కవాడిగూడలో ముగ్గురు బాలికల అదృశ్యం | Three girls missing in Hyderabad | Sakshi
Sakshi News home page

కవాడిగూడలో ముగ్గురు బాలికల అదృశ్యం

Jul 20 2026 11:43 AM | Updated on Jul 20 2026 12:36 PM

Three girls missing in Hyderabad

పొరుగింటి అమ్మాయితో కలిసి వెళ్లిన అక్కాచెల్లెలు 

హైదరాబాద్‌: దోమలగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ముగ్గురు బాలికలు అదృశ్యమయ్యారు. ఇన్‌స్పెక్టర్‌ అంజద్‌ అలీ తెలిపిన మేరకు.. చత్తీస్‌ఘడ్‌క చెందిన టోటారాం కుటుంబం ఫరీద్‌ బస్తీలో నివాసముంటోంది. వీరికి ఇద్దరు కూతుళ్లు సహిత కుమారి(16), స్నేహ కుమారి(14). ఇద్దరూ ఇంటివద్దే ఉంటున్నారు.ఇంటిపక్కనే ఉన్న బంధువు రోహిణి కూతురు  లత (14)తో కలిసి ముగ్గురూ శనివారం హిమాయత్‌నగర్‌లో ఆటో ఎక్కొ వెళ్లి పోయారు. తల్లిదండ్రులు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కాచిగూడ రైల్వే స్టేషన్‌ వైపు వెళ్లినట్లు నిర్ధారించారు. రైలులో వెళ్లారా.. లేదా అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement