-
ఏపీలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం
సాక్షి, విజయవాడ: ఏపీలో వాతావరణం చల్లబడింది. పలు జిల్లాల్లో నల్లటి మేఘాలు కమ్మేసి, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. వర్షపు నీటితలో లోతట్లు ప్రాంతాలన్నీ నిటమునిగాయి. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. బైక్లు వర్షపు నీటిలో కొట్టుకుపోయాయి. దురుగాలుల ప్రభావంతో పలు చోట్ల చెట్లు నెలకూలాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిసింది.ఉమ్మడి కృష్ణా జిల్లాలో అకాల వర్షం కురిసింది. నూజివీడు తరువూరు కైకలూరు ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏలూరు సిటీ, కైకలూరు, కలిదిండి, ఆచంట ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో రహదారులు జలమయంగా మారాయి. ఏలూరుజిల్లా పోలవరం మండలంలో భారీ వర్షాలు పడుతున్నాయి. వరి, మొక్క జొన్న పంటంతా వర్షపు నీటిపాలు అయ్యింది. రైతులు పరదాలు కప్పి పంట రక్షించుకుంటున్నారు.కృష్ణాజిల్లా :బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ లో అకాల వర్షం.ఉరుములు,మెరుపులతో కూడిన భారీ వర్షం.ఉదయం నుండి భానుడి భగభగలతో అల్లాడిన జనం.భారీ వర్షంతో ఒక్కసారిగా చల్లబడిన వాతావరణం.ఏలూరు జిల్లానూజివీడు డివిజన్ పరిధిలోని పలు మండలాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షం.మధ్యాహ్నం మూడు గంటలకు పట్టపగలే కారుమబ్బులు, నల్లని మబ్బులతో కమ్మేసిన ఆకాశం.అకాల వర్షంతో సేద తీరుతున్న నూజివీడు ప్రాంత ప్రజలు.అల్లూరి సీతారామరాజు జిల్లాచింతూరు,కూనవరం, విఆర్ పురం మండలాల్లో ఈదురుగాలల భీభత్సంపలు ప్రాంతాల్లో రోడ్లపై విరిగిపడిన విద్యుత్తు స్థంభాలు, వృక్షాలు. -
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @మచిలీపట్నం (కృష్ణా జిల్లా)
-
పెనమలూరులో తుఫ్యాన్
కంకిపాడు: సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ సమయం సమీపించే కొద్దీ పెనమలూరులో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. గెలుపుపై వైఎస్సార్ సీపీలో ధీమా వ్యక్తమవుతుండగా, టీడీపీ డీలా పడుతోంది. వైఎస్సార్ సీపీ అభ్యర్థి జోగి రమేష్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. గ్రామగ్రామాన ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాల లబ్ధి, అభివృద్ధి కార్యక్రమాలతో వైఎస్సార్ సీపీకి అడుగడుగునా అపూర్వ ఆదరణ లభిస్తోంది. ప్రజలంతా పారీ్టకి వెన్ను దన్నుగా నిలుస్తున్నారు. కూటమి విధానాలు నచ్చక టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు ఆ పారీ్టలను వీడి వైఎస్సార్ సీపీలో చేరుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో టీడీపీ నాయకుల్లో ఆందోళన మొదలైంది. ప్రచారంలో బీజేపీ అంటీముట్టనట్టు ఉండటం, జనసేనలోని వర్గాలు కలిసిరాకపోవడంతో టీడీపీ నాయకుల వెన్నులో వణుకు మొదలైంది. నాలుగోసారి నియోజకవర్గానికి ఎన్నికలు పెనమలూరు నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య కృష్ణా జిల్లాలోనే అత్యధికం. ఎన్నికల సంఘం ఆదేశాలతో అధికారులు తాజాగా ఓటర్ల జాబితాను విడుదల చేశారు. నియోజకవర్గంలో మొత్తం 2,94,928 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 1,42,349 మంది, మహిళలు 1,52,577 మంది, ఇతరులు ఇద్దరు ఉన్నారు. నియోజకవర్గ పునరి్వభజన ప్రక్రియతో 2009లో కంకిపాడు, ఉయ్యూరు, పెనమలూరు మండలాలతో పెనమలూరు నియోజకవర్గం ఏర్పాటైంది. ఆయా మండలాలతో పాటుగా ఉయ్యూరు నగర పంచాయతీ, తాడిగడప మునిసిపాలిటీ కూడా ఈ నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి. నియోజక వర్గంలో ఇప్పటి వరకూ 2009, 2014, 2019లో ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు నాలుగో సారి ఎన్నికలు జరుగుతున్నాయి. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొలుసు పార్థసారథి 177 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2014లో టీడీపీ అభ్యర్థి బోడె ప్రసాద్ 31,448 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. 2019లో వైఎస్సార్ సీపీ అభ్యర్థి కొలుసు పార్థసారథి 11,317 ఓట్ల మెజార్టీతో విజయం దక్కించుకున్నారు. ఈ దఫా పెనమలూరు స్థానం కోసం వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్ బరిలో నిలిచారు. టీడీపీ అభ్యర్థి బోడె ప్రసాద్తో పాటు మరో తొమ్మిది మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. బోడె.. నీకో దండం ‘టీడీపీ అభ్యర్థి బోడె ప్రసాద్ వ్యవహారశైలిలో ఇప్పటికీ మార్పులేదు. కనీసం కార్యకర్తలను ఆత్మీయంగా పలకరించడంలేదు’ అని ఆ పార్టీ శ్రేణులు వాపోతున్నాయి. ఇదెక్కడి గోల. ఆయనకో దండం. ఇష్టం లేకున్నా కొనసాగుతున్నాం అంటూ ఆ పార్టీ శ్రేణులే మధనపడుతున్న పరిస్థితి. కూటమి నేతృత్వంలో చేపడుతున్న ప్రచారానికి స్పందన అంతంత మాత్రంగా ఉంటోంది. అధికారం లేకున్నా ఐదేళ్లు ప్రజలతోనే ఉన్నానని అండగా నిలవాలని ప్రచారంలో గొప్పగా చెప్పుకొంటున్నారు. 2014 నుంచి 2019 వరకూ కేవలం కొద్ది మంది అనుయాయులను పక్కనపెట్టుకుని అందలం ఎక్కించారంటూ పలువురు పెదవి విరుస్తున్నారు. ఇసుక విక్రయాలు, మట్టి అక్రమ వ్యాపారం, సెక్స్రాకెట్, కాల్ మనీ, బిల్డర్ల నుంచి అక్రమ వసూళ్లు వంటి అనేక ఆరోపణలు బోడె ప్రసాద్ చుట్టూ ఉచ్చులా బిగుస్తున్నాయి. స్వపక్షంలోనూ విపక్షం ఉండటం, నాయకులు కలిసినా మనసులు కలవకపోవడంతో కూటమి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. బీజేపీలోని ఓ వర్గం ఇప్పటికే దూరంగా ఉంటోంది. జనసేన వర్గాలు పూర్తిగా కలిసి పనిచేయటం లేదు. సీనియర్ నాయకుడు చలసాని వెంకటేశ్వరరావు (పండు) వర్గానికి అన్యాయం జరగడంతో ఆయన కుమార్తె చలసాని స్మిత, గౌతమ్, ఆమె వర్గం టీడీపీకి షాక్ ఇచ్చింది. వారంతా వైఎస్సార్ సీపీకి మద్దతుగా నిలిచారు. స్థానికుడు అన్న ఒక్క అనుకూలం తప్ప బోడె ప్రసాద్కు మిగిలినవన్నీ ప్రతికూల అంశాలే. తొలుత సీటు ఖరారు కాక అధిష్టానంపై ధిక్కార స్వరం వినిపించి స్వతంత్ర అభ్యరి్థగా పోటీ చేస్తాననడం, ఆఖరికి ఎన్ఆర్ఐల పుణ్యమాని సీటు తెచ్చుకోవడం ఇబ్బందిగా ఉందంటూ ఆ పార్టీ నేతలు గుసగుసలాడుతున్నారు. ఎలాగూ ఎదురుగాలి వీస్తుండటంతో ఇండెంట్ వేసి చందాలు రాబడుతూ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టే పనిలో నేతలు ఉన్నారన్న వ్యాఖ్యలు బలంగా వినిపిస్తున్నాయి. జోగికి ప్రజాదరణ సిట్టింగ్ ఎమ్మెల్యే పార్థసారథి టీడీపీలోకి ఫిరాయించటంతో వైఎస్సార్ సీపీ అధిష్టానం రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమే‹Ùకు పెనమలూరు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది. అంతేకాకుండా పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిపింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో ఇప్పటికే జోగి రమేష్ ప్రజలకు చేరువయ్యారు. ఆయన పారీ్టలోని అన్ని వర్గాలను సమన్వయం చేసుకుంటూ విస్తృతంగా ప్రజల్లోకి చొచ్చుకెళ్తున్నారు. వైఎస్సార్ సీపీ విజయాన్ని కాంక్షిస్తూ జోగి కుటుంబం యావత్తూ ప్రచారాన్ని సాగిస్తూ ప్రజాదరణ చూరగొంటోంది. సమస్యలు విన్న వెంటనే ‘నేనున్నా.. పరిష్కరించే బాధ్యత నాది’ అని జోగి భరోసా ఇస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ విధానాలు నచ్చి, టీడీపీ, జనసేన పక్షాల్లో ఇమడలేక అనేక మంది ద్వితీయ శ్రేణి నాయకులు ఇప్పటికే వైఎస్సార్ సీపీలో చేరి పార్టీ బలోపేతంలో ప్రధాన పాత్ర వహిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీతో పాటు ఇవ్వని ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అర్హులందరికీ అందించింది. పాలనను గ్రామస్థాయికి తీసుకొచ్చింది. వలంటీరు వ్యవస్థ ద్వారా సంక్షేమాన్ని గడపకు చేర్చి అన్ని వర్గాల సంక్షేమానికి, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు పాల్పడుతోంది. ఇవన్నీ జోగికి అనుకూల అంశాలు. -
భారీగా టీడీపీ మద్యం పట్టివేత
గన్నవరం: కృష్ణాజిల్లా గన్నవరం మండలంలోని మెట్లపల్లి శివారుల్లో టీడీపీ నేతలు ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు సిద్ధం చేసిన గోవా మద్యం నిల్వలను ఆదివారం పోలీస్, ఎక్సైజ్, ఎస్ఈబీ అధికారులు పట్టుకున్నారు. అక్రమంగా మద్యం నిల్వచేసిన టీడీపీ నేతను అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం.. మెట్లపల్లి శివారులో గన్నవరం మాజీ సర్పంచి, టీడీపీ నేత గూడపాటి తులసీమోహన్ సోదరుడైన దుర్గాప్రసాద్కు చెందిన శ్రీనివాస గార్డెన్స్లో భారీగా మద్యం నిల్వచేసినట్లు ఉన్నతాధికారులకు సమాచారం అందింది. వీరి ఆదేశాల మేరకు హనుమాన్జంక్షన్ సీఐ నరసింహమూర్తి, ఎక్సైజ్ స్క్వాడ్ ఎస్ఐ రామాంజనేయ, సెబ్ అధికారులు సంయుక్తంగా గార్డెన్స్లోని గెస్ట్హౌస్పై దాడిచేశారు. అక్కడ గోవా రాష్ట్రానికి చెందిన స్టీకర్స్తో మొత్తం 1,210 కేసుల్లో 58,032 క్వార్టర్ సీసాల మద్యం నిల్వల్ని గుర్తించి సీజ్ చేశారు. వీటివిలువ సుమారు రూ.75 లక్షలు ఉండవచ్చని అధికారులు అంచనా వేశారు. ఆత్కూరు ఎస్ఐ పైడిబాబు కేసు నమోదు చేశారు. అక్రమంగా మద్యం నిల్వచేసిన శ్రీనివాస గార్డెన్స్ యాజమాని, టీడీపీ నేత గూడపాటి దుర్గాప్రసాద్ను, వాచ్మెన్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీస్, ఎక్సైజ్ అధికారులు తెలిపారు. టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ, నేతల్లో ఆందోళన ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి యార్లగడ్డ వెంకట్రావు ఈ మద్యం కొనుగోలు చేసి ఇక్కడ నిల్వ చేసినట్లుగా అనుమానిస్తున్నారు. శనివారం అర్ధరాత్రి గూడ్స్ వాహనంలో ఇక్కడికి తీసుకొచ్చి న ఈ మద్యాన్ని ఇక్కడినుంచి గ్రామాలకు పంపేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలిసింది.మద్యం పట్టుబడ్డడంతో యార్లగడ్డతో పాటు ఆ పార్టీ నేతల్లో ఆందోళన మొదలైంది. అధికారులు దాడిచేసిన విషయం తెలుసుకున్న యార్లగడ్డ వర్గానికి చెందిన టీడీపీ నేతలు పొట్లూరి బసవరావు, జాస్తి శ్రీధర్బాబు, దొంతు చిన్నా, కేసరపల్లి ఎంపీటీసీ సభ్యుడు శొంఠి కిషోర్ గంటల వ్యవధిలోనే ఆ గ్రామానికి చేరుకున్నారు. -
రెట్టించిన ఉత్సాహంతో...
(మేమంతా సిద్ధం బస్సు యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) నుదిటిపై గాయం మానలేదు.. కుట్లు పచ్చి ఆరలేదు.. కంటిపైన వాపు తగ్గలేదు.. అయినా పెదాలపై చిరునవ్వు చెరగలేదు. ఆ ముఖంలో ఏ మాత్రం భయంలేదు. సడలని ఉక్కు సంకల్పంతో మరింత దృఢ నిశ్చయంతో జగన్ సోమవారం తన బస్సుయాత్రను ముందుకు దూకించారు. దాడులతో మన యాత్రను ఆపలేరని, ధైర్యంగా ముందుగు సాగుదామని కేడర్లో జోష్ నింపారు. బస్సుయాత్రలో భాగంగా ప్రతిరోజూ ఉ.9 గంటల నుంచి జగన్ సంబంధిత నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలను కలుస్తారు. అలాగే, సోమవారం ఈ కార్యక్రమానికి కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఆయా నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలే కాకుండా రాష్ట్రం నలుమూల నుంచి పలువురు నాయకులు తరలివచ్చారు. వారిని కలిసిన అనంతరం వైఎస్ జగన్పై హత్యాయత్నం కారణంగా డాక్టర్ల సూచనతో ఒకరోజు విశ్రాంతి తర్వాత కృష్ణాజిల్లా కేసరపల్లి నుంచి జగన్ ‘మేమంతా సిద్ధం’ 15వ రోజు బస్సుయాత్ర సోమవారం ఉదయం 10.25 నిమిషాలకు ప్రారంభమైంది. కేసరపల్లి బస ప్రాంతానికి అప్పటికే భారీగా చేరుకున్న అభిమానులు జగన్ రాకతో జై జగన్ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేశారు. అక్కడి నుంచి వందలాది మోటార్ బైకులు ర్యాలీగా ముందు నడవగా.. బస్సుయాత్ర గన్నవరం చేరుకుంది. మార్గమధ్యంలో తన కోసం వచ్చిన ఓ మహిళా అభిమానితో మాట్లాడి సమస్యను అడిగి తెలుసుకున్నారు. గన్నవరం నియోజకవర్గం కొత్తపేటలో ప్రవేశించిన ముఖ్యమంత్రికి జాతీయ రహదారికి ఇరువైపులా బారులుతీరిన మహిళలు అఖండ స్వాగతం పలికారు. గన్నవరం వద్ద జాతీయ రహదారికి రెండువైపులా జనసందోహంతో నిండిపోయింది. గన్నవరం చరిత్రలోనే కనీవినీ ఎరుగనంత జనంతో కూడళ్లు ఇసుకేస్తే రాలనంతగా కిక్కిరిసిపోయాయి. బస్సుపైకెక్కి వారికి అభివాదం చేస్తూ జగన్ ముందుకు సాగారు. మహిళలు జననేతకు గుమ్మడికాయలతో దిష్టితీసి హారతులిచ్చారు. జగనన్నా.. నీ ప్రాణానికి మా ప్రాణం అడ్డువేస్తామంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. గాంధీబొమ్మ సెంటర్ జనసంద్రంగా మారింది. ఆపదను దాటి వచ్చిన నాయకుడికి అక్కడి ప్రజలు ప్రేమతో స్వాగతం పలికారు. జగన్ను చూసేందుకు పెద్దఎత్తున భవనాలపైకి స్థానికులు చేరుకున్నారు. జననేతను చూసి ఆనందంతో అభివాదం చేశారు. స్వచ్ఛందంగా తరలివస్తున్న జనం.. ఉమామహేశ్వరం మీదుగా ముందుకు సాగిన జగన్ను చూసేందుకు ఇళ్లల్లో నుంచి వృద్ధులు మహిళలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. హనుమాన్ జంక్షన్ క్రాస్ మీదుగా పెరికీడుకు చేరుకున్న జగన్కు భారీ జనసందోహం బాణాసంచాతో స్వాగతం పలికారు. కానుమోలులో శిరీష రీహాబిలిటేషన్ సెంటర్ (ఉయ్యూరు) నిర్వాహకులు, దివ్యాంగులతో వచ్చి జగన్ని కలిశారు. తమ సేవలను గుర్తించి ప్రభుత్వం వైఎస్సార్ లైఫ్టైమ్ అచీవ్మెంట్ను అందించినందుకు వారు జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. వారితో మాట్లాడి ముందుకు సాగిన జగన్కు గ్రామస్తులు భారీగా వచ్చి ఘనస్వాగతం పలికారు. ఆరుగొలనులో రహదారి కిక్కిరిసిపోయేలా అభిమానులు తరలివచ్చి జై జగన్ అంటూ నినాదాలు చేశారు. ఆరుగొలను ఆరోగ్యమాత ఆలయం వద్ద స్కడ్ హాట్ ఇంగ్లిష్ మీడియం స్కూలు విద్యార్థులు జగన్ మావయ్యా అంటూ ఎదురొచ్చారు. వారిని దాటి వచ్చిన జగన్కు పుట్టగుంటలో దారిపొడవునా ప్రజలు స్వాగతం పలికారు. పూర్ణకుంభంతో ఎదురొచ్చిన వేద పండితులు జగన్ను ఆశీర్వదించారు. మ.3.30 గంటలకు జగన్నాథపురం వద్ద మధ్యాహ్న భోజన విరామం తీసుకున్న సీఎం జగన్ ప్రజాభిమానాన్ని దాటుకుంటూ సా.5.38 గంటలకు గుడివాడ బహిరంగ సభకు చేరుకున్నారు. మధ్యాహ్నం నుంచే బహిరంగ సభకు జనం పోటెత్తడంతో సభా ప్రాంగణం జన సునామీని తలపించింది. ఆ అశేష జనవాహినినుద్దేశించి జగన్ ప్రసంగించారు. సభ అనంతరం 6.40 కి బస్సుయాత్ర తిరిగి ప్రారంభమైంది. హనుమాన్ జంక్షన్ హైవే మీదుగా కలపర్రు టోల్ప్లాజా చేరుకుంది. ఏలూరు జిల్లా నేతలు, కార్యకర్తలు, అభిమానులు జగన్కు ఎదురొచ్చి గజమాలలు, డప్పులు, బాణాసంచా వెలుగులతో ఘన స్వాగతం పలికారు. చంద్రబాబు, పవన్ కుట్ర అది.. ఇక జగన్పై హత్యాయత్నం చంద్రబాబు, పవన్కళ్యాణ్ కుట్రేనని బస్సుయాత్రకు వచ్చిన ప్రతిఒక్కరూ నినదించారు. వాళ్లే వేయించారని, రాళ్లు పెట్టికొట్టండి పగోడు వస్తున్నాడు అని ఆ చంద్రబాబు, పవన్కళ్యాణ్ రెచ్చగొట్టారని దుమ్మెత్తిపోశారు. ‘రాళ్లుపెట్టి కొట్టండి అని చంద్రబాబు అన్నాడు. నీకు దమ్ముంటే గెలిపించుకో, నీకు దమ్ముంటే పథకాలివ్వు. నీ దగ్గర శక్తి ఉంటే జనం మనస్సులు గెలుచుకో. కానీ, నువ్వు ఏ ఒక్క పథకం ఇవ్వలేదు. జనానికి సున్నా చుట్టావు. నిన్నెలా నమ్ముతారు చంద్రబాబు.. అంటూ జనం సూటిగా ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు ఎవరికీ న్యాయం చేయలేదని, అన్యాయమే చేశాడని, 175 సీట్లు జగన్కే వస్తాయి.. చంద్రబాబుకు ఒక్క సీటు కూడా రాదని ముక్తకంఠంతో చెప్పారు. ఏలూరు జిల్లాలో ఎగిసిన అభిమాన సంద్రం బస్సుయాత్ర కలపర్రు టోల్గేట్ వద్దకు చేరుకోగానే ఏలూరు జిల్లాకు చెందిన నేతలు, కార్యకర్తలు, అభిమానులు జగన్కు ఎదురొచ్చి గజమాలలు, డప్పులు బాణాసంచాతో జగన్కు ఘనస్వాగతం పలికారు. గజమాలలు ఏర్పాటుచేసి మహిళలు గుమ్మడికాయలతో దిష్టితీశారు. పొద్దుపోయినా జాతీయ రహదారిపై జనం బారులు తీరారు. బస్సు పైకెక్కి వారందరికీ జగన్ అభివాదం చేస్తూ ఏలూరు క్రాస్ నుంచి భీమడోలు మీదుగా యాత్ర కదిలింది. కైకరం వద్ద రోడ్డు ప్రమాద ఘటనలో గాయపడ్డ వారిపట్ల సీఎం తక్షణమే స్పందించి మానవత్వం చూపారు. ఒక పోలీస్ వాహనాన్ని (కాన్వాయ్ వాహనం కాదు) బైక్పై వెళ్తున్న ఇద్దరు యువకులు వెనకనుంచి ఢీకొట్టారు. సీఎం బస్సును ఆపి, ప్రమాదాన్ని చూసిన తర్వాత బాధితులకు వెంటనే వైద్య సహాయం అందించాలని ఆదేశించారు. సీఎం కాన్వాయ్లో ఉంచిన అంబులెన్స్ ద్వారానే క్షతగాత్రులను ఏలూరు ఆశ్రం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ముందుకు సాగిన సీఎం జగన్ చేబ్రోలు మీదుగా నారాయణపురం బస ప్రాంతానికి రాత్రి 9.55 నిమిషాలకు చేరుకున్నారు. యాత్ర మొత్తం జగన్ను చూసేందుకు వచ్చిన ప్రజలు మీకు తోడుగా మేమున్నామంటూ ఆశీర్వదించంతో 15వ రోజు మేమంతా సిద్ధం బస్సుయాత్ర ముగిసింది. మొదటి ఓటు జగన్ మామకే.. ఫస్ట్టైమ్ ఓటు వేస్తున్నాను. నాకైతే చాలా ఆసక్తిగా ఉంది. ఎందుకంటే జగన్ వంటి మంచి వ్యక్తికి ఓటు వేయడమనేది చాలా గర్వంగా ఉంది. జగన్ మామకే ఓటు వేయాలనుకుంటున్నా. మంచి పథకాలిచ్చి జనానికి మంచి చేస్తున్నారు. అందుకోసమైనా గెలిపించుకోవడానికి ఆయనకే ఓటు వేస్తా. మంచిచేసే వ్యక్తిని కావాలని కోరుకుంటాంగానీ తప్పుడు పనులు చేసేవాళ్లకు వేయం కదా. ఇంతకుముందు పాలనలో పేదోడు అయితే బాగుపడింది లేదు. ఇప్పుడు జగన్ మామ వచ్చిన తర్వాత పేదోడు అనేవాడు కాలర్ ఎగరేసుకుని తిరుగుతున్నాడు. మంచి గెలవాలి అంటే మనమంతా కలిసి గెలిపించుకోవాలి.. చెడు రాజకీయం చేయకూడదు. ఇక్కడికి వచ్చిన వాళ్లలో విద్యార్థులే ఎక్కువ.. అన్నయ్య గెలుపు కూడా విద్యార్థులతోనే మొదలవుతుంది.– కమలాకర్, విద్యార్థి జగనే మళ్లీ సీఎంగా రావాలి.. జగనన్న స్థలం ఇచ్చాడు.. ఇళ్లు కట్టించాడు. మగ్గం డబ్బులు కూడా ఇచ్చి ఆదుకున్నాడు. నాకు మగ్గంతో ఇంట్లో ఇరుకుగా ఉండేది. ఇల్లు ఇరుకుగా ఉండటంతో మగ్గాన్ని షెడ్డులో తెచ్చిపెట్టుకున్నాం. ఇప్పుడు మాకు బాగుంది. కాబట్టి మళ్లీ జగనన్నే సీఎంగా రావాలని కోరుకుంటున్నాం. – బత్తూరి పద్మావతి, మంగళగిరి టీడీపీ హయాంలో నరకయాతన టీడీపీ ప్రభుత్వంలో చాలా యాతన పడ్డాం.. వాళ్లు వెయ్యి రూపాయల పెన్షన్ను కూడా సరిగ్గా ఇవ్వలేకపోయారు. మా అమ్మ ఆఫీస్ చుట్టూ తిరగలేకపోయేది. మేం వెళ్తుంటే పెన్షన్ మాకు ఇచ్చేవారు కాదు. ఆవిడే రావాలి, ఆవిడే సంతకం పెట్టాలి అని టీడీపీ వాళ్లు చాలా ఇబ్బంది పెట్టారు. ఆవిడ నడవలేని, లేవలేని మనిషి.. వాళ్ల అమ్మాయికివ్వండి అని ఎంతమంది చెప్పినా ఇవ్వలేదు. జగనన్న మాకు స్థలం ఇచ్చాడు. ఇల్లు కట్టుకునేందుకు డబ్బులు కూడా ఇచ్చాడు. మేం ఇల్లు కట్టుకున్నాం. పెన్షన్, రేషన్ ఇంటికే వస్తోంది. ఈరోజు ఈ ఇంట్లో ఉండి తినగలుగుతున్నామంటే అంతా జగనన్న చలవే. ఇంతవరకు మమ్మల్ని అలా ఆదరించిన వాళ్లు, అలా అనుగ్రహించి చూసిన వాళ్లు, సహాయం చేసినవాళ్లంటూ ఎవరూ లేరు. నా తోడబుట్టిన వాడిలా మాకు సహాయం చేశాడు. మళ్లీ మళ్లీ జగనే రావాలని మేం కోరుకుంటున్నాం. – కందుకూరి కల్పన, ప్రభుత్వ సంక్షేమ లబ్ధిదారు సూరీడు నిప్పులు చెరుగుతున్నా.. ఎర్రని సూరీడు చండ్ర నిప్పులు కురిపిస్తున్నా లెక్కచేయకుండా జగన్ బస్సుపైకి వచ్చి అందరికీ అభివాదం చేశారు. చినఅవుటపల్లి వద్దకు రాగానే అక్కడ మహిళలు జగన్కు ఎదురొచ్చారు. వారిని జననేత పలకరించి సమస్యలు తెలుసుకున్నారు. హైవే బైపాస్వల్ల జాతీయ రహదారితో కనెక్షన్ కోల్పోయిన చినవాడిపల్లికి న్యాయం చేయాలంటూ ఆ గ్రామస్తులు వినతిపత్రం అందించారు. ఉంగుటూరు మండలం పెదఅవుటపల్లికి చెందిన క్యాన్సర్ బాధితురాలు లింగంపల్లి నేలవేణి సాయం చేయమని సీఎంను కోరారు. ఆమెకు భరోసా ఇచ్చి జగన్ ముందుకు కదిలారు. మరికొంత దూరం రాగానే పెదఅవుటపల్లి క్రాస్ వద్ద తనను చూసేందుకు పరుగుపరుగున వచ్చిన ప్రజలను చూసి జగన్ బస్సును ఆపించి వారితో మాట్లాడారు. సుభాషిణి అనే మహిళ తన అన్న బాలశౌరి ఆరోగ్యంపై వినతిపత్రం అందజేశారు. ఆత్కూరులో అభిమానులు జగన్కు వైఎస్సార్సీపీ జెండాలతో స్వాగతం పలికారు. అక్కడి మహిళల సమస్యలను జగన్ అడిగి తెలుసుకున్నారు. పొట్టిపాడు టోల్గేట్ దాటగానే మహిళలు హైవేపై బంతిపూలతో వైఎస్సార్సీపీ అని రాసి స్వాగతం పలికారు. తేలప్రోలు వద్ద అభిమానుల స్వాగతాన్నందుకుని జగన్ ముందుకొచ్చారు. కోడూరుపాడు వద్ద మహిళలు, రైతులను జగన్ పలకరించారు. వీరవల్లి హైస్కూల్ బాలికలు జగన్ మావయ్యకు ఆప్యాయంగా స్వాగతం పలికారు. వారితో జగన్ కాసేపు ముచ్చటించారు. -
వైఎస్సార్సీపీ కార్యకర్తలను చావబాదిన పోలీసులు
కోనేరు సెంటర్: టీడీపీ నేత సమక్షంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలను చితకబాదిన కృష్ణా జిల్లా బందరు రూరల్ పోలీసుల తీరు వివాదస్పదంగా మారింది. బందరు మండలం ఉల్లిపాలెంలో ఇటీవల జరిగిన ఓ గ్రామ దేవత సంబరంలో వైఎస్సార్సీపీ, టీడీపీ కార్యకర్తలు గొడవ పడ్డారు. కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో వైఎస్సార్సీపీ కార్యకర్తలకు గాయాలు కావడంతో వారు ఆస్పత్రిలో చేరారు. దీనిపై పరస్పర ఫిర్యాదులు అందుకున్న బందరు రూరల్ ఎస్ఐ చాణక్య ఆస్పత్రి నుంచి వైఎస్సార్సీపీ కార్యకర్తలు డిశ్చార్జ్ అయ్యాక వారిని మంగళవారం స్టేషన్కు పిలిపించారు. మరో ఏఎస్సై, కానిస్టేబుల్తో కలిసి సుల్తానగరంకు చెందిన ఓ టీడీపీ నేత సమక్షంలో ముగ్గురు వైఎస్సార్సీపీ కార్యకర్తలను లాఠీలతో ఎస్ఐ కుళ్లబొడిచారు. అంతేకాకుండా పిడిగుద్దులు గుద్ది, కార్యకర్తల ముఖాలను గోడకు బలంగా నొక్కి చిత్రహింసలు పెట్టారు. పోలీసులు కొట్టిన దెబ్బలకు ముగ్గురు వైఎస్సార్సీపీ కార్యకర్తల్లో ఒకరికి చేయి విరిగిపోగా, మరొకరికి తలపై గాయమైంది. ఇంకో కార్యకర్త వీపంతా రక్తపుమరకలతో నిండిపోయింది. పోలీసుల చేతిలో చావుదెబ్బలు తిన్న కార్యకర్తలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న బందరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పేర్ని నాని, ఆయన తనయుడు పేర్ని కిట్టు, తదితర నాయకులు, కార్యకర్తలు పోలీసు స్టేషన్కు చేరుకుని పోలీసుల తీరును ఖండించారు. కేసు నమోదు చేశాక తమ కార్యకర్తలను కొట్టే అధికారం మీకెవరిచ్చారంటూ పేర్ని నాని నిలదీశారు. టీడీపీ నేత సమక్షంలో తమ కార్యకర్తలను ఏకపక్షంగా కొట్టిన ఎస్ఐతోపాటు బాధ్యులందరినీ విధుల నుంచి వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ సమాచారం అందుకున్న బందరు డీఎస్పీ సుభానీ, సబ్ డివిజన్కు చెందిన సీఐలు, ఎస్ఐలు పెద్ద ఎత్తున పోలీస్స్టేషన్కు చేరుకున్నారు. మరోవైపు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు కూడా భారీగా వచ్చారు. దీంతో స్టేషన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. డీఎస్పీ ఈ ఘటనపై విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని పేర్ని నానికి హామీ ఇచ్చారు. దీంతో ఆయన శాంతించి అక్కడి నుంచి వెనుదిరిగారు. ఘటనపై డీఎస్పీ విచారణకు ఆదేశించారు. -
నన్ను, సీఎం జగన్ను ఎవ్వరూ ఓడించలేరు: కొడాలి నాని
సాక్షి, కృష్ణా: ప్రజలు తనను నిలదీశారంటూ ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని టీడీపీ నేతలకు మాజీ మంత్రి కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తనను నిలదీశారంటూ ఎల్లోమీడియాలో వస్తున్న వార్తలను పట్టించుకోనన్నారు. గుడివాడలో తనను, రాష్ట్రంలో సీఎం జగన్ను ఎవ్వరూ ఓడించలేరని తెలపారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ‘ఎన్నికల ప్రచారంలో వందలాది చోట్లకు వెళుతున్నాం. మా పార్టీ కార్యకర్తలు, అభిమానులు నాకు శిరస్సుపై నుంచి క్షీరాభిషేకాలు చేస్తానంటే వద్దని వారించాను. నేను వద్దన్నా నాపై అభిమానంతో ఒకటి రెండు చోట్ల నా కాళ్లు కడిగారు. చంద్రబాబు, పవన్, లోకేష్ వాళ్ల డప్పులు వాళ్లే కొట్టుకొంటున్నారు. వాళ్ల దండలు వారే తెచ్చుకుంటున్నట్లు, వారి తమ్ముళ్లను వాళ్లే పోగేసుకునేలా, కార్యక్రమాలు నేను చేయడం లేదు. ఎల్లో మీడియాకు కళ్ళు మూసుకుపోయాయి. చంద్రబాబును సీఎం సీట్లో కూర్చోబెట్టడానికి ఎంతకైనా దిగజారతారు. ఎన్నికల ప్రచారంలో చెంబుడు నీళ్లు కాళ్లపై పొయ్యడం పెద్ద విషయమా. నన్ను అల్లరి చేయడానికి ఏమీ లేక ఫాల్స్ న్యూస్ ప్రచారం చేస్తున్నారు. గుడివాడ నియోజకవర్గంలో ప్రజల ఇళ్ల సమస్యలు పరిష్కరించేలా.. 23 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి 12వందల కోట్లతో ఇల్లు కట్టిస్తున్నాం. రూ. 320 కోట్లతో ఫ్లైఓవర్లు నిర్మిస్తున్నాం. మంచినీటి అవసరాల కోసం రూ. 200 కోట్లు ఖర్చు చేశాం. రూ. 200 కోట్లతో రోడ్లు వేశాం. ఎన్ని చేసినా ఎక్కడో ఒకచోట సమస్య అనేది ఉండటం సర్వసాధారణం. సమస్యలపై ఎమ్మెల్యేగా ప్రజలు నన్ను అడుగుతారు. వారికి సమాధానం చెప్పుకుంటాం. మాకు మరో అవకాశం ఇస్తే పెండింగ్ సమస్యలు కూడా పరిష్కరిస్తామని ప్రజలకు చెబుతాం. ప్రజలు నేను ముఖాముఖిగా మాట్లాడుకుంటుంటే నన్నేదో నిలదీశారంటూ ఎల్లో మీడియా హడావుడి చేస్తుంది’అని కొడాలి నాని అన్నారు. -
విషాదం.. పెన్షన్ కోసం వెళ్లి వడదెబ్బతో వృద్దురాలు మృతి
సాక్షి, కృష్ణా జిల్లా: కృష్జా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పెనమలూరు మండలం గంగూరులో పెన్షన్ కోసం వెళ్లిన వృద్దురాలు వడదెబ్బ తగిలి మృతిచెందింది. పెన్షన్ కోసం వెళ్లి వడదెబ్బతో వజ్రమ్మ(80) ప్రాణాలు విడిచింది. ఉదయం నుంచి పెన్షన్ కోసం పడిగాపులు కాసిన వజ్రమ్మ వడదబ్బతో అక్కడే కుప్పకూలిపోయింది. పరీక్షించిన వైద్యులు ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి పెన్షన్ పంపిణీ జరుగుతోంది. ఏప్రిల్ 3 నుంచి 6 వరకు పింఛన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగనుంది. అన్ని గ్రామ, వార్డు సచివాలయాల వద్ద పింఛన్ల పంపిణీ చేస్తున్నారు. విభిన్న దివ్యాంగ లబ్దిదారులతోపాటు తీవ్ర అనారోగ్యాల పాలైనవారు, మంచం లేదా వీల్ చైర్లకే పరిమితమైనవారు, సైనిక సంక్షేమ పింఛన్లు పొందుతున్న వృద్ధ వితంతువులకు మాత్రం వారి ఇంటి వద్దే పెన్షన్లు అందిస్తున్నారు. ఇదిలా ఉండగా నాలుగున్నరేళ్లుగా ప్రతి నెలా 1నే వలంటీర్ల ద్వారా లబ్దిదారుల ఇంటి వద్దే అందిస్తున్న పింఛన్లపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు బాబుతో సన్నిహితంగా వ్యవహరించే మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వలంటీర్లను విధుల నుంచి తప్పించడంతో ఇంటింటికీ పింఛన్ల పంపిణీ ఆగిపోయింది. చంద్రబాబు అండ్ కో కుటిల రాజకీయాలకు వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. లక్షల మంది అవ్వాతాతలు, దివ్యాంగులు, వితంతు అక్కచెల్లెమ్మలు మండుటెండల్లో రోడ్లపై నిలబడాల్సి వచ్చింది. పెన్షన్ల కోసం బారులు తీరారు. ఈ ఉదంతంతో పేదలంటే చంద్రబాబుకు ఎంత వ్యతిరేకత ఉందో మరోసారి స్పష్టమైంది. చంద్రబాబు కారణంగా పింఛన్ల పంపిణీ నిలిచిపోవడం తీవ్ర ప్రజా వ్యతిరేకతకు దారితీస్తోంది. బాబుకు ఓటుతో బుద్ధి చెప్తామంటున్నారు పెన్షనర్లు. -
జనసేనకు టికెట్ ఇస్తే ఓడిస్తాం.. చంద్రబాబుకు అల్టిమేటం
-
ఉమ్మడి జిల్లాలో కుదేలవుతున్న ‘కూటమి’
ఉమ్మడి కృష్ణా జిల్లాలో ‘కూటమి’ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. ఇంకా టికెట్ల పంచాయితీ కొలిక్కిరాకపోవడం.. ప్రకటించిన సీట్లలోనూ కొందరు అభ్యర్థుల ప్రవర్తన, మాటతీరుతో కూటమి మూడు పార్టీల నేతలను ఏకతాటిపైకి తీసుకురాకపోగా.. వంకరటింకరగా ఎవరిదారి వారిదే అన్నట్లు చేస్తోంది. మరోవైపు పార్టీ మారిన జంపింగ్ జపాంగ్లకు ఎదురుగాలి వీస్తోంది. ముఖ్యంగా తిరువూరు, మైలవరం, విజయవాడ వెస్ట్ నియోజకవర్గాల్లో కూటమి ఉక్కిరిబిక్కిరి అవుతోంది. సాక్షి ప్రతినిధి, విజయవాడ: తిరువూరు టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాస్. ఈయన ఆది నుంచి వివాదాస్పదుడే. అమరావతి రైతుల జేఏసీ కన్వీనర్ ముసుగులో పచ్చ మీడియాకు చంద్రబాబు డైరెక్షన్లో అద్దె మైకుగా పని చేశారు. చర్చా వేదికల్లో పలు సందర్భాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీనికి ప్రతిఫలంగానే చినబాబు సిఫారసుతో స్థానిక నేతలను కాదని తిరువూరు టీడీపీ టికెట్ దక్కించుకున్నారు. నియోజకవర్గంలో ప్రవేశించినప్పటి నుంచి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లోకి ఎక్కారు. ఏ.కొండూరు మండలంలో తాగునీరు సజావుగా సరఫరా అవుతున్నా.. గిరిజనులు తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారని పాదయాత్ర పేరుతో రెండు కిలోమీటర్లు కూడా నడవకుండానే హడావుడి చేసి అభాసుపాలయ్యారు. మూడునెలల తర్వాత రాష్ట్రంలో ఉన్న వైఎస్సార్ విగ్రహాలన్నీ కూల్చివేస్తామని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. నియోజకవర్గంలోని ప్రజల నుంచే తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వచ్చింది. డ్రెయినేజీలో ఉన్న కప్పలను పట్టి కూర వండి పంపిప్తాను తినండి అంటూ మున్సిపల్ అధికారులను కించపరిచేలా సందేశం పంపారు. ఆర్యవైశ్యుల సమావేశంలో మిగతా కులాలను కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. తాజాగా పదో తరగతి పరీక్ష కేంద్రంలోకి వెళ్లి ప్రచారం చేసి, ఎన్నికల ప్రవర్తనా నియామవళిని ఉల్లంఘించారు. దీనికి తోడు నియోజకవర్గంలో ఉన్న టీడీపీ నాయకులు, క్యాడర్తో సఖ్యత పూర్తిగా లోపించింది. ఆయన ఒక్కరే బయటి నుంచి తెచ్చుకున్న యువకులతో కలిసి ప్రచారం చేయటాన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు. దీంతో టీడీపీ సొంత సామాజిక వర్గానికి చెందిన నేతలంతా ఈయన మాకొద్దు బాబూ! అంటూ చంద్రబాబుకు ఫిర్యాదు చేసినట్లు ప్రస్తుతం నియోజకవర్గంలో చర్చసాగుతోంది. గత ఎన్నికల్లో టీడీపీలో పోటీ చేసిన జవహర్, ఇక్కడ మళ్లీ పోటీ చేయాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. వెస్ట్లో వార్.. విజయవాడ వెస్ట్లో పోతిన మహేష్కే టికెట్ కేటాయించాలని జనసేన కార్యకర్తలు రోడ్డెక్కి ధర్నా చేస్తున్నారు. పోతిన కాకుండా ఎవరికి టికెట్ కేటాయించినా.. జనసేన కార్యకర్తలు సహకరించేది లేదని తేల్చి చెబుతున్నారు. ఇక్కడ పొత్తులో భాగంగా సీటు బీజేపీకి కేటాయించింది. అక్కడ బీజేపీ తరఫున ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు. దీంతో అక్కడ పోటీచేసే అభ్యర్థి ఎవ్వరోననే సందిగ్ధత నెలకొంది. వసంతకు ఎదురుగాలి.. మైలవరం నియోజకవర్గంలో ఇటీవల వైఎస్సార్ సీపీని వీడి టీడీపీలో చేరిన ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. టికెట్కు సంబంధించి టీడీపీ అధిష్టానం తాజాగా ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించింది. దీనిలో ప్రతికూల ఫలితాలు వచ్చినట్లు తెలిసింది. క్షేత్ర స్థాయిలో వసంత కృష్ణ ప్రసాద్పై నియోజకవర్గ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. పార్టీమారి పోటీ చేయటాన్ని ప్రజలు సహించటం లేదు. డబ్బుతో నేతలను మేనేజ్ చేస్తున్నప్పటికీ, ప్రజలు మాత్రం ఈయన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ మాత్రం బీసీ వర్గానికి చెందిన సామాన్య వ్యక్తికి సీటు కేటాయించింది. ఇక్కడ బీసీ వర్గానికి సంబంధించి లక్షకుపైగా ఓట్లు ఉండటం వసంతను ప్రస్తుతం కలవరపెడుతోంది. సామాన్యుని చేతిలో ఓటమి తప్పదేమో అనే బెంగ ఆయన పట్టి పీడిస్తోంది. దీంతో ఆయన కంగారు పడుతున్నట్లు ఆయన అనుచరులే పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో అడిగిన ఓ ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పకుండా తిట్ల దండకం అందుకోవడం ఆయనలో పెరుగుతున్న అసహనానికి అద్దం పడుతోంది. కృష్ణా జిల్లాలోనూ కంగారే.. కృష్ణా జిల్లాలోని పెనమలూరు టికెట్పై ఇంకా సందిగ్ధం కొనసాగుతూనే ఉంది. రోజుకొక పేరు తెరపైకి వస్తోంది. పొత్తులో భాగంగా అవనిగడ్డ సీటు జనసేన కోటాలోకి వెళ్లినా అక్కడ కూడా ఇంకా అభ్యర్థిని ప్రకటించపోవడంతో, కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది. ఆది నుంచి పార్టీ కోసం కష్టపడిన నేతలను కాదని, టీడీపీ అధినేత డైరెక్షన్లో అరువు నేతలకు టికెట్ కేటాయిస్తారనే అనుమానం జనసేన కార్యకర్తలను పట్టి పీడిస్తోంది. -
YSRCP కృష్ణా జిల్లా అభ్యర్థులు వీళ్లే
కృష్ణా జిల్లాలో అన్ని నియోజకవర్గాల గెలుపే లక్ష్యంగా.. సామాజిక సమీకరణాలు.. సర్వేల ఆధారంగా సేకరించిన అభ్యర్థుల గెలుపోటములను ప్రామాణికంగా తీసుకుని అభ్యర్థుల్ని ఎంపిక చేసింది వైఎస్సార్సీపీ. -
ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి కొడాలి నాని జోస్యం
సాక్షి, కృష్ణా: సూర్యుడు పడమర ఉదయించిన సరే సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డినే ప్రమాణస్వీకారం చేస్తారని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. శుక్రవారం ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి కొడాలి నాని జోస్యం చెప్పారు. ‘మే నెలాఖరున సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేయకుండా ఆపగలిగేవారు రాష్ట్రంలో లేరు. చంద్రబాబు.. పవన్.. సోనియా ఎంతమంది కలిసి వచ్చినా సరే. సీఎం జగన్ను అధికారం నుండి దింపగలిగే శక్తి సామర్థ్యాలు ఎవరికి లేవు. నవ్వుతూ జైలుకెళ్ళిన సీఎం జగన్. 16 నెలల తర్వాత కూడా అదే చిరునవ్వుతో బయటకు వచ్చాడు. ...సీఎం జగన్ ముఖంలో నవ్వు తప్ప మరొకటి కనిపించదు. మాడు ముఖం, చించుకోవడం, ఫ్రస్టేషన్, గంతులు వేయడం ఇది ప్రతిపక్షాల తిరు. ఇలాంటి సైకోలందరూ కలిసి సీఎం జగన్ను వేధిస్తున్నారు. 58 నెలల పాలనలో ఆర్థిక సమస్యలు తలెత్తినా.. కరోనా ఇబ్బందులు వచ్చినా. ప్రజలకు ఇచ్చిన మాట తప్పకుండా జగన్ పాలించాడు. అదే చంద్రబాబు అయితే ఇంట్లో పడుకొని.. కరోనా కష్టాలతో ప్రజలను పస్తులుంచేవాడు’ అని కొడాలి నాని అన్నారు. -
ఉయ్యూరు వీరమ్మతల్లి తిరునాళ్లలో శిడిబండి వేడుక (ఫొటోలు)
-
టీడీపీ తొలి జాబితాపై మండలి బుద్ధప్రసాద్ ఆగ్రహం
సాక్షి, కృష్ణా జిల్లా: టీడీపీ-జనసేన ప్రకటించిన ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితాలో తన పేరు లేకపోవడంపై మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అవనిగడ్డ నుంచి టీడీపీ తరపున టిక్కెట్ ఆశిస్తున్న బుద్ధ ప్రసాద్.. ప్రస్తుతం ఆ నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జిగా వ్యవహరిస్తున్నారు. అవనిగడ్డ టిక్కెట్ జనసేనకు కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి అభ్యర్ధిగా తనకే టిక్కెట్ వస్తుందని బుద్ధ ప్రసాద్ ఆశపడ్డారు. పొత్తుల సీట్ల ప్రకటనలో అవనిగడ్డ సీటును చంద్రబాబు, పవన్ పెండింగ్లో పెట్టారు. మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ, తన పేరు ప్రకటించనందుకు నేను మహదానందంగా ఉన్నానని.. పంజరంలోంచి బయటకు వచ్చిన పక్షిలాగా స్వేచ్ఛాస్వాతంత్య్రాలు పొందినట్లుగా ఉందంటూ వ్యాఖ్యానించారు. ‘నేను పదవుల కోసం పుట్టలేదు. రాజకీయాలు మన కళ్లముందే మారిపోయాయి. డబ్బు రాజకీయాలకు ప్రధానమైపోయింది. ధనవంతుల కోసమే పార్టీలు అభ్యర్ధులుగా అన్వేషిస్తున్నాయంటూ చంద్రబాబుపై పరోక్ష విమర్శలు చేశారు. ఇదీ చదవండి: ‘జనసేనకు 24 సీట్లే ఎక్కువా?’.. ఎంత మాట! -
గ్రాఫిక్స్తో దొంగనాటకాలు ఆడింది చంద్రబాబు కాదా?: కొడాలి నాని
సాక్షి, కృష్ణా జిల్లా: రాష్ట్రానికి మేలు జరుగుతుంటే చంద్రబాబు ఓర్వలేడని మాజి మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మండిపడ్డారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప.. రాజధాని రైతులు ఏ త్యాగం చేశారని దుయ్యబట్టారు. ‘రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో సీఎం జగన్కు తెలుసు. ఏ రాజధానిలోనైనా 150 ఎకరాల్లోనే ప్రభుత్వ కార్యాలయాలుంటాయి. మిగిలిన 99 శాతం ప్రైవేట్ ఆస్తులుగా ఉంటాయి. 33 వేల ఎకరాలు తీసుకున్న బాబు.. పిట్టలదొర కబుర్లు చేబుతున్నాడు. గ్రాఫిక్స్తో దొంగనాటకాలు ఆడింది చంద్రబాబు కాదా? అని మండిపడ్డారు. దేశంలో ఉన్న రాష్ట్ర రాజధానులన్నీ వందల ఏళ్ల క్రితం ఏర్పడి.. ఇప్పుడు మెగా సిటీలుగా మనకు దర్శనమిస్తున్నాయి. రాజధాని రైతులు ఏం త్యాగం చేశారు.. రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప. మద్రాస్, బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ కోల్కత్తా ఏ రాజధానిలో అయినా 150 ఎకరాల్లో ప్రభుత్వ కార్యాలయాలు ఉంటాయి. ప్రజల సమస్యలు నేరుగా పరిష్కారమయ్యే వ్యవస్థను క్రియేట్ చేసిన జగన్ గొప్పవాడా?. రాజధాని కడతానంటూ గ్రాఫిక్స్తో దొంగ నాటకాలు ఆడిన చంద్రబాబు గొప్పవాడా?. దేశంలో రాజధాని కట్టిన నేత ఎవరైనా ఉన్నారా?. ఒక్కడే రాజధాని కట్టడం అనేది సాధ్యం కాదు. 25 లక్షల జనాభా, పోర్టు, అన్ని రకాల హంగులు ఉన్న వైజాగ్లో ప్రభుత్వ కార్యాలయాలకు అవసరమైన భూమి సేకరిస్తే మహానగరంగా అయ్యి తీరుతుంది. ... వైజాగ్ను వ్యాపార, వర్తక, వాణిజ్య రాజధానిగా అభివృద్ధి చేస్తే, వచ్చే సంపద ద్వారా పేద ప్రజలకు మరింత మేలు చేయొచ్చని సీఎం జగన్ ఆలోచిస్తున్నారు. ప్రజలకు మేలు చేస్తే సహించలేని చంద్రబాబు అండ్ కో ఇక్కడే రాజధాని ఉండాలని కోర్టులకు వెళ్లి స్టే తెచ్చారు. సీఎం జగన్ రెండు లక్షల 57వేల కోట్ల రూపాయలు, 120 సార్లు బటన్ నొక్కి పేద ప్రజల ఖాతాల్లో వేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ వెయ్యి సార్లు బటన్ నొక్కి డబ్బంతా చంద్రబాబుకు చెందిన రాజదాని రైతులు ఖాతాల్లో జమ చేసేవారు. కోట్లాదిమంది ప్రజలు ఏమైపోయినా వారికి అనవసరం. నేనైతే సంపద సృష్టించే వాడిని, సీఎం జగన్కు అది చేత కావడం లేదని చంద్రబాబు అంటున్నాడు. సీఎం జగన్ రాజకీయ నాయకుడి కంటే కూడా.. ఓ సక్సెస్ఫుల్ బిజినెస్మాన్. రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో అన్ని విషయాలు తెలిసిన వ్యక్తి సీఎం జగన్’అని కొడాలి అన్నారు. -
చంద్రబాబు, లోకేష్ కుర్చీలను ఎప్పుడో మడతపెట్టేశాం: పేర్ని నాని
సాక్షి, కృష్ణా: 2019లో చంద్రబాబు, లోకేష్ కుర్చీలను మడతపెట్టేశామని అన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. 2024లో కూడా మళ్లీ వాళ్ల కుర్చీలు మడతపెట్టి ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారని వ్యంగ్యస్త్రాలు సంధించారు. ఊరూరా షామియానా కంపెనీలో కుర్చీలు అద్దెకు తెచ్చుకోవడం వల్ల ఉపయోగం లేదని..మీ సమావేశాల్లొ ఖాళీగా ఉన్న కుర్చీలు మడతపెట్టి ఎక్కడ పెట్టాలో చూసుకోండని చురకలంటించారు. గురివింద గింజకు ఒక్కచోటే మచ్చ.. కానీ బాబుకు నిలువెళ్లా మచ్చలేనని విమర్శించారు. చంద్రబాబు పేరు చెప్తే.. ఒక్క పథక కూడా గుర్తుకు రాదని అన్నారు. చంద్రబాబు సవాల్కుపేర్నినాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు పిట్టల దొరలా ఊరూరా తిరిగి హామీలిచ్చాడని మండిపడ్డారు. బందరులో ఓట్లు అడుక్కోవడానికి వచ్చి ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేదని విమర్శించారు. బందరు పోర్టును పూర్తిచేశావా?. మూడు సెంట్ల స్థలం ఇస్తానన్నావ్.. మూడు గజాలైనా ఇచ్చావా అని ప్రశ్నించారు. ఆక్వా హబ్ను చేస్తానన్నావ్ చేశావా?. హైదరాబాద్ నుంచి బందరుకు ఉద్యోగాలు వెతుక్కుంటూ వచ్చేలా చేస్తానని మోసం చేశాడన్నారు. ఎన్నికల ముందు మాటిచ్చి ఓటేసిన తర్వాత మోసం చేసే గుణం ఉన్నోడే చంద్రబాబు అని పేర్ని నాని దుయ్యబట్టారు. ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబు దిట్ట అని మండిపడ్డారు. 99 శాతం హామీలు నెరవేర్చిన నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అని కొనియాడారు. సీఎం గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. 14 ఏళ్లలో చంద్రబాబు చెప్పుకోవడానికి ఒక్కపథకమైనా ఉందా అని ప్రశ్నించారు. చదవండి: బాబుకన్నా దుర్మార్గులు ఎవరుంటారు? -
చంద్రబాబును భయపెడుతున్న టీడీపీ తమ్ముళ్లు
-
Krishna District: టీడీపీ సీనియర్ నేతలకు చంద్రబాబు భారీ షాక్..
ఇప్పటి వరకూ ఎమ్మెల్యే టికెట్ తమదేనంటూ ఆశల పల్లకీలో ఊరేగారు. ఎక్కువ కేసులు పెట్టించుకుని అధినేత దృష్టిలో పడేందుకు అడ్డగోలు చర్యలతో చెలరేగారు. చంద్రబాబుకు తాము ఎంత చెబితే అంత, తమకు కాక టికెట్ ఇంకెవరికి ఇస్తారంటూ విర్రవీగారు. డబ్బు మూటలే ప్రామాణికంగా పక్కపార్టీ నుంచి వచ్చేవారు, ఎన్ఆర్ఐలు, బడా పారిశ్రామికవేత్తలకు అధినేత టికెట్లు కేటాయిస్తుండటంతో దిక్కుతోచక దిక్కులు చూస్తున్నారు. సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఆది నుంచి టీడీపీని నమ్ముకున్న నాయకులు ఎమ్మెల్యే టికెట్లపై పెట్టుకున్న ఆశలు గల్లంతవుతున్నాయి. ఎవరు ఎక్కువ కేసులు పెట్టించుకుంటే వారికే పార్టీలో ప్రాధాన్యం ఇస్తామన్న చంద్రబాబు, చినబాబు మాటలు నీటి మూటలేనని తేలాయి. అధినేతల మెప్పు కోసం నియోజకవర్గాల్లో హడావిడి చేసి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించి, కేసులు పెట్టించుకోవడమే లక్ష్యంగా పని చేసిన వారికి నిరాశే మిగిలింది. చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ డబ్బు మూటలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎన్ఆర్ఐలు, బడా పారిశ్రామికవేత్తలకే ఎమ్మెల్యే సీట్లు కట్టబెడుతున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో గుడివాడ టికెట్ వెనిగండ్ల రాముకు, గన్నవరం టికెట్ యార్లగడ్డ వెంకటరావుకు కేటాయించారు. పార్టీ కోసం కష్టపడి పని చేసి, పలు కేసులు పెట్టించుకున్న పెనమలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి బోడే ప్రసాద్ సీటు చింపేశారు. ఆయనకు టికెట్ లేదని చంద్రబాబు ఇప్పటికే స్పష్టం చేశారని సమాచారం. పక్క పార్టీల నుంచొచ్చే డబ్బున్న బడానేతలకు టికెట్ ఇస్తామన్న సంకేతాలు ఇచ్చారు. తనకే టికెట్ వస్తుందని బోడే ప్రసాద్ పాద యాత్రలు చేస్తున్నా, ఆయన భార్య, కుమారుడు కాళ్లకు బలపం కట్టుకుని గడప గడపకూ తిరుగుతున్నా ప్రయోజనం శూన్యమన్న చర్చ జరుగుతోంది. టికెట్ కోసం తమ ప్రత్యర్థి, పార్టీ మారుతున్న నేత పంచకు చేరి కాళ్లావేళ్ల పడగా, తనకే ఇక్కడ టికెట్ లేక వేరే నియోజకవర్గంలో పోటీ చేస్తున్నానని, అధిష్టానం వద్దే విన్నవించుకోవాలని ఆ నేత సూచించడంతో బోడే ప్రసాద్కు దింపుడు కల్లం ఆశ కూడా లేకపోయిందన్న చర్చ సాగుతోంది. ఉమాకు టికెట్ గల్లంతు పార్టీలో నంబరు–2, అధినేతకు తాను ఎంత చెబితే అంత అని విర్రవీగిన దేవినేని ఉమామహేశ్వరరావు పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారింది. అధినేత వద్ద మెప్పుకోసం నానా హంగామా చేసి కేసులు పెట్టించుకొని జైలుకు వెళ్లిన ఆయనను ఇప్పుడు అధినేత పట్టించుకోవటం లేదు. మైలవరం సీటు కోసం పక్క పార్టీల నుంచి వచ్చేవారు, పార్టీలోనే కొంత మంది డబ్బు మూటలు ఆశ చూపడంతో ఉమాకు చెక్ పెట్టినట్లు పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి. విజయవాడ ఎంపీ సీటు సైతం డబ్బే ప్రామాణికంగా కేశినేని చిన్నికి కేటాయిస్తున్నారని, పార్టీ నేతలే పెదవి విరుస్తున్నారు. ముద్దరబోయినకు షాక్ నూజివీడు నియోజకవర్గంలో పదేళ్లుగా పార్టీజెండా మోస్తూ తిరుగుతున్న ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు చంద్రబాబు షాక్ ఇచ్చారు. పార్టీ పిలుపు ఇచ్చిన కార్యక్రమాలు, పార్టీ తరఫున పోరాటం చేసిన ముద్దరబోయినకు టికెట్ లేదని మొండి చెయ్యి చూపడంపై పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. పక్క పార్టీ నుంచి వచ్చిన నేతకు టికెట్ కేటాయిస్తానని చెప్పడంపై, ఆ పార్టీ శ్రేణుల్లో ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే జనసేన పొత్తు నేపథ్యంలో పలుచోట్ల టీడీపీ అభ్యర్థులకు గండి పడింది. బీజేపీతో పొత్తు ఉంటుందన్న నేపథ్యంలో మరికొన్ని సీట్లు ఆ పార్టీకి కేటాయించాల్సి వస్తోంది. మిగిలిన సీట్లు ఎన్ఆర్ఐలు, బడా పారిశ్రామిక వేత్తలకు కేటాయిస్తే, ఆది నుంచి పార్టీని నమ్ముకొని పని చేసిన వారి పరిస్థితి ఏంటనే చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. దీంతో పార్టీ నేతల్లో అసంతృప్తి తారస్థాయికి చేరుతోంది. -
ఏపీలో డిజిటల్ బోధన సూపర్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ విద్యావిధానం అద్భుతంగా ఉందని మెక్సికో దేశానికి చెందిన ఐబీ ప్రతినిధి ఆల్డో ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న ఐబీ (ఇంటర్నేషనల్ బాకలారియేట్) అమలులో భాగంగా ఐబీ ప్రతినిధులు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని వసతులు, పరిస్థితులను అధ్యయనం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆల్డో మంగళవారం కృష్ణా జిల్లాలోని పలు పాఠశాలలను సందర్శించారు. విజయవాడలోని ఎంకే బేగ్ మునిసిపల్ కార్పొరేషన్ హైస్కూల్లోని గదులను, ఉపాధ్యాయులు ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెళ్ల వినియోగం, బోధనా విధానాన్ని పరిశీలించారు. విద్యార్థులకు ప్రభుత్వం అందించిన ట్యాబ్ల పనితీరును అడిగి తెలుసుకున్నారు. బోధనా అంశాలపై విద్యార్థులకు ప్రశ్నలు వేసి సమాధానాలు విన్నారు. అనంతరం ‘జగనన్న గోరుముద్ద’ను రుచి చూసి మధ్యాహ్న భోజనం వంట కార్మికులను అభినందించారు. అనంతరం కంకిపాడు మండలం పునాదిపాడు, ఈడుపుగల్లు జెడ్పీ హైసూ్కళ్లను సందర్శించారు. పునాదిపాడులో భౌతిక, జీవశాస్త్ర ప్రయోగశాలలు, ఇంగ్లిష్ ల్యాబ్, ఈడుపుగల్లులో డ్రాయింగ్ ప్రదర్శన, సైన్స్ ల్యాబ్ను పరిశీలించి ఉపాధ్యాయులను ప్రశంసించారు. పాఠశాలలో విద్యార్థులు ప్రదర్శించిన ‘ఇండియన్ యోగా’ ప్రత్యేక ప్రదర్శనకు ఆల్డో ముగ్దులయ్యారు. ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను సందర్శించి, అడ్మిషన్ విధానంపై ప్రిన్సిపల్ను ఆరా తీశారు. విద్యార్థి నుల వివరాలు, వసతి గురించి అడిగి తెలుసుకున్నారు. తరగతి గదులకు వెళ్లి బోధనా అభ్యసన పద్ధతులను పరిశీలించారు. అక్కడ గిరిజన సంప్రదాయ నృత్యమైన థింసాను విద్యార్థినులు ప్రదర్శించారు. స్కూళ్ల సందర్శన అనంతరం ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ స్కూళ్లను అద్భుతంగా తీర్చిదిద్దిందని, వసతుల కల్పనలో ఉన్నతమైన ప్రమాణాలు పాటించిందని ఆల్డో అభినందించారు. ఈ పర్యటనలో ఐబీ ప్రతినిధి వెంటఎన్టీఆర్, కృష్ణా జిల్లాల విద్యాశాఖాధికారి తాహెరా సుల్తానా, ఎస్సీఈఆర్టీ ప్రొఫెసర్ వై.గిరిబాబు యాదవ్, డీసీఈబీ సెక్రటరీ ఉమర్ అలీ ఉన్నారు. -
కృష్ణా జిల్లా కురుమద్దాలి హైవేపై కారు దగ్ధం
-
చంద్రబాబు మోసం చేశాడన్న... లైవ్ లో కన్నీళ్లు పెట్టుకున్న మహిళా
-
బందరు తీరంలో.. త్వరలో 'లంగరు'
కృష్ణాజిల్లా మచిలీపట్నం వాసుల చిరకాల స్వప్నం శరవేగంగా వాస్తవ రూపంలోకి వస్తోంది. దక్షిణాసియాకు అత్యంత సమీప ముఖ ద్వారంగా ఉన్న ఈ పోర్టు నిర్మాణ పనులు పరుగులు పెడుతున్నాయి. ప్రారంభించిన ఏడు నెలల్లోనే కీలకమైన బ్రేక్ వాటర్ పనులను పూర్తిచేయడం ద్వారా ఈ పోర్టు నిర్మాణంపై తన చిత్తశుద్ధిని రాష్ట్ర ప్రభుత్వం చాటుకుంటోంది. ప్రత్యక్షంగా.. పరోక్షంగా 25,000 మందికి ఉపాధి క ల్పించే ఈ పోర్టు.. 2025 ఆరంభానికల్లా పూర్తయ్యేలా పనులు యుద్ధప్రాతిపదికన సాగుతున్నాయి. – సాక్షి, అమరావతి బందరు పోర్టు తొలిదశ కింద రూ.5,254 కోట్లతో నాలుగు బెర్తుల నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్ మే 22, 2023న భూమి పూజచేసి పనులు ప్రారంభించారు. అన్ని అనుమతులు తీసుకుని నిర్మాణ పనులు ప్రారంభించడంతో పనులు పరుగులు పెడుతున్నాయి. ఇప్పటికే నార్త్బ్రేక్ వాటర్ నిర్మాణం పూర్తికాగా, సౌత్బ్రేక్ వాటర్ నిర్మాణ పనులు 70 శాతం పూర్తయ్యాయి. అలాగే, రెండు బెర్తుల నిర్మాణ పనులూ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ పోర్టు నిర్మాణం ద్వారా తెలంగాణ రాష్ట్రంతో పాటు మన రాష్ట్రంలోని కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి ప్రజలు ప్రయోజనం పొందనున్నారు. ఎరువులు, బొగ్గు, వంట నూనెలు, కంటైనర్ల దిగుమతులకు ఈ పోర్టు అనువుగా ఉంటుందని అంచనా వేయగా.. వ్యవసాయ ఉత్పత్తులు, సిమెంట్, సిమెంట్ క్లింకర్, గ్రానైట్ బ్లాక్స్, ముడి ఇనుము, కంటైనర్ల ఎగుమతికి ప్రయోజనకరంగా ఉంటుందని కూడా అంచనా. ఈ పోర్టు అందుబాటులోకి రావడం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 25,000 మందికి ఉపాధి లభించనుంది. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో.. ఇక రాష్ట్రంలో నిర్మిస్తున్న నాలుగు పోర్టుల్లో మచిలీపట్నం పోర్టు నిర్మాణం అత్యంత సవాలుతో కూడుకున్నది. ఎందుకంటే.. ఇక్కడ సముద్రంలో ఇసుక మేటలు ఎక్కువగా ఉండడంతో పాటు తీరప్రాంతం కూడా ఇసుకతో ఉండటంతో భారీ కట్టడాల నిర్మాణానికి అనువుగా ఉండదు. ఇందుకోసం అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేలను పటిష్టపరుస్తున్నారు. 2,075 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ ప్రాంతాన్ని ప్రీఫ్యాబ్రికేటెడ్ వర్టికల్ డ్రెయిన్స్ (పీవీడీ) విధానంలో భూమిలోంచి నీటిని తోడి ఆ స్థానంలో మట్టిని పంపి భారీ కట్టడాలకు అనువుగా తీర్చిదిద్దుతున్నారు. అదే విధంగా 52 మిలియన్ క్యూబిక్ మీటర్ల ఇసుకను తోడిపోయడం ద్వారా భారీ ఓడలు నిలుపుకునే విధంగా సముద్రాన్ని డ్రెడ్జింగ్ చేస్తున్నారు. ఇందుకోసం ఆ్రస్టేలియా నుంచి అత్యాధునిక డ్రెడ్జింగ్ మిషన్లను తీసుకొస్తున్నారు. ఏడు నెలల కాలంలోనే 12 శాతం నిర్మాణ పనులను పూర్తిచేయడం ద్వారా ఏపీ మారిటైమ్ బోర్డు రికార్డు సృష్టించింది. తండ్రి కోరికను నెరవేరుస్తున్న తనయుడు.. నిజానికి.. మచిలీపట్నం పోర్టు పునరుద్ధరణ అనేది స్థానిక ప్రజల చిరకాల స్వప్నమంటూ 2004 తర్వాత దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి దృష్టికి స్థానిక ఎమ్మెల్యే పేర్ని నాని తీసుకెళ్లారు. వారి కోరికను నెరవేర్చే విధంగా వైఎస్ రాజశేఖర్రెడ్డి బందరు పోర్టు నిర్మాణానికి 2008, ఏప్రిల్ 23న శంకుస్థాపన చేశారు. వైఎస్ మరణానంతరం ఈ ప్రాజెక్టు అటకెక్కెంది. 2014 తర్వాత చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో ఈ ప్రాజెక్టు గురించి ఏమాత్రం పట్టించుకోకుండా 2019 ఎన్నికలకు కేవలం నెలన్నర ముందు కొబ్టరికాయ కొట్టి మమ అనిపించారు. కానీ, దీనికి భిన్నంగా ప్రసుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిధులు సమకూర్చడం దగ్గర నుంచి అన్ని అనుమతులు వచ్చిన తర్వాతే నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం.. సీఎం పదవి చేపట్టిన ఏడాదిలోపే 2020 ఫిబ్రవరి 4న మచిలీపట్నం పోర్టు డెవలపమెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో ప్రత్యేక కంపెనీ ఏర్పాటుచేశారు. రూ.5,254 కోట్లతో పోర్టు నిర్మాణానికి పరిపాలన అనుమతులను మంజూరు చేయడమే కాకుండా జగన్ సర్కారు నిధులను కూడా సమకూర్చింది. ఆ తర్వాత ఈ పోర్టు నిర్మాణానికి సంబంధించి రూ.3,668.83 కోట్లతో నిర్మాణ పనులు ప్రారంభించడానికి టెండరు దక్కించుకున్న మేఘా ఇంజనీరింగ్తో 2023, ఫిబ్రవరి 26న ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే, ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కీలకమైన పర్యావరణ అనుమతులు కూడా 2023, ఫిబ్రవరి 28న వచ్చాయి. ఇలా అన్ని అనుమతులు వచ్చిన తర్వాతే పనులు ప్రారంభించడమే కాక ఆ పనులు వేగంగా జరుగుతుండటంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. పోర్టు ఎప్పుడెప్పుడు ఎలా..? ♦ 1590 నుంచి ఎగుమతి దిగుమతులతో మచిలీపట్నం పోర్టు కళకళ.. ♦ 1970 నుంచి నిలిచిపోయిన పోర్టు కార్యకలాపాలు ♦ బందరు వాసుల చిరకాల వాంఛను తీరుస్తూ దివంగత సీఎం వైఎస్ 2008 ఏప్రిల్లో శంకుస్థాపన ♦ ఆయన మరణానంతరం అటకెక్కిన పోర్టు పనులు ♦ ఎన్నికలకు నెలన్నర ముందు ఎటువంటి అనుమతులు లేకుండా 2019లో చంద్రబాబు మరోసారి శంకుస్థాపన ♦ దీనికి భిన్నంగా ఇప్పుడు అన్ని అనుమతులతో పనులు ప్రారంభించిన సీఎం జగన్ ♦రూ.11,464 కోట్ల వ్యయంతో 116 మిలియన్ టన్నుల సామర్థ్యంతో పోర్టు నిర్మాణం ప్రారంభం ♦తొలిదశలో రూ.5,254 కోట్ల పెట్టుబడితో పోర్టు పనులకు గత మే 22న శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి జగన్ ♦ 2,075 ఎకరాల్లో నాలుగు బెర్తులతో 35 మిలియన్ టన్నుల సామర్థ్యంతో నిర్మిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ♦ పోర్టును జాతీయ రహదారితో అనుసంధానిస్తూ 6.5 కి.మీ మేర నాలుగులైన్ల రహదారి నిర్మాణం ♦అలాగే.. ఏడు కి.మీ రైల్వేలైన్ కూడా నిర్మాణం ♦ ఈ పోర్టుతో రాష్ట్రంలోని ఉమ్మడి కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు తెలంగాణకు ప్రయోజనం ♦ దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 25,000 మందికి ఉపాధి ప్రాజెక్టు పూర్తి వ్యయం - 11,464 కోట్లు తొలిదశ పోర్టు సామర్థ్యం - 35 ఎంఎంటీపీఏ పూర్తిస్థాయి సామర్థ్యం - 116 ఎంఎంటీపీఏ బెర్తులు - 2,075ఎకరాల్లో నాలుగు బెర్తులతో నిర్మాణం కార్యకలాపాలు ప్రారంభం 2025ప్రారంభం నాటికి భారీ ఓడలు నిలిచేలా నిర్మాణం.. మచిలీపట్నం పోర్టు నిర్మాణం అత్యంత సవాలుతో కూడుకున్నది. భారీ ఓడలు నిలిచే విధంగా రాష్ట్రంలోని నాలుగు ఓడ రేవులను అభివృద్ధి చేస్తున్నాం. దేశంలో ఓడరేవుల సగటు లోతు 7–8 మీటర్లు ఉండగా, ఇప్పుడు నిర్మిస్తున్న ఈ పోర్టుల్లో 16–18 మీటర్ల లోతు ఉండేలా నిర్మిస్తున్నాం. దీంతో భారీ ఓడలు రావడమే కాకుండా సరుకు రవాణా కూడా పెరుగుతుంది. హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యాపారం మొత్తం ఇప్పుడు మచిలీపటా్ననికే వస్తుంది. – రవీంద్రనాథ్రెడ్డి, డిప్యూటీ సీఈఓ, ఏపీ మారిటైమ్ బోర్డు 2025 నాటికి రెడీ.. అన్ని అనుమతులు ముందుగానే తీసుకోవడంతో నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఏడు నెలల్లోనే 12 శాతం పనులు పూర్తిచేశాం. 6.5 కి.మీ కాంపౌండ్ వాల్ నిర్మాణం, నాలుగు బిల్డింగ్లు, జాతీయ రహదారి 216కు అనుసంధానం చేస్తూ 6.5 కి,మీ రోడ్డు అనుసంధానం వంటి పనులు వేగంగా జరుగుతున్నాయి. రెండు బెర్తులకు సంబంధించి ఈ పైల్స్ నిర్మాణ ప్రక్రియ ప్రారంభమైంది. 2025 ప్రారంభం నాటికి ఈ పోర్టును అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుని పనులు చేస్తున్నాం. – ఎం. దయాసాగర్, ఎండీ, మచిలీపట్నం పోర్టు డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ సంతోషంగాఉంది.. బందరు ప్రాంత అభివృద్ధి ఈ పోర్టు నిర్మాణంతో సాకారం కానుంది. పోర్టు నిర్మాణానికి నాకున్న భూమిని ఇవ్వడం సంతోషంగా ఉంది. ఈ ప్రాంత అభివృద్ధిలో పాలు పంచుకునే అవకాశం నాకు కలిగింది. భావితరాల మేలు కోసం మాజీమంత్రి పేర్ని నాని చేసిన కృషి ఫలించింది. – పిప్పళ్ల వెంకటేశ్వరరావు, పోతేపల్లి, బందరు మండలం గర్వంగా ఉంది.. సొంత ఊరు అభివృద్ధికి కీలకమైన బందరు పోర్టు నిర్మాణంలో భాగస్వామి కావడం ఆనందంగాను, గర్వంగాను ఉంది. నేను ఉద్యోగ రీత్యా ఢిల్లీలో ఉండేవాడిని. కానీ, ఈ పోర్టు నిర్మాణంలో నా వంతు కృషిచేయాలన్న తలంపుతో మచిలీపట్నంకు బదిలీ చేయించుకున్నా. బందరు పోర్టును జాతీయ రహదారికి అనుసంధానించే పనిలో పాలుపంచుకుంటున్నా. త్వరలో ఈ ప్రాంత ప్రజల కల సాకారం కానుంది. – బి.నాగసూర్య చంద్ర, అసిస్టెంట్ మేనేజర్, రైట్స్ సంస్థ -
