
మనస్తాపంతో యువతి ఆత్మహత్య
హైదరాబాద్: ప్రేమించిన యువకుడు మరో యువతిని వివాహం చేసుకోవడంతో మనస్తాపానికి లోనైన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నా యి. మిర్యాలగూడ, బొక్కనుంతలపాడు గ్రామానికి చెందిన మల్లీశ్వరి నిమ్స్ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తూ మధురపురి కాలనీలోని హాస్టల్లో ఉంటుంది. గత కొన్నేళ్లుగా ఆమె అదే గ్రామానికి చెందిన జానారెడ్డిని ప్రేమిస్తోంది.
అయితే మల్లీశ్వరి కులం వేనే కావటంతో జానా రెడ్డి కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకరించలేదు. ఇటీవల జానారెడ్డికి మరో యువతితో వివాహం జరిగింది. ఈ విషయం తెలియడంతో మల్లీశ్వరి ఆదివారం రాత్రి హాస్టల్లో మత్తు ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం నిందితుడు జానారెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.