పెట్టుడు కనుగుడ్డు తీసి సిబ్బంది చేతిలో పెట్టిన దివ్యాంగురాలు | Incident in Krishna district | Sakshi
Sakshi News home page

పెట్టుడు కనుగుడ్డు తీసి సిబ్బంది చేతిలో పెట్టిన దివ్యాంగురాలు

Aug 24 2025 6:17 AM | Updated on Aug 24 2025 6:17 AM

Incident in Krishna district

కృష్ణాజిల్లాలో ఘటన 

కోడూరు: కూటమి ప్రభుత్వం అర్హులైన దివ్యాం­గులకు కూడా పింఛన్లు రద్దు చేస్తోంది. పింఛన్లు తొలగించినట్లుగా అధికారులు ఇచి్చన నోటీసులతో వారు మండల పరిషత్‌ కార్యా­లయాలు, సచివాలయాల చుట్టూ తిరు­గుతున్నారు. ఈ క్రమంలోనే కృష్ణాజిల్లా కోడూరు పంచాయతీకి చెందిన భూపతి నాగమణికి పింఛను తొలగిస్తూ నోటీసు ఇచ్చారు. నాగమణికి ఒక్క కన్ను మాత్రమే ఉండడంతో ఆమెకు దివ్యాంగ పెన్షన్‌ రూ.6 వేలు వచ్చేవి.

 సదరం సరిఫికెట్‌లో 40శాతం అంధత్వం ఉన్నట్లు వైద్యులు ధ్రువీకరించా­రు. ఇటీవల  వైద్య పరీక్షల్లో  40శాతం లోపే ఉందంటూ పెన్షన్‌ను తొలగించారు. అధికారులు ఇచి్చన నోటీసులతో కోడూరు–1 సచివాలయానికి వెళ్లిన నాగమణి తనకు ఒక్క కన్ను మాత్రమే ఉందని, రెండోది పెట్టుడు కన్ను అంటూ కన్ను గుడ్డు తీసి సచివాలయ వెల్ఫేర్‌ సిబ్బంది చేతిలో పెట్టింది. ఈ ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. తన బాధను చెప్పుకోవడం కోసమే కన్ను తీసి సచివాలయ ఉద్యోగి చేతిలో పెట్టినట్లు బాధితురాలు వాపోయింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement