ఆన్‌లైన్‌ అమ్మకాల్లో భారత్‌ దూకుడు | SBI Research report confirms significant surge in India online sales | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ అమ్మకాల్లో భారత్‌ దూకుడు

Dec 8 2025 4:32 AM | Updated on Dec 8 2025 7:37 AM

SBI Research report confirms significant surge in India online sales
  • పండుగ అమ్మకాల్లో అమెరికాను అధిగమించిన వైనం  
  • దసరా–దీపావళి సీజన్‌లో ఆన్‌లైన్‌ ద్వారా రూ.1.24 లక్షల కోట్ల సేల్స్‌  
  • ఇది అమెరికాలో అత్యధికంగా జరిగే బ్లాక్‌ ఫ్రైడే సేల్స్‌ కంటే ఎక్కువ 
  • 2024లో అమెరికా బ్లాక్‌ ఫ్రైడే సేల్స్‌ రూ.95,040 కోట్లు మాత్రమే  
  • ఈ ఏడాది రూ.1,02,960 కోట్ల విక్రయాలు ఉండవచ్చని అంచనా  
  • ఇండియా ఆన్‌లైన్‌ అమ్మకాల్లో అత్యధికంగా ఎల్రక్టానిక్స్, గృహోపకరణాలే 
  • ఆ తర్వాత స్థానాల్లో మొబైల్స్, లైఫ్‌స్టైల్‌ ప్రొడక్ట్స్‌ 
  • ఎస్‌బీఐ రీసెర్చ్‌ నివేదిక వెల్లడి

సాక్షి, అమరావతి: ఆన్‌లైన్‌ అమ్మకాల్లో భారత్‌ దూసుకుపోతోంది. టెక్నాలజీ వినియోగంలో ముందుండే అమెరికాను దాటేసి భారతీయులు ఆన్‌­లైన్‌లో వారికి నచ్చిన వస్తువులను కొనే­స్తున్నారు. మ­న దేశంలో అత్యధికంగా అమ్మకాలు జరిగే ద­సరా–దీపావళి పండుగ సమయంలో జరిగిన అమ్మ­కాలు.. అమెరికాలో క్రిస్మస్‌ ముందు జరిగే బ్లాక్‌ ఫ్రైడే అమ్మకాలను మించిపోయాయని ఎస్‌బీఐ రీ­సె­ర్చ్‌ తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ఈ సంవత్సరం  పండుగల సీజన్‌లో రూ.1.24 ల­క్ష­ల కో­ట్ల విలువైన అమ్మకాలు జరిగినట్లు ఎస్‌బీఐ అంచ­నా వేసింది.

ఇది గతేడాది జరిగిన అమ్మకాలు రూ.94,­800 కంటే ఎక్కువ. పండుగల సీజన్‌కు ముందు కేంద్రప్రభుత్వం జీఎస్టీ రేట్లను సంస్కరించడం ఈ ఏడాది అమ్మకాలు పెరగడానికి ప్రధాన కారణంగా పేర్కొంది. ఇదే సమయంలో అమెరికాలో ఈ ఏడా­ది బ్లాక్‌ ఫ్రైడే అమ్మకాలు రూ.1,02,960 కోట్లు ఉంటాయని అంచనా వేసింది. 2024లో ఈ బ్లాక్‌ ఫ్రైడే అమ్మకాలు రూ.95,040 కోట్లుగా నమో­దయ్యాయి. అంటే భారత్‌లో ఈ ఏడాది పండుగ అమ్మ­కాల్లో 31 శాతం నమోదయితే అమెరికాలో మా­త్రం ఈ వృద్ధి 8.3 శాతానికి పరిమితమవుతుందని ఎస్‌బీఐ అంచనా వేసింది. అమెరికా ఆర్థి­కవ్య­వస్థ అంతంతమాత్రంగానే ఉండటంతో ఈ ఏడాది అమ్మ­కాల్లో అంత వృద్ధి నమోదు కాకపోవచ్చని పేర్కొంది.

ఎక్కువ ఎలక్ట్రానిక్‌ వస్తువులే 
దేశీయ ఆన్‌లైన్‌ అమ్మకాల్లో అత్యధికభాగం ఎలక్ట్రానిక్స్, హోమ్‌ అప్లయిన్సెస్‌ వస్తువులే అత్యధికంగా ఉంటున్నాయి. మొత్తం అమ్మ­కాల్లో 43 శాతం (సుమారు రూ.53 వేలకోట్లు) ఈ రెండు రంగాల్లోనే జరు­గుతు­న్నాయి. ఆ తర్వాత అత్యధికంగా మొబైల్‌ ఫోన్లు (26 శాతం) కొనుగోలు చేస్తున్నారు. తర్వాతి స్థానాల్లో లైఫ్‌స్టైల్‌ ఉత్పత్తులు (22 శాతం), సౌందర్యసాధనాలు (21 శాతం) ఉన్నాయి. ఈ సారి ఖరీదైన వస్తువులను మెట్రో వాసులే కాకుండా నాన్‌ మెట్రో వాసులు కూడా అత్యధికంగా కొనుగోలు చేసినట్లు  ఎస్‌బీఐ తెలిపింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement