14 దేశాల దెబ్బకు డ్రాగన్ మైండ్ బ్లాక్! | South China Sea Dispute China Protests After 14 Nations Reject Its Claims | Sakshi
Sakshi News home page

14 దేశాల దెబ్బకు డ్రాగన్ మైండ్ బ్లాక్!

Jul 13 2026 2:16 PM | Updated on Jul 13 2026 2:19 PM

South China Sea Dispute China Protests After 14 Nations Reject Its Claims

న్యూఢిల్లీ: దక్షిణ చైనా సముద్రంపై బీజింగ్ ప్రాంతీయ సార్వభౌమాధికార వాదనలను జపాన్ సహా 14 దేశాలు తోసిపుచ్చడంపై చైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 2016 నాటి అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానం (పీసీఏ)తీర్పును సమర్థిస్తూ ఆయా దేశాలు సంయుక్త ప్రకటన విడుదల చేయడం దౌత్యపరమైన ఉత్కంఠకు దారితీసింది. ఈ నేపథ్యంలో, చైనా తన నిరసనను వ్యక్తం చేస్తూ, బీజింగ్‌లోని జపాన్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్‌కు సమన్లు జారీ చేసింది. జపాన్ వైఖరి ప్రాంతీయ శాంతి, స్థిరత్వాలను దెబ్బతీసేలా ఉందని ఆరోపించింది.

అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, ఫిలిప్పీన్స్ సహా 14 దేశాలు ఈ వివాదాస్పద తీర్పు 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, ఐక్యరాజ్యసమితి సముద్ర చట్టాల ఒప్పందం (యూఎన్‌సీఎల్‌ఓఎస్‌)ప్రకారం చైనా విస్తరణ వాదనలకు చట్టబద్ధత లేదని స్పష్టం చేశాయి. 27 దేశాల యూరోపియన్ యూనియన్ సైతం ఈ తీర్పును మైలురాయిగా అభివర్ణించింది. అయితే, చైనా విదేశాంగ శాఖ ఈ ప్రకటనలను తీవ్రంగా ఖండిస్తూ, జపాన్ ఈ సముద్ర తీర ప్రాంతంలో భాగస్వామి కాదని, తమ సార్వభౌమాధికారంపై మాట్లాడే హక్కు దానికి లేదని పేర్కొంది. చైనా తన వాదనను సమర్థించుకుంటూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను కూడా పంచుకుంది.

వ్యూహాత్మక రవాణా మార్గంగా, 17.7 బిలియన్ టన్నుల చమురు, సహజ వాయువు నిక్షేపాలు కలిగిన దక్షిణ చైనా సముద్రంపై చైనా చారిత్రక హక్కులను క్లెయిమ్ చేస్తూ, కృత్రిమ దీవులను నిర్మిస్తోంది. చైనా సైనిక చర్యలు, గస్తీలు అమెరికా కూటమి నౌకాదళ పర్యటనల మధ్య ఈ ప్రాంతంలో భవిష్యత్తులో ఘర్షణలు తలెత్తే ముప్పు ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

ఇది కూడా చదవండి: రౌడీషీటర్ బర్త్‌డే పార్టీలో బీజేపీ ఎమ్మెల్యే సందడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement