సాక్షి, కృష్ణా జిల్లా: చల్లపల్లి పోలీస్స్టేషన్లో పేలుడు సంభవించింది. మందుగుండు సామాగ్రి పేలడంతో ఎస్ఐ, ముగ్గురు కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
సీజ్ చేసిన టపాసులు కోర్టుకు తరలిస్తుండగా ఒక్కసారిగా పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. పోలీసు జీపు స్వల్పంగా ధ్వంసమైంది. గాయపడిన పోలీసులను చల్లపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.


