయారీ హక్కులు, జీఐ ట్యాగ్ రైట్స్.. ఇది కలిగివుంది. దీంతో కేఎస్ఐసీ శిక్షణ ఇచ్చిన వారు మాత్రమే మైసూరు పట్టు చీరలను నేస్తుండడంతో డిమాండ్కు తగినట్టుగా సరఫరా చేయలేకపోతోంది. అందుకే తమ దుకాణానికి వచ్చిన వారికి ఒక్కొక్కరికి ఒక చీర మాత్రమే విక్రయిస్తోంది. నాణ్యతలో ఏమాత్రం రాజీపడకుండా ఒరిజినల్ పట్టుచీరలను తయారు చేస్తోంది కాబట్టే మహిళలు కేఎస్ఐసీ దుకాణం ముందు బారులు తీరుతున్నారు. ఒరిజినల్ బ్రాండ్ వ్యాల్యూకు ఉండే క్రేజ్ అలాంటిది మరి!Women queue up from 4.00 AM outside a Karnataka Soviet (sorry Silk) Industries Corporation showroom to buy silk sarees starting from ₹23,000 and going up to ₹250,000. Only 1 saree per customer and you need a token to be in the queue.There is an ongoing shortage (or more… pic.twitter.com/d100w3hql0— Rakesh Krishnan Simha (@ByRakeshSimha) January 20, 2026నెటిజన్ల స్పందన..''కొత్త ఐఫోన్ల కోసం ఆపిల్ స్టోర్ల ముందు మగాళ్లు 12 గంటలు ముందుగానే క్యూ కట్టడం మామూలు విషయం. కానీ చీరల కోసం మహిళలు క్యూలో వేచివుండడం ఆసక్తికరం.''''కొత్త ఐఫోన్ లాంచ్ అయినప్పుడు ఆపిల్ షోరూమ్ల వెలుపల కూడా ఇలాంటి దృశ్యాలే కన్పిస్తుంటాయి. అంటే ఆ ఫోన్ల కొరత ఉందని కాదు. ఐఫోన్ కోరుకునే ప్రతి ఒక్కరూ చివరకు దాన్ని దక్కించుకుంటారు. చీర కోసం 23 వేల రూపాయలు ఖర్చు చేసేందుకు సిద్ధపడుతున్నారంటే.. వారంతా బాగా డబ్బున్న ఉన్నవారే అయుంటారు.''''ప్రైవేటు దుకాణాల కంటే కేఎస్ఐసీ నాణ్యతపై నమ్మకంతోనే మహిళలు ఇక్కడ పట్టు చీరలు కొనేందుకు వస్తున్నారు.''చదవండి: కారును లాగే కొండ.. ఎక్కడుందో తెలుసా? -
11 లైసెన్సులు, 75 ఏళ్లు : ఆమెకు ప్రతీ దారి ఒక పాఠం!
కుటుంబాన్ని పోషించుకునేందుకు, గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేందుకు మహిళలు ఎంతటి సాహసాని కైనా పూనుకుంటారు. క్లిష్టమైన డ్రైవర్ వృత్తిలో రాణిస్తూ 75 ఏళ్ల మహిళ శభాష్ అనిపించు కుంటోంది. ఒకపుడు డ్రైవింగ్ను జీవనోపాధిగా చూసేవారు, అదీ పురుషులకు మాత్రమే పరిమితమని భావించేవారు. కానీ ప్రస్తుతం ఎలాంటి లింగ భేదాలు లేకుండా డ్రైవింగ్ను ఒక అభిరుచిగా కొనసాగిస్తున్నారు. స్త్రీలైనా, పురుషులైనా, డ్రైవింగ్ ఒక అవసరం. కేరళకు చెందిన 75 ఏళ్ల వృద్ధురాలు రాధామణి మరింత ప్రత్యేకం. రాధామ ఏకంగా చీరలోదుబాయ్ రోల్స్ రాయిస్ ఘోస్ట్ నడుతూ దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రతిభకు వయసుతో పనిలేదని నిరూపిస్తూ అత్యంత నిష్ణాతులైన డ్రైవర్లలో ఒకరిగా అరుదైన ఖ్యాతిని సంపాదించింది. వాహనంఏదైనా...ఆమె చేతికి స్టీరింగ్ వచ్చిందంటే.. రయ్ రయ్మని దూసుకుపోవాల్సిందే. ఇన్స్టాగ్రామ్లో లక్ష మందికి పైగా అనుచరులున్న మణి అమ్మ లేదా డ్రైవర్ అమ్మగా ప్రసిద్ధి చెందిన రాధామణి అమ్మ, లగ్జరీ కార్లు మ్తాత్రమే కాదు లగ్జరీ కార్లను మాత్రమే కాదు,రోడ్ రోలర్లు, క్రేన్లు, బస్సులు, JCB వంటి ఎక్స్కవేటర్లు, ట్రక్కులు, ఫోర్క్లిఫ్ట్లు ఇతర భారీ యంత్రాలతో సహా 11 వేర్వేరు డ్రైవింగ్ లైసెన్స్లను కలిగి ఉండటం విశేషం. విదేశాలకు డ్రైవింగ్ చేసేందుకు అవసరమైన అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్ను సాధించింది. కేరళలో డ్రైవింగ్ స్కూల్ నడుపుతోంది. అందుకే మణి అమ్మ ‘ది డ్రైవర్ అమ్మ’గా నెటిజన్స్ అభివర్ణిస్తున్నారు. ‘‘ప్రతి దారి ఒక కొత్త పాఠం లాంటిది. ఆత్మవిశ్వాసం, శ్రద్ధ, ప్రేమ- ఇవే నా ప్రయాణానికి బలాలు. రోడ్లు ఎలా తిరిగినా సాగిపోతూనే ఉండే ధైర్యం ఉంటే అసాధ్యమైనది ఏదీ లేదు’’ మణి అమ్మకేరళలో డ్రైవింగ్ స్కూల్ బస్సు, ట్రక్ డ్రైవర్లకు శిక్షణ1978లో డ్రైవింగ్ స్కూల్ తెరవమని ఆమె భర్త ఆమెను ప్రోత్సహించాడట. 2004లో ఆమె భర్త మరణించిన తర్వాత ఇంటిని నడపడానికి ఆమె ఈ పాఠశాల బాధ్యతను చేపట్టింది. వ్యక్తిగతంగా వృత్తిపరంగా ఇబ్బందులను ఎదుర్కొంది. కానీ ఎక్కడా బెదరలేదు. వెనకడుగు వేయలేదు. కేరళలో మహిళలు భారీ వాహనాలను నడపడమే గగనమైన సమయంలోనే A2Z ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెవీ ఎక్విప్మెంట్స్కు సహ-వ్యవస్థాపకురాలిగా, డిఫరెంట్ కరియర్ను ఎంచుకోవడంలో మహిళలను బాగా ప్రోత్సహించింది. రాధామణి తన ప్రయాణాన్ని నలభయ్యేళ్లకు పైగా కొనసాగించింది. తన భర్త సూచనమేరకే డ్రైవింగ్లోకి అడుగుపెట్టి 1981లో తన ఫోర్-వీలర్ లైసెన్స్ను , 1984లో తన హెవీ వెహికల్ లైసెన్స్ను పొందింది. డ్రైవింగ్ వృత్తిలో కొనసాగేందుకు ఆమె చేసిన పోరాటం కూడా గొప్పదే. ఈ లైసెన్సులు పొందడానికి పడ్డ కష్టాలు, ఆమె పేరు మీద కేరళలో మొట్టమొదటి హెవీ వెహికల్ డ్రైవింగ్ స్కూల్ను స్థాపించడానికి చట్టపరమైన పోరాటాలు కూడా అవసరమని కూడా ఆమె తన అనుభవాలను గుర్తు చేసుకుంది.ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు 70 ఏళ్ల వయసులో డ్రైవింగ్ లైసెన్స్లు పొందిన మహిళగా రాధామణి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ నుండి గుర్తింపు పొందింది. 2022లో ఆమె 'ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్'గా కూడా ఎంపికైంది. డెబ్బైల ప్రారంభంలో మెకానికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా పూర్తి చేయడం మరో విశేషం. సోషల్ మీడియా అంతా మహిళలు వస్త్రధారణమీద తీవ్ర చర్చ నడుపుతున్న ప్రస్తుత తరుణంలో నైపుణ్యాలకు, వృత్తికి లింగభేదం లేదని రాధామణి నిరూపించారు..నిజంగా ఏదైనా సాధించాలన్న సంకల్పం ఉంటే, అంకితభావం, నమ్మకంతో ప్రయత్నిస్తే కచ్చితంగా సాధించగలరు అంటారు ఆమె. తన దృష్టిలో నేర్చుకోవడం అనేది "ఒక శాశ్వత ప్రయాణం" అని కూడా అంటారు. View this post on Instagram A post shared by The Logical Indian (@thelogicalindian) -
Viral Video: ‘జిగ్జాగ్’ డ్రైవింగ్.. షాక్ ఇచ్చిన పోలీసులు
ఢిల్లీ: ఎస్యూవీతో ప్రమాదకర విన్యాసాలు చేస్తున్న ఓ యువకుడికి ఢిల్లీ పోలీసులు షాక్ ఇచ్చారు. జాతీయ రహదారి-48పై అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో ఎస్యూవీ వాహనంతో అతివేగంగా 'జిగ్జాగ్' డ్రైవింగ్ చేసిన యువకుడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నిందితుడిని ఓఖ్లా ప్రాంతానికి చెందిన ఇగ్నో విద్యార్థి దావూద్ అన్సారీ (21)గా గుర్తించారు. నిందితుడు నడిపిన స్కార్పియో-ఎన్ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనం అతని తండ్రి ముసాఫిర్ అన్సారీ పేరు మీద రిజిస్టర్ అయి ఉంది.జనవరి 18న మధ్యాహ్నం 3 నుండి 4 గంటల మధ్య జీటీ కర్నాల్ బైపాస్ రోడ్డు నుండి నరేలా వైపు వెళ్తున్న ఒక నల్లటి స్కార్పియో వాహనం, అద్దాలకు నల్లటి టింట్లు వేసుకుని, రహదారిపై వెళ్తున్న ఇతర వాహనదారులను భయపెట్టేలా అడ్డదిడ్డంగా వెళ్తున్న వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన జరిగింది. ఈ వీడియోను తీవ్రంగా పరిగణించిన పోలీసులు.. నిందితుడిని వెంబడించి పట్టుకున్నారు. కేసు నమోదు చేయడంతో పాటు నిందుతుడి డ్రైవింగ్ లైసెన్స్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. Taking cognizance of a viral video circulating on social media, the team of PS Samaypur Badli, @dcp_outernorth took swift action .The offending vehicle, which was being driven recklessly & dangerously, has been seized and the driver has been arrested for rash & negligent… pic.twitter.com/FIr8HbR9Za— Delhi Police (@DelhiPolice) January 20, 2026 -
తొందరగా బరువు తగ్గాలంటే..! ఏం చేయాలి? ఏం చేయకూడదు?
బరువు తగ్గడానికి కొవ్వు కరిగించే మందులు, ఇంజెక్షన్లపై ఆధారపడుకుండా అత్యంత సహజసిద్ధంగా బరువు తగ్గాలంటే చాలా ఓపిక, స్ట్రాంగ్ మైండ్సైట్ చాలా ముఖ్యం. అలా నిలకడగా ప్రయత్నానికి బ్రేక్ ఇవ్వని వారే అద్భుతాలు సృష్టిస్తారు..మంచి ఫలితాలను అందుకుంటారు. అందుకు ఉదాహరణే ఈ ఫిట్నెస్ ట్రైనర్ టార్న్ కౌర్. ఆమె కేవలం ఎనిమిది నెలల్లోనే 31 కిలోలు తగ్గి శెభాష్ అనిపించుకుంది. అందుకు ఉపకరించిన మూడు వాస్తవిక త్యాగాల గురించి ఇస్టాగ్రామ్లో వివరిస్తూ..పోస్టు పెట్టారామె. మరి బరువు తగ్గేందుకు ఆమె వ్యక్తిగతంగా చేసిన ఆ మూడు మార్పులేంటి? అంతలా ఎలా బరువు తగ్గారామె అంటే..ఆమె చేసుకున్న వ్యక్తిగత మార్పులు..పక్కా ప్లానింగ్..బరువు తగ్గేందుకు ప్రయత్నించిన ప్రతిసారి నూటికినూరు శాతం పర్ఫెక్షన్ ఉండాలనుకునేది. అలా అనుకున్న ప్రతిసారి తన డైట్ మళ్లీ మొదటకు రావడం..జరుగుతుండేది. ముఖ్యంగా నిద్ర తర్వాత ప్లానింగ్ స్కిప్ అవ్వతూ ఇబ్బంది పడేది. అందుకే పరిపూర్ణ కంటే..సవ్యంగా అనుకున్నది ప్రతి రోజు జరిగేలా ప్లాన్ ఉంటే సరి అని డిసైడ్ అయ్యింది.నిర్విరామంగా, స్థిరంగా..అస్తామాను బరవు తగ్గాలి అంటూ పరిష్కారాల కోసం ప్రయత్నించడం అనేవి వృధా ప్రయాసేనని అంటోందామె. దానికంటే..రోజువారి ఆరోగ్యకరమైన అలవాట్లు క్రమం తప్రకుండా చేసేలా చూసుకోవడం బెటర్. ముఖ్యంగా నిలకడ(స్థిరత్వానికి) ప్రాముఖ్యత ఇస్తేనే..మంచి ఫలితాలు సొంతం అవుతాయి.సాకులుసమయం లేదనే మాటకు ఆస్కారం ఇవ్వకూడదంటోంది. సెలవులు, వివాహాలు, సుదీర్ఘ ప్రయాణ రోజులు, తల్లిదండ్రుల బాధ్యతలు, పని ఒత్తిళ్లు, ఇలా ఎన్ని ఉన్నా..బరువు తగ్గాడానికి బ్రేక్ ఇవ్వకూడదని, సమయం లేదనే మాట ఉండకుండా ఉండేలా కేర్ తీసుకోవాలంటోంది. ఎందుకంటే ఇలా ఎన్నో బాధ్యతలు ఉన్న చాలామంది బరువు తగ్గుతున్నప్పుడూ మనమెందుకు తగ్గం అనేది విశ్లేషించుకుంటే..పరిష్కారం ఆటోమేటిగ్గా దొరుకుతుందంటోంది. View this post on Instagram A post shared by Tarn Kaur | Online Coach 🏋🏼♀️💕 (@weightlosswithtarn) ఇక ఇక్కడ ఫిట్నెస్ ట్రైనర్ తన బరువ తగ్గే జర్నీలో డైట్లో మార్పులు చేసుకున్నా మొత్తం 20 ఆహారాల జాబితాను కూడా షేర్ చేశారు. అవేంటో చూద్దామా..!1. మిల్కీ షుగర్ చాయ్ బదులు - బ్లాక్ కాఫీ2. ప్యాక్ చేసిన జ్యూస్లు - ఎలక్ట్రోలైట్స్ కోసం దోస, కీర జ్యూస్లు లేదా కొబ్బరి నీళ్లు3. రాత్రిపూట తెల్ల బియ్యం - క్వినోవా/కాలీఫ్లవర్ బియ్యం4. మైక్రోవేవ్ పాప్కార్న్ - ఎయిర్-పాప్డ్ పాప్కార్న్5. చీజ్ క్రాకర్స్ - కాల్చిన చిక్పీస్6. క్రీమీ పాస్తా - హోల్వీట్ నూడుల్స్ + పాలకూర సాస్7. షుగర్ తృణధాన్యాలు - దాల్చిన చెక్క, ఆపిల్ & తేనెతో రాత్రిపూట ఓట్స్8. క్రిస్ప్స్ ప్యాకెట్లు - వెజ్జీ స్టిక్స్ + గ్రీక్ పెరుగు డిప్9. మిల్క్ చాక్లెట్ - డార్క్ చాక్లెట్ స్క్వేర్10. షుగర్ బిస్కెట్లు - బాదం పిండి కుకీలు11. బిస్కెట్లు - వేరుశెనగ వెన్న మరియు తేనెతో రైస్ క్రాకర్స్12. వేయించిన స్నాక్స్ - బేక్డ్ వెజ్జీ చిప్స్13. ఐస్ క్రీం - గ్రీక్ పెరుగు + ఫ్రోజెన్ బెర్రీస్14. షుగర్ సాస్లు - ఇంట్లో తయారుచేసిన టమోటా/పెస్టో సాస్15. వైట్ బ్రెడ్ - హోల్గ్రెయిన్ లేదా సీడ్ బ్రెడ్16. షుగర్ డ్రింక్స్ - మెరిసే నీరు + నిమ్మకాయ17. సూపర్ మార్కెట్ మఫిన్లు - ఇంట్లో తయారుచేసిన ప్రోటీన్ అరటిపండు/ఓట్ మఫిన్లు18. చాక్ బార్లు - నట్ + డార్క్ చాక్లెట్ బైట్స్19. హెవీ సలాడ్ డ్రెస్సింగ్లు - ఆలివ్ ఆయిల్ + బాల్సమిక్ వెనిగర్20. ఫాస్ట్ ఫుడ్ బర్గర్లు - ఇంట్లో తయారుచేసిన టర్కీ/వెజ్జీ బర్గర్లు View this post on Instagram A post shared by Tarn Kaur | Online Coach 🏋🏼♀️💕 (@weightlosswithtarn)బరువు తగ్గడానికి 8 'విచిత్రమైన' అలవాట్లుటెంప్ట్ చేసే ఆహారాలు కంట పడకుండా ఉండేలా చేసుకోవడం లేదా దూరంగా ఉండేలా నోటిని అదుపులో ఉంచుకోవడం. భోజనం తర్వాత ఏమైనా తినాలనిపిస్తే..పుదీనా లేదా ఆరోగ్యకరమైన హెల్దీ ఆకులను తినేలా మెదడుని పాజ్ చేయడంముందుగానే ఇంత తినాలనేలా ప్లాన్ చేసుకోవడంఆహారం సరిపోయిన సంతృప్తిని అందివ్వకపోతే..ఆ కోరికను స్కిప్ చేసి..ఏదైనా పనిలో లీనమవ్వడంఅలాగే కడుపు నిండింది అని బిగ్గరగా చెబుతూ మన మైండ్ని కంట్రోల్ చేయడంరెస్టారెంట్లలో బ్రెడ్ వంటి వాటి జోలికి పోకుండా ఉండటం.ఫిట్గా ఉండే మోడ్రన్ దుస్తులు ధరించాలనే విషయాన్ని గుర్తించుకుంటూ..తక్కువగా తినడం తనను ఏదో రకంగా తినాలనిపించేలా చేసే ఆకర్షణీయమైన వంటకాలన్నింటిని చెత్తబుట్టలో వేసేయడం తదితరాలతో ఫిట్నెస్ ట్రైనర్ టార్న్ కౌర్ విజయవంతంగా బరువు తగ్గారామె. ఈమె వెయిట్లాస్ జర్నీ ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటంటే..ఇక్కడ మనం బరువు తగ్గాలనే విషయంపై గట్టి ఫోకస్ తోపాటు ఆ దిశగా మనం తినే ఆహారం, వర్కౌట్లు ఉండేలా కేర్ తీసుకోవడమే గాక నిలకడతో చేయాలి. అప్పుడే సత్ఫలితాలు పొందగలం అని చెబుతున్నారు నిపుణులుగమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: 73 ఏళ్ల తాత గారి సిక్స్ప్యాక్ బాడీ..! ఫిదా అవ్వాల్సిందే..) -
సర్కారీ స్కూల్లో చదివాడు..కానీ ఇవాళ ఏకంగా..!
వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఎప్పటిలానే ఈసారి కూడా ఒక స్ఫూర్తిదాయకమైన కథతో మన ముందుకు వచ్చారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన అభిమానులకు స్ఫూర్తిని రగిలించే ప్రేరణాత్మక స్టోరీలను షేర్ చేసే ఆనంద్ మహీంద్రా ఈసారి టాలెంట్కి సంబంధించిన ఆసక్తికర కథను పంచుకున్నారు. కార్పోరేట్ స్కూల్లో చదివినంత మాత్రాన టాలెంట్ వాడి సొత్తు కాదని..సాధారణ స్కూల్లో చదవిన వాడు కూడా టాలెంట్కి కేరాఫ్గా నిలుస్తారని చెప్పే గొప్ప కథ..!.భారతదేశంలోని సవాళ్లే మనలోని ప్రతిభకు, ఆవిష్కరణలకు కేంద్రం అని చెబుతున్నారు ఆనంద్ మహీంద్రా. అదే మనల్ని మాత్రమే కాదు యావత్తు భారత దేశాన్ని ప్రపంచం ముందు విజేతగా నిలబెడుతోందని అంటూ ఓ మహోన్నత వ్యక్తి గురించి చెప్పుకొచ్చారు. తమిళనాడులో ఓ సాధారణ ప్రభుత్వ పాఠశాలలో చదవిన వేలు సామీ ఇవాళ మహీంద్రా ఆటోమోటివ్ వ్యాపార టీమ్కి హెడ్గా సారథ్యం వహిస్తున్నాడు. అతడి ప్రయాణం తన కంపెనీలో చాలా చిన్నగా ప్రారంభమైందని..అంచెలంచెలుగా ఈ స్థాయికి చేరుకున్నాడని చెప్పుకొచ్చారు. ఆయన తన బృందంతో కలిసి కొత్త మహీంద్రా XUV 7XOలో డావిన్సీ డంపింగ్ టెక్నాలజీని పరిచయం చేశాడని, ఇది ప్రపంచంలోనే మొట్టమొదటిదని అన్నారు. ఆనంద్ ఆప్యాయంగా 'వేలు గురు'గా పిలిచే అతడు అన్నా విశ్వవిద్యాలయం నుంచి ఆటోమోటివ్ ఇంజనీరింగ్లో బి.టెక్ సీటుని తమిళనాడు నామక్కల్లోని ప్రభుత్వ పాఠశాల విద్యా నైపుణ్యంతో సాధించాడని చెప్పారు. మహీంద్రాలో జూనియర్ ఇంజనీర్గా చేరి..ఇవాళ ఏకంగా టెక్నాలజీ ప్రొడక్ట్ డెవలప్మెంట్ హెడ్ అయ్యాడని, అలాగే గతేడాదే ఆయన మహీంద్రాలో ఆటోమోటివ్ బిజినెస్ అధ్యక్షుడిగా నియమితులయ్యాడని తెలిపారు. స్వదేశ ప్రతిభను వెలుగులోకి తీసుకువచ్చే క్రమంలో మహీంద్రా రీసెర్చ్ వ్యాలీ కంపెనీ ఆర్ అండ్ డీ బృందాలు వేలు ప్రయాణాన్ని పరిచయం చేశాయి. మన స్వదేశీ ఇంజనీర్లు నేర్చుకోవాలనే ఆకలితో ఉన్నారని, అందువల్లే నాయకత్వం వహించే స్థాయికి చేరుకుంటున్నారు, పైగా ప్రపంచంలోనే అత్యుత్తమమైన వాటిని పరిచయం చేస్తున్నారంటూ..మనవాళ్ల టాలెంట్ని, ప్రతిభని కొనియాడుతున్నారు. అంతేగాదు భారతదేశాన్ని ఒక ప్రతిభ కర్మాగారంగా అభివర్ణిచారు కూడా. అంతేగాదు 1991లో, ఆర్థిక వ్యవస్థ తెరుచుకున్నప్పుడు ప్రపంచ కన్సల్టెంట్లు భారతీయ కంపెనీలకు "సహాయం చేయమని" ఎలా సలహా ఇచ్చారో గుర్తు చేసుకుంటూ..మహీంద్రా గ్రూప్ ఆ దిశగానే ముందుకు సాగుతోంది. ఇంకా ఇక్కడే ఉన్నాం, నేర్చుకోవాల్సింది ఎంతో ఉందంటూ ప్రపంచ స్థాయి సాంకేతికతో సేవ చేసేందుకు సదా ఆరాట పడుతోంది మా గ్రూప్ అని చెప్పుకొచ్చారు. కాగా, వేలు సామీ 1996లో మహీంద్రాలో జాయిన్ అయ్యారు. పవర్ట్రెయిన్ అభివృద్ధిలో తన కెరీర్ను ప్రారంభించాడు. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ..అత్యాధునిక M-హాక్ ఇంజిన్ల వెనుక ఉన్న దార్శనికుడిగా పేరుతెచ్చుకున్నాడు. అంతేగాదు ఆటోమోటివ్ పరిశ్రమలో కొత్త ప్రమాణాలను నెలకొల్పిన మహనీయుడు కూడా. ది ఆల్ న్యూ థార్, XUV700, స్కార్పియోన్ వంటి బ్లాక్బస్టర్ ఉత్పత్తుల ఆవిష్కరణలలో కీలక పాత్ర పోషించిన టీమ్ లీడర్ ఆయన.Meet Velu.He and his team have just introduced the world’s first suspension featuring DaVinci damping technology in the new Mahindra XUV 7XOAs you can see, he can’t conceal his excitement to demonstrate it personally.Velu, or "Velu Guru” as we affectionately call him,… pic.twitter.com/tfbkJbLryO— anand mahindra (@anandmahindra) January 19, 2026(చదవండి: 73 ఏళ్ల తాత గారి సిక్స్ప్యాక్ బాడీ..! ఫిదా అవ్వాల్సిందే..) -
సోషల్ మీడియాలో ఇదేం తొండాట(డబుల్ గేమ్)?!
పిల్లికి చెలగాటం.. ఎలుకకు ప్రాణ సంకటం అనే సామెత ఒకటి ఉంటుంది. కేరళ ఘటనలో తప్పెవరిది అనేది తేలకున్నా.. ఇప్పుడు చాలామంది ఈ సామెతను అన్వయింపజేస్తున్నారు. బస్సులో తనను లైంగికంగా వేధించాడని ఓ ఇన్ఫ్లుయెన్సర్ పోస్టు చేసిన వీడియో.. ఒకరి ప్రాణం పోయేందుకు కారణమైన సంగతి తెలిసిందే కదా.. ఈ ఘటనలో ఏం జరిగిందో మరోసారి చూద్దాం. కోజికోడ్కు చెందిన దీపక్(42) బస్సులో వెళ్తున్నప్పుడు ఓ యువతి పక్కనే నిలబడి వీడియో తీసింది. అందులో దీపక్ తనను అసభ్యంగా తాకాడంటూ ఆ వీడియోను తన ఫాలోవర్స్కు చేరవేసింది. అంతే.. సదరు వ్యక్తిని తిట్టిపోస్తూ ట్రెండింగ్ నడిచింది. ఈ విషయం తనదాకా చేరడంతో ఆ వ్యక్తి భరించలేకపోయాడు. శుక్రవారం(జనవరి 16) ఈ ఘటన జరిగింది. శనివారం దీపక్ పుట్టినరోజునే ఈ వీడియో వైరల్ కావడంతో మనస్తాపం చెందాడు. ఆదివారం బలన్మరణానికి పాల్పడి ఈ తతంగాన్ని ఇంతటితో ముగిద్దాం అనుకున్నాడు. కానీ, నెటిజన్స్ మాత్రం ఊరుకోలేదు. తిట్టిపోసిన అదే సోషల్ మీడియా ఈసారి ప్రాణాలతోలేని దీపక్కు మద్దతు ప్రకటించింది. సదరు యువతి ఫాలోయింగ్ను పెంచుకోవాలనే అలా చేసి ఉంటుందా?... పాపులారిటీ కోసం పాకులాడిందా? అనే అనుమానాలతో చర్చ మొదలుపెట్టారు. అయితే దీపక్ ఫ్యామిలీ ఈ డబుల్ గేమ్ సపోర్టును తిరస్కరించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇంటర్నెట్లో అలా ఎలా విచారణ జరుపుతారని.. తమ బిడ్డది తప్పని తేలుస్తారని దీపక్ తల్లి అంటోంది. ఆ యువతి కంటే నెటిజన్లే డేంజర్ అని అంటోంది. షిమ్జితా ముస్తాఫా.. యాక్టివిస్ట్గానూ, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గానూ గుర్తింపు దక్కించుకుంది. దీపక్ వేధింపుల వీడియోను పోస్ట్ చేశాక.. ఆమెకు అభినందనలు కురిశాయి. అయితే.. దీపక్ మరణం తర్వాత ఆమె ట్రోలింగ్కు గురైంది. పలువురు నెటిజన్లు ఆమెను తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో ఆమె ఆ వీడియోను తొలగించింది. తన చర్యను సమర్థించుకుంటూ మరో వీడియోను పోస్ట్ చేసింది(దానికి కామెంట్లు చేయకుండా ప్రైవసీ పెట్టుకుంది). పైగా ఈ విషయంలో తనకు పోలీసుల సపోర్ట్ లభించిందని చెప్పుకొచ్చింది. కానీ.. మగ ప్యాసింజర్లకు, మగ కండక్టర్లకు ఇవి తప్పవా?మూడు రోజుల క్రితం చేయని తప్పుకు తన మీద వీడియో తీసి తనను అవమానించినందుకు ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నేపథ్యంగా, కేరళ బస్సుల్లో మగవారు అట్టపెట్టెలను అడ్డం పెట్టుకుని బస్సులో వెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. pic.twitter.com/AXUEYp5Dfc— greatandhra (@greatandhranews) January 20, 2026కేరళ పోలీసులు ట్విస్ట్ ఇచ్చారు. షిమ్జితా నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని క్లారిటీ ఇచ్చారు. పైగా ఆత్మహత్యకు ఉసిగొల్పిందంటూ దీపక్ కుటుంబ సభ్యులు చేసిన ఫిర్యాదుతో షిమ్జితాపైనే కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆమె పరారీలో ఉంది. ఆమె కోసం స్పెషల్ టీంలు గాలింపు జరుపుతున్నాయి. ఆమె దొరికితేనే ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకోవచ్చని పోలీసులు అంటున్నారు. మరోవైపు.. నెటిజన్ల దెబ్బకు ఆమె సోషల్ మీడియా అకౌంట్లు కూడా డిలీట్ చేసేసుకుందని తెలుస్తోంది. ఆన్లైన్ వేధింపులు ఎంతటి విషాదాలకు దారి తీస్తుందో ఈ ఘటన ఉదాహరణగా నిలిచిందని అంటున్నారు. కేరళ మానవ హక్కుల కమిషన్ ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. కొందరు పురుషులు (వయసు తారతమ్యం లేకుండా పెద్దవాళ్లతో సహా..) బస్సుల్లో ఎక్కి ఆడవాళ్ల మధ్యలో నిల్చుని తమను అనుమానించొద్దు అంటూ సెల్ఫీ వీడియోలు తీసుకుంటూ ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. -
73 ఏళ్ల తాత గారి సిక్స్ప్యాక్ బాడీ..! ఫిదా అవ్వాల్సిందే..
జస్ట్ ఆరు పదుల వయసు దాటగానే ముఖంలో ముడతలు..చర్మం వదులుగా వచ్చేసి..ముసలి రూపు వచ్చేస్తుంటుంది. ఒకవేళ ఆరోగ్యకరమైన వృద్ధాప్యాన్ని ఆస్వాదించేవారు కూడా ఓ మోస్తారు వర్కౌట్లు, చిన్న పాటి వాకింగ్ వంటివి చేస్తూ ఆరోగ్యంగా ఉండటం చూశాం. కానీ ఇతడని చూస్తే..నోరెళ్లబెట్టేస్తాం. బాడీ ఏమో 25 ఏళ్ల యువకుడిలా చాకులా ఉంటుంది. వయసు చూస్తే వామ్మో అనేస్తాం. ఇది నిజమేనా అనే సందేహం కూడా వచ్చేస్తుంది ఆ తాతగారి ఫిజిక్ని చూస్తే. అంత అద్భుతమైన దేహ ధారుడ్యంతో..ముఖ్యంగా సిక్స్ ప్యాక్స్తో నవ మన్మధుడిలా ముగ్ధమనోహరంగా ఉంటాడు. మరి అతడి ఫిట్నెస్ సీక్రెట్ ఏంటి?, ప్రోటీన్ సప్లిమెంట్స్ ఏమైనా తీసుకుంటాడా అంటే..?సాధారణంగా డెభైల వయసులో కండరాలు దృఢంగా ఉండటం అంత సులభం కాదు. ముఖ్యంగా చర్మం ఎంత వదులుగా మారిపోతుందో తెలిసిందే. అలాంటిది ఆ తాతగారి ఉక్కులాంటి శరీరాన్ని చూసి షాకవ్వుతాడు. అంతలా ఉండటానికి ఎంతలా వర్కౌట్లు చేస్తాడో తలుచుకుంటూనే భయమేస్తుందంటూ..నేరుగా ఆయన్నే అడుగుతాడు ఫిట్నెస్ కోచ్ లాంగోవ్స్కీ. చక్కటి పోషకాహారం, స్మార్ట్ వ్యాయామాలు మయసుని దిక్కారిస్తాయని నిరూపించాడు ఈ 73 ఏళ్ల వ్యక్తి. అందుకు తనకు ఉపకరించిన హెల్త్ సీక్రెట్ గురించి కూడా ఫిట్నెస్ కోచ్ స్కీతో పంచుకుంటాడు కూడా. ఇంత స్ట్రాంగ్ బాడీ మెయింటైన్ చేసేందుకు జిమ్లో ఎంతలా కష్టపడుతుంటారని అడుగుతాడు. అందుకు ఆ తాతగారు గట్టిగా నవ్వేసి..తేలికపాటి వ్యాయామాలే చేస్తాను, కానీ కష్టపడకుండా తేలిగ్గా చేస్తానని సమాధానమిచ్చారు. మరి ఎలాంటి పుడ్ తీసుకుంటారు అని ఫిట్నెస్ కోచ్ స్కీ అడగగా..మంచి ప్రోటీన్, కొల్లాజెన్, క్రియేటిన్ మాత్రమే తీసుకుంటానని అన్నారు. ఉపవాసం ఉంటే తప్ప..ప్రతిరోజు వైన్ పడాల్సిందేనని అన్నారు. రోజుకి రెండు గ్లాస్ల వైన్ హాంఫట్ చేస్తారట ఈ తాతయ్య. ఆ తర్వాత కోచ్ ఎన్ని పుషఅప్లు చేయగలరు? అని కుతుహలంగా అడుగుతాడు..దానికి ఆయన దాదాపు 30 వరకు చేయగలనని నమ్మకంగా చెప్పారు. అంతేకాదండోయ్ ఆ ఫిట్నెస్ కోచ్ ముందే ఏకంగా 36 పుష్ అప్లు చేసి చూపించాడు కూడా. తన శరీర కొవ్వు శాతం కూడా 8.5% అని వెల్లడించాడు. పైగా క్రమశిక్షణతో కూడిన మంచి పోషకాహారం, కొంచెం వైన్ని సేవిస్తూ..డెభైలలో కూడా ఫిట్గా ఉండటం ఈజీనే అని నిరూపించాడమే కాదు వయసు అనేది జస్ట్ నెంబర్ మాత్రమే అని తన ఆహార్యంతో గొంతెత్తి చెప్పకనే చెప్పాడు ఈ తాతయ్య. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by ʙᴏᴅʏ ʙʏ ᴍᴀʀᴋ™ (@bodybymark) (చదవండి: థాంక్యూ అమెరికా..కానీ భారత్ అంటే ప్రేమ..! వైరల్గా భారత సంతతి వ్యక్తి పోస్ట్) -
మంచులో రీల్స్..క్షణం ఆలస్యమై ఉంటే.. వైరల్ వీడియో
సోషల్ మీడియా, రిల్స్ మోజులో పడి వింత వింత పోకడలు పోతున్నారు. ప్రాణాలు పోతున్నా, ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా అస్సలు పట్టించుకోవడం లేదు. తాజాగా గడ్డకట్టిన మంచులో రీల్స్ చేయడానికి ప్రయత్నించి ప్రాణాల మీదకు తెచ్చకున్న ఒక మహిళ వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది.సాధారణంగా మంచు కురిసే ప్రదేశాలకు వెళ్లడం, అక్కడమంచుతో ఆడుకోవడం సరదాగానే ఉంటుంది. కానీ సరైన జాగ్రత్తలు తీసుకోకుండా అంటే చలికి తట్టుకోగలిగే ఇన్సులేట్ దుస్తులు ధరించడం, ఎక్కువ సేపు అక్కడ ఉండకపోవడం లాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా వెళితే మాత్రం, అందరిలో కాకపోయినా, కొందరిలో సమస్యలు తప్పవు. ఈ వైరల్ వీడియోను పరిశీలిస్తే అదే విషయం అవగతమవుతుంది.వీడియోతో పాటు షేర్ అయిన వివరాల ప్రకారం, మంచుతో కప్పబడిన ఎత్తైన ప్రదేశంలో ఇద్దరు మహిళలు డ్యాన్స్ రీల్ను షూట్ చేస్తున్నారు. ఒకరు ఎరుపు చీరలో, మరొకరు గులాబీ రంగులో ఉన్నారు. వీరిలో ఒకామె చలితీవ్రతకు ఇబ్బంది పడుతున్నమనం చూడొచ్చు. ఆక్సిజన్ స్థాయిలు పడిపోవడంతో తల తిరగడం, బ్లాక్అవుట్ లాంటి సంకేతాలతో ఇబ్బంది పడింది. ఒక దశలో ఆమె ఏడుస్తూ కుప్పకూలిపోయింది. వెంటనే అక్కడున్న వారు స్పందించి సహాయం అందించడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఇదీ చదవండి: తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం : ఆ కాఫ్ సిరప్ బ్యాన్Self-Harm Kalesh (Girl risked her life for reels: shot video in freezing heavy snow wearing almost nothing just for views. Soon oxygen dropped → started feeling dizzy, severe headache, blackout coming. Broke down crying in the snow.) pic.twitter.com/jooV7P02uO— Ghar Ke Kalesh (@gharkekalesh) January 18, 2026దీంతోనె టిజన్లు ఆమె యోగక్షేమాలపై ఆరా తీశారు. ఫాలోయర్లను పెంచుకునేందుకో, లేదా వారిని ఎంటర్టైన్ చేసేందుకో ఇలాంటి కంటెంట్ను సృష్టించే సందర్భంలో ఆరోగ్య ప్రమాదాలపై ఆందోళన వ్యక్తమైంది. ముఖ్యంగా చలి లేదా ఎత్తైన ప్రదేశాలకు అలవాటు లేని వారు, ఇలాంటి పరిస్థితులను తట్టుకోలేని వారు ఇలాంటి ప్రమాదకరమైన స్టంట్స్కు దూరంగా ఉండాలని సూచించారు. .చలిని నుంచి రక్షించే సరైన దుస్తులు లేకుండా తీవ్రమైన చలికి గురికావడం తీవ్రమైన పరిణామాలను కలిగిస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గడ్డకట్టే ఉష్ణోగ్రతలలో తగినంత రక్షణ లేకపోవడం అనేది అల్పోష్ణస్థితికి దారి తీస్తుందని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. -
వందే భారత్ రైళ్లకు పెరిగిన ‘చెత్త’ తాకిడి
మనోళ్లు తల్చుకుంటే ఏదైనా సాధ్యమే. గంటలో అమెరికాను అనకాపల్లిని చేసేస్తారు.. ఓ తెలుగు సినిమాలో సరదా సంభాషణ కోసం ఉపయోగించిన డైలాగ్ ఇది. అయితే.. మనోళ్ల చేతలు ఎలా ఉంటాయో చెప్పే ఉదాహరణ ఒకటి ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. కాస్త కాస్ట్లీ ప్రయాణంగా చెప్పుకుంటున్న వందే భారత్ రైళ్లను క్రమక్రమంగా చెత్త కుప్పలుగా మార్చేస్తున్నారు. మొన్నీమధ్యే దేశంలోనే తొలి వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. హౌరా–గువాహటి మధ్య పట్టాలపై ఇది పరుగులు పెట్టింది. ఈ నెలల 22 నుంచి పూర్తి స్థాయిలో ఇది నడవనుంది. అయితే ప్రారంభించిన కొన్ని గంటలకే ఆ రైలు చెత్తాచెదారంతో నిండిపోయింది. సివిక్ సెన్స్(పబ్లిక్ ప్లేస్ల్లో ఎలా వ్యవహరించాలనే స్పృహ) అనేది మరిచి.. ప్లాస్టిక్ ప్యాకెట్లు, స్పూన్లను బోగీల్లోనే పడేశారు అందులో ప్రయాణించినవాళ్లు. విదేశాల్లోలా మన దగ్గరా రైళ్లు.. దేశంలో హైటెక్ రైలు అంటూ సోషల్ మీడియాలో వందే భారత్ స్పీర్ ఎక్స్ప్రెస్ ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. సరిగ్గా అదే సమయంలో ఇటు ఈ వీడియో వైరల్ కావడం గమనార్హం. పబ్లిక్ ప్రాపర్టీకి గౌరవించేవాళ్లు.. మాన్సర్స్ ఉన్నవాళ్లు మాత్రమే ఈ రైళ్లలో ప్రయాణించాలి అంటూ రైల్వే అధికారులు మొదటి నుంచి మొత్తుకుంటున్నారు. కానీ, పైసలు కాస్త ఎక్కువైనా ఫర్వాలేదని ప్రయాణిస్తున్నవాళ్లు తమ అలవాట్లను మాత్రం కొనసాగిస్తున్నారు. వందే భారత్ రైళ్లలో చెత్త వ్యవహారంపై సోషల్ మీడియాలో ఇలా చర్చ నడుస్తోంది.. ఇది కాస్ట్లీ ప్రయాణమే అయినా.. చీప్ మెంటాలిటీ వల్ల చెత్త కుప్పగా మారుతోందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. సివిక్ సెన్స్ లేకపోతే ప్రపంచ స్థాయి మౌలిక వసతులు కూడా వేస్ట్ అని మరొకరు వ్యాఖ్యానించారు. కొత్త వందే భారత్ స్లీపర్ రైలు రోడ్డు పక్కన ఉన్న చెత్త బుట్టలా మారింది అని ఇంకొకరు అన్నారు. వందే భారత్ స్లీపర్ వైరల్ వీడియోపై రైల్వే అధికారి ఒకరు స్పందిస్తూ.. రైళ్ల శుభ్రత విషయంలో సిబ్బంది నిర్లక్ష్యంగా ఉండడం తగదని.. అదే సమయంలో శుభ్రత కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యత అని స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలను కట్టడిచేయాలంటే కఠిన మార్గాలను అనుసరించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారాయన. View this post on Instagram A post shared by I LOVE BONGAIGAON (@ilovebongaigaon) -
క్యాన్సర్తో చిన్నారి : తోటి విద్యార్థులు కళ్లు చెమర్చేలా, వైరల్ వీడియో
క్యాన్సర్తో పోరాడుతున్న వారికి, అటువ్యాధితో సతమతమవడంతోపాటు, జుట్టు ఊడిపోవడం పెద్ద సమస్యగా మారుతుంది. క్యాన్సర్ చికిత్సలో భాగంగా తీసుకనే కీమో థెరపీ కారణంగా మొత్తం జుట్టును కోల్పోవడం సాధారణంగా చూస్తూంటాం. ఆ సమయంలో వారి మానసికవేదన వర్ణనాతీతం. అయితే అలా బాధపడుతున్న విద్యార్థిని కోసం సహవిద్యార్థులు , ఉపాధ్యాయులు తీసుకున్న నిర్ణయం విశేషంగా నిలిచింది. క్యాన్సర్తో పోరాడుతున్న క్రమంలో ఒక విద్యార్థిని జుట్టు ఊడిపోవడం ప్రారంభించింది. దీంతో స్కూల్కు రావడానికి భయపడింది. అందరూ గేలి చేస్తారేమోనని భయపడింది. కానీ ఆ చిన్నారికి తోటి విద్యార్థులు, టీచర్లు అండగా నిలిచారు. టీచర్లు, పిల్లలు గుండు కొట్టించుకొని ఆమెకు అండగా నిలిచారు. ఈ పోరాటంలో నువ్వు ఒంటరివి కాదు, తోడుగా మేమూ ఉన్నామనే ధైర్యాన్నిచ్చారు. వారంతా సామూహికంగా గుండు చేయించుకుని ఆ చిన్నారిలో ధైర్యాన్ని నింపారు. ఇదీ చదవండి: తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం : ఆ కాఫ్ సిరప్ బ్యాన్Girl Lost Her Hair Due To Cancer, So Classmates and Teachers Shaved Their Heads To Cheer Her Up | WATCH pic.twitter.com/oVJQnetFyv— Ghar Ke Kalesh (@gharkekalesh) January 19, 2026 ఇది కేవలం పాఠశాల కాదు, ప్రేమ, ధైర్యం కలగలిసిన కుటీరమని, మనిషి మనిషి ప్రేమించాలని నేర్పించే దేవాలయమని నిరూపించారు. వారు చూపించిన అప్యాయతా నురాగాలు, చేసిన గొప్ప పనిపై నెటిజన్లు ప్రశంసించారు. స్నేహానికి మారు పేరుగా నిలిచిన విద్యార్థులకు మార్గదర్శకులకు సెల్యూట్ చేయడం విశేషం. నిజానికి ఇది ఫేమ్ కోసమో, చప్పట్ల కోసమో చేసింది కాదు మనస్ఫూర్తిగా నిండుమనసుతో చేసిన చర్య. ఆ దృశ్యాన్ని చూసినప్పుడు ఆ చిన్నారి సంకోచం దూది పింజలా కరిగిపోయింది. అందరి కళ్లు భావోద్వేగంతో చెమర్చే క్షణాలివి.ఇదీ చదవండి: మ్యాట్రిమోనియల్ స్కాం : కోట్లు నష్టపోయిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ -
Sakshi Special: ఇన్ఫ్లుయెన్సర్ల కొత్త దందా
-
వివాదంలో ‘ఖైదీ’ ఎమ్మెల్యే.. సిగరెట్ వీడియో వైరల్
పాట్నా: బీహార్లో అధికార జేడీ(యూ)కు చెందిన ఎమ్మెల్యే అనంత్ సింగ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఎమ్మెల్యే అనంత్ సింగ్.. ఓ ఆసుపత్రిలో సిగరెట్ తాగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే తీరుపై ప్రతిపక్ష నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఆసుపత్రిలో సిగరెట్ తాగుతూ రీల్స్ చేస్తున్నాడా? ఏం సందేశం ఇచ్చారంటూ నేతలు మండిపడుతున్నారు.వివరాల మేరకు.. జేడీ(యూ) ఎమ్మెల్యే అనంత్ సింగ్.. పాట్నాలోని ఇందిరా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఐజిఐఎంఎస్)కు వైద్య చికిత్సల కోసం వెళ్లారు. ఈ సందర్భంగా అనంత్ సిగరెట్ తాగారు. ఆసుపత్రి లోపలే ధూమపానం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోపై ప్రతిపక్ష నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా గౌరవప్రదమైన స్థానంలో ఉన్న వ్యక్తి ఈ విధంగా ప్రవర్తించడంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.JDU MLA Anant Singh smokes Ciggerate in Patna HospitalPublic hospital turned into personal ashtrayIndian Civic sense on Display pic.twitter.com/4qaDm9N5my— Nehr_who? (@Nher_who) January 19, 2026మరోవైపు.. ఈ వీడియోను ఆర్జేడీ ప్రతినిధి ప్రియాంక భారతి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ సందర్బంగా ఆమె స్పందిస్తూ..‘నితీశ్ కుమార్కు ప్రియమైన నేత అనంత్ సింగ్ సిగరెట్ పొగతో బీహార్లో సుపరిపాలనను తీసుకువస్తున్నాడని ఎద్దేవా చేశారు. అలాగే, నితీశ్ గారాల పెంపుడు విలన్.. ఆసుపత్రిలో సిగరెట్ తాగుతూ రీల్స్ చేస్తున్నాడా? అని ప్రశ్నించారు. ఈ వీడియోపై నెటిజన్లు సైతం తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అధికారంలో ఉండి ఇలాంటి ప్రవర్తన ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా.. బీహార్ గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనంత్ సింగ్ అరెస్ట్ అయ్యాడు. జన్ సూరజ్ పార్టీ ప్రశాంత్ కిశోర్ మద్దతుదారు దులార్ చంద్ యాదవ్ హత్య కేసులో అనంత్ సింగ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం అనంత్ సింగ్ విజయం సాధించారు. మొకామా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆర్జేడీకి చెందిన వీణా సింగ్పై 28,206 ఓట్ల తేడాతో గెలుపొందారు. ప్రస్తుతం ఆయనపై 28 క్రిమినల్ కేసులు ఉన్నాయి. -
సీఎం యోగీ మోమున నవ్వులు పూయించిన బుడ్డోడు, వైరల్ వీడియో
పిల్లలతో ఇంటరాక్షన్ ఎపుడూ హృద్యంగానే ఉంటుంది. అది రాజైనా, మంత్రి అయినా, ఎలాంటి వారైనా సరే ఒత్తిడిని మర్చిపోయి హాయిగా నవ్వుకోవాల్సిందే. ఎపుడూ గంభీరంగా కనిపించే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను మోముపై నవ్వులు పూయించిన వీడియో ఒకటి నెట్టింట తెగ సందడి చేస్తోంది. స్టోరీ ఏంటీ అంటేయూపీలోని గోరఖ్పూర్లోని గోరఖ్నాథ్ ఆలయంలో జరిగిన వార్షిక కిచిడీ మేళాలో ఈ ఘటన చోటుచేసుకుంది. యూపీ సీఎం సంప్రదాయం ప్రకారం గోరఖ్నాథునికి కిచిడీని సమర్పించారు. అనంతరం భక్తులతో ముచ్చటించారు. ఈ క్రమంలో అక్కడొక చిన్నారితో ముద్దుగా పలకరించారు. ఇదే కరెక్ట్ టైం అనుకున్నాడో ఏమో గానీ ఆ బుడ్డోడు తన మనసులోని కోరికను ముఖ్యమంత్రి చెవిన పడేశాడు. దీంతో అక్కడున్నవారంతా సరదాగా నవ్వుకున్నారు. ఇంతకీ ఆ చిన్నారి అడిగింది ఏమిటో చిన్న పిల్లలంతా ఇష్టపడే చిప్స్ ప్యాకెట్. దీంతో ముఖ్యమంత్రి స్వయంగా పిల్లవాడికి చిప్స్ ప్యాకెట్లను అందజేయడంతో వాడి మొహం మతాబులా వెలిగిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మిషన్ ఎకాంప్ల్ష్డ్ కొంతమంది వ్యాఖ్యానించారు. సీఎం చూపిన ఆప్యాయతకు నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. ఇదీ చదవండి: మ్యాట్రిమోనియల్ స్కాం : కోట్లు నష్టపోయిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ योगी जी ने पूछा और क्या चाहिए? बच्चा बोला चिप्स 😁 pic.twitter.com/Rqta2anzhU— Jayant Singh Shivach (@JayantSinghBJP) January 15, 2026Chips story update 😂 https://t.co/KBUvVsqlYM pic.twitter.com/aWOI9UzHiN— Lala (@FabulasGuy) January 16, 2026 -
ఓ తల్లి కోతి చేసిన పనికి నెటిజన్లు ఫిదా
-
ఊడిన చక్రం?.. రన్వేపై తుళ్లిపడిన విమానం
మరికాసేపట్లో ఆ విమానం ఎయిర్పోర్టులో దిగాల్సి ఉంది. అయితే ఏం జరిగిందో తెలియదు ల్యాండింగ్ సక్రమంగా జరగలేదు. రన్వేపై విమానం ఒక్కసారిగా ఊగుతూ దిగింది. కాస్త ఉంటే క్రాష్ ల్యాండ్ అయ్యేదే. కానీ, అదృష్టవశాత్తూ అది జరగలేదు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది. యునైటెడ్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం ఒకటి( UA2323 ఫ్లైట్) ఆదివారం మధ్యాహ్నాం చికాగో నుంచి ఒర్లాండోకు బయల్దేరింది. ఎయిర్పోర్ట్లో దిగే సమయంలో తీవ్ర కుదుపునలకు లోనైంది. అయితే.. పైలట్ చాకచక్యంగా స్పందించడంతో విమానం క్రాష్ ల్యాండ్ తప్పించుకుంది. ప్రమాదం సమయంలో విమానంలో 200 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. ఎవరూ గాయపడలేదని అధికారలు వెల్లడించారు. అయితే.. ఈ ఘటన తర్వాత విమానాల రాకపోకలకు కాసేపు అంతరాయం కలిగింది. ప్రయాణికులను ఎయిర్పోర్ట్ టర్మినల్కు తరలించి.. విమానాన్ని రన్వేపై నుంచి జరపడంతో రాకపోకలు యధావిధిగా కొనసాగాయి. ఫ్లోరిడా నగరం ఓర్లాండోలో గత కొంతకాలంగా విపరీతమైన వానలు, ఈదురు గాలులు వీస్తున్నాయి. ప్రతికూల వాతావరణం వల్లే ఈ ఘటన జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అయితే.. ల్యాండింగ్ సమయంలో నోస్ వీల్(ల్యాండింగ్ గేర్ చక్రం) ఊడిపోయిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఎయిర్లైన్స్గానీ, ఒర్లాండో ఎయిర్పోర్ట్ అథారిటీ కాని దీనిపై ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. 🚨WATCH: United Airlines flight nearly crashes during landing at Orlando International Airport (MCO) as nose wheel appears to roll off landing gearpic.twitter.com/bzjY6uQFmT— Derrick Evans (@DerrickEvans4WV) January 19, 2026 -
కూతురి బర్త్డేకి... తల్లి సర్ప్రైజ్
బర్త్డే అంటే వయసుతో నిమిత్తం లేకుండా అందరమూ చిన్నపిల్లలైపోతాం. చిన్న వయసులో బర్త్డే అంటే ఎదుగుతున్నామన్న సంతోషం అటు తల్లిదండ్రుల్లోనూ, ఇటు పిల్లల్లోనూ ఉండటం సహజం. ఒక సంవత్సరం వయసు పెరుగుతోందన్న బెంగ లేకుండా పెద్దలు కూడా ఈ పుట్టిన రోజును జరుపుకోవడం విశేషం. అంత స్పెషల్ పుట్టిన రోజు. ఈ వేడుకల్లో ఇష్టమైన బట్టలు, ప్రదేశాలు, కోరికలు ఇలా చిట్టా చాలానే ఉంటాయి. కానీ మనకిష్టమైన వాళ్లు, మనకిష్టమైన వంటకాలను అదీ ఇంట్లో వండితే బాగా గుర్తుండిపోతాయి. దీన్నేకంటెంట్ క్రియేటర్ బర్త్డేని ఆమె తల్లి ఫుడీగా నిర్వహించింది. అదేంటో చూద్దాం.కంటెంట్ క్రియేటర్ సారా సరోష్ 27వ పుట్టినరోజును ఆమె కుటుంబంగా వినూత్నంగా జరుపుకుంది. ఆమె 27 ఏళ్లను గుర్తు చేసుకుంటూ ఆమె తల్లి ఒకటీ రెండు కాదు, ఏకంగా 27 రకాల వంటకాలను తయారు చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇన్స్టాగ్రామ్లో వైరల్గా మారింది. ఈ క్లిప్ పుట్టినరోజు అమ్మాయి తన ఇంట్లోకి ప్రవేశించడంతో ప్రారంభమవుతుంది, ఈ రూమ్ అంతా అద్భుతమైన అలంకరణలతోపాటు, టేబుల్పై అమర్చిన పదార్థాలు చూసి ఆశ్చర్యపోవడం బర్త్డే గార్ల్ వంతైంది.అలాగే కుటుంబ సభ్యులందరూ రకరకాల ఆహార పదార్థాలు టేబుల్పై అమర్చడానికి ముందు వాటిని తయారు చేయడం, చివరి నిమిషంలో కొన్ని వంటకాలను, తల్లి తయారు చేస్తున్న దృశ్యాలను వీడియోలో చూడొచ్చు. వావ్.. 27 ఏళ్లకు 27 వంటకాలు, నా బర్త్డేకి బెస్ట్ గిఫ్ట్ థ్యాంక్యూ అమ్మా...ఎప్పటికీ నువ్వే మా అమ్మ అంటూ సారా తన సంతోషాన్ని వెలిబుచ్చింది. View this post on Instagram A post shared by Sylvia D'costa (@maa.madeit) ఈ విందులో వివిధ రకాల ఫ్రైడ్ చికెన్ ముక్కలు, వింగ్స్, చిన్న సమోసాలు, పినా కోలాడా,రస్నా గ్లాసులు ఉన్నాయి. సలాడ్లు, పాస్తాలు, ఇతర డిషెస్ ఉన్నాయి. టేబుల్ మధ్యలో ఫ్రాస్టింగ్తో కూడిన గుండ్రని చాక్లెట్ కేక్ ఉంది, దాని పక్కనే ప్రాన్ సుషీ, ప్రాన్ ఫ్రై, దహీ కే కబాబ్, స్టఫ్డ్ పొటాటోస్, తందూరి ప్రాన్స్ , చికెన్ షెజ్వాన్ వంటి వంటకాలు ఉన్నాయి.ఇదీ చదవండి: 26..26 : ప్రేమకు కొత్త అర్థం చెప్పిన ప్రియుడు, వైరల్ వీడియోదీనిపై నెటిజన్లు కూడా తమ ఆనందాన్ని ప్రకటించారు. ఇంత అద్భుతమైన తల్లిదండ్రులున్నందుకు నువ్వు చాలా అదృష్టవంతు రాలివి అంటూ సారాను దీవించారు. తల్లి ప్రేమ అంటే ఇలానే ఉంటుంది. ఈ వంటకాల గురించి తెలుసుకోవాలని ఉంది అని ఒకరు, ఇది ఏఐ పిక్లా ఉంది అని మరొకరు చమత్కరించారు. ఇదీ చదవండి: గడ్డకట్టిన సరస్సులో : గుండెలు పగిలే విషాదం వీడియో వైరల్ -
గర్ల్ఫ్రెండ్ కోసం 26 కిలోమీటర్ల పరుగు.. ట్విస్ట్ ఏంటంటే!
-
26..26 : ప్రేమకు కొత్త అర్థం చెప్పిన ప్రియుడు, వైరల్ వీడియో
ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ప్రియురాల్ని, పుట్టినరోజు నాడు బాగాఇంప్రెస్ చేయాలని ఏ ప్రేమికుడైనా అనుకుంటాడు. సాధారణంగా పువ్వులు, చాక్లెట్లు, రింగ్స్, లేదా మరేదైనా సర్ప్రైజింగ్గా తన ప్రేమను వ్యక్తం చేయడానికి ప్రయత్నిస్తాడు. తాజాగా ఒక యువకుడు తన ప్రియురాలి పుట్టిన రోజు సందర్భంగా ఆమెను ఆకట్టుకోవాలని వినూత్నంగా ప్రయత్నించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ సందడి చేస్తోంది.తన స్నేహితురాలి 26వ పుట్టినరోజును పురస్కరించుకుని అవిక్ భట్టాచార్య అనే యువకుడు రొమాంటింగ్ ప్రయత్నించాడు. ఏకంగా 26 కిలోమీటర్లు పరిగెత్తాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇంటర్నెట్ దృష్టిని ఆకర్షించాడు. భట్టాచార్య తన స్నేహితురాలు సిమ్రాన్ కలిసి ఉమ్మడిగా @simranxavik అకౌంట్లో షేర్ చేశారు. దీంతో ఈ క్లిప్ వైరల్ అవుతోంది.అసలు విషయం ఏమిటంటే..సిమ్రాన్ తన పుట్టినరోజున 26 కి.మీ పరిగెత్తాలని ప్లాన్ చేసుకుంది కానీ ఆమె అనారోగ్యం కారణంగా పరుగెత్తలేకపోయింది. దీంతో అవిక్ ఆ పనిచేసి ఆమె మనసు దోచుకున్నాడన్నమాట. అతను చేసిన పనికి ఆమె సంతోషంతో ఉబ్బితబ్బిబ్బై పోయింది.వీడియో భట్టాచార్య ఇలా అంటాడు "నా స్నేహితురాలు ఇప్పుడే 26 ఏళ్లు నిండాయి, కాబట్టి నేను ఆమె పుట్టినరోజు కోసం 26 కి.మీ పరిగెత్తబోతున్నాను." అంటూ తన రొమాంటిక్ రన్ను 2 కి.మీ, 4 కి.మీ, 6 కి.మీ, 10 కి.మీ అంటూ రికార్డ్ చేయడంతో పాటు, సిమ్రాన్ ఆరోగ్యంగా ఆనందాన్ని ఉండాలని కోరుకున్నాడు. అలాగే మరికొన్ని వారాల్లో రాబోయే ముంబై మారథాన్కు శిక్షణ పొందుతున్నామని, ఈ ప్రత్యేకమైన పరుగును పూర్తిగా ఆమెకు అంకితం చేయాలనుకుంటున్నానని కూడా వెల్లడించాడు. దీంతో నెటిజన్లు అవిక్ను ప్రశంసలతో ముంచెత్తారు.ఇదీ చదవండి: కన్నకూతుళ్లపై తండ్రి అఘాయిత్యం, 6 ఏళ్ల వయసు నుంచి -
అవును నా ప్రియుడే.. అయితే తప్పేంటి?
వివాహేతర సంబంధాలను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్న పలు సందర్భాలు నెట్టింట లేదంటే వార్తల రూపంలో వైరల్ అయ్యేది చూస్తూనే ఉంటాం. ఆ సమయంలో తమ భాగస్వాముల మోసాన్ని.. పరాయి వాళ్లతో ఆ స్థితిలో చూసి భరించలేక దాడులు చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే.. ఇక్కడ మాత్రం అందుకు పూర్తిగా విరుద్ధమైన దృశ్యాలు కనిపించడంతో పోలీసులు తలలు పట్టుకున్నారు.‘‘హలో.. పోలీస్ స్టేషన్ ఆ నా భార్య నన్ను మోసం చేస్తోంది. వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. మీరు వస్తే వాళ్లను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవచ్చు’’ అంటూ ఫోన్ చేశాడు ఓ భర్త. ఆ కాల్ అందుకుని ఆగమేఘాల మీద ఓ హోటల్కు చేరుకున్నారు. అప్పటికే పోలీసుల కోసం ఎదురు చూస్తున్న ఆ భర్త.. వాళ్లను చూడగానే ఉరుకుల మీద రూమ్ నెంబర్ 113 తలుపును విరగొట్టాడు. లోపల ఏకాంతంగా గడుపుతున్న ఓ జంట.. ఆ అలజడికి ఉలిక్కి పడింది. వెంటనే మంచం మీద ఉన్న వ్యక్తి.. మంచం కిందకు దూరాడు. ఈలోపు ఆ భర్త గట్టిగా కేకలు వేయడంతో హోటల్ సిబ్బంది, రోడ్డు మీద పోతున్న వాళ్లు అక్కడికి చేరారు. మంచం కింద దాక్కున్నవాడ్ని బయటకు లాగారు. వాళ్లందరిరి సమక్షంలో తనని తిట్టిపోస్తున్న భర్తను ఏమాత్రం భయపడకుండా ఎదుర్కొందామె. ‘‘అవును.. ఇతను నా ప్రియుడే. నా ఇష్టపూర్వకంగానే ఇక్కడికి వచ్చా. నేను నా భర్త రెండేళ్లుగా దూరంగా ఉంటున్నాం. అందుకే అతనింకా నా జీవితంలో భాగం కాదని ఫిక్స్ అయ్యా. అందుకే నాకిష్టమైన వ్యక్తితో జీవించాలని ఫిక్స్ అయ్యా. అందుకే నా భర్త నుంచి విడాకులు కోరుతున్నా’’ అంటూ పోలీసులకు సమాధానం ఇచ్చింది. ఈలోపు.. భర్త పోలీసులకు తన వాదన వినిపించడం మొదలుపెట్టాడు. పెళ్లైనప్పటి నుంచే తమ మధ్య గొడవలు జరుగుతున్నాయని.. 2023లో భార్య తరఫు వాళ్లు కేసు పెట్టినా మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకున్నామని, కానీ ఆమె మళ్లీ గొడవ పెట్టుకుని వెళ్లిపోయిందని.. అప్పటి నుంచి మరో వ్యక్తికి దగ్గరైందని.. ఇప్పుడు విడాకుల కోసం రూ.10 లక్షలు డిమాండ్ చేస్తోందని వాపోయాడు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇద్దరూ పోటాపోటీగా వాదించుకోవడంతో పోలీసులు వాళ్లను పీఎస్కు తీసుకెళ్లారు. ఇద్దరి వాంగ్మూలాలు తీసుకుని.. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. ఉత్తర ప్రదేశ్ ఝాన్సీ నగరంలోని నవాబాద్ పీఎస్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఆ వీడియోను మీరూ చూసేయండి.. 🚨 होटल ड्रामा, VIDEO वायरल 🚨🏨 पत्नी प्रेमी संग, पति 👮♂️ पुलिस के साथ पहुंचा😱 पकड़े जाने पर बोली— “तलाक दे दूंगी”📍 वायरल वीडियो झांसी (UP) बताया जा रहा#Jhansi #UPNews #ViralVideo #BreakingNews pic.twitter.com/yX4Z3ggciQ— Mr Kushal Gupta,( K G ) (@g94897659) January 16, 2026 -
మరో నిర్వాకం : అటు ఇండిగో, ఇటు ప్రయాణికులు, వైరల్ వీడియో
పైలట్ల కొరత, విమానాల రద్దు, పైలట్ల పనిగంటల తదితర అంశాలపై ఇప్పటికే చాలా విమర్శలెదుర్కొన్న ఇండిగో మరో వివాదంలో చిక్కుకుంది. డ్యూటీ సమయం ముగిసిన తర్వాత కూడా మరో విమానాన్ని నడపమని సంస్థ కోరడం, దీనికి పైలట్ నిరాకరించడంతో గందరగోళం నెలకొందన్న విమర్శలు వెల్లువెత్తాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ముంబై నుండి థాయ్లాండ్లోని క్రాబీకి వెళ్లే ఇండిగో విమానానికి సంబంధించి గురువారం నాడు ఈ విపత్కర పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ ఘటనపై ఇండిగో స్పందన ఎలా ఉందంటే..ఫ్లైట్-ట్రాకింగ్ వెబ్సైట్ ఫ్లైట్రాడార్24లో అందుబాటులో ఉన్న డేటా ప్రకారం, ఉదయం 4:05 గంటలకు బయలుదేరాల్సిన ఇండిగో విమానం, 6E 1085, మూడు గంటలకు పైగా ఆలస్యమైంది. ఉదయం 10 గంటలకు క్రాబీలో ల్యాండ్ కావాల్సిన విమానం, ఫ్లైట్రాడార్24 ప్రకారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతానికి చేరుకుంది.New:-Pandemonium in @IndiGo6E flight from Mumbai to Krabi -Passengers wanted to beat pilot-Who is said to have refused to operate flight as he was breaching his duty time & had told airline in advance-But flight was boarded & passengers were stuck inside for 3 hours✈️ pic.twitter.com/vAYWjCBHov— Tarun Shukla (@shukla_tarun) January 15, 2026విమానంలోని ప్రయాణికులకు, క్యాబిన్ సిబ్బందికి మధ్య తీవ్ర వాగ్వాదానికి దిగిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. తన డ్యూటీ సమయం ముగిసిందని చెప్పి పైలట్ విమానాన్ని నడపడానికి నిరాకరించాడని, ఈ కారణంతా తాము మూడు గంటలు పాటు ఇబ్బందులు పడ్డామని ప్రయాణికులు ఆరోపించారు. విమానం ఆలస్యం కారణంగా తమకు జరిగిన అసౌకర్యంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్లాన్ల పరిస్థితి ఏంటి అని ఒక ప్రయాణికుడు మండిపడ్డారు. మరి కొంతమంది తీవ్ర ఆగ్రహంతో దుర్బాషకు దిగారు. ముంబై-క్రాబీ విమానంలో జరిగినట్లు నివేదించబడిన ఈ సంఘటనను వీడియో తీసి రచయిత తరుణ్ శుక్లా ఎక్స్లో షేర్ చేశారు. దీని ప్రకారం ‘‘ఇండిగో హాయ్ హాయ్" అని నినాదాలు చేయడం చూడవచ్చు. ఒక మహిళ "ఎలుకలా ఎందుకు దాక్కున్నాడు? బ్లడీ ఇడియట్" అని అరవడం, మరో ప్రయాణికుడు విమానం ఎగ్జిట్ డోర్ను తన్నడం కూడా కనిపించింది.ఇదీ చదవండి: కన్నకూతుళ్లపై తండ్రి అఘాయిత్యం, 6 ఏళ్ల వయసు నుంచిఇండిగో స్పందనవిమానం ఆలస్యంపై ఇండిగో స్పందించింది. ఇన్కమింగ్ విమానం ఆలస్యంగా రావడం, విమాన ట్రాఫిక్ రద్దీ , సిబ్బంది తమ డ్యూటీ సమయ పరిమితులను మించడం వంటి అనేక కారణాల వల్ల ముంబై నుండి విమానం ప్రారంభంలో ఆలస్యమైందని ఇండిగో ప్రతినిధి తెలిపారు. వేచి ఉండే సమయంలో విమానంలోని ఇద్దరు ప్రయాణికులు అనుచితంగా ప్రవర్తించారనీ, వారిని క్రమశిక్షణ లేనివారిగా ప్రకటించామని విమానయాన సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.ఈ వివాదంతో ప్రోటోకాల్ ప్రకారం, వారిని విమానం నుండి దించి భద్రతా సంస్థలకు అప్పగించే క్రమంలో విమానం బయలుదేరడం మరింత ఆలస్య మైందని వివరించింది. గతంలో వెయిటింగ్ పీరియడ్లో ప్రయాణికులకు లంచ్, డ్రింక్స్లాంటివి అందించామని తెలిపింది. అందరికీ సురక్షితమైన, గౌరవప్రదమైన వాతావరణాన్ని అందిండచమే లక్ష్యమని, వినియోగదారుల అసౌకర్యానికి చింతిస్తున్నామని ప్రకటించింది. ఇదీ చదవండి: 5,200 ఏళ్ల నాటి పడవ గుర్తింపు, సూపర్ టెక్నాలజీ -
పొంగల్వేళ అద్భుతమైన సాంప్రదాయ పులినృత్యం..!
పొంగల్ వేళ ఓ పాఠశాలలోని టీచర్ మార్గదర్శకత్వంలోని సాంప్రదాయ పులి నృత్యం నెట్టింట వైరల్గా మారి అదరి దృష్టిని అమితంగా ఆకర్షించింది. ఆ చిన్నారులు ఆనృత్యాన్ని అద్భుతంగా ప్రదర్శించేలా చేసేందుకు అతడు పడ్డ తపన మాటలకందనిది. ఓ గురువు తన శిష్యుల కోసం ఎంతలా కష్టపడతాడు అనేందుకు ఈ ఘట్టం అద్భుతమైన ఉదాహరణ.న్యూజెర్సీ ఎడిసన్లోని తిరువల్లూవర్ తమిళ పాఠశాలలో జరిగిన ఉత్సాహభరితమైన పొంగల్ వేడుక నెట్టింట వైరల్గా మారింది. ఆ వీడియోలో గులాబీ రంగు చీర ధరించిన ఓ మహిళా టీచర్ తన పిల్లల ముందు నిలబడి పులియట్టం (సాంప్రదాయ పులి నృత్యం) కోసం మార్గనిర్దేశం చేస్తున్నట్లు కనిపిస్తాడు. దాంతో ఆ విద్యార్థులు తమ టీచర్ని అనుసరిస్తూ..సులభంగా ఆ బీట్కు అనుగుణంగా కాళ్లు కదుపుతుంటాడు. అయితే అక్కడ వాళ్లు ఆ సంగీత లయలకు అనుగుణంగా సరిగా స్టెప్పులు వేస్తున్నా..అక్కడ ఆ మహిళా టీచర్ మాత్రం అందరి దృష్టిని అకర్షించి, హైలెట్గా నిలిచింది. అక్కడున్న విద్యార్థులంతా ఆ సంప్రదాయ పులి నృత్యం అంతభాగా ప్రదర్శించగలిగారంటే..అందుకు ఆ టీచర్ పెట్టిన ఎఫెక్టే కారణం. వాళ్లు ఏ స్టెప్ని మిస్ చేయకుండా కేర్ తీసుకుంటూ..వారికి ఎదురుగా నిలబడి ఆ టీచర్ కూడా నృత్యం చేస్తూ..పడిన తపనకి అందరూ ఫిదా అవ్వడమే గాక..ఆమె పెట్టిన ఎఫెక్ట్కి మాటల్లేవ్ అంతే..!. అంటూ పోస్టలు పెట్టారు నెటిజన్లు View this post on Instagram A post shared by Kees Candid 🇮🇳to🇺🇸 (@keescandid) (చదవండి: Makar Sankranti 2026: అరిసెలే కాదు ఉంధియు, తిల్ పిఠా కూడా!) -
‘బిడ్డా.. మీ అయ్య చూస్తే ఊకోడు’
కృత్రిమ మేధస్సు (AI)తో సృష్టించే కంటెంట్ను ఈ మధ్యకాలంలో ఎందుకూ పనికి రాని విషయంగా(AI slop) చాలామంది తిడుతున్నారు. అడ్డదిడ్డంగా, అడ్డగోలుగా.. అందునా అశ్లీలమైన కంటెంట్ వైరల్ అవుతుండడమే అందుకు కారణం. పైగా ఒరిజినాలిటీని దెబ్బ తిస్తోందని విమర్శిస్తున్నారు. కానీ అదే సాంకేతికతను వినోదం కోసం ఉపయోగిస్తే ఆ కిక్కే వేరప్పా. ఏఐ కంటెంట్ను ఇప్పుడున్న యూత్ ఎలా ఉపయోగించుకుంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలూ వాళ్ల పనితీరు ఎలా ఉంటుందో తెలిసిపోతుంది. అయితే.. ఇక్కడ మాత్రం ఓ కూతురు తన తల్లిని ఆటపట్టించింది. లేని బాయ్ఫ్రెండ్ను సృష్టించి.. తల్లికి పిచ్చి కోపం తెప్పించింది. అలా నెట్టింట నవ్వులు పూయించింది. అసలు విషయంలోకి వెళ్తే.. యూపీ లక్నోకు చెందిన పావని అవస్థి తన తల్లిని సరదాగా మోసం చేసింది. చాట్జీపీటీ ద్వారా ఎడిట్ చేసిన ఫొటోను తల్లికి చూపించి బిత్తర పోయేలా చేసింది. ఆపై వాళ్ల మధ్య సంభాషణ ఇలా జరిగింది. ఆ ఫొటోలోని వ్యక్తి ఎవరు అని తల్లి ప్రశ్నించగా.. తన బాయ్ఫ్రెండ్ అని ఆమె బదులిచ్చింది. అవునా.. అతను నీ స్నేహితుడా?.. ఎప్పటి నుంచి మీరు స్నేహితులు? అంటూ ఆందోళనలతో ప్రశ్నలు గుప్పించి.. చాలాకాలంగా తెలుసని, మంచోడు అని, ఇంకా కొన్నిరోజుల్లో ఇంటికి వస్తాడు కదా అంటూ పావని సమాధానం ఇచ్చింది. అయితే ఈ విషయం నీ తండ్రికి తెలిస్తే బాగోదని.. ఆయన ఏమాత్రం సంతోషించరని కోపంగా మాట్లాడి లాగిపెట్టి కొట్టింది. ఫోన్ విసిరేయబోతుండగా.. సీన్ కట్ అయ్యింది. View this post on Instagram A post shared by Pawani (@pawani_awasthi_)తన తల్లిని ఏఐతో ఎలా బురిడీ కొట్టించిందో తెలియజేస్తూ పావని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. ఈ వీడియోకు ఇన్స్టాగ్రామ్లో దగ్గర దగ్గర 4 మిలియన్ల(4M) వ్యూస్ వచ్చాయి. ఈ ప్రాంక్ను ఆస్వాదించిన వాళ్లంతా.. సరాదాగా కామెంట్లు పెడుతున్నారు. నేను AIని అసహ్యించుకునే వాడిని. కానీ ఇది అద్భుతమైన వినియోగం అంటూ ఓ నెటిజన్ చేసిన కామెంట్ హైలైట్ అవుతోంది. ఇదిలా ఉంటే.. మరో ఘటనలో ఒక మనవడు తన తాతయ్య 90వ పుట్టినరోజు సందర్భంగా AI సాంకేతికతను వినియోగించి ప్రత్యేకమైన వీడియోను రూపొందించాడు. పాత కుటుంబ ఫోటోలను ఉపయోగించి, వాటిని కదిలే జ్ఞాపకాలుగా మార్చి తాతయ్య జీవితకథను చూపించాడు. ఆ వీడియో చూసిన తాతయ్య మాటలు రానంతగా భావోద్వేగానికి లోనయ్యాడు. కుటుంబ సభ్యులు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. AIని కేవలం నిరుపయోగమైన కంటెంట్ సృష్టించే సాధనంగా కాకుండా, సరదా, భావోద్వేగం, కుటుంబ బంధాలను మరింత బలపరచే సాధనంగా కూడా ఉపయోగించవచ్చని ఈ వీడియో చూసిన వాళ్లు కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Generative AI | Discover, Learn & Grow (@generativeai_official) -
Garam Garam Varthalu: కొడుకు మీద ప్రేమతో
-
హై-రైజ్ పెయింటర్..! ఇది కదా సంపాదన అంటే..
చాలామంది ఓ ఉద్యోగం సంపాదించగానే తమకంటే గొప్పోళ్లు లేరన్నట్లుగా ఉంటుంది వారి బిల్డప్. తమదే సంపాదన అన్నట్లు ఉంటుంది వాళ్ల ఆటిట్యూడ్. కానీ ఈ వ్యక్తి ఆర్జించే విధానం చూస్తే..ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం అనే మాటకు నిలువెత్తు నిదర్శనంలా ఉంది. రెండు చేతులా సంపాదిస్తున్నా..చిన్న చితకా పనులను కూడా ఎలాంటి నామోషి లేకుండా చాలా ఇష్టంతో చేస్తుండటం చూస్తే..సింపుల్ సిటీకి అసలైన అర్థం ఇతడేనేమో అనిపిస్తుంది.ఒక మహిళ, పెయింటర్ మధ్య సంభాషణ నెట్టింట వైరల్ అవ్వడంతో ఈ ఘటన వెలుగు చూసింది. ఒక ఎత్తైన భవనంపై పెయింటింగ్ వేస్తూ ఉండగా,.. ఆ భవనంలోని మహిళ సరదాగా పలకరిస్తుంది ఆ పెయింటర్ని. అంత ఎత్తు నుంచి వేలాడుతూ పేయింటింగ్ వేయడం చూసి..ఆమె నడుం నొప్పి వస్తుందా అని అడగగా..ఆ పెయింటర్ ఎలాంటి నొప్పి లేదని సమాధానమస్తాడు. ఆ తర్వాత అతడు తన వేతనం రూ. 30,000లని కూడా చెబుతాడు. అతడి శాలరీ విని ఆమె ఆశ్చర్యపోతుంది కూడా. ఇంకా ఆ పెయింటర్ మాట్లాడుతూ తాను కూడా చదువుకున్నానని, డిగ్రీ పూర్తి చేశానని, వ్యవసాయం కూడా చేస్తుంటానని చెప్పాడు. అలాగే తన తోబుట్టువుల గురించి ప్రస్తావిస్తూ..తన సోదరుడు సైన్యంలో ఉన్నాడని, సోదరి బీహార్ పోలీస్ శాఖలో పనిచేస్తుందని చెబుతాడు. మరి నీ సంపాదన నీ తోబుట్టువుల కంటే ఎక్కువేనా అని ఆ మహిళ అడగగా అందుకు ఆ వ్యక్తి తాను చెరుకు ద్వారా సుమారు రూ. 10 లక్షల దాక ఆర్జిస్తానని బదులు ఇస్తాడు. ఈ సంభాషణ మొత్తం సానియా మీర్జా అనే మహిళ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడంతో నెట్టింట వైరల్గా మారింది. ఈ వీడియో నెటిజన్లను అమితంగా ఆకర్షించడమే కాకుండా అతని కష్టపడేతత్వం అందర్నీ కట్టిపడేసింది. (చదవండి: లండన్లో చాయ్, పోహా..! ఖరీదు ఎంతో తెలుసా?) -
మారువేషంలో ఆ ఎంపీ! ఏం చేశాడంటే..
ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు కొంతమంది మంచి రాజులు మారువేషాలేసుకుని నగర వీధుల్లో తిరిగేవారట!. రాజులు లేరు.. రాజరికం పోయింది. ప్రజాస్వామ్యం వచ్చింది. ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు మారువేషాలు వేసుకునే ప్రజాప్రతినిధులు అరుదైపోతున్న ఈ కాలంలో ఒక ఎంపీ ఆ దిశగా ఒక అడుగు వేశారు. దేశంలో కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న గిగ్ వర్కర్ల అసలు కష్టాలేమిటో అర్థం చేసుకునేందుకు తానూ రోజుపాటు ఆ పని చేశారు. ఎవరా ఎంపీ.. ఏమా కథ?.. రాఘవ్ చద్దా.. గిగ్ కార్మికుల హక్కులపై ఈ మధ్యకాలంలో గళం వినిపిస్తున్న ఏకైక ఎంపీ. క్విక్ కామర్స్ (Quick commerce) సంస్థల 10 నిమిషాల డెలివరీ వ్యవస్థతో మనుషుల ప్రాణాలు పోతున్నాయని.. అలాంటిదాన్ని పూర్తిగా నిషేధించాలని మొన్నీమధ్యే రాజ్యసభలోనూ ఆయన మాట్లాడారు. ఆ సమయంలో.. ఇంటర్నెట్లో తెగ వైరల్ అయిన బ్లింకెట్ డెలివరీ బాయ్ ఒక్కరోజు సంపాదనను ప్రముఖంగా ప్రస్తావించారాయన. అంతేకాదు.. ఆ డెలివరీ బాయ్ వివరాలు కనుక్కుని, తన వద్దకు రప్పించుకుని ఆతిథ్యం కూడా ఇచ్చి పంపించారు. ఇప్పుడ మరో అడుగు ముందుకేశారు. గిగ్ కార్మికుల కష్టాలు తెలుసుకునేందుకు వేషం మార్చారు. బ్లింకెట్ డెలివరీ ఏజెంట్తో కలిసి ఆ అనుభవం ఏంటో చవిచూశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. అఫ్కోర్స్.. ఈ చర్యను కూడా విమర్శించేవాళ్లు లేకపోలేదు. ఇది ఢిల్లీలో చేశారా? పంజాబ్లో చేశారా?(ఆయన పంజాబ్ కోటాలో రాజ్యసభ ఎంపీ అయ్యారని) అంటూ సెటైర్లు వేస్తున్నారు. అలాగే ఆయన చర్యను మెచ్చుకునేవాళ్లు కూడా కనిపిస్తున్నారు. అయితే.. ఆ పనిలో అనుభవమేంటో ఆయన ఇంకా వివరించాల్సి ఉంది.Away from boardrooms, at the grassroots. I lived their day.Stay tuned! pic.twitter.com/exGBNFGD3T— Raghav Chadha (@raghav_chadha) January 12, 2026‘‘గిగ్ కార్మికులు రోబోలు కాదు. ఈ విషయంపై సభ ఆలోచన చేయాలి. 10 నిమిషాల్లో డెలివరీ అనేది క్రూరత్వం. ఈ పద్ధతికి ముగింపు పలకాలి. వేగంగా సేవలు అందుతున్నాయని వినియోగదారులు ఆశిస్తున్నప్పటికీ.. గిగ్ కార్మికుల సంక్షేమం గురించి చట్టసభ ఆలోచించాలి. రేటింగ్ తగ్గించడం, ప్రోత్సాహకాల్లో కోత, ఐడీ బ్లాక్ వంటి భయాలతో నిర్దిష్ట సమయంలో డెలివరీ చేసేందుకు కార్మికులు (Gig Workers) వేగంగా, సిగ్నల్స్ జంప్ చేస్తూ వెళ్లాల్సి వస్తోంది. ఈ క్రమంలో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. వీటితోపాటు కస్టమర్ల వేధింపులు, ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేయాల్సి రావడం వంటి సవాళ్లు ఎదుర్కొంటున్నారు. గిగ్ కార్మికులు భారత ఆర్థిక వ్యవస్థకు కనిపించని చక్రాలు. కానీ వాళ్ల పరిస్థితి రోజువారీ కూలీల కంటే దారుణంగా ఉంటోంది:::రాజ్యసభలో రాఘవ్ చద్దా -
లండన్లో చాయ్, పోహా..! ఖరీదు ఎంతో తెలుసా?
లండన్లో సమోసాలు అమ్ముతున్న బిహార్ వ్యక్తి నెట్టింట తెగ వైరల్ అయ్యాడు. అది మరువక మునుపే తాజాగా మరో బిహార్ వ్యక్తి అదే బాటలో నడుస్తూ అందర్నీ అమితంగా ఆకర్షించాడు. లండన్లో రుచికరమైన సమోసాలను విక్రయిస్తున్న ఒక బిహార్ వ్యక్తి నెట్టింట సంచలనంగా మారి..ఎంతలా బిజినెస్ రన్ చేస్తున్నాడనేది అందరికీ తెలిసిందే. అచ్చం అలానే ఇప్పుడు ఈవ్యక్తి లాస్ ఏంజిల్స్ వీధుల్లో చాయ్ పోహ అమ్ముతున్న వీడియో అందర్నీ విస్మయానికి గురి చేసింది. అంతేగాదు ఒకరకంగా ఇది కష్టపడేతత్వం, ఆత్మవిశ్వాసం, సాంస్కృతిక గర్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలవడం విశేషం. పైగా స్వతహాగా స్వదేశానికి దూరంగా ఉన్నా..వాటి మూలాలతో కనెక్ట్ అయ్యే ఉన్నా అన్నట్లుగా అతడు జీవిస్తున్న విధానం ఉంది. అంతేగాదు విదేశాల్లో ఉన్నా.. హిందీలోనే మాట్లాడతాడు, బిహారీ వ్యక్తిగా గుర్తింపునే అత్యంత గౌరవంగా భావిస్తాడు. అంతేకాదండోయ్ లండన్లో ఆ వ్యక్తి అమ్మే టీ ఖరీదు రూ.782 కాగా, పోహా ఖరీదు రూ. 1,512లు. అంతర్జాతీయ నగరానికి అనుగుణంగా అతడు విక్రయించే ధరలు నిజాయితీని, సంకల్పాన్ని ప్రతిబింబిస్తున్నాయి. అక్కడ స్థానిక లండన్ప్రజలు అతడి పొడవాటి జుట్టు, మీసాలను చూసి..ఏసుక్రీస్తుతో పోలుస్తూ ఉంటారని చెబుతున్నాడు. View this post on Instagram A post shared by India ego (@indiaego) (చదవండి: వలస వచ్చి..ప్రేమ 'నరకం'లో పడి..ఇప్పుడు 'కరోడ్పతి'గా..) -
జస్ట్ మిస్ భయ్యా.. అదృష్టం అంటే వీరిదే..
బెంగళూరు: కొన్ని సందర్భాల్లో నువ్వు లక్కీ ఫెలో రా.. అని అంటుంటాం కదా.. సరిగ్గా అలాగే ఓ బ్యాచ్కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఎందుకు అనుకుంటున్నారా?.. అతివేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి డివైడర్ను దాటుకుని వెళ్లి వారి వైపు దూసుకొచ్చింది. సెకన్ల వ్యవధిలో వారు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలో వైరల్ అవుతోంది. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటుచేసుకుంది.ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బెంగళూరులోని ఇందిరానగర్లో డెరిక్ టోనీ(42) ఫుల్లుగా మద్యం సేవించి తన స్కోడా కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాడు. 18వ మెయిన్ రోడ్డు నుండి 100 అడుగుల రోడ్డు వైపు వెళ్తున్నాడు. ఇంతలో మద్యం మత్తులో కారుపై నియంత్రణ కోల్పోయి.. రోడ్డు వద్ద ఎడమ వైపునకు తిరగాల్సి ఉండగా నేరుగా డ్రైవ్ చేశాడు. దీంతో, అతి వేగంలో ఉన్న కారు ఒక్కసారిగా డివైడర్పై నుంచి సినిమా రేంజ్లో జంప్ చేసి అవతలి వైపునకు దూసుకెళ్లింది.ఈ క్రమంలో రోడ్డుపై వెళ్తున్న ఒక ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు, చివరకు అక్కడే ఉన్న ‘బార్బెక్యూ నేషన్’ రెస్టారెంట్ గోడను బలంగా ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో రెస్టారెంట్ గోడ పూర్తిగా దెబ్బతినింది. ప్రమాదం శుక్రవారం రాత్రి 11:35 గంటల సమయంలో కొందరు వ్యక్తులు రెస్టారెంట్లో డిన్నర్ ముగించుకుని బయట నిలబడి ఉన్నారు. వారిపై కారు దూసుకెళ్లినప్పటికీ సెకన్ల వ్యవధిలో అప్రమత్తమైన బ్యాచ్.. ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అదృష్టవశాత్తూ ఈ భారీ ప్రమాదంలో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు.ఇక, ఈ ఘటనలో కారు ఢీకొట్టిన బైక్ను నడుపుతున్న జాబిర్ అహ్మద్ అనే వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. అతడిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న జీవన్ భీమా నగర్ ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. మద్యం సేవించి కారు నడిపిన డెరిక్ టోనీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. -
ఇక్కడ కూడా వదలరా?.. స్మృతి రియాక్షన్ వైరల్
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)-2026ను విజయంతో ఆరంభించింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ). డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్తో శుక్రవారం నాటి మ్యాచ్లో మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠ రేపిన WPL ఓపెనర్లో ఆర్సీబీ జయకేతనం ఎగురవేసింది.సౌతాఫ్రికాకు చెందిన నదినె డి క్లెర్క్ ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆర్సీబీకి సంచలన విజయం అందించింది. దీంతో ఆర్సీబీ ఖాతాలో తొలి గెలుపు నమోదైంది. ఈ మ్యాచ్లో ఓపెనర్గా స్మృతి మంధాన (13 బంతుల్లో 18) విఫలమైనా.. కెప్టెన్గా మాత్రం హిట్టయ్యింది.ఇక ఆటకు తోడు అందంతో మెరిసే స్మృతి మంధానకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విరాట్ కోహ్లి మాదిరే స్మృతి పట్ల కూడా ఆర్సీబీ ఫ్యాన్స్ వీరాభిమానం చూపిస్తారు. అందుకే కెమెరామెన్ సైతం మైదానంలోపలా, వెలుపలా ఆమెపైనే ఎక్కువగా దృష్టి పెడతాడు.ఇక్కడ కూడా వదలరా?ఈ నేపథ్యంలో మ్యాచ్కు ముందు మైదానంలో బ్యాట్తో స్మృతి ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఓ కెమెరామెన్ ఆమెకు దగ్గరగా వచ్చి ఫొటోలు తీసే ప్రయత్నం చేశాడు. దీంతో కాస్త చిరాకుపడిన స్మృతి.. ‘‘ఇక్కడ కూడా వదలరా? ఏంటి భయ్యా ఇది?’’ అన్నట్లుగా రియాక్షన్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఆర్సీబీ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్గా మారింది.మాకు అలవాటేఇక తొలి మ్యాచ్లో ఆర్సీబీ విజయం సాధించడం పట్ల స్మృతి హర్షం వ్యక్తం చేసింది. ఉత్కంఠ పోరులో గెలవడం తమకు అలవాటేనని.. నదినె వల్లే ఈ గెలుపు సాధ్యమైందని ప్రశంసించింది. జట్టులోని ప్రతి ఒక్కరు సానుకూల దృక్పథంతో ముందుకు సాగారని కొనియాడింది.కాగా స్మృతి వ్యక్తిగత జీవితంలో ఇటీవల ఓ చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. ఆరేళ్లుగా ప్రేమలో ఉన్న పలాష్ ముచ్చల్తో పెళ్లి పీటలు ఎక్కే కొన్ని గంటలకు ముందు.. హఠాత్తుగా వివాహం ఆగిపోయింది. పలాష్ ఆమెను మోసం చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.డబ్ల్యూపీఎల్-2026: ముంబై వర్సెస్ ఆర్సీబీ స్కోర్లు👉ముంబై: 154/6(20)👉ఆర్సీబీ: 157/7(20)👉ఫలితం: మూడు వికెట్ల తేడాతో ఆర్సీబీ గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: నదినె డి క్లెర్క్ (4/26, 44 బంతుల్లో 63 నాటౌట్).చదవండి: మేము నటిస్తున్నామని మాకూ తెలుసు: బీసీబీపై బంగ్లా కెప్టెన్ విమర్శలుCameraman not leaving Smrithi alone to practice and see Smrithi’s reaction 😂 pic.twitter.com/QVF8q4WTzw— RCB (@RCBtweetzz) January 9, 2026 -
టీనేజ్ లవర్స్ : 40 ఏళ్లకు 60లలో మళ్లీ పెళ్లి
నలభై ఏళ్ల ప్రేమ అరవై ఏళ్ల వయసులో నెరవేరడం నిజంగా అదృష్టం. 65 ఏళ్ల వయసులో జయప్రకాష్ అనే వ్యక్తి, తన టీనేజ్ ప్రియురాలు యాభై తొమ్మిదేళ్ల రష్మిని పెళ్లాడాడు. ఇది కేవలం ప్రేమకథ కాదు. అనేక ట్విస్టు అండ్ టర్న్ మధ్య వారి చిరకాల ప్రేమసంతోషం, ఆనందం గెలిచిన రోజు. ఒకనాడు విధికి తలవంచిన ఈ జంట, మళ్లీ ఆ విధి చేసిన వింతలో భాగంగానే పిల్లల అనుమతితో ఒకటయ్యారు. అలనాటి ప్రేమికులు జయప్రకాష్ , రష్మిల అందమైన, అరుదైన ఈ పెళ్లి కథ గురించి తెలుసుకోవాలని ఉందా.. అయితే పదండి! కేరళలో జరిగిన ఆసక్తికరమైన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి:-కేరళలోని కొల్లం ముందక్కల్కు చెందినవారు జయప్రకాష్, రష్మి. వీరిద్దరూ పొరుగువారే. చాలా చిన్న వయసులోనే ప్రేమించు కున్నారు. కానీ వీరి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. విధి వారిద్దరినీ మరొకరి జీవితంలోకి ప్రవేశించేలా చేసింది. దీంతో ఇద్దరూ తమ ప్రేమను త్యాగం చేసి, పెద్దలు చెప్పిన పెళ్లిళ్లు చేసుకొని వారి వారి జీవితాల్లో స్థిరపడ్డారు. రష్మికి ఆమె తల్లిదండ్రులు వేరే వ్యక్తితో వివాహం జరిపించారు.ప్రేమ విఫలం కావడంతో జయప్రకాష్ ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్లి, పెళ్లి చేసుకున్నాడు. జయప్రకాష్కు ఇద్దరు కుమారులు, రష్మికి ఇద్దరు కుమార్తెలున్నారు. పిల్లలు, మనవరాళ్ళు, మునిమనవళ్లు వారి కుటుంబాలు నిండుగా సంతోషంగా ఉన్నాయి. అయితే జయప్రకాష్, రష్మి ఇద్దరూ కూడా తమతమ జీవిత భాగస్వాములను కోల్పోయారు. రష్మి భర్త పదేళ్ల క్రితం అకస్మాత్తుగా మరణించగా, జయప్రకాష్ భార్య 5 సంవత్సరాల క్రితం మరణించింది. అప్పటి నుంచి వారు తమ పిల్లలే తమ ప్రాణమని భావించి తిరిగి వివాహం చేసుకోకుండానే జీవించారు. దీంతో వారిద్దరూ ఒంటరిగా మారారు. షార్ట్ ఫిలిం కలిపిన ప్రేమభర్తను కోల్పోయిన బాధను మర్చిపోయేందుకు రష్మి సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనేది. ఆమె షార్ట్ ఫిల్మ్లలో కూడా నటించేది. ఈలోగా జయప్రకాష్ రష్మి నటించిన ఒక షార్ట్ ఫిల్మ్ చూశాడు. తన చిన్ననాటి ప్రియురాలు షార్ట్ ఫిల్మ్స్లో నటించినట్టు తెలిసి సంబరపడిపోయారు. షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ వద్ద రష్మి కుమార్తె సెల్ ఫోన్ నంబర్ తీసుకుని, రష్మితో మాట్లాడారు. ఈ క్రమంలోనే జీవిత భాగస్వాములు చనిపోయారని పరస్పరం తెలుసుకున్నారు. మరోవైపు భార్య చనిపోవడంతో పిల్లల పట్టుబట్టడంతో జయప్రకాష్ కూడా తిరిగి వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. తాను తిరిగి వివాహం చేసుకోవాలని భావిస్తున్నానని జయప్రకాష్ రష్మికి చెప్పాడు. అలా ఇద్దరిమధ్య పాత ప్రేమ మళ్లీ చిగురించింది. పిల్లల అంగీకారంతో ఇద్దరం పెళ్లి చేసుకోవచ్చని కూడా ప్రపోజ్ చేశాడు. రష్మి తన కూతురు, అల్లుడికి ఆ విషయం చెప్పింది. వారిద్దరూ పెళ్లి చేసుకోవడానికి అంగీకరించారు. ఇంకేముంది పెళ్లి సందడి వేళ అయ్యింది.పిల్లలే పెద్దలుగా జయప్రకాష్-రష్మి సమీప బంధువుల సమక్షంలో దంపతులుగా మారారు. యవ్వనంలో ప్రేమలో పడిన ఈ జంట 60 ఏళ్ల తర్వాత కలిసి "నిజమైన ప్రేమ ఒకరోజు తప్పకుండా గెలుస్తుంది" అని నిరూపించారు. నూతన వధూవరులు రష్మి, జయప్రకాష్ మలేషియాకు హనీమూన్ వెళ్లాలని నిర్ణయించు కున్నారు. జయప్రకాష్, రష్మిల వివాహ ఫోటోను రష్మి కుమార్తె సోషల్ మీడియాలో షేర్ చేసి, "ఈ అదృష్టం ఏ పిల్లలకు లభిస్తుంది?" అని పేర్కొనడం విశేషంగా నిలిచింది.ఇదీ దచవండి: అమ్మానాన్నల్ని ఫస్ట్ ఫ్లైట్ ఎక్కిస్తే.. ఆ కిక్కే వేరప్పా! -
అమ్మానాన్నల్ని ఫస్ట్ ఫ్లైట్ ఎక్కిస్తే.. ఆ కిక్కే వేరప్పా!
సగటు భారతీయ కుటుంబాలకు విమాన ప్రయాణం అంటే విలాసవంతమైందే. ఆకాశంలో విహరించేందు కోసం సంవత్సరాల తరబడి వేచి ఉండటం, అందుకనుగుణంగా డబ్బులు దాచుకోవడంతోపాటు కొన్ని త్యాగాలు కూడా ఉంటాయి. అలా నెటిజనులలో భావోద్వాగాన్ని కలిగించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్వుతోంది.విష్ణు అనే వ్యక్తి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన వీడియో ప్రకారం తన తల్లిదండ్రులను తొలిసారి విమానం ఎక్కించాడు. ఈ అనుభవాన్ని రికార్డ్ చేశాడు. ప్రతీ కొడుకు స్వప్నం నెరవేరిన క్షణం ఇదీ అంటూ ఎలాంటి ఫిల్టర్లు, సౌండ్ట్రాక్లు లేకుండా చాలా సాదా సీదాగా, అత్యంత హృద్యంగా ఈ క్షణాలను వీడియో తీశాడు. సెక్యూరిటీ చెకప్నుంచి, గేటులోకి ఎంట్రీ ఇవ్వడం, విమానం ఎక్కడం, చివరగా విమానంలో కూర్చునే దాకా తల్లిదండ్రుల ముఖాల్లో ఆనందాన్ని ఈ వీడియోలో స్పష్టంగా చూడవచ్చు ఈ సెంటిమెంట్తో సోషల్ మీడియా వినియోగదారులు త్వరగా కనెక్ట్ అయ్యారు. "స్వచ్ఛమైన ప్రేమ మరియు కృతజ్ఞత అంటూ విష్ణుకు అభినందనలు తెలిపారు. గ్రేట్ బ్రో.. ఇది కదా ఆనందం అంటే అని మరొకరు, "ఇది ప్రతి మధ్యతరగతి మనిషి కల" చిన్నప్పటినుంచీ కష్టపడి పెంచి, చదివించినందుకు వారికి మనం చాలా రుణపడి ఉంటాం అంటూ కమెంట్లు వెల్లువెత్తాయి. -
దటీజ్ కేసీఆర్
సాక్షి, సిద్ధిపేట: తెలంగాణ ప్రభుత్వం తరఫున బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు ఆహ్వానం వెళ్లింది. ఆ సమయంలో ఆయన పలకరింపు మహిళా మంత్రులనూ ఒకింత ఆశ్చర్యానికి గురి చేసిందనే చర్చ నడుస్తోంది. ‘‘బాగున్నారా అమ్మా..’’ అంటూ కొండా సురేఖను, సీతక్కలను ఆత్మీయంగా పిలిచి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారాయన. అంతటితో ఆగకుండా.. మేడారం జాతర పనులు ఎంతవరకు వచ్చాయని మంత్రులను అడిగి తెలుసుకున్నారు. పనులు చివరి దశలో ఉన్నాయని.. జాతర దగ్గర పడుతుండడంతో పనులు వేగంగా చేస్తామని ఈ సందర్భంగా మాజీ సీఎంకు మంత్రులిద్దరూ వివరించారు. అయితే.. పనుల విషయం జాగ్రత్త వహించండి.. పనులు తొందర కావాలని ఆగం కావొద్దంటూ ఆయన వాళ్లను సున్నితంగా సూచించారు. అవసరం అయితే కొన్ని పనులు జాతర అయిపోయాక కూడా చేసుకోవచ్చంటూ సలహా ఇచ్చారు. అలాగే కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన ఆహ్వానానికి సానుకూలంగా స్పందించిన ఆయన.. హెలికాప్టర్లో సతీసమేతంగా జాతరకు వచ్చే ప్రయత్నం చేస్తానని చెప్పారు. ‘‘ఆడబిడ్డలుగా కేసీఆర్ దగ్గరికి వచ్చాం. మాకు చీర పెట్టి కేసీఆర్ ఆహ్వానం పలికారు’’ అని మంత్రులిద్దరూ మీడియాకు చెప్పారు. అంతకు ముందు.. ఎర్రవెల్లిలోని తన నివాసానికి వచ్చిన మహిళా మంత్రులను కేసీఆర్ దంపతులు అతిథి మర్యాదలతో పసుపు, కుంకుమ, చీర, తాంబూలాలతో సత్కరించడం వైరల్గా మారింది. మాజీ ముఖ్య మంత్రివర్యులు కేసీఆర్ గారిని మేడారం మహా జాతరకు ఆహ్వానించిన మంత్రులు శ్రీమతి కొండా సురేఖ గారు,శ్రీమతి సీతక్క గారు..@seethakkaMLA @iamkondasurekha #prajapalana#medaramjatara#sammakkasarakka#tribalfestival pic.twitter.com/F8pwvacqlP— Telangana Congress (@INCTelangana) January 8, 2026కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించిన కేసీఆర్.. మొన్నటి అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో రేవంత్ రెడ్డి పలకరింపునకు స్పందించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. సీఎం రాక సందర్భంగా లేచి నిలబడి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ‘‘దటీజ్ కేసీఆర్ అని.. ఆయనకంటూ ఓ సంస్కారం ఉందని.. ఆయన విమర్శలు ఏనాడూ హద్దుదాటి ఉండవు’’ అంటూ బీఆర్ఎస్ శ్రేణులు ఆ వీడియోను నెట్టింట తెగ వైరల్ చేశాయి. -
హీరో రామ్చరణ్ ఇంట జపాన్ చెఫ్ చేతి బిర్యానీ..!
బిర్యానీ ఎవ్వరినైనా ఇట్టే తన రుచికి ఫిదా చేసేస్తుంది. యావత్తు ప్రపంచాన్ని తన ఘుమఘమలు వైపుకి లాగేసుకుంటుంది. అసలు ఒక్కసారి రుచి చూసిన వారెవ్వరైనా..మరోసారి తినేలా ఊరించే వంటకం ఇంది. అలాంటి వంటకానికి ఎందరెందరో ఫిదా అయ్యారు. అచ్చం అలానే బిర్యానీ ప్రియుడిగా మారి అందులో స్పెషలిస్ట్గా అవతరించాడు ఈ జపనీస్ చెఫ్. ఆ ఇష్టమే హైదరాబాద్కి రప్పించి ..మన చిరు తనయడు ఇంటికి వచ్చేలా చేయడమే కాదు..హీరో రామ్చరణ్కి రుచి చూపించాడు కూడా. ఔనా ఏంటా కథా అని కుంటున్నారా..!. అయితే తక్షణమే చదివేయండి ఆ సంగతేంటో..ప్రత్యేక బిర్యానీలకు సంబంధించి వరల్డ్ పేమస్ జపనీస్ చెఫ్ మాస్టర్ తకమాసా ఒసావా ఇటీవల హైదరాబాద్లోని మన రామ్చరణ్ ఇంటికే వచ్చి మరి వండుకున్నాడు. ఇదేంటి అనుకోకండి బహిరంగంగా వండుతూ ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చేసుకునే ఈ చెఫ్ తకమాసా..అలానే మన చరణ్ ఇంట్లో కూడా బిర్యానీ వండి ఆ వీడియోని నెట్టింట షేర్ చేసుకున్నాడు. ఇది క్షణాలో ఆహారప్రియులను, రామ్చరణ్ అభిమానులను అమితంగా ఆకర్షించింది. ఇంతకీ ఏంటి మేటర్ అంటే..ఆయన రామ్ చరణ్ నివాసానికి వచ్చి..అక్కడ బ్యూటిఫుల్ లోకేషన్స్ని షేర్ చేస్తూ..అక్కడే తన స్పెషల్బిర్యానీ వండాడండోయ్. అక్కడితో ఆగలేదు రామ్చరణ్కి, వాళ్ల అమ్మ సురేఖమ్మకి కూడా టేస్ట్ చేయమని పెట్టాడు కూడా. మన హీరో రామ్చరణ్ అయితే బాస్ ఇది చాలా రుచిగా ఉంది గ్రేవీలా లేదంటూ చమత్కరించాడు. ఎందుకంటే జపాన్ వాళ్లు ఏదైనా సూప్ మాదిరిగా అదేనండి పులుసు టైపులో తింటుంటారు కథా అందుకని మన హీరో చరణ్ సరదాగా అలా అన్నారు. మన జపాన్ చెఫ్ తకమాసాకి ఈ బిర్యానీ వండడం ఎలా తెలిసిదంటారా..?అలా తెలుసుకుని..ఇలా గరిటపట్టేశాడు..టోక్యోకు చెందిన చెఫ్ తకమాసా సింగిల్ పాట్ బిర్యానీ స్పెషలిస్ట్ అట. అంతేగాదు ట్యోక్కోలో బిర్యానీ రెస్టారెంట్ని కూడా నడుపుతున్నాడు. అతని బిర్యానీ వండే స్కిల్కి, టేస్ట్కి మిచెలిన్ బిబ్ గౌర్మాండ్ అనే మంచి అవార్డు సైతం వచ్చింది ఈ చెఫ్కి. మన తకమాసాకి బిర్యానీ గురించి తెలిసింది 2009లోనట. తమిళనాడులో ఆఫీస్ ఉద్యోగిగా పనిచేస్తున్నప్పుడూ..స్థానిక తినుబండారాలపై బిర్యానీ అని రాసి ఉడంట చూశాడట తకమాసాక. ఆసక్తిగా అనిపించి ఆర్డర్ చేసి తిన్నాడట. అంతే ఆక్షణమే దానిపై మనసు పారేసుకుని ఇలా బిర్యానీ చెఫ్గా సెటిల్ అయ్యిపోయాడు. అక్కడితో ఆగిపోలేదు భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలన్ని పర్యటించి మరి అక్కడ బిర్యానీ వంట పద్ధతులను తెలుసుకుంటూ, దీని రుచిపై అధ్యయనం చేస్తున్నాడట ఈ చెఫ్ తకమాసా. బిర్యానీపై ఉన్న అతని ప్రేమ చూస్తుంటే భోజనప్రియులకు ఆహారమే సార్వత్రికభాష అని నిరూపితమైంది కదూ..!Famous Japanese biryani chef Osawa Takamasa (awarded Bib Gourmand in the Michelin Guide) visited @AlwaysRamCharan's home yesterday and cooked biryani for him and his family. He postedan Instagram story about the occasion.🥘🔥🤩 pic.twitter.com/xLR3k1XbT5— 𝐀𝐤𝐚𝐬𝐡𝐡 𝐑𝐂™ (@AlwaysAkashRC) January 5, 2026 (చదవండి: ఏడేళ్లుగా నిలబడే ఉన్న సాధువు..! నిద్రపోవడం ఎలా అంటే..) -
ప్రేమకు ఎక్స్పైరీ లేదు!.. వీళ్లంతా ‘యంగ్’స్టర్లే!
ప్రేమకు ఎక్స్పైరీ అంటూ ఉండదు. ఏ వయసులోనైనా కాసింతా ప్రేమ, ఆదరణ కావాలనే అనుకుంటాం. ప్రేమ అనే పదంతోనే కదా ఏ బంధమైన పెనవేసుకునేది. యంగ్గా ఉన్నప్పుడే ప్రేమ, పెళ్లి కాదు, మలి వయసులోనూ కావాలి ఓ తోడు. అయితే మలిసంధ్యలో ఉండే ప్రేమ అత్యంత ఆత్మీయమైనది, స్నేహ మాధుర్యానికి మించినది. దాన్నే హైలెట్ చేసింది ఈ మ్యాచ్ మేకింగ్ ఈవెంట్. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్గా మారింది. ఇన్ఫ్లుయెన్సర్ షెనాజ్ ట్రెజరీ ఈ వీడియోని నెట్టింట షేర్ చేశారు. అది 60,70, 80 ఏళ్ల లోపు వారి కోసం రూపొందించిన మ్యాచ్ మేకింగ్ ఈవెంట్ అని రాసుకొచ్చింది. ఆ కార్యక్రమాన్ని చూడటానికి వెళ్లి కళ్లనీళ్లు ఆగలేదంటోంది. వాళ్లంతా టీనేజర్ల వలే నవ్వుతూ ఉండటం చూసి తాను ఒక విధమైన ఆనందం, భావోద్వగంతో ఉక్కిరిబిక్కిరి అయినట్లు పేర్కొంది. అక్కడ గదుల్లో చాలామంది భాగస్వాములును కోల్పోయారని, మరికొందరూ విడాకులు తీసుకున్న వాళ్లని తెలిపింది. అయితే అందరూ కలిసి కూర్చొని నవ్వుకుంటూ కనిపించిన విధానం తాము కోల్పోయిన ప్రేమ, తోడు ఏదో పొందాలన్న ఆశ వారి ముఖాల్లో స్పష్టంగా కనిపించిందని చెప్పుకొచ్చింది. అయితే ఈ కార్యక్రమం మతం, కులం, అంతస్థులతో సంబంధం లేకుండా జరగడం విశేషం. కొందరు స్వేచ్ఛగా మాట్లాడుకుంటూ కనిపిస్తే..మరికొందరు సిగ్గుపడిపోతూ కబుర్లు చెప్పుకుంటున్న వాళ్లని చూస్తే మనసు ఆనందంతో పవరశించిపోయిందంటూ ఉద్విగ్నంగా రాసుకొచ్చిందామె పోస్ట్లో. వాళ్లంతా పిల్లల పెంపకం, బాధ్యతలలో తలమునకలై, తమకంటూ వ్యక్తిగత ఆనందానికి చోటు దొరకక, కనీసం మలి వయసులోనైనా పొందాలని వచ్చిన అత్యంత యంగ్ సీనియర్ సిటిజన్లుగా అని పేర్కొంది. ఈ కార్యక్రమం వారికి కొత్త ప్రేమనే కాదు..ఆ వయసు వాళ్లతో కనెక్ట్ అయ్యే ఓ గొప్ప అవకాశం కూడా ఇది. నెటిజన్లు సైతం ఈ వయసులో అలా ధైర్యంగా ముందుకొచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా గ్రేట్అంటూ ప్రశంసించారు. అందరూ తమను కూడా ఇది భావోద్వేగానికి గురించేసిందంటూ పోస్టులు పెట్టారు. అంతేగాదు ప్రేమకు వయోపరిమితి ఉందనే నమ్మకానికి ఈ ఘటనే అతి పెద్ద సవాలు అని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Travel, Romance, Smiles (@shenaztreasury) (చదవండి: ఏడేళ్లుగా నిలబడే ఉన్న సాధువు..! నిద్రపోవడం ఎలా అంటే..) -
రెస్టారెంట్ మేనేజర్గా ఇస్రో శాస్త్రవేత్త..!
ఒక్కోసారి సరదాగా కొత్త వ్యక్తులతో జరిగే సంభాసణ అద్భుతంగానూ ఆసక్తికరంగానూ మారుతుంది. మనకు ఓ కొత్త విషయం తెలుస్తుంది కూడా. అలాంటి ఆసక్తికరమైన పోస్ట్ నెట్టింట వైరల్గా మారి అందరి దృష్టిని ఆకర్షించింది. జీవిమంతే సానుకూలదృక్పథంతో అందంగా మలుచుకునేదనే చెప్పే గొప్ప సంభాషణ. ఎదురై సమస్యలను సింపుల్గా ఎలా పరిష్కరించుకోవాలో తెలియజేసే గొప్ప జీవిత పాఠం కూడా. మరి అదేంటో చకచక చదివేద్దమా..!.శాండో అనే ఒక కంటెంట్ క్రియేటర్ గతంలో ఇస్రో శాస్త్రవేత్తగా పనిచేసిన ఒక రెస్టారెంట్ మేనేజర్ను కలిసిన ఆసక్తికర కథను ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు. ఒకరోజు ఒక సాధారణ రెస్టారెంట్ మేనేజర్తో జరిగిన సంభాషణ చివరికి ఇస్రో శాస్త్రవేత్తతో జరిగిన ముచ్చటగా మారింది అనే క్యాప్షన్ని జోడించి మరి వారి మధ్య జరిగిన సంభాషణను షేర్ చేసుకున్నాడు. ఆ రెస్టారెంట్ యజమాని మాట్లాడుతూ..తాను ఇంతకుముందు ఇస్రోలో పనిచేశానని, అక్కడ సైంటిస్ట్ ఇంజనీర్గా విధులు నిర్వర్తించేవాడినని చెప్పుకొచ్చారు. సుమారు 16 ఏళ్ల పనిచేసినట్లు తెలిపారు. ఆ తర్వాత మానేసినట్లు తెలిపారు. అక్కడ ఒత్తిడి తట్టుకోలేకపోయినట్లు వివరించారు. శాటిలైట్లో పరికరాల అసెంబ్లీ చాలా క్లిష్టంగా ఉందంటూ దాని కనెక్ట్విటీ గురించి పూసగుచ్చినట్లు వివరించారు. అక్కడ ఒక భాగాన్ని అసెంబుల్ చేసేందుకు టాలరెన్స్ 0.001 ఉంటుంది. కేవలం ఒక పూర్తి భాగాన్ని అసెంబుల్ చేయడానికి 10 భాగాలు ఉంటాయి. ఆ 10 భాగాలలో, ప్రతి ఒక్కటి 0.001, 0.002, 0.003 అలా వస్తాయి. ఏ భాగం ఎక్కడ సరిపోతుందో, అది ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో ముందుగా అంచనా వేయాలని మాజీ శాస్త్రవేత్త అన్నారు. అవన్ని ఒక వెంట్రుక మందంలో సుమారు 0.004, అంటే సుమారు 4 మైక్రాన్లలలో ఉంటాయి.మనం మనం 1 మైక్రాన్ టాలరెన్స్తో అసెంబ్లీ చేయాల్సి ఉంటుంది. రెండు భాగాలను అసెంబుల్ చేసిన తర్వాత లోపల ఒక్కటి డిస్కనెక్ట్ అయినా, అది 5 మైక్రాన్లు అవుతుంది. అంత ఖచ్చితత్వంతో పనిచేయాల్సి ఉంటుంది. అందువల్ల ఆ ఒత్తిడిని తట్టుకోలేక విశ్రాంతి కోరుకున్నాని అన్నారు. అన్నింటికంటే మానసిక ప్రశాంత ముఖ్యమని అనిపించి ఇలా రెస్టారెంట్ మేనేజర్గా ప్రశాంతంగా పనిచేసే జీవితాన్ని ఎంచుకున్నట్లు తెలిపారు. తన నిర్ణయంపై సంతృప్తిని వ్యక్తం చేస్తూ..ప్రస్తుతం ఎలాంటి ఒత్తిడి లేదని ప్రశాంతంగా ఉన్నానని అన్నారు. తనకు అమెరికాలో పనిచేసే అవకాశం కూడా వచ్చిందని అయితే తన డాక్యుమెంట్స్లో ఒక క్లరికల్ లోపం కారణంగా అది చేజారిపోయిందని అన్నారు. అందుకు సంబంధించిన వీడియో భారీగా వ్యూస్, లైక్లు వచ్చాయి. ఉద్యోగ జీవితం వదులుకోవడానికి గల కారణం చాలామందిని తాకింది. అంతేగాక అత్యున్నత స్థాయిని వదులుకుని సాధారణ స్థాయిని ఎంచుకునేటప్పుడూ కూడా ఒత్తిడి ఉంటుంది కానీ, దాన్ని ఎలా సానుకూలంగా తీసుకుని..ముందకు సాగాలో చెబుతుంది ఈ కథ. మొదట మన కంఫర్ట్కి ప్రాధాన్యత ఇస్తేనే..ఏ ఫీల్డ్లోనైనా హాయిగా కొనసాగగలం ఆ క్రమంలో వచ్చే సవాళ్లను సానుకూల దృక్పథంతో పరిష్కారించుకుంటూ సాగిపోవాలని చెప్పే ఈ స్టోరీ అందరి మనసులను దోచుకుంది. View this post on Instagram A post shared by Sando (@guywithmetaglasses) (చదవండి: న్యూస్ పేపర్ రీడింగ్తో.. పోన్ చూడటం మానిపించగలమా?) -
ట్రంప్.. నీ బాంచన్!!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ను ఎగతాళి చేస్తూ ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. టారిఫ్ బెదిరింపులతోనే ఔషధ ధరల విషయంలో ఫ్రాన్స్ మెడలు వంచానంటూ వ్యాఖ్యానించారు. అయితే.. తాను మాక్రాన్పై ఎలాంటి ఒత్తిడి చేశాననే విషయాన్ని బహిరంగంగా వివరించారు. తాజాగా.. వాషింగ్టన్లో రిపబ్లికన్ సభ్యులను ఉద్దేశించి ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘అమెరికన్లు ఫ్రెంచ్ ప్రజల కంటే 14 రెట్లు ఎక్కువగా ఔషధ ధరలు చెల్లిస్తున్నారు. ఈ అసమానతను తగ్గించేందుకు ఫ్రాన్స్పై ఒత్తిడి చేశా. మొదట మాక్రాన్ నిరాకరించినా.. చివరికి నా డిమాండ్కు లొంగిపోయారు’’ అని అన్నారు. వైన్, షాంపేన్ సహా అన్నిరకాల ఫ్రెంచ్ ఉత్పత్తులపై 25 శాతం టారిఫ్ను విధిస్తానని హెచ్చరించా. ఈ బెదిరింపుతో ఫ్రెంచ్ అధ్యక్షుడు వెంటనే దిగి వచ్చారు అని ట్రంప్ చెప్పుకొచ్చారు. “డొనాల్డ్, మీకు డీల్ ఉంది. ఔషధ ధరలను 200 శాతం పెంచుతాను. కానీ ప్రజలకు చెప్పకండి” అని మాక్రాన్ డీల్ సెట్ చేసుకున్నారు అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఫ్రాన్స్ మాత్రమే కాదు.. ఇతర దేశాల నాయకులను కూడా ఇలాంటి టారిఫ్ బెదిరింపులతోనే దిగి వచ్చేలా చేశానని, కేవలం 3.2 నిమిషాలపాటు జరిగిన సంభాషణలలోనే ఔషధ ధరలను నాలుగు రెట్లు పెంచేందుకు అంగీకరించారని తెలిపారు. పైగా ఈ నిర్ణయాన్ని తాము గర్వంగా ఫీలవుతున్నామని వాళ్లు నాతో అన్నారు అని ట్రంప్ వివరించారు. అయితే వాళ్ల పేర్లను మాత్రం ఆయన ప్రస్తావించలేదు. ఫ్రాన్స్లో ఈ మధ్యకాలంలో ఔషధ ధరలు 200 శాతం పెరిగాయి. దీంతో ట్రంప్ తన మోస్ట్ పేవర్డ్ నేషన్ విధానం కారణంగా.. అమెరికాలో ధరలు తగ్గుతాయని అంటున్నారు. అది ఎలాగంటే.. MFN విధానం ప్రకారం అమెరికా మెడికేర్ చెల్లింపులు ఇతర అభివృద్ధి చెందిన దేశాల్లోని కనిష్ఠ ధరలకు అనుసంధానించబడతాయి. అలా అత్యల్ప ధర ఉన్న దేశం ధరను మాత్రమే చెల్లించేందుకు ఫెడరల్ సర్కార్ ముందుకు వస్తుంది.ట్రంప్ ప్రకారం.. అమెరికాలో 400 నుంచి 600 శాతం మధ్య తగ్గాయట. జనవరి నుండి కొత్త వెబ్సైట్ TrumpRx.gov ద్వారా తగ్గిన ధరలు అందుబాటులో ఉంటాయని ఆయన అంటున్నారు. అయితే ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ఫ్రాన్స్లో రాజకీయ దుమారం రేపే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతానికైతే మాక్రాన్ ప్రభుత్వం ఈ వ్యాఖ్యలపై స్పందించలేదు.Trump mocks Macron:Emmanuel said to me: “Donalddd, you have a deal. I would like to increase my prescription drug prices by 200% or whatever. Whatever you want, Donald, please don’t tell the population, I beg you.”Every country said the same thing. pic.twitter.com/hrAXWkKDD3— Clash Report (@clashreport) January 6, 2026అయితే ట్రంప్ ప్రకటనలో విరుద్ధత కనిపిస్తోంది. ఉదాహరణకు.. ఫ్రాన్స్లో ఔషధాల ధర $10 కనిష్ఠ ధర ఉండేది. అప్పుడు అమెరికా benchmark $10 అవుతుంది. ఫలితంగా, అమెరికా తన ధరను $100 నుండి $10కి తగ్గించుకుంటుంది. అదే ఫ్రాన్స్ ఆ తర్వాత $10 నుండి $30కి పెంచింది. జర్మనీలో ఔషధాల ధర $20గా ఉంది. అప్పుడు అమెరికా benchmark $20 అవుతుంది. ఫలితంగా, అమెరికా ధర $100 నుండి $20కి తగ్గుతుంది. అలాంటప్పుడు ఫ్రాన్స్పై ఒత్తిడి చేయాల్సిన అవసరం ఏముందనేది? కొందరి ప్రశ్న. -
నా మొగుడు నాకే సొంతం
సాక్షి, వరంగల్: నా భర్త నాకు కావాలి. అది కుదరకుంటే అతను బతికి ఉండడానికి వీల్లేదు.. అంటూ వరంగల్ చౌరస్తాలో ఓ వివాహిత కత్తితో కాసేపు హల్ చల్ చేసింది. ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగగా.. పోలీసులు రంగంలోకి దిగి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. బుధవారం వరంగల్ చౌరస్తాలో జ్యోత్స్న అనే వివాహిత తన భర్తపై దాడికి యత్నించింది. తప్పించుకున్న భర్త స్థానికంగా ఓ నగల దుకాణంలో దాక్కున్నాడు. అయితే.. ఎలాగైనా చంపుతానంటూ ఆమె రోడ్డు మీదే బైఠాయించింది. దీంతో ఆ భర్త ప్రాణభయంతో పోలీసులకు ఫోన్ చేశాడు.తన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని.. తన ఆస్తులన్నింటినీ లాగేసుకున్నాడని.. ఇప్పుడు విడాకులు ఇచ్చేందుకు చూస్తున్నాడని ఆరోపిస్తూ ఆవేదన వ్యక్తం చేసిందామె. కోర్టులో కేసు నడుస్తున్నందున.. చంపాలనుకున్నట్లు చెప్పింది. అయితే ఈలోపు రంగ ప్రవేశం చేసిన పోలీసులు ఆమె చేతి నుంచి కత్తి లాక్కుని పీఎస్కు తీసుకెళ్లారు. -
రీల్స్ పిచ్చి.. నడిరోడ్డుపై యువతులు నాగిని డాన్స్.. వీడియో వైరల్
-
ఇంట్లోకి రాగానే ఆ దంపతులకు ఊహించని దృశ్యం..!
రాజస్థాన్లోని కోటాకు చెందిన ఓ వ్యక్తి తన తన భార్యతో కలిసి ఆలయానికి వెళ్లి రాత్రి తిరిగి వచ్చినప్పుడు వారి ఇంట్లో ఊహించలేని దృశ్యం కనిపించింది. సుభాష్ కుమార్ రావత్ ఇంట్లో చోరీకి వెళ్లిన ఓ దొంగ.. ఎగ్జాస్ట్ ఫ్యాన్ రంధ్రంలో ఇరుక్కుపోయాడు. దీంతో పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఎవరూ లేని ఇంటిలో దొంగతనం చేయడానికి ప్లాన్ చేసిన ఓ దొంగ ఎగ్జాస్ట్ ఫ్యాన్ రంధ్రం నుంచి ఇంట్లోకి వెళ్లడానికి ప్రయత్నించాడు. అయితే కన్నంలో సగం దూరిన తర్వాత మధ్యలోనే ఇరుక్కుపోయాడు. బయటకురావడానికి చాలా ప్రయత్నించాడు. సాధ్యం కాకపోవడంతో కిందకి వేలాడుతూ ఉన్నాడు. బయటకు రావడానికి ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాకపోవడంతో అలా వేలాడుతూ ఉన్నాడు. నేల నుండి 10 అడుగుల ఎత్తులో తల, చేతులు ఇంట్లో లోపల ఉండగా కాళ్లు బయట వేలాడుతూ కనిపించాడు.అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఇంటికి వచ్చిన యజమాని సుభాష్ కుమార్ రావత్ వంటగదిలోని ఎగ్జాస్ట్ ఫ్యాన్ రంధ్రంలో దొంగ వేలాడుతుండడాన్ని గమనించారు. తాను దొంగనంటూ ఆ చెప్పిన ఆ వ్యక్తి ఆ దంపతులపై బెదిరింపులకు దిగాడు. తన సహచరులు బయట ఉన్నారని, తాను బయటపడనివ్వకపోతే వారు హాని చేస్తారంటూ హెచ్చరించాడు.In Rajasthan's Kota, a family returned from Khatu Shyam Ji darshan to find a thief stuck in the exhaust fan hole! They called police to pull him out. Accused Pawan drives a police officer's car. 😳 pic.twitter.com/mwNcxjD2AF— Ghar Ke Kalesh (@gharkekalesh) January 6, 2026దీంతో ఆ దంపతులు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దాదాపు గంటపాటు శ్రమించి దొంగను కన్నం నుంచి బయటకు తీశారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనలో మరో ట్విస్ట్ ఏంటంటే.. చోరీ చేయడానికి వచ్చిన దొంగ ఎవరికీ అనుమానం రాకుండా పోలీసు స్టిక్కర్ ఉన్న కారులో వచ్చినట్లు తెలిపారు. దీంతో ఒక్కసారిగా పోలీసులే షాక్ అయ్యారు. జనవరి 3న జరిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
మురికి వాడలో పెరిగిన ఆ అబ్బాయ్ ..ఎన్నో జీవితాలను అద్భుతంగా మార్చాడు!
వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ..మంచి స్ఫూర్తిదాయకమైన కథలు షేర్ చేస్తుంటారు. అలానే ఈసారి ఓ అద్భతమైన ప్రేరణాత్మక కథతో మన ముందుకొచ్చారు. సక్సెస్ అంటే..మనం మాత్రమే అభివృద్ధి చెందడం కాదని చెప్పే.. గొప్ప జీవిత పాఠాన్ని నేర్పే అద్భుత కథ. అదేంటంటే..20 మందితో ముంబై మురికి వాడలో ఒక పూరింట్లో పెరిగిన సిద్ధేష్ లోక్రే అనే యువకుడు మనందరికీ స్ఫూర్తి అంటూ అతడి స్టోరీని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా షేర్ చేసుకోవడమే గాక, అతడు తలపెట్టిన మహాత్తర కార్యానికి సైతం తన సపోర్ట్ ఫుల్ ఉంటుందని నొక్కి చెప్పారు. సిద్ధేష్ తండ్రి కూరగాయల వ్యాపారి, కాగా తల్లి క్లర్క్.20 మందితో ఒకే గది ఉన్న ఇంట్లో పెరిగిన సిద్ధేష్ తన లైఫ్ని చదువుతోనే మార్చుకోగలని నమ్మి..చాలా కష్టబడి చదువుకున్నాడు. అలా ప్రతిష్టాత్మకమైన కాలేజ్లో ఎంబీఏ చేసి టెక్ స్టార్టప్గా ఎదిగాడు. అలా తన తల్లిదండ్రులకు మంచి ఇల్లు కట్టించి..మంచి కొడుకుగా హ్యాపీగా లైప్ లీడ్ చేస్తున్నాడు. అయితే సక్సెస్ అంటే ఇది కాదన్న వెళితి ఏదో వెంటాడుతూ ఉండేది. అసలు నిజమైన సక్సెస్ అంటే ఏంటీ అని ఆలోచిస్తూ..ఉండేవాడు. తనలా అందిరి జీవితాలు బాగుంటే అన్న ఆలోచనే..అతడి జీవితాన్నే మార్చేసింది. అందుకు సోషల్ మీడియా సాయం తోడు తెచ్చుకుని మరి. ఎంతోమంది పేద ప్రజల జీవితాలను తీర్చిదిద్దాడు. పైగా ఎన్నో మురికివాడలను, గ్రామాలను దత్తత తీసుకుని అందంగా మార్చి..ఎందరో పేదలకు ఆశాకిరణంగా నిలిచాడు ఆ యువకుడు. పాడైపోయిన ఎన్నో షాపులను పునర్నిర్మించాడు, ప్రజలకు ఉపయోగపడేలా సొంతంగా అంబులెన్స్ సర్వీస్ వంటి ఎన్నో సేవలతో తన ఆనందాన్ని, సక్సెస్ని వెతుకున్నాడు సిద్ధేష్. అక్కడితో ఆగలేదు ఆ యువకుడు తాజాగా మరో లక్ష్యాన్ని ఏర్పరుచుకున్నాడు. అదే మిషన్ 30303. దీని సాయంతో 30 రోజుల్లో 30 పాఠశాలలను అభివృద్ధి చేసేల మౌలిక సదుపాయల కోసం రూ. 3 కోట్లు సేకరించడం. అందుకోసం కాస్త ఇబ్బందులు పడుతున్నాడు. ఎందుకంటే బెంచీలు, టాయిలెట్లు వంటి ప్రాథమిక అవసరాల నుంచి ఏఐ వంటి రోబోటిక్ ల్యాబ్స్ వరకు అన్ని ఆధునిక హంగులకు చాలా ఖర్చుతో కూడికున్న పని కావడంతో లక్ష్యం నెరవేరడం కష్టతరంగా మారింది సిద్ధుకి. అయితే అతడి నిస్వార్థ సేవ నచ్చి సిద్ధేష్ ప్రాజెక్టుకు తనవంతుగా మదతిస్తానుంటూ ముందుకొచ్చి ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నారు ఆనంద్ మహీంద్రా. చాలామంది మనం సక్సెస్ అయ్యి ఓ మంచి పొజిషన్లో ఉంటే చాలు అనుకుంటారు. అలా కాకుండా అందురూ బాగుండాలి అందులో నేను ఉండాలి అన్నట్లుగా సాగుతున్న సిద్ధేష్ పయనం నిజంగా స్ఫూర్తిదాయకం, ప్రశంసించదగ్గ విషయం కూడా కదూ..!.He achieved escape velocity from his modest beginnings…But never abandoned the orbit he escaped from. I will connect & support his project 30303#MondayMotivationpic.twitter.com/MA0sfxwauY— anand mahindra (@anandmahindra) January 5, 2026 (చదవండి: వామ్మో ఇదేం విచిత్రం..జుట్టు ఆరోగ్యం కోసం ఆలయమా..?!) -
షిల్లాంగ్ వీధుల్లో విదేశీ మహిళ స్టెప్పులు : స్థానికులపై ప్రశంసలు
నూతన సంవత్సర వేడుకల సందర్బంగా మేఘాలయలోని షిల్లాంగ్లోని ఖైందాయ్ లాడ్ (పోలీస్ బజార్)లో ఒక ఆసక్తికర సంఘటన నమోదైంది. విదేశీ టూరిస్టు ఉత్సాహంగా డ్యాన్స్ చేయడం మొదలు పెట్టారు. స్థానికులు ఆమె చుట్టూచేరి సందడి చేశారు. వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఇందులో స్పెషాల్టీ ఏముంది అనుకుంటున్నారా? అసలు ఏం జరిగిందో తెలియాలంటే ఈ కథనం పూర్తిగా చదవాల్సిందే.మిరుమిట్లు గొలిపే కాంతుల మధ్య నూతన సంవత్సర వేడుకల మధ్యలో ఒక విదేశీ పర్యాటకురాలు ఉత్సాహంగా నృత్యం చేశారు. దీంతో చాలామంది ఆమె చుట్టూ చేరారు. కొంతమంది ఉత్సాంగా అడుగులు కదిపారు, మరికొంతమంది ఆమె చుట్టూ రక్షణ వలయంలా ఏర్పడిన ఆమెను కాపాడటం విశేషంగా నిలిచింది. ఇదీ చదవండి: గ్వాలియర్లో దారుణం మహిళల బొమ్మల్ని కూడా .. వీడియో వైరల్ఆ క్షణం ఆమె స్వేచ్ఛగా ఆస్వాదించడానికి ఆస్కారం కల్పించారు. ఆమె స్వేచ్ఛకు, మర్యాదకు భంగం కలగకుండా గౌరవప్రదంగా వ్యవహరించిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. దూరం పాటిస్తూ, సురక్షితంగా , సుఖంగా ఉండేలా మహిళా డ్యాన్సర్ను గౌరవించిన తీరును కొనియాడారు. స్త్రీలను గౌరవించే షిల్లాంగ్ సంస్కృతిని, స్థానిక ఖాసీ పురుషుల ప్రవర్తనపై ప్రశంసలు వెల్లువెత్తాయి. View this post on Instagram A post shared by S Lapang (@chaba_lapang) -
గ్వాలియర్లో దారుణం మహిళల బొమ్మల్ని కూడా .. వీడియో వైరల్
మహిళల వస్త్రధారణ, మోరల్ పోలీసింగ్పై చర్చ నడుస్తున్న తరుణంలో మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో జరిగిన ఒక సంఘటన భారతదేశంలో మహిళల భద్రత, సామాజిక సమస్యలపై పెద్ద చర్చకు దారి తీసింది. మహిళల యోగా భంగిమల్లో ఉన్న పబ్లిక్ వాల్ పెయింటింగ్లను అసభ్యంగా మార్చడం వివాదానికి దారి తీసింది. దీనికి సంబంధించిన వీడియోపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి.గ్వాలియర్లో ‘‘స్మార్ట్ సిటీ" ప్రాజెక్ట్లో భాగంగా యోగా చేస్తున్న మహిళల చిత్రాలను అక్కడ కొన్ని గోడలపై చిత్రించారు. యోగా అవగాహనకోసం చిత్రాలతో ఉన్న ప్రభుత్వ కళాకృతులను కొందరు వ్యక్తులు అభ్యంతరకరంగా గీసి, అవమానించడం ఇటీవల సోషల్ మీడియాలో వివాదాస్పదమైంది, వివిధ యోగా భంగిమలతో మహిళల నల్లని సిల్హౌట్లుగా గోడలపై చిత్రీకరించారు. అయితే ఎవరో వాటిని ఉద్దేశపూర్వకంగా అభ్యంతరకరంగా, అవమానపర్చేలా మార్చేశారు. స్త్రీశరీరంలోని కొన్ని నిర్దిష్ట భాగాలను హైలైట్ చేసేలా గీతలు గీశారు. దీన్ని గమనించిన ఒకరు తిరిగి ఈ చిత్రాలపై తిరిగి నల్లరంగు పూశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట విస్త్రృతంగా షేర్ అవుతోంది. View this post on Instagram A post shared by LOKENDRA SINGH (@ketu_gwalior) “గ్రాఫిటీలో కూడా మహిళలకు భద్రతలు లేదు” అంటూ విజువల్స్తో పాటు ఒక యూజర్ ట్విటర్లో షేర్ చేశారు, దీనిపై సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో తీవ్ర విమర్శలు చెలరేగాయి.ఇది మనుషుల్లో కొరవడుతున్న సివిక్ సెన్స్, మహిళల భద్రత,ప్రజా కళను విధ్వంసం చేయడంపై ఆగ్రహం వ్యక్తమైంది. పబ్లిక్ ప్రాపర్టీని విధ్వంసం చేయడం మాత్రమే కాదు, మహిళలను అగౌరవపరిచే తీవ్రమైన కేసు, దోషులపై చర్య తీసుకోవాలని చాలామంది నెటిజన్లు డిమాండ్ చేశారు. ఇది చౌకబారు ఆలోచన అని కొందరు అభివర్ణించారు. ఆడవారి దుస్తులను కాదు ఈ పైత్యాన్ని ప్రశ్నిద్దాం మరికొందరు వ్యాఖ్యానించారు. మొత్తంగా ఈ చర్య మహిళల పట్ల అగౌరవానికి, స్మార్ట్సిటీ హోదాకు భంగకరమనే ప్రజాగ్రహానికి దారితీసింది.ఇదీ చదవండి: మహిళల డ్రెస్సింగ్ వివాదం : రాధాకృష్ణ వ్యాఖ్యలపై తీవ్ర దుమారంమరోవైపు ఈ విధ్వంసం ఎప్పుడు జరిగింది, ఎవరు బాధ్యులు, లేదా స్థానిక అధికారులతో ఏదైనా ఫిర్యాదు నమోదైనా అనే దానిపై అధికారిక ధృవీకరణ లేదు. అలాగేదీనిపై గ్వాలియర్ మున్సిపల్ పరిపాలన లేదా పోలీసులు ఎటువంటి ప్రకటన జారీ చేయలేదు. -
వామ్మో ఇదేం విచిత్రం..జుట్టు ఆరోగ్యం కోసం ఆలయమా..?!
ప్రస్తుతం ఉన్న కాలుష్యం, ఉరుకుల పరుగుల జీవన విధానం వంటి కారణాలతో చాలామంది జుట్టు రాలు సమస్యను ఫేస్ చేస్తున్నారు. దానికి తోడు సరైన జీవనశైలి కూడా లేకపోవడంతో ఈ సమస్య ఇటీవల కాలంలో ఎక్కువగా ఉంది. ఇది అందరికీ తెలిసిందే కదా..! మళ్లా ఇదంతా ఎందుకనుకుంటున్నారా..?. ఏం లేదండి ఏకంగా జుట్టు ఆరోగ్యం కోసం ఆలయమే ఉంది ఆ దేశంలో. కురులు మంచి ఒత్తుగా, దృఢంగా ఉండాలంటే ఆ ఆలయానికి వెళ్లి దేవుడిని దర్శిస్తే చాలట. అంతేకాదండోయ్ ఏటా వేలాది మంది ప్రజలు ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి తరలి వస్తుంటారట.వినడానికి ఇది..ఇదేం విచిత్రం రా బాబు అనిపిస్తోంది కదూ..!. ఎక్కడైన జుట్లు రాలకుండా లేదా ఆరోగ్యం కోసం ఆలయం ఉంటుందా?..నమ్మశక్యంగా అనిపించడం లేదు కదా..!. అయితే వెంటనే జపాన్లోని క్యోటోలో ఉన్న మికామి పుణ్యక్షేత్రానికి వచ్చేయండి. ఇది జుట్టు కోసం అంకితం చేయబడిన ఆలయమట. జుట్టు పెరుగుదల, ఆరోగ్యం, జుట్టు రాలడం వంటి ఆందోళనలు నివారించుకోవాలనుకుంటే తక్షణమే ఈ ఆయానికి వెళ్లి ప్రార్థిస్తే చాలట. అంతేకాదు కొత్త హెయిర్ స్టైలిస్టులుగా బ్యూటీషియన్ రంగంలోకి అడుపెట్టే విద్యార్థులు సైతం ముందుగా ఈ ఆలయానికి వచ్చి ప్రార్థించాక..తమ కోర్సుని నేర్చుకుంటారట. అంతేకాదండోయ్ ఇక్కడ ప్రార్థన అత్యంత విచిత్రంగా ఉంటుంది. అక్కడ మసాయుకి ఫుజివారా అనే దేవుడు కొలువై ఉంటాడు. ముందుగా ఆ ఆలయానికి చేరుకునే మునుపే ఒక ప్రార్థన కవర్ని కొనుగోలు చేయాలట. అక్కడ ఆలయ పూజారులు మన జుట్టులో కొంత జుట్టుని కత్తిరించి ఆ కవర్లో వేస్తారట. ఆ తర్వాత మనం దాన్నితీసుకుని ఆ ఆలయంలో ఉన్న మసాయుకి ఫుజివారా దేవుడి వద్ద పెట్టి ప్రార్థించి అక్కడ ఉండే పూజారికి ఇవ్వాలట ఆ కవర్ని. అలా చేస్తే వారి జీవితంలో జుట్టుకి సంబంధించిన సమస్యలు రావు, పైగా ఒత్తుగా పెరుగుతుందనేది అక్కడి ప్రజల ప్రగాఢ నమ్మకం. అంతేకాదండోయ్ ఆ ఆలయం వెనుక ఓ ఆసక్తికర కథ కూడా ఉంది. అదేంటంటే..ఓ క్షరకుడి నైపుణ్యానికి ప్రతీక..మికామి మందిరం జపాన్లోని మొట్టమొదటి కౌరశాల అట. ఫుటివారా ఉనెమెనోసుకే మసాయుకి అనే క్షరకుడు తన వృత్తిని దైవంగా భావించి పనిచేసేవాడట. తన కుటుంబాన్ని పోషించుకునేందుకు ఎంతో అద్భుతంగా జుట్టుని కత్తిరించడం, స్టైలింగ్ చేయడం వంటివి చేశాడట. అలా తన జీవితం మొత్తం ఆ వృత్తికి అంకితం చేసి..మంచి పునాది వేశాడట. అంతలా ఆ రంగంలో తన నైపుణ్యాన్ని ప్రదర్శించందుకు గుర్తుగా అత్యున్నతంగా గౌరవించాలని అక్కడి ప్రజలు నిర్ణయించి.. ఇలా ఒక ఆలయాన్ని నిర్మించి పూజించుకుంటున్నారట. అంతేగాదు అతడి గౌరవార్థం చనిపోయిన 17వ తేదీన ప్రతినెల జపాన్ అంతటా క్షరకులు సెలూన్ల నిర్వాహకులు నివాళులర్పిస్తూ..దుకాణాలు కూడా మూసివేస్తారట. అలాగే ఈ ఆలయానికి వచ్చిన భక్తులకు ఆ మసాయుకి దేవుడిని ప్రార్థించాక.. జుట్టుకి సంబంధిత సమస్యలు తగ్గుముఖం పట్టడంతో..ఈ దేవాలయానికి మరింత పేరుప్రఖ్యాతలు వచ్చి.. జుట్టు ఆరోగ్యానికి సంబంధించిన ఆలయంగా స్థిరపడిందట. అంతేగాదు ఇక్కడకు పర్యాటకుల తాకిడి కూడా ఎక్కువగానే ఉంటుందట. View this post on Instagram A post shared by Shervin Abdolhamidi (@shervin_travels) (చదవండి: బ్రయాన్ జాన్సన్లా భారత్ యువకుడు..! ఏకంగా ఏడువేల..) -
పాక్లో షరారత్ క్రేజ్ మామూలుగా లేదుగా, అమ్మాయిల స్టెప్పులు వైరల్
బాలీవుడ్ స్టార్హీరో రణవీర్ సింగ్ నటించిన లేటెస్ట్ మూవీ దురంధర్ (Dhurandhar ) బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతోంది. అంతేకాదు గ్లోబల్గా కూడా హాట్ టాపిక్గా మారింది. దీంతో ఈ మూవీలో పాటల క్లిప్లు తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా 'షరారత్' (Shararat) పాటతో ఒక పెళ్లి వేడుకలో పాకిస్తాన్ అమ్మాయిలు స్టెప్పులు నెట్టింట సందడిగా మారాయి.పాకిస్తానీ మహిళలు సినిమాలోని పాటకు డ్యాన్స్ చేస్తున్నారంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో విశేషంగా నిలుస్తోంది. ఈ క్లిప్లో, ఇద్దరు మహిళలు పెళ్లి వేదిక లోపల 'షరారత్' పాటకు డ్యాన్స్ చేస్తుండగా, ఇతర అతిథులు వారిని చూస్తూ ప్రోత్సహిస్తున్నారు.ఈ వీడియోపై చాలామంది నెటిజన్లు స్పందిస్తూ, నిషేధం ఉన్నప్పటికీ ఈ సినిమా ఇంతటి ఆదరణ పొందడంపై కామెంట్ల వెల్లువ కురిపిస్తున్నారు. “నిషేధం ఉన్నప్పటికీ ఈ సినిమాకు ఇంత క్రేజ్.. వావ్,” అని ఒకరు, “పాకిస్తానీలు దురంధర్ను విపరీతంగా ఇష్టపడు తున్నారు. బహుశా ఈ మూవీ దర్శకుడు ఆదిత్య ధార్కు నిషాన్-ఎ-పాకిస్తాన్ ఇస్తారేమో అని మరొకరు వ్యాఖ్యానించారు. భారత ఉపఖండంపై బాలీవుడ్ సాంస్కృతిక ముద్ర ఉందని మరకొరు కమెంట్ చేశారు.Pakistani girls dancing to Shararat despite the ban on Dhurandhar. https://t.co/l89mWhDEdH— Abhishek Dhiman (@Abhi_dhiman8090) January 5, 2026కాగా దురంధర్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా వసూలు చేసింది. అయితే పాకిస్తాన్తో పాటు బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈలలో ఈ మూవీ విడుదల కాలేదు. అయినా కూడా 2025లో విదేశాలలో అత్యంత విజయ వంతమైన భారతీయ చిత్రంగా నిలిచింది.మరోవైపు ఆయేషా ఖాన్,క్రిస్టల్ డిసౌజా నటించిన 'షరారత్' డ్యాన్స్ నంబర్ మ్యూజిక్ వీడియో యూట్యూబ్లో 100 మిలియన్ల వీక్షణలను దాటింది. ఈ పాటకు శశ్వత్ సచ్దేవ్ సంగీతం అందించగా, మధుబంతి బాగ్చి , జాస్మిన్ సాండ్లాస్ పాడారు. విజయ్ గంగూలీ ఈ పాటకు కొరియోగ్రఫీ చేశారు. ఇదొక గూఢచారి థ్రిల్లర్ చిత్రం. ఈ మూవీలో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించగా, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్ ,సంజయ్ దత్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. 2025లో భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. దీని రెండవ భాగం మార్చి 2026లో విడుదల కానుందని భావిస్తున్నారు. -
ప్రాణం తీయడం.. సినిమా స్టైల్గా మారిపోయింది..!
ఇటీవల కాలంలో ఎక్కువగా గన్ కల్చర్ గురించే మాట్లాడుకుంటూ ఉన్నాం. గన్ కల్చర్తో ప్రమాదమనే విషయం అమెరికాలోని వరుస కాల్పుల ఘటనలు మనకు కనువిప్పు కలిగిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు అదే గన్ కల్చర్ మనదేశంలో కూడా కనిపిస్తుంది. తాజాగా పంజాబ్ రాష్ట్రంలో ఆప్ సర్పంచ్ జర్మల్ సింగ్ను హత్య చేసిన విధానం అందుకు ఉదాహరణగా చెప్పొచ్చు.ఓ పెళ్లి వేడుకకు హాజరైన జర్మల్ సింగ్ను ఇద్దరు యువకల ఇలా వచ్చి అలా కాల్చేసి వెళ్లిపోయారు. వివాహ కార్యక్రమంలో భాగంగా పక్క ఊరికి వెళ్లిన సమయంలో ఇది చోటు చేసుకుంది. ఆ దుండగులు అక్కడకు వచ్చిన సమయంలో సర్పంచ్ జర్మల్ సింగ్ కూర్చొని ఉన్నారు. వెనుక నంచి జస్ట్ అలా కాల్చేయడం, ఆపై వెంటనే ఆయన కుప్పకూలిపోవడం జరిగిపోయాయి. ఆ హఠాత్తుపరిణామం నుంచి అక్కడున్న వారు తేరుకునే లోపే ఆ సర్పంచ్ ప్రాణం వదిలేశారు. ఆ దుండగులు పారిపోయారు. సీసీ టీవీ ఫుటేజ్లో రికార్డైన హత్యోదంతం ఒక్కసారిగా కలవరపాటుకు గురి చేసింది. ఇంత ఈజీగా ప్రానాలు తీసే సంస్కృతి ఇక్కడకు కూడా వచ్చేసిందా అనే భావన ఆ వీడియోను చూస్తే అర్థమవుతుంది.Strongly condemn the cold-blooded murder of Sarpanch Jarmal Singh of Valtoha village (Tarn Taran), who was shot dead at a wedding function in Amritsar today.This follows an extremely worrisome pattern: yesterday, a young man was gunned down in Bhinder Kalan (Moga) and on Friday… pic.twitter.com/nt01hEeQAn— Sukhbir Singh Badal (@officeofssbadal) January 4, 2026తంగ్ తారన్ జిల్లా వాల్టోహా గ్రామ సర్పంఛ్ చేస్తున్న జర్మల్ సింగ్ను కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కాల్పి చంపారు. ఓ పెళ్లి వేడుకకు హాజరైన క్రమంలో ఈ హత్య జరిగింది. అమృత్సర్ జిల్లా, వెర్కా బైపాస్ దగ్గర ఉన్న ఒక రిసార్ట్లో పెళ్లి వేడుకకు జర్మల్ సింగ్ హాజరయ్యారు. అయితే ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు పెళ్లి అతిథుల్లా లోపలికి వచ్చి, జర్మల్ సింగ్ను దగ్గర నుంచి కాల్చి చంపారుఆయన వేడుకలో పాల్గొంటున్న సమయంలో దాడి జరిగింది. తలకు బుల్లెట్ తగిలడంతో జర్మల్ సింగ్ మృతిచెందారు. కబడ్డీ ఆటగాడు కన్వర్ దివిజయ్ సింగ్ (రాణా బలాచౌరియా) హత్య జరిగిన కొన్ని వారాలకే చోటు చేసుకోవడం వల్ల రాష్ట్రంలో నేరాల పెరుగుదలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అంతకుముందు మూడుదఫాలు జర్మల్ సింగ్ హత్యాయత్నం జరిగింది. అయితే ఈసారి జర్మల్ సింగ్ను అతి దగ్గరగా కాల్చి చంపడంతో ఆయన మృత్యువాత పడ్డారు. ఈ హత్య రాజకీయ ప్రత్యర్థిత్వం లేదా గ్యాంగ్స్టర్ సంబంధాలు కారణమా అన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. -
ఆ రియల్ హీరోల కోసం.. చప్పట్లతో మారుమోగిన స్టేడియం
యాషెస్ ఐదో టెస్ట్ సందర్భంగా.. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో భావోద్వేగ క్షణాలు కనిపించాయి. బాండీ బీచ్ హీరోలకు మైదానంలో స్టాండింగ్ ఒవేషన్ లభించింది. తన ప్రాణాలను పణంగా పెట్టి అనేక మంది ప్రాణాలను రక్షించిన బాండీ బీచ్ హీరో అహ్మద్ అల్ అహ్మద్ ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆ క్షణాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మ్యాచ్ ప్రారంభం కావడానికి ముందు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో (SCG) బాండీ బీచ్ హీరో అహ్మద్ అల్-అహ్మద్, ఇతరులకు ఘనమైన స్వాగతం లభించింది. ఇంగ్లండ్-ఆస్ట్రేలియా జట్టు ఆటగాళ్లు ఈ రియల్ హీరోకు గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చారు. అహ్మద్తో పాటు ఘటనలో ఇద్దరు చిన్నారులను కాపాడి గాయపడ్డ చాయా డాడోన్ కూడా వచ్చింది. ఆమె కాలికి బుల్లెట్ గాయం కావడంతో స్ట్రెచ్చర్ సాయంతో వచ్చారు. అలాగే ఘటన సమయంలో తక్షణమే స్పందించిన(ఫస్ట్రెస్పాండర్స్) వైద్యులు, పోలీసు అధికారులు అందరినీ ప్రత్యేకంగా గౌరవించారు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు అలెక్స్ కేరీ, కామెరాన్ గ్రీన్లు ఇంగ్లండ్ ప్లేయర్స్తో కలిసి బౌండరీ వద్ద నిలబడి చప్పట్లతో స్వాగతం పలికారు. ఆ వీరులంతా మైదానంలోకి వచ్చిన సమయంలో అంతా లేచి నిలబడ్డారు. చప్పట్లతో స్టేడియం మొత్తం మారుమోగించారు. బాండీ బీచ్ ఘటనలో మరణించిన 15 మంది బాధితుల పేర్లను.. మిమ్మల్ని మరువబోం (forever in our hearts)అనే పదాలతో ప్రదర్శించారు. ఆ సమయంలో ప్లేయర్లు సహా పలువురు కంటతడి పెట్టారు.The SCG rises as one to acknowledge the first responders and community heroes who bravely acted during the Bondi attack 🙏 pic.twitter.com/HUl7M34Lcx— 7Cricket (@7Cricket) January 3, 2026గ్రౌండ్ మధ్యలోకి వచ్చాక తన గుండెలపై చేయి ఉంచుకుని.. ఆపై పైకి ప్రదర్శించాడు. ఆ సమయంలో స్టేడియంలో చప్పట్లు మరింత బిగ్గరగా వినిపించాయి. జాతీయ గీతం ఆలాపన జరిగాక.. క్రికెట్ పెద్దలు, ఆటగాళ్లు ఆ వీరులతో చేతులు కలిపారు. అహ్మద్ను ఆసీస్ ప్లేయర్ ఉస్మాన్ ఖవాజా ప్రత్యేకంగా అభినందించడం అత్యంత భావోద్వేగ క్షణంగా నిలిచింది.సిరియాలో పట్టి.. ఆస్ట్రేలియాకు వలస వచ్చిన అహ్మద్ అల్ అహ్మద్(43).. డిసెంబర్ 14న సిడ్నీ బాండీ బీచ్ ఉగ్రదాడి ఘటనలో సూపర్ హీరోగా నిలిచారు. లంచ్ చేస్తున్న సమయంలో తుపాకుల మోత విన్న ఆయన.. ధైర్యం చేసి ముందుకు దూకారు. కాల్పులు జరుపుతున్న సాజిద్ అక్రమ్పైకి దూకి గన్ లాక్కుని నిలువరించారు. ఆ సమయంలో మరో ఉగ్రవాది నవీద్ అక్రమ్ జరిపిన కాల్పుల్లో కాలికి, భుజానికి తూటాలు తగిలి అహ్మద్ తీవ్రంగా గాయపడ్డాడు. అయితే అప్పటికే భద్రతా బలగాలు అప్రమత్తం కావడంతో పెను ముప్పు తప్పింది. సకాలంలో చికిత్స అందడంతో అహ్మద్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ హీరో కోసం జరిపిన ఫండ్ రైజింగ్కు అనూహ్య స్పందన లభించింది. అంతేకాదు.. ప్రధాని ఆంథోనీ అల్బనీస్ స్వయంగా ఆస్పత్రికి వెళ్లి అహ్మద్ను పరామర్శించారు. స్థానికురాలైన చాయా డాడోన్ కాల్పులు జరుగుతున్న సమయంలో ఇద్దరు పిల్లలకు అడ్డుగా నిలబడింది. దీంతో ఆమె కాలికి గాయాలయ్యాయి. ఈ ఇద్దరినీ ఆస్ట్రేలియా ప్రభుత్వం వీరులుగా గుర్తించింది. -
చేతిలో పాముతో తాగుబోతు హుల్చుల్
-
ఫ్యాక్టరీ కార్మికుడి నుంచి ఫుల్స్టాక్ డెవలపర్ రేంజ్కి..!
ఏ చిన్న ఉద్యోగం చేసినా..అక్కడే ఉండిపోకూడదు..దినదినాభివృద్ధి చెందాలన్నా ఆర్యోక్తిని బలంగా నమ్మాడు ఈ వ్యక్తి. శ్రమతో కూడిన ఉద్యోగం చేస్తూ..కూడా మంచి ఉన్నతోద్యోగిగా మారాలన్న ఆశయాన్ని బలంగా ఏర్పరుచకున్నాడు. ఆర్థిక పరిస్థితి చదువు కొనసాగనివ్వకపోయినా..తనను తాను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలనుకున్నాడు. అనుకున్నది సాధించి..పరిమితులు, ఆర్థిక వనరులు అనుకూలంగా లేకపోయినా..ఉవ్వెత్తిన ఎగిసిపడే కెరటంలా అనితర సాధ్యమైన లక్ష్యాన్ని చేధించగలమని నిరూపించి.. స్ఫూర్తిగా నిలిచాడు. అతడు పూణేకు చెందిన యువకుడు. అతడి కథ నెట్టింట వైరల్గా మారండంతో అందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది. అతడు యూఎస్ ఆధారిత కూరగాయల ప్రాసెసింగ్ ఫ్యాకర్టీలో రోజుకి పదిగంటల షిప్ట్లో పనిచేస్తుండేవాడు. నిజానికి ఈ ఉద్యోగం శారీరకంగా, మానసికంగా చాలా శ్రమతో కూడిన ఉద్యోగం. అతనికి కోడింగ్పై ఎలాంటి ముందస్తు నేపథ్యంగానీ, అవగాహన గానీ లేదు. కానీ స్నేహితుడు చెప్పిన ఎలోనమస్క్ సూచన అతడిని ఎంతగానే ప్రేరేపించింది. ఆ సూచననే కార్యరూపంలోకి తీసుకొచ్చేలా..ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఎలాన్ మస్క్ అన్నట్లుగా ప్రతీది ఇంటర్నెట్లో ఉచితంగా లభిస్తుంది కాబట్టి అదే మీ అభ్యున్నతికి అద్భుతమైన వనరు అన్న మాటలు తూచతప్పకుండా ఫాలో అయ్యాడు అతడు. డబ్బు ఆదా చేసుకుని మరి తల్లిదండ్రుల మద్దతుతో ఓ ల్యాప్టాప్ కొనుకున్నాడు. దాని సాయంతో ఆన్లైన్ వనరులను ఉపయోగించుకుని హెచ్టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్, రియాక్ట్ను అధ్యయనం చేశాడు. ఖరీదైన కోర్సులు లేకుండా డాక్యుమెంటేషన్ చదవడం ప్రారంభించాడు. అలా ప్రాజెక్టులు నిర్మించడం, ఆ క్రమంలో జరిగే తప్పుల నుంచి నేర్చుకోవడం వంటివి చేస్తున్నాడు. జస్ట్ 18 నెలల్లో తనను తాను ఫుల్స్టాక్ డెవలపర్గా తీర్చిదిద్దుకుని యువతరానికి స్ఫూర్తిగా నిలిచాడు. నేర్చుకోవాలనే తప్పన, మంచి స్ధాయిలో ఉండాలన్న అభిలాష, ఆర్థిక వనరులు, పరిస్థితులు వెనక్కిలాగలేవు, ఆపలేవు అని నిరూపించాడు. From a factory worker to a full-stack developer in 1.5 years of grind.I’m not saying this to flex.I’m saying this because I didn’t believe it was possible either.1.5 years ago, I was working in a vegetables factory.10 hours a day. Packing. Picking. Standing.Physically… pic.twitter.com/pn30AaJ8LY— Sambhav.apk▲ (@Coding_Sage) January 2, 2026 ఫుల్-స్టాక్ డెవలపర్ అంటే వెబ్సైట్ లేదా అప్లికేషన్ ముందు భాగం (యూజర్ చూసేది), వెనుక భాగం (డేటాబేస్లు, సర్వర్లు) రెండింటినీ నిర్మించగల సామర్థ్యం ఉన్న వ్యక్తి. వీరికి HTML, CSS, JavaScript (ఫ్రంట్-ఎండ్ కోసం), Python, Java, Node.js వంటి భాషలు, డేటాబేస్ మేనేజ్మెంట్ (బ్యాక్-ఎండ్ కోసం) వంటి విస్తృత నైపుణ్యాలు అవసరం. ఇది ఎండ్-టు-ఎండ్ ప్రాజెక్ట్ను నిర్వహించడానికి వీలు కల్పిస్తుంది. (చదవండి: 52 ఏళ్ల మహిళ యూట్యూబ్ రీల్స్తో మొదటి సంపాదన..!) -
పాము Vs ముంగిస ఫైట్: ఉలిక్కిపడకపోతే ఒట్టు!
-
ఇండియా అబ్బాయి.. జపాన్ అమ్మాయి!
వన్స్ అపాన్ ఏ టైమ్... లవ్ స్టోరీలు కావచ్చు... జస్ట్ నిన్న మొన్నటి లవ్స్టోరీ కావచ్చు... లవ్స్టోరీలు ఎప్పుడూ హాట్ కేకులే! తాజా విషయానికి వస్తే... బిహార్కు చెందిన ఇంజినీర్ రాహుల్ కుమార్ లవ్స్టోరీకీ నెటిజనులు ఫిదా అయ్యారు. ఐఐటీ గ్రాడ్యుయేట్ అయిన రాహుల్ జపాన్లోని ఆటోమొబైల్ కంపెనీలో పనిచేయడానికి వెళ్లాడు. టోక్యోలో జరిగిన అంతర్జాతీయ వ్యాపార సమావేశంలో జపనీయురాలైన మెరీనాతో పరిచయం అయింది. ఆ పరిచయం ప్రేమగా, పెళ్లిగా మారింది.‘నా జీవితంలోని కీలకమైన మలుపు టోక్యోలో జరిగిన వ్యాపార సమావేశంలో మొదలవుతుందని ఊహించలేదు. మేము మొదట స్నేహితులం. స్నేహం నమ్మకంగా పరిణామం చెందింది, ఆ నమ్మకం ప్రేమగా వికసించింది. వేరు వేరు దేశాల నుంచి వచ్చినప్పటికీ ఒకరినొకరం బాగా అర్థం చేసుకోవడంప్రారంభించాం’ అని రాశాడు రాహుల్.మొదట్లో వీరి పెళ్లికి ఇరుపక్షాల పెద్దల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయినప్పటికీ ఆ తరువాత పచ్చజెండా ఊపారు. పెళ్లి వేడుకలు దిల్లీలో, రిసెప్షెన్ దిల్లీలో జరిగింది. ఆ తరువాత వీరు బిహార్లోని మాదేపుర గ్రామానికి వెళ్లారు. అది రాహుల్ కుమార్ స్వగ్రామం. ‘నమస్తే ఇండియా. ఐయామ్ మెరీనా యాదవ్’ అని తనను తాను పరిచయం చేసుకున్న మెరీనా తమ లవ్ స్టోరీ (Love Story) ఎలా ప్రారంభమైందో వివరించింది. మొత్తానికైతే వీరి వివాహ వేడుక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.చదవండి: ఏం చేశావ్ బ్రో.. చూపు తిప్పుకోలేకపోయాం View this post on Instagram A post shared by Tube Indian (@tube.indian) -
కుర్రాడి పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తించిన వాషింగ్టన్ సుందర్
టీమిండియాలో అప్ కమింగ్ ఆల్రౌండర్గా పేరు తెచ్చుకున్న వాషింగ్టన్ సుందర్.. మైదానం వెలుపల తన ప్రవర్తన కారణంగా నెటిజన్ల ఆగ్రహానికి బలయ్యాడు. సుందర్ తాజాగా ఓ హోటల్ నుంచి బయటికి వస్తూ ఓ కుర్రాడు ఆటోగ్రాఫ్ అడిగితే నిర్లక్ష్యంగా నిరాకరించాడు. అలాగే కొందరు ఫ్యాన్స్ సెల్ఫీల కోసం ప్రయత్నిస్తున్నా పట్టీపట్టనట్లు వ్యవహరించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరలవుతుంది.Washington Sundar looks like a proper gentleman, but his attitude is on another level — even more than big names like Virat Kohli, Rohit Sharma, and Hardik Pandya. 😅🙏 pic.twitter.com/7lVDBGz66K— Jara (@JARA_Memer) January 2, 2026ఇది చూసి నెటిజన్లు సుందర్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నావు.. ఏంటా బలుపు అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. ఇంకొందరేమో నువ్వేమైనా విరాట్ కోహ్లి లేదా రోహిత్ శర్మ అనుకుంటున్నావా అంటూ ఘాటుగా విమర్శిస్తున్నారు. మొత్తానికి ఆన్ ఫీల్డ్ ప్రదర్శనలతో అభిమానులను ఆకట్టుకున్న సుందర్, ఆఫ్ ద ఫీల్డ్ ప్రవర్తన కారణంగా అదే అభిమానుల నుంచి ఛీత్కారాలు ఎదుర్కొంటున్నాడు.ఇదిలా ఉంటే, ఇటీవలి ఇంగ్లండ్, ఆస్ట్రేలియా పర్యటనల్లో ఫార్మాట్లకతీతంగా రాణించిన సుందర్..త్వరలో న్యూజిలాండ్తో జరుగబోయే హోం టీ20 సిరీస్కు సిద్దమవుతున్నాడు. న్యూజిలాండ్ సిరీస్కు ఎంపికైన జట్టే టీ20 ప్రపంచకప్లో కూడా కొనసాగనున్న విషయం తెలిసిందే. ఇటీవలి కాలంలో ప్లేయింగ్ ఎలెవెన్లో స్థానాన్ని పక్కా చేసుకున్న సుందర్.. ప్రపంచకప్లో ఆడటం లాంఛనమే.న్యూజిలాండ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ జనవరి 21 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ కోసం భారత జట్టును ఇటీవలే ప్రకటించారు. ఐదు టీ20లు జనవరి 21, 23, 25, 28, 31 తేదీల్లో నాగ్పూర్, రాయ్పూర్, గౌహతి, వైజాగ్, తిరువనంతపురం వేదికలుగా జరుగనున్నాయి. ఈ సిరీస్కు ముందే ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ కూడా జరుగనుంది. ఈ సిరీస్ జనవరి 11 నుంచే మొదలవుతుంది. ఈ సిరీస్ కోసం వన్డే జట్టును ప్రకటించాల్సి ఉంది. -
దుబాయ్లో గ్రాండ్గా తల్లి బర్త్డే : వివాదాల బ్యూటీ వీడియో వైరల్
నటి,వివాదాలతో వార్తల్లో నిలిచే బ్యూటీ క్వీన్ ఊర్వశి రౌతేలా తన తల్లి మీరా రౌతేలా పుట్టిన రోజును ఘనంగా నిర్వహించింది. ప్రపంచంలోనే అతి పెద్ద హెటల్, 24 క్యారెట్ల బంగారు కిరీటం, గోల్డ్ కేక్ లాంటి విశేషాలతో గుర్తుండిపోయేలా వేడుక చేసింది. దీనికి సంబంధించిన వీడియో,ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసింది.ప్రపంచంలోని ఎత్తైనహోటల్లో 24 క్యారెట్ల బంగారు కిరీట కేక్తో అమ్మ పుట్టినరోజు వేడుక.. మేం అందరం నిన్ను ప్రేమిస్తున్నాం. వరల్డ్ టాలెస్ట్ హోటల్,ప్యూర్ రాయల్ గోల్డ్ క్రౌన్ కేక్,ప్యూర్ లవ్’’అంటూ ఊర్వశి పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీంతో తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలతోపాటు, ఊర్వశిపై ప్రశంసలు వెల్లువెత్తాయి.ఇదీ చదవండి: ఐదు నెలల చిన్నారి ఉసురు తీసిన ‘పాలు’విలాసవంతమైన వేడుకలో మూడు లేయర్ల బంగారు రంగు కేక్ ఒక ఆకర్షణ అయితే, 24 క్యారెట్ల బంగారంతో చేసిన కిరిటాన్ని ఊర్వశి తన తల్లి తలపై ఉంచడం మరో ఎట్రాక్షన్గా నిలిచింది. అందంగా ముస్తాబైన మీరా నవ్వుతూ, తన కుమార్తె స్వచ్ఛమైన ఆప్యాయత అనురాగాలను మురిసిపోయింది. కాగా ప్రతీ ఏడాది తల్లి బర్త్డే ఘనంగా నిర్వహించడం ఊర్వశికి అలవాటు. ఊర్వశి కలాజికల్ హారర్ చిత్రం కసూర్ 2 , వెల్కమ్ టు ది జంగిల్లలో నటించనుంది. గ్లెన్ బారెట్టో దర్శకత్వంలో ఆమె అఫ్తాబ్ శివదాసాని, జాస్సీ గిల్తో కలిసి నటిస్తోంది. View this post on Instagram A post shared by Urvashi Rautela (@urvashirautela) ఇదీ చదవండి: ఐఐటీ హైదరాబాద్ విద్యార్థికి ఏకంగా రూ. 2.5 కోట్ల ఆఫర్, రికార్డ్ -
డ్రంక్ & డ్రైవ్లో భర్త, భార్య ప్రెగ్నెంట్ : ఆ పోలీసు ఏం చేశాడంటే!
మద్యం మత్తులో ఉన్న వాహనదారుడిని నిలువరించిన పోలీసు ఆఫీసర్కు ఊహించని ఘటన ఎదురైంది. అయితే పరిస్థితిని అర్థం చేసుకుని, ఆయన చేసిన పని నెట్టింట విశేషంగా ఆకట్టుకుంటోంది. దీంతో ఈ పోలీసు అధికారి ప్రస్తుతం సోషల్మీడియాలో హీరోగా నిలిచారు.ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో జరిగింది. మద్యం మత్తులో ఉన్న వ్యక్తిని తన విధుల్లో భాగంగా అడ్డుకున్నారో పోలీసు అధికారి. అయితే "నేను కొంచెం తాగి ఉన్నాను. నా భార్య గర్భవతి. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్తున్నాను. ఇప్పుడు రాత్రి 10:30 అయింది.. ఇంకో రెండు కి.మీ దూరంలోనే ఆసుపత్రి. సార్, దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి " అని ఆ వ్యక్తి పోలీసు అధికారిని వేడుకున్నాడు. ఈ సమయంలో పోలీసు అధికారి స్పందించిన తీరు విశేషంగా నిలిచింది. కారులో ఉన్న మహిళ పరిస్థితిని గమనించి, భర్తను బయటకు రమ్మని చెప్పి, కారు స్టీరింగ్ను తన చేతుల్లోకి తీసుకున్నారు. భర్తను కారు వెనుక కూర్చోమని మర్యాదగా చెప్పారు. “మీ భద్రత కోసమే ఇక్కడ ఉన్నాము. మిమ్మల్ని ఆసుపత్రికి సురక్షితంగా తీసుకెళ్లడం మా విధి” అని గర్భిణీకి ధైర్యం చెప్పి ముంబై పోలీసు అధికారి డ్రైవర్ సీట్లో కూర్చున్నారు. అంతేకాదు ఈ దృశ్యాలను వీడియో తీస్తోంటే.. ఈ విధంగా కూడా పోలీసులు సహాయం చేస్తారని ప్రజలకు తెలియజేసేలా చిత్రీకరణ కొనసాగించమని కోరడం మరో విశేషం. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.He creates such videos on Instagram, his video has gone viral before also. pic.twitter.com/rklSuh9iFk— Dinesh Choudhary (@DineshJaiHind7) January 1, 2026నెటిజన్లు ప్రశంసలుపోలీసు అధికారిపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. “బిగ్ సెల్యూట్” అంటూ కామెంట్ చేశారు. మరోవైపు భార్య గర్భవతిగా ఉన్నప్పుడు, అందులోనూ ప్రసవానికి దగ్గరపడ్డపుడు తాగడం అవసరమా అని కొంత మంది ఆగ్రహించారు. కొన్ని మంచు ప్రాంతాల్లో పరిమితులతో, మద్యపానాన్ని శాశ్వతంగా నిషేధించాలి అంటూ వ్యాఖ్యానించారు. -
52 ఏళ్ల మహిళ యూట్యూబ్ రీల్స్తో మొదటి సంపాదన..!
సోషల్ మీడియా గృహిణులకు వారి అభిరుచులు, రోజువారీ అనుభవాలను డాక్యుమెంట్ చేసి, ఆదాయ వనరులుగా మార్చుకుని, జీవనోపాధి పొందే అవకాశాలను కల్పిస్తోంది. ఇది యువతకే కాదు..50 ఏళ్ల పైబడ్డవారికి గొప్ప ఫ్లాట్ఫామ్. వాళ్లు కూడా వయసు కేవలం సంఖ్య మాత్రమే అని ప్రూవ్ చేస్తున్నారు. అందుకు ఈ 52 ఏళ్ల మణీష పరీక్ ఉదాహరణ. యూట్యూబ్లో రీల్స్ పోస్ట్ చేస్తూ ఆరు నెలల్లో తొలి ఆదాయం అందుకున్నా అంటూ కూతురు అన్షుల్ పరీక్షతో సంతోషాన్ని షేర్ చేసుకుంది. ఆమె తన అమ్మ హ్యాపీ మూమెంట్స్ని కెమారాలో రికార్డు చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. అది కాస్తా వైరల్గా మారడంతో మనిషా వార్తల్లో నిలిచింది. అంతేగాదు ఆ వీడియోకి అంతా ‘కంగ్రాట్స్ ఆంటీ జీ’ అని ప్రేమగా కామెంట్లు పెట్టగా, యూట్యూబ్ సైతం ఆమెను అభినందించడం విశేషం.52 ఏళ్ల వయసులో మనీషా పరీక్ యూట్యూబ్లో కార్టూన్ ఆధారిత రీల్స్ చేయాలని భావించింది. ఈ క్రమంలోనే ‘Life Unscripted’ పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించింది. మన చుట్టూ ఉండే కుటుంబాలలో జరిగే కొన్ని సంఘటనలకే తనదైన హాస్యాన్ని జోడిస్తూ.. కార్టూన్ వీడియోలను రూపొందించి యూట్యూబ్లో పోస్ట్ చేయడం మొదలుపెట్టింది. వాటికి అనతికాలంలోనే ఆదరణ లభించడంతో వ్యూస్ కూడా పెరిగాయి. ఇలా ఆరు నెలలు తిరక్కముందే సుమారు 42 వేల మంది సబ్స్క్రైబర్లను సంపాదించుకుని..యూట్యూబ్ సంస్థ నుంచి తొలిసారి వేతనాన్ని అందుకుంది. అది మనీషాకు జీవితంలోనే మొదటి సంపాదన కావడంతో పట్టరాని సంతోషం కలిగిందామె. ఈ క్రమంలోనే తన సంతోషాన్ని కూతురు అన్షుల్ పరీక్తో పంచుకుంది. ఈనేపథ్యంలోనే తన తల్లి మెమరబుల్ మొమెంట్స్ని వీడియో రూపంలో కెమెరాలో బంధించి తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయగా వైరల్గా మారింది.అంతేగాదు ఆ వీడియోలో అన్షుల్ తన తల్లితో ‘నీ హ్యాపీనెస్కి కారణమేంటమ్మా?’ అని అడగ్గా.. ‘52 ఏళ్ల వయసులో.. జీవితంలో తొలి సంపాదనను యూట్యూబ్ ద్వారా అందుకున్నా. అదీ ఆరు నెలల్లోనే.. కష్టపడితే తప్పకుండా ఫలితం వస్తుంది’ అంటూ సంబరపడిపోయింది మనీషా. ఈ వీడియోకి సుమారు 13 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. View this post on Instagram A post shared by Anshul Pareek | Content Creator (@anshul_pareek___) (చదవండి: సోలో బైక్ రైడ్తో..12 జ్యోతిర్లింగాలు చుట్టొచ్చిన లెఫ్టినెంట్ కల్నల్ అంబిలి సతీష్..!) -
న్యూ ఇయర్ రెజల్యూషనా?.. ఛా అవతలికి పో!
కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టాం. సాధారణంగానే.. ఈ టైంలో ‘రెజల్యూషన్స్’ తెరపైకి రావాలి. కానీ, ఈసారి ఎందుకనో ఆ హడావిడి లేదు. ఇటు సోషల్ మీడియాలో ఆ పదం ఎక్కడో అరుదుగా కనిపిస్తోంది. ఎవరినైనా మైక్ పెట్టి కదిలిస్తే దాంతోనే కొట్టేలా కనిపిస్తున్నారు. అదే సమయంలో.. నెట్టింట వైరల్ అవుతున్న ఓ పాత వీడియో గురించి చర్చించుకుంటున్నారు. న్యూఇయర్ అనగానే కొత్తగా ‘రెజల్యూషన్స్’ షురూ అవుతాయి. అప్పుడైతే ఉత్సాహం టన్నులకొద్దీ ఉంటుంది. మంచి అలవాట్లు మొదలుపెట్టి.. పాడు పద్ధతులను పాతరేయాలనుకుంటారు. నాలుగు రోజులు గడిచాయా.. ఉత్సాహం ఉసూరుమంటుంది. నెల తిరిగేసరికల్లా ‘ఇక మనవల్ల కాదులే’ అని చేతులెత్తేస్తారు.. మోటివేషన్ సూత్రాలు ఇక్కడ ఏమాత్రం పని చేయవు. ఒకప్పుడు.. కనిపించిన దృశ్యాలివి. 1997లో శేఖర్ సుమన్ లేట్నైట్ టాక్ షో Movers and Shakers కోసం ప్రజల వద్దకు వెళ్లి వారి న్యూఇయర్ రెజల్యూషన్స్ అడిగారు. వారు నిర్మోహమాటంగా చెప్పిన సమాధానాలు ఇప్పటికీ గుర్తుండిపోయేలా ఉన్నాయి. చాలామంది “స్ట్రిక్ డైట్ పాటిస్తాం” అన్నారు. ఒక యువతి “ఎక్కువ మంది బాయ్ఫ్రెండ్స్ సంపాదించుకుంటా” అని చెప్పగా, ఇంకో యువకుడు “నెలకో గర్ల్ఫ్రెండ్ మార్చేస్తా” అంటూ సరదాగా స్పందించాడు.“ఈ ఏడాదిలో అయినా జీన్స్, టీషర్ట్స్ కొనుక్కుంటా” అని ఓ యువకుడు, “ఈ ఏడాదిలోనైనా బడికి బండెడు పుస్తకాలు మోయకూడదనుకుంటున్నా” అంటూ ఓ పిలగాడు ఇచ్చిన సమాధానాలు చిరునవ్వు తెప్పించాయి. ఎలాగైనా ఖర్చులు తగ్గించుకుంటాం అంటూ చెప్పిన సమాధానాలు ఇప్పుడు చాలామందికి కనెక్ట్ అవుతున్నాయి. నిజాయితీతో కూడిన ఆ సమాధానాలు నేటి నెటిజన్లను కూడా ఆకట్టుకుంటున్నాయి. View this post on Instagram A post shared by The90sIndia🤩 (@the90sindia)మరి ఇప్పుడో.. గత కొన్నేళ్లుగా కొత్త ఏడాది తీర్మానాలు (Ne Year Resolutions) విషయంలో మునుపటి ఉత్సాహం కనిపించడం లేదు. డిజిటల్ ఎరాలో డైరీల్లో రాసుకోవడం, బొమ్మలు గీసుకుని గోడలకు తగిలించుకోవడం నామోషీ అయిపోయింది. మొదలు పెట్టిన జోష్ను పాత అలవాట్లు మింగేయడం.. బిజీ లైఫ్స్టైల్తో కొన్ని వారాలకే మరిచిపోవడం.. సాధ్యం కాని పెద్ద ప్లాన్లు పెట్టుకోవడం వాటిని మధ్యలోనే వదిలేసేలా చేస్తున్నాయి. ఆఖరికి.. ఆరోగ్యంగా ఉండాలి అనే ఆర్డినరీ రెజల్యూషన్ను కూడా పక్కన పెట్టాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలాంటప్పుడు మీ న్యూఇయర్ రెజల్యూషన్స్ ఏది? అని అడిగితే.. ఛా అవతలికి పో అనే సమాధానం ఎక్కువగా వినిపించదంటారా? ఆరోజుల్లో.. సాధారణంగా వినిపించిన రెజల్యూషన్స్బరువు తగ్గాలిజిమ్కి క్రమం తప్పకుండా వెళ్లాలిడైట్ పాటించాలి (స్ట్రిక్ డైట్ చాలా పాపులర్)పొగ తాగడం మానేయాలిచదువు & కెరీర్పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలికొత్త స్కిల్ నేర్చుకోవాలిఉద్యోగంలో కష్టపడి ప్రమోషన్ పొందాలిమంచి స్నేహితులు సంపాదించుకోవాలిసరైన బాయ్ఫ్రెండ్/గర్ల్ఫ్రెండ్ సంపాదించుకోవాలికుటుంబంతో ఎక్కువ సమయం గడపాలిఖర్చు తగ్గించుకోవాలిపొదుపు చేయాలిఅప్పులు తీర్చేయాలిమద్యం తగ్గించుకోవాలికొత్త పుస్తకాలు చదవాలికొత్త ప్రదేశాలు చూడాలికొత్త హాబీ మొదలుపెట్టాలి (ఫోటోగ్రఫీ, మ్యూజిక్ వంటివి)ఆరోజుల్లో.. రెజల్యూషన్స్ ఎక్కువగా వ్యక్తిగత ఆరోగ్యం, చదువు, సంబంధాలు, డబ్బు చుట్టూ తిరిగేవి. అప్పట్లో సోషల్ మీడియా లేకపోవడం వల్ల ప్రజలు తమ రెజల్యూషన్స్ను నేరుగా చెప్పేవారు, టీవీ షోలు, పత్రికలు, డైరీల్లో రాసుకునేవారు. సోషల్ మీడియా వాడకం పెరిగాక.. పోస్టులు కూడా చేసి చాటి చెప్పుకునేవారు. మరి ఇప్పుడో.. ఈ డిజిటల్ యుగంలో ప్రైవేట్గా ఉంచుకోవడమో లేదంటే అసలు పెట్టుకోవడమే బెస్ట్గా ఫీలవుతున్నారు. -
గోవాలో చిల్ అవుతున్న సారా.. చేతిలో బీర్ బాటిల్..
భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) కుమార్తె సారా టెండూల్కర్ (Sara Tendulkar) ప్రస్తుతం గోవా వెకేషన్లో ఉన్నారు. గోవా ట్రిప్లో సారా.. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.గోవాలో పబ్లిక్గా బీరు బాటిల్తో సారా కనిపించడం విమర్శలకు దారి తీసింది. సోషల్ మీడియాలో వీడియో ప్రకారం.. సారా టెండుల్కర్ తన ఫ్రెండ్స్తో గోవా వీధుల్లో వెళ్తున్నారు అటుగా వెళ్తున్న ఓ బైకర్.. వారికి వీడియో తీశారు. అయితే, ఆ సమయంలో సారా చేతుల్లో బీర్ బాటిల్ ఉండటం గమనార్హం. దీంతో సారా టెండూల్కర్ బీర్ తాగుతుంది అంటూ సోషల్ మీడియా మొత్తం కోడై కూస్తోంది.ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. తండ్రి ఆదర్శాలకు విరుద్ధంగా కూతురి ప్రవర్తన ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు మాత్రం సారాకు మద్దతు ఇస్తూ పోస్టులు పెడుతున్నారు. ఈ కాలంలో మందు తాగడం చాలా కామన్ గురూ అని కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ మాత్రం.. ఎంజాయ్ చేయాలి బ్రో అంటూ సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. ఇక మరి కొంతమంది తాగడం అవసరమా అని నెగిటివ్గా ట్రోల్ చేస్తున్నారు. అయితే, సచిన్ మాత్రం ‘తాను ఎప్పుడూ మద్యం, పొగాకు ఉత్పత్తులను ప్రచారం చేయనని గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. Sachin Tendulkar : I will never promote alcohol and tobacco.Le his daughter Sara on streets of Goa with 🥲: pic.twitter.com/QDeQ8YGMoW— Career247Official (@Career247Offici) December 31, 2025ఇక, సారా టెండుల్కర్ హీరోయిన్కు మించిన అందం అభినయంతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా సారా టెండూల్కర్ సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. తాను పోస్ట్ చేసే ఫోటోలకు విపరీతంగా లైక్స్ వస్తాయి. ఆమె నిత్యం ఏదో ఒక ఫోటోను, వీడియోను సోషల్ మీడియాలో తన అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది.Sara Tendulkar chilling with a budwiser in Goa.#ShubmanGill #SaraTendulkar pic.twitter.com/QL8sATkFS2— AuraFarmer (@TheCricPundit) December 31, 2025 Sara Tendulkar isn’t going viral today because she is someone’s daughter,but because her simplicity, confidence, and grace truly resonate with people.There is a lot of noise on social media,but what is natural is what really reaches the heart. pic.twitter.com/AFW4C86RlY— Shalini Singh (@Bahujan_Era) December 24, 2025 -
రూ. 5 లక్షలు ఖర్చుపెట్టి.. విద్యార్థులను ఫ్లైట్ ఎక్కించిన హెడ్మాస్టర్
బెంగళూరు: బాల్యంలో ప్రతీ ఒక్కరి జీవితాల్లో ఉపాధ్యాయుల ప్రేరణ చాలా ఉంటుంది. తల్లి దండ్రుల తరువాత పిల్లలపై తమ ప్రేమ అప్యాయతలను కురిపించేది టీచర్లు మాత్రమే. అందుకే గొప్ప గొప్ప నాయకులు, సెలబ్రిటీల జీవితాలపై టీచర్ల ప్రభావం ఉంటుంది. తాజాగా కర్ణాటకలోని కొప్పల్ జిల్లా బహద్దూరిబండి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యుడి చేసిన పని నెట్టింట పలువురిని ఆకట్టుకుంటోంది.విమానం ఎక్కాలనే విద్యార్థులకలను సాకారం చేసేందుకు కర్ణాటకకు చెందిన ప్రధాన ఉపాధ్యాయుడు దాతృత్వాన్ని చాటుకున్న వైనం విశేషంగా నిలిచింది. బహద్దూరిబండి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బీరప్ప అందగి 24 మంది విద్యార్థులను తొలి సారి విమానం ఎక్కించారు. తన సొంత ఖర్చులతో రూ. 5 లక్షలు వెచ్చించి మరీ తన విద్యార్థులను లైఫ్లో మర్చిపోలేని అనుభూతిని మిగిల్చారు. 5-8 తరగతుల విద్యార్థులతోపాటు, ఉపాధ్యాయులు, మధ్యాహ్న భోజన సిబ్బంది, పాఠశాల అభివృద్ధి పర్యవేక్షణ కమిటీ సభ్యులు మొత్తం 40 మంది విమానంలో ప్రయాణించారు. వీరి కోసం తోరణగల్లులోని జిందాల్ విమానాశ్రయం నుండి బెంగళూరుకు ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశారు.ప్రతీ క్లాస్లో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన తొలి ఆరుగుర్ని ఈ జర్నీకి ఎంపిక చేశారు.A truly heartwarming gesture 🙏✈️Twenty-four government school students from a village in Koppal experienced their first-ever flight, made possible by the selfless generosity of their headmaster, who personally funded the journey. Two enriching days in Bengaluru, learning,… pic.twitter.com/6E28SKHQVv— Ravi Boseraju (@raviboseraju) December 31, 2025 కొప్పల్ జిల్లాలోని ఒక గ్రామానికి చెందిన ఇరవై నాలుగు మంది విద్యార్థులు తమ తొలివిమాన ప్రయాణాన్ని అనుభవించారు, వారి ఆకాశంలో ఎగురుతున్న విమానాన్ని చూసి సంతోషం పడే వారు తొలిసారి విమానం ఎక్కి తెగ సంతోష పడిపోయారు. బెంగళూరులో రెండు రోజులు ఉండి అనేక పర్యాటక ప్రదేశాలను, పాఠశాలలను సందర్శించి తమ అభిమాన హెడ్మాస్టర్కి శతకోటి అభివందనాలు కొప్పల్కు తిరిగొచ్చారు. ఎన్నో మధురమైన,సంతోషకరమైన క్షణాలను, అనుభవాలను మూటగట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట సందడిగామారింది. ఆయనపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తాయి.ఇదీ చదవండి: నాకు వేరే దారి లేదు! మమ్మా యూ ఆర్ ద బెస్ట్.. సారీ! -
నాకు వేరే దారి లేదు! మమ్మా యూ ఆర్ ద బెస్ట్.. సారీ!
ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో విషాదం చోటు చేసుకుంది. తన ప్రియుడు ఆకాష్ మోసం చేశాడంటూ ప్రియురాలు బలవన్మరణానికి పాల్పడింది. ఈ సందర్భంగా ఆమె రికార్డు చేసిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.హాత్రాస్లోని ఆవాస్ వికాస్ కాలనీలో నివసించే కామిని శర్మ, ప్రియుడు ఆకాష్ తనను వివాహం చేసుకోవడానికి నిరాకరించడంతో ఆత్మహత్య చేసుకుంది. ‘‘నేను ఎపుడూ ఆత్మహత్య చేసుకోవాలనుకోలేదు. కానీ నాకు చావు మరో ఆప్షన్ మిగలకుండా చేశావ్. బలహీను రాల్నిచేసి ఆడుకున్నావ్...ఎవరి జీవితంతో ఆడుకోవడ్డం మీ ఇంట్లో వాళ్లు ఎపుడూ చెప్పలేదా.. కానీ మానవత్వం అనేది బతికి ఉంటే నీకు కూడా నాలాంటి గతే పడుతుంది. ఎందుకంటే నేను ఎవర్నీ మోసం చేయలేదు.. నిన్ను చాలా ప్రేమించాను’’ అంటూ భావోద్వేగానికి లోనైంది. అంతేకాదు అమ్మా నన్ను క్షమించు. ఈ ప్రపంచంలో నువ్వే అత్యుత్తమ తల్లివి. నా సూసైడ్కి బిహార్ వాలా ఆకాష్ కారణం అని తన వీడియోలో పేర్కొంది. అలాగే తన అత్తకు కూడా క్షమాపణలు చెప్పింది. నీలాంటి అత్త యూనివర్స్లో ఎక్కడా దొరకదంటూ కన్నీరు మున్నీరుగా విలపించింది.Tragic incident in Hathras, UP: Girl records emotional video blaming her Ex-Boyfriend Aakash for forcing her ("You've forced me so much... I AM SORRY MUMMA. You are the BEST Mumma..."), then d!es by suicide. Heartbreaking. 💔pic.twitter.com/7f29omeO3i— Ghar Ke Kalesh (@gharkekalesh) December 31, 2025 కామినీ సోమవారం మధ్యాహ్నం విషం సేవించింది. ఆమె కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఆకస్మిక మరణం ఆమె కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అంత్యక్రియల తర్వాత, కుటుంబ సభ్యులకు కామిని వీడియో గురించి తెలిసింది. దీంతో కామిని తల్లి రష్మి శర్మ కొత్వాలి సదర్లో ఫిర్యాదు చేసింది. కుమార్తె మరణానికి కారణమైన తన కుమార్తె ప్రియుడు ఆకాష్పై ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.ఇదీ చదవండి: బాలనటి ఇంట్లో తీరని విషాదం, కళ్లముందే..! -
ఫాస్ట్-ట్రాక్ ఇమ్మిగ్రేషన్ అంటే..? సుస్మితా, రాణి ముఖర్జీలు సైతం..
భారత ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ ఇమ్మిగ్రేషన్ - ట్రస్టెడ్ ట్రావెలర్ ప్రోగ్రామ్ (FTI-TTP)ని ప్రారంభించింది. ఈ విధానంతో విమానం మిస్సవుతుందనే భయం లేకుండా నిశ్చింతగా విదేశాలు చుట్టొచ్చేయొచ్చు. అంతేగాదు గంటల తరబడి క్యూలైన్లలో పడిగాపులు పడకుండా ఈజీగా ఇమిగ్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. ఇది ప్రముఖుల దృష్టిని అమితంగా ఆకర్షిస్తోంది కూడా. అందుకు నిదర్శనం బాలీవుడ్ తారలు సుస్మితా సేన్, రాణి ముఖర్జీలు ఈ చొరవకు సైన్అప్ చేయడమే. ఆ విషయాన్ని స్వయంగా బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించింది. ఈ ఇద్దరు హీరోయిన్లు ఈ ప్రక్రియలో తమ పేర్లను నమోదు చేసుకున్న వీడియోలను షేర్ చేసింది కూడా. ఒక వీడియో క్లిప్లో రాణి ముఖర్జీ తన బయోమెట్రిక్ ప్రక్రియను పూర్తి చేస్తున్నట్లు కనిపిస్తుంది. దానికి క్యాప్షన్గా "మర్దానీ శివానీ శివాజీ రాయ్ ఫాస్ట్ట్రాక్ ఇమ్మిగ్రేషన్లో నమోదు చేసుకున్నప్పుడూ దేశం కూడా అనుసరిస్తుంది" అని క్యాప్షన్ జోడించి మరి పోస్ట్ చేశారు. ఇక మరో వీడియో క్లిప్లో సుస్మితా సేన్ బయోమెట్రిక్లో వేలిముద్ర వేస్తున్నట్లుగా షేర్ చేస్తూ.."సుష్మితా సేన్ క్యూను స్కిప్ చేయాలనుకుంటోంది.. మరి మీరు" అనే క్యాప్షన్ జోడించి మరి పోస్ట్ చేశారు. వీళ్లంతా ఎందుకు ఫాస్ట్ ట్రాక్ ఇమ్మిగ్రేషన్ కోసం నమోదు చేసుకుంటున్నారు? దీనికి ఎవరు అర్హులు? తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందామా..!FTI-TTP అంటే ఏమిటి?ఫాస్ట్ ట్రాక్ ఇమ్మిగ్రేషన్ - ట్రస్టెడ్ ట్రావెలర్స్ ప్రోగ్రామ్ (FTI-TTP) అంతర్జాతీయ ప్రయాణాన్ని సౌకర్యవంతంగా, సులభతరం చేయడమే దీని ప్రధానోద్దేశ్యం. క్యూలైన్లలో పడిగాపులు పడకుండా తక్కువ సమయంలో ఇమ్మిగ్రేషన్ పాలసీ ప్రకియను పూర్తి చేసేలా ఈ ప్రక్రియ అనుమతిస్తుంది. ఇది 2024లో ప్రారంభమైంది. జస్ట్ 30 సెకన్లలోపు ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్కు అనుమతిస్తుంది. విమానాశ్రయంలో నిరీక్షించాల్సిన పని ఉండదు, అలగే తరచుగా అంతర్జాతీయ ప్రయాణాలు చేసేవారికి ఇది ఎంత ప్రయోజనకరంగా ఉంటుంది. View this post on Instagram A post shared by Bureau of Immigration, India (@bureauofimmigrationindia) ఎలా అంటే..FTI-TTP కింద నమోదు చేసుకున్న ప్రయాణీకులు సాధారణ ఇమ్మిగ్రేషన్ కౌంటర్ల వద్ద లైన్లో నుంచోవాల్సిన పని ఉండదు. సంబంధిత విమానాశ్రయాల్లో వీరికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ–గేట్ల వద్దకు వెళ్లాలి. మొదటి గేట్ వద్ద పాస్పోర్ట్, బోర్డింగ్ పాస్ స్కానింగ్ పూర్తవుతుంది. దీంతో రెండో ఈ–గేట్కు అనుమతి లభిస్తుంది.రెండో ఈ–గేట్ వద్ద ప్రయాణికుడి ముఖాన్ని స్కాన్ చేస్తారు. ధ్రువీకరణ అనంతరం ఇమిగ్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది View this post on Instagram A post shared by Bureau of Immigration, India (@bureauofimmigrationindia) ఎవరు అర్హులు?భారతీయ పౌరులుభారతదేశ విదేశీ పౌరసత్వం (OCI) కార్డులు కలిగి ఉన్న విదేశీ పౌరులుపాస్పోర్ట్ కనీసం 6 నెలల చెల్లుబాటును కలిగి ఉండాలి.ఒక్కసారి రిజిస్ట్రేషన్ విజయవంతంగా పూర్తి అయితే ఐదేళ్లు లేదా పాస్పోర్ట్ గడువు ముగిసే వరకు ఇది చెల్లుబాటవ్వుతుంది. అలాగే ఇది ప్రయాణికులకు దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరుస్తుంది.ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..దరఖాస్తు ప్రక్రియ ఎక్కువగా ఆన్లైన్లో ఉంటుంది. అనుసరించడం సులభం.ఆన్లైన్ దరఖాస్తు: ftittp.mha.gov.in వెబ్సైట్ని సందర్శించి ఇటీవలి పాస్పోర్ట్-సైజ్ ఫోటో, స్కాన్ చేసిన పాస్పోర్ట్ పేజీలు, నిర్థారిత అడ్రస్, OCI కార్డ్ (వర్తిస్తే) అప్లోడ్ చేయాలి.ఆ తర్వాత అధికారులు సమర్పించిన వివరాలను ధృవీకరిస్తారు. క్లియర్ అయిన తర్వాత దరఖాస్తుదారులకు ఇమెయిల్ లేదా SMS ద్వారా సమాచారం అందిస్తారు.బయోమెట్రిక్ అపాయింట్మెంట్: FRRO కార్యాలయంలో లేదా నియమించబడిన అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆన్లైన్లో అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.అపాయింట్మెంట్ సమయంలోనే వేలిముద్రలు, ముఖ డేటాని నమోదు చేసుకోవాలి. అయితే తుది ఆమోదం ఒక నెల వరకు పట్టవచ్చు.ఎందుకు తిరస్కరింపబడతాయంటే..తప్పుగా లేదా తప్పుడు సమాచారంముఖ్యమైన వివరాలను దాచడంఅస్పష్టంగా లేదా అసంపూర్ణంగా ఉన్న పత్రాలు లేదా ఫోటోలుతప్పుగా లేదా తప్పుడు అడ్రస్ చివరగా దరఖాస్తుదారులు దరఖాస్తును సమర్పించిన తర్వాత ఈమెయిల్ లేదా SMS ద్వారా రసీదును అందుకుంటారు. ఒకవేళ దరఖాస్తు తిరస్కరించబడితే, సమస్యలను సరిదిద్దిన తర్వాత వారు తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చు.(చదవండి: -
రాంప్రసాద్ రెడ్డి తొడగొట్టి చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video: మరోసారి సహనం కోల్పోయిన మాగ్నస్ కార్ల్సన్
ప్రపంచ నంబర్ 1, ఐదు సార్లు వరల్డ్ చెస్ ఛాంపియన్ అయిన మాగ్నస్ కార్ల్సన్ మరోసారి భావోద్వేగాన్ని నియంత్రించుకోలేకపోయాడు. వరల్డ్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్లో భారత గ్రాండ్మాస్టర్ అర్జున్ ఎరిగైసి చేతిలో ఓటమిని జీర్ణించుకోలేక, అన్ ప్రొఫెషనల్గా ప్రవర్తించాడు. నిరాశతో టేబుల్ను బలంగా కొట్టి తన అసహనాన్ని ప్రదర్శించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది. Arjun Erigaisi wins and Magnus Carlsen slams the table 💥!https://t.co/9kA44nR1gV pic.twitter.com/fPeZmggftd— chess24 (@chess24com) December 29, 2025కార్ల్సన్కు ఇలా ప్రవర్తించడం కొత్తేమీ కాదు. ఇదే ఏడాది నార్వేలో జరిగిన ఓ టోర్నీలో కూడా భారత యువ గ్రాండ్మాస్టర్ గుకేశ్ చేతిలో ఓటమి తర్వాత ఇలానే టేబుల్ను బలంగా కొట్టాడు.ప్రస్తుత టోర్నీలోనే రష్యా గ్రాండ్మాస్టర్ ఆర్టెమియేవ్ చేతిలో ఓటమి తర్వాత కూడా కోపంతో ఊగిపోయి, కెమెరాను తోసేశాడు.కార్ల్సన్ తరుచూ ఇలా ప్రవర్తించడం ప్రస్తుతం చెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కార్ల్సన్పై చర్యలు తీసుకోవాలని అభిమానులు ప్రపంచ చెస్ ఫెడరేషన్ను డిమాండ్ చేస్తున్నారు.ఇదిలా ఉంటే, కార్ల్సన్పై విజయంతో వరల్డ్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్లో ఎరిగైసి పాయింట్ల సంఖ్య 7.5కు చేరింది. తద్వారా ఎరిగైసి ఉజ్బెకిస్తాన్కి చెందిన నోడిర్బెక్ అబ్దుసత్తోరోవ్తో కలిసి అగ్రస్థానంలో నిలిచాడు. -
మంచంపై పులిరాజా.. ఓ చేదు నిజం!
గ్రామంలోకి చొరబడిన ఓ పెద్దపులి.. జనాలను బెంబేలెత్తించింది. ఓ వ్యక్తిపై దాడి చేశాక.. ఆరుబయట ఉన్న మంచంపై తీరికగా సేద తీరింది. ఆ దృశ్యాన్ని కొందరు ఫోన్లలో బంధించడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఈ ఘటన వెనుక ఉన్న చేదు నిజం గురించి చర్చ మాత్రం జరగడం లేదన్న అభిప్రాయం సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. మధ్యప్రదేశ్ బంధవ్గఢ్ టైగర్ రిజర్వ్(Bandhavgarh Tiger Reserve) ప్రాంతంలో గ్రామంలోకి చొరబడింది. అక్కడ ఆరుబయట సంచరిస్తుండగా దానిపై రాళ్లతో దాడి చేశారు. భయంభయంగానే అది దాక్కునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో అది అక్కడే కట్టేసిన ఉన్న పశువుల జోలికి పోలేదు(గ్రామస్తులు కూడా ఇదే విషయాన్ని చెప్పారు). అయితే రాళ్లు తగిలిన కోపంతో.. ఓ గ్రామస్తుడ్ని నేలకేసి కొట్టింది. ఆపై మరో ఇంట్లోకి వెళ్లి కొన్ని గంటలపాటు మంచంపై కూర్చుని సేదదీరింది. విషయం తెలుసుకున్న అటవీశాఖ సిబ్బంది సుమారు 8 గంటలపాటు శ్రమించి పులిని బంధించారు. పులి బోనులోకి చేరడంతో పాటు గాయపడిన వ్యక్తికి కూడా ప్రాణాపాయం తప్పడంతో.. ఆ ఊరి ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు. आज मैं गाँव में पंचायत लगाकर सभी की सुनवाई करूँगा, क्यूँ मेरा जीना हराम कर रहे हो, मेरे जंगल में कब्ज़ा कर, मेरा इलाका ख़त्म करके ..??#MadhyaPradesh #bandhavgarh #umaria #tiger #viral #highlight pic.twitter.com/0rG8TAvwnk— DEEPAK YADAV (@YadavDeepakya22) December 29, 2025అయితే.. వేటగాళ్లకు భయపడే పులులు గ్రామాల్లోకి వస్తున్నాయని ఆ ఊరి ప్రజలు చెబుతుండడం ఇక్కడ చర్చించాల్సిన విషయం. టైగర్ స్టేట్గా పేరొందిన మధ్యప్రదేశ్లో పెద్దపులుల మరణాల లెక్కలు ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. తాజాగా.. సగర్ జిల్లాలోని ధానా ఫారెస్ట్ రేంజ్లో 10 ఏళ్ల ఆడ పులి మృతదేహం దొరికింది. గత వారం రోజుల్లో రాష్ట్రంలో ఆరు పులులు మృత్యువాత పడగా.. ఈ ఒక్క ఏడాదిలోనే 55 పులులు మరణించడం గమనార్హం. बांधवगढ़ टाइगर रिजर्व में बाघ पर पत्थर बरसाएHuman-wildlife conflict management in Madhya Pradesh collapses 😔🐯 #tiger @CMMadhyaPradesh @PMOIndia @ntca_india @moefcc pic.twitter.com/OfWAFDo5zg— Ajay Dubey (@Ajaydubey9) December 29, 20251973లో మధ్యప్రదేశ్లో పులుల సంరక్షణ కోసం ప్రాజెక్ట్ టైగర్ ప్రారంభమైంది. అప్పటి నుంచి పులులు అత్యధికంగా చనిపోయింది ఈ ఏడాదిలోనే. అందునా అసహజ మరణాలే 11 నమోదు అయ్యాయని లెక్కలు చెబుతున్నాయి. అయితే.. అటవీ శాఖ వీటిని ఎక్కువగా పులుల మధ్య గొడవలుగా పేర్కొంటున్నాయి. కానీ, క్షేత్ర పరిస్థితులు అవి కావనే చెబుతున్నాయి. వేట, కరెంట్ ఉచ్చులు.. పర్యవేక్షణ లోపాలు, నిర్లక్ష్యం ప్రధాన కారణాలని తెలుస్తోంది. ఓ జాతీయ మీడియా సంస్థ బయటపెట్టిన అటవీ శాఖ నివేదికలో.. కేసుల దర్యాప్తులో నిర్లక్ష్యం, సరైన ఫోరెన్సిక్ పరిశీలన లేకపోవడం బయటపడ్డాయి. ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసు ఉన్న వన్యప్రాణి అక్రమ రవాణా నెట్వర్క్ ప్రధాన సూత్రధారి యాంగ్చెన్ లఖుంపా ఇటీవలె సిక్కిం బార్డర్లో అరెస్టు అయ్యాడు. మధ్యప్రదేశ్లో పులులను చంపి.. వాటి చర్మం, గోళ్లు పళ్లు.. అక్రమ రవాణా చేసిన అభియోగాలు అతనిపై ఉన్నాయి. సంరక్షణవాదులు(Conservationists) వ్యవస్థలోనే లోపాలు ఉన్నాయని, సంస్కరణలు లేకపోతే మరణాలు కొనసాగుతాయని హెచ్చరిస్తున్నారు. మద్యప్రదేశ్ ప్రభుత్వం మాత్రం.. ప్రతి పులి మరణాన్ని సీరియస్గా తీసుకుంటామని, నిపుణుల బృందాలు దర్యాప్తు చేస్తున్నాయని ఒక్క మాటతో తేల్చేస్తోంది. -
వాట్ యాన్ ఐడియా..! యువతకు సాంకేతికతో భావోద్వేగ సందేశం..
ఏఐ సాంకేతికతను ఎన్ని రకాలుగా వాడేస్తున్నారంటే..ఇలా కూడా ఉపయోగించొచ్చా అనేలా అబ్బురపరుస్తున్నాయి ఆ ఆలోచనలు. టెక్నాలజీతో మంచి సందేశాన్నిస్తూ ప్రభావితం చేయడం గురించి విన్నారా. అదే నేర్పిస్తుంది చైనా. టెక్నాలజీని విపరీతంగా వాడే డ్రాగన్ దేశం ఓ సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టి.. అందర్నీ తనవైపుకి తిప్పుకుంది. ప్రస్తుతం యువత కెరీర్ ఫస్ట్ పెళ్లి, పిల్లలు, ఆ తర్వాత అంటోంది. దాంతో పరిస్థితి ఏ విధంగా తయారైందో అందరికి తెలిసిందే. ఇది కరెక్ట్ కాదని ఎంతోమంది మేధావులు, మానసిక నిపుణులు చెబుతున్నా.. యువత అందుకు ససేమరి నో అనే చెబుతోంది. అలాంటి యువతను చాకచక్యంగా మార్గంలో పెట్టేందుకు డ్రాగన్ కంట్రీ ఏఐ టెక్నాలజీతో భావోద్వేగ సందేశంతో పిలుపునిస్తూ..యువతరాన్ని ప్రభావితం చేసే పనిలో పడింది. ఏం చేస్తోందంటే..ఏం లేదండి..ఏఐ కృత్రిమ మేధస్సుతో రూపొందించిన ఆన్లైన్ వీడియోలతో బలమైన భావోద్వేగ సందేశాలతో యువత దృష్టిని ఆకర్షించే పనిలో పడింది. ఏఐ జనరేటెడ్ మహిళలు యువతను సరైన వయసుకి వివాహం చేసుకోవాలని పిలుపునిస్తూ రకరకాల వీడియోలను వైరల్ చేస్తోంది. వివాహం, కుటుంబానికి సంబంధించిన నిర్ణయాల్లో యువతకు స్పష్టమైన అవగాహన ఉండాలనే బలమైన సందేశాన్ని అందిస్తోంది. ఈ వీడియోల్లో మధ్య వయస్కురాలైన ఒంటిరి మహిళ తాను పెళ్లి చేసుకోకపోవడం, పిల్లలను కనకపోవడం పట్ల విచారం చేస్తున్న వీడియోలను పోస్ట్ చేస్తూ..యూత్ని ఆ అంశాలపై ఆలోచనత్మాక దృష్టిని అందిస్తోంది. అంతేగాదు ఆ వీడియోల్లో ఆస్పత్రి లాంటి వాతావరణంలో మహిళలు ఏడుస్తున్నట్లు చిత్రీకరించాయి. తాము ఒంటరితనంతో విలపిస్తున్నామని, యంగ్గా ఉన్నప్పుడూ తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల తమ జీవితాలు దుఃఖమయంగా మారాయంటూ రికార్డు చేసిన వీడియోలు యువతకు సరైన దృక్పథం తోపాటు సరైన దిశలో నడిపించేలా ప్రభావితం చేస్తున్నాయి. సరైన వయసులో పెళ్లి చేసుకోకపోతే.. వృద్ధాప్య జీవితం ఎంత భారంగా దయనీయంగా ఉంటుందో కళ్లకుకట్టినట్లు చూపిస్తూ..యువతను మేల్కొపేందుకు ప్రయత్నిస్తున్నాయి. అంతేగాదు ఆ ఆ వీడియోలో వివేకవంతమైన మార్పు వైపుకి మొగ్గు చూపేలా ప్రోత్సహిస్తున్నాయి. డబుల్ ఇన్కమ్, పిల్లలు లేని జీవితం అవసనా దశనను ఎంత దుర్భరంగా మారుస్తోంది కనువిప్పు కలిగేలా చేసి.. యువతకు కుటుంబం, పెళ్లి వంటి వాటికి ప్రాముఖ్యతనిచ్చి, మంచి నిర్ణయం తీసుకునేలా ఆ సాంకేతిక వీడియోలు బలమైన సందేశాన్నిస్తుండటం విశేషం. ఒకరకంగా చైనా సరికొత్త సందేశాత్మక ధోరణి.. సాంకేతికతను మంచి దృక్పథానికి ఎలా వాడాలనేది హైలెట్ చేసింది కదూ..!.(చదవండి: ఎకో ఫ్రెండ్లీ వాటర్ ఏటీఎం..! బాధ్యతయుతమైన పర్యాటకానికి కేరాఫ్గా..) -
ఓడియమ్మ.. ఫ్లాష్ ఉమెన్!
ఫలానా కేసును.. గంటల్లోనే చేధించిన ఖాకీలు.. అంటూ అత్యంత అరుదుగా చూస్తుంటాం. అదే ఒక కేసును గంటలోనే చేధిస్తే ఎలా ఉంటుంది?.. అదీ ఒక మహిళా ఆఫీసర్ ఆ పని చేస్తే!. అయితే.. పాపం అలాంటి సందర్భంలో ఆ సూపర్ ఉమెన్ను అభినందించాల్సిందిపోయి.. ‘ఒడియమ్మ.. ఫ్లాష్ ఉమెన్’ అంటూ ఎగతాళి చేసేస్తోంది సోషల్ మీడియా..‘‘మేడమ్.. ఇది స్క్రిప్ట్ కాదు కాదా.. ఎందుకంటే సీఐడీ(హిందీ క్రైమ్ టీవీ సిరీస్) కూడా ఇంత ఫాస్ట్గా కేసును సాల్వ్ చేయలేదేమో’’ అంటూ అనుమానాలతో పాకిస్థాన్కు చెందిన మహిళా ఎస్పీని నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. లాహోర్ ఎస్పీ షెహర్బానో నఖ్వీ.. ఈ పేరుతో గతంలోనూ నెట్టింట బాగా వైరల్ అయ్యింది. కిందటి ఏడాది.. దుస్తులపై అరబిక్ ప్రింట్ ఉండడంతో ఒక మహిళపై మూక దాడి ప్రయత్నం జరిగింది. అయితే సీన్లోకి ఎంట్రీ ఇచ్చి.. అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించి బాధితురాలిని ఆ మూక నుంచి కాపాడి లాహోర్ లేడీ సింగంగా గుర్తింపు పొందింది నఖ్వీ. ఆ సమయంలో నెట్టింట ఆమెపై ప్రశంసలు కురిశాయి. అయితే..ఆవిడను ఇప్పుడు ట్రోల్ చేయడానికి కారణం లేకపోలేదు. ఏఆర్వై న్యూస్ ప్రకారం.. ఎస్పీ నఖ్వీ ఓ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూకి హాజరైంది. ఆ సమయంలో.. మధ్యలో ఉండగానే ఆమెకు ఒక ఫోన్ కాల్ రాగా లిఫ్ట్ చేసి.. ‘‘ఖుర్రం జీ.. ఎక్కడున్నారు... వాళ్లను పట్టుకున్నారా? మంచిది’’ అంటూ మళ్లీ వస్తానంటూ హడావిడిగా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ మధ్యలో టైంని బ్రేక్ ప్రకటించారు సదరు పాడ్కాస్ట్ వ్యాఖ్యాత.గంట సేపటి తర్వాత తిరిగి వచ్చాక.. ఆమె జరిగిందో పాడ్కాస్ట్లో వివరించారు. డిఫెన్స్ ఫేస్ ఏలో ఒక హత్య జరిగిందని.. ఆ కేసును చేధించడం కోసమే వెళ్లానని అన్నారామె. ‘‘డబ్బు కోసం ఇద్దరు స్నేహితులు గొడవ పడ్డారు. ఈ క్రమంలో ఒకడు మరొకడిని చంపేశాడు. ఆ తర్వాత బాధిత కుటుంబాన్ని బంధించాడు. ఈ విషయం బంధువుల ద్వారా పోలీసులు తెలుసుకున్నారు. నాకు సమాచారం ఇచ్చారు. మేం అక్కడికి వెళ్లి.. ఆ హంతకుడ్ని పట్టుకుని ఆ కుటుంబాన్ని సేఫ్గా విడిపించాను. అందులో ఓ చిన్నారి కూడా ఉంది.. అని తెలిపారు. ఆ వీడియో కాస్త నెట్టింట వైరల్ అయ్యింది..కానీ, ఆమె చెప్పేది గతంలో ఆమెను పొగిడిన వాళ్లు కూడా నమ్మలేకపోతున్నారు. అంత దూరం.. అదీ అంత స్పీడ్గా వెళ్లి ఎలా కేసును సాల్వ్ చేశారంటూ ఆమెను ట్రోలింగ్ చేస్తున్నారు. ఏసీపీ ప్రద్యుమన్(సీఐబీ సిరీస్ క్యారెక్టర్) కూడా ఈ కేసును చూసి సుత్తితో తలబద్ధలు కొట్టుకుంటాడేమో అంటూ వెటకారం ప్రదర్శించాడు. ఈ స్క్రిప్ట్ రాసింది ఎవరు? అని ఒక యూజర్.. కిడ్నీ టచింగ్ యాక్టింగ్.. అని మరో యూజర్ ఇలా ఎవరికి తోచినట్లు వాళ్లు ట్రోలింగ్ చేస్తున్నారు ఆ లేడీ సింగాన్ని.. کسی مہذب معاشرے میں ایک پولیس افسر یہ ناٹک کرتی تو اُسے نا صرف برطرف کیا جاتا بلکہ جیل ہو جاتی ! ایک گھنٹے میں FIR نہیں لکھی جاتی اس نے نا صرف قاتل پکڑ لیا وجہ قتل اور ساری کہانی میڈیا پر بتا دی عدالتیں جس کام میں سالوں لگا دیتی ہیں اس نے ایک گھنٹے میں کر دیا ۔۔ واہ دی دی واہ pic.twitter.com/1loxSxQGWV— AliZai Vlogs (@alizaihere) December 21, 2025 -
చైనాలో మరో అద్భుతం..
బీజింగ్: చైనా మరో అడుగు ముందుకేసి అద్భుతం సృష్టించింది. ప్రపంచంలోనే అతి పొడవైన ఎక్స్ప్రెస్వే సొరంగాన్ని ప్రజా రవాణా కోసం అందుబాటులోకి తెచ్చింది. ఈ సొరంగం ద్వారా 7 గంటల ప్రయాణాన్ని ఇప్పుడు కేవలం 20 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.డ్రాగన్ దేశం చైనాలో ప్రపంచంలోనే అతి పొడవైన ఎక్స్ప్రెస్వే సొరంగం ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. 22.13 కిలోమీటర్ల పొడవుతో ప్రపంచంలోనే అతి పొడవైన ఎక్స్ప్రెస్వే సొరంగం టియాన్షాన్ షెంగ్లీ టన్నెల్ డిసెంబర్ 26 శుక్రవారం అధికారికంగా ట్రాఫిక్కు ప్రారంభించారు. ఇది వాయువ్య చైనాలోని జిన్జియాంగ్ ఉయ్గుర్ అటానమస్ రీజియన్లోని సెంట్రల్ టియాన్షాన్ పర్వతాలను దాటి, గతంలో కొన్ని గంటలు పట్టే పర్వత ప్రయాణాన్ని కేవలం 20 నిమిషాలకు తగ్గిస్తుంది.22.13 kilometers! China just opened the world’s longest highway tunnel across a mountain range to traffic in Xinjiang.China named the tunnel Tianshan Victory. Why? Because it cuts through 16 geofracture zones and is without doubt a world marvel of engineering. pic.twitter.com/FGM34fyqia— Li Zexin 李泽欣 (@XH_Lee23) December 26, 2025 ఇదిలా ఉండగా.. చైనా శుక్రవారమే మరో ఎక్స్ప్రెస్వేను కూడా ప్రారంభించింది. ఉత్తర, దక్షిణ జిన్జియాంగ్లోని పట్టణ సముదాయాలను కలిపే మరొక ముఖ్యమైన సహాయక సొరంగం G0711 ఉరుంకి-యులి ఎక్స్ప్రెస్వే కూడా అందుబాటులోకి తెచ్చింది. ఈ సొరంగం చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్స్లోని టియాన్షాన్ పర్వత శ్రేణిలో ఉంది. ఇది రెండు సమాంతర గొట్టాలుగా రూపొందించబడింది. ఒక్కొక్కటి రెండు లేన్ల ట్రాఫిక్ను కలిగి ఉంటాయి. ఇది ఉత్తర జిన్జియాంగ్లోని ఉరుంకిని దక్షిణాన యులికి కలిపే ఉరుంకి-యులి ఎక్స్ప్రెస్వేలో భాగం. ఈ సొరంగం 3,000 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో నిర్మించబడింది. సొరంగం ప్రారంభంతో గతంలో సుమారు ఏడు గంటలు పట్టే ప్రయాణానికి ఇప్పుడు 20 నిమిషాల్లోనే చేరుకునే అవకాశం ఉంటుంది. The Urumqi-Yuli Expressway officially opens to traffic!At its heart lies the world’s longest expressway tunnel. At 22 kilometers, it turns a 3-hour mountain drive into 20 minutes.A major leap in connectivity for Xinjiang.🛣 pic.twitter.com/jNMoRm2qvU— Mao Ning 毛宁 (@SpoxCHN_MaoNing) December 26, 2025The Tianshan Victory Tunnel opened to full traffic today. Spanning 22.13 km, it is the world's longest highway tunnel. The driving time from Ürümqi to Korla has been reduced from seven hours to 3.5 hours. Traveling in #Xinjiang has become significantly more convenient.#China… pic.twitter.com/fUWIHPZNRC— China Bro (@chinalittlebro6) December 26, 2025 -
పది అంతస్తులపైనుంచి జారి కిటికీకి వేలాడి : మొత్తానికి
పది అంతస్తుల పైనుంచి కిందపడితే..వామ్మో ఎముకలు ముక్కలు ముక్కలు అవ్వాల్సిందే. అస్సలు ఆ ఊహే వెన్నులో వణుకి పుట్టిస్తుంది కదా. అసలు ఎంత ఎత్తునుంచి కిందికి చూడాలంటేనే మామూలు మనుషులకి గుండెల్లో గుబులు. అయితే అంత ఎత్తునుంచి జారిపడిన 57 వ్యక్తి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఎలా అంటే...గుజరాత్లోని సూరత్ని జహంగీర్పురా ప్రాంతంలోని టైమ్స్ గెలాక్సీ నివాస సముదాయంలో మంగళవారం ఈ సంఘటన జరిగింది. 57 ఏళ్ల నితిన్ ఆదియా ఒక ఎత్తైన భవనంలోని తన 10వ అంతస్తు అపార్ట్మెంట్ నుండి పొరపాటున జారిపడి పోయాడు. అపార్ట్మెంట్లోని కిటికీ దగ్గర విశ్రాంతి తీసుకుంటుండగా బ్యాలెన్స్ కోల్పోయి జారిపడ్డాడు. అయితే మధ్యలోనే మిరాకిల్ జరిగింది. పడిపోతున్న క్రమంలో ఎనిమిదో అంతస్తులోని కిటికీ వెలుపల అమర్చిన ఇనుప గ్రిల్కి చిక్కుకున్నాడు. ఆ మెటల్ విండో గ్రిల్కి ఒక కాలు చిక్కుకుంది. ఒకవైపు బాధ, మరోవైపు బాధతో దాదాపు గంటసేపు అలా వేలాడాడు. ఇంతలో సంఘటనా స్థలానికి చేరుకున్న అత్యవసర సేవల సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది అతడిని జాగ్రత్తగా రక్షించారు. నేరుగా కిందపడకుండా ఉండటం వల్లే అతను తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడని అధికారులు తెలిపారు.Surat: Dramatic Rescue as 57-Year-Old Man Dangles from 8th Floor Window Grill After Fall from 10th Floor – Fire Brigade Saves Lifepic.twitter.com/s4yitzduXv— Ghar Ke Kalesh (@gharkekalesh) December 25, 2025 జహంగీర్పుర, పాలన్పూర్, అడాజన్ అనే మూడు స్టేషన్ల నుండి అగ్నిమాపక దళ బృందాలు హైడ్రాలిక్ కట్టర్లు,ప్రత్యేక పరికరాలతో మోహరించాయి. ఒక యూనిట్ భద్రతా వలయ కింద రక్షణగా ఉండగా, దిగువ ప్రాంతాన్ని ఇతర బృందాలు 10-8 అంతస్తుల నుండి భవనంలోకి ప్రవేశించి ఒకేసారి చిక్కుకున్న వ్యక్తిని మృత్యు ముఖం నుంచి కాపాడాయి. ఏదైనా అనుకోనిది జరిగితే ఎలా అనే ఆందోళనతో స్థానికులు కూడా పెద్ద ఎత్తున అక్కడకు చేరి సహాయక చర్యల్లో పాల్గొనడం విశేషం. తీవ్ర ఉద్రిక్తత మధ్య సాగిన ఈ ఆపరేషన్పై ఒక అగ్నిమాపక అధికారి మాట్లాడుతూ, ఇది కష్టంగా, చాకచక్యంగా అతణ్ని రక్షించాం అన్నారు. తొలుత బాధితుడిని 10వ అంతస్తు నుండి తాళ్లు ,సేఫ్టీ బెల్ట్తో కట్టేసాం..అతని అతని శరీర బరువుకు మద్దతు లభించింది. అలా గ్రిల్లో చిక్కుకున్న కాలుని విడిపించి , ఆదియను సురక్షితంగా కిందకు దించి చికిత్స కోసం గురుకృప ఆసుపత్రికి తరలించామని చెప్పారు. కాలికి గాయాలు అయినప్పటికీ, పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డాడని వైద్యులు కూడా నిర్ధారించారు. ఈ రెస్క్యూకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అతణ్ణి రక్షించిన అధికారులను నెటిజన్లు కొనియాడారు. పలు బృందాలు సమన్వయంతో పెద్ద ప్రమాదాన్ని నివారించారంటూ అధికారులను అభినందించారు. -
అమ్మ కెనడియన్, నాన్న ఇటలీ..పెరిగింది ఇండియాలో..!
కొన్ని కథలు చాల గమ్మత్తుగా, ఆశ్చర్యంగా ఉంటాయి. ఎక్కడో పుట్టి, ఎక్కడ పెరిగి..విభిన్న మనుషులను కలుస్తుంటాం. అది కెరీర్, లేదా ఉద్యోగం వల్ల అయినా. కానీ కొందరు విదేశీయలును పెళ్లాడి..మళ్లీ వాళ్ల పిల్లల్ను మరో దేశంలో పెంచిన కొన్ని స్టోరీలు వింటుంటే ఆశ్చర్యం వేస్తుంటుంది. అలాంటి సరదా స్టోరీనే షేర్ చేసింది ఓ విదేశీయురాలు. ఇది ఆమె కథనే. కానీ రెండు వేర్వురు దేశాలకు చెందని పేరెంట్స్కి పుట్టిన ఆమె చిరుప్రాయంలో మన భరత గడ్డపై అడుగుపెట్టిన కథ ఆద్యంతం మనసుకు హత్తకునేలా అందంగా ఉంది. బాలికి చెందిన సంగీతకారిణి బియాంక నీడు తన బాల్యమంతా భారత్లోనే సాగిందంటూ తన స్టోరీని షేర్ చేసుకుంది. ఆ పోస్ట్లో నీడు ఇలా రాసుకొచ్చారు. కెనడియన్ తల్లి, ఇటాలియన్ తండ్రికి జన్మిచిన ఆమె మూడు నెలల వయసుకుకే భారత్కి వచ్చినట్లు పేర్కొంది. 16వ ప్రాయం వరకు ఇక్కడే ఉండి ఆ తర్వాత లండన్, బాలికి వెళ్లినట్లు తెలిపింది. తన తల్లిదండ్రులు క్యాథీ నీడు, రాబర్టో నీడు భారత్లోని కలుసుకున్నారని, ఇక్కడే ప్రేమలో పడ్డారని చెప్పుకొచ్చింది.చివరికి ఇక్కడే ఒక ఇల్లు కొనుక్కుని స్థిరనివాసం ఉన్నారని చెప్పుకొచ్చింది. తన చైల్డ్హుడ్ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ..తన బాల్యంలో అజిల్ భవన్లో జరుపుకున్న హోలిపండుగ గురించి చెప్పుకొచ్చింది. ప్రతి ఏడాది అక్కడకు వెళ్లి హోలీ ఆడటం బాగా నచ్చేదని, అక్కడే పార్టీలు కూడా చేసుకునేవాళ్లమని తెలిపింది. అంతేగాదు ఈ పోస్ట్కి తాను తల్లిదండ్రులతో భారత్లో గడిపిన కొన్ని బాల్య జ్ఞాపకాలకు సంబంధించిన వీడియోని కూడా జత చేసి మరి పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ని చూసి చాలామంది నెటిజన్లు అద్భుతం, మీరు చాలా గ్రేట్ మీకు చాలా భాషలు వచ్చి ఉండొచ్చే అంటూ కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు.జీవితమే మారిపోయింది.. కాగా, బియాంకా నీడు తాను భారత్లో పెరగడం వల్ల తన లైఫ్ అద్భుతంగా మారిందని కూడా పేర్కొంది. భారత్లోని సంభాషణలు కారణంగా అప్యాయత, ఉదారతలు నేర్చుకున్నా, అలాగే ఆతిథ్యం అంటే ఏంటో తెలసుకున్నానని అంటోంది. అంతేగాదు అందరితో కలుపుగోలుగా ఉండాలో తెలిసింది. జీవితం అంటే మనం ఒక్కరమే కాదని, అందరితో కలిసి ఉండటం అని తెలిసింది అంటోంది. చివరగా పోస్ట్లో తాను ఇక్కడ పెరగడం వల్లే ప్రపంచంలో ఎలా జీవించాలో, ఇంటిని ఎలా చక్కదిద్దుకోవాలో తెలుసుకున్నా అని సంతోషంగా చెప్పుకొచ్చింది. ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవ్వడమే కాదు, నెటిజన్ల హృదయాలను కొల్లగొట్టింది కూడా. View this post on Instagram A post shared by Bianca Nieddu (@biancanieddu) (చదవండి: పిల్లలు విలువలు నేర్చుకోవాలంటే భారత్ బెస్ట్..! ఓ విదేశీ తల్లి భావోద్వేగ పోస్ట్) -
చరిత్ర సృష్టించిన జోష్ టంగ్
ఇంగ్లండ్ యువ పేసర్ జోష్ టంగ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియాతో బాక్సింగ్ డే టెస్టులో ఐదు వికెట్లతో చెలరేగిన ఈ కుడిచేతి వాటం బౌలర్.. అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.ప్రసిద్ధ మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG)లో 21వ శతాబ్దంలో టెస్టులలో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన ఇంగ్లండ్ తొలి బౌలర్గా 28 ఏళ్ల టంగ్ నిలిచాడు. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ (Ashes 2025-26)లో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు ఇంగ్లండ్.. ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.3-0తో సిరీస్ సొంతం చేసుకున్న ఆసీస్ ఇందులో భాగంగా పెర్త్, బ్రిస్బేన్, అడిలైడ్ టెస్టుల్లో ఆసీస్ చేతిలో చిత్తుగా ఓడిన ఇంగ్లండ్.. ఇప్పటికే సిరీస్ను కోల్పోయింది. ఈ క్రమంలో శుక్రవారం మెల్బోర్న్ వేదికగా నాలుగో టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్.. తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్కు దిగిన కంగారూ జట్టు.. తొలి ఇన్నింగ్స్లో 45.2 ఓవర్లలో 152 పరుగులు చేసి ఆలౌట్ అయింది.ఆసీస్ను నామమాత్రపు స్కోరుకు పరిమితం చేయడంలో జోష్ టంగ్దే ముఖ్య భూమిక. టాపార్డర్లో ఓపెనర్ జేక్ వెదరాల్డ్ (10), వన్డౌన్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ (6) రూపంలో కీలక వికెట్లు తీసిన టంగ్... అద్బుతమైన డెలివరీతో కెప్టెన్ స్టీవ్ స్మిత్ (9) రూపంలో మరో డేంజరస్ బ్యాటర్ను కూడా పెవిలియన్కు పంపాడు.WHAT A DELIVERY!Steve Smith looks on puzzled after this peach from Josh Tongue.#Ashes | #PlayoftheDay | @nrmainsurance pic.twitter.com/NpkEgGxOQR— cricket.com.au (@cricketcomau) December 26, 2025తొలి ఇంగ్లండ్ బౌలర్గా అదే విధంగా లోయర్ ఆర్డర్లో పట్టుదలగా నిలబడ్డ ఆసీస్ పేసర్ మైకేల్ నాసర్ (35)ను కూడా అవుట్ చేసిన టంగ్.. ఆఖరిగా స్కాట్ బోలాండ్ను డకౌట్ చేసి తన ఖాతాలో ఐదో వికెట్ జమచేసుకున్నాడు. తద్వారా ఎంసీజీలో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసి.. 21వ శతాబ్దంలో ఈ ఘనత సాధించిన తొలి ఇంగ్లండ్ బౌలర్గా చరిత్రకెక్కాడు.ఇంగ్లండ్ ఇతర బౌలర్లలో గస్ అట్కిన్సన్ రెండు, బ్రైడన్ కార్స్, కెప్టెన్ బెన్ స్టోక్స్ తలా ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్కు ఆసీస్ బౌలర్లు చుక్కలు చూపించారు. ఫలితంగా 29.5 ఓవర్లలో కేవలం 110 పరుగులు చేసిన ఇంగ్లండ ఆలౌట్ అయింది. దీంతో ఆసీస్కు తొలి ఇన్నింగ్స్లో 42 పరుగుల ఆధిక్యం లభించింది. ఆసీస్ బౌలర్లలో నాసర్ నాలుగు, బోలాండ్ మూడు, స్టార్క్ రెండు, గ్రీన్ ఒక వికెట్ పడగొట్టారు.చదవండి: Virat Kohli: మళ్లీ సెంచరీ చేస్తాడనుకుంటే.. -
అబ్బాయిలంటే ఇష్టంలేదు, ఇద్దరు యువతుల పెళ్లి
పెళ్లి అంటే పందిళ్లు, సందళ్లు తప్పెట్లు.. తాళాలు... తలంబ్రాలు ఉండాలి. అంతేనా కట్నాలు, కానుకలు, ప్రీవెడ్డింగ్ షూట్లు ఘనంగా జరగాలి. కానీ ఒక జంట మాత్రం అక్షరాలా గ్యాస్ స్టవ్ సాక్షిగా పెళ్లి చేసుకున్నారు. ఎక్కడో తెలియాలంటే ఈ కథనాన్ని చదవాల్సిందే.పెళ్లిసందడి, హంగూ ఆర్బాటం, మూడు ముళ్లు లాంటి హడావిడి లేకుండానే బిహార్లో ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకున్న ఘటన నెట్టింట సందడిగా మారింది. అబ్బాయిలంటే ఇష్టంలేకనే తాము ఈ పెళ్లి చేసుకున్నామని ఆ యువతులు ప్రకటించారు. బిహార్లోని సుపాల్లో, ఇద్దరు యువతులు ప్రత్యేకంగా వివాహ వేడుకను నిర్వహించారు. మగాళ్లపై ఆసక్తిలేకనే ఇద్దరూ ఒకరికొకరు తోడుగా నిలవాలని నిర్ణయించుకున్నారు. ఒకరి చేయి మరొకరు పట్టుకుని కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. గ్యాస్ స్టవ్ను సాక్షిగా ఏడడుగులు వేయడం విశేషం.ఇదీ చదవండి: ఐటీ ఫ్రెషర్లకు ఇన్ఫోసిస్ క్రిస్మస్ కానుక In Supaul, two young women held a unique marriage ceremony. Both revealed that they have no interest in boys, so they decided to hold hands and live together. They took seven rounds considering the gas stove as witness.pic.twitter.com/rwVaMFjxrJ— Ghar Ke Kalesh (@gharkekalesh) December 24, 2025 -
'భారత్ చాలా నేర్పించింది'..! ఓ విదేశీ తల్లి భావోద్వేగ పోస్ట్
చాలామంది విదేశీయలు మన మాతృగడ్డపై మమకారం పెంచుకుని ఇక్కడే శాశ్వత నివాసం ఏర్పరుచుకుంటున్నారు. ముఖ్యంగా ఇక్కడ సంస్కృతి, ఆచార వ్యవహారాలకు ఫిదా అంటూ ఇక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకుంటున్నారు. పైగా వాళ్ల సతంతి కూడా ఇక్కడ పెరిగితేనే మంచిదని భావిస్తుండటం విశేషం. ఆ కోవలోకి తాజాగా మరో రష్యన్ తల్లి వచ్చి చేరింది. ఆ పిల్లల తల్లి పోస్ట్లో పేర్కొన్న విషయాలు వింటుంటే మన గడ్డపై మమకారం, ప్రేమ రెట్టింపు అవవ్వడమే కాదు భారతీయులుగా గర్వం ఉప్పొంగుతుంది కూడా. మరి ఇంతకీ ఆమె ఆ పోస్ట్లో ఏం చెప్పుకొచ్చిందంటే..బెంగళూరులో నివశిస్తున్న ఈ రష్యన్ మహిళ తాను తన భర్త భారతదేశాన్ని కేవలం పర్యాటక ప్రదేశంగా కాకుండా శాశ్వత నివాసంగా ఎందుకు మార్చుకున్నామో వెల్లడించింది పోస్ట్లో. ఈ గడ్డపై ఉంటేనే తన పిల్లలు మంచిగా పెరుగుతారని, ఇది పిల్లల పెంపకానికి అత్యంత అనుకూలమైన వాతావరణమని, విశాల దృక్పథంతో వ్యవహరించడం అలవడుతుందని అటోంది. ఈ భారతదేశం తమ కుటుంబానికి ఎన్నో నేర్పించిందంటూ ఇలా వివరించింది. వేగాన్ని తగ్గించడం దగ్గర నుంచి తొందరపడకుండా ఉండటం, మాటకు స్పదించడం, శ్రద్ధగా వినడం వంటివి తమ కుటుంబం నేర్చుకుందని తెలిపింది. అలాగే తాము ఇక్కడ భారతీయులను తాము ఎంతగానో ప్రేమిస్తున్నామని, వారి కపటం లేని మనసు, దయ, ప్రతిఫలాప్రేక్ష లేని హెల్పింగ్ నేచర్ మమ్మల్ని ఎంతగానో కట్టిపడేశాయని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా పొరుగువారితో సత్సంబంధాలు చాలా బాగుంటాయని, ఇక్కడ చిరునవ్వే అందరి కామన్భాష అని అంటోంది. అందువల్లే తన పిల్లలను ఇక్కడే పెంచాలని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యానంటోంది ఈ తల్లి. ఈ బహుళ సంస్కృతి, బహుభాషా వాతావరణంలో ఎన్నో నేర్చుకోగలరు, ముఖ్యంగా గౌరవించడం, చిన్న చిన్న వాటికి ప్రశంసించడం వంటివి నేర్చుకుంటారని చెబుతోంది. ఈ వెచ్చని వాతావరణం ఎంజాయ్ చేయడం ఓ థ్రిల్, అలాగే ఏడాది పొడవునా కాలానుగుణ తాజా పండ్లను ఆస్వాదించడంలో ఓ మజా ఉందంటోంది. అందువల్లే తాము భారతదేశాన్ని తమ నివాస స్థలంగా మార్చుకున్నామంటూ పోస్ట్ని ముగించింది. అయితే నెటిజన్లు స్పందిస్తూ..మా భారత్కి స్వాగతం, మా మృతృభూమి చాలా అందమైనది, ఎవరినైనా తనలో ఇట్టే కలిపేసుకుంటుంది అని ఆమెకు సాదారంగా ఆహ్వానం పలుకుతూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Lifestyle (@yana.in.india) (చదవండి: సంపాదన కంటే అదే అత్యంత ముఖ్యం! వైరల్గా ఎన్ఆర్ఐ పోస్ట్) -
సంపాదన కంటే అదే అత్యంత ముఖ్యం ! వైరల్గా ఎన్ఆర్ఐ పోస్ట్
సంపాదన కంటే ప్రశాంతమైన జీవితం మంచిది అనే సూక్తులు వినడానికే బాగుంటాయి. నిజజీవితంలో కాస్త కష్టమే అంత ఈజీ కూడా కాదు. పోనీ అలాంటి సాహసం చేస్తే..సమాజంలో, బంధువుల్లో మన స్థాయి తక్కువుగా ఉంటే మనం తట్టుకున్నా.. మన కుటుంబసభ్యలు అందుకు సిద్ధంగా ఉంటారా అంటే సమాధానం దొరకడం చాలా కష్టం. కానీ నార్వేలో నివశిస్తున్న భారత యువకుడు అదే మంచిదంటూ తాను అనుభవ పూర్వకంగా తెలుసుకున్నా అంటూ పెట్టిన పోస్ట్ తెగ వైరల్ అవ్వడమే కాదు..అందర్నీ విపరీతంగా ఆకర్షించింది.అందులోనూ ఈ ఉరుకుల, పరుగుల జీవితంతో విసిగివేశారిన వారికి ఈ పోస్ట్ ఓ మంచి ఎనర్జిటిక్గా కనిపించింది. పైగా ఆయన ఏం చెబుతున్నాడో అంటూ ఆ వీడియోని అంతా ఆస్తక్తిగా చూసేశారు కూడా. ఇంతకీ ఈ నార్వే యుకుడు ఆ ఇన్స్టాగ్రామ్ వీడియో పోస్ట్లో ఏం చెప్పాడంటే..తన పేరు సచిన్ అని తాను నార్వేలో నివశిస్తున్నట్లు పేర్కొన్నాడు. తాను దాదాపు 35 దేశాలకు పైగా పర్యటించాక ఓ విషయాన్ని గ్రహించానానని అంటూ చెప్పుకుంటూ రావడం వీడియోలో చూడొచ్చు. జీవితానికి ఎల్లప్పుడూ డబ్బు అవసరం లేదని, జీవించడానికి కేవలం సమయమే కావలని అన్నాడు. ఇక్కడ నార్వేలో ఉద్యోగం మనిషి విలువను ప్రతిబింబించదని, కేవలం వాళ్లు మనుషులుగా చూడటం అత్యంత ప్రశంసించదగ్గ విషయమని అన్నాడు. అక్కడ జీతం, హోదా, జెండర్, ఎక్కడ నుంచి వచ్చారు వంటి వాటికి పెద్దగా విలువ ఇవ్వరని అన్నాడు. అక్కడ కుటుంబం, ఆరోగ్యం, అభిరుచులు, పర్యటనలు, మానసిక ప్రశాంతత తదితరాలే ముఖ్యమనే విషయం ఇక్కడకు వచ్చాక తప్పక గుర్తిస్తారని అన్నాడు. కేవలం జీవన నాణ్యత, భద్రత, శాంతి అనేవి ఎంత ముఖ్యమో కచ్చితంగా తెలుస్తుందంటున్నాడు. అలాగని నార్వే ఏదో గొప్పదని చెప్పుకురావడం తన ఉద్దేశ్యం మాత్రం కాదని, కేవలం నిజంగా మనం కోసం మనం జీవించే జీవితాన్ని ఎంచుకోవడానికి మించిన ప్రశాంతత మరొకటి ఉండదని తెలియజేసేందకేనని పోస్ట్లో పేర్కొన్నాడు. అంతేగాదు నార్వేలో పని అనేది జీవితంలో ఒక భాగమేనని, అక్కడ ప్రజలు కుటుంబం, పర్యటనలు, అభిరుచులపై పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తారని చెప్పాడు. అంతేగాదు ఇక్కడ ప్రజలు మనుగడ కోసం జీవించరని, పూర్తి స్థాయిలో జీవితాన్ని ఆస్వాదిస్తారని ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు సచిన్. అయితే నెటిజన్లు ఈ పోస్ట్ని చూసి బ్రదర్ మీరు చాలా అదృష్టవంతులు అని కొందరు, అలాంటి మంచి భారతీయ కమ్యూనిటీ ఉంటే కచ్చితంగా మేము అక్కడకి వచ్చేస్తాం అంటూ కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Sachin | Life in Norway 🇳🇴 | Ship to Shore 🚢 (@sachinoffshore) (చదవండి: IAS Officer Anu Garg: ఎవరీ అను గర్గ్..? అత్యున్నత పదవిని చేపట్టిన తొలి మహిళగా..) -
చైనా మరో దుశ్చర్య: ట్రావెల్ వ్లాగర్కి 15 గంటల నరకం, ఎందుకంటే
అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో అంతర్భాగం అన్నందుకు ఒక భారతీయ ట్రావెల్ వ్లాగర్-కమ్-యూట్యూబర్ను చైనాలో 15 గంటల పాటు నిర్బంధించిన వైనం మరోసారి ఆందోళన రేపింది. నవంబర్ 16న జరిగిన సంఘటనను వివరిస్తూ డిసెంబర్ 23న ఇన్స్టాగ్రామ్లో రీల్ యూట్యూబ్లో బాధితుడు ఒక సుదీర్ఘ వీడియోను పోస్ట్ చేశాడు. కేవలం తన బాధను పంచుకోవాలనే ఉద్దేశమే తప్ప ఇది ఎవరి ఒత్తిడిమీద పోస్ట్ చేసినవీడియో కాదనీ స్పష్టం చేశాడు. దీంతో ఇది వైరల్గామారింది. అరుణాచల్ ప్రదేశ్కు చెందిన ఒక మహిళను షాంఘై పుడాంగ్ విమానాశ్రయంలో దాదాపు 18 గంటలు నిర్బంధించిన ఘటన, తీవ్ర నిరసనలువ్యక్తం చేసిన కొద్ది రోజులకే ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. అసలు విషయం ఏమిటంటే.ఆన్లైన్లో ఆన్ రోడ్ ఇండియన్గా ప్రసిద్ధి చెందిన భారతీయ ట్రావెల్ వ్లాగర్ అనంత్ మిట్టల్ చైనాలో తనకెదురైన భయానక అనుభవాన్ని సోషల్మీడియాలో షేర్ చేశాడు. చైనాలో గతంలో నిర్బంధించబడిన అరుణాచల్ ప్రదేశ్ పౌరుడికి సంఘీభావం తెలిపే వీడియోను పోస్ట్ చేయడంతోనే తనను చైనా అధికారులు దాదాపు 15 గంటల పాటు నిర్బంధించారని ఆరోపించాడు. ఈ వీడియోపై యూట్యూబర్ క్షమాపణలు కూడా చెప్పాడు.నవంబర్ 16న మిట్టల్ చైనాలోకి ప్రవేశించిన కొద్దిసేపటికే ఈ సంఘటన జరిగింది. ఎపుడు మామూలుగా ప్రశ్నలిడిగి, క్లియర్ చేసే అధికారులు ఈ సారి ఇమ్మిగ్రేషన్ వద్ద తనను ఆపివేసినట్లు మిట్టల్ చెప్పారు. పాస్పోర్ట్పై వార్నింగ్ స్టిక్కర్ అంటించి, ఆ తరువాత పలువురు విదేశీ పౌరులను ఉంచిన నిర్బంధ ప్రాంతానికి తీసుకెళ్లారని తన సుదీర్ఘ వీడియోలో ఆరోపించాడు. భారతదేశంలోని ఈశాన్య ప్రాంతంలో అరుణాచల్ ప్రదేశ్తో తనకున్న భావోద్వేగ సంబంధం మూడేళ్లు అక్కడ చదువుకోవడంతో ఏర్పడిందనీ , చైనాలో ఒక అరుణాచల్ పౌరుడిని నిర్బంధించారని విన్న తర్వాత తాను తీవ్రంగా ప్రభావితమై దాని గురించి మాట్లాడిన వీడియో తన నిర్బంధానికి కారణమైందన్నాడు.దాదాపు రెండు గంటల పాటు ఏ అధికారి కూడా అతనితో మాట్లాడలేదు. తరువాత, అతన్ని మరొక గదిలోకి తీసుకెళ్లారు, అక్కడ ఏవీ రికార్డ్ చేయకుండా ఉండటానికి ఫోన్, కెమెరాను స్వాధీనం చేసుకున్న అధికారులు తన ఐప్యాడ్ను పట్టించుకోలేదని తెలిపాడు. తన నిర్బంధంపై పదే పదే అడిగినా సమాచారం ఇవ్వడానికి నిరాకరించమే కాదు నీళ్లు, ఆహారం కూడా ఇవ్వలేదు. ఒక్కసారి మాత్రమే కొద్దిగా నీళ్లిచ్చారు. అలా 12-13 గంటలయ్యేసరికి తనలో భయం మొదలైంది. దాదాపు 15 గంటల తర్వాత, ఒక చైనా అధికారి తిరిగి వచ్చి ప్రక్రియ పూర్తయిందని ,వెంటనే దేశం విడిచి వెళ్ళవలసి వచ్చిందని హెచ్చరించారు. ఇక దీనిపై ఎటువంటి వివరణ ఇవ్వలేదని అతను చెప్పాడు. ఎట్టకేలకు తాను సురక్షితంగా భారతదేశానికి తిరిగి వచ్చానని పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by On Road Indian (@onroadindian) తానొక సాధారణ ట్రావెల్ వ్లాగర్ అని, తనకు ఎలాంటి రాజకీయ సంబంధాలు లేవని, చైనాలో తన స్టార్టప్ రోజుల నుండి స్నేహితులు ఉన్నారని కూడా అన్నారు. "నాకు ఎవరిపైనా ద్వేషం లేదు. నేను అందర్నీ ప్రేమిస్తున్నాను, నా కళ్ళ ద్వారా ఈ ప్రపంచాన్ని మీతో పంచుకుంటాను. నాకు ఏ రాజకీయ ఎజెండాతో సంబంధం లేదు" అని ఇన్స్టాగ్రామ్లో రాశాడు. తనకు ఎటువంటి రాజకీయ అనుబంధాలు లేవని, అధికారులను రెచ్చగొట్టాలని ఎప్పుడూ ఉద్దేశించలేదని మిట్టల్ వాపోయాడు. ఇది రాస్తున్నంతసేపు కూడా తాను ఏడుస్తూనే ఉన్నాని కూడా రాసుకొచ్చాడు.భారత - చైనా రాయబార కార్యాలయాలు తాను అనుభవించిన భయాన్ని అర్థం చేసుకుంటాయని తాను ఆశిస్తున్నానని మిట్టల్ అన్నారు. ఇదీ చదవండి: చిన్నారిపై పిట్బుల్ దాడి, ఎలా విడిపించాడో చూడండి వైరల్ వీడియోకాగా గతంలో చైనాలో మహిళను నిర్బంధించిన ఘటనను విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ఖండించింది. భారతీయ వ్యక్తిని ఏకపక్షంగా నిర్బంధించడం తగదని హితవు చెప్పింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్ "భారతదేశంలో అంతర్భాగం" అని విదేశాంగ మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటించింది. చైనా ఎంత తిరస్కరించినా ఈ సత్యాన్ని మార్చలేమని కూడా స్పష్టం చేసింది. తాజా సంఘటనపై భారత అధికారులు ఇప్పటివరకు స్పందించలేదు. ఇదీ చదవండి: నువ్వా బాసూ నీతులు చెప్పేది.. శివాజీపై నెటిజన్లు ఫైర్ -
చిన్నారిపై పిట్బుల్ దాడి, ఎలా విడిపించాడో చూడండి వైరల్ వీడియో
పెట్ యానిమల్స్ని పెంచుకోవడమే కాదు.వాటిని సరియైన పద్ధతిల్లో నియంత్రించడం కూడా తెలిసి ఉండాలి యజమానులకు. మరీ ముఖ్యంగా పిట్ బుల్ లాంటి పెంపుడు కుక్కల్ని పెంచుకునేవారు మరింత అప్రమత్తంగా ఉండాలి. లేదంటే చిన్న పిల్లలు, వృద్ధులు ప్రమాదంలో పడతారు. ఫలితంగా యజమానులకు కూడా చట్టపరమైన తిప్పలు తప్పవు. ఈ వీడియో చూస్తే మీరు కూడా ఇదే కరెక్ట్ అంటారు.న్యూయార్క్ వీధుల్లో ఒక పిట్ బుల్ ఒక పసిపిల్లవాడిపై దాడి చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఒక్క క్షణం ఆ పసివాడి తల్లి గుండ్లో రైళ్లు పరుగెట్టిందింది. కానీ అదృష్టవశాత్తూ పక్కనే ఉన్న వారు స్పందించడంతో ఆ పసివాడికి ప్రాణా పాయం తప్పింది.A pit bull attacked a toddler on the streets of New York, but luckily a bystander was quick enough to choke the dog before it could do further harm the child.😳 pic.twitter.com/Yh6btEwVVm— Rain Drops Media (@Raindropsmedia1) December 23, 2025ట్విటర్లో ఇప్పటికే 70 లక్షలకుపైగా వ్యూస్ దక్కించుకున్న ఈ వీడియో ప్రకారం పిట్ బుల్ డాగ్ పిల్లవాడి కాలును గట్టిగా దొరకబుచ్చుకుంది. నలుగురు వ్యక్తులు ఎంత తీవ్రంగా ప్రయత్నించినా కూడా, ఎంతకీ వదలకుండా పట్టుపట్టింది. దీంతో వారిలో ఒక వ్యక్తి చాలా చాకచక్యంగా వ్యవహరించాడు. ఆ కుక్కను గొంతు పట్టుకుని గాలి ఆడకుండా చేయడంతో అది నోటి తెరిచి పట్టువీడింది. దీంతో మరింత గాయం కాకుండా పిల్లవాడి కాలును తప్పించుకున్నారు. దీనిపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. కుక్క కరచినపుడు ఎలా ప్రవర్తించాలో, కచ్చితంగా అదే చేశాడు. హీరో అంటూ అతని చర్యను కొనియాడటం విశేషం. ఇదీ చదవండి: నువ్వా బాసూ నీతులు చెప్పేది.. శివాజీపై నెటిజన్లు ఫైర్ -
హిప్పో జర తప్పుకో, ఈ సెక్యూరిటీ ధైర్యానికి సలాం!
-
నటాషా పూనవాలా అరుదైన పింక్ డైమండ్ రింగ్..ఇన్ని ప్రత్యేకతలా?
బిలియనీర్ అదర్ పూనవాలా భార్య నటాషా పూనవాలా వ్యాపారవేత్త, ఫ్యాషన్ ఐకాన్ కూడా. ఆమె హై-ఎండ్ డిజైనర్ దుస్తులు, అత్యంత లగ్జరీ ఆభరణాలనే ధరిస్తూ ప్రత్యేకంగా కనిపిస్తారామె. ఇటీవల ఆభరణాల నిపుణుడు, ఫ్యాషన్ కంటెంట్ సృష్టికర్త ధ్రుమిత్ మెరులియా ఆమె అరుదైన పింక్ డైమండ్ రింగ్పై ఫోకస్ పెట్టడమే గాక దాని ప్రత్యేకత, వెనకున్న ఆసక్తికర కథనుకూడా వివరించారు. View this post on Instagram A post shared by Natasha Poonawalla (@natasha.poonawalla) ఆ రాణికి చెందినది..ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన వీడియోలో ఈ ఉంగరాన్ని మేరీ-థెరెస్ పింక్ డైమండ్ రింగ్ అని పిలుస్తారు అని ధ్రుమిత్ వెల్లడించారు. ఈ ఉంగరం ఫ్రాన్సక్వీన్ మేరీ ఆంటోయినెట్కు చెందినదని తెలిపారు. ఆ ఉంగరం కేంద్ర భాగం పది క్యారెట్ల విలువ చేసే పర్పుల్ అండ్ పింక్ డైమండ్ మోడిఫైడ్ కైట్ బ్రిలియంట్-కట్ డైమండ్. దీని చుట్టూ గుండ్రని 17 వజ్రాలతో అలకరించి నల్లటి ప్లాటినం బ్యాండ్లో ఉంది. అంతేగాదు ఆ మధ్యలోని వజ్రం 18వ శతాబ్దం కాలం నాటిదట. దీనిని క్వీన్ మేరీ ఆంటోయినెట్ కుమార్తె డచెస్ మేరీ-థెరిస్ డి'అంగోలేమ్ వారసత్వంగా పొందారు. ఈ ఉంగరం 1996లో విక్రయించబడే వరకు చాలా ఏళ్లు రాజకుటుంబం ఆభరణాల కలెక్షన్స్లో ఉండేదట.అంత ఖరీదా..?అయితే ప్రఖ్యాత ఆభరణాల డిజైనర్ జోయెల్ ఆర్థర్ రోసెంతల్ వజ్రం కోసం కొత్త బ్యాండ్ను రూపొందించారు. జూన్ 17, 2025న, ఈ ఉంగరాన్ని న్యూయార్క్లోని క్రిస్టీస్ మాగ్నిఫిసెంట్ జ్యువెల్స్ సేల్లో దాదాపు రూ.125 కోట్లు పైనే అమ్ముడుపోయిందట. ఫ్రెంచ్ హిస్టరీలోనే అత్యధిక ధర పలికిన ఉంగరంగా వార్తల్లో నిలిచింది కూడా. కాగా, బిలియనీర్ అదర్ పూనవాలాను వివాహం చేసుకున్న నటాషా ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారు అయిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. అంతేగాదు ఆమె విద్య, ఆరోగ్య సంరక్షణ కోసం విల్లూ పూనవల్లా ఛారిటబుల్ ఫౌండేషన్కు కూడా అధ్యక్షత వహిస్తున్నారు. అలాగే నెదర్లాండ్స్లోని పూనావాలా సైన్స్ పార్క్ డైరెక్టర్గా, బ్రిటిష్ ఏషియన్ చిల్డ్రన్స్ ప్రొటెక్షన్ ఫండ్ చైర్గా కూడా వ్యవహరిస్తున్నారు. View this post on Instagram A post shared by Dhrumit Merulia (@dhrumitmerulia) (చదవండి: వ్యాపారంలో 14 కోట్లు నష్టపోయి..చివరికి ర్యాపిడో డ్రైవర్గా! మనసు మెలిపెట్టే భావోద్వేగ కథ) -
ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయాడు!
కార్లూన్లతో పాపులర్ అయిన పిల్లల కామెడీషో నికెలోడియన్ లో నటించిన అలనాటి నటుడు ఇపుడు దీనమైన స్థితిలో కనిపించాడు. కాలిఫోర్నియా వీధుల్లో 36 ఏళ్ల టైలర్ చేజ్ కాలిఫోర్నియా వీధుల్లో నివసిస్తున్నట్లు కనిపించడం అభిమానులలో, సహనటులలో ఆందోళన రేకెత్తించింది. తమకెంతో సుపరిచితమైన బాల నటుడిని ఇలా హృదయ విదారకమైన రీతిలో ఇంత క్లిష్ట పరిస్థితుల్లో చూడటం చూసి ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా బాల నటులు ఎదుర్కొంటున్న ఆర్థిక కష్టాలు, మత్తుమందులు, మానసిక ఆరోగ్యం సవాళ్లపై చర్చకు దారి తీసింది. 2004-2007 మధ్య నెడ్ డిక్లాసిఫైడ్ స్కూల్ సర్వైవల్ గైడ్లో మార్టిన్ క్వెర్లీ పాత్ర పోషించాడు చేజ్. లాస్ ఏంజిల్స్లోని రివర్సైడ్లో సెప్టెంబర్లో కనిపించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోలో మాసిపోయిన లాస్ ఏంజిల్స్ రైడర్స్ పోలో షర్ట్ జీన్స్ ధరించి కనిపించాడు. జీన్స్ ప్యాంట్ ఎగదోసుకుంటూ,మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తిలా కనిపించడం, అభిమానులు దిగ్భ్రాంతికి గురిచేసింది. అపుడు వీడియో తీసిన వ్యక్తి అతని గురించి ప్రస్తావించినపుడు తాను నికెలోడియన్ బాల నటుడిని అని చేజ్ బదులిచ్చాడు. ఈ వీడియో వైరల్ కావడంతో చేజ్ పేరు మీద GoFundMe పేజీని ఏర్పాటు చేసి 1,200 డాలర్లకు పైగా నిధులను సేకరించారు. అయితే ఈ విరాళాలను చేజ్ తల్లి నిరాకరించారు. విరాళాల సేకరణను నిలిపివేయాలని కోరారు. టైలర్కు డబ్బు కాదు వైద్య సహాయం అవసరమని ఆమె స్పష్టం చేశారు. ఎన్నోసార్లు చాలా ఫోన్లు కొనిచ్చా. కానీ ఒకటి, రెండు రోజుల్లో వాటిని పోగొట్టుకుంటాడు. వైద్య ఖర్చుల కోసం మనీ మేనేజ్ చేయడం అతనికి తెలియదంటూ వివరించారు. ఈ సందర్భంగా గోఫండ్మీ ద్వారా విరాళాల సేకరణను అభినందించారు. కానీ నిజానికి ఈ డబ్బుతో లాభం లేదన్నారు.మరోవైపు చేజ్ పరిస్థితి గురించి అతని మాజీ సహనటులు డెవాన్ వెర్క్హైజర్, లిండ్సే షా . డేనియల్ కర్టిస్ లీ కూడా నెడ్స్ డిక్లాసిఫైడ్ పాడ్కాస్ట్ సర్వైవల్ గైడ్ ఎపిసోడ్ సందర్భంగా బహిరంగంగా చర్చించారు. తమ సహనటుడి ప్రస్తుత పరిస్థితిపై విచారం వ్యక్తం చేశారు. టైలర్కు మళ్లీ మంచి రోజులు రావాలని ఆశించారు. కాగా చేజ్ 1989 సెప్టెంబర్ 6 న అరిజోనాలో జన్మించాడు. 2000ల ప్రారంభంలో బాలనటుడుగా తన నటనతో ఆకట్టుకున్నాడు. 2004 నుండి 2007 వరకు ‘నెడ్స్ డిక్లాసిఫైడ్ స్కూల్ సర్వైవల్ గైడ్’లో మార్టిన్ క్వెర్లీ పాత్రను పోషించాడు. వీటితోపాటు గుడ్ టైమ్ మాక్స్ (2007), ఎవ్రీబడీ హేట్స్ క్రిస్ (2005)లలో కూడా కనిపించాడు.ఇదీ చదవండి: రూ. 8.10 కోట్ల మోసం.. తుపాకీతో కాల్చుకున్న మాజీ ఐజీ Former Nickelodeon child stars are having a rough one pic.twitter.com/qN95SrxOmJ— 𓅃 (@FalconryFinance) December 21, 2025 -
ఆ ప్యాలెస్లో డెస్టినేషన్ వెడ్డింగ్ ఇంత ఖరీదా..?
డెస్టినేషన్ వివాహాలు గురించి తెలిసిందే. సంపన్నులు, సెలబ్రిటీలు, ప్రముఖులు ఇలాంటి విలాసవంతమైన వివాహాలు చేసుకుంటుంటారు. విలాసవంతమైన ప్యాలెస్లు, రాజుల కాలంనాటి ఫేమస్ భవనాల్లో అలనాటి చారిత్రక దర్పానికి తగ్గట్టు అంగరంగ వైభవవంగా వివాహాలు చేసుకుంటుంటారు. అలాంటి ప్రఖ్యాతిగాంచిన డెస్టినేషన్ వెడ్డింగ్ భవంతులలో ఒకటి ఈ రాజస్థాన్ ఉదయ్పూర్లోని ప్యాలెస్. ఇక్కడ ఒక్క రాత్రికి బస ఎంత అవుతుందో తెలిస్తే కంగుతింటారు. ఈ ప్రముఖ రాజస్థాన్ ప్యాలెస్లో లగ్జరీ రిసార్ట్లు, వాటి హంగుఆర్భాటాలు పర్యాటకుల్ని మంత్రముగ్దుల్ని చేస్తాయి. ఇలాంటి ప్యాలెస్లలో పరిణీతి చోప్రా-రాఘవ్ చద్దా నుంచి వెంకట దత్త సాయి పివీ సింధు -నేత్ర మంతెన-వంశీ గదిరాజు వంటి ఎందరో జంటలు పెళ్లి బంధంతో ఇక్కడే ఒక్కటయ్యారు. ఎప్పటికీ గుర్తుండిపోయేలా చారిత్రకనేపథ్యం ఉన్న ఇలాంటి ప్యాలెస్లను ఎంచుకుంటారు చాలామంది జంటలు. ఈ డిసెంబర్22తో వెంకట దత్త సాయి పీవీ సింధుల దంపతులకు పెళ్లై ఏడాది అవుతున్న నేపథ్యంలో వారి వివాహానికి వేదిక అయిన ఉదయ్పూర్ ప్యాలెస్ విశేషాల గురించి సవివరంగా తెలుసుకుందామా.పీవీ సింధు రాఫెల్స్ ఉదయ్పూర్ సూట్లో వివాహం చేసుకున్నారు. యూరోపియన్ వాస్తుశిల్పాల మిశ్రమాన్ని కలిగి ఉన్న ఈ రిసార్ట్ తన కస్టమర్లకు మంచి ఆధునిక సౌకర్యాలను అందిస్తోంది. మహారాణా ప్రతాప్ విమానాశ్రయం నుంచి కేవలం 20 నిమిషాల దూరంలో ఉంటుంది ఈ ప్యాలెస్. ఇక్కడ ఉదయ్ సాగర్ సరస్సు మీదుగా పడవ ప్రయాణం అత్యంత ఆహ్లాదభరితంగా ఉంటుంది. దాని చుట్టూ ఉన్న పచ్చదనం చూపు మరల్చనివ్వని విధంగా కట్టిపడేస్తుంది. అలాగే భోజన ప్రియుల కోసం చక్కటి వంటకాల నిధిని, ఫిట్నెస్ ఔత్సాహికుల కోసం మంచి వెల్నెస్ చికిత్సలు, ఆయుర్వేద సెషన్ వంటి సకల సౌకర్యాలను అందిస్తుంది. ముఖ్యంగా మౌంటైన్ బైకింగ్, వాల్ క్లైంబింగ్, షూటింగ్, ఆర్చరీ తదితర ఎన్నో వినోదాలను నిలయం. దాదాపు 21 ఎకరాలకు పైగా విస్తరించి ఉన్న ఈ ప్యాలస్ మర్చిపోలేని మధురానుభూతిని పంచి ఇస్తుందని అక్కడ నిర్వాహకులు చెబుతున్నారు. అంతేకాదండోయ్ పురాతనమైన మహాదేవ్ ఆలయాన్ని సందర్శించడం కోసం ట్రెక్కింగ్ అనుభవాన్ని కూడా అందిస్తుందట.'స్టే' చేయడానికి అయ్యే ఖర్చు..పీవీ సింధు-వెంకటసాయి దత్త రాఫెల్స్ ప్రెసిడెన్షియల్ సూట్ని బుక్ చేసుకున్నారు. అది ఏకంగా దగ్గర దగ్గర ఒక్క రాత్రికి బస రూ. 7 లక్షలు పైనే అవుతుందట. ఇంత లగ్జరీలోనే కాదు ఓ మోస్తారు ధరలో లభించే రిసార్టుల కూడా ఉన్నాయట.లేక్షోర్ సిగ్నేచర్ - ద్వీపంలో లేని గది, రాత్రికి రూ. 57,000ఫ్లెమింగో సిగ్నేచర్ రూమ్, తోటతో పాటు, ట్విన్ లేదా కింగ్ బెడ్తో, రాత్రికి రూ. 77,000ఫ్లెమింగో సిగ్నేచర్ రూమ్, బాల్కనీతో పాటు, ట్విన్ లేదా కింగ్ బెడ్తో, రాత్రికి రూ. 81,000ఫ్లెమింగో సిగ్నేచర్ రూమ్, ప్లంజ్ పూల్తో పాటు, ట్విన్ లేదా కింగ్ బెడ్తో, రాత్రికి రూ. 87,000రాఫెల్స్ లేక్షోర్ మనోర్ - ద్వీపంలో లేని రిసార్ట్, రాత్రికి రూ. 97,000రాఫెల్స్ మనోర్ సూట్, రాత్రికి రూ. 1,17,000రాఫెల్స్ ఒయాసిస్ సూట్, రాత్రికి రూ. 1,37,000రాఫెల్స్ ప్రెసిడెన్షియల్ సూట్, రాత్రికి రూ. 7,57,000అయితే, బుకింగ్ తేదీని అనుసరించి గదులు, సూట్ల లభ్యతలో ధరలు మార్పు ఉంటుందట. View this post on Instagram A post shared by Raffles Udaipur (@rafflesudaipur) (చదవండి: Worlds Most Expensive Saree: అత్యంత ఖరీదైన 'పట్టుచీర'..! ఆద్యంతం ఆసక్తికరం..అద్భుతం..) -
పాక్ బౌలర్కు ఇచ్చిపడేసిన వైభవ్ సూర్యవంశీ
భారత్, పాకిస్తాన్ మధ్య ఇవాళ (డిసెంబర్ 21) జరిగిన అండర్-19 పురుషుల ఆసియా కప్ ఫైనల్లో ఉద్రికత్త చోటు చేసుకుంది. ఈ మ్యాచ్లో 348 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తుండగా భారత బ్యాటర్లను పాక్ బౌలర్ అలీ రజా రెచ్చగొట్టాడు. తొలుత భారత కెప్టెన్ ఆయుశ్ మాత్రేను టార్గెట్ చేసిన రజా.. ఆతర్వాత చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీని గెలికాడు. ఇద్దరూ తగు రీతిలో రజాకు సమాధానం చెప్పడంతో వాతావరణం వేడెక్కింది.ఏమన్నావురా..?భారీ లక్ష్య ఛేదనలో భారత కెప్టెన్ ఆయుశ్ మాత్రే పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతున్నాడు. ఈ దశలో అలీ రజా అద్బుతమైన బంతితో మాత్రేను ఔట్ చేశాడు. ఔట్ చేసిన ఆనందంలో రజా మాత్రే పట్ల దురుసుగా స్పందించాడు. ఇక చాలు వెళ్లు అన్నట్లు హావభావాలు ప్రదర్శించాడు. దీంతో చిర్రెత్తిపోయిన మాత్రే ఏమన్నావురా అన్నట్లు రజా మీదికి వెళ్లాడు. దీంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.वैभव सूर्यवंशी पाकिस्तानियों को उनकी औकात बताते हुए ।#INDvsPAK #vaibhavsuryavanshi pic.twitter.com/NpoPl5hBFA— सनातन सर्वोच्च🚩 मोदी का परिवार (@sanatani58) December 21, 2025నీ స్థాయి నా కాళ్ల కింద..!మాత్రేని గెలికి చీవాట్లు తిన్న రజా వైభవ్ సూర్యవంశీతో కూడా అలాగే ప్రవర్తించాడు. సిక్సర్తో ఛేదన ప్రారంభించిన సూర్యవంశీని (10 బంతుల్లో 26; ఫోర్, 3 సిక్సర్లు) ఔట్ చేసిన రజా ఓవరాక్షన్ చేశాడు. సూర్యవంశీకి ఫియరీ సెండాఫ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. రజా ఓవరాక్షన్కు సూర్యవంశీ కూడా తగు రీతిలో బదులిచ్చాడు. నీ స్థాయి నా కాళ్ల కింద అన్నట్లు రజాకు బుద్ది చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరలవుతుంది.టీమిండియాకు పరాభవం348 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో టీమిండియా తడబడింది. ఆది నుంచే క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ ఓటమిని కొని తెచ్చుకుంది. 26.2 ఓవర్లలో 156 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. ఫలితంగా 191 పరుగుల భారీ తేడాతో పరాజయంపాలైంది. పాక్ బౌలర్లలో అలీ రజా 4 వికెట్లు తీసి భారత పతనాన్ని శాశించాడు. మొహమ్మద్ సయ్యమ్, అబ్దుల్ సుభాన్, సుజైఫా ఎహసాన్ తలో 2 వికెట్లు తీసి టీమిండియాను దెబ్బకొట్టారు.భారత్ తరఫున చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ (10 బంతుల్లో 26; ఫోర్, 3 సిక్సర్లు) సిక్సర్తో ఛేదనను ప్రారంభించినా కొద్ది సేపటికే ఔటయ్యాడు. అంతకుముందే కెప్టెన్ ఆయుశ్ మాత్రే (2), స్టార్ ప్లేయర్ ఆరోన్ జార్జ్ (16) పెవిలియన్కు చేరారు. 86 పరుగులకే 6 వికెట్లు కోల్పోవడంతో ఆదిలోనే భారత ఓటమి ఖరారైంది.ఆఖర్లో దీపేశ్ దేవేంద్రన్ (36) కంటితుడుపుగా బ్యాట్ ఝులిపించాడు. భారత ఇన్నింగ్స్లో ఇతనే టాప్ స్కోరర్. మిగతా ఆటగాళ్లలో విహాన్ మల్హోత్రా 7, వేదాంత్ త్రివేది 9, అభిగ్యాన్ కుందు 13, కనిష్క్ చౌహాన్ 9, ఖిలన్ పటేల్ 19, హెనిల్ పటేల్ 6 పరుగులు చేసి ఔటయ్యారు.అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. ఓపెనర్ సమీర్ మిన్హాస్ (113 బంతుల్లో 172; 17 ఫోర్లు, 9 సిక్సర్లు) భారీ శతకంతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది. అహ్మద్ హుసేన్ (56), ఉస్మాన్ ఖాన్ (35) పర్వాలేదనిపించారు. ఓ దశలో పాక్ 400 పరుగుల మార్కు దాటుందని అనిపించింది. అయితే భారత బౌలర్లు పుంజుకోవడంతో పాక్ ఆఖర్లో త్వరితగతిన 5 వికెట్లు కోల్పోయింది. ఇదే సమయంలో స్కోర్ కూడా నెమ్మదించింది.భారత బౌలర్లలో దీపేశ్ దేవేంద్రన్ 3 వికెట్లు పడగొట్టగా.. హెనిల్ పటేల్, ఖిలన్ పటేల్ తలో 2, కనిష్క్ చౌహాన్ ఓ వికెట్ తీశారు. కాగా, ఈ టోర్నీ సెమీఫైనల్లో భారత్ శ్రీలంకను.. పాక్ బంగ్లాదేశ్ను ఓడించి ఫైనల్స్కు చేరాయి. గత ఎడిషన్లోనూ ఫైనల్లోనే ఓడిన (బంగ్లాదేశ్) భారత్ మరోసారి రన్నరప్తోనే సరిపెట్టుకుంది. -
మెస్సీ మోజులో 'మన హీరో'పై చిన్నచూపు..!
అంతర్జాతీయ ఫుట్బాల్ స్టార్ లియోనల్ మెస్సీ ఇటీవల (డిసెంబర్ 13-15) గోట్ టూర్ పేరిట భారత్లో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ టూర్ ఆధ్యాంతం అద్భుతంగా సాగింది. మెస్సీని చూసేందుకు లక్షల సంఖ్యలో అభిమానులు ఎగబడ్డారు. ఈ పర్యటనలో మెస్సీ కోల్కతా, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ నగరాలను సందర్శించాడు. ప్రతి చోటా మెస్సీకి అనూహ్యమైన ఆదరణ లభించింది. కోల్కతాలో 70 అడుగుల మెస్సీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మొత్తంగా చూస్తే భారత్లో మెస్సీ పర్యటన విజయవంతమైంది.ఇంతవరకు అంతా బాగానే ఉంది. అయితే మెస్సీ పర్యటనలో భారత స్టార్ ఫుట్బాలర్ సునీల్ ఛెత్రీకి అవమానం జరిగిందని ఫుట్బాల్ ప్రేమికులు వాపోతున్నారు. ముంబైలో జరిగిన ప్రొగ్రాంలో నిర్వహకులు ఛెత్రీ పట్ల అవమానకరంగా ప్రవర్తించారని వారంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ముంబైలోని జరిగిన కార్యక్రమంలో నిర్వహకులు ఛెత్రీని అస్సలు పట్టించుకోలేదు.వీఐపీలంతా మెస్సీతో ఫోటోలకు ఫోజులిస్తుంటే, ఛెత్రీ మాత్రం తన వారి మధ్యే అనామకుడిలా స్టేజీ కింద నిల్చుండిపోయాడు. అంతర్జాతీయ స్థాయిలో నాలుగో టాప్ గోల్ స్కోరర్ అయిన ఛెత్రీని నిర్వహకులు మెస్సీ ఫోటో ఉన్న టీ షర్ట్ వేయించి మరింత అవమానించారు. అంతర్జాతీయ స్థాయిలో మెస్సీది, ఛెత్రీది ఇంచుమించు ఒకే స్థాయి. అయినా మెస్సీ ఏదో గొప్ప అయినట్లు అతని ఫోటోను మన హీరో ధరించిన టీ షర్ట్పై వేయించడం అవమానకరమని చాలామంది ఫీలవుతున్నారు.ముంబై ప్రొగ్రామ్లో వీఐపీలంతా స్టేజీపై అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటే ఛెత్రీ స్టేజీ కింద సామాన్యుడిలా అటు ఇటూ తిరుగుతున్న వీడియో సోషల్మీడియాలో వైరలైంది. ఈ వీడియోను చూసిన వారంతా ఛెత్రీకి అతని స్థాయి గౌరవం దక్కలేదని అభిప్రాయపడుతున్నారు. మెస్సీ గొప్ప ఆటగాడే, అయినా మన దేశంలో ఫుట్బాల్ ఉనికిని కాపాడిన ఛెత్రీకి కూడా సమాంతర గౌరవం లభించాలన్నది వారి భావన. విదేశీయుల మోజులో పడి 20 ఏళ్లు భారత్లో ఫుట్బాల్ వ్యాప్తికి కృషి చేసిన మన హీరోని చిన్నచూపు చూడటం సమంజసం కాదని ప్రతి ఒక్కరి అభిప్రాయం.నిర్వహకులు, పాలకులు సరైన గౌరవాన్ని ఇవ్వకపోయినా మెస్సీ మాత్రం ఛెత్రీ పట్ల చాలా మర్యాదగా ప్రవర్తించి అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. మెస్సీ స్వయంగా ఛెత్రీని పలకరించి, హత్తుకుని, తన సంతకం చేసిన అర్జెంటీనా జెర్సీని బహుమతిగా ఇచ్చాడు. ఈ దృశ్యం భారత ఫుట్బాల్ అభిమానులకు చిరకాలం గుర్తుండిపోతుంది. భారత ఫుట్బాల్ దిగ్గజాన్ని నిర్వహకులు పట్టించుకోకపోయినా మెస్సీ మాత్రం సరైన రీతిలో గౌరవించాడని ఫ్యాన్స్ అంటున్నారు. కాగా, అంతర్జాతీయ స్థాయిలో అత్యధిక గోల్స్ చేసిన ఫుట్బాలర్ల జాబితాలో ఛెత్రీ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో లాంటి దిగ్గజాలు మాత్రమే ఛెత్రీ కంటే కాస్త ముందున్నారు. 2024 జూన్లో అంతర్జాతీయ ఫుట్బాల్కు రిటైర్మెంట్ ప్రకటించిన ఛెత్రీ 151 మ్యాచ్ల్లో 94 గోల్స్ చేసి ఆల్టైమ్ హయ్యెస్ట్ గోల్ చేసిన ఆటగాళ్లలో ముఖ్యుడిగా నిలిచాడు. -
ఎయిరిండియా టికెట్కు రూ. 4 లక్షలు వెచ్చించా, ఫుడ్ వ్లాగర్ వింత అనుభవం
బిజినెస్క్లాస్లో దర్జాగా ప్రయాణించాలని చాలా విమాన ప్రయాణికులు ఆశపడతారు. ముఖ్యంగా అంతర్జాతీయ విమానాలలో లాంగ్ జర్నీ చేసేవారికి సౌకర్యవంతమైన సీట్లు చక్కటి ప్లేస్, ఆహారం ఇలా కొన్ని ప్రత్యేక సదుపాయాలుంటాయి. ఇది కేవలం సుదూర గమ్యస్థానాన్ని చేరుకోవడం గురించి మాత్రమే కాదు మంచి ప్రయాణ అనుభవాన్ని కూడా ఇస్తుందని భావిస్తారు. ముఖ్యంగా ఢిల్లీ-శాన్ ఫ్రాన్సిస్కోవంటి అల్ట్రా-లాంగ్ రూట్లలో సౌకర్యాలపై అంచనాలు సహజంగానే ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే టికెట్ల ధర లక్షల్లో ఉంటుంది. అందులోనూ ఎయిరిండియా లాంటి విమానాలలో టికెట్ కోసం లక్షలు ఖర్చు చేసినప్పుడు, ఎవరైనా ప్రీమియం ఫీచర్స్నే ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఫుడ్ బ్లాగర్ తనకెదురైన చేదు అనుభవాన్ని గురించి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్గా మారింది.పాపులర్ ఫుడ్ వ్లాగర్ పవిత్రా కౌర్ ఢిల్లీ-శాన్ ఫ్రాన్సిస్కో వెళ్లేందుకు ఎయిరిండియా బిజినెస్ క్లాస్లో ప్రయాణించింది. ఈ ప్రయాణంలో తనకెదురైన అనుభవాన్ని చెప్పుకొచ్చింది తన యూట్యూబ్ వీడియోలో. ఈ జర్నీకి 10- 6 రేటింగ్ ఇచ్చింది. వరుసగా తన అనుభవానాలకు ఏకరువు పెట్టింది. తొలుగ ఫస్ట్ సీట్ అస్సలు బాగాలేదని, తరువాత రెండో సీట్లోకి మారినా కూడా పరిస్థితిలాగే ఉందని నిరాశను వ్యక్తం చేసింది. ఇందు కోసమా తాన టికెట్కు రూ. 4లక్షలకు ఖర్చు చేశానని వాపోయింది.విమానంలో ఆహారంపైకూడా పెదవి విరించింది. మంచి నిద్ర తరువాత బాగాతిందామని ఎదురుచూస్తే నిరాశే మిగిలిందనీ, మెయిన్ కోర్స్ తప్ప మిగతాది అస్సలు బాగాలేదని తెలిపింది. డెజర్ట్స్ అయితే దారణమని వ్యాఖ్యానించింది. అయితే డ్రింక్స్, షాంపైన్ మాత్రం బావున్నాయని చెప్పింది. అంతేకాదు తాను తినకపోవడం ఇదే మొదటిసారి అయిఉండాలని కూడా తెలిపింది. ఇక శుభ్రత మరొక బాధాకరమైన విషయమని పేర్కొంది. తన సీటుపై అక్షరాలా రెండు చచ్చిన ఈగల్ని చూశానని ఫిర్యాదు చేసింది. ఎందుకు? ఇలా అని ప్రశ్నించింది.అయితే దటీజ్ ఎయిరిండియా అంటూనే కంఫర్ట్ పరంగా, సీట్లు, సౌకర్యవంతంగా ఉన్నాయని ఆమె అంగీకరించింది. బాగా నిద్రపోయానని వెల్లడించింది. తనకు వేరే మార్గం లేదని, అందుకే ఈ ఎయిరిండియావిమానంలో ప్రయాణించానని తెలిపింది. కానీ ఇన్ని ఫిర్యాదులున్నప్పటికీ ఎయిరిండియా ప్రయాణం అనుకున్నదానికంటే బావుంది అంటూ కితాబివ్వడం విశేషం. అయితే ఈ ఆరోపణలపై ఎయిరిండియా అధికారికంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. -
ఎంత ధైర్యం?.. పుతిన్ ముందే అలా చేస్తావా?
ప్రపంచంలో శక్తివంతమైన నేతల్లో వ్లాదిమిర్ పుతిన్ ఒకరు. ఆయన అలవాట్లు.. మేనరిజం.. ప్రోటోకాల్.. అన్నీ ఎంతో ప్రత్యేకంగానే ఉంటాయి. అలాంటిది ఆయన సమక్షంలో ఓ యువకుడు.. తన ప్రియురాలికి ప్రపోజ్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. మరి ఆ ప్రపోజల్కు ఆ యువతి ఏం చేసింది.. దానికి పుతిన్ రియాక్షన్ ఎలా ఉందో తెలుసుకోవాలని ఉందా?.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2025 ఏడాది ముగింపు నేపథ్యంతో.. విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆ సమయంలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. రిపోర్టర్లు పలు ప్రశ్నలు అడగ్గా.. దానికి పుతిన్ బదులిస్తూ వచ్చారు. ఈ క్రమంలో కిరిల్ బజానోవ్ అనే 23 ఏళ్ల యువ జర్నలిస్టు వంతు వచ్చింది. ‘నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను’ అని ప్లకార్డును పట్టుకున్న అతను.. పుతిన్ ముందే తన ప్రియురాలికి ప్రపోజ్ చేశాడు. ‘నా స్నేహితురాలు దీన్ని చూస్తోంది. ఓల్గా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా?. ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకో.. నేను నీకు ప్రపోజ్ చేస్తున్నా’ అని అన్నాడు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వులు చిందించారు. వెంటనే ఆ ప్రాంగణంలోని వారంతా చప్పట్లు కొట్టారు. ‘Vladimir Vladimirovich, Breaking News’ — host interrupted Putin‘She said yes’ — Kirill Bazhenov’s girlfriend accepted the proposalPreviously journalist proposed in the middle of the live Q&A pic.twitter.com/WI1PMftowG— RT (@RT_com) December 19, 2025అనంతరం అతడు.. రష్యాలో జీవన వ్యయం పెరగడంపై ఆందోళన వ్యక్తంచేశాడు. తాను, తన స్నేహితురాలు ఎనిమిదేళ్లుగా కలిసి ఉంటున్నామని అయితే, విస్తృత ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా పెళ్లి చేసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నట్లు పుతిన్ దృష్టికి తీసుకెళ్లాడు. ఇక, సమావేశం కొనసాగుతుండగా.. ప్రోగ్రామ్ హోస్ట్ కీలక ప్రకటన చేశారు. జర్నలిస్టు కిరిల్ బజానోవ్ ప్రపోజల్ను అతడి స్నేహితురాలు అంగీకరించినట్లు తెలిపారు. దీంతో పుతిన్తో సహా అక్కడున్న వారంతా ఆనందం వ్యక్తంచేస్తూ చప్పట్లు కొట్టారు. అయితే కిరిల్ లాంటి యువ కుటుంబాల ఆర్థిక పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసిన పుతిన్.. విరాళాల రూపంలో అయినా ఇలాంటి పెళ్లిళ్లకు సాయం అందించాలని పిలుపు ఇచ్చారు. ఈ సమయంలో తమ పెళ్లికి రావాలంటూ కిరిల్ రష్యా అధినేతను ఆహ్వానించగా.. ఆయన నుంచి ఎలాంటి బదులు రాలేదు. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. -
పాపం.. ఫుట్బాల్లా తన్నాడు..వైరల్ వీడియో
బెంగళూరులో జరిగిన అనూహ్య సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తల్లితో కలిసి ఆడుకుంటున్న పిల్లవాడిని ఒక వ్యక్తి అమాంతం తోసి వేసిన ఘటన నెట్టింట దిగ్భ్రాంతి రేపుతోంది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వీడియో వైరల్గా మారింది.డిసెంబర్ 14న ఆ బాలుడు నీవ్ జైన్ తన అమ్మమ్మ ఇంటి దగ్గర ఇతర పిల్లలతో ఆడుకుంటుండగా ఈ సంఘటన జరిగింది. త్యాగరాజనగర్ ప్రాంతంలోని ఒక వీధిలో ఐదేళ్ల బాలుడు తోటిపిల్లలతో ఆటుకుంటున్నాడు. తల్లి కూడా అక్కడే ఉంది. ఇంతలో వెనకనుంచి వ్యక్తి ఆ బాలుడిని గట్టిగా కాలితో తన్నాడు. ఊహించని పరిణామానికి బాలుడు బొక్కబోర్లా పడిపోయాడు.A five-year-old boy was allegedly assaulted by a passerby in Bengaluru’s #Thyagarajanagar area, with CCTV footage capturing the incident. Police arrested the accused, who was later released on bail, and further investigation is underway. #Bengaluru #Banashankari pic.twitter.com/eWeZpN9nIC— Madhuri Adnal (@madhuriadnal) December 19, 2025 ఈ సంఘటన సిసిటివిలో రికార్డైంది. బాలుడి తల్లి దీపిక జైన్ దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం, నిందితుడిని అరెస్ట్ చేశారు. తరువాత బెయిల్పై విడుదల చేసినట్లు పోలీసులు తెలిపారు.తదుపరి దర్యాప్తు జరుగుతోంది. తన కొడుకును "ఫుట్బాల్ లా" తన్నాడని, దీంతో కనుబొమ్మల వద్ద గాయం రక్త స్రావమైందని, కాళ్లు, చేతులకు కూడాగాయాలైనాయని తల్లి ఆరోపించింది. మరోవైపు నిందితుడిని అదే ప్రాంతానికి చెందిన రంజిత్గా గుర్తించారు. ఇతను మాజీ జిమ్ ట్రైనర్ కూడా అట. ఉద్యోగాన్ని వదిలేసినట్టు సమాచారం. నిందితుడు ఈ ప్రాంతంలో ప్రజలపై దాడి చేయడం, దుర్భాషలాడడం లాంటి చర్యలకు పాల్పడుతూ ఉంటాడట.ఇవీ చదవండి: ట్వీట్స్తో మోత మోగించిన ప్రధాని మోదీబెట్టింగ్ యాప్స్ : యూట్యూబర్ హై-ఎండ్ స్పోర్ట్స్ కార్లు చూసి ఈడీ షాక్! -
ట్రాఫిక్.. గీఫిక్.. జాన్తా నై!
రూల్స్ ఉండేవే బ్రేక్ చేయడానికి అన్న వాదన నుంచి పుట్టిన సిద్ధాంతం మనది. అందుకే ఎప్పుడు రూల్స్ గురించి మాట్లాడినా.. రాద్ధాంతం తప్పనిసరిగా ఉంటుంది. ఇక ట్రాఫిక్ రూల్స్ అంటారా.. ఇది మరీ విడ్డూరం. దేశంలో ట్రాఫిక్ రూల్స్ సక్రమంగా పాటిస్తూ అందరితో శభాష్ అనిపించుకున్న.. అందరూ కాకపోయినా ట్రాఫిక్ పోలీసుల మెప్పు పొందిన వారిని వేళ్ళపై లెక్కపెట్టవచ్చు. రూల్స్ పాటించడమంటేనే చేతకాని తనానికి నిదర్శనమని త్రికరణశుద్ధిగా నమ్ముతుంటాం. అందుకే ఎదుటి వారికి చెప్పేటందుకే రూల్స్ ఉన్నాయి.. డోంట్ కేర్ అంటూ ఏఎన్నార్ లెక్కన పాటలు పాడుకుంటూ నిర్లక్ష్యంగా తిరిగే వారే ఎక్కువ. ఏదైన రూల్ ఉందంటే అది రాజుగారి గదిలాంటిది. రాజుగారి గదిలోకి మాత్రం వెళ్లకండి అంటే.. కచ్చితంగా అందులోకే వెళ్లడం సగటు భారతీయుని నైజం. ఇదీ అంతే.. రూల్స్ అంటూ ఎవరైనా మాట్లాడితే.. ఆ చెప్పొచ్చావులే పేద్ద.. రూల్స్ అంట రూట్స్.. అని ఆరున్నొక్క రాగాల దీర్ఘం తీయడం మనకు అలవాటై పోయింది.గీ ట్రాపిక్ పురాణం పొద్దుపొద్దులా మాకెందుకు బై అంటే.. జర ఆగుండ్రి మరి.. మన సివిక్ సెన్స్ చూసి విదేశీయులే నోరెల్ల బెడ్తుండ్రంట. పుణెలో ఓ విదేశీయుడు మనోళ్లు ఫుట్పాత్ల మీదికెళ్లి మోటార్ బైకులు చెలాయిస్తూంటే వారిని ఆపి.. ఏందిది? అని అడుగుతున్న వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. అందుకే.. ఇక్కడే కాదు.. దేశంలో చాలా చోట్ల విదేశీయులు మన భారతీయుల ఉల్లం‘ఘనుల’ను చూసి.. అరే ఎంత దర్జాగా రూల్స్ వదిలేసి తిరుగుతుండ్రని నోళ్ళు నొక్కుకుంటుండ్రు. మన దేశ రాజధాని ఢిల్లీలో సైకిల్ తిరగాల్సిన చోట వాహనాలు హల్ చల్ చేస్తుంటే.. చూస్తున్న విదేశీయులు రంగప్రవేశం చేసి జనాలకు బాబూ దీన్ని బైసైకిల్ లేన్ అంటారు. ఇక్కడ కేవలం సైకిల్స్ తిరగాలి అంతేకానీ.. ఎడాపెడా పెద్ద వాహనాలు రాకండి అంటూ నిలబడి మరీ చెప్పడం ప్రారంభించారు.కొందరు వీరి మాటలు వింటున్నట్లు నటించినా.. మరి కొందరు బేఫికర్గా వారి మాటలు పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు. అరే మన దేశంలో ట్రాఫిక్ రూల్స్ గురించి విదేశీయులు అర్థం చేసుకుని ఇలా పాటించాలి బాబూ అంటున్నా.. వినకుండా వారు అలా చెబుతున్నందుకు విసుక్కొంటున్నారట. పాపం విదేశీయులకు మన థియరీ అర్థం కాలేదు. అరే వీరేందిర బై రూల్స్ అన్నాక ఫాలో కావాలి కదా. పనిగట్టుకుని మరీ రూల్స్ బ్రేక్ చేస్తే వీరికి మాత్రం ఒరిగేదేంటి? అని లోలోపల మదనపడుతున్నారట. విదేశీయులు మన భారతీయులకు ట్రాఫిక్ రూల్స్ చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.🚨 A foreigner is forcing riders to move out of footpath in Pune. 🙏 pic.twitter.com/XYIqB9AzVs— Indian Tech & Infra (@IndianTechGuide) December 19, 2025మనవాళ్ళదంతా ఎడ్డెమంటే తెడ్డెమనే రకం.. ఫర్ ఎగ్జాంపుల్.. వన్ వే ట్రాఫిక్ అన్నారనుకోండి.. సరిగ్గా అదే రూట్ లోనే బుల్లెట్ బండెక్కి వచ్చేస్తా పా అని పాటలు పాడుకుంటూ మరీ వెళుతుంటారు. పోలీసులు చూసి విజిల్ వేసినా.. పెద్దగా పట్టించుకోరు. ఒకరు అలా రావడం షురూ చేస్తే పది మందిదీ అదే దారి అవుతుంది. ఎంతైనా మనది గొర్రెదాటు కదా. సిగ్నల్ లైట్ల విషయం సరే సరి ఎర్రలైట్ ఆన్ కాగానే మనం బండి స్టార్ట్ చేయాలి. ఎందుకంటే అప్పుడే రష్ ఉండదు.. ఇలా ఉంటుందండి సగటు వాహనదారుడి సైకాలజీ.మనవాళ్ళదంతా ఎడ్డెమంటే తెడ్డెమనే రకం.. ఫర్ ఎగ్జాంపుల్.. వన్ వే ట్రాఫిక్ అన్నారనుకోండి.. సరిగ్గా అదే రూట్ లోనే బుల్లెట్ బండెక్కి వచ్చేస్తా పా అని పాటలు పాడుకుంటూ మరీ వెళుతుంటారు. పోలీసులు చూసి విజిల్ వేసినా.. పెద్దగా పట్టించుకోరు. ఒకరు అలా రావడం షురూ చేస్తే పది మందిదీ అదే దారి అవుతుంది. ఎంతైనా మనది గొర్రెదాటు కదా. సిగ్నల్ లైట్ల విషయం సరే సరి ఎర్రలైట్ ఆన్ కాగానే మనం బండి స్టార్ట్ చేయాలి. ఎందుకంటే అప్పుడే రష్ ఉండదు.. ఇలా ఉంటుందండి సగటు వాహనదారుడి సైకాలజీ.అరే ఇదేందిర బై వన్ వే అంటూ రాసిండు గదా.. ఇట్టే వస్తున్నవేంది? అని ఎవరైనా అడిగితే... చుట్టూ ఎలితే లంబా అవుతది గందుకే షార్ట్ గా ఈ తొవ్వలో వస్తుండ అంటూ యమ కూల్ గా సమాధానం చెబుతారు. హెల్మెట్ పెట్టుకోవాలని ట్రాఫిక్ పోలీసులు జర ఫోర్స్ చేసిండ్రు అంటే.. గదేంది సర్ పొద్దునే ఈ రూట్ లో ఇట్టే వెళ్ళా.. గప్పుడు కూడా లేదు.. ఇప్పుడు అడుగుడేంది అంటూ ఉల్టా ప్రశ్న వేస్తుంటే సదరు పోలీసు నోరెళ్ళబెట్టాల్సిందే. ఇగ హారన్ కొట్టుడు అంటే మనకు మస్త్ మజా వస్తది. బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఉన్నా.. హారన్ దంచుతునే ఉంటం.. అరె బై ఆ సప్పుడేంది.. ట్రాఫిక్ ఉంది కదా అని విసుక్కొన్నారో.. హారన్ సౌండ్ మరింత పెరుగుతుంది. అదే విదేశాల్లో హారన్ కొట్టడం అంటే న్యూసెన్స్ గా భావిస్తారు.విదేశాల్లో ఇలా అంటే చాలు ఆ మా బాగా చెప్పొచ్చావులే.. అక్కడికే వెళ్ళలేకపోయావా అంటూ వ్యంగ్యం దట్టించి మరీ మాటలు వదులుతుంటారు. కానీ నిజాలు మాట్లాడుకోవాలంటే.. యూరోపియన్ దేశాల్లో అమెరికా, లండన్, కెనడా లాంటి దేశాల్లో ట్రాఫిక్ రూల్స్ పట్టింపు చాలా ఎక్కువ. రోడ్డుపై టూవీలర్, ఫోర్ వీలర్ తోపాటు సైకిల్ పై వెళ్లే వారికి కూడా ప్రత్యేక లైన్లుంటాయి. ప్రభుత్వ బస్సులు నడపడానికి కూడా ప్రత్యేక లైన్లుంటాయి. పాదచారులకు వారు అత్యధిక ప్రాధాన్యమిస్తారు. పెడస్ట్రియన్ సిగ్నల్ పడిందంటే.. ఎన్ని వాహనాలైనా సరే అటూ ఇటూ నిలిచి వేచి చూడాల్సిందే. అలాగే స్కూల్ జోన్ వద్ద సైలంట్ జోన్ అని ఉంటుంది. అక్కడ హారన్ మోగిస్తే ఫైన్ కట్టాలి. అలాగే స్కూల్, హాస్పిటల్ వద్ద స్పీడుగా వెళ్ళినా పెనాల్టీ డబుల్ ఉంటుంది. టొరంటోలో ట్రాఫిక్ ఎప్పుడూ హెవీగానే ఉంటుంది. కానీ ప్రమాదాల శాతం చాలా తక్కువ. మనకూ ట్రాఫిక్ రూల్స్ బోలెడన్ని ఉన్నాయ్.. పాటించేవారి సంఖ్యే తక్కువ. రూల్స్ బ్రేక్ చేయడమంటే మనకు వెన్నతో పెట్టిన విద్య. అది తప్పని కూడా అనుకోం. పాపం ఢిల్లీలో విదేశీయులు మన అరాచకం చూసి అల్లాడిపోయారు. కనీసం రూల్స్ చెబితే పాటిస్తారేమోనని అనుకుని చెప్పడం ప్రారంభించారు. వారిది ఎంత దురాశో కదా.-ఆరెం. -
నాగిని పాటకు పాము డాన్స్.. వీడియో వైరల్
-
వామ్మో,లక్ అంటే పులి రాజాదే... లేదంటే!
-
ఒట్టు... ఇలాంటి పెళ్లి చూసి ఉండరు!
‘ఇది పెళ్లి వేడుకా? పాన్ ఇండియా సినిమానా?’ అని ఆశ్చర్యపోయారు అతిథులు. వేడుకలో అడుగడుగునా సినిమాటిక్ ట్రిక్స్ను ఉపయోగించడమే దీనికి కారణం. వేదికపై రైలు పట్టాలు కనిపిస్తాయి. అయితే ఆ పట్టాల మీది నుంచి రైలు కాదు... అటు నుంచి హంసతూలికా వాహనంలో వధువు, ఆమెకు ఎదురుగా మరో హంసతూలికా వాహనంలో వరుడు వస్తుంటాడు.బ్యాక్గ్రౌండ్లో అలనాటి ‘మహాభారత్’ టీవీ సీరియల్లోని పాటలు వినిపిస్తుంటాయి. వధూవరుల చేతిలో స్పార్క్–షూటింగ్ గన్స్ ఉంటాయి. ఇద్దరూ ఒకే చోటుకి రాగానే పూల వెలుగు వాన కురుస్తుంది. బాణసంచా పేలుతుంది.ఒక్కటా రెండా... ఈ పెళ్లి వేడుకలో ఎన్నో వింతలు.‘ఎంత గొప్ప క్రియేటివిటో... ఆహా!’ అని ఆకాశానికెత్తారు కొందరు. చాలామంది మాత్రం... ‘ఎవరి పిచ్చి వారికి ఆడంబరం’ అన్నట్లుగా కామెంట్స్ పెట్టారు. అయినప్పటికీ ఈ వీడియో వైరల్ అయింది. రాబోయే కాలంలో ఇదొక ట్రెండ్గా కూడా మారవచ్చు! View this post on Instagram A post shared by युक्ति (@lil_dicey_ybz) -
నితీశ్ కుమార్కు పాక్ గాంగ్స్టర్ బెదిరింపులు, డీజీపీ స్పందన
పట్నా: హిజాబ్ వివాదంలో చిక్కుకున్న బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Nitish Kumar)కు సంబంధించి ఒక బెదిరింపు వీడియో ఒకటి సంచలనంగా మారింది. ఇప్పటికే ఈ సంఘటపై కాంగ్రెస్, ఆర్జేడీ తీవ్రంగా స్పందించాయి. నితీశ్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేయగా, నితీశ్ మానసిక స్థితిపై ఆర్జేడీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే బిహార్ సీఎం వెంటనే ఆ మహిళకు బేషరతుగా క్షమాపణ చెప్పి తీరాలి అని నటి జైరా వసీం డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా నితీష్ కుమార్కు పాకిస్తాన్కు చెందిన ఒక గ్యాంగ్స్టర్ ద్వారా సోషల్ మీడియాలో బెదిరింపులు వచ్చాయని తెలుస్తోంది.పాకిస్తాన్కు చెందిన గ్యాంగ్స్టర్ షాజాద్ భట్టి ఈ సంఘటనపై క్షమాపణ చెప్పాలని సీఎంను డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. ముస్లిం మహిళతో నితీష్ ప్రవర్తించిన తీరును ప్రస్తావిస్తూ భట్టి సదరు మహిళకు క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించాడు. బాధ్యతా యుతమైన పదవిలో ఉండి ఇలా ప్రవర్తించడం తగదని వ్యాఖ్యానించినట్టు సమాచారం.ఈ వీడియోపై ఎలాంటి ధృవీకరణ లేనప్పటికీ, బిహార్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) వినయ్కుమార్ స్పందించారు. ఈ విషయాన్ని పరిశీలించమని పట్నా ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ను కోరినట్లు చెప్పారు. ఇంతకుమించి ప్రస్తుతానికి వివరాలేమీ లేవంటూ, తదుపరి వ్యాఖ్యానించడానికి ఆయన నిరాకరించారు, ఈ వీడియోపై అధికారిక విచారణ అనంతరం, బెదిరింపులను పరిశీలిస్తామన్నారు. VIDEO | Hijab incident: On a Pakistan-based gangster allegedly issuing video threat to Bihar CM Nitish Kumar, Bihar DGP Vinay Kumar says, "The social media post is being investigated at the level of the IG, Patna. As of now, no immediate details are available."(Full video… pic.twitter.com/eQ4s3pOJ49— Press Trust of India (@PTI_News) December 17, 2025; కాగా పట్నాలో ఆయుష్ డాక్టర్లకు సర్టిఫికెట్ల ప్రదానం సందర్భంగా ఒక మహిళా డాక్టర్ హిజాబ్ను (Hijab) దించి మరీ ముఖాన్ని చూడటంపై దుమారం రేపింది.ఇదీ చదవండి: మెస్సీకి అనంత్ అంబానీ సర్ప్రైజ్ గిఫ్ట్, ఖరీదెంతో తెలుసా? -
స్నేహితుడి కూతురు కోసం వెల కట్టలేని గిఫ్ట్..! నెటిజన్లు ఫిదా
ఓ వ్యక్తి స్నేహితుడి కూతురు కోసం అందమైన గిఫ్ట్ని స్వయంగా తన చేతులతో సిద్ధం చేశాడు. తీరిగ్గా చేసింది కాదు. బిజీ షెడ్యూల్లో రెండు విమానాల జర్నీలో అలవొకగా తయారు చేశాడు. నిజంగా అది అతడి నైపుణ్యం, విలువైన గిఫ్ట్ ఇవ్వాలన్నా అతడి ఆలోచనకు నిదర్శనం. ఆ గిఫ్ట్ నెటిజన్ల మనసుని అమితంగా దోచుకోవడమే కాదు..అతని క్రియేటివిటీకి ఫిదా అయ్యారు కూడా.వెల్లూరు మెడికల్ కాలేజీలో సైక్రియాట్రిక్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ ధీరజ్ తన బిజీ విమానాల షెడ్యూల్లో తన స్నేహితుడి కూతురు కోసం గిఫ్ట్ తయారు చేశాడు. లేత గులాబీ వూల్తో అల్లిన ఆ టోపీ ఎంత అందంగా ఉందంటే..అతడు అల్లికల్లో కూడా డాక్టర్ అని అనొచ్చేమో అన్నంత అందంగా కుట్టేశాడు. చేతితో తయారు చేసిన ఈ గిఫ్ట్ అతడి క్రియేటివిటీకి, శ్రమకు నిదర్శనం.జస్ట్ మూడు రోజుల్లో రెండు విమానాల ప్రయాణాల వ్యవధిలో ఈ టోపిని అల్లేయడం విశేషం.అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ఎక్స్లో షేర్ చేస్తూ..మూడే మూడు రోజుల్లో రెండు విమాన జర్నీలలో స్నేహితుడి కుమార్తె కోసం తయారు చేసిన టోపీ అనే క్యాప్షన్ జోడించి మరి పోస్ట్ చేశాడు. నెటిజన్లు దొరికిన ఖాళీ సమయాన్ని వృధాగా పోనివ్వకుండా క్రియేటివిటీగా చేతితో తయారు చేసిన గిఫ్ట్ ఇవ్వాలనుకోవడం నిజంగా ప్రశంసించదగ్గ విషయం. ఇది వెలకట్టలేని అమూల్యమైన గిఫ్ట్. అన్ని డబ్బులతో కొనలేం అనేందుకు ఈ గిఫ్టే ఉదాహరణ అని మెచ్చుకుంటూ పోస్టులు పెట్టారు.Two flight trips in three days. Finished a beanie for friend's daughter. pic.twitter.com/SVM7tmRUjt— Dr Dheeraj K, MD, DM, 🇮🇳🇬🇧🇦🇺 (@askdheeraj) December 16, 2025 (చదవండి: Sobhita Dhulipala: గోల్డెన్ లెహంగాలో 24 క్యారెట్ల బంగారంలా మెరిసిన శోభితా ధూళిపాళ..!) -
ఎలుక కోసం కార్ బంపర్ ని పీకేసింది.. కట్ చేస్తే.. కారు కంపెనీపై..!
-
'అయ్ బాబోయ్ ఎంత పొడుగో'..!
అత్యున్నత హోదాలో ఉండి అంతే శారీరక ధృడత్వంతో మంచి ఎత్తుతో ఉంటే..కళ్లు తిప్పుకోలేం కదూ. అబ్బా పదవికి తగ్గ ఫిజిక్ అన్న ఫీల్ కలుగుతుంది. అలాంటి అనుభవమే ఎదురైంది ఇటాలియన్ ప్రధాని మోలోనికి. ద్వైపాక్షిక సమావేశం కోసం వచ్చినప్పుడూ ఆ దేశ అధ్యక్షులు ఘనంగా ఆహ్వానం పలకడం కామన్. అలానే మొజాంబిక్ దేశ అధ్యక్షుడకి చక్కగా ఆహ్వానం పలికింది ఇటలీ దేశం . అయితే ఆ దేశ అధ్యక్షుడిని చూడగానే ఒక్కక్షణంలో ఇటలీ ప్రధాని మెలోని రియాక్షన్ మారిపోయింది. అది స్పష్టంగా వీడియోల్లో కనిపిస్తోంది కూడా. అంతేగాదు వారిద్దరిని కెమెరాలో బంధించడానికి ఫోటోగ్రాఫర్లు సైతం ఇబ్బంది పడ్డారు. అసలేం జరిగిందంటే గతవాంర మొజాంబిక్ అధ్యక్షుడు డేనియల్ చాపో రోమ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన్కు స్వాగం పలికేందుకు వచ్చిన ఇటలీ ప్రధానికి మెలోని ఒక్కసారిగా కంగుతింటుంది. ఎందుకంటే డేనియ చాపో ఎత్తు చూసి ఆశ్చర్యపోతుంది. ఒక్కసారిగా అతనికి కరచాలనం చేయడానికి కూడా తడబడుతుంది. చెప్పాలంటే ఆమె ముఖంలో ఇంత పొడుగా అని విస్తుపోతున్నట్లు హవభావాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఆమె మనసులో ఏదో అనుకుంటూ ఇబ్బందిగా మొజాంబిక్ అధ్యక్షుడు చాపోకి కరచాలనం ఇవ్వడానిక వస్తున్నట్లుగా వీడియోలో కనిపిస్తుంది. అంతేగాదు అక్కడే ఉన్న ఫోటోగ్రాఫర్లుకు సైతం ఇద్దర్నీ ఒకే ఫోటోఫ్రేంలో బంధించడం చాలా సవాలుగా మారుతుంది. ఎందుకంటే అత్యున్నత హోదాలో ఉన్నవారి శారీరక ఎత్తులలో మరి ఇంత వ్యత్యాసం కనపడుకుండా కవర్ చేసేందుకు నానాతంటాలు పడ్డారు ఫోటోగ్రాఫర్లు. కానీ అది దాదాపు అసాధ్యం.ఎందుకంటే మొజాంబిక్ అధ్యక్షుడు డేనియ్ చాపో ఎత్తు ఏకంగా 6'8 కాగా, మెలోని ఎత్త కేవలం 5'2. నెట్టంట అందుకు సబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇక ద్వైపాక్షిక సమావేశంలో ఇరువురు ఇటలీ మాట్టేయి ప్లాన్ ఫర్ ఆఫ్రికా శక్తి, వాణిజ్యం, సహకారం వంటి వాటిపై చర్చలు జరిపారు. కాగా, తన దేశం స్వాతంత్ర్యం పొందిన తర్వాత జన్మించిన మొజాంబిక్ అధ్యక్షుడు డేనియల్ చాపో అధ్యక్ష ఎన్నికల్లో దాదాపు 70 శాతం మెజార్టీ ఓట్లతో ఈ ఏడాది ప్రారంభంలోనే అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడం గమనార్హం.Ho ricevuto oggi a Palazzo Chigi il Presidente della Repubblica del Mozambico, Daniel Francisco Chapo.In particolare il colloquio, nel ricordare il cinquantesimo anniversario dell’indipendenza mozambicana e dello stabilimento delle relazioni diplomatiche, ha confermato la… pic.twitter.com/hI8kH3pFfO— Giorgia Meloni (@GiorgiaMeloni) December 11, 2025 (చదవండి: హనుక్కా పండుగ అంటే..? యూదులు ఎందుకింత ఘనంగా జరుపుకుంటారంటే..) -
మనసు దోచే వరమాల..! పూలతో చేసింది కాదు..
ఈ వెడ్డింగ్ సీజన్ ట్రెండ్... ‘క్రోచెట్ వరమాల’. కాస్త వెనక్కి వెళితే... వివాహం చేసుకోబోయే ఒక జంట నుంచి ఒక మహిళకు ‘వరమాల’ తయారుచేయాల్సిందిగా ఆర్డర్ వచ్చింది.‘ఎప్పుడూ పూలతోనే చేస్తే ఏం వెరైటీ ఉంటుంది. కొత్తగా చేయాలి’ అని ఆలోచించింది. ఆమె ఆలోచనలో నుంచి వచ్చిందే... క్రోచెట్ వరమాల. మృదువైన రంగుల ఉన్ని దారాలను ఉపయోగించి ఆమె తయారుచేసిన ‘వరమాల’ ఆహా అనిపించింది. వరమాల మేకింగ్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తరువాత ఈ వరమాలకు ‘క్రోచెట్ వరమాల’గా పేరు వచ్చింది. ఆ తరువాత ట్రెండ్గా మారింది. ఇలాంటి అందాల వరమాలను మీరు కూడా తయారుచేయాలనుకుంటున్నారా? ‘క్రోచెట్’ హ్యాండిల్తో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన వీడియోను చూసి నేర్చుకోండి. వధూవరులకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వండి!. View this post on Instagram A post shared by Hot_Knot (@hot_knot_by_sumee) (చదవండి: నెలగంట కట్టడం అంటే..? అది పండుగ రాకకు సంకేతమా..?) -
తుపాను బీభత్సం : కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
దక్షిణ బ్రెజిల్లోని గువైబా నగరంలో తీవ్ర తుఫాన్ బీభత్సం సృష్టించింది. బలమైన గాలులు, తుఫాన్ తాకిడికి దాదాపు 114 అడుగుల ఎత్తున్న స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ప్రతిరూపం కుప్పకూలిపోయింది.అయితే అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. దీనికి సంబంధించిన వీడియో ఆన్లైన్ బాగా షేర్ అవుతోంది. సోమవారం మధ్యాహ్నం బ్రెజిల్లోని గుయిబా నగరాన్ని తీవ్రమైన తుఫాను ముంచెత్తింది. దీంతో దాదాపు 40 మీటర్ల పొడవైన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ప్రతిరూపం కూలిపోయింది. ఫాస్ట్-ఫుడ్ అవుట్లెట్ సమీపంలోని హవాన్ రిటైల్ మెగాస్టోర్ ,కార్ పార్కింగ్లో ఏర్పాటు చేయబడినఈ విగ్రహాన్ని తీవ్రమైన గాలులు తాకాయి. బలమైన గాలుల ధాటికి తొలుత వంగిపోయిన ఈ విగ్రహం తాకిడి తీవ్రం కావడంతో స్టాట్యూ తల ముక్కలైంది. బ్రెజిల్ పౌర రక్షణ సంస్థ అధికారుల ప్రకారం.. పై భాగం మాత్రమే ప్రభావితమైది. అయితే 11 మీటర్లు (36 అడుగులు) పీఠం చెక్కుచెదరకుండా ఉంది. గుయిబా మేయర్ మార్సెలో మారనాటా మాట్లాడుతూ, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదన్నారు. సత్వరమే స్పందించిన అధికారులను ప్రశంసించారు. విగ్రహం కూలిపోవడానికి ఖచ్చితమైన కారణాన్నిగుర్తించేందుకు, తీవ్రమైన వాతావరణం తోపాటు, తర అంశాలు పాత్రపై ఆరా తీసేందుకు సాంకేతిక తనిఖీ నిర్వహించబడుతుందని అధికారి ఒకరు చెప్పారు.ఇదీ చదవండి: బోండీ బీచ్ హీరోకు సర్వత్రా ప్రశంసలు : భారీగా విరాళాలుగుయిబాలో తుఫాను రియో గ్రాండే డో సుల్ను కూడా చాలా వరకు ప్రభావితం చేసింది. వడగళ్ల వాన, పైకప్పులు, చెట్లు, కూలిపోవడం, తాత్కాలిక విద్యుత్తు అంతరాయం లాంటి సంఘటనలు చోటు చేసు కున్నాయి. భారీ వర్షం కారణంగా కొన్ని వీధులు జలమయమయ్యాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెటియాలజీ తుఫాను హెచ్చరికలను జారీ చేసింది. గంటకు 100 కి.మీ. వేగంతో గాలులు వీచాయి. చలిగాలులే దీనికి కారణమని వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు. తేలికపాటి వర్షం ఉన్నప్పటికీ మంగళ వారం నుండి వాతావరణ పరిస్థితులు మెరుగుపడతాయని భావిస్తున్నారు. కాగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అసలైన విగ్రహం అమెరికాలోని న్యూయార్క్లో ఉంది. బ్రెజిల్లోని హవాన్ అనే డిపార్ట్మెంటల్ స్టోర్ చైన్ బ్రాండ్ గుర్తుగా 2020లో దీన్ని ఏర్పాటు చేశారు..Video footage shows a forty-meter-tall replica of the Statue of Liberty, located across from a McDonald's within the parking lot of a Havan in the Brazilian city of Guaíba, one of several dozen replicas of the statue located throughout the country, collapsing during a wind and… pic.twitter.com/kUid9lwA3b— OSINTdefender (@sentdefender) December 15, 2025 -
ఉగ్రమూకపై తిరగబడి.. వైరల్ వీడియో
ఆస్ట్రేలియాలోని సిడ్నీ బోండై బీచ్లో ఉగ్ర దాడి వేళ ఓ పౌరుడు పెద్ద సాహసమే చేశాడు. ఉగ్ర మూకపై స్థానిక పౌరుడు తిరగబడ్డాడు. కాల్పులు జరుపుతున్న ఉగ్రవాది నుంచి తుపాకీ లాక్కొని అతడిపైనే కాల్పులు జరిపాడు. ఆ తర్వాత అతడిని తరిమికొట్టాడు. వందలాది మంది పర్యాటకులను ఉగ్రవాదుల నుంచి ఆ వ్యక్తి రక్షించాడు. ఈ వీడియో వైరల్గా మారింది.బాండి బీచ్ కాల్పుల ఘటనలో 10 మంది మరణించారు. బీచ్లోకి ప్రవేశించిన ఉగ్రవాదులు ఒక్కసారిగా ఫైరింగ్ చేయడంతో వందల మంది పర్యాటకులు భయంతో పరుగులు తీశారు. నల్లటి ముసుగులు ధరించిన వ్యక్తులు కాల్పులు జరిపారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. దుండగులను అదుపులోకి తీసుకున్నారు. హెలికాప్టర్లు, 30 అంబులెన్స్ల ద్వారా క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.One of the shooters was disarmed and possibly shot by one of the Bondi Beach goers. He is the shooter who the police gave CPR.pic.twitter.com/LS6IP68jlH— Terrible Pics (@TerriblePic) December 14, 2025 -
అనకొండ అవులిస్తే...!
-
ఏకంగా 72 గంటల పాటు ఆ చెట్టును కౌగిలించుకునే ఉండిపోయింది..!
చెట్టును కావలించుకుని ఉండి ప్రపంచ రికార్డు స్థాపించింది. కెన్యాలో అడవుల నరికివేతపై అందరి దృష్టి పడేలా ఆమె ఈ నిరసన తెలియచేసింది. ప్రజలు ఆమె మద్దతుకు తండోప తండాలుగా కదిలి వచ్చారు. కెన్యాలోని న్యారీ కౌంటీలో పర్యావరణ కార్యకర్త ట్రంఫెనా ముతోని నాలుగు రోజుల క్రితం ఒక చెట్టును పట్టుకుని నిలబడిపోయింది. 72 గంటల పాటు ఆ చెట్టును వదలకుండా ఉంది. నిద్రపోలేదు. విశ్రాంతి తీసుకోలేదు. కాలకృత్యాల కోసం కూడా అతి తక్కువ సమయమే తీసుకుంది. ఒక దశలో వాటి అవసరమే రాలేదు. 72గంటల పాటు ఆమె చేస్తున్న నిరసనను ఆన్లైన్లో సోషల్ మీడియాలో జనం చూశారు. చాలామంది నేరుగా వచ్చి చూశారు. మరెంతో మంది దశలు దశలుగా చూస్తూ ఉండిపోయారు. ఆరోగ్య కార్యకర్తలు దగ్గరే ఉండి ఆమె ఆరోగ్యాన్ని గమనిస్తూ వచ్చారు. జనం చప్పట్లతో ఆమెను ఉత్సాహపరిచి 72 గంటల తర్వాత నిరసనను ముగించేలా చూశారు. ముతోని గతంలో కూడా ఇలాగే 48 గంటల పాటు చెట్టును కావలించుకుని ఉండిపోయి రికార్డు స్థాపించింది. ఇప్పుడు తన రికార్డును తానే బ్రేక్ చేసింది. ఇది గిన్నెస్ రికార్డు అని పరిశీలకులు భావిస్తున్నారు. ‘నేను ఈ పని ప్రచారం కోసమో, డబ్బు కోసమో చేయడం లేదు. నాలాంటి యువతీ యువకులు పర్యావరణ సంరక్షణ అవసరాన్ని తెలుసుకోవాలని చేస్తున్నాను. నన్ను చూసి ఏ మూల ఏ ఒక్కరైనా ఒక్క చెట్టు నాటినా నా నిరసనలోని ప్రతి సెకండ్ సద్వినియోగం అయినట్టే భావిస్తాను’ అని నిరసన ముగించాక ముతోని మీడియాతో అంది. ఈ 72 గంటలలో ఒక రాత్రి భారీగా వాన పడింది. అయినా ముతోని చలించలేదు. చెట్టును కరుచుకుని ఉండిపోయింది. ఆమె దృఢ నిరసనకు ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో స్పందన వచ్చింది. కెన్యాలో అడవుల నరికివేత మాత్రమే కాదు మృగాల సంహారం కూడా సాగుతూ ఉన్న దరిమిలా ఈ నిరసన ఏ మార్పుకు కారణమవుతుందో చూడాలి.(చదవండి: మట్టితో... ఫేస్మాస్క్లు) -
'స్త్రీ' నిర్వచనం ఇదా..? ఎలాన్మస్క్పై నెటిజన్లు ఫైర్
స్త్రీత్వంపై ప్రపంచ కుభేరుడు చేసిన వ్యాఖ్యలు నెట్టింట వివాదాస్పదంగా మారి తీవ్ర దుమారం రేపాయి. అంత స్థాయిలో ఉన్న వ్యక్తి కాస్త దిగజారుడు వ్యాఖ్యలు చేయడంపై సర్వత్ర ఆగ్రహం వ్యక్తమైంది. పోనీ సైంటిఫిక్గా చెప్పని అందరికి సమంజసంగా ఉండేలా మాట్లాడాలి గానీ మరి ఇలానా అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు నెటిజన్లు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..టెస్లా, స్సేస్ ఎక్స్ దిగ్గజం ఎలోన్ మస్స్ స్త్రీత్వంపై తన అభిప్రాయలను పంచుకోవడం వివాదాస్పదంగా మారింది. సోషల్ మీడియాలో ఆయన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శులు వెల్లువెత్తాయి. మస్క్ స్త్రీకి నిర్వచనం గర్భం అంటూ గర్భాశయం ఉన్నవాళ్లను స్త్రీలుగా వ్యవహరిస్తారని, గర్భం ఉనికి ద్వారా స్త్రీని నిర్వచించాలి అని నొక్కి చెప్పాడంతో ఒక్కసారివ ఆయనపై తారాస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. ఆయన వైఖరిని చాలామంది ఖండించారు. అంతేగాదు అస్సలు మనం ఇంకా ఏ కాలంలో జీవిస్తున్నాం అని విమర్శిస్తూ పోస్టులు వెల్లువెత్తాయి. గర్భం ఉంటే స్త్రీ అంటే.. మరి ఎంఆర్కేహెచ్ సిండ్రోమ్ మేయర్-రోకిటాన్స్కీ-కస్టర్-హౌసర్ సిండ్రోమ్) అరుదైన పరిస్థితితో బాధపడుతున్న ఆడవాళ్లు..స్త్రీలు కాకుండా పోతారా అని నిలదీశారు. ఎంఆర్కేహెచ్ సిండ్రోమ్ అంటే గర్భాశయం లేకుండా లేదా అభివృద్ధి చెందని స్త్రీలని అర్థం. లింగ మార్పిడిని బహిరంగంగా వ్యతిరేకిస్తూ తన ట్రాన్స్జెండర్ కుమార్తె పరిస్థితిని "విషాదకరమైన మానసిక అనారోగ్యం"గా అభివర్ణించారు. ఆయన తనను లక్ష్యంగా చేసుకుని డెమొక్రాట్ అభ్యర్థి కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ చేసిన వ్యాఖ్యలకు మస్క్ ఇలా ప్రతిస్పందించారు. కాగా, కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ పాడ్కాస్టర్తో తాను ఎక్కువ మంది ట్రాన్స్ పిల్లలను చూడాలనుకుంటున్నానని, తనను తాను ట్రాన్స్-ప్రో చట్టం LGBTQ హక్కుల బలమైన మద్దతుదారుగా భావిస్తానని చెప్పారు. అంతేగాదు సారీ మస్క్ మిమ్మల్ని మీ కూతురు ద్వేషిస్తున్నందుకు అని నేరుగా సెటైర్ వేశారు. దాంతో మస్క్ ఇలా విరుచుకుపడుతూ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. Correct. We’re sorry your daughter hates you, Elon. https://t.co/HeJIm5fJMS— Governor Newsom Press Office (@GovPressOffice) December 11, 2025 (చదవండి: ఔనా ..! ఏకంగా 66 శాతం మగజాతి రాముడిలా ఏకపత్నీవ్రతులా! సర్వేలో షాకింగ్ విషయాలు) -
చుట్టూ అగ్నికీలలున్నా బెదరలే, తెగువ చూపింది!
ఆపద సమయంలో చురుగ్గా స్పందించాలి. అది ఎంతటి ప్రమాదమైనా సరే.. గాభరా పడకుండా తప్పించుకునే మార్గాలున్నాయా అనేది ఆలోచించాలి. ఆందోళన పడితే బుర్ర పనిచేయదు.. ఏం చేయాలో తోచదు. ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకుని ధైర్యంగా అడుగుముందుకేయాలి. ఫిలిప్పీన్స్లోని సెబులోని మాండ్యూ నగరంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో చిక్కుకున్న ఒక మహిళ సరిగ్గా ఇలాగే చేసింది. తన పెంపుడు కుక్కల్ని కూడా కాపాడుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఫిలిప్పీన్స్లో ఇటీవల భారీ అగ్న ప్రమాదం చోటు చేసుకుంది. మహిళ నివసిస్తున్న భవనంలో మంటలు చుట్టుముట్టాయి. ఎటు చూసినా దట్టమైన, నల్లటి తీవ్రమైన పొగ వ్యాపించింది. తన రెండు పోమెరేనియన్లను కుక్కల్ని వదిలి వెళ్లడానికి మనసొప్పలేదు. అందుకే అంత ఆపదలోనూ తెలివిగా, అంతకుమించిన మానవత్వంతో ఆలోచించిందా మహిళ. భవనంలో మంటలు చెల రేగుతున్న సమయంలో వాటిని మూడో అంతస్తులోని రైలింగ్పైకి విసిరి వాటిని కాపాడింది. ఆ తరువాత అగ్నిమాపక సిబ్బంది వేసిన ల్యాడర్ ద్వారా చాలా జాగ్రత్తగా కిందికి దిగింది. రెండు నిమిషాల వీడియో ఆన్లైన్లో ఆకర్షణీయంగా మారింది. దీంతో ఆమెను షీరో అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఈ వీడియో ఏకంగా 30 లక్షలకుపైగా వ్యూస్ను సాధించడం విశేషం. ICYMI: This is real courage.During a massive fire in Mandaue City, Cebu, Philippines, a woman refused to leave without her dogs.As flames spread, she climbed onto a ladder, threw each dog down to safety, then hung by her hands from the railing while firefighters climbed up to… pic.twitter.com/unDE6PcyUG— Tony Lane 🇺🇸 (@TonyLaneNV) December 13, 2025 -
‘మధ్యలో ఏంటి బాసూ’ గజరాజుకు కోపం వచ్చింది
-
అర్థరాత్రి ఆటోలో ఒంటరి మహిళ : ఆ నోట్ చూసిందంతే!
అర్థరాత్రి రద్దీగా ఉండే నగరాల్లో కూడా అర్థరాత్రి మహిళలు ఒంటరిగా ప్రయాణించాలంటే బిక్కు బిక్కుమంటూ వెళ్లాల్సిందే. క్యాబ్ సేవలు అందించే సంస్థలకు చెందిన ఆటో,క్యాబ్, బైక్ డ్రైవర్లు మర్యాదగానే ఉంటారు. అయినా కూడా సురక్షింగా గమ్య స్థానానికి చేరేదాకా మనసులో బెరుకు తప్పదు. తాజాగా బెంగళూరులో రాపిడో ఆటోలో అర్ధరాత్రి ఇంటికి ప్రయాణిస్తున్న ఒక మహిళకు అనుభవం నెట్టింట విశేషంగా నిలిచింది.రాత్రి 12 గంటలకు అర్థరాత్రి, ఒంటరిగా ఉన్నప్పటికీ తన ప్రయాణంలో తాను ధైర్యంగా గడిపిన క్షణం గురించి వివరించిన వీడియోను షేర్ చేసింది. నిజంగా ఆటోలు కనిపించిన ఒక నోట్ను ఆమెలోఆనందాశ్చర్యాల్ని నింపింది. వాహనం లోపల అతికించిన చేతితో రాసిన నోట్ను చూపించడానికి కెమెరాను అటు తిప్పింది. అక్కడ ఇలా ఉంది: "నేను ఒక తండ్రిని, సోదరుడుని కూడా. మీ భద్రత ముఖ్యం. హాయిగా ప్రశాంతంగా కూర్చోండి."అని ఒక నోట్లో రాసి ఉండటం విశేషం. అంటే ఆ సమయంలో ఒంటరిగా ప్రయాణించే మహిళల మనస్సుల్లో చెలరేగే భావాలను, భయాలను అర్థం చేసుకుని భయపడకండి.. నేనూ ఒక బిడ్డకు తండ్రినే, ఒక సోదరికి అన్నయ్యను కూడా..భయపడకుండా కూర్చోండి, నా వలన మీకెలాంటి ప్రమాదం ఉండదు అని ధైర్యం చెప్పడం బాగా ఆకట్టుకుంటోంది.ఇదీ చదవండి: చిలుకను కాపాడబోయి : తనువు చాలించిన వ్యాపారవేత్త View this post on Instagram A post shared by Little Bengaluru Stories (@littlebengalurustories) ఈ వీడియోను లిటిల్ బెంగళూరు స్టోరీస్ "పీక్ బెంగళూరు" అనే శీర్షికతో పోస్ట్ చేసింది . దీంతో నెటిజన్ల నుండి హృదయపూర్వక స్పందనలు వచ్చాయి. "గత 20 సంవత్సరాలుగా నాకు ఈ నగరం తెలుసు! ఇది అందరికీ అత్యంత సురక్షితమైన నగరం." ‘‘మేము కోరుకుంటున్నది , మనం చేయవలసినది ఇదే" అంటూ వ్యాఖ్యానించారు. ‘‘ఇలాంటి చిన్ని చిన్న విషయాలు చాలు. నగరంలోని మహిళలకు అర్థరాత్రి ప్రయాణం సురక్షితంగా అనిపించేలా చేయడంలో సహాయపడతాయి’’ అని మరొకరు కామెంట్ చేశారు. శభాష్..భయ్యా..ఇలాంటి భరోసానే కావాల్సింది అంటూ మరికొందరు ఆటో డ్రైవర్ను కొనియాడారు.


