హెరిటేజ్‌ పెరుగు నాసిరకం.. నెయ్యిపై నారా ఆరోపణలు?: రాచమల్లు | YSRCP Rachamallu Siva Prasad Reddy Serious On CBN Govt | Sakshi
Sakshi News home page

హెరిటేజ్‌ పెరుగు నాసిరకం.. నెయ్యిపై నారా ఆరోపణలు?: రాచమల్లు

Feb 9 2026 1:03 PM | Updated on Feb 9 2026 1:50 PM

YSRCP Rachamallu Siva Prasad Reddy Serious On CBN Govt

సాక్షి, వైఎస్సార్‌: ముఖ్యమంత్రి చంద్రబాబు.. దేవుడిని అడ్డుపెట్టుకుని కుట్రలో అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. బరితెగించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూనే ఉన్నారని అన్నారు. బోలేబాబా సంస్థకు అనుమతి ఇచ్చింది మీ ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు. ఆ నాలుగు ట్యాంకర్ల  నెయ్యి వచ్చింది చంద్రబాబు పాలనలోనే ​అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘మేము అబద్ధాల కోరు చంద్రబాబుతో కొట్లాడుతున్నాం. ప్రతిరోజూ ఆయనతో కొట్లాడకపోతే ఆయన చెప్పే అబద్ధం ప్రపంచం అంతా తిరుగుతుంది. అందుకే మేము తిరుమల పవిత్రతపై రోజూ మాట్లాడాల్సి వస్తోంది. కేవలం హిందువుల్లో జగన్ పట్ల వ్యతిరేకత రావాలనే చంద్రబాబు దుష్ప్రచారానికి దిగాడు. దేవుడిని కూడా అడ్డు పెట్టుకుని కుట్రలకు తెర లేపారు. జంతువుల కొవ్వు కలిసింది అని మొట్టమొదటి అబద్దం చెప్పాడు. స్వామి వారి పవిత్రతకు భంగం కలగకుండా ఉండాలి అనుకుంటే ఈ విషయం మాట్లాడరు.

గోప్యంగా విచారణ చేసి నిజాలు తేలిన తర్వాత ఏదైనా ఉంటే అప్పుడు ప్రకటన చేయాలి. సుప్రీంకోర్టులో సిదార్థ్‌ లూథ్రా వాదిస్తుంటే జడ్జీలు మాట్లాడిన మాటలు వింటే అన్నీ తెలుస్తాయి. ఆనాడు సుప్రీంకోర్టు మందలించినా మీకు బుద్ధి రాలేదు. సీబీఐ విచారణ వేసినా దర్యాప్తు చేసింది మీ అధికారులే కదా. వారిచ్చిన రిపోర్టులో జంతువుల కొవ్వు కలవలేదని స్పష్టంగా చెప్పారు. అప్పుడన్నా నన్ను క్షమించి స్వామీ అని దేవదేవుడిని కోరాల్సింది. అప్పుడు జంతు కొవ్వు అన్నావు.. ఇప్పుడు బాత్‌రూం కడిగేవి వాడారు అంటున్నావు. భోలేబాబా సంస్థకు అనుమతి ఇచ్చింది మీ ప్రభుత్వం కాదా?.

82వేల కేజీల నెయ్యి కొనుగోలుకు ఒకే రోజు అనుమతించారు. సీబీఐ రిపోర్టు కాదని ఏకసభ్య కమిషన్‌ ఎలా వేస్తారు?. సీబీఐ దర్యాప్తు తర్వాత ఏకసభ్య కమిషన్‌ వేయడమేంటి?. భోలే బాబా ఫ్రాడ్‌ అయినప్పుడు 82వేల కేజీల నెయ్యి ఎలా ఆర్ఢర్‌ ఇచ్చారు. ఎన్‌డీడీబీ, ఎన్డీఆర్‌ఐ రిపోర్టులే సరికాదని ఎలా చేప్తావు చంద్రబాబు?. బాబూ నీకు ఆత్మే లేనప్పుడు అంతరాత్మ సాక్షిగా ప్రమాణం ఏంటి?. వైఎస్ జగన్ హయాంలో నెయ్యి నాణ్యతలో ఎక్కడా పొరపాటు చేయలేదు. బరితెగించి నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూనే ఉన్నావు.

ఇది కూడా చదవండి: చంద్రబాబు హెరిటేజ్‌ గురించి తెలుసా.. నాసిరకం పెరుగు.. 

సీబీఐ సిట్ చెప్పినా, ల్యాబ్స్ చెప్పినా నారా వారి మాటే కరెక్ట్ అనాలని కోరుకుంటున్నారు. మళ్ళీ ఏకసభ్య కమిషన్ అంటున్నారు.. సీబీఐ విచారణ చేసినా వీళ్లు ఒప్పుకోవడం లేదు. పాలే లేకుండా పెరుగు తయారు చేసినందుకు నీ హెరిటేజ్‌ సంస్థకు లక్ష రూపాయలు జరిమానా కట్టావు. దీనికి పుల్ స్టాప్ పడాలంటే ఒక్కటే మార్గం.. దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి ఇక నిరూపించుకోవాలి. దీనికి మేము జంతు కొవ్వు కలిపితే మా చేతులు పడిపోవాలి. జంతు కొవ్వు కలవకపోతే చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ నోరు పడిపోవాలి. మీ ముగ్గురికి ఆ వెంకటేశ్వర స్వామి శిక్ష తప్పకుండా విధిస్తాడు. స్వామి వారికి నువ్వు చేసిన అపచారానికి కచ్చితంగా శిక్ష పడుతుంది. నీ జీవితంలో 2029 తర్వాత నువ్వు, నీ కొడుకు ముఖ్యమంత్రి అయ్యేది లేదు. ఆ తర్వాత నీ జీవితంలో మంచి రోజులే ఉండవు. నీకు స్వామి వారి పట్ల భక్తి లేదు.. ప్రజల మనోభావాలపై గౌరవం లేదు అంటూ ఘాటు విమర్శలు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement