చుట్టూ నల్లమల అడవులు.. జలపాతాలు.. ఆహ్లాదకరమైన వాతావరణం.. వీటిన్నింటి మధ్యలో కనిపించే ఆలయం "నెమలిగుండ్ల రంగనాయకస్వామి" ఆలయం.
వారంలో శనివారం రోజు మాత్రమే తెరిచి ఉండే ఈ గుడి ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం జిల్లా రాచర్ల మండలం జె.పుల్లలచెరువు గ్రామంలో ఉంది.
ఇక్కడ రంగనాయకస్వామి స్వయంభువుగా వెలిశారు.
ఏ క్షేత్రంలో కనిపించని ఆరుదైన పవిత్రత గొప్పదనం నెమలిగుండ్ల రంగనాయక స్వామికి ఉంది. అంటు, ముట్టులు వున్నవారు ఆలయం వద్దకు వస్తే తేనెటీగలు దాడి చేస్తాయి.
ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో బహుళ పాడ్యమి, విదియ, తదియ లో మూడు రోజుల పాటు స్వామి వారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.
ఈ ఆలయానికి వెళ్ళడానికి గిద్దలూరు నుంచి ప్రతి శనివారం apstrc వారు ప్రత్యేక బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది.
గిద్దలూరు నుంచి అంబవరం మీదుగా 20 km ప్రయాణం చేసి స్వామి వారి క్షేత్రం చేరుకోవచ్చు.
Photo Credit : Google


