-
మేడిపల్లి పీఎస్లో బండి సంజయ్పై కేసు
సాక్షి, మేడ్చల్ జిల్లా: మేడిపల్లి పోలీస్ స్టేషన్లో బండి సంజయ్పై కేసు నమోదైంది. చెంగిచర్లలో పిట్టల బస్తి బాధితులను పరామర్శించడానికి బండి సంజయ్, అతని అనుచరులు రాగా, పోలీసులకు, బీజేపీ నాయకులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. తోపులాటలో కింద పడిన నాచారం సీఐ నందిశ్వర్ రెడ్డికి గాయాలయ్యాయి. సీఐ ఫిర్యాదుతో బండి సంజయ్తో పాటు మరో పది మందిపై 332, 353, 143, 149 ఐపీసీ 3, 4పీడీపీపీఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇదీ చదవండి: హైదరాబాద్ ఎంపీగా సానియా మీర్జా పోటీ?! -
సాఫ్ట్వేర్ ఉద్యోగం పేరుతో.. 400 మందిని మోసం చేసిన యువకుడు
వైఎస్సార్: సాఫ్ట్వేర్ ఉద్యోగం కలి ్పస్తామని సుమారు రూ. 10 కోట్లకు కుచ్చుటోపీ పెట్టిన సంఘటన పీలేరులో ఆలస్యంగా వెలుగు చూసింది. ఆదివారం పలువురు బాధితులు పీలేరు పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లి ఎస్ఐ ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు. బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పీలేరు పట్టణం బండ్లవంకకు చెందిన రెడ్డిసూర్యప్రసాద్ అలియాస్ భరత్ అనే యువకుడు హైదరాబాద్లో ఉంటూ అడ్డదారిలో సంపాదించడానికి నిరుద్యోగులకు వల వేశాడు. ఈ క్రమంలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ సుమారు 400 మంది నిరుద్యోగుల నుంచి ఒక్కొక్కరి వద్ద రూ. 2 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు వసూలు చేశాడు. రెండు నెలల పాటు వేతనాలు సక్రమంగా చెల్లించి నమ్మించాడు. అనంతరం మొహం చాటేశాడు. దీంతో మోసపోయిన కొంత మంది యువకులు తాము డబ్బులు చెల్లించిన బ్యాంకు అకౌంట్ చిరునామాను గుర్తించారు. హైదరాబాద్, గుంటూరు, ప్రకాశం, అనంతపురం, చిత్తూ రు, కడప, అన్నమయ్య జిల్లాల నుంచి సుమారు 400 మంది నిరుద్యోగులు మోసపోయినట్లు తెలుసుకున్నారు. పలువురు బాధితులు తమకు న్యాయం చేయాలని పీలేరు పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. -
పోలీస్ స్టేషన్లో దస్తగిరి దాదాగిరి
తాడిమర్రి: శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని తాడిమర్రి పోలీసుస్టేషన్, తహసీల్దార్ కార్యాలయంలో శనివారం ఓ భూమి విషయంలో మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ముద్దాయి దస్తగిరి దౌర్జన్యానికి పాల్పడ్డాడు. తాడిమర్రి మండలం నిడిగల్లు గ్రామానికి చెందిన దేవరకొండ నాగమ్మకు చెందిన 3.84 ఎకరాల భూమిని ముదిగుబ్బ మండలం జొన్నలకొత్తపల్లికి చెందిన రామ్నాయక్ తన భార్య శివాబాయి పేరున రూ.29 లక్షలకు కొనుగోలు చేశాడు. ఇటీవల రామ్నాయక్ ఆ భూమి పక్కనున్న శివాయి సాగు భూమి రెండెకరాలు కూడా చదును చేస్తుండగా నాగమ్మ, కుమారులు అడ్డుకున్నారు. దాన్ని విక్రయించనందున ఆ భూమి జోలికి రావొద్దని, అలాగే తమకు ఇవ్వాల్సిన రూ.3 లక్షలు చెల్లించాలని అడిగారు. అయితే, రామ్నాయక్ శివాయి సాగు భూమి కూడా తనకే చెందుతుందనడంతో ఇరువురి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో.. దస్తగిరి శనివారం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి తహసీల్దార్ నజ్మాబానుతో మాట్లాడారు. నిడిగల్లు గ్రామంలో రామ్ నాయక్ కొనుగోలు చేసిన పొలంపై స్టేటస్కో ఉందని, ఆ పొలం వద్దకు వీఆర్ఓను గానీ.. ఎస్ఐ, పోలీసులనుగానీ పంపవద్దని బెదిరించాడు. అలాగే, పోలీసుస్టేషన్కు వెళ్లి నాగమ్మ, ఆమె కుమారులు, అల్లుడు కలిసి రామ్నాయక్ను కొట్టారని, వారిపై కేసు నమోదు చేయాలని ఎస్ఐ నాగస్వామిని డిమాండ్ చేశాడు. ఫిర్యాదు లేనప్పుడు కేసు ఎలా పెడతామని ఎస్ఐ ప్రశ్నించారు. ఇలా దస్తగిరి ఆగడాలు పెరిగిపోయాయని సామాన్య ప్రజలు వాపోతున్నారు. ఇదీ చదవండి: దస్తగిరి కొత్త డ్రామా.. అసలు వాస్తవం ఏంటంటే? -
జడ్జి కుమారుడిపై ఫిర్యాదు తీసుకోరా?
