ఢిల్లీ: ఎస్యూవీతో ప్రమాదకర విన్యాసాలు చేస్తున్న ఓ యువకుడికి ఢిల్లీ పోలీసులు షాక్ ఇచ్చారు. జాతీయ రహదారి-48పై అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో ఎస్యూవీ వాహనంతో అతివేగంగా 'జిగ్జాగ్' డ్రైవింగ్ చేసిన యువకుడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నిందితుడిని ఓఖ్లా ప్రాంతానికి చెందిన ఇగ్నో విద్యార్థి దావూద్ అన్సారీ (21)గా గుర్తించారు. నిందితుడు నడిపిన స్కార్పియో-ఎన్ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనం అతని తండ్రి ముసాఫిర్ అన్సారీ పేరు మీద రిజిస్టర్ అయి ఉంది.
జనవరి 18న మధ్యాహ్నం 3 నుండి 4 గంటల మధ్య జీటీ కర్నాల్ బైపాస్ రోడ్డు నుండి నరేలా వైపు వెళ్తున్న ఒక నల్లటి స్కార్పియో వాహనం, అద్దాలకు నల్లటి టింట్లు వేసుకుని, రహదారిపై వెళ్తున్న ఇతర వాహనదారులను భయపెట్టేలా అడ్డదిడ్డంగా వెళ్తున్న వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన జరిగింది. ఈ వీడియోను తీవ్రంగా పరిగణించిన పోలీసులు.. నిందితుడిని వెంబడించి పట్టుకున్నారు. కేసు నమోదు చేయడంతో పాటు నిందుతుడి డ్రైవింగ్ లైసెన్స్ను కూడా స్వాధీనం చేసుకున్నారు.
Taking cognizance of a viral video circulating on social media, the team of PS Samaypur Badli, @dcp_outernorth took swift action .
The offending vehicle, which was being driven recklessly & dangerously, has been seized and the driver has been arrested for rash & negligent… pic.twitter.com/FIr8HbR9Za— Delhi Police (@DelhiPolice) January 20, 2026


