లింగాల పీఎస్‌ ముందు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ధర్నా | Ys Avinash Reddy Dharna In Front Of Lingala Police Station | Sakshi
Sakshi News home page

లింగాల పీఎస్‌ ముందు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ధర్నా

Nov 8 2025 11:05 AM | Updated on Nov 8 2025 11:34 AM

Ys Avinash Reddy Dharna In Front Of Lingala Police Station

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: లింగాల పోలీస్‌ స్టేషన్‌ ముందు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ధర్నాకు దిగారు. వారం రోజులుగా రైతుల మోటార్ల వైర్లు అపహరణకు గురవుతున్నాయి. గత రాత్రి 25 మంది రైతుల కేబుల్ వైర్లు చోరీ అయ్యాయి. రైతులకు న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ ముందు రైతులతో కలిసి వైఎస్‌ అవినాష్‌రెడ్డి ఆందోళన చేపట్టారు.

రైతులకు లక్షలాది రూపాయల నష్టం జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదు. వెంటనే నిందితులను పట్టుకుని రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్‌ అవినాష్‌రెడ్డి ధర్నాకు దిగారు.

Advertisement
 
Advertisement
Advertisement