సాక్షి, హైదరాబాద్: ‘పోలీస్స్టేషన్.. ఏమన్నా పర్యాటక కేంద్రం అనుకుంటున్నారా? ప్రజలు ఫిర్యాదు చేసేందుకు కాకుండా సందర్శనకు వస్తుంటారా? జ్యుడీషియల్ అధికారి కుమారుడిపై ఫిర్యాదు చేస్తే తీసుకోరా? దేశంలో ఎవరిపై ఫిర్యాదు చేసినా తీసుకోవాల్సిన బాధ్యత మీకుందని తెలియదా? ఓ మహిళ పోలీస్ స్టేషన్కు వచ్చి వేధింపుల ఆరోపణలు చేసి.. ఆ విషయంలో కరీంనగర్ జిల్లా ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి కుమారుడిపై ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదో శుక్రవారం నేరుగా కోర్టుకు హాజరై వివరణ ఇవ్వండి. ఏ కారణాలతోనైనా న్యాయస్థానం ముందు హాజరుకాకుంటే బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తాం’ అని కరీంనగర్ టూటౌన్ ఎస్హెచ్ఓ ఓదెల వెంకట్పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణను శుక్ర వారానికి వాయిదా వేసింది. సెషన్స్ జడ్జి కుమారుడిపై ఎఫ్ఐఆర్కు ఆదేశాలు కరీంనగర్ జిల్లాకు చెందిన రమ్య కోర్టులో ఆఫీస్ సబార్డి నేట్గా నియమితురాలయ్యారు. అయితే సెషన్స్జడ్జి కుమారుడు తనను వేధిస్తున్నాడంటూ ఆమె ఉన్నతాధికా రులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో తన విద్యార్హత, ఉద్యోగావకాశాలకు సంబంధించిన సమాచారాన్ని దాచి పెట్టిందంటూ ఆమెను సర్వీసు నుంచి తొలగించారు. ఇదే విషయంపై ఆమె రెండు రోజుల క్రితం హైకోర్టును ఆశ్ర యించారు. సీజే ధర్మాసనం ముందుకు ఈ అంశం రావడంతో సదరు సెషన్స్ జడ్జి కుమారుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేలా ఎస్హెచ్ఓకు ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వ న్యాయవాది రూపేందర్కు హైకోర్టు స్పష్టం చేసింది. జిల్లా జడ్జి కుమారుడు.. చట్టానికి అతీతుడా? ఈ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్కుమార్ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. తాము ఆదేశించినా ఎఫ్ఐఆర్ నమోదు చేయక పోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కోర్టు ఆదేశాలను ఎస్హెచ్ఓకు సరిగా తెలియజేయలేదా? లేక ఆ మహిళ పీఎస్కు వచ్చినా ఫిర్యాదు తీసుకోలేదనే కారణంతో ఎస్హెచ్ఓను సమర్థించే ప్రయత్నం చేస్తున్నారా అని జీపీపై అసహనం వ్యక్తం చేసింది. ‘కోర్టు ఆదేశాలున్నా ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో కరీంనగర్ టూటౌన్ ఎస్హెచ్ఓ నిర్లక్ష్యం ప్రదర్శించారు. పీఎస్లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మహిళను వేచి ఉండాల్సిందిగా కోరడం రాజ్యాంగ ధర్మాసనం ఆదేశాలను ఉల్లంఘించడమే. ఇది సమాజంలో అత్యంత దారుణమైన పరిస్థితి. నిందితుడు జిల్లా జడ్జి కుమారుడన్న కారణంగా ఎస్హెచ్ఓ నిందితుడిని రక్షించడానికి ప్రయత్నిస్తున్నారు. అతను చట్టానికి అతీతుడా? చట్టం ప్రకారం పరిపాలించే సమాజంలో ఇలాంటి వాటికి తావు లేదు. ఈ ఘటన మా మనస్సాక్షిని దిగ్భ్రాంతికి గురిచేసింది’ అని ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఏఏజీని పిలిపించిన ధర్మాసనం..: విచారణ సందర్భంగా అడిషనల్ అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ)ని ధర్మాసనం కోర్టు హాల్కు పిలిపించింది. ‘కొందరు జీపీలపై ఆధారపడవద్దు. ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని రాజ్యాంగ ధర్మాసనం ఆదేశించినా.. ఎస్హెచ్ఓ ఉల్లంఘించారు. అంతేకాదు ఫిర్యాదు దారుని ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పీఎస్లో నిరీక్షించేలా చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయమని సూచించే ధైర్యం కూడా మీ న్యాయాధికారులకు లేదు. ఇది నిజంగా దిగ్భ్రాంతికర విషయం’ అని వ్యాఖ్యానించింది. ఎస్హెచ్ఓను తమ ముందు హాజరు కావాలని ఆదేశిస్తూ.. విచారణ వాయిదా వేసింది. -
పోలీస్టేషన్పై ఉగ్రదాడి.. 10 మంది పోలీసులు మృతి
ఇస్లామాబాద్: పాకిస్థాన్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. డేరా ఇస్మాయిల్ఖాన్లోని చోడ్వాన్ పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్పై ఉగ్రమూకలు దాడిచేశారు. ఈ కాల్పుల్లో 10 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఫిబ్రవరి 8న పాకిస్థాన్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు మూడు రోజుల ముందు ఈ దాడి జరగడం గమనార్హం. "ఉదయం 3 గంటలకు, ఉగ్రవాదులు పోలీసు స్టేషన్పై దాడి చేశారు. పోలీసు భవనంలోకి ప్రవేశించి, విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు." అని పాకిస్తాన్ పోలీసు అధికారులు తెలిపారు. ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్థాన్లో గత కొద్ది రోజులుగా ఉగ్రదాడుల ఘటనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇదీ చదవండి: Denver: అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి! -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం
హస్తినాపురం: అతివేగంతో వచ్చిన టిప్పర్ బైకును ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలైన ఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వనస్థలిపురం ఇన్స్పెక్టర్ బి.రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లా పంపర మండలం పూడి గ్రామానికి చెందిన వీర వెంకట సత్యనారాయణ (36), ఆయన స్నేహితుడు ముద్దాల సతీష్ (38)లు కూకట్పల్లి ప్రగతినగర్ కాలనీలో కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. శనివారం ఉదయం వీరిద్దరూ కలిసి వనస్థలిపురంలో కూలిపనుల కోసం బైకుపై బయలుదేరారు. సుష్మా సిగ్నల్ సమీపంలోకి రాగానే వీరి బైకును టిప్పర్ వాహనం వెనక నుంచి వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సత్యనారాయణ, సతీష్లు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. టిప్పర్ డ్రైవర్ మహ్మద్ రఫీని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు సమాచారం. -
మహారాష్ట్రలో బీజేపీ ఎమ్మెల్యే బుల్లెట్ల వర్షం
థానె/ముంబై: మహారాష్ట్రలోని ఓ పోలీస్స్టేషన్ బీజేపీ ఎమ్మెల్యే కాల్పుల ఉదంతానికి కేంద్ర బిందువైంది. సీనియర్ ఇన్స్పెక్టర్ ఛాంబర్లోనే శివసేన నేత మహేశ్ గైక్వాడ్పై బీజేపీ ఎమ్మెల్యే గణ్పత్ గైక్వాడ్ కాల్పుల వర్షం కురిపించారు. బుల్లెట్ల గాయాలతో రక్తమోడుతున్న మహేశ్కు ఆపరేషన్ చేసినా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు ప్రకటించారు. పదేళ్ల క్రితం ఎమ్మెల్యే కొనుగోలు చేసిన భూమిని శివసేన నేత మహేశ్ కబ్జా చేశాడని ఆరోపణలున్నాయి. దీనిపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్స్టేషన్కు వెళ్లిన తన కుమారుడితో మహేశ్ మనుషులు దారుణంగా ప్రవర్తించారని ఎమ్మెల్యే ఆరోపించారు. శుక్రవారం అర్ధరాత్రి థానె జిల్లా ఉల్హాస్నగర్ హిల్లైన్ పోలీస్స్టేషన్లో ఈ ఘటన జరిగింది. ‘‘తమ భూమి కబ్జాకు గురైందని ఫిర్యాదుచేసేందుకు ఎమ్మెల్యే కుమారుడు పోలీస్స్టేషన్కు వచ్చారు. అదే సమయానికి మహేశ్ తన మనుషులతో వచ్చారు. గణ్పత్ రాకతో గొడవ పెద్దదై కాల్పులకు దారి తీసింది’’అని అదనపు పోలీస్ కమిషనర్ షిండే వెల్లడించారు. కాల్పుల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అస్సలు బాధ లేదు: ఎమ్మెల్యే కాల్పులు జరిపినందుకు అస్సలు బాధ పడటం లేదని ఎమ్మెల్యే చెప్పారు. పోలీస్స్టేషన్లోనే నా ముందే నా కొడుకును అన్యాయంగా చితకబాదుతుంటే చూస్తూ ఊరుకోవాలా? అందుకే ఐదు రౌండ్లు కాల్చా. శివసేనను చీల్చి బీజేపీతో అంటకాగుతున్న ఏక్నాథ్ షిండే మహారాష్ట్రలో నేర సామ్రాజ్యం సృష్టించారు’’ అని అరెస్ట్కు ముందు చెప్పారు. రాహుల్ పాటిల్ అనే వ్యక్తికీ బుల్లెట్లు తగిలాయి. కాల్పుల ఘటనలో ఎమ్మెల్యేతోపాటు మరో ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తునకు ఆదేశించిన ఫడ్నవిస్ మొత్తం వివాదంపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ శనివారం చెప్పారు. ఆయనది తప్పుందని తేలితే చర్యలు తీసుకుంటామని బీజేపీ పేర్కొంది. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోకూడదని ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అన్నారు. అధికార పార్టీల నేతల ఆగడాలతో రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని రుజువైందని కాంగ్రెస్ పేర్కొంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహేశ్ను ముఖ్యమంత్రి ఏక్నాథ్ కలిసి పరామర్శించారు. -
రామచంద్రాపురం పి ఎస్ క్వార్టర్స్ లో అగ్నిప్రమాదం
-
విచారణకు వెళ్లిబాలికతో అసభ్య ప్రవర్తన
ఖలీల్వాడి (నిజామాబాద్ అర్బన్): నిజామాబాద్ రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలో పనిచేస్తున్న కానిస్టేబుల్ మహేశ్పై పోక్సో కేసు నమోదైంది. కానిస్టేబుల్ మహేశ్ ఓ కేసు విషయమై నిందితుడికి సమన్లు అందించడానికి ఆదివారం నిజామాబాద్ రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలోని గుండారం గ్రామానికి వెళ్లాడు. ఇంట్లో నిందితుడు లేకపోవడంతో పక్కింట్లో ఉన్న బాలికతో మాట్లాడి నిందితుడి వివరాలను తెలుసుకున్నాడు. ఈ క్రమంలో బాలికతో మహేశ్ అసభ్యంగా ప్రవర్తించాడు. తల్లిదండ్రులు రాత్రి ఇంటికి వచ్చాక బాలిక వారికి విషయం చెప్పింది. దీంతో వారు సోమవారం ఉదయం రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కానిస్టేబుల్ వ్యవహారాన్ని ఎస్సై మహేశ్ నిజామాబాద్ సౌత్ సీఐ వెంకటనారాయణకు వివరించారు. ఆయన సీపీ కల్మేశ్వర్ దృష్టికి తీసుకెళ్లారు. సీపీ ఆదేశాల మేరకు పోలీసులు శుక్రవారం మహేశ్పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. మహేశ్ గతంలో ఓ కేసు విషయంలో సస్పెండ్ అయ్యారు. సస్పెన్షన్ ఎత్తేశాక మళ్లీ అదే స్టేషన్లో విధుల్లో కొనసాగుతున్నారు. పోక్సో కింద కేసు నమోదు కావడంతో సదరు కానిస్టేబుల్ పరారీలో ఉన్నాడు. -
Hyderabad: ఫిలింనగర్లో ఎన్ఆర్ఐ దారుణ హత్య
సాక్షి, హైదరాబాద్: ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య జరిగింది. ఇటీవల యూకే నుండి హైదరాబాద్ వచ్చిన ఎన్నారై గౌస్ మొయినుద్దీన్ను దుండగులు హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. వివాహేతర సంబంధం కారణంగానే హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడు గౌస్ మొయినుద్దీన్ ఇటీవల యూకే నుండి నుండి హైదరాబాద్ వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అనంతపురం జిల్లాలో బయటపడ్డ ఎల్లో మీడియా కుట్రలు
-
పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్ సతీశ్ సస్పెండ్
రంగారెడ్డి: పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్గా కె.సతీశ్ బాధ్యతలు చేపట్టి ఆరు నెలలు గడవక ముందే భూ వివాదంలో తలదూర్చారనే ఆరోపణలతో సస్పెండ్ అయ్యారు. 2004 బ్యాచ్కు చెందిన సతీశ్ 2023 జూన్ 14న పహాడీషరీఫ్ సీఐగా బాధ్యతలు చేపట్టారు. ఆరు మాసాల్లో స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల అంశం, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ప్రశాంత వాతావరణంలోనే కొనసాగింది. కానీ అధికార పార్టీ రాష్ట్ర స్థాయి నేతకు సంబంధించిన భూ వివాదంలో తలదూర్చారనే ఆరోపణల నేపథ్యంలో రాచకొండ సీపీ విచారణ చేపట్టి సస్పెండ్ చేశారు. ఈ వివాదంలో ఇన్స్పెక్టర్ మాత్రమే ఉన్నారా...? మరెవరైనా ఉన్నత స్థాయి అధికారులు ఉన్నారా అని స్థానికంగా చర్చలు సాగుతున్నాయి. ఏడాది గడవకుండానే.. రెండు నుంచి మూడేళ్లపాటు విధులు నిర్వహించాల్సిన ఎస్ఎహెచ్ఓలు పహాడీషరీఫ్ పీఎస్లో మాత్రం ఏడాది కూడా పనిచేయడం లేదు. రకరకాల కారణాలతో బదిలీలు, సస్పెండ్ అవుతున్నారు. ►2020 జూలై 23న సీఐగా బాధ్యతలు చేపట్టిన విష్ణువర్ధన్రెడ్డి ఏడాది తిరగకుండానే 2021 జూలై 15న అవినీతి ఆరోపణలతో సస్పెండ్ అయ్యారు. ►2021 ఆగస్టు 4న బాధ్యతలు చేపట్టిన సి.వెంకటేశ్వర్లు 14 నెలలు పనిచేసి 2022 అక్టోబర్ 4న అకస్మాత్తుగా బదిలీ అయ్యారు. ► అక్టోబర్లో బాధ్యతలు చేపట్టిన కిరణ్ కుమార్ 2023 మార్చిలో రాజకీయ ఫిర్యాదులతో బదిలీ అయ్యారు. మూడు నెలల పాటు డీఐ కాశీ విశ్వనాథ్ ఇన్చార్జి ఎస్హెచ్ఓగా కొనసాగారు. ► 2023 జూన్ 14న బాధ్యతలు చేపట్టిన సతీశ్ ఆరు నెలలు గడవక ముందే భూ వివాదం ఆరోపణలతో 2024 జనవరి 7న సస్పెండ్ అయ్యారు. స్నేక్ గ్యాంగ్ ఉదంతం నుంచి స్నేక్ గ్యాంగ్ లాంటి ఉదంతంతో రాష్ట్ర వ్యాప్తంగా మార్మోగిన పహాడీషరీఫ్ పీఎస్పై పోలీసు ఉన్నతాధికారుల ప్రత్యేక నిఘా ఉంటుంది. ఒకవైపు హత్యలు, హత్యాయత్నాల లాంటి నేరాలకు ఆస్కారం ఉండడం.. ఆపై నగర శివారు కావడంతో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారం కొనసాగుతున్న ఈ ఠాణా పరిధిలో విధి నిర్వహణ కత్తిమీద సాములాంటిదే. పై స్థాయి అధికారుల ఆదేశాల కోసం భూ వివాదాలలో తలదూర్చి స్థానిక పోలీసులు తమ మెడకు చుట్టుకున్న సందర్భాలు సైతం గతంలో వెలుగు చూశాయి. ఏదేమైనా తరచూ ఎస్హెచ్ఓలు మారుతుండడంతో నేరాల నివారణ, ఈ ప్రాంతంపై పట్టు సాధించడం కొత్తగా వచ్చిన అధికారులకు ఇబ్బందికరంగా మారుతోంది. -
కట్నం ఇవ్వలేదని శోభనం అడ్డుకున్న కుటుంబ సభ్యులు
కర్ణాటక: కట్నం ఇవ్వలేదని శోభనం జరగకుండా అడ్డుకున్న ఆమె భర్త, అతని కుటుంబ సభ్యులపై వివాహిత బసవనగుడి మహిళా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వివరాలు...బాధిత మహిళకు 2022 జూన్ 6న అవినాశ్ శర్మతో వివాహం జరిగింది. వివాహ సమయంలో వరుడు కుటుంబ సభ్యులు కట్నం వద్దన్నారు. వివాహమై భర్త ఇంట్లోకి అడుగుపెట్టిన రోజు వరుడి తండ్రి మీ కుటుంబ సభ్యులు తనకు రూ.15 లక్షలు ఇస్తామని తెలిపారని, ఆ డబ్బు ఇవ్వకపోతే మొదటిరాత్రి శోభనానికి అనుమతించేదిలేదని కోడలిని బెదిరించాడు. ఈ విషయం కోడలు తల్లిదండ్రులకు తెలపడంతో డబ్బు ఇవ్వడానికి తల్లిదండ్రులు కొద్దిరోజులు సమయం ఇవ్వాలని కోరారు. 2022 జూన్ 22 తేదీన బాధిత మహిళ తల్లిదండ్రులు రూ.5.8 లక్షలు నగదు ఇచ్చారని మహిళ ఫిర్యాదులో పేర్కొంది. స్నానం చేస్తుండగా గమనించేవారు ఇంతటితో మిన్నకుండిన భర్త కుటుంబ సభ్యులు మిగిలిన రూ.10 లక్షలు ఇవ్వకుంటే ఇంట్లో ఉండనిచ్చేదిలేదని కోడల్ని బెదిరించారు. స్నానం చేస్తుండగా భర్త తండ్రి చాటుగా గమనించేవాడు. దీనిపై కోడలు మామను ప్రశ్నించగా ఎవరికై నా చెబితే నిన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తామని బెదిరించారని మహిళా ఫిర్యాదులో ఆరోపించింది. బాధిత మహిళ మళ్లీ పుట్టింటికి వెళ్లి తమ గోడు వెళ్లబోసుకుంది. తల్లిదండ్రులు అల్లుడి ఇంటి వద్దకు విచారించగా మేము చెప్పినట్లు వినాలని లేకపోతే ఇప్పుడే రూ.15 లక్షల డబ్బు ఇవ్వాలని తెలిపారు. అనంతరం మహిళ కుటుంబసభ్యులు అక్కడ నుంచి తమ ఇంటికి వెళ్లిపోయారు. నాకు సంబంధించిన పత్రాలు అత్తగారింట్లో ఉన్నాయని వీటి గురించి అడిగితే డబ్బు ఇచ్చి మీ పత్రాలు తీసుకెళ్లాలని తెలిపారని ఫిర్యాదులో బాధితురాలు తెలిపింది. -
మార్నింగ్ వాక్ కు వెళ్లిన మహిళ అదృశ్యం
హైదరాబాద్: మార్నింగ్ వాక్కు వెళ్లిన మహిళ అదృశ్యమైన సంఘటన మధురానగర్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. జి.రాజేశ్వరి, రవికుమార్ దంపతులు తమ కుమారుడు లోకేషకుమార్తో కలిసి మధురానగర్లో నివాసం ఉంటున్నారు. ఈనెల 30న రాజేశ్వరి మార్నింగ్వాక్కు వెళుతున్నట్లు చెప్పి వెళ్లి సాయంత్రం వరకు తిరిగి రాలేదు. మధ్యాహ్నం లోకేష్ అత్తగారికి ఫోన్ చేసి తనను ఎవరూ అర్థం చేసుకోవడం లేదని, తాను చనిపోనని, ఇంటికి మాత్రం రానని చెప్పింది. ఆమె కోసం గాలించినా ప్రయోజనం లేకపోవడంతో లోకేష్ ఆదివారం మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
సిగరెట్ తాగుతూ పీఎస్ ఎదుట రీల్స్ చేసినందుకు..
హైదరాబాద్: పోలీస్ స్టేషన్ ఎదుట సిగరెట్ తాగుతూ రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేసిన వ్యక్తికి న్యాయస్థానం 8 రోజుల జైలు శిక్ష విధించింది. రాంగోపాల్పేట్ ఇన్స్పెక్టర్ లింగేశ్వర్ కథనం ప్రకారం పాటిగడ్డ ఎన్బీటీనగర్కు చెందిన ప్రైవేటు ఉద్యోగి వంశీకృష్ణ (25) ఈ నెల 17న రాంగోపాల్పేట్ పోలీస్ స్టేషన్ ఎదుట సిగరెట్ తాగుతూ రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిని గమనించిన రాంగోపాల్పేట్ పోలీసులు అతనిపై ఈ పెట్టీ కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరుచగా సికింద్రాబాద్ 16వ ప్రత్యేక మెట్రోపాలిటన్ మేజి్రస్టేట్ అతడికి 8 రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. -
చింతపల్లి ఠాణాకు వాస్తు దోషం!
చింతపల్లి: నల్లగొండ జిల్లాలోని చింతపల్లి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించేందుకు వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఎస్ఐలు పోటీ పడుతుంటారు. హైదరాబాద్–నాగార్జునసాగర్ రాష్ట్ర రహదారిపై ఉన్న చింతపల్లి పోలీస్స్టేషన్కు అంత క్రేజి ఏర్పడింది. అంతా శుభం అనుకొని డ్యూటీలో జాయిన్ అ యిన ఎస్ఐలు కొన్ని నెలలకే అనూహ్యంగా వివా దాలతో బదిలీ అవుతున్నారు. ఇలా ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. పది నెలల వ్యవధిలో పదకొండు మంది ఎస్ఐలు వేర్వేరు కారణాలతో బదిలీ అయ్యారు. దీంతో చింతపల్లి పోలీస్స్టేషన్కు వాస్తు దోషం పట్టుకుందని భావించిన అధికారులు.. తాజాగా స్టేషన్ ముందు భాగాన్ని కూల్చివేశారు. క్లిన్చిట్తో వచ్చి.. వివాదాలతో.. చింతపల్లి పోలీస్ స్టేషన్కు ఎస్ఐగా పని చేసేందుకు ఎక్కువ సంఖ్యలో ఆసక్తి కనబరుస్తుంటారు. ఈ క్రమంలో క్లీన్ చిట్తో స్టేషన్ ఎస్ఐగా వచ్చిన పలువురు అనుకోకుండా పలు కేసుల్లో జోక్యం చేసుకోవడం, భూ తాగాదాల్లో తలదూర్చడం వంటి కారణాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ పని చేసిన పలువురు ఎస్ఐలు వివాదాలతో బదిలీ అవుతున్నారు. వాస్తు దోషం ఎఫెక్ట్ చింతపల్లి పోలీస్ స్టేషన్లో పనిచేసిన పలువురు ఎస్ఐలు వివాదాలతో బదిలీ అవుతుండడంతో ఇక్కడి స్టేషన్కు వాస్తు దోషం భయం పట్టుకుంది. ఈ క్రమంలో తాజాగా శుక్రవారం చింతపల్లి పోలీస్ స్టేషన్లోని ముందు భాగాన్ని కూల్చిన అధికారులు వాస్తు దోషాన్ని సరిచేసే పనిలో ఉండడం గమనార్హం. ఏదేమైనా చింతపల్లి పోలీస్స్టేషన్కు రావాలనుకునే ఎస్ఐలకు వరుసపెట్టి చోటు చేసుకుంటున్న ఘటనలు గుబులు పుట్టిస్తున్నాయి. -
jadcherla:తలకు మించిన పనిభారంతో సతమతమవుతున్న పోలీస్స్టేషన్ సిబ్బంది!
జడ్చర్ల: రెండు జాతీయ రహదారులు కలయుకతో పాటు పారిశ్రామికంగా, వ్యాపార వాణిజ్యపరంగా, తదితర అనేక రంగాలకు సంబంధించి నిత్యం రద్దీని సంతరించుకున్న జడ్చర్లలో పోలీసుల సత్వర సేవల ఆవశ్యకత ఎంతైనా ఉంది. సకాలంలో పోలీసుల సేవలు అందకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేగాక నేరాలు, తదితర చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై సరైన నిఘా పెట్టలేని పరిస్థితి నెలకొంది. వీటికి తోడు ట్రాఫిక్ సమస్యను కూడా స్థానిక పోలీసులే పర్యవేక్షించాల్సి రావడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. చోరీలు, తదితర నేరాల నియంత్రణ కష్టతరమైంది. వీటన్నింటి పరిష్కారానికి జడ్చర్లలో పోలీస్ సబ్డివిజన్ ఏర్పాటుతో పాటు ప్రత్యేకంగా రూరల్ పోలీస్స్టేషన్, ట్రాఫిక్ పోలీస్స్టేషన్లను ఏర్పాటు చేస్తే తప్పా సమస్యల పరిష్కారానికి నోచుకోలేని పరిస్థితి నెలకొంది. రూరల్ స్టేషన్కు ఎదురుచూపులు.. జడ్చర్లలో రూరల్ పోలీస్స్టేషన్ ఏర్పాటుకు ప్రజలు ఎదురుచూస్తున్నారు. దశాబ్ద కాలంగా రూరల్ పోలీస్స్టేషన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ బలంగా ఉంది. పట్టణం రోజు రోజుకు నలుదిక్కులా విస్తరిస్తుండటంతో పాటు ఓ వైపు 44వ నంబర్ జాతీయ రహదారి, మరో వైపు 167 నంబర్ జాతీయ రహదారి ఉన్నాయి. వీటితో పాటు మండల పరిధిలోని పోలేపల్లి గ్రామ శివారులో ఏర్పాటు చేసిన సెజ్, గ్రీన్ ఇండస్ట్రీయల్ ఏరియాతో నియోజకవర్గం కేంద్రంగా ఉన్న జడ్చర్ల పోలీస్స్టేషన్ బిజీబిజీగా మారింది. ఇటువంటి పరిస్థితుల్లో చోటు చేసుకుంటున్న పలు సమస్యలు సకాలంలో పరిష్కారానికి నోచుకోక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జడ్చర్ల పోలీస్స్టేషన్ పరిధిలో బాదేపల్లి, కావేరమ్మపేట(జడ్చర్ల) జంట పట్టణంతో పాటు మండల పరిధిలోని 45 గ్రామపంచాయతీలు, వాటి పరిధిలోని 23 అనుబంధ తండాలు, తదితర నివాస ప్రాంతాలు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో లక్షకు పైగా జనాభా ఉంది. ఒక్క జడ్చర్ల పట్టణంలోనే దాదాపు 80 వేలకు పైగా జనాభా ఉంది. ఇంత జనాభాకు సంబంధించి ఒకే ఒక పోలీస్స్టేషన్ ఉండటంతో ప్రజలకు సత్వర పోలీస్సేవలు అందడం లేదనే అపవాదు ఉంది. ట్రాఫిక్ సమస్యలతో.. పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు తీవ్రమవుతుండటంతో ట్రాఫిక్ నియంత్రణ కూడా పోలీసులే చూడాల్సి వస్తుంది. పట్టణంలోని నడిబొడ్డున జాతీయ రహదారులతో పాటు అంతర్రాష్ట్రీయ రహదారులు ఉన్నాయి. దీంతో వాహనాల రద్దీ తీవ్రంగా ఉంటుంది. రోడ్లు ఇరుగ్గా ఉండటంతో రాకపోకలు స్తంభించిపోతున్నాయి. పనిభారంతో సతమతం.. జడ్చర్ల పోలీస్స్టేషన్లో పనిచేస్తున్న సిబ్బంది తలకు మించిన పనిభారంతో సతమతమవుతున్నారు. స్టేషన్లో సిబ్బంది కొరత కూడా వేధిస్తుంది. మండల పరిధిలోని సెజ్లో పరిశ్రమల సంఖ్య పెరుగుతుండటంతో అక్కడికి సంబంధించిన శాంతిభద్రతల సమస్యల పరిరక్షణ బాధ్యత పోలీసులపైనే ఉంటుంది. జిల్లాలోనే అధిక నేరాలు నమోదవుతున్న పోలీస్స్టేషన్లలో జడ్చర్ల ప్రధానంగా ఉంది. ప్రతి ఏడాది దాదాపుగా 500–600 వరకు కేసులు నమోదవుతున్నాయి. గత ఏడాది దాదాపు 800 పైచిలుకు కేసులు నమోదయ్యాయి. ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు.. జడ్చర్లలో పోలీస్ సబ్డివిజన్తో పాటు రూరల్, ట్రాఫిక్ పోలీస్స్టేషన్ల ఏర్పాటుకు సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ప్రతిపాదనలు పంపించారు. ట్రాఫిక్ పోలీస్స్టేషన్ భవన నిర్మాణ పనులకు అప్పటి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కొబ్బరికాయ కూడా కొట్టారు. ఇటీవల ఎన్నికల ప్రచార సభకు వచ్చిన అప్పటి సీఎం కేసీఆర్ కూడా రూరల్, ట్రాఫిక్ స్టేషన్ల ఏర్పాటుకు హామీ ఇచ్చారు. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఈ ప్రతిపాదనలు కూడా అటకెక్కే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికై నా డివిజన్ కార్యాలయంతో పాటు రూరల్, ట్రాఫిక్ స్టేషన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజలకు అందుబాటులో సేవలు.. జడ్చర్ల పట్టణంతో పాటు మండల ప్రజలకు సకాలంలో సేవలు అందించేందుకు కృషి చేస్తున్నాం. జడ్చర్ల మున్సిపాలిటీ మరియు గ్రామీణ ప్రాంతాలు, తండాలకు కలిపి ఒకే పోలీస్స్టేషన్ ఉంది. రూరల్ పోలీస్ స్టేషన్ ఏర్పాటయితే ప్రజలకు మరింత సౌకర్యంగా ఉంటుంది. –రమేశ్బాబు, సీఐ, జడ్చర్ల ఏర్పాటుకు కృషి.. జడ్చర్లలో రూరల్ పోలీస్స్టేషన్ అవసరం ఎంతో ఉంది. ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడి ప్రజలు రూరల్ పోలీస్స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. రూరల్ పోలీస్స్టేషన్ ఏర్పాటుపై గత పాలకులు నిర్లక్ష్యం వహించారు. తమ హయాంలో రూరల్ పోలీస్స్టేషన్ ఏర్పాటుకు కృషి చేస్తాం. – అనిరుద్రెడ్డి, ఎమ్మెల్యే, జడ్చర్ల -
బాలింత మృతి.. వైద్యురాలి నిర్లక్ష్యమే కారణమన్న బంధువులు.. పోలీస్ స్టేషన్కు పంచాయతీ!
కొల్లాపూర్: కొల్లాపూర్ పట్టణంలోని ఓ ప్రైవేటు నర్సింగ్ హోం వద్ద గురువారం కొందరు ఆందోళనకు దిగారు. బాలింత మృతికి మీ నిర్లక్ష్యమే కారణం అంటూ వైద్యురాలితో వాగ్వాదానికి దిగారు. ఈ పంచాయితీ పోలీస్స్టేషన్ వరకు చేరింది. చివరికి మధ్యవర్తులు రాజీ కుదిర్చారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దకొత్తపల్లి మండలం యాపట్లకి చెందిన రజిత(21)కు ఏడాదిన్నర కిందట చారకొండ మండలం తుర్కలపల్లికి చెందిన సురేష్తో వివాహమైంది. రజిత గర్భిణి కావడంతో కొల్లాపూర్లోని ఓ ప్రైవేటు నర్సింగ్హోంలో ఈ నెల 3న ఆమెకు కాన్పు చేయించారు. సాధారణ కాన్పులో ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. హెర్నియా సమస్య కారణంగా ఆమె ఆరోగ్యం నిలకడగా లేకపోవడంతో మెరుగైన చికిత్స నిమిత్తం ఆస్పత్రి వైద్యురాలు మహబూబ్నగర్కు రెఫర్ చేశారు. అక్కడ కూడా ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగు పడకపోవడంతో హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ ఈ నెల 16న మృతిచెందింది. మృతురాలి కుటుంబీకులు కొందరు స్థానిక నాయకులతో కలిసి గురువారం సంబంధిత డాక్టర్ వద్దకు వెళ్లారు. రజిత అమ్మమ్మగారి ఊరు పెంట్లవెల్లి మండలంలోని మల్లేశ్వరం కావడంతో ఆ మండలానికి చెందిన హరిప్రసాద్, గోపినాయక్, తెలంగాణ దళితదండు నాయకులు బచ్చలకూర బాలరాజు మృతురాలి కుటుంబం తరఫున వైద్యురాలితో మాట్లాడారు. సరైన వైద్యం అందకపోవడంతోనే ఆమె మృతిచెందింది. ఆమె బిడ్డకు తల్లి లేకుండా పోయింది. ఆ కుటుంబానికి పరిహారం చెల్లించాలని కోరారు. ఈ క్రమంలో వైద్యురాలిపై కొందరు దురుసుగా మాట్లాడారు. దీంతో ఆమె వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు స్టేషన్కు వెళ్లింది. పట్టణానికి చెందిన ప్రైవేటు ఆస్పత్రుల వైద్యులు ఆమెకు సంఘీభావంగా స్టేషన్కు చేరుకున్నారు. స్టేషన్లో వైద్యురాలికి, మృతురాలి తరఫున వచ్చిన వారికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. స్థానిక నాయకులు కొందరు జోక్యం చేసుకుని ఇరువురి మధ్య రాజీ కుదిర్చారు. రూ.లక్ష పరిహారం చెల్లించేలా వైద్యురాలిని ఒప్పించినట్లు తెలిసింది. అయితే పరిహారం చెల్లింపు విషయంలో ఎటువంటి స్పష్టత రాలేదని, శుక్రవారం మరోసారి చర్చలు జరుపుతామని మృతురాలి తరఫు వారు తెలిపారు. ఈ ఘటనపై ఇరువర్గాలు తమకు ఎటువంటి ఫిర్యాదులు ఇవ్వలేదని ఏఎస్ఐ రామస్వామిగౌడ్ తెలియజేశారు. -
పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంట
మదనపల్లె : కులాంతర వివాహం చేసుకున్న ప్రేమికులు కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందంటూ ఆదివారం తాలూకా పోలీసులను ఆశ్రయించారు. మదనపల్లె మండలం అంకిశెట్టిపల్లె పంచాయతీ తుమ్మల తాండాకు చెందిన శంకరనాయక్ కుమారుడు గణేష్నాయక్(22) తిరుపతిలో ఎంబీఏ చదువుతున్నాడు. శ్రీకాళహస్తికి చెందిన సుధాకర్గౌడ్ కుమార్తె గీతావాణి తిరుపతిలో ఎంసీఏ చదువుతోంది. ఈ క్రమంలో ఇద్దరూ రెండేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. అయితే గీతావాణి తల్లిదండ్రులకు ప్రేమవివాహం ఇష్టం లేదు. దీంతో గీతావాణి రెండురోజుల క్రితం ఇంట్లో నుంచి పారిపోయి, ఆదివారం మదనపల్లెలోని ప్రియుడు గణేష్నాయక్ ఇంటికి వచ్చేసింది. ఇద్దరూ కలిసి పట్టణంలోని అయోధ్యనగర్ రామాలయంలో కులాంతర వివాహం చేసుకున్నారు. గీతారాణి తల్లిదండ్రుల నుంచి ప్రాణహాని ఉంటుందని భయపడి తాలూకా పోలీసులను ఆశ్రయించి రక్షణ కల్పించాల్సిందిగా కోరారు. ప్రేమికులిద్దరూ మేజర్లు కావడంతో రక్షణ కల్పించనున్నట్లు పోలీసులు తెలిపారు. -
వీడు మహా కేటుగాడు! డైరెక్ట్గా పోలీస్టేషన్లనే ఏం చేశాడో తెలిస్తే షాక్!
