South China Sea
-
ఫిలిప్పీన్స్ నౌకలను ఢీకొట్టిన చైనా కోస్ట్గార్డ్ షిప్
మనీలా: దక్షిణ చైనా సముద్రంలోని వివాదాస్పద ప్రాంతంలో ఆదివారం ఫిలిప్పీన్స్, చైనా మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తమ కోస్ట్ గార్డ్ నౌక, మిలటరీ రవాణా బోటులను చైనా కోస్ట్గార్డ్ షిప్, దానితోపాటే వచ్చిన చైనా నౌక ఢీకొట్టాయని ఫిలిప్పీన్స్ అధికారులు తెలిపారు. ఘటనలో తమ సిబ్బందికి ఎటువంటి గాయాలు కాలేదని, నౌకలకు వాటిల్లిన నష్టంపై అంచనా వేస్తున్నామన్నారు. తమ నౌకలు వేగంగా ప్రయాణించకపోయుంటే చైనా నౌకల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లేదని చెప్పారు. థామస్ షోల్ వద్ద ఉన్న ఫిలిప్పీన్స్ మెరైన్ పోస్టుకు సమీపంలో ఈ నెలలో చోటుచేసుకున్న రెండో ఘటన ఇది అని చెప్పారు. ఫిలిప్పీన్స్ అంతర్జాతీయ నిబంధలను ఉల్లంఘిస్తూ తమ నౌకల ప్రమాదాలకు కారణమవుతోందని చైనా ఆరోపించింది. -
దక్షిణ చైనా సముద్రంలో చైనా దూకుడు
మనీలా: దక్షిణ చైనా సముద్రంపై పెత్తనం తమదేనంటున్న డ్రాగన్ దేశం దుందుడుకు చర్యకు పాల్పడింది. వివాదాస్పద జలాల్లోని ఫిలిప్పీన్స్ కోస్ట్గార్డ్ ఓడపైకి చైనా కోస్ట్గార్డ్ షిప్ మిలటరీ గ్రేడ్ లేజర్ కిరణాలను ప్రయోగించింది. దీంతో అందులోని తమ సిబ్బందిలో కొందరికి కొద్దిసేపు కళ్లు కనిపించకుండా పోయాయి. ఈ చర్యతో చైనా తమ సార్వభౌమ హక్కులకు తీవ్ర భంగం కలిగించిందని ఫిలిప్పీన్స్ ఆరోపించింది. తమ ఓడ బీఆర్పీ మలపస్కువాను దగ్గరల్లోని రాతి దిబ్బ వైపు వెళ్లకుండా చైనా ఓడ అడ్డుకుందని తెలిపింది. ఈ క్రమంలో ప్రమాదకరంగా 137 మీటర్ల అతి సమీపానికి చేరుకుందని వివరించింది. -
తుపాను కారణంగా రెండు ముక్కలైన ఓడ... 12 మంది మృతి
బీజింగ్: దక్షిణ చైనా సముద్రంలో ఓడ ధ్వంసమై మునిగిపోయింది. ఈ విషయాన్ని చైనా అధికారులు వెల్లడించారు. ఈ నౌక హాకాంగ్కు నైరుతి దిశలో 160 నాటికల్ మైళ్లు (296 కిలోమీటర్లు) దూరంలో రెండుగా ముక్కలై మునిగిపోయిందని తెలిపారు. ఈ దుర్ఘటనలో సుమారు 30 మంది సిబ్బంది గల్లంతైయ్యారని, ఈ ఘటన దక్షిణ చైనా సముద్రం మధ్య భాగంలో ఏర్పడిన చాబా తుపాను కారణంగా చోటు చేసుకుందని పేర్కొన్నారు. హాంకాంగ్ కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం ఏడు గంటలకు ఈ ఘటన జరిగినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ తుపాను గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లో తీరాన్ని తాకింది. ఈ నౌక మునిగిపోయిన ప్రదేశానికి 50 నాటికల్ మైళ్ల దూరంలో 12 మంది మృతదేహాలను రెస్కూ సిబ్బంది గుర్తించారు. అదీగాక అక్కడ కఠినమైన వాతావరణ పరిస్థితులు, తీవ్ర గాలులు కారణంగా రెస్కూ ఆపరేషన్ చేపట్టడం కష్ట తరంగా మారింది. ఈ ఘటన జరిగిన వెంటనే శనివారం ముగ్గురిని రక్షించారు. మరొకరిని సోమవారం తెల్లవారుజామున రక్షించారు. ఈ మేరకు ఆ ప్రాంతంలో సుమారు ఏడు విమానాలు, దాదాపు 249 పడవలు, 498 ఫిషింగ్ ఓడలు గల్లంతైన వారి ఆచూకి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ప్రస్తుతం ఈ రెస్కూ ఆపరేషన్కి సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by 政府飛行服務隊GovernmentFlyingService (@governmentflyingservice) (చదవండి: పాకిస్తాన్లో ఘోరం.. లోయలో పడిన బస్సు..19 మంది మృతి) -
డ్రాగన్ సైనిక విన్యాసాలు
బీజింగ్: దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ దేశం చైనా సైనిక విన్యాసాలు ప్రారంభించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆసియాపర్యటన తలపెట్టిన నేపథ్యంలో ఈ విన్యాసాలకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. సైనిక విన్యాసాలు గురువారం ప్రారంభమయ్యాయని, సోమవారం వరకు కొనసాగుతాయని హైనన్ ప్రావిన్స్లోని చైనా మారిటైమ్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసు ప్రకటించింది. విన్యాసాలు జరిగే ప్రాంతంలో ఇతర దేశాల విమానాలకు అనుమతి ఇవ్వడం లేదని తెలిపింది. -
అమెరికా అణు జలాంతర్గామికి ప్రమాదం.. ఆందోళన వ్యక్తం చేసిన చైనా
బీజింగ్: వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో అమెరికాకు చెందిన అణు జలాంతర్గామి ‘యూఎస్ఎస్ కనెక్టికట్’ ప్రమాదానికి గురైవ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ‘యూఎస్ఎస్ కనెక్టికట్’ గత శనివారం అంతర్జాతీయ జలాల్లో నీటి అడుగున దేనినో ఢీకొట్టిందనీ, ఈ ఘటనలో పలువురు నావికులు అంతగా ప్రమాదకరం కాని విధంగా గాయపడ్డారని గురువారం యూఎస్ పసిఫిక్ ఫ్లీట్ ఒక ప్రకటనలో తెలిపింది. ‘సబ్మెరీన్ కనెక్టికట్ సురక్షితంగానే ఉంది. అందులోని న్యూక్లియర్ ప్రొపల్షన్ ప్లాంట్, ఇతర వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తున్నాయి’ అని పేర్కొంది. అయితే, ఈ జలాంతర్గామి మునిగిపోయిన ఓడనో, మరే వస్తువునో ఢీకొట్టి ఉంటుందే తప్ప..మరో సబ్మెరీన్ను మాత్రం కాదని ఓ అధికారి వివరించారు. ప్రస్తుతం ఈ జలాంతర్గామి గ్వామ్ వైపు వెళుతోందని ఆయన చెప్పారు. భద్రతా కారణాల రీత్యానే ఈ ఘటన వివరాలను వెంటనే వెల్లడించలేక పోయినట్లు వివరించారు. కాగా, ప్రమాద ఘటనపై చైనా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటన జరిగిన ప్రాంతం, ఇతర వివరాలను వెంటనే బహిరంగపర్చాలని డిమాండ్ చేసింది. స్వేచ్ఛా సముద్రయానం పేరుతో ఈ ప్రాంతంలో అమెరికా జరుపుతున్న వాయు, నౌకా విన్యాసాలే ఘటనకు కారణమని నిందించింది. -
ఆ ట్రిబ్యునల్ తీర్పు చెత్త కాగితంతో సమానం!: చైనా
బీజింగ్: దక్షిణ చైనా సముద్రంపై 2016లో అంతర్జాతీయ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు చెత్తకాగితంతో సమానమని చైనా వ్యాఖ్యానించింది. ఆ తీర్పును తాము గౌరవించేది లేదని స్పష్టం చేసింది. ట్రిబ్యునల్ తీర్పును అమెరికా సమర్ధించడం తమపై నింద మోపేందుకు చేసే ప్రహసనమని చైనా ప్రతినిధి జావో లిజ్జియన్ విమర్శించారు. ఇటీవలే తమ సముద్ర జలాల్లోకి వచ్చిన యూఎస్ యుద్ధ నౌకను తరిమి కొట్టామని చైనా ప్రకటించింది. దక్షిన చైనా సముద్రంపై తమకు హక్కుందని చైనా వాదిస్తుండగా, అలాంటిదేమీ లేదంటూ అప్పుడప్పుడు యూఎస్ ఇలాంటి ప్రయోగాలు చేస్తుంటుంది. ఈ విషయమై ట్రిబ్యునల్ తీర్పును గౌరవించాలని అమెరికా చెబుతుంటుంది. ఈ నేపథ్యంలోనే ఫిలిప్పీన్స్కు తమకు ద్వైపాక్షిక ఒప్పందాలున్నందున, దక్షిన చైనా జలాల్లో వాటాలకు సంబంధించి ఫిలిప్పీన్స్పై చైనా ఎలాంటి దాడి చేసినా, తాము జోక్యం చేసుకోక తప్పదని యూఎస్ స్టేట్ సెక్రటరీ ఆంటోనీ బ్లింకెన్ ఆదివారం హెచ్చరించారు. దీనిపై ప్రతిస్పందిస్తూ చైనా తాజా వ్యాఖ్యలు చేసింది. తాము ఆ తీర్పును గౌరవించమని, ఎప్పటిలాగే ఈ జలాలపై తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేసింది. దక్షిణ చైనా సముద్రంలోని పరాసెల్స్ దాదాపు వంద ద్వీపాల సముదాయం. వీటిపై చైనా, వియత్నాం, తైవాన్, ఫిలిప్పీన్స్, మలేసియా, బ్రూనే దేశాలు చారిత్రకంగా తమకే హక్కు ఉందని చెప్పుకుంటున్నాయి. అయితే జులై 12, 2016లో హేగ్లోని అంతర్జాతీయ న్యాయస్థానం చైనాకు దక్షిణ చైనా సముద్రంపై చారిత్రకంగా ఎలాంటి హక్కూ లేదని తీర్పునిచ్చింది. అంతేగాక, ఫిలిప్పీన్స్కు ఉన్న చేపలు పట్టే హక్కును ఉల్లంఘిస్తోందనీ, రెడ్ బ్యాంకు వద్ద చమురు, సహజవాయువు నిక్షేపాల కోసం మైనింగ్ చేయడం ద్వారా ఆ దేశ సార్వభౌమత్వాన్ని చైనా ఖాతరు చేయడం లేదని పేర్కొంది. -
అమెరికా యుద్ధ నౌకను తరిమికొట్టాం: చైనా
బీజింగ్: తమ దేశ జలాల్లోకి అక్రమంగా ప్రవేశించిన అమెరికా యుద్ధ నౌకను తరిమికొట్టినట్లు చైనా మిలిటరీ ప్రకటించింది. వివాదాస్పదమైన పారాసెల్ దీవులకు సమీపంలో సోమవారం చైనా జలాల్లోకి అమెరికా యుద్ధనౌక చట్టవిరుద్ధంగా ప్రవేశించినట్లు డ్రాగన్ దేశం తెలిపింది. దక్షిణ చైనా సముద్ర జలాలాపై చైనాకు ఎలాంటి హక్కు లేదని అంతర్జాతీయ కోర్టు తీర్పు వెల్లడించిన ఐదేళ్లకు చైనా ఈ చర్యకు పాల్పడటం గమనార్హం. అమెరికాకు చెందిన యూఎస్ఎస్ బెన్ఫోల్డ్ యుద్ధ నౌక చైనా ప్రభుత్వ అనుమతి లేకుండా పారాసెల్స్ జలాల్లోకి ప్రవేశించిందని చైనా ఆర్మీ పీఎల్ఏ సదరన్ థియేటర్ కమాండర్ తెలిపారు. అమెరికా చర్యలు చైనా సార్వభౌమత్వాన్ని తీవ్రంగా ఉల్లంఘించడమే కాక దక్షిణ చైనా సముద్రం స్థిరత్వాన్ని దెబ్బతీసేవిధంగా ఉన్నాయని ఆరోపించించారు. అమెరికా తక్షణమే ఇలాంటి రెచ్చగొట్టే చర్యలను మానుకోవాలని కమాండర్ ఓ ప్రకటనలో కోరారు. చైనా ఆరోపణలు అవాస్తవం: అమెరికా చైనా ఆరోపణలపై అమెరికా విదేశాంగ శాఖ స్పందించింది. ఈ మేరకు అగ్ర రాజ్య విదేశాంగ శాఖ మంత్రి ఆంటోని బ్లింకెన్ స్పందిస్తూ.. ‘‘అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా, పారాసెల్స్ దీవుల పరిసరాల్లో మా యుద్ధ నౌక సంచిరించింది. చైనా సార్వభౌమాత్వానికి భంగం కలిగించామనడం పూర్తిగా అవాస్తవం. అంతేకాక అంతర్జాతీయ చట్టాలు అనుమతించిన ప్రతి చోట అమెరికా ఎగురుతుంది, ప్రయాణిస్తుంది.. పనిచేస్తూనే ఉంటుంది’’ అని ఆయన స్పష్టం చేశారు. అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పును పట్టించుకోని చైనా చైనాలో జిషాగా పిలిచే పారాసెల్స్ ప్రాంతం వందలాది ద్వీపాలు, కోరల్ దీవులు, సముద్ర సంపదకు పుట్టినిల్లు. ఈ ప్రాంతంపై తమకే హక్కుందని చైనా, వియత్నాం, తైవాన్, ఫిలిప్పీన్స్, మలేసియా, బ్రూనే దేశాలు ప్రచారం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో 1970 లలో హైనాన్ ద్వీపానికి ఆగ్నేయంగా 220 మైళ్ళు (350 కిలోమీటర్లు), 250 మైళ్ళు (వియత్నాంకు 400 కిలోమీటర్లు) బంజరు ద్వీపాల గొలుసు అయిన పారాసెల్స్ను చైనా తన ఆధీనంలోకి తీసుకుంది. ఈ ప్రాంతాన్ని వియత్నాం తమదిగా చెప్పుకుంటుంది. అక్కడ దీన్ని హోంగ్ సా అని పిలుస్తారు. అలానే తైవాన్ కూడా దీనిపై తమకే హక్కుందని ప్రచారం చేసుకుంటుంది. ఈ ప్రాంతం గుండా ఏదైనా సైనిక నౌక ప్రయాణించే ముందు మూడు దేశాల నుంచి అనుమతి తీసుకోవాలి. ముందస్తు నోటిఫికేషన్ ఇవ్వాలి. అయితే ఈ వివాదంపై అంతర్జాతీయ న్యాయస్థానం హేగ్ 2016, జూలై 12న సంచలన తీర్పు ఇచ్చింది. చైనా నైన్-డాష్ లైన్గా పిలుచుకునే పారాసెల్స్ ప్రాంతంపై బీజింగ్కు చారిత్రతకంగా ఎలాంటి హక్కు లేదని తేల్చి చెప్పింది. అంతేకాక ఫిలిప్పీన్స్కు ఉన్న చేపలు పట్టే హక్కును ఉల్లంఘిస్తోందని.. రెడ్ బ్యాంక్ వద్ద చమురు, సహజవాయువు నిక్షేపాల కోసం మైనింగ్ చేస్తూ.. ఫిలిఫ్పీన్స్ దేశ సార్వభౌమత్వాన్ని చైనా ఉల్లంఘిస్తుందని తెలిపింది. -
చైనాకు ఆస్ట్రేలియా గట్టి వార్నింగ్!
కాన్బెర్రా: ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ చైనాకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. డ్రాగన్ దేశ ఒత్తిళ్లకు తలొగ్గే ప్రసక్తేలేదని, తమ జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. చైనా రాయబార కార్యాలయం నుంచి వచ్చిన అనధికారిక డాక్యుమెంట్, తమ చట్టాల రూపకల్పన, నిబంధనలపై ఎలాంటి ప్రభావం చూపలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఈ ఏడాది మేలో వాణిజ్య విభాగ విదేశీ ప్రత్యక్ష ఉత్పత్తుల వినియోగం నిబంధనలు మరింత విస్తృతం చేసిన అగ్రరాజ్యం అమెరికా.. తద్వారా చైనీస్ టెలికం దిగ్గజం వావే టెక్నాలజీస్ను అమెరికా చట్టాలను ఉల్లంఘించకుండా కట్టడి చేయాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.ఇందులో భాగంగా వావేను విశ్వసనీయత లేని వ్యాపార సంస్థగా అభివర్ణిస్తూ.. చైనా కమ్యూనిస్టు పార్టీ ఆదేశాలకు అనుగుణంగా ఆ సంస్థ పనిచేస్తుందని ఆరోపించింది. (చదవండి: చైనా లక్ష్యంగా 4 దేశాల కీలక ప్రకటన) అంతేగాక ఏదైనా దేశానికి చెందిన 5జీ నెట్వర్క్ మౌలిక సదుపాయాలు గనుక వావే వద్ద ఉన్నట్లయితే, ఆ దేశంపై గూఢచర్యం చేసే అవకాశాలు ఉంటాయన్న సమాచారాన్ని తన మిత్ర దేశాలతో పంచుకుంది. ఈ నేపథ్యంలో యూకే, ఆస్ట్రేలియా ఈ చైనీస్ కంపెనీపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ క్రమంలో జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా వావేను బ్యాన్ చేసినట్లు ఆస్ట్రేలియా వెల్లడించింది. అంతేగాక దక్షిణ చైనా సముద్రం, ఇండో- పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టేలా వ్యవహరిస్తున్న అమెరికాకు, ఆసీస్ మద్దతుగా నిలుస్తోంది. అంతేగాక కరోనా వైరస్ విషయంలోనూ డ్రాగన్ దేశంపై విరుచుకుపడింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య గత కొన్నిరోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దౌత్య, వ్యాపార సంబంధాలు దెబ్బతిన్నాయి. దీంతో 14 రకాల వేర్వేరు అంశాల్లో ఆసీస్ వైఖరి కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని చైనా పేర్కొంది. (చదవండి: అప్ఘనిస్తాన్లో ఆస్ట్రేలియా సైనికుల దాష్టీకాలు) ఈ నేపథ్యంలో చైనా ప్రభుత్వ అధికారి ఒకరు.. ‘‘చైనాను శత్రువుగా భావిస్తే.. చైనా మీ శత్రువుగానే ఉంటుంది’’అంటూ ఆస్ట్రేలియా ను ఉద్దేశించి వ్యాఖ్యానించినట్లు బుధవారం కథనాలు వెలువడ్డాయి. ఈ విషయంపై గురువారం స్పందించిన ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్.. ‘‘ మా జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా మా చట్టాలు, మా నిబంధనలు మేం రూపొందించుకుంటాం. అలా చేయకుండా ఓ అనధికారిక పత్రం మమ్మల్ని ఆపలేదు. విదేశీ పెట్టుబడుల అంశంపై మేం అస్సలు రాజీపడబోం. 5జీ టెలికమ్యూనికేషన్స్ నెట్వర్క్ ఎలా నిర్మించుకోవాలి, మా సార్వభౌమత్వాన్ని ఎలా కాపాడుకోవాలి అన్న అంశాలపై మాకు స్పష్టత ఉంది’’అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో చైనా జోక్యం అవసరం లేదని పేర్కొన్నారు. కాగా ట్రంప్ హయాంలో డ్రాగన్ దేశంతో విభేదాలు తారస్థాయికి చేరిన శ్వేతసౌధ జాతీయ భద్రతా మండలి ఆస్ట్రేలియా- చైనాల గురించి ట్వీట్ చేసిన కొన్ని గంటల్లోనే ఆసీస్ ప్రధాని ఈ మేరకు స్పందించడం గమనార్హం. ‘‘చైనీస్ ఎత్తుగడలు బహిర్గతం చేసే దిశగా ఆస్ట్రేలియా ముందడుగు వేస్తున్న వేళ బీజింగ్ నిరాశకు లోనవుతోంది. తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకునే క్రమంలో ఆసీస్ తీసుకుంటున్న నిర్ణయాలు, మరికొన్ని దేశాలు కూడా అదే బాటలో నడవడం చూస్తుంటే ఉత్సాహంగా ఉంది’’అని జాతీయ భద్రతా మండలి పేర్కొంది. -
భారత్తో చర్చలు.. అమెరికా కీలక వ్యాఖ్యలు
వాషింగ్టన్/న్యూఢిల్లీ: తూర్పు లదాఖ్ సరిహద్దుల్లో నెలకొన్న ప్రతిష్టంభన పరిస్థితులను గమనిస్తున్నామని, దక్షిణ చైనా సముద్రం సహా ఇండో పసిఫిక్ జలాల్లో దుందుడుకు వైఖరి ప్రదర్శిస్తున్న చైనాకు దీటుగా బదులిచ్చేందుకు భారత్తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు అగ్రరాజ్యం అమెరికా పునరుద్ఘాటించింది. ఆగ్నేయాసియాలో కీలక దేశమైన భారత్కు ఎల్లప్పుడు తన మద్దతు ఉంటుందని పేర్కొంది. 2016 నుంచి ఇండియా తమ మేజర్ డిఫెన్స్ పార్టనర్గా మారిందని, గత నాలుగేళ్లుగా ఇరుదేశాల మధ్య రక్షణ రంగానికి సంబంధించిన ఒప్పందాల విషయంలో ఇటీవల కీలక ముందడుగు పడిందని పేర్కొంది. కాగా సైన్య సహకారం, పరస్పర సమాచార మార్పిడి తదితర అంశాలకు సంబంధించిన ఒప్పందాల గురించి భారత్- అమెరికాల మధ్య వచ్చే వారం 2+2 చర్చలు జరుగనున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా బేసిక్ ఎక్స్స్ఛేంజ్ అండ్ కో-ఆపరేషన్ అగ్రిమెంట్(బీఈసీఏ)పై భారత్ సంతకం చేయనుంది. (చదవండి: చైనా పన్నాగం; ఆ తర్వాతే బలగాల ఉపసంహరణ!) శత్రు దేశాలకు దీటుగా బదులిచ్చే క్రమంలో వారి స్థావరాలను గుర్తించి, దాడి చేసేందుకు ఉద్దేశించిన ఎంక్యూ- 9బి వంటి ఆర్మ్డ్ డ్రోన్స్ దిగుమతి తదితర అంశాల గురించి ఈ మేరకు అవగాహన ఒప్పందం కుదరనుంది. చర్చలు విజయవంతమైన తరుణంలో యూఎస్ గ్లోబల్ జియో- స్పేషియల్ మ్యాపులు ఉపయోగించి క్రూయిజ్ మిసైల్స్, బాలిస్టిక్ క్షిపణుల కచ్చితమైన జాడను తెలుసుకునే వీలు కలుగుతుంది. దీంతో దొంగ దెబ్బ తీయాలనుకునే శత్రు దేశాల వ్యూహాలను చిత్తు చేసి వారికి దీటుగా బదులిచ్చే అవకాశం లభిస్తుంది. ఈ నేపథ్యంలో ట్రంప్ పాలనా యంత్రాంగంలోని సీనియర్ అధికారులు శనివారం మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘హిమాలయాల నుంచి దక్షిణ చైనా సముద్రం నుంచి వరకు ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా దుందుడుకు చర్యలకు బదులిచ్చే క్రమంలో సారూప్య భావజాలం, ఒకే విధమైన ఆలోచనా విధానం కలిగిన ఇండియా వంటి భాగస్వామితో కలిసి పనిచేయాల్సిన ఆవశ్యకత ఉంది. మలబార్ నావికాదళ విన్యాసాల్లో ఆస్ట్రేలియాతో జట్టుకట్టనున్నట్లు ఇటీవల భారత్ చేసిన ప్రకటన పట్ల మాకెంతో సంతోషంగా ఉంది. భారత్కు మా మద్దతు ఉంటుంది. సైన్య సహకారం, పరస్పర సమాచార మార్పిడితో ముందుకు సాగుతాం. త్వరలోనే జరుగనున్న చర్చల్లో భాగంగా, ఆగ్నేయాసియా ప్రాంతంలో పెట్టుబడులు, అభివృద్ధి కార్యక్రమాలు, దక్షిణ చైనా సముద్రం తదితర అంశాల్లో భారత్ భాగస్వామ్యం మరింతగా పెరగడాన్ని స్వాగతిస్తున్నాం. తూర్పు లదాఖ్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరగకుండా చూసుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఉంది’’ అని పేర్కొన్నారు. కాగా కాగా పరస్పర సైన్య సహకారం, ఇండో- పసిఫిక్ జలాల్లో నిర్మాణాలు చేపట్టకుండా, అక్కడ జరుగుతున్న పరిణామాలపై ఓ కన్నేసి ఉంచి, పరస్పరం సహకరించుకునే క్రమంలో సమాచార మార్పిడి తదితర అంశాల్లో భారత్- అమెరికా ఇప్పటికే మూడు ప్రాథమిక ఒప్పందాలు కుదిరిన విషయం తెలిసిందే. -
యుద్ధానికి సిద్ధంగా ఉండండి: జిన్పింగ్
బీజింగ్: చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ గ్యాంగ్డాంగ్ ప్రావిన్స్లో ఉన్న మిలిటరీ బేస్ను సందర్శించారు. దక్షిణ చైనా సముద్రం మీద డ్రాగన్ పెత్తనంపై దిగ్గజ దేశాలు భగ్గుమంటున్న వేళ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మెరైన్ కార్్ప్స(నావికా దళం)ను ఉద్దేశించి ప్రసంగించారు. యుద్ధానికి సిద్ధంగా ఉండాలని, విశ్వసనీయత కలిగి ఉండాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ మేరకు చైనా అధికారిక వార్తా సంస్థ షినువా మంగళవారం ఓ కథనం ప్రచురించినట్లు సీఎన్ఎన్ తెలిపింది. ‘‘మీ అందరూ ఈ విషయంపై దృష్టి సారించి, శక్తినంతటినీ కూడగట్టుకుని యుద్ధానికి సన్నద్ధం కావాలి’’ అని జిన్పింగ్ వ్యాఖ్యానించినట్లు పేర్కొంది. కాగా వాస్తవాధీన రేఖ వెంబడి దుందుడుకు వైఖరి, దక్షిణ చైనా సముద్రం, ఇండో- పసిఫిక్ జలాలపై ఆధిపత్యం ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్న చైనా తీరు పట్ల అగ్రరాజ్యం అమెరికా సహా భారత్, ఆస్ట్రేలియా, జపాన్ తదితర క్వాడ్ దేశాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. (చదవండి: భారత సరిహద్దులో 60 వేల చైనా సైన్యం: అమెరికా) ఈ నేపథ్యంలో ఈ నాలుగు దేశాల విదేశాంగ మంత్రులు ఇటీవల టోక్యోలో సమావేశమై డ్రాగన్ దేశమే లక్ష్యంగా కీలక ప్రకటన విడుదల చేశారు. ఇండో- పసిఫిక్ ప్రాంతంలో సమ్మిళిత, స్వేచ్ఛాయుత వాతావరణమే లక్ష్యంగా కలిసి పనిచేస్తామని పునరుద్ఘాటించారు. ఇక ఈ సమావేశం అనంతరం స్వదేశానికి చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో చైనాపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘భారత ఉత్తర సరిహద్దులో చైనా 60 వేల మంది సైనికులను మోహరించింది. వుహాన్లో ఉద్భవించిన ప్రాణాంతక కరోనా వైరస్ గురించి ప్రశ్నించినందుకు ఆస్ట్రేలియాపై వేధింపులకు పాల్పడింది. చైనీస్ కమ్యూనిస్టు పార్టీ పాలన వల్ల ప్రపంచానికి ముప్పు పొంచి ఉంది’’ అంటూ డ్రాగన్ వైఖరిని ఎండగట్టారు. దీంతో మరోసారి అమెరికా- చైనాల మధ్య తలెత్తిన విభేదాలు మరోసారి తారస్థాయికి చేరుకున్నాయి. (సానుకూలంగా చర్చలు.. కానీ) అంతేగాక అమెరికా, తైవాన్కు అన్ని రకాలుగా అండగా నిలవడం పట్ల చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. అగ్రరాజ్యం అండతో తమతో సవాలు చేస్తే యుద్ధం తప్పదంటూ తైవాన్ను కూడా హెచ్చరించింది. మరోవైపు.. భారత్తోనూ సరిహద్దుల్లో పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న డ్రాగన్, మంగళవారం నాటి మిలిటరీ చర్చల్లో సానుకూల చర్చ జరిగిందని మంగళవారం ప్రకటన విడుదల చేయడం గమనార్హం. అయితే అదే సమయంలో భారత్కు వ్యూహాత్మకంగా కీలకమైన లదాఖ్, జమ్మూ కశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్ తదితర ప్రాంతాల్లో నూతనంగా నిర్మించిన వంతెనల గురించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో జిన్పింగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
డ్రాగన్ దూకుడుకు చెక్
సాక్షి, న్యూఢిల్లీ : భారత్- చైనా సరిహద్దు వివాదం నేపథ్యంలో డ్రాగన్ దూకుడుకు చెక్ పెట్టేందుకు భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. గల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు మరణించిన కొద్ది నెలల అనంతరం భారత నౌకాదళం దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో యుద్ధ నౌకను మోహరించింది. దక్షిణ చైనా సముద్ర ప్రాంతం వద్ద తాము కీలక యుద్ధ నౌకను మోహరించామని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయని ఆదివారం ఓ జాతీయ వార్తాఛానెల్ పేర్కొంది. దక్షిణ చైనా సముద్రం ఆవల గస్తీ కాస్తున్న అమెరికన్ యుద్ధ నౌకలతో భారత యుద్ధనౌక సంప్రదింపులు జరుపుతోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కి ఇక వివాదాస్పద ప్రాంతంలో భారత యుద్ధ నౌకల కదలికలపై డ్రాగన్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తూర్పు లడఖ్లో ఉద్రిక్తతల నేపథ్యంలో దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో భారత యుద్ధవిమానాల మోహరింపు ప్రాధాన్యత సంతరించుకుంది. దక్షిణ చైనా సముద్రంపై ప్రాబల్యం కలిగిన చైనా ఆ ప్రాంతంలో ఇతర దేశాల యుద్ధవిమానాల ఉనికిని వ్యతిరేకిస్తోంది. మరోవైపు దక్షిణ చైనా సముద్రంపై చైనా ప్రాబల్యానికి చెక్ పెట్టేందుకు అమెరికా పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. చదవండి : చైనా దూకుడు: మిస్సైల్ బేస్ల నిర్మాణం! -
విమాన విధ్వంస క్షిపణులను ప్రయోగించిన చైనా
బీజింగ్: చైనా నావికా విన్యాసాల్లో భాగంగా మొదటిసారిగా రెండు విమాన విధ్వంసక మిసైల్స్ని, దక్షిణ చైనా సముద్రంపైన ప్రయోగించింది. అమెరికా గూఢచార విమానాలు వివాదాస్పద భూభాగంలో తిరుగుతున్నాయని చైనా ఆరోపించింది. దక్షిణ, తూర్పు చైనా సముద్ర ప్రాంతాల్లో ఉన్న వివాదాన్ని దృష్టిలో ఉంచుకొని, చైనా ఈ ప్రాంతంలో సైనిక స్థావరాలను బలోపేతం చేసుకుంది. దక్షిణ చైనా సముద్రంపై తమకే పూర్తి అధికారాలున్నాయని బీజింగ్ పేర్కొంటుండగా, వియత్నాం, మలేషియా, పిలిప్పైన్స్, బ్రూనే, తైవాన్లు విభేదిస్తున్నాయి. ఈ రెండు మిస్సైళ్లు 4 వేల కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించగలవు. -
ఇండో పసిఫిక్ మెగా నేవీ డ్రిల్
వాషింగ్టన్ : మలబార్ నావికాదళ విన్యాసాలలో పొల్గొనేందుకు భారత్ ఆస్ర్టేలియాను ఆహ్వానించాలని యోచిస్తోంది. ఈ అంశానికి సంబంధించి రాబోయే రెండు వారాల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో క్వాడ్ సభ్యులతో పాటు కాన్బెర్రా పాల్గొనడం వల్ల ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని, పరస్పర ప్రయోజనాలను కాపాడుకోవచ్చని అమెరికాకు చెందిన దౌత్యవేత్త స్టీవెన్ బీగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. 1992 లో ప్రారంభమైన వార్షిక నావికాదళ విన్యాసాల్లో భాగంగా భారత్, జపాన్, అమెరికా పాల్గొంటుండగా తాజాగా ఆస్ర్టేలియా కూడా ఇందులో పాలుపంచుకోనుంది. కాగా 2015లో జపాన్ ఈ క్వాడ్లో శాశ్వత సభ్యుదేశంగా మారిన సంగతి తెలిసిందే. ఇండో-పసిఫిక్లో శాంతి, సుస్థిరితను నెలకొల్పాలనే లక్ష్యంతో క్వాడ్ను ఏర్పాటు చేశారు. (దక్షిణ చైనా సముద్రంలో అమెరికా యుద్ధ విన్యాసాలు ) ప్రపంచ వ్యాప్తంగా ఇండో- పసిఫిక్ దేశాలతో అమెరికా సహకారం ఎప్పుడూ ఉంటుందని, ఆసియా దేశాలతో కలిసి పనిచేస్తున్నామని స్టీవెన్ బీగన్ అన్నారు. 'తమ విధానం నాలుగు స్తంఢాలపై నిలుస్తుంది. మొదటిది ఐక్యత, రెండోది మా మిత్రదేశాలతో భాగస్వామ్యం, మూడివది సైనిక నిరోధకత, చివరిగా నాలుగవది చైనాకు శక్తివంతమైన ఆర్థిక ప్రత్యామ్నాయం' అని స్టీవెన్ బీగన్ వెల్లడించారు. దక్షిణ చైనా సముద్రం చుట్టుపక్కల ఉన్న ఆయిల్, గ్యాస్ నిల్వలపై కన్నేసే ఇతర దేశాలతో చైనా గొడవపడుతోందని అమెరికా గతంలో ఆరోపించింది. దక్షిణ చైనా సముద్రంలో ఉన్న ఆయిల్, గ్యాస్ నిల్వల్లో 90 శాతం తనదేననేది చైనా వాదన. దీనిపై బ్రూనై, ఫిలిప్పీన్స్, మలేసియా, తైవాన్, వియత్నాం దేశాలు అభ్యంతరం చెబుతున్నాయి. తమకూ ఈ సహజ నిల్వలపై హక్కు ఉందంటున్నాయి. అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో కూడా దక్షిణ చైనా సముద్రంలోని వివాదాస్పద ప్రాంతంలో చైనా తన ప్రాదేశిక ఆశయాల కోసం ప్రయత్నిస్తోందని ఆరోపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆస్ట్రేలియా, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, ఫిలిప్పీన్స్, థాయ్లాండ్ దేశాలతో సత్సంబంధాలు మరింత బలోపేతం అవుతున్నాయని స్టీవెన్ పేర్కొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. ('గ్లోబల్ కామన్స్లో ఇది కూడా ఒక భాగమే' ) -
అమెరికాకు బదులిచ్చేందుకు సిద్ధమవుతున్న చైనా!
బీజింగ్: దక్షిణ చైనా సముద్రంపై ఆధిపత్యం చాటుకునేందుకు ప్రయత్నిస్తున్న చైనాకు చెక్ పెట్టేందుకు అమెరికా గత కొన్ని రోజులుగా క్రియాశీలక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా యుద్ధ విన్యాసాలు చేపడుతూ గట్టి హెచ్చరికలు జారీ చేస్తోంది. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యానికి దీటుగా బదులిచ్చేందుకు చైనా పీపుల్స్ లెబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) సైతం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టైప్ 075 అనే ఆంఫీబియస్ అసాల్ట్(ఉభయచర) షిప్పులను రంగంలోకి దించినట్లు సమాచారం. దాదాపు 40 వేల టన్నుల బరువైన టైప్ 075 షిప్ 900 బలగాలను తరలించగల సామర్థ్యం ఉన్న విమాన వాహక నౌక అని, దాదాపు 30 హెలికాప్టర్లను ఒకేసారి మోసుకెళ్లగలిగే శక్తిసామర్థ్యాలు దీని సొంతమని ఇటీవల విడుదలైన సాటిలైట్ ఫొటోగ్రాఫ్లను అధ్యయనం చేసిన వెస్ట్రన్ మిలిటరీ నిపుణులు పేర్కొన్నారు. అంతేగాక యూఎస్ ఎఫ్-35బీ మాదిరి షార్ట్ టేకాఫ్ అండ్ వర్టికల్ లాండింగ్ ఎయిర్క్రాఫ్ట్ను తయారు చేసే పనిలో చైనా నిమగ్నమై ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. (భారత్-అమెరికా సంయుక్త విన్యాసాలు) కాగా గతేడాది సెప్టెంబరులో తొలి టైప్ 075 షిప్ను, ఈ ఏడాది ఏప్రిల్లో రెండో షిప్ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మూడో ఆంఫీబియస్ షిప్ నిర్మాణంలో ఉందని, మొత్తంగా ఇలాంటివి ఏడు షిప్పులు తయారు చేయనున్నట్లు చైనా మిలిటరీ అధికారిక ప్రెస్మీట్లో వెల్లడించింది. వీటి ద్వారా ఇదిలా ఉండగా.. దక్షిణ చైనా సముద్రంపై గుత్తాధిపత్యం సాధించేందుకు డ్రాగన్ అన్ని విధాలుగా సన్నద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ప్రత్యర్థి బలగాలకు దీటుగా బదులిచ్చేందుకు నావికా దళ బలగాలను పెద్ద ఎత్తున పెంచుకుంటూ పోతున్నట్లు తెలుస్తోంది. చైనాకు 2017లో దాదాపు 10 వేల మెరైన్లు ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య 25 నుంచి 35 వేలకు చేరిందని అమెరికా, జపాన్ మిలిటరీ ఈ మేరకు అంచనా వేశాయి. ఇక దక్షిణ చైనా సముద్రం చుట్టుపక్కల ఉన్న ఆయిల్, గ్యాస్ నిల్వలపై కన్నేసిన డ్రాగన్ పొరుగు దేశాలను బెదిరింపులకు గురిచేస్తోందని అమెరికా మండిపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దక్షిణ చైనా సముద్రంలో ఏ దేశాల హక్కులను డ్రాగన్ హరించినా ఆయా దేశాలకు ట్రంప్ సర్కారు అండగా ఉంటుందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో స్పష్టం చేశారు. ఈ క్రమంలో భారత్-చైనాల మధ్య సరిహద్దు వివాదం నేపథ్యంలో భారత యుద్ధనౌకలతో కలిసి సంయుక్త విన్యాసాలు చేపట్టేందుకు అమెరికా నౌకాదళం సిద్ధమైంది. ఇందులో భాగంగా సోమవారం యుద్ధనౌక యూఎస్ నిమిజ్ అండమాన్, నికోబార్ దీవుల సమీపంలో హిందూ మహాసముద్రానికి చేరుకుంది. అండమాన్ నికోబార్ కమాండ్ (ఏఎన్సీ)తో పాటు తూర్పు నావల్ కమాండ్ (ఏఎన్సీ)కు చెందిన నౌకలు ఈ విన్యాసాల్లో పాలుపంచుకున్నాయి. -
'గ్లోబల్ కామన్స్లో ఇది కూడా ఒక భాగమే'
ఢిల్లీ : దక్షిణ చైనా సముద్రంపై అమెరికా -చైనా మాటల యుద్ధం నెలకొన్న తరుణంలో వ్యూహాత్మక జలమార్గం గ్లోబల్ కామన్స్లో భాగమని భారత్ ప్రకటించింది. అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా నావిగేషన్ , చట్టబద్ధమైన వాణిజ్యం కోసం భారత్ నిలుస్తుందని పేర్కొంది. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ వెల్లడించారు. ఇదివరకు దక్షిణ చైనా సముద్రం గుండా నావిగేషన్ స్వేచ్ఛ కోసం పోరాడతామని ఆస్ట్రేలియా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై ఆస్ట్రేలియా చాలా స్థిరమైన స్థానాన్ని అవలంభిస్తుందంటూ ప్రధాని స్కాట్ మోరిసన్ పేర్కొన్నారు. దక్షిణ చైనా సముద్రానికి సంబంధించి చైనా నిబంధనలు ఉల్లంఘించిందని నమ్మే దేశాలకు మద్దతిస్తామని అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపియో ప్రకటన అనంతరం ఆస్ట్రేలియా, భారత్ నుంచి ఈ ప్రకటనలు వచ్చాయి. సముద్ర సామ్రాజ్యాన్ని సృష్టించేందుకు చైనా ప్రయత్నిస్తోందని అమెరికా ఆరోపించించిన సంగతి తెలిసిందే. దక్షిణ చైనా సముద్రానికి సంబంధించి చైనా చేసిన వాదనలను చట్టవిరుద్ధమని జూలై 13న పాంపియో పేర్కొన్నారు. అయితే ఇప్పటికే కరోనా వైరస్ నేపథ్యంలో రెండు ప్రపంచ శక్తిమంతమైన దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న తరుణంలో జలమార్గంలోనూ ఇబ్బందులను కలిగించడానికి అమెరికా ప్రయత్నిస్తోందని బీజింగ్ ఆరోపించింది. (ఆ ఆరోపణలు అర్థం లేనివి : చైనా) దక్షిణ చైనా సముద్రం చుట్టుపక్కల ఉన్న ఆయిల్, గ్యాస్ నిల్వలపై కన్నేసే ఇతర దేశాలతో చైనా గొడవపడుతోందని అమెరికా గతంలో ఆరోపించింది. దక్షిణ చైనా సముద్రంలో ఉన్న ఆయిల్, గ్యాస్ నిల్వల్లో 90 శాతం తనదేననేది చైనా వాదన. దీనిపై బ్రూనై, ఫిలిప్పీన్స్, మలేసియా, తైవాన్, వియత్నాం దేశాలు అభ్యంతరం చెబుతున్నాయి. తమకూ ఈ సహజ నిల్వలపై హక్కు ఉందంటున్నాయి. అయితే ప్రస్తుతం కరోనా సంక్షోభం నెలకొన్న సమయంలో చైనా ఆ ప్రాంతంపై అధిపత్యం కోసం ప్రయత్నాలు ముమ్మురం చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో కూడా దక్షిణ చైనా సముద్రంలోని వివాదాస్పద ప్రాంతంలో చైనా తన ప్రాదేశిక ఆశయాల కోసం ప్రయత్నిస్తోందని ఆరోపించిన సంగతి తెలిసిందే (దక్షిణ చైనా సముద్ర వివాదం.. స్పందించిన చైనా) -
చైనాకు షాక్: భారత్-అమెరికా యుద్ధ విన్యాసాలు
సాక్షి, న్యూఢిల్లీ: భారత్-చైనాల మధ్య సరిహద్దు వివాదం నేపథ్యంలో భారత యుద్ధనౌకలతో కలిసి సంయుక్త విన్యాసాలు చేపట్టేందుకు అమెరికా నౌకాదళానికి చెందిన యుద్ధనౌక యూఎస్ నిమిజ్ అండమాన్, నికోబార్ దీవుల సమీపంలో హిందూ మహాసముద్రానికి చేరుకుంది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో దూకుడు పెంచిన డ్రాగన్కు ఈ పరిణామం దీటైన సంకేతం పంపుతోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. లక్ష టన్నుల బరువుండే అమెరికా నిమిజ్ నౌక 90 యుద్ధ విమానాలను మోయగల సామర్ధ్యం కలిగిఉంది. అండమాన్ నికోబార్ దీవుల్లో జరుగుతున్న విన్యాసాల్లో సబ్మెరైన్లు సహా పలు భారత యుద్ధ నౌకలు పాల్గొంటున్నాయి. అండమాన్ నికోబార్ కమాండ్ (ఏఎన్సీ)తో పాటు తూర్పు నావల్ కమాండ్ (ఏఎన్సీ)కు చెందిన నౌకలు విన్యాసాల్లో పాలుపంచుకుంటున్నాయి. దక్షిణ చైనా సముద్రంలో వ్మూహాత్మక జలాలపై ప్రపంచ దేశాలన్నింటికీ ఉమ్మడి భాగస్వామ్యం ఉంటుందని భారత్ ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ విన్యాసాలు చోటుచేసుకోవడం గమనార్హం. ఈ ప్రాంతంలో శాంతి సుస్ధిరతలను భారత్ కోరుకుంటుందని, అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా దక్షిణ చైనా సముద్రంలో స్వేఛ్చా నావిగేషన్, చట్టబద్ధ వాణిజ్యానికి కట్టుబడి ఉన్నామని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. దక్షిణ చైనా సముద్రంలో ఏ దేశాల హక్కులను డ్రాగన్ హరించినా ఆయా దేశాలకు ట్రంప్ యంత్రాంగం అండగా ఉంటుందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో స్పష్టం చేసిన క్రమంలో భారత్ ఈ వ్యాఖ్యలు చేసింది. గత కొద్ది రోజులుగా ట్రంప్ యంత్రాంగం దక్షిణ చైనా సముద్రంపై తన వైఖరిని కఠినతరం చేసింది. ఆ ప్రాంతంలో ఇతర దేశాల ఆందోళనలను విస్మరిస్తూ దక్షిణ చైనా ప్రాంతంలో మారిటైమ్ సామ్రాజ్యం నిర్మించేందుకు చైనా ప్రయత్నిస్తోందని అమెరికా ఆరోపించింది. చదవండి: అగ్ర రాజ్యాల మధ్య వ్యాక్సిన్ వార్ -
‘అమెరికా జోక్యం అనవసరం’
బీజింగ్: సరిహద్దు దేశాలతో కయ్యానికి కాలు దువ్వే చైనాకు షాక్ ఇవ్వడానికి అమెరికా దక్షిణ చైనా సముద్రంలోకి యుద్ధ నౌకలను తరలించిన సంగతి తెలిసిందే. దీనిపై చైనా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో దక్షిణ చైనా విషయంలో అమెరికా చేస్తోన్న ఆరోపణలు పూర్తిగా అన్యాయమైనవని డ్రాగన్ దేశం పేర్కొంది. దక్షిణ చైనా సముద్రం విషయంలో చైనా పొరుగుదేశాలను బెదిరిస్తోందని అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యలను కూడా చైనా ఖండించింది. ఈ మేరకు ‘దక్షిణ చైనా సముద్రం విషయంలో అమెరికా కల్పించుకోవడం ఆమోదయోగ్యంగా లేదు. ఈ వివాదంలో అమెరికాకు సంబంధం లేదు. అలాంటప్పుడు ఈ అంశంలో తలదూర్చడం సమంజసం కాదు’ అంటూ అమెరికాలోని చైనా రాయబార కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. అంతేకాక స్థిరత్వం కాపాడాలనే నెపంతో అమెరికా ఈ అంశంలో ఉద్రిక్తతలను రేకెత్తిస్తుంది అని చైనా విమర్శించింది. (అందరూ కరోనా బిజీలో ఉంటే.. చైనా మాత్రం) దక్షిణ చైనా సముద్రం చుట్టుపక్కల ఉన్న ఆయిల్, గ్యాస్ నిల్వలపై కన్నేసే ఇతర దేశాలతో చైనా గొడవపడుతోందని అమెరికా గతంలో ఆరోపించింది. దక్షిణ చైనా సముద్రంలో ఉన్న ఆయిల్, గ్యాస్ నిల్వల్లో 90 శాతం తనదేననేది చైనా వాదన. దీనిపై బ్రూనై, ఫిలిప్పీన్స్, మలేసియా, తైవాన్, వియత్నాం దేశాలు అభ్యంతరం చెబుతున్నాయి. తమకూ ఈ సహజ నిల్వలపై హక్కు ఉందంటున్నాయి. ఈ క్రమంలో చైనా దక్షిణ చైనా సముద్రంలో యుద్ధ విన్యాసాలకు ప్లాన్ చేసుకుంది. డ్రాగన్ కంట్రీని కట్టడి చేసేందుకు అమెరికా యుద్ధ విన్యాసాలను నిర్వహించడానికి రెడీ అయిన సంగతి తెలిసిందే. ‘దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో శాంతిభద్రతలకు కట్టుబడి ఉంటామని మా భాగస్వాములకు తెలియజేసేందుకే ఈ విన్యాసాలు చేపడుతున్నాం’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే, తాము చేయబోయే యుద్ధ విన్యాసాలకు, చైనా యుద్ధ విన్యాసాలు కారణం కాదని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
చైనా సముద్రంలోకి అమెరికా యుద్ధనౌకలు
వాషింగ్టన్: దక్షిణ చైనా సముద్రం(ఎస్సీఎస్)లోకి అమెరికా యుద్ధ విన్యాసాలను నిర్వహించనుంది. ఈ మేరకు రెండు విమానవాహక నౌకలతో పాటు నాలుగు యుద్ధ నౌకలు శనివారానికి ఎస్సీఎస్లో ప్రవేశిస్తాయని వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనంలో వెల్లడించింది. (జూనియర్ ట్రంప్ గర్ల్ఫ్రెండ్కు కరోనా..) ఎస్సీఎస్లోని పారాసెల్ దీవుల్లో చైనా యుద్ధ విన్యాసాలను ప్లాన్ చేసుకున్న సమయంలోనే అమెరికా కూడా విన్యాసాలకు దిగడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. అమెరికాకు చెందిన యూఎస్ఎస్ రోనాల్డ్ రీగన్, యూఎస్ఎస్ నిమిట్జ్ విమాన వాహక నౌకలు దక్షిణ చైనా సముద్రంలో యుద్ధ విన్యాసాల్లో పాల్గొంటాయని అడ్మిరల్ జార్జ్ వికాఫ్ పేర్కొన్నారు. (విజృంభిస్తున్న కరోనా డీ614జీ స్టెయిన్) ‘దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో శాంతిభద్రతలకు కట్టుబడి ఉంటామని మా భాగస్వాములకు తెలియజేసేందుకే ఈ విన్యాసాలు చేపడుతున్నాం’ అని ఆయన చెప్పారు. అయితే, తాము చేయబోయే యుద్ధ విన్యాసాలకు, చైనా యుద్ధ విన్యాసాలు కారణం కాదన్నారు. పారాసెల్ ద్వీపంపై వియత్నాంతో చైనా కయ్యానికి కాలు దువ్వుతోంది. ఆ దీవి తమదేనని వాదిస్తోంది. వివాదాస్పద ప్రాంతంలో యుద్ధ విన్యాసాలపై వియత్నాం, ఫిలిప్పీన్స్, చైనాను తప్పుబట్టాయి. ఇలాంటి వ్యవహారశైలి పొరుగు దేశాలతో చైనాకు ఉన్న సంబంధాలపై ప్రభావం చూపుతుందన్నాయి. దక్షిణ చైనా సముద్రం చుట్టుపక్కల ఉన్న ఆయిల్, గ్యాస్ నిల్వలపై కన్నేసే ఇతర దేశాలతో చైనా గొడవపడుతోందని అమెరికా గతంలో ఆరోపించింది. దక్షిణ చైనా సముద్రంలో ఉన్న ఆయిల్, గ్యాస్ నిల్వల్లో 90 శాతం తనదేననేది చైనా వాదన. దీనిపై బ్రూనై, ఫిలిప్పీన్స్, మలేసియా, తైవాన్, వియత్నాం దేశాలు అభ్యంతరం చెబుతున్నాయి. తమకూ ఈ సహజ నిల్వలపై హక్కు ఉందంటున్నాయి. -
ఆ ఆరోపణలు అర్థం లేనివి : చైనా
బీజింగ్ : దక్షిణ చైనా సముద్రంపై పట్టు కోసం చైనా కరోనా వైరస్ వ్యాప్తిని ఉపయోగిస్తుందనే వార్తలను ఆ దేశం కొట్టిపారేసింది. ఆ ఆరోపణలు పూర్తిగా అర్థం లేనివని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ తెలిపారు. ఆదివారం రోజున ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. దక్షిణ చైనా సముద్రంలో సామ్రాజ్యాన్ని విస్తరించడం కోసం.. చైనా కరోనా వ్యాప్తిని విస్తరిస్తుందనడంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. వైరస్ నిరోధానికి సంబంధించి చైనా.. ఆగ్నేయ ఆసియా దేశాలతో కలిసి పనిచేస్తుందని చెప్పారు. అయితే కొందరు మాత్రం చైనాపై దుష్ప్రచారం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని మండిప్డారు. మిలటరీ విమానాలు మోహరించడం, సముద్రంలో గస్తీ నిర్వహించడంతో అస్థిరత సృష్టించేందకు కొన్ని దేశాలు ప్రయత్నిస్తున్నాయని అమెరికా దాని మిత్రదేశాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. చైనా, ఆగ్నేయ ఆసియా దేశాల మధ్య వివాదాలు రేకెత్తించడం కోసమే ఇటువంటి నీచమైన ఆలోచనలు చేస్తున్నారని మండిపడ్డారు. కాగా, దక్షిణ చైనా సముద్రంపై పట్టు కోసం చైనా చాలా కాలంగా ప్రయత్నిస్తుందనే విమర్శలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో పెద్ద మొత్తంలో చమురు, సహజవాయువు నిక్షేపాలు ఉన్నాయని అంతా భావిస్తున్నారు. ఈ వివాదాస్పద ప్రాంతం నౌకల రవాణాకు కీలకమైనది కూడా. ఈ ప్రాంతం మీద అధిపత్యం కోసం చైనా, వియత్నాం, ఫిలిప్పీన్స్, తైవాన్, బ్రూనై దేశాల మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం కరోనా సంక్షోభం నెలకొన్న సమయంలో చైనా ఆ ప్రాంతంపై అధిపత్యం కోసం ప్రయత్నాలు ముమ్మురం చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో కూడా దక్షిణ చైనా సముద్రంలోని వివాదాస్పద ప్రాంతంలో చైనా తన ప్రాదేశిక ఆశయాల కోసం ప్రయత్నిస్తోందని ఆరోపించిన సంగతి తెలిసిందే.(చదవండి : అమెరికాలో రాజకీయ వైరస్ వ్యాపిస్తోంది) -
భారత్పై చైనా దుందుడుకు వైఖరి
వాషింగ్టన్: భారత్ సహా సరిహద్దు దేశాలపై చైనా కవ్వింపు చర్యలకు దిగుతోందని అమెరికా తీవ్రంగా విమర్శించింది. బలవంతంగా సైనిక చర్యలు చేపడుతూ మిలటరీని మోహరిస్తూ దురుసుగా ప్రవర్తిస్తోందని గురువారం అధ్యక్షభవనం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ఎల్లో సీ, తూర్పు, దక్షిణ చైనా సముద్రాలు, తైవాన్ జలసంధి, భారత్ చైనా సరిహద్దుల్లో చైనా చేస్తున్న పనులకు, చెబుతున్న మాటలకి పొంతన లేదని ఆ నివేదికలో అగ్రరాజ్యం ధ్వజమెత్తింది. ‘చైనా పట్ల అమెరికా వ్యూహాత్మక ధోరణి’పేరుతో రచిం చిన ఈ నివేదికను అమెరికా ప్రభుత్వం కాంగ్రెస్కు సమర్పించింది. చైనాను ఎదుర్కోవడానికి వివిధ దేశాలు, సంస్థలతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆ నివేదిక అభిప్రాయపడింది. బలమైన శక్తిగా అవతరిస్తోన్న చైనా తమ ప్రయోజనాలకు విరుద్ధంగా ప్రవర్తించిన వారిని గుప్పిట్లోకి తీసుకోవాలని చూస్తోందని మండిపడింది. చైనా కమ్యూనిస్టు పార్టీ పొరుగు దేశాలపై దురుసుగా ప్రవర్తిస్తోందని విమర్శించింది. నేషనల్ సైబర్ సెక్యూరిటీ చట్టాన్ని తీసుకువచ్చి ప్రపంచ దేశాల సమాచారాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలని చైనా చూస్తోందని, ఈ చట్టం ద్వారా అందరి డేటాని తస్కరించే పనిలో ఉందని పేర్కొంది. ఇటీవలి కాలంలో భారత్, చైనా సరిహద్దుల్లో సైనికుల మధ్య ఘర్షణలు చెలరేగిన నేపథ్యంలో అధ్యక్షభ వనం ఈ నివేదికను కాంగ్రెస్కి సమర్పించడం గమనార్హం. భారత్తో చర్చలు జరపాలి దక్షిణ చైనా సముద్రంలో చైనా చేపడుతున్న ఆపరేషన్లకు అదుపులేకుండా పోయిందని దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల శాఖ సహాయ మంత్రి పదవి నుంచి వైదొలగనున్న అలీస్ వెల్స్ అన్నారు. సరిహద్దు దేశాలపై కవ్వింపు చర్యల కు దిగుతూ య« దాతథ స్థితిని, సరిహద్దుల్ని మార్చడానికి చైనా ప్రయత్నిస్తోందని ఆమె మండిపడ్డారు. చైనా ఇప్పటికైనా ఇలాంటి చర్యల్ని కట్టిపెట్టిæ భారత్తో చర్చలు జరపాలని అన్నారు. చైనా భారత్తో చర్చలు జరిపి సానుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు. మిషిగాన్లో కరోనా ఫేస్ షీల్డ్ ధరించిన ట్రంప్ -
అందరూ కరోనా బిజీలో ఉంటే.. చైనా మాత్రం
బీజింగ్: ప్రపంచ దేశాలు కోవిడ్-19 నివారణ చర్యలతో తీరికలేకుండా ఉన్న వేళ వైరస్ పుట్టుకకు కేంద్ర స్థానమైన చైనా మాత్రం దక్షిణ చైనా సముద్రంపై పట్టుసాధించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దక్షిణ చైనా సముద్రంలోని వివాదాస్పద ప్రాంతంలో చైనా తన ప్రాదేశిక ఆశయాల కోసం ప్రయత్నిస్తోందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ఆరోపించారు. దక్షిణ చైనా సముద్రంలో వియత్నాం, తైవాన్, ఫిలిప్పీన్స్ మలేషియా, బ్రూనైతో ఉద్రిక్తతలకు కారణమైన ప్రాంతంలో డ్రాగన్ దేశం పట్టు పెంచుకుంటోందని పాంపియో పేర్కొన్నారు. (చదవండి: భారతీయులకు కోవిడ్-19ను ఎదుర్కొనే సామర్థ్యం అధికం..) కరోనా పరిస్థితులపై ఆగ్నేయాసియా దేశాల మంత్రులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో పాంపియో ఈ ఆరోపణలు చేశారు. వివాదంలో ఉన్న ప్రాంతంలో మిలటరీ బలగాలు, యుద్ధ నౌకలను మోహరించి చైనా పొరుగు దేశాలను భయపెట్టే యత్నం చేస్తోందని విమర్శించారు. తద్వారా చమురు, సహజయవాయువు ప్రాజెక్టుల అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తోందని అన్నారు. కాగా, పాంపియో ఆరోపణల నేపథ్యంలో యూఎస్ యుద్ధనౌక దక్షిణ చైనా సముద్రంలోని తైవాన్ జలసంధి గుండా నిఘా పెట్టింది. మరోవైపు దక్షిణ చైనా సముద్రం మొత్తాన్ని, ఆ చుట్టుపక్కల ఉన్న దీవులు, దిబ్బల లెక్క తీస్తున్నామని చైనా తమ చర్యను సమర్థించుకుంది. కాగా, దక్షిణ చైనా సముద్రంలో దాదాపు ఎవరూ నివసించని దీవుల సముదాయాలు పరాసెల్స్, స్ప్రాట్లిస్ దీవులపై సార్వభౌమాధికారం ఎవరిదనే విషయంలో చైనా, ఇతర దేశాల మధ్య సుదీర్ఘకాలంగా వివాదం నెలకొంది. ఈ రెండు సముదాయాల్లోని అత్యధిక భూభాగం తమదేనని చైనా వాదిస్తోంది. దీనిపై తమకు వందల ఏళ్లుగా హక్కులు ఉన్నాయని చెబుతోంది. (చదవండి: కరోనా: అదిరిందయ్యా ఐడియా) -
సముద్ర గర్భంలో డ్రాగన్ వాల్
బీజింగ్ : దక్షిణ చైనా సముద్రంలో చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నీటిగర్భంలో గ్రేట్ వాల్ను నిర్మిస్తోంది. ఈ ప్రాంతంలో సముద్రగర్భ యుద్ధతంత్రాల్లో ఆధిపత్యం చెలాయించేందుకు డ్రాగన్ భారీ స్కెచ్ను రూపొందిస్తోంది. ఈ క్రమంలో దక్షిణ చైనా సముద్రంలో యుద్ధనౌకల నెట్వర్క్, సబ్సర్ఫేస్ సెన్సార్లను సంసిద్ధం చేస్తోంది. వివాదాస్పద ప్రాంతంలో విదేశీ నౌకల కదలికలను పసిగట్టేందుకూ వ్యూహాత్మకంగా చైనా అడుగులువేస్తోంది. మరోవైపు ఈ ప్రాంతంలో చైనా సైన్యం చర్యలకు చెక్పెట్టేందుకు దక్షిణ చైనా సముద్రంలో అమెరికా పలు మిషన్స్ను చేపట్టింది. అమెరికాకు దీటుగా అగ్రరాజ్యానికి సవాల్ విసురతూ సైనిక పాటవాన్ని చైనా సంతరించుకోవడంతో దక్షిణ చైనా సముద్రం సాయుధ వివాదాలకు, అలజడులకు కేంద్ర బిందువు కానుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. -
సౌత్ చైనా సీపై డ్రాగన్ డేగ కన్ను
బీజింగ్: వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంపై చైనా మరింత పట్టుబిగించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. సముద్రాన్ని 24 గంటల పాటు పరిశీలించేందుకు ప్రత్యేక శాటిలైట్ వ్యవస్థను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. సౌత్ చైనా సీలోని చైనాకు సంబంధించిన హైనాన ద్వీపం కేంద్రంతా.. రిమోట్ శాటిలైట్ సెన్సింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు చైనా అధికారలు ప్రకటించారు. శాటిలైట్ రిమోట్ సెన్సింగ్ మిషన్ 2019లో మొదలు పెడుతున్నట్లు శాన్యన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ డైరెక్టర యాంగ్ తియాన్లాంగ్ తెలిపారు. ఈ మిషన్లో భాగంగా సౌత్ చైనా సీపై మూడు మొదట ఆప్టికల్ శాటిలైట్స్ ప్రయోగిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇదిలాఉండగా.. 2021 నాటికల్లా.. ఇకమరో మూడు ఆప్టికల్ శాటిలైట్లు, రెండు హైపర్స్పెక్ట్రాల్ శాటిలైట్లు, మరో రెండు ఎస్ఏఆర్ రకానికి చెందిన ఉపగ్రహాలను ప్రయోగిస్తున్నట్లు చైనా అధికారులు తెలిపారు. ఈ ఉపగ్రహ వ్యవస్థ మొత్తం దక్షిణ చైనా సముద్రాన్ని నితరంతం డేగ కళ్లతో కాపు కాస్తుంటాయని చెప్పారు. -
దక్షిణ చైనా సముద్రంపై చైనా, వియత్నాం రాజీ
హనోయ్: దక్షిణ చైనా సముద్రం వివాదం విషయంలో చైనా, వియత్నాం రాజీకొచ్చాయి. ఆ విషయంలో వెనక్కి తగ్గేందుకు ఇరు దేశాలు సోమవారం అంగీకరించాయి. దాదాపు 5 ట్రిలియన్ డాలర్ల నౌకా రవాణా వాణిజ్యం జరిగే ఈ దక్షిణ చైనా సముద్రం విషయంలో చైనా, వియత్నాంతో పాటు బ్రూనై, తైవాన్, ఫిలిప్పీన్స్ మధ్య ఎంతో కాలంగా వివాదం నలుగుతోంది. ఈ సముద్రంలో చైనా ఓ అడుగు ముందుకేసి మిలిటరీ కార్యకలాపాలు సాగించేందుకు వీలుగా ఏకంగా కృత్రిమ ద్వీపాలను నిర్మించింది. చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ హనోయ్ పర్యటన సందర్భంగా ఈ సముద్రం విషయంలో శాంతి నెలకొల్పేందుకు కృషి చేస్తామని రెండు దేశాలు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో అంగీకరించాయి. ‘సమస్యలు మరింత జఠిలం అయ్యే ఎటువంటి చర్యలు కూడా తీసుకోం. తూర్పు సముద్రంలో శాంతి సామరస్యాన్ని పెంపొందిస్తాం’అని పేర్కొన్నాయి. వియత్నాంలోని వివాదాస్పద కోస్తా తీర ప్రాంతంలో చైనా చేపట్టిన చమురు వెలికితీత ప్రాజెక్టును ఈ ఏడాది ప్రారంభంలో వియత్నాం ఆపేసింది. -
మధ్యవర్తిత్వం చేస్తా: ట్రంప్
మనీలా: దక్షిణ చైనా సముద్రంపై మధ్యవర్తిత్వం వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించారు. వియత్నాం అధ్యక్షుడు త్రాన్ దై క్వాంగ్తో ద్వైపాక్షిక భేటీ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తానొక మంచి మధ్యవర్తినని, సంబంధిత పక్షాలు కోరితే మధ్యవర్తిత్వానికి తనకేం అభ్యంతరం లేదని వ్యాఖ్యానించారు. దక్షిణ చైనా సముద్రంలో చైనా ఏర్పాటుచేస్తున్న సైనిక స్థావరాలు, కృత్రిమ ద్వీపాల్ని గత కొంతకాలంగా వియత్నాం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ వివాదంలో మొదటి నుంచి వియత్నాంకు అమెరికా మద్దతుగా ఉంది. వియత్నాంతో పాటు ఫిలిప్పీన్స్, మలేసియా, బ్రూనై, తైవాన్లతో కూడా దక్షిణ చైనా సముద్రం విషయమై చైనాకు గొడవలున్నాయి. పరిష్కరించుకుంటాం: వియత్నాం మరోవైపు ట్రంప్ వియత్నాం పర్యటన ముగించుకుని ఫిలిప్పీన్స్ చేరగానే చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ వియత్నాంలో అడుగుపెట్టారు. ఆయనకు వియత్నాం ఘనస్వాగతం పలికింది. జిన్పింగ్ పర్యటనలో భాగంగా.. ఇరు దేశాధినేతలు ఆర్థిక సంబంధాల్ని విస్తృతం చేసుకోవడంతో పాటు దక్షిణ చైనా సముద్రంపై కొనసాగుతున్న వివాదం పరిష్కారం దిశగా చర్చలు జరపనున్నారు. శాంతియుత మార్గంలో దక్షిణ చైనా సముద్రంపై కొనసాగుతున్న విభేదాల్ని పరిష్కరించుకుంటామని వియత్నాం అధ్యక్షుడు క్వాంగ్ పేర్కొన్నారు. కిమ్ పొట్టి, లావు అని అన్నానా?: ట్రంప్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మధ్య మరోసారి మాటల యుద్ధం కొనసాగింది. కిమ్ తనను ముసలివాడు అనడంపై ట్విటర్లో ట్రంప్ మండిపడ్డారు. ‘నన్ను ముసలివాడు అంటూ కిమ్ ఎందుకు అవమానిస్తున్నాడు. నేనెప్పుడైనా అతన్ని పొట్టి, లావు అన్నానా?’ అని ఎగతాళిగా ట్వీట్ చేశారు. కిమ్కు స్నేహితుడిగా ఉండేందుకు తాను ఎంతగానో ప్రయత్నిస్తున్నానని, ఏదొక రోజు అది జరగవచ్చేమో? అని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. -
చైనాకు ట్రంప్ తొలి సవాల్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తొలిసారిగా చైనాకు సవాల్ విసిరారు. వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో చైనా నిర్మించిన కృత్రిమ దీవుల సమీపంలోకి అమెరికా యుద్ధనౌక ఒకటి చొచ్చుకెళ్లింది. దక్షిణ సముద్ర జలాలను వ్యూహాత్మకంగా భావిస్తున్న చైనా.. వీటిపై ఆధిపత్యం తనదేనని వాదిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలిసారిగా చైనా నిర్మించిన ఓ కృత్రిమ దీవిలో 12 నాటికల్ మైళ్లు అమెరికన్ నేవీ యుద్ధనౌక ప్రయాణించినట్టు ఆ దేశ అధికారులు తెలిపారు. పొరుగుదేశాలతో పలు వివాదాలు ఉన్నా లెక్కచేయకుండా చైనా దూకుడుగా దక్షిణ చైనా సముద్రంలో కృత్రిమ దీవులు, దిబ్బలు, ఇసుక రేవులు నిర్మించిన సంగతి తెలిసిందే. ఇందులో ఒకటైన స్ప్రాట్లీ దీవులలోని మిస్చీఫ్ రీఫ్కు అత్యంత సమీపంలో యూఎస్ఎస్ డీవే యుద్ధనౌక సంచరించినట్టు పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ అధికారి తెలిపారు. అంతర్జాతీయ జలాల్లో స్వేచ్ఛాయుత నౌకయానం ఉండాలని అమెరికా వాదిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే అగ్రరాజ్యం తలపెట్టిన ఈ చర్య చైనాకు ఆగ్రహం తెప్పించే అవకాశముంది. చైనా మిత్రపక్షం ఉత్తరకొరియా అణ్వాయుధ పరీక్షలను కట్టడి చేసేందుకు ఆ దేశం సహకారాన్ని ట్రంప్ కోరుతున్న సమయంలోనే ఇలాంటి ఘటన జరగడం గమనార్హం. అయితే, దక్షిణ చైనా సముద్రంలో చైనా ఆధిపత్యం చెల్లబోదంటూ హేగ్లోని అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు నేపథ్యంలో తొలిసారి అమెరికా ఈ ఆపరేషన్ చేపట్టినట్టు ఆ దేశ అధికారులు చెప్తున్నారు. -
చైనా వార్నింగ్ బేఖాతరు.. రంగంలోకి అమెరికా!
చైనా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ.. నేరుగా అమెరికా వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలోకి దిగింది. అమెరికా నేవీకి చెందిన యుద్ధ విమాననౌక శనివారం నుంచి దక్షిణ చైనా సముద్రంలో గస్తీ తిరగడం ప్రారంభించింది. క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ (సీఎస్జీ) 1 యుద్ధవిమాన నౌక ఈ మేరకు సాధారణ గస్తీ చేపడుతున్నదని ఆ దేశ నేవీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ యుద్ధనౌకలో నిమిట్జ్ క్లాస్ ఎయిర్క్రాప్ట్ క్యారియర్ (USS Carl Vinson (CVN 70)), క్షిపణి విధ్వంసక యూఎస్ఎస్ వేన్ ఈ మేయర్, ఎయిర్వింగ్కు చెందిన యుద్ధవిమానం తదితర అత్యాధునిక యుద్ధ సామాగ్రి ఉంది. చైనా సార్వభౌమాధికారాన్ని సవాల్ చేసే సాహసానికి ఒడిగట్టవద్దని ఇప్పటికే డ్రాగన్ హెచ్చరించింది. వివాదాస్పద దక్షిణ చైనా సముద్రం గంపగుత్తగా తనదేనని మొండిగా వాదిస్తున్న చైనా.. ఈ విషయంలో అమెరికా జోక్యాన్ని వ్యతిరేకిస్తున్నది. మరోవైపు దక్షిణ చైనా సముద్రంలోని పలు దీవులు, సముద్రజలాల్లో తమకు కూడా హక్కులు ఉన్నాయని కాంబోడియా, ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయ్లాండ్, వియత్నాం భావిస్తున్నాయి. ఇక్కడ అంతర్జాతీయ జలాలు ఉన్నాయని, ఈ జలాల మీదుగా అంతర్జాతీయ నౌకలు సురక్షితంగా ప్రయాణించేందుకు వీలుగా తాము రంగంలోకి దిగామని అమెరికా అంటోంది. ఈ నేపథ్యంలో దక్షిణ చైనా సముద్రం విషయంలో జోక్యం చేసుకోవద్దంటూ గతవారం చైనా విదేశాంగశాఖ ఒక హెచ్చరిక జారీచేసింది. -
చైనాకు అమెరికా స్ట్రాంగ్ వార్నింగ్
వాషింగ్టన్: దక్షిణ చైనా సముద్రం విషయంలో చైనాకు అమెరికా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. వివాదాస్పద ఈ సముద్రంలో తమ ప్రయోజనాలను తాము కాపాడుకుంటామని స్పష్టం చేసింది. అంతేకాకుండా అంతర్జాతీయ ప్రాదేశిక ప్రాంతాలను 'ఒక దేశం' స్వాధీనం చేసుకోకుండా అడ్డుకుంటామని కూడా తెలిపింది. 'దక్షిణ చైనా సముద్రంలో పలు ప్రాంతాలు అంతర్జాతీయ జలాలు, అంతర్జాతీయ కార్యకలాపాల కిందకు వస్తాయి. అక్కడి మా ప్రయోజనాలను కాపాడుకుంటామని అమెరికా కచ్చితంగా చాటిచెప్పగలదు' అని వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ సీన్ స్పైసెర్ తన మొదటి విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. 'దక్షిణ చైనా సముద్రంలోని దీవులు అంతర్జాతీయ జలాలోనివే. అవి చైనాకు చెందినవి కావు. అంతర్జాతీయ ప్రాదేశిక ప్రాంతాలను ఒక దేశం స్వాధీనం చేసుకోకుండా మేం అండగా నిలబడతాం అన్నది చాటుతాం' అని స్పైసర్ స్పష్టం చేశారు. అంతర్జాతీయ జలాల్లో ఉన్న ఈ దీవుల్లోకి చైనా ప్రవేశాన్ని నిరాకరిస్తామని ఇటీవల అమెరికా విదేశాంగ మంత్రిగా ఎంపికైన టెక్స్ టిల్లర్సన్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై అడిగిన ప్రశ్నలకు స్పైసర్ ఈ విధంగా బదులిచ్చారు. అమెరికా ఉత్పత్తులకు, సేవలకు ఇప్పటికీ చైనానే అతిపెద్ద మార్కెట్ అని, అదేవిధంగా చైనా వ్యాపారవేత్తలు, వ్యక్తులకు అమెరికాలో స్వేచ్ఛగా తమ ఉత్పత్తులు అమ్ముకునే అవకాశముందని చెప్పారు. -
అమెరికాకు గట్టి షాకిచ్చిన చైనా
-
అమెరికాకు షాకిచ్చిన చైనా
వాషింగ్టన్: దక్షిణచైనా సముద్రం జలాలపై తన హక్కులు కాపాడుకునేందుకు ఎంత దూరమైనా వెళతానని ప్రకటించిన చైనా అన్నంత పని చేసింది. సముద్రగర్భంలో పరిశోధనలు చేస్తోన్న (అమెరికా నౌకాదళానికి చెందిన) అండర్ వాటర్ డ్రోన్ ను స్వాధీనం చేసుకుని, అగ్రరాజ్యానికి గట్టి షాక్ ఇచ్చింది. అమెరికాకు చెందిన ఏదేనీ రక్షణ వాహనాన్ని చైనా బంధించడం వర్తమాన చరిత్రలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. అమెరికా నౌకాదళానికి చెందిన సముద్రశాస్త్ర పరిశోధక నౌక(యూఎస్ఎన్ఎస్-బౌదిక్) కొద్ది రోజులుగా దక్షిణ చైనా సముద్రంలో పరిశోధనలు నిర్వహిస్తున్నదని, ఆ నౌక నుంచి సముద్ర గర్భంలోకి పంపిన (అండర్ వాటర్) డ్రోన్ ఒకదానిని డిసెంబర్ 15న చైనా నౌకాదళం స్వాధీనం చేసుకున్నదని యూఎస్ అధికార ప్రతినిధి మీడియాకు తెలిపారు. అంతర్జాతీయ జలాల్లో ఉన్న డ్రోన్ను స్వాధీనం చేసుకుని చైనా తెంపరితనం ప్రదర్శించిందని, ఒక పరిశోధక వాహనాన్ని బంధించడానికి ఆ దేశానికి ఎలాంటి హక్కులు లేవని అమెరికా మండిపడింది. వెంటనే డ్రోన్ను అప్పగించేలా చైనాపై అమెరికా దౌత్యపరమైన ఒత్తిడి తెచ్చింది. కాగా, అసలా డ్రోన్తో సముద్రగర్భంలో ఎలాంటి పరిశోధనలు చేస్తున్నారనే ప్రశ్నకు మాత్రం అమెరికా సమాధానం ఇవ్వలేదు. అమెరికన్ అండర్ వాటర్ డ్రోన్ను స్వాధీనం చేసుకున్న మాట వాస్తవమేనని అంగీకరించిన చైనా నౌకాదళం.. డ్రోన్ కదలికలపై అనుమానాలను వ్యక్తపర్చింది. తమ నౌకాదళానికి చెందిన రహస్య సమాచారం సేకరించేందుకే దక్షిణ చైనా సముద్రంలో పరిశోధనల పేరిట అమెరికా నాటకాలాడుతోందని చైనా మండిపడింది. డ్రోన్ను తిరిగి అమెరికాకు అప్పగించేదీ లేనిదీ ఇంకా స్పష్టం కాలేదు. దక్షిణచైనా సముద్రంలో చైనాకు హక్కులు లేవన్న అంతర్జాతీయ కోర్టు తీర్పును అంగీకరించబోనన్న డ్రాగన్ దేశం.. కొద్ది నెలలుగా ఆ ప్రాంతంలో అలజడి సృష్టిస్తోంది. సముద్రంలో తాను తయారుచేసుకున్న ఏడు కృత్రిమ దీవుల్లో చైనా భారీ ఎత్తున ఆయుధాలను మోహరింపజేస్తోంది. వాటిలో గగనతలంలో దాడిచేయగల క్షపణులను కూడా సిద్ధంగాఉంచింది. దక్షిణచైనా సముద్రంలో అమెరికా నౌకాదళానికి చెందిన పరిశోధక నౌక: యూఎస్ఎన్ఎస్-బౌదిక్ (డ్రోన్ను పంపింది ఈ నౌక నుంచే) దక్షిణచైనా సముద్రంలోని ఓ కృత్రిమ దీవిలో చైనా సిద్ధం చేసుకున్న ఆయుధాలు -
సముద్రాలపై చైనా డ్రోన్లు!
బీజింగ్: వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంతోపాటు, తూర్పు చైనా సముద్రాలపై దేశీయంగా అభివృద్ధి చేసిన డ్రోన్లను చైనా మోహరించనుంది. సముద్రాలతోపాటు జపాన్తో వివాదం ఉన్న సెంకాకు దీవుల్లో సర్వేలు చేయడానికి, మ్యాప్లను రూపొందించడానికి ఈ డ్రోన్లు ఉపకరిస్తాయి. ఈ మేరకు అక్కడి ప్రభుత్వ అధీనంలో నడిచే పీపుల్స్ డైలీలో కథనం వచ్చింది. సెంకాకు దీవులను చైనా, జపాన్లు మావి అంటే మావి అంటున్నాయి. ఈ డ్రోన్లతో తీరం నుంచి 80 నాటికల్ మైళ్ల వరకు జలాలను పూర్తిగా కవర్ చేయవచ్చు. సముద్రం ఉపరితలాన్ని 1,500 నాటికల్ మైళ్ల వరకు పరిశీలించవచ్చు. దక్షిణ చైనా సముద్రం మొత్తం తమదేనని చైనా వాదిస్తోంది. అంతర్జాతీయ ట్రిబ్యునల్ చైనా వాదనను వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. తమకు 30 లక్షల చదరపు కి.మీ విస్తీర్ణంలో 12,186 దీవులు ఉన్నాయని చైనా తెలిపింది. జడ్సీ–5బీ, జడ్సీ–10 అనే మానవ రహిత విమానాలను చైనా తయారుచేసింది. జడ్సీ–5బీ గరిష్టంగా 1,400 కి.మీ ఎత్తు వరకు ఎగరగలదు. 30 వరుస గంటలపాటు గాలిలో ఉండగలదు. దీని నిర్మాణం వల్ల ఇది ఏ ప్రాంతంలోకైనా దొంగతనంగా ప్రవేశించగలదు. -
అమెరికా తటస్థంగా ఉండాలి: చైనా
బీజింగ్: దక్షిణ చైనా సముద్రం విషయంలో తటస్థంగా ఉండాలని అమెరికాకు చైనా సూచించింది. చైనా విదేశాంగ అధికార ప్రతినిథి చున్యింగ్ మాట్లాడుతూ.. సముద్రజలాలకు సంబంధించి పొరుగుదేశాలతో చైనాకు ఉన్నటువంటి విభేదాల విషయంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తటస్థంగా ఉండాలని కోరారు. సమస్య పరిష్కారంలో అమెరికా నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని చున్యింగ్ అభ్యర్థించారు. దక్షిణ చైనా సముద్రం విషయంలో హేగ్లోని పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేజ్ వెల్లడించిన తీర్పును సమర్థిస్తూ.. దానికి కట్టుబడాలని ఒబామా గురువారం స్పష్టం చేసిన నేపథ్యంలో చైనా ఈ ప్రకటన చేయడం విశేషం. దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో శాంతి, స్థిరత్వం కొనసాగేందుకు అమెరికా నుంచి సానుకూల, నిర్మాణాత్మకమైన ప్రయత్నాలను చైనా ఆశిస్తుందని చున్యింగ్ తెలిపారు. దక్షిణ చైనా సముద్రం విషయంలో జులైలో ఫిలిప్పీన్స్కు అనుకూలంగా కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేజ్ ఇచ్చిన తీర్పును చెల్లనిదిగా, చట్ట వ్యతిరేకమైనదిగా చైనా అభివర్ణించింది. అసలు ఈ వివాదం కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేజ్ పరిధిలోనిది కాదని చైనా వాదిస్తోంది. ప్రాదేశిక వివాదాల్లో సంబంధిత దేశాల మధ్య చర్చలకే అమెరికా మద్దతిస్తుందని గతంలో అమెరికా అధికారులు వెల్లడించిన విషయాన్ని ఈ సందర్భంగా చున్యుంగ్ గుర్తుచేశారు. -
చైనాకు ఒబామా ఘాటు సూచన!