మత్స్యకార ‘పథకాల’ అమలులో ఏపీ సహకారం భేష్
చిలకలపూడి(మచిలీపట్నం): మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన పథకాల అమలుకు కావాల్సిన సదుపాయాలను కల్పించడంలో ఏపీ ప్రభుత్వ రాష్ట్ర, జిల్లాస్థాయి అధికారుల కృషి అభినందనీయమని కేంద్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి పరుషోత్తం రూపాల ప్రశంసించారు. ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన పథకాలను లబ్ధిదారులకు చేరవేయడంలో అధికారులు భాగస్వామ్యులు కావాలని సూచించారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం సమీపంలోని గిలకలదిండి హార్బర్ వద్ద సాగర్ పరిక్రమ కార్యక్రమంలో భాగంగా మంగళవారం సాయంత్రం మత్స్యకారులు, ఆక్వా రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. మచిలీపట్నం గిలకలదిండి హార్బర్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేసి మత్స్యకారులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమం కోసం రూ. 20 వేల కోట్లు కేటాయించిందని తెలిపారు. కాగా, నందివాడ మండలం రామాపురానికి చెందిన దావీదు, పెదలింగాలకు చెందిన తుమ్మల రామారావు, రవీంద్రబాబు, ప్రవీణ్లు కేంద్ర మంత్రికి పరిశ్రమల్లో ఎదుర్కొంటున్న కష్ట, నష్టాలను వివరించారు. మత్స్యరైతుల ఉత్పత్తిదారుల సంఘాలకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు అందజేశారు. కేంద్ర మంత్రి సతీమణి సవితబెన్ రూపాల, కేంద్ర ప్రభుత్వ మత్స్యశాఖ జాయింట్ సెక్రటరీ నీతుకుమార్ ప్రసాద్, రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ కె.కన్నబాబు, కలెక్టర్ పి.రాజాబాబు, నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు ప్రతినిధి డాక్టర్ ఎల్ఎన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. -
కంకిపాడు జన కెరటం
కంకిపాడు: వైఎస్సార్సీపీ సామాజిక సాధికార నినాదం గురువారం కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడులో మార్మోగింది. ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరుగెట్టేలా బహిరంగ సభకు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, బీసీలు పెద్ద ఎత్తున కదం తొక్కారు. సామాజిక న్యాయాన్ని ఆచరణలో చూపిస్తున్న సీఎం వైఎస్ జగన్కు అక్కచెల్లెమ్మలు, యువత, అవ్వాతాతలు జేజేలు పలికారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మరోసారి జగనన్నను సీఎంను చేసుకోవాలని పిలుపునిచ్చారు. పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, మర్రి రాజశేఖర్ ఆధ్వర్యంలో బహిరంగ సభను నిర్వహించారు. పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ ప్రారంభ ఉపన్యాసం చేశారు. బాబు, పవన్ను తరిమికొట్టండి దొంగలకు, చంద్రబాబు, పవన్లకు తేడా లేదని మంత్రి జోగి రమేష్ చెప్పారు. వీరిద్దరూ పిక్పాకెటర్స్ మాదిరిగా వ్యవహరిస్తున్నారని, ఇలాంటి జేబు దొంగలను ప్రజలు మూకుమ్మడిగా తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. చంద్రబాబుకు సామాజిక న్యాయం చేశానని చెప్పే దమ్ముందా? అని ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో అసమానతలు జగనన్న పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు తలెత్తుకు బతుకుతున్నాయని మంత్రి మేరుగు నాగార్జున, ఎంపీ మోపిదేవి వెంకటరమణ చెప్పారు. చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో సామాజిక న్యాయం లేకపోగా, అన్నీ అసమానతలు, అవమానాలు, వెలివేతలే మిగిలాయన్నారు. టీడీపీలో ముస్లింలకు స్థానమేది? ముస్లిం వర్గాలకు టీడీపీలో స్థానం లేదని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ఖాన్ చెప్పారు. వారికి కనీస గుర్తింపు కూడా మృగ్యమేనన్నారు. చంద్రబాబు పాలనలో ఒక్క ముస్లింకు అయినా మంత్రి పదవి ఇచ్చారా.. అని ప్రశ్నించారు. సీఎం జగన్ ముస్లింలకు ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అనేక నామినేటెడ్ పదవులు ఇచ్చారని గుర్తు చేశారు. పాలన అంతా చంద్రబాబు దోపిడీని సాగిస్తే.. జగనన్న సామాజిక న్యాయంతో అణగారిన వర్గాల ఉన్నతికి అహర్నిశలు పాటుపడుతున్నారని ప్రశంసించారు. విప్లవాత్మక సంస్కరణలతో అన్ని వర్గాల ప్రగతి.. సామాజిక న్యాయంతో అణగారిన వర్గాలకు జగన్ రాజ్యాధికారం చేరువ చేశారని ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఆత్మగౌరవంతో జీవించేలా ప్రభుత్వం పాటుపడిందన్నారు. గత టీడీపీ ప్రభుత్వం అణగారిన వర్గాలకు ఏం చేసిందో శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా.. అని సవాల్ విసిరారు. సామాజిక న్యాయంపై మాట్లాడే అర్హత చంద్రబాబుకి ఎక్కడిదని, సీఎం జగన్ విప్లవాత్మక సంస్కరణలతో అన్ని వర్గాల ప్రగతికి కృషి చేస్తున్నారని కొనియాడారు. రోడ్లు, ప్రాజెక్టులు, విదేశీ పెట్టుబడులే కాదని, అణగారిన వర్గాల సంక్షేమం, అభివృద్ధి కూడా ముఖ్యమే అని చాటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోతుల సునీత, ఎమ్మెల్యేలు కొక్కిలిగడ్డ రక్షణనిధి, సామినేని ఉదయభాను, జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక, కేడీసీసీ చైర్పర్సన్ తాతినేని పద్మావతి, డీసీఎంఎస్ చైర్పర్సన్ పడమట స్నిగ్ధ, నియోజకవర్గ పరిశీలకులు బొప్పన భవకుమార్, మంగళగిరి పార్టీ ఇన్చార్జి గంజి చిరంజీవి, కమ్మ, కాపు కార్పొరేషన్ చైర్మన్లు తుమ్మల చంద్రశేఖర్, అడపా శేషు, తదితరులు పాల్గొన్నారు. -
ఇవాళ కృష్ణా జిల్లా పెనమలూరులో సామజిక సాధికార యాత్ర
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
నా కోసం కొంత డబ్బు కావాలి.. అందుకే నేనే అడిగా: రేణు దేశాయ్ పోస్ట్ వైరల్
పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
International Family Day: ఐపీఎల్ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)
ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఎలా నమ్మాలి?: సజ్జల
మెగాస్టార్ చిత్రంలో మరో సీనియర్ నటి.. ఆ కాంబో రిపీట్!
సీఏఏ చట్టం కింద తొలిసారి 14 మందికి భారత పౌరసత్వం
100 రోజులకు బ్లూ ప్రింట్ రెడీ.. ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
పోలీస్ ఫెయిల్యూర్.. బాబు, పురందేశ్వరి మేనేజ్..
'ఇడియట్ సిండ్రోమ్' అంటే ఏంటీ..? ప్రమాదకరమా..?
సోషల్ మీడియాలో వైరల్గా మారిన టీడీపీ, జనసేన వీడియో
తప్పక చదవండి
- పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
- స్టార్ క్రికెటర్ ప్రపోజ్.. హీరోయిన్ ఏమన్నారంటే!
- పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
- వడదెబ్బ మరణాలు.. ఐదో వంతు భారత్లోనే !
- సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!
- అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
- నాన్స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
- BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
Advertisement