హైదరాబాద్: తాను బ్రెజిల్కు చెందినవాడినని, హైదరాబాద్ పర్యటనకు రాగా తన పర్సుతో పాటు ల్యాప్టాప్ కూడా చోరీ అయిందని ఈ నెల 7వ తేదీన అచ్చు విదేశీ యువకుడిలాగా ఉన్న ఓ వ్యక్తి జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్కు వచ్చాడు. జూబ్లీహిల్స్ డీఐ వీరశేఖర్ సదరు వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు సరైనదేనని నమ్మి పర్సు ఎక్కడ పోగొట్టుకున్నాడో ఆ ప్రాంతానికి వెళ్లి రోజంతా సీసీ ఫుటేజీలు వెతికారు. ఎలాంటి ఆచూకీ దొరకలేదు. తనకు తినడానికి కూడా డబ్బులు లేవని ఆ యువకుడు చెప్పగా రూ.500 ఇచ్చి పంపించారు. ఆ మరుసటి రోజు భువనగిరి పోలీస్ స్టేషన్కు వెళ్లిన అదే యువకుడు తన పర్సు పోయిందని, తాను అమెరికా నుంచి వచ్చానని అక్కడ పోలీసులకు చెప్పగా రోజంతా వారు కూడా సీసీ ఫుటేజీలు వడపోశారు. ఖర్చులకు డబ్బులు లేవని చెప్పగా రూ.1500 ఇచ్చి పంపారు. తాజాగా ఈ నెల 9న అదే యువకుడు మధురానగర్ పోలీస్ స్టేషన్కు వెళ్లి తన పర్సు పోయిందని ఫిర్యాదు చేశాడు. తిండికి డబ్బులు లేవని చెప్పడంతో జాలిపడ్డ అక్కడి పోలీసులు రూ.1000 ఇచ్చి పంపించారు. తీరా ఈ యువకుడి గురించి ఆరా తీస్తే గోవాకు చెందిన సెబీ డిసిల్వాగా గుర్తించారు. సదరు యువకుడు అచ్చం విదేశీ పోలికలతో ఉండటంతో పోలీసులు కూడా విదేశీయుడనే భ్రమపడి ఫిర్యాదును స్వీకరించి విచారణ చేపట్టేవారు. ఖర్చుల కోసం అడిగితే డబ్బులు కూడా ఇచ్చారు. తీరా సదరు యువకుడి గురించి లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులకు గోవాకు చెందిన వాడని, ఇలాగే రాజస్థాన్, బీహార్, గోవాలలో మోసాలకు పాల్పడి రిమాండ్ అయినట్లు తేలింది. రోజువారి ఖర్చుల కోసం ఇలాగే పర్సు పోయిందని ఠాణాల్లో ఫిర్యాదులు చేస్తూ ఎంతో కొంత పోలీసుల నుంచే తీసుకొని రోజులు గడిపేస్తున్నట్లుగా తేలింది. ఈ సరికొత్త వసూళ్ల పథకం గురించి తెలుసుకున్న పోలీసులు నోరెళ్లబెడుతున్నారు. పోలీసులకు టోకరా వేస్తున్న వైనం చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. ఇక ముందు ఈ యువకుడు పర్సు పోయిందని, ల్యాప్ట్యాప్ పోయిందని ఫిర్యాదు చేస్తే నమ్మవద్దని చెబుతున్నారు. ఇవి కూడా చదవండి: దాయాదులు పొలానికి దారి ఇవ్వలేదని యువకుడు తీవ్ర నిర్ణయం! -
శభాష్ .. వెంకటసుబ్బయ్య !
కడప అర్బన్ : ఓ మహిళ ఆటోలో వెళుతూ రూ. 2లక్షలు విలువైన బంగారు ఆభరణాలు ఉన్న హ్యాండ్ బ్యాగును మరచిపోయింది. ఆటోలో బ్యాగును గుర్తించిన డ్రైవర్ వెంకట సుబ్బయ్య పోలీస్ స్టేషన్లో అప్పగించి అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారు. జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ సోమవారం కడపలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆటో డ్రైవర్ నల్లకట్ల వెంకట సుబ్బయ్యకు ప్రశంసాపత్రాన్ని అందజేసి ప్రత్యేకంగా అభినందించారు. వివరాలిలా ఉన్నాయి. రాజంపేటకు చెందిన మేరువ వెంగమ్మ జంగాలపల్లెలోని తన తల్లి ఇంటికి శుభకార్య నిమిత్తం వచ్చింది. ఈనెల 2న కమ్మపల్లెకు వెళ్లి సాయంత్రం ఆటోలో జంగాలపల్లెకు తిరుగు ప్రయాణమైంది. ఈ నేపథ్యంలో ఆటోలో బంగారు నగలున్న బ్యాగును మరిచిపోయింది. బ్యాగును గుర్తించిన ఆటో డ్రైవర్ వెంటనే సమీపంలోని సిద్దవటం పోలీస్ స్టేషన్కు చేరుకుని ఒంటిమిట్ట సీఐ పురుషోత్తం రాజుకు అందజేశారు. బాధిత మహిళకు పోలీసులు సమాచారం ఇచ్చి నగలతో కూడిన బ్యాగు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె ఆటో డ్రైవర్కు, పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది. -
పేలుడు పదార్థాల సరఫరా కేసులో.. 8 మందిపై ఎన్ఐఏ చార్జిషీట్
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భద్రతాదళాలపై పేలుళ్లు జరిపేందుకు కుట్ర పన్నిన ఎనిమిది మంది మావోయిస్టులపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) శుక్రవారం చార్జిషిట్ దాఖలు చేసింది. మావోయిస్టులకు పేలుడు పదార్థాలు సరఫరా చేస్తున్న వ్యక్తులపై 2023 జూన్ 5న చెర్ల పోలీస్స్టేషన్ పరిధిలో కేసు నమోదైంది. ఈ కేసుతో సంబంధం ఉన్న ఎనిమిది మంది నిందితులపై ఐపీసీ సెక్షన్ 120(బీ), 143, 147, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం సెక్షన్ 10,13,18,20ల కింద కేసులు నమోదు చేసినట్లు పేర్కొంది. పట్టుబడిన నిందితులు మావోయిస్టులకు కొరియర్లుగా పనిచేస్తున్నట్లు చార్జిషీట్లో తెలిపింది. మావోయిస్టులకు పేలుడు పదార్థాలు, డ్రోన్లు, లేథ్ మెషీన్లు సరఫరా చేస్తుండగా పునెం నాగేశ్వరరావు, దేవనూరి మల్లికార్జున రావు, వొల్లిపోగుల ఉమాశంకర్ను అరెస్టు చేశారు. ఆ తర్వాత వారి నుంచి సేకరించిన సమాచారం మేరకు జన్ను కోటి, ఆరేపల్లి శ్రీకాంత్, తాళ్లపల్లి ఆరోగ్యం, బొంత మహేందర్, సోనబోయిన కుమారస్వామిని అరెస్టు చేసినట్లు ఎన్ఐఏ తెలిపింది. పునెం నాగేశ్వరావు, దేవనూరి మల్లికార్జునరావు, వొల్లిపోగుల ఉమాశంకర్లు 2023 మార్చిలో డ్రిల్ మిషన్, మే 2023లో ఒక లేథ్ మిషన్ కొనుగోలు చేసినట్లు తమ దర్యాప్తులో వెల్లడైనట్లు ఎన్ఐఏ పేర్కొంది. ఈ ముగ్గురు నిందితులు మే లో డ్రోన్లు, పేలుడు పదార్థాలు గుర్తించినట్లు తెలిపింది. -
మొయినాబాద్లో రూ.7.5 కోట్లు పట్టివేత
మొయినాబాద్/సాక్షి, హైదరాబాద్: ఎన్నికల వేళ మొయినాబాద్లో భారీగా నగదు పట్టుబడటం కలకలం రేపింది. శనివారం సాయంత్రం అజీజ్నగర్ రెవెన్యూలోని ఓ మట్టి రోడ్డులో ఏకంగా ఆరు కార్లలో తరలిస్తున్న రూ.7.5 కోట్లను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. కార్లలో ఉన్న తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. డబ్బులు తరలిస్తున్న కార్ల నంబర్లు టీఎస్ 36 కె 3030, టీఎస్ 07 జేకే 4688, టీఎస్ 09 ఈడబ్ల్యూ 3747, ఏపీ 39 ఏఎం 4442, టీఎస్ 02 ఎఫ్ఈ 8332, టీఎస్ 09 జీబీ 5841. రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్రెడ్డి, చేవెళ్ల ఏసీపీ ప్రశాంత్రెడ్డి, ఐటీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. డబ్బులను ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు..? అనే విషయాలపై ఆరా తీస్తున్నామని.. విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని డీసీపీ చెప్పారు. కార్లను మొయినాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఓ విద్యా సంస్థ చైర్మన్ ఇంట్లో నుంచి బయటకొచ్చిన కార్లు? మొయినాబాద్లో నగదు తరలిస్తూ పట్టుబడిన కార్లు ఓ విద్యా సంస్థ చైర్మన్ ఇంట్లో నుంచి బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. అజీజ్నగర్ రెవెన్యూలో విద్యా సంస్థ నిర్వహిస్తున్న ఆ సంస్థ చైర్మన్ హిమాయత్సాగర్ జలాశయం ఒడ్డునే నివాసముంటున్నట్లు సమాచారం. ఆ ఇంట్లో నుంచి కార్లు బయటకు రాగానే విశ్వసనీయ సమాచారంతో ఎస్ఓటీ పోలీసులు కార్లను పట్టుకున్నట్లు తెలిసింది. కార్లలో డబ్బును ఎక్కడికి తరలిస్తున్నారనే విషయాలు మాత్రం తెలియలేదు. కార్లు పట్టుబడింది ఓ మంత్రి డెయిరీ ఫాం పక్కనే కావడం విశేషం. ఆ విద్యా సంస్థ చైర్మన్ ఇంట్లో ఐటీ సోదాలు? కాగా ఆ విద్యా సంస్థ చైర్మన్ ఇంట్లో ఐటీ అధికారులు శనివారం రాత్రి సోదాలు చేపట్టినట్టు సమాచారం. అక్కడి ఇంటితో పాటు ఐటీ అధికారులు, పోలీసులు సదరు చైర్మన్కు సంబంధించిన ఫుట్ బాల్ అకాడమీ, క్రికెట్ అకాడమీ కార్యాలయాల్లో సైతం సోదాలు చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కార్లలో పట్టుబడిన ఆ సొమ్ముతో సదరు సంస్థకు ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నట్టు తెలిసింది. -
ఆర్కే వ్యాలీ పోలీస్ స్టేషన్లను ప్రారంభించిన సీఎం జగన్
-
ఇడుపులపాయలో రెండో రోజు సీఎం జగన్ (ఫొటోలు)
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పాపం రాహుల్ త్రిపాఠి.. షాక్లో కావ్య మారన్! వీడియో వైరల్
పుష్ప-2 మరో అప్డేట్ వచ్చేసింది.. అదేంటంటే?
రామేశ్వరం కేఫ్ పేలుడు.. పలు రాష్ట్రాల్లో ఎన్ఐఏ దాడులు
ఓ వైపు టెన్షన్.. మరోవైపు ఉత్సాహం: స్టేడియంలో తళుక్కుమన్న షారుఖ్ (ఫొటోలు)
అప్పుడు 'నీ తండ్రి స్థాయి తెలుసా అన్నారు': దీపిందర్ గోయల్
HYD: ఏసీపీ నివాసంలో సోదాలు.. బయటపడుతున్న నోట్ల కట్టలు
శ్యామలపై తప్పుడు కథనాలు.. చట్టపరంగానే ముందుకెళ్తానన్న యాంకర్!
స్టార్క్ సూపర్ డెలివరీ.. హెడ్కు ఫ్యూజ్లు ఔట్
భారీగా పెరిగిన ఫ్లిప్కార్ట్ గ్రోసరీ బిజినెస్
లిక్కర్ కేసు: మనీష్ సిసోడియాకు మళ్లీ చుక్కెదురు
తప్పక చదవండి
- రాహుల్ విరామం తీసుకోవడమే మేలు: పీకే
- హార్దిక్ తప్పేం లేదు.. అంతా సీనియర్ల వల్లే: ముంబై మాజీ కెప్టెన్
- లవ్ ఫర్ లగ్జరీ కార్ : నాగ చైతన్య కొత్త కారు, ధర తెలిస్తే!
- మాజీ జడ్జి గంగోపాధ్యాయ ప్రచారంపై ‘ఈసీ’ బ్యాన్
- 2030 నాటికి భారత్ 11.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించాలి.. లేకుంటే?
- ఎల్లో మీడియాకు చెప్పకుండా బాబు ఎక్కడికి వెళ్లారు? జోగి రమేష్
- జూన్ 1 నుంచి డ్రైవింగ్ లెసెన్స్లు జారీ చేయనున్న ప్రైవేట్ కంపెనీలు
- అంతర్జాతీయ 'టీ' దినోత్సవం! ఈ వెరై'టీ'లు ట్రై చేశారా?
- వైఎస్సార్సీపీ గెలుపును ఖరారు చేసిన ఎల్లో మీడియా!.. ఈ రాతలు అందుకేనా?
- బంగారం కొనుగోలు దారులకు భారీ ఊరట
Advertisement