వాషింగ్టన్: అగ్రరాజ్యంగా ఎదుగుతున్న చైనా ఆర్థిక విధానాల్లో తన దూకుడు వైఖరితో పొరుగుదేశాలను ఇబ్బంది పెడుతోంది. అంతేకాకుండా దక్షిణ చైనా సముద్రం వివాదం విషయంలోనూ అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలను బేఖాతరు చేస్తూ మొండిగా ప్రవర్తిస్తోంది. ఈ నేపథ్యంలో చైనాకు బుద్ధిచెప్పే నాలుగు మాటలను అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా చెప్పారు. అగ్రరాజ్యంగా ఎదుగుతున్న చైనా తనను తాను నిగ్రహించుకొని సంయమనంతో వ్యవహరించాలని, అంతర్జాతీయ వేదికలపై బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని ఘాటుగా సూచించారు. ' అమెరికా అగ్రరాజ్యంగా ఎదుగడంలో తనను తాను నిగ్రహించుకోవడం కూడా ఉందనే విషయాన్ని (చైనా) అధ్యక్షుడు గ్జీ జింగ్పింగ్తో నేను మాట్లాడిన సందర్భంగా పేర్కొన్నాను' అని ఒబామా సీఎన్ఎన్ చానెల్తో చెప్పారు. 'అంతర్జాతీయ నియమనిబంధనలు రూపొందించుకున్నది.. వాటిని మనం కచ్చితంగా అనుసరించాలని కాదు. కానీ మనకు తెలుసు.. వాటిని అనుసరిచండం ద్వారా దీర్ఘకాలంలో బలమైన అంతర్జాతీయ పద్ధతిని మనం నిర్మించుకోగలం. ఇది మన ప్రయోజనాల కోసమే. ఇలా ఉండటం దీర్ఘకాలంలో చైనా ప్రయోజనాలకు కూడా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నా' అని ఒబామా చెప్పారు. 'దక్షిణా చైనా సముద్రం వంటి కొన్ని అంశాలలో అంతర్జాతీయ నియమనిబంధనలను ఉల్లంఘిస్తున్నట్టు మనకు కనిపిస్తున్నది. ఆర్థిక విధానాల విషయంలోనూ వారి(చైనా) ప్రవర్తన ఇదేవిధంగా ఉంది. ఈ విషయంలో మేం స్థిరంగా ఉన్నాం. ఇలా వ్యవహరించడం వల్ల భవిష్యత్తులో పరిణామాలుంటాయని వారికి స్పష్టం చేశాం' అని ఒబామా చెప్పారు. 'వాణిజ్య విషయంలో అమెరికా, చైనా స్నేహపూర్వక పోటీదారులుగా ఉండకూడదని లేదు. రెండు దేశాలను వేధిస్తున్న అంతర్జాతీయ సమస్యలను ఎదుర్కోవడంలో కీలక భాగస్వాములుగా రెండు దేశాలు కలిసి కొనసాగవచ్చు' అని ఒబామా చెప్పారు. అయితే, చైనా అంతర్జాతీయ నియమనిబంధనలకు లోబడి పనిచేస్తేనే.. ఆ దేశంతో భాగస్వామిగా కొనసాగేందుకు తాను సిద్ధమని అమెరికా చెప్తూ వస్తున్నదని ఒబామా స్పష్టం చేశారు. -
చైనా అప్పుడలా.. ఇప్పుడిలా!
న్యూ ఢిల్లీ: అణు సరఫరా దేశాల కూటమి(ఎన్ఎస్జీ)లో సభ్యత్వం విషయంలో భారత్కు మోకాలడ్డిన చైనా.. ఇప్పుడు భారత సహాయం కోరుతోందా. అవుననే అంటున్నాయి ప్రస్తుత పరిణామాలు. చైనా విదేశాంగమంత్రి వాంగ్ యి.. వచ్చేవారం ఢిల్లీకి రాబోతున్నారు. భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్తో ఆయన భేటీ కానున్నారు. ఈ భేటీ వెనకున్న ప్రధాన ఉద్దేశం మాత్రం ఇటీవల దక్షిణ చైనా సముద్రం విషయంలో అంతర్జాతీయ న్యాయస్థానంలో చైనాకు తగిలిన ఎదురుదెబ్బే అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దక్షిణ చైనా సముద్రం విషయంలో అంతర్జాతీయంగా చైనాకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఆ సముద్రంలో చైనా ఆధిపత్యాన్ని అమెరికాతో సహా చాలా దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. కోర్టు తీర్పు నేపథ్యంలో చిక్కుల్లో పడిన చైనా.. ఈ విషయంలో భారత్ సపోర్ట్ను కోరుకుంటుంది. అలా కాకున్నా.. మిగతా దేశాలతోపాటు బారత్ వ్యతిరేక స్వరం వినిపించకూడదని చైనా కోరుకుంటోంది. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్లో చైనాలో జరగనున్న జీ 20 సదస్సులో ఇతర దేశాలతో పాటు.. బారత్ కూడా తమకు వ్యతిరేక గళం వినిపంచకుండా మోదీ, జి జిన్పింగ్ల మధ్య సమావేశానికి బ్యాక్గ్రౌండ్ సెట్చేయటమే.. వాంగ్ యీ భారత్ పర్యటన లక్ష్యం అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
మరింత రెచ్చిపోతున్న చైనా
-
మరింత రెచ్చిపోతున్న చైనా
దక్షిణ చైనా సముద్రంలో కొంతభాగం మూసివేత.. వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంపై గుండుగుత్తగా తన ఆధిపత్యం చాటాలని భావిస్తున్న చైనా మరో ముందడుగు వేసింది. సైనిక విన్యాసాలు నిర్వహించేందుకు ఈ సముద్రంలో కొంత భాగాన్ని మూసివేస్తున్నట్టు ప్రకటించింది. దక్షిణ చైనా సముద్రంపై చైనాకు ఎలాంటి హక్కులు లేవని అంతర్జాతీయ ట్రిబ్యునల్ తీర్పు వెలువరించిన కొద్దిరోజుల్లోనే చైనా ఈ చర్యకు దిగడం గమనార్హం. సముద్రంలోని ఆగ్నేయ దీవి ప్రావిన్స్లో సైనిక విన్యాసాలు నిర్వహించేందుకు సోమవారం నుంచి గురువారం ఈ ప్రాంతాన్ని మూసివేస్తున్నట్టు చైనాకు చెందిన హైనాన్ మారిటైమ్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. అయితే, ఇవి ఏరకమైన సైనిక కార్యక్రమాలు అనేది వివరించలేదు. చైనా నేవీగానీ, రక్షణశాఖగానీ దీనిపై స్పందించలేదు. దక్షిణా చైనా సముద్రంపై వివాదాన్ని సామరస్య ధోరణిలో పరిష్కరించేందుకు, రెండు దేశాల ఆర్మీల మధ్య సంప్రదింపులను పెంచేందుకు అమెరికా నేవీ టాప్ అడ్మిరల్ చైనాలో పర్యటిస్తున్న నేపథ్యంలోనే డ్రాగన్ ఈ చర్యకు దిగడం గమనార్హం. అపార వనరులు, సహజ సంపదకు నెలవైన దక్షిణా చైనా సముద్రంలో చైనాకు ఎలాంటి చారిత్రక హక్కులు లేవని హేగ్ లోని అంతర్జాతీయ ట్రిబ్యునల్ ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ.. ఈ ఉత్తర్వులు బేఖాతరు చేస్తూ చైనా తన ధిక్కార ధోరణిని చాటుతున్న సంగతి తెలిసిందే. -
కయ్యానికి కాలు దువ్వుతున్న చైనా
బీజింగ్: చైనా అన్నంత పనిచేస్తోంది. దక్షిణ చైనా సముద్రంపై ఆధిపత్యం చెల్లబోదని అంతర్జాతీయ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును నిజంగానే భేఖాతరు చేస్తోంది. త్వరలోనే ఆ సముద్రంపై చైనా అణువిద్యుత్ ప్లాంట్లను నిర్మిస్తుందట. ఈ విషయాన్ని అక్కడి మీడియా స్పష్టం చేసింది. ట్రిబ్యునల్ తీర్పు వచ్చిన రెండు రోజులకే చైనా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం మరోసారి కయ్యానికి కాలు దువ్వడమేనని తెలుస్తోంది. దక్షిణ చైనా సముద్రంపై తమకంటే తమకే పెత్తనం ఉందని అటు చైనా, ఫిలిప్పీన్స్ ది హేగ్ లోని అంతర్జాతీయ ట్రిబ్యునల్ కు వెళ్లగా ట్రిబ్యునల్ మాత్రం పిలిప్పీన్స్ కు అనుకూలంగా తీర్పును వెలువరించింది. చైనాకు ఎలాంటి పెత్తనం లేదని, అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని సూచించింది. అయితే, తాము ట్రిబ్యునల్ తీర్పును పట్టించుకోబోమని, తాము చేసేది చేస్తామని చైనా ప్రకటించింది. అన్నట్లుగానే ఓ మీడియా ద్వారా తాము అణు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం చేపడతామని, వాటి వల్ల దక్షిణ చైనా సముద్రంపై ప్రభావవంతమైన పట్టుసాధిస్తామని చెబుతోంది. ఒక వేళ ఇదే జరిగితే అంతర్జాతీయ సమాజంతో చైనా మరోసారి విమర్శలపాలు కాక తప్పదు. -
తీర్పును చెత్త బుట్టలో వేయండి
దక్షిణ చైనా సముద్రం మాదే : చైనా బీజింగ్: దక్షిణ చైనా సముద్రంలో చైనాకు ఎలాంటి హక్కు లేదంటూ హేగ్లోని మధ్యవర్తిత్వ శాశ్వత కోర్టు (పీసీఏ) ఇచ్చిన తీర్పును చెత్త బుట్టలో పడేయాలని ఆ దేశం మండిపడింది. వ్యూహాత్మక దక్షిణ చైనా సముద్రాన్ని ‘ఎయిర్ డిఫెన్స్ జోన్’గా ప్రకటించే హక్కు తమకుందని తెలిపింది. తీర్పు ప్రభావం తమ దేశంపై ఏమాత్రం ఉండదని చైనా రక్షణ మంత్రి వాంఖ్వాన్ చెప్పారు. ‘ఆ సముద్రం చైనాది. మా నేవీ, వాయుసేన అక్కడినుంచే పనిచేస్తాయి. ట్రిబ్యూనల్ తీర్పును అమలుపరచం. అది తెల్ల కాగితం వంటిదే. దాన్ని చెత్త బుట్టలో పడేయండి, లేదా చర్చలకు రండి’ అని ఫిలిప్పీన్స్ను ఉద్దేశించి విదేశాంగ సహాయ మంత్రి జెన్మిన్ అన్నారు. -
దక్షిణ చైనా సముద్రంపై చైనా హెచ్చరిక!
వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంపై తన ఆధిపత్యం విషయంలో చైనా ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. ఈ సముద్రం విషయంలో చైనాకు ఎలాంటి హక్కులు లేవని, అక్కడ తన ఆగడాలను చైనా మానుకోవాలని ఐరాస నియమిత హేగ్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చినప్పటికీ.. డ్రాగన్ దేశం తన మంకుపట్టు వీడటం లేదు. హేగ్ ట్రిబ్యునల్ తీర్పును ఆమోదించబోమని తేల్చిచెప్పిన చైనా తాజాగా మరో అడుగు ముందుకేసింది. దక్షిణ చైనా సముద్రం విషయంలో తమ భద్రతకు భంగం వాటిల్లితే.. ఈ సముద్రంపై గగనతల రక్షణ జోన్ ను ప్రకటిస్తామని పొరుగుదేశాలను హెచ్చరించింది. దక్షిణచైనా సముద్రాన్ని పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకొని తమ సముద్ర జలాల హక్కులను చైనా కాలరాస్తున్నదని ఫిలిప్పీన్స్, తైవాన్, వియత్నాం, బ్రూనై, మలేషియా ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఫిలిప్పీన్స్ చేసిన అప్పీలును విచారించిన హేగ్ ట్రిబ్యునల్.. ఈ సముద్రంలో చారిత్రక హక్కులు ఉన్నాయన్న చైనా వాదనను కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అవసరమైతే దక్షిణ చైనా సముద్ర గగనతలంపై గుర్తించిన ప్రాంతంలో వైమానిక రక్షణ జోన్ తాము ప్రకటిస్తామని, ఈ విషయంలో తమకు ఎదురైనా ముప్పు తీవ్రత ఆధారంగా ఈ జోన్ పరిధి ఉంటుందని చైనా ఉప విదేశాంగ మంత్రి లీయూ ఝెన్మిన్ బుధవారం విలేకరులతో తెలిపారు. -
ట్రిబ్యునల్ ఉత్తర్వులతో చైనాకు వణుకెందుకు?
బీజింగ్/వాషింగ్టన్: దక్షిణ చైనా సముద్రం వివాదంపై హేగ్ ట్రిబ్యునల్ ఉత్తర్వులతో ఆగ్నేయాసియాలో ఉద్రిక్తతలు రాజుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ సముద్రంపై హక్కుల విషయంలో చైనా దూకుడుగా వ్యవహరిస్తుండటం.. దీన్ని వ్యతిరేకిస్తూ తీర ప్రాంత దేశాలైన ఫిలిప్పీన్స్, తైవాన్, వియత్నాం, బ్రూనై, మలేషియా దేశాలు హేగ్లోని మధ్యవర్తిత్వ శాశ్వత న్యాయస్థానా(పీసీఏ)న్ని ఆశ్రయించాయి. 2013 నుంచి ఈ కేసు విచారణ జరుగుతుండగా.. మంగళవారం తుది తీర్పు వెలువడింది. చైనాకు షాక్ ఇచ్చేరీతిలో హేగ్ ట్రిబ్యునల్ తీర్పు వెలువడటం.. ఈ ఉత్తర్వులను చైనా తిరస్కరిస్తుండటం వివాదం రేపుతున్నది. ఒక్క అడుగు కూడా వెనక్కివేయం! చైనాతో చర్చల ద్వారా ఈ సమస్య పరిష్కారానికి 17 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నామని.. అయినా చైనా స్పందించటం లేదంటూ ఫిలిప్పీన్స్ వాదిస్తోంది. అటు అమెరికా కూడా ఈ ప్రాంతంపై పట్టుకోసం ప్రయత్నించటం.. చైనాను చికాకు పెడుతోంది. అమెరికా ప్రభావం వల్ల కోర్టులో తీర్పు తనకు వ్యతిరేకంగా అంచనా వేసిన చైనా.. ఈ కేసు విచారణ, తీర్పుతో తమకు సంబంధం లేదని.. ఎవరేం చేసుకున్నా ఈ సముద్రంపై తనకే పూర్తి హక్కుందంటోందని వాదిస్తోంది. ఒక్క అడుగుకూడా వెనక్కువేసే ప్రసక్తే లేదంటోంది. దీంతో దక్షిణ చైనా సముద్రంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చైనా దాదాగిరీ! 2009లో దక్షిణ చైనా సముద్రమంతా తనదేనంటూ చైనా ప్రభుత్వం ఓ సరిహద్దు పటాన్ని విడుదల చేసింది. దీనికి తోడు వియత్నాం, ఫిలిప్పీన్స్ దేశాల సమీపంలోని దీవుల్లో ఆయా దేశాలు చమురు వెలికితీతకు ప్రయత్నించగా.. చైనా తన నావికాదళంతో కవాతు నిర్వహించింది. దీనికి ఆసియాన్ దేశాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. అయినా చైనా తన దూకుడు తగ్గించలేదు. దీనికి తోడు తనకు భవిష్యత్తులో ఇబ్బందికరమని భావించిన భారత్ను నిరంతరం కవ్విస్తోంది. శ్రీలంక, బంగ్లాదేశ్ జలాల్లో తన జలాంతర్గాములను మోహరించింది. రంగంలోకి అమెరికా! ప్రపంచంలో అత్యంత రద్దీ అయిన నౌకా రవాణా మార్గమైన ఈ ప్రాంతం చైనా పట్టు పెరిగితే.. తనకు కష్టమనేది అమెరికా ఆలోచన. దీంతో తన మిత్రదేశాలైన ఈ ఏడెనిమిది ద్వీపాల హక్కుల పరిరక్షణకు నడుంబిగించింది. వీరికి మద్దతుగా తన యుద్ధ నౌకలను మోహరించింది. దీంతో దక్షిణచైనాసముద్రంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ ప్రాంతంపై చైనా పట్టు తగ్గటం వ్యూహాత్మకంగా భారత్కూ కీలకమే. పొరుగుదేశాల జలాల్లో జలాంతర్గాములను మోహరించిన చైనాను కట్టడి చేసేందుకు.. దక్షిణచైనాపై అమెరికా ఆధిపత్యం పెరిగేలా తెరవెనక మంత్రాంగం నెరపుతోంది. ఫిలిప్పీన్స్కు కోర్టు తీర్పు విషయంలో బహిరంగంగా మద్దతిస్తూనే.. చైనా వ్యతిరేక దేశాలను కూడగడుతోంది. ఇక్కడున్న సహజ వనరులను వెలికితీస్తే.. వియత్నాం, ఫిలిప్పీన్స్, బ్రూనై, తైవాన్ దేశాల తలరాత మారిపోతుందని ప్రపంచబ్యాంకు అంచనావేసింది. అదే చైనా చేతికే ఈ నిధులందితే.. అమెరికా కూటమికి కష్టమే. అందుకే ఈ ప్రాంతపై పట్టుకోసం నువ్వా, నేనా అనే రీతిలో పోటీ పెరుగుతోంది. అదే యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. వివాదమిది దక్షిణా చైనా సముద్రంలో చైనాతో పాటు.. మలేషియా, వియత్నాం, ఫిలిప్పీన్స్, బ్రూనై వంటి ఏడెనిమిది దేశాలున్నాయి. వీటితోపాటు వందల సంఖ్యలో చిన్న చిన్న ద్వీపాలున్నాయి. అయితే, సముద్రాల్లోని చమురు, సహజ వాయువు నిక్షేపాలు, మత్స్యసంపద పెద్ద పరిశ్రమగా మారటంతో.. బలమున్న దేశాలు.. చిన్న ద్వీపాలను ఆక్రమించుకుని సముద్ర సంపదపై భారీ లాభాలు ఆర్జిస్తున్నాయి. ఈ యత్నంలో దేశాల మధ్య వివాదాలు చెలరేగకుండా 1982లో ఐక్యరాజ్యసమితి ‘సముద్ర చట్టాల ఒప్పందం’ను అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం.. ఓ దేశ తీర ప్రాంతం నుంచి 12 నాటికల్ మైళ్ల (22 కిలోమీటర్లు) ప్రాంతం.. ఆ దేశ సముద్ర జలాల పరిధిలోకి వస్తుంది. ఆ తర్వాత అవిచ్ఛిన్న జలాలు, అంతర్జాతీయ జలాలనూ ఇందులో చేర్చారు. దక్షిణ చైనా సముద్రం విషయానికొస్తే.. ఈ ఏడెనిమిది దేశాలు ఈ సముద్రంలోని చిన్న చిన్న ద్వీపాలను ఆక్రమించుకున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని ద్వీపాలు తనవేనంటూ చైనా ప్రకటించుకోవటంతో వివాదం మొదలైంది. కృత్రిమ దీవులు.. అణు విద్యుత్ కేంద్రాలు! వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో చైనా తన సైనిక, సముద్ర భద్రత అవసరాల కోసం ‘ఫీరీ క్రాస్ రీఫ్’, ‘జాన్సన్ రీఫ్’ తదితర పేర్లతో చైనా ఇటీవల కొన్ని కృత్రిమ ద్వీపాలు నిర్మించింది. అక్కడి రాడార్ వ్యవస్థలు, లైట్హౌస్లు, బ్యారక్లు, పోర్టులు, వైమానిక స్థావరాల నిర్వహణకు భారీగా విద్యుత్ కావాలి. వేల మైళ్ల దూరంలోని భూమిపై ఉన్న పవర్ గ్రిడ్ల నుంచి వీటికి తీగల ద్వారా విద్యుత్ను అందించడం చాలా కష్టమైన పని. దీనికి పరిష్కారంగా.. సముద్రంలోనే అణు విద్యుత్ కేంద్రాలను నిర్మించి విద్యుత్ సరఫరా చేయాలని చైనా యోచిస్తోంది. ఈ ద్వీపాలతోపాటు చమురు రిఫైనరీల విద్యుత్ అవసరాలను తీర్చేందుకు నౌకలపై అణు ప్లాంట్లను నిర్మించాలని చైనా షిప్పింగ్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ కసరత్తు చేస్తోంది. నిజానికి తేలియాడే అణు విద్యుత్ ప్లాంట్లు కొత్తవేమీ కాదు. రెండో ప్రపంచ యుద్ధకాలం నాటి ఒక నౌకలో అమెరికా 1960లలో అణు రియాక్టర్ను ఏర్పాటు చేసింది. పనామా కెనాల్ జోన్లోని విద్యుత్ అవసరాల కోసం దీన్ని నిర్మించారు. -
చైనాకు భారీ ఎదురుదెబ్బ!
దక్షిణ చైనా సముద్రం తన గుత్తసొత్తుగా చెలరేగిపోతున్న చైనాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దక్షిణ చైనా సముద్రంలో తనకు చారిత్రక హక్కులు కలవంటూ చైనా చేస్తున్న వాదనకు ఎలాంటి చట్టబద్ధ ఆధారం లేదని ఐక్యరాజ్యసమితికి చెందిన హేగ్ అంతర్జాతీయ ట్రిబ్యునల్ తేల్చిచెప్పింది. 'నైన్ డ్యాష్ లైన్స్' పరిధిలోని సముద్ర ప్రాంతాల్లో తనకు చారిత్రక హక్కులు ఉన్నాయంటూ చైనా చేస్తున్న వాదనకు ఎలాంటి చట్టబద్ధత ఆధారం లేదని ట్రిబ్యునల్ నిర్ధారించింది' అని హేగ్కు చెందిన శాశ్వత వివాద పరిష్కారాల కోర్టు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. హేగ్ ట్రిబ్యునల్ ఉత్తర్వులు ఆగ్నేయా ఆసియాలో మరింతగా ఉద్రిక్తతలు రాజేసే అవకాశముందని భావిస్తున్నారు. మరోవైపు చైనా ఈ ఉత్తర్వులను తప్పుబట్టింది. ట్రిబ్యునల్ ఉత్తుర్వులను అంగీకరించబోమని, గుర్తించబోమని ధిక్కార స్వరాన్ని వినిపించింది. దీవులు, దిబ్బలు సహా దక్షిణ చైనా సముద్రం మొత్తం తనదేనని చైనా వాదిస్తుండగా.. ఈ వాదనను ఇతర దేశాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. దక్షిణ చైనా సముద్రంలో వనరుల అన్వేషణ, ఓడరేవుల ఏర్పాటు తదితర చర్యలతో చైనా దూకుడుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఆ దేశానికి వ్యతిరేకంగా ఫిలిప్పీన్స్ అంతర్జాతీయ హేగ్ ట్రిబ్యునల్లో వ్యాజ్యం దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టిన ట్రిబ్యునల్ చైనాకు వ్యతిరేకంగా ఉత్తర్వులు వెలువరించింది. అంతేకాకుండా దక్షిణ చైనా సముద్రంలో వనరుల అన్వేషణ చేపట్టడం ద్వారా చైనా ఫిలిప్పీన్స్ సార్వభౌమాధికార హక్కులను ఉల్లంఘించిందని తేల్చిచెప్పింది. చైనా చర్యలు పగడాల దిబ్బల్లోని పర్యావరణానికి పెనుముప్పుగా మారాయని ట్రిబ్యునల్ ఆందోళన వ్యక్తం చేసింది. -
దక్షిణ చైనా సముద్రంపై హైటెన్షన్
- సముద్రంపై హక్కు విషయంలో రేపు తుది తీర్పు - పూర్తి హక్కులు నావే: డ్రాగన్ తమ వాటాకు ఫిలిప్పీన్స్, వియత్నాం, తైవాన్ డిమాండ్ బీజింగ్/వాషింగ్టన్ : ప్రపంచం దృష్టంతా ఇప్పుడు దక్షిణ చైనా సముద్రం పైనే. ఈ సముద్రంపై హక్కుల విషయంలో చైనా దూకుడుగా వ్యవహరిస్తుండటం.. దీన్ని వ్యతిరేకిస్తూ తీర ప్రాంత దేశాలైన ఫిలిప్పీన్స్, తైవాన్, వియత్నాం, బ్రూనై, మలేషియా దేశాలు హేగ్లోని మధ్యవర్తిత్వ శాశ్వత న్యాయస్థానా(పీసీఏ)న్ని ఆశ్రయించాయి. 2013 నుంచి ఈ కేసు విచారణ జరుగుతుండగా.. మంగళవారం తుది తీర్పు వెలువడనున్న నేపథ్యంలో మరోసారి దక్షిణ చైనా సముద్రంపై ప్రపంచమంతా ఆసక్తి నెలకొంది. చైనాతో చర్చల ద్వారా ఈ సమస్య పరిష్కారానికి 17 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నామని.. అయినా చైనా స్పందించటం లేదంటూ ఫిలిప్పీన్స్ వాదిస్తోంది. అటు అమెరికా కూడా ఈ ప్రాంతంపై పట్టుకోసం ప్రయత్నించటం.. చైనాను చికాకు పెడుతోంది. అమెరికా ప్రభావం వల్ల కోర్టులో తీర్పు తనకు వ్యతిరేకంగా వస్తుందని చైనా భావిస్తోంది. అందుకే.. ఈ కేసు విచారణ, తీర్పుతో సంబంధం లేదని.. ఎవరేం చేసుకున్నా ఈ సముద్రంపై తనకే పూర్తి హక్కుందంటోంది. ఒక్క అడుగుకూడా వెనక్కువేసే ప్రసక్తే లేదంటోంది. దీంతో దక్షిణ చైనా సముద్రంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చైనా దాదాగిరీ!: 2009లో దక్షిణ చైనా సముద్రమంతా తనదేనంటూ చైనా ప్రభుత్వం ఓ సరిహద్దు పటాన్ని విడుదల చేసింది. దీనికి తోడు వియత్నాం, ఫిలిప్పీన్స్ దేశాల సమీపంలోని దీవుల్లో ఆయా దేశాలు చమురు వెలికితీతకు ప్రయత్నించగా.. చైనా తన నావికాదళంతో కవాతు నిర్వహించింది. దీనికి ఆసియాన్ దేశాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. అయినా చైనా తన దూకుడు తగ్గించలేదు. దీనికి తోడు తనకు భవిష్యత్తులో ఇబ్బందికరమని భావించిన భారత్ను నిరంతరం కవ్విస్తోంది. శ్రీలంక, బంగ్లాదేశ్ జలాల్లో తన జలాంతర్గాములను మోహరించింది. రంగంలోకి అమెరికా: ప్రపంచంలో అత్యంత రద్దీ అయిన నౌకా రవాణా మార్గమైన ఈ ప్రాంతం చైనా పట్టు పెరిగితే.. తనకు కష్టమనేది అమెరికా ఆలోచన. దీంతో తన మిత్రదేశాలైన ఈ ఏడెనిమిది ద్వీపాల హక్కుల పరిరక్షణకు నడుంబిగించింది. వీరికి మద్దతుగా తన యుద్ధ నౌకలను మోహరించింది. దీంతో దక్షిణచైనాసముద్రంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ ప్రాంతంపై చైనా పట్టు తగ్గటం వ్యూహాత్మకంగాా భారత్కూ కీలకమే. పొరుగుదేశాల జలాల్లో జలాంతర్గాములను మోహరించిన చైనాను కట్టడి చేసేందుకు.. దక్షిణచైనాపై అమెరికా ఆధిపత్యం పెరిగేలా తెరవెనక మంత్రాంగం నెరపుతోంది. ఫిలిప్పీన్స్కు కోర్టు తీర్పు విషయంలో బహిరంగంగా మద్దతిస్తూనే.. చైనా వ్యతిరేక దేశాలను కూడగడుతోంది. ఇక్కడున్న సహజ వనరులను వెలికితీస్తే.. వియత్నాం, ఫిలిప్పీన్స్, బ్రూనై, తైవాన్ దేశాల తలరాత మారిపోతుందని ప్రపంచబ్యాంకు అంచనావేసింది. అదే చైనా చేతికే ఈ నిధులందితే.. అమెరికా కూటమికి కష్టమే. అందుకే ఈ ప్రాంతపై పట్టుకోసం నువ్వా, నేనా అనే రీతిలో పోటీ పెరుగుతోంది. అదే యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. వివాదమిది దక్షిణా చైనా సముద్రంలో చైనాతో పాటు.. మలేషియా, వియత్నాం, ఫిలిప్పీన్స్, బ్రూనై వంటి ఏడెనిమిది దేశాలున్నాయి. వీటితోపాటు వందల సంఖ్యలో చిన్న చిన్న ద్వీపాలున్నాయి. అయితే, సముద్రాల్లోని చమురు, సహజ వాయువు నిక్షేపాలు, మత్స్యసంపద పెద్ద పరిశ్రమగా మారటంతో.. బలమున్న దేశాలు.. చిన్న ద్వీపాలను ఆక్రమించుకుని సముద్ర సంపదపై భారీ లాభాలు ఆర్జిస్తున్నాయి. ఈ యత్నంలో దేశాల మధ్య వివాదాలు చెలరేగకుండా 1982లో ఐక్యరాజ్యసమితి ‘సముద్ర చట్టాల ఒప్పందం’ను అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం.. ఓ దేశ తీర ప్రాంతం నుంచి 12 నాటికల్ మైళ్ల (22 కిలోమీటర్లు) ప్రాంతం.. ఆ దేశ సముద్ర జలాల పరిధిలోకి వస్తుంది. ఆ తర్వాత అవిచ్ఛిన్న జలాలు, అంతర్జాతీయ జలాలనూ ఇందులో చేర్చారు. దక్షిణ చైనా సముద్రం విషయానికొస్తే.. ఈ ఏడెనిమిది దేశాలు ఈ సముద్రంలోని చిన్న చిన్న ద్వీపాలను ఆక్రమించుకున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని ద్వీపాలు తనవేనంటూ చైనా ప్రకటించుకోవటంతో వివాదం మొదలైంది. -
సముద్రంలో అణు విద్యుత్ కేంద్రాలు
కృత్రిమ ద్వీపాల అవసరాల కోసం చైనా కసరత్తు హాంకాంగ్: అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తున్న చైనా.. సముద్ర జలాలపై ఆధిపత్యం కోసం అవసరమైన అన్ని మార్గాలనూ వాడుకుంటోంది. దక్షిణ చైనా సముద్రంలో తాను ఇటీవల నిర్మించిన కృత్రిమ ద్వీపాల అవసరాల కోసం సముద్రంలో తేలియాడే అణు విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి తెరతీసింది. ఎందుకు? వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో చైనా తన సైనిక, సముద్ర భద్రత అవసరాల కోసం ‘ఫీరీ క్రాస్ రీఫ్’, ‘జాన్సన్ రీఫ్’ తదితర పేర్లతో ఇటీవల కొన్ని కృత్రిమ ద్వీపాలు నిర్మించింది. అక్కడి రాడార్ వ్యవస్థలు, లైట్హౌస్లు, బ్యారక్లు, పోర్టులు, వైమానిక స్థావరాల నిర్వహణకు భారీగా విద్యుత్ కావాలి. వేల మైళ్ల దూరంలోని భూమిపై ఉన్న పవర్ గ్రిడ్ల నుంచి వీటికి తీగల ద్వారా విద్యుత్ను అందించడం చాలా కష్టమైన పని. దీనికి పరిష్కారంగా.. సముద్రంలోనే అణు విద్యుత్ కేంద్రాలను నిర్మించి విద్యుత్ సరఫరా చేయాలని చైనా యోచిస్తోంది. ఈ ద్వీపాలతోపాటు చమురు రిఫైనరీల విద్యుత్ అవసరాలను తీర్చేందుకు నౌకలపై అణు ప్లాంట్లను నిర్మించాలని చైనా షిప్పింగ్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ కసరత్తు చేస్తోంది. ప్లాంట్లకు చాలా డిమాండ్ ఉందని, ఇవి భారీగా కావాలని చైనా అణు ఇంధన సంస్థ డెరైక్టర్ జు దాజే చె ప్పారు. గతంలో.. తేలియాడే అణు విద్యుత్ ప్లాంట్లు కొత్తవేమీ కాదు. రెండో ప్రపంచ యుద్ధకాలం నాటి ఒక నౌకలో అమెరికా 1960లలో అణు రియాక్టర్ను ఏర్పాటు చేసింది. పనామా కెనాల్ జోన్లోని విద్యుత్ అవసరాల కోసం దీన్ని నిర్మించారు. ఎంతవరకు సురక్షితం? దక్షిణ చైనా సముద్రంలో తరచూ భారీ తుపాన్లు వస్తుంటాయి. అణు ప్లాంటు ఉన్న నౌకలు తుపాన్ల ముప్పును తట్టుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి నౌకలో కీలక రియాక్టర్ కరిగిపోవడం వంటి భారీ అణు ప్రమాదాలు జరిగితే గాలుల ద్వారా రేడియోధార్మికత జనావాసాలకు వ్యాపించే అవకాశముందని యూనియన్ ఆఫ్ కన్సర్న్డ్ సైంటిస్ట్స్కు చెందిన అణు భద్రత ప్రాజెక్టు డెరైక్టర్ డేవిడ్ లాక్కామ్ చెప్పారు. -
చైనాపై భారత్ శాటిలైట్ నిఘా..!!
న్యూఢిల్లీ: చైనాకు పొరుగున ఉన్న దక్షిణ వియత్నాంలో భారత్ శాటిలైట్ ట్రాకింగ్, ఇమేజింగ్ సెంటర్ను ఏర్పాటు చేస్తోంది. ఈ కేంద్రం ద్వారా భారత భూ పరిశీలన శాటిలైట్లు తీసే ఫొటోలను పొందే అవకాశం ఆ దేశానికి లభిస్తుంది. చైనా, వివాదాస్పద దక్షిణ సముద్రం సహా ఈ ప్రాంతమంతా భారత శాటిలైట్ల పరిధిలోకి వస్తాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. వియత్నాంతో ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు భారత్ తలపెట్టిన ఈ చర్య చైనాను ఇరకాటంలో పడేసే అవకాశముంది. వ్యవసాయ, శాస్త్ర పరిశోధన, పర్యావరణ అంశాలను అధ్యయనం చేసేందుకు ఉద్దేశించిన ఈ భూ పరిశీలన శాటిలైట్లను పౌర సేవల వసతిగా పేర్కొంటున్నప్పటికీ.. మెరుగైన ఇమేజింగ్ పరిజ్ఞానంతో ఇవి తీసే చిత్రాలు సైనిక అవసరాలకు కూడా వాడుకునే అవకాశముందని నిపుణులు అంటున్నారు. దక్షిణ చైనా సముద్రం విషయంలో చైనాతో వివాదం నానాటికీ ముదురుతున్న నేపథ్యంలో వియత్నాం తన నిఘా, గూఢచర్య, భూపరిశీలన సాంకేతికతను మరింత మెరుగుపరుచాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో సైనికపరంగా చూస్తే ఆ దేశానికి ఈ చర్య ఎంతో కీలకమైనదని నేవీ భద్రత నిపుణుడు కొలిన్ కొహ్ తెలిపారు. భారత్-వియత్నానికి ఇది సమాన లబ్ధిని కలిగించే అంశమని, భద్రతా లోపాలు పూడ్చుకోవడానికి వియత్నానికి, తన సామర్థాన్ని విస్తృతం చేసుకోవడానికి భారత్కు ఈ చర్య ఉపకరిస్తుందని సింగపూర్కు చెందిన రాజారత్నం స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్లో సేవలందిస్తున్న ఆయన వివరించారు. వరుస అంతరిక్ష విజయాలతో దూకుడు మీద ఉన్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 23 మిలియన్ డాలర్ల (రూ. 155 కోట్ల)తో హో చి మిన్హ్ నగరంలో ఈ శాటిలైట్ సమాచార సేకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. దీని ద్వారా భారత శాటిలైట్లు ఇస్రో పర్యవేక్షిస్తుంది. ఈ కేంద్రం ఇటు భారత్కు తన శాటిలైట్ల పర్యవేక్షణకు ఉపయోగపడగా, అటు వియత్నానికి ట్రాకింగ్ సైట్ సేవలు అందుబాటులోకి వస్తాయని, ఇరుదేశాలూ దీని నుంచి లబ్ధి పొందుతాయని కేంద్ర అధికార వర్గాలు చెప్తున్నాయి. ఈ శాటిలైట్ సమాచార కేంద్రం అందించే ఫొటోలను వియత్నాం నిఘా, సైనిక అవసరాలకు కూడా వాడుకునే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. -
అమెరికా-చైనా ముఖాముఖి
మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను ముందుకురికించడానికి ఏం చేయాలా అన్న అంశంపై చైనా కమ్యూనిస్టు పార్టీ కీలక నేతలంతా మథనపడుతుంటే దక్షిణ చైనా సముద్ర జలాల్లో అమెరికా మంట రాజేసింది. 'ప్రపంచ పోలీసు'గా తన పాత్రను వదులుకోబోనని మరోసారి చెప్పింది. అంతర్జాతీయ జలాల్లో స్వేచ్ఛగా నౌకాయానం చేసే హక్కు ఎవరికైనా ఉంటుందని తెలియజేస్తూ 'ఫ్రీడం ఆఫ్ నావిగేషన్' పేరిట రెండు నౌకలనూ...వీటికి తోడుగా నిఘా విమానాన్ని పెట్టుకుని అమెరికా నావికా దళం ఈ విన్యాసాలు కానిచ్చింది. ఈ రెండు నౌకాల్లో ఒకటి క్షిపణి విధ్వంసక నౌక. దీన్నంతా చైనా చూస్తూ ఊరుకోలేదు. అమెరికాను తీవ్ర పదజాలంతో హెచ్చరిస్తూ ప్రకటన విడుదల చేసింది. బీజింగ్లోని అమెరికా రాయబారిని పిలిచి నిరసనను తెలియజేసింది. రాగల కాలంలో ఆసియాలో ఎలాంటి పరిణామాలు ఏర్పడబోతున్నాయో ఈ మొత్తం ఉదంతం తెలియజెబుతోంది. దక్షిణ చైనా సముద్ర జలాల్లో కల్లోల భరిత వాతావరణం అలుముకుని ఉండటం ఇది మొదటిసారి కాదు. చైనా, తైవాన్, వియత్నాం, మలేసియా, ఫిలిప్పీన్స్, బ్రూనై, ఇండొనేసియా దేశాల మధ్య ఉన్న ఈ ప్రాంతంలో చాలా భాగం తమదేనని చైనా వాదిస్తోంది. అక్కడున్న చిన్న చిన్న దీవులు, పగడాల దిబ్బలు, ఇసుక మేటలు దాదాపు 700 వరకూ ఉన్నాయి. ఇవన్నీ గొలుసు కట్టుగా కూడా లేవు. విసిరేసినట్టుగా అక్కడక్కడ ఉండే వీటన్నిటినీ కలిపి స్ప్రాట్లీ దీవులంటారు. బ్రిటన్కు చెందిన కెప్టెన్ రిచర్డ్ స్ప్రాట్లీ 19వ శతాబ్దం మొదట్లో తొలిసారి వీటిని కనుగొన్నాడంటూ ఆయన పేరిట వ్యవహరించడం మొదలుపెట్టారు. అయితే ఆయన కనుక్కొనడానికి చాలాముందే... క్రీస్తు పూర్వం మూడో శతాబ్దంలో ప్రాచీన చైనా రాజ వంశాలకు చెందినవారు ఆ దీవులకు రాకపోకలు సాగించినట్టు ఆధారాలున్నాయి. 19వ శతాబ్దంనాటికి ఆ చుట్టుపక్కల ఉన్న దేశాలు యూరపియన్ల నియంత్రణలో ఉండటంవల్ల కావొచ్చు...ఆ దీవులు ఎందుకు పనికిరానివన్న అభిప్రాయంతో కావొచ్చు చైనా కూడా వాటిని పట్టించుకోలేదు. వియత్నాంపై పెత్తనం చలాయించిన కాలంలో ఫ్రాన్స్ ఈ దీవుల్లో కొన్నిటిని తన అధీనంలో ఉంచుకున్నది. ఆ రకంగా ఈ దీవులు తమవేనని వియత్నాం అంటుంటే...తమకు సమీపంలో ఉన్నాయి గనుక అవి తమకే చెందుతాయని ఫిలిప్పీన్స్ వాదిస్తోంది. నాలుగేళ్లక్రితమే ఈ దీవులన్నీ తమవేనని చైనా ప్రకటించి, అందుకొక చట్టం కూడా తెచ్చింది. ఆ ప్రాంతం మీదుగా విదేశీ నౌకలు వెళ్తే వెళ్లొచ్చుగానీ తనిఖీలకు ఒప్పుకోవాలని, అక్కడ నిలపడం, లంగరేయటం నిషిద్ధమని ఆ చట్టం చెబుతోంది. మరోపక్క అక్కడ కృత్రిమ దీవుల నిర్మాణాన్ని చురుగ్గా సాగిస్తోంది. భౌగోళికంగా చూస్తే ఈ దీవులు కీలకమైనవి. ప్రధాన నౌకా రవాణా మార్గంగా ఉన్న ఈ ప్రాంతాన్ని తమ నియంత్రణలోకి తెచ్చుకుంటే భవిష్యత్తులో తమదే పైచేయి కాగలదని చైనా అంచనా వేసుకుంది. దీనికి ఇంధన వనరుల అన్వేషణ కూడా తోడైంది. దక్షిణ చైనా సముద్ర గర్భంలో అపారమైన చమురు, సహజ వాయు నిక్షేపాలున్నాయి. ఆ ప్రాంతాన్ని సొంతం చేసుకుంటే కొన్ని దశాబ్దాలపాటు ఇంధన రంగంలో తిరుగులేని శక్తిగా మారడానికి వీలవుతుందని చైనా భావించబట్టే ఆ ప్రాంతం గురించి అంత పట్టుదలగా ఉంది. సరిగ్గా ఈ కారణాలవల్లే ఈ ప్రాంతంపై అమెరికా కన్ను పడింది. చైనా ఆర్ధిక వ్యవస్థ బలోపేతానికి, ఇంధనరంగంలో అది మరింతగా ఎదగడానికి, రక్షణపరంగా అభేద్యం కావడానికి తోడ్పడే దీవుల్ని అలా కళ్లప్పగించి వదిలేయడం అమెరికా స్వభావానికే విరుద్ధం. హిందూ మహా సముద్ర ప్రాంతంలోని డీగోగార్షియా దీవుల్ని బ్రిటన్తో కలిసి అది సొంతం చేసుకున్న తీరే ఇందుకు ఉదాహరణ. అక్కడ మానవమాత్రులుండటానికే వీలు కాదని, మూలవాసులుగా చెప్పుకుంటున్న ఓ వందమంది, అప్పుడప్పుడు అక్కడకు రాకపోకలు సాగించే మరికొందరూ తప్ప దాన్లో ఎవరూ లేరని ప్రపంచాన్ని మభ్యపెట్టి ఆ దీవుల్ని తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. క్రమేపీ ఆ ప్రాంతాన్ని సైనిక స్థావరంగా మార్చారు. ఇప్పుడు దక్షిణ చైనా సముద్ర ప్రాంత దీవులపై ఎవరి ఆధిపత్యం ఏర్పడినా జరిగేది ఇదే. నిజానికి చైనా దూకుడువల్ల మన దేశానికి కూడా భవిష్యత్తులో ప్రమాదం పొంచి ఉన్నట్టే. ఇప్పటికే పాకిస్థాన్, మయన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంకలకు నౌకాశ్రయాలను నిర్మించడంద్వారా హిందూ మహా సముద్ర ప్రాంతంలో భారత్ను దిగ్బంధించడానికి చైనా ఏర్పాట్లు చేసుకుంది. దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో నాలుగేళ్లక్రితం వియత్నాం అభ్యర్థన మేరకు చమురు వెలికితీత పనుల్ని ప్రారంభించినప్పుడు మన దేశాన్ని పరోక్షంగా హెచ్చరించి వాటిని అడ్డుకుంది. అటు రష్యాతో వచ్చిన వివాదంలో తలమునకలు కావడంవల్లనో, మరే కారణంవల్లనో అమెరికా ఈ ప్రాంతాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఈ ఏడాది మొదట్లో తొలిసారి అమెరికా దానిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో తమ నౌకా దళ విన్యాసముంటుందని గత కొంత కాలంగా అమెరికా లీకులిస్తోంది. గత నెలలో చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు సైతం ఇది కొనసాగింది. ఇటు చైనా కూడా అధికారికంగా స్పందించలేదు. అక్కడ అమెరికా విన్యాసాలు చూశాకే కఠిన పదజాలంతో విరుచుకు పడింది. ఆ ప్రాంతంపై తమకు తిరుగులేని సార్వభౌమాధికారం ఉన్నదని ప్రకటించింది. అక్కడ తమ కృత్రిమ నిర్మాణాలవల్ల అంతర్జాతీయ రవాణా మార్గానికి ఎలాంటి ఇబ్బందులూ తలెత్తబోవని చెబుతూనే దీవుల జోలికొస్తే మాత్రం ఊరుకోబోమని హెచ్చరించింది. ఏతా వాతా ఈ ప్రాంతం భవిష్యత్తులో ఉద్రిక్తతలకు నెలవు కాబోతున్నదని తాజా పరిణామాలు చెబుతున్నాయి. ఆధిపత్య ధోరణులతో, అంతులేని దురాశతో చేసే పనులవల్ల ఘర్షణలు రాజుకోవడమే కాదు...పర్యావరణం సైతం సర్వ నాశనమవుతుంది. దక్షిణ చైనా సముద్ర ప్రాంతం మరో డీగోగార్షియా కాకూడదని శాంతి కాముకులు ఆశిస్తారు. -
అబ్బురపరచిన త్రివిధ దళాలు
సియాచిన్ నుంచి దక్షిణ చైనా సముద్రం వరకూ యోగా ఈవెంట్లు న్యూఢిల్లీ: అంతర్జాతీయ యోగా డే త్రివిధ దళాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రపంచంలోనే ఎత్తై యుద్ధభూమి సియాచిన్ గ్లేసియర్ మొదలుకుని దక్షిణ చైనా సముద్రం వరకూ భారత బలగాలు యోగాసనాలు వేసి ఆకట్టుకున్నాయి. ఆదివారం ఢిల్లీలో ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం మెగా ఈవెంట్లో ఆర్మీ చీఫ్ దల్బీర్సింగ్ సుహాగ్, ఎయిర్చీఫ్ మార్షల్ అరూప్ రాహా, నేవీ అడ్మిరల్ ఆర్కే ధోవన్ పాలుపంచుకున్నారు. ఇక రక్షణ మంత్రి మనోహర్ పారికర్ మీరట్లో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. అయితే దేశంలో యోగా డేకు ప్రత్యేక ఆకర్షణ తీసుకొచ్చింది మాత్రం సైనిక దళాలే. మంచు దుప్పటి కప్పుకున్న సియాచిన్లో సముద్ర మట్టానికి 18,800 అడుగుల ఎత్తులో యోగాసనాలు వేసి అందరినీ అబ్బురపరిచారు. చలిని తట్టుకునే ప్రత్యేకమైన దుస్తులు ధరించి ఉదయం మైనస్ 4 డిగ్రీల ఉష్ణోగ్రతలో సైనికులు యోగా చేశారు. కార్గిల్, లడఖ్తో పాటు దేశంలోని అన్నిఆర్మీ యూనిట్లలోనూ కార్యక్రమాలు నిర్వహించారు. నేవీ కూడా వేడుకల్లో పాలుపంచుకుంది. దక్షిణ చైనా సముద్రంలోని భారత నేవీ నౌకల్లో యోగాసనాలు వేశారు. వాయు సేన కూడా యోగా సెషన్లు నిర్వహించింది. -
దక్షిణ చైనా సముద్రంలో అంతా ప్రశాంతమే
బీజింగ్: వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో రాకపోకలకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా చేసిన వ్యాఖ్యలను చైనా తిప్పికొట్టింది. ఆ జలాల్లో స్వేచ్ఛా యానం ఎప్పుడూ సమస్య కాలేదని, దీనిపై సమస్యలున్న వాళ్లు సంబంధిత పక్షాలతో చర్చల ద్వారా వాటిని పరిష్కరించుకోవచ్చునని వ్యాఖ్యానించింది. భారత పర్యటన సందర్భంగా ఒబామా ఈ అంశాన్ని ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో భారత్ కీలక పాత్ర పోషించాలని, స్వేచ్ఛా యానంపై వివాదాలు పరిష్కారం కావాలని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో చైనా ఘాటుగా స్పందించింది. ‘సాధారణంగా దక్షిణ చైనా సముద్రంలో పరిస్థితి ఎప్పుడూ నిలకడగా ఉంటుంది. అక్కడ శాంతి పరిరక్షణకు సంయుక్తంగా కృషి చేయాలని ఆసియా న్ దేశాలు, చైనాకు మధ్య అవగాహన ఉంది. స్వేచ్ఛా నౌకాయానం, గగనతల విహారం విషయంలో ఇప్పటివరకు ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాలేదు.’ అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చున్యింగ్ వెల్లడించారు. -
వియత్నాంలో ఓవీఎల్కు 5 బ్లాకులు
న్యూఢిల్లీ: ఆయిల్ రంగ దిగ్గజం ఓఎన్జీసీ విదేశ్కు వియత్నాం 5 ఆయిల్, గ్యాస్ బ్లాకులను కేటాయించింది. బిడ్డింగ్ లేకుండానే ఈ సముద్రగర్భ బ్లాకుల కేటాయింపు జరిగినట్లు ఓఎన్జీసీ విదేశ్ తెలిపింది. దక్షిణ చైనా సముద్ర ప్రాంతం, ఉజ్బెకిస్తాన్లోని కొసోర్ బ్లాకులోని ఈ క్షేత్రాలను వియత్నాం ప్రభుత్వ సంస్థ పెట్రోవియత్నాం నామినేషన్ ప్రాతిపదికన కేటాయించినట్లు పేర్కొంది. చైనాకున్న ఆధిపత్యానికి చెక్ పెట్టే ప్రయత్నంలో వియత్నాం వీటి కేటాయింపును చేపట్టింది. ప్రభుత్వ రంగ ఆయిల్ దిగ్గజం ఓఎన్జీసీకి విదేశాలలో అనుబంధ సంస్థగా ఓఎన్జీసీ విదేశ్ వ్యవహరించే సంగతి తెలిసిందే. వియత్నాం, ఇండియా, తదితర దేశాలలో ఇంధన రంగంలో పరస్పరం సహకరించుకునేందుకు వీలుగా పెట్రోవియత్నాంతో తాజాగా అవగాహనా ఒప్పందాన్ని(ఎంవోయూ) కుదుర్చుకున్నట్లు ఓఎన్జీసీ విదేశ్ వెల్లడించింది. ఎంవోయూలో భాగంగానే వియత్నాం 5 బ్లాకులను కేటాయించింది. ఓఎన్జీసీ విదేశ్ వీటిని మదింపుచేశాక ఆసక్తి ఉంటే పెట్రోవియత్నాంకు ప్రతిపాదనలు పంపించవచ్చు. ఈ బ్లాకులకు సంబంధించిన డేటాను పరిశీలించాక ఆసక్తి కలిగిన బ్లాకుల కోసమే ఓఎన్జీసీ విదేశ్ ప్రతిపాదనలు చేయవచ్చు. ఈ విషయాలను కంపెనీ సీనియర్ అధికారి ఒకరు ఒక ప్రకటనలో వివరించారు. ఆపై ఆసక్తి కలిగిన బ్లాకుల కోసం ఉత్పత్తి పంపకం కాంట్రాక్ట్(పీఎస్సీ)పై సంతకాలు చేయవచ్చు.