కదులుతున్న రైలులో పూజలు..! వీడియో వైరల్‌.. | Puja on a moving train goes viral On Social media | Sakshi
Sakshi News home page

కదులుతున్న రైలులో పూజలు..! రైల్వే ఏం చెప్పిందంటే

Jul 13 2026 1:13 PM | Updated on Jul 13 2026 1:53 PM

Puja on a moving train goes viral On Social media

రైలు బోగినే హనీమూన్‌ సూట్‌గా మార్చిన ఘటన మరువక ముందే మరో రైలు ఘటన నెట్టింట వైరల్‌గా మారింది. కదులుతున్న రైలులో పూజ పరమైన కార్యక్రమాలు జరుగుతున్న​ వీడియో..నెట్టించ చర్చలకు దారితీసింది. భారతీయ రైల్వేలోనే ఇలాంటి వాటికి అనుమతి ఉంటుందా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆ వీడియలోఓ ప్రయాణికులు రైలు కోచ్‌ లోపల మతపరమైన పూజ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు స్పష్టంగా కనిపించడంతోనే ఇలా కదులుతున్న రైలు ఇలాంటి ఆచారాలు నిర్వహించుకోవచ్చా అనే ప్రశ్నలు వెల్లువెత్తాయి. ఈ ఘటన ఉత్తర మధ్య రైల్వేలో చోటు చేసుకుంది. 

అయితే రైలులో ఇలాంటి వాటికి అనుమతి ఉంటుందా అని అంతా అనుమానాలు వ్యక్తం చేశారు. దీనిపై ఉత్తర రైల్వే ఇలా వివరణ ఇచ్చింది. ఈ వైరల్‌ వీడియో ఘటనతో ఉత్తరరైల్లే ఇలా వివరణ ఇచ్చింది. ఐఆర్‌సిటిసి (IRCTC) ద్వారా వాణిజ్య బుకింగ్‌ ద్వారా ప్రేవేట్‌గా బుక్‌ చేసుకున్న సెలూన్‌ కోచ్‌గా పేర్కొది. అందులోనే ఈ మతపరమైన ఆచారాలు జరిగినట్లు ఉత్తర రైల్వే స్పష్టం చేసింది. ఆ కార్యక్రమం సాధారణ ప్యాసింజర్‌ కోచ్‌లో కాకుండా IRCTC ద్వారా ఒక ప్రైవేట్ వ్యక్తి బుక్ చేసుకున్న సెలూన్ కోచ్‌లో జరిగిందని తెలిపింది. 

ఈ సెలూన్‌ కోచ్‌ అనేది సీనియర్‌ రైల్వే అధికారులు, వీఐపీల కోసం ఉద్దేశించిన విలాసవంతమైన ప్రైవేట్‌ బోగీ. ఇందులో ఎయిర్‌ కండిషన్డ్‌ బెడ్‌రూమ్‌లు, ఒక చిన్న వంటగది, లివింగ్‌, డైనింగ్‌ రూమ్‌ల తోకూడిన వాష్‌రూమ్‌  సౌకర్యాలు ఉంటాయి. ఆ వ్యక్తి ఈ వాణిజ్య రిజర్వేషన్‌ కోసం అడ్వాన్స్‌గా రూ. 3 లక్షలకు పైగా జమ చేసినట్లు పేర్కొంది. 

ఈ సెలూన్ కోచ్‌ను జూలై 10న న్యూఢిల్లీ (NDLS) నుంచి ముంబై (BDTS)కి వన్-వే ప్రయాణం కోసం రైలు నెం. 12926 పశ్చిమ్ ఎక్స్‌ప్రెస్‌కు జతచేయాల్సి ఉందని వెల్లడించింది. అదే సమయంలో ప్రయాణికుల భద్రత, రైళ్లు సజావుగా నడపడం తమ అత్యంత ప్రాధాన్యత అని రైల్వే అదికారులు నొక్కి చెప్పారు. 

 

(చదవండి: 15 ఏళ్లకే చదువుకి మానేసింది..! కట్‌చేస్తే రూ 7 వేల కోట్ల కంపెనీ..)
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement