సాక్షి, హైదరాబాద్: నగరంలోని కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ నిర్వహణపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. హెచ్-సిటీ ప్రాజెక్టు పనుల నేపథ్యంలో ఇటీవల నిర్వహించిన వన్వే ట్రయల్ రన్లో గుర్తించిన సమస్యలను పరిశీలించేందుకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించారు.
కేబీఆర్ పార్క్ చుట్టూ మార్నింగ్ వాక్ చేస్తూ ట్రాఫిక్ రాకపోకలను పరిశీలించిన అధికారులు.. వన్వే విధానం అమలుతో ఎదురవుతున్న ఇబ్బందులు, వాహనాల రద్దీ, రోడ్ల నిర్వహణ, ప్రయాణికులకు ఎదురవుతున్న సమస్యలపై సమీక్ష నిర్వహించారు. ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు అవసరమైన మార్పులు, మెరుగైన ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా హెచ్-సిటీ పనుల్లో భాగంగా కేబీఆర్ పార్క్ పరిసరాల్లో చేపడుతున్న ట్రాఫిక్ మార్పులపై ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. వాహనదారులకు సౌకర్యవంతమైన రాకపోకలు కల్పించేందుకు క్షేత్రస్థాయి సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
🚦కేబీఆర్ పార్క్ ట్రాఫిక్పై ఉన్నతాధికారుల సమీక్ష
🔸 హైదరాబాద్లో కేబీఆర్ పార్క్ పరిసరాల్లో అమలు చేసిన వన్వే ట్రాఫిక్ ట్రయల్ను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ పరిశీలించారు.
🔸 ట్రాఫిక్ రద్దీ, క్షేత్రస్థాయిలో ఎదురైన సమస్యలు, నిర్వహణలో ఉన్న… pic.twitter.com/DT3wwNXS55— ముచ్చట్లు (@muchatlu_) July 15, 2026


