లడ్డూ తయారీ నెయ్యిలో కల్తీ జరగలేదు: జనసేన ఎమ్మెల్యే | There was no adulteration in ghee used for making Srivari laddu | Sakshi
Sakshi News home page

లడ్డూ తయారీ నెయ్యిలో కల్తీ జరగలేదు: జనసేన ఎమ్మెల్యే

Feb 9 2026 5:25 AM | Updated on Feb 9 2026 6:45 AM

There was no adulteration in ghee used for making Srivari laddu

ఎన్‌డీడీబీ, సిట్‌ నివేదికలు ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పాయి 

అబద్ధాన్ని పదే పదే చెబితే నిజమవుతుందనే మూర్ఖత్వంతో ఉన్నారు 

తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు స్పష్టీకరణ 

ఆయన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌  

తిరుపతి అన్నమయ్య­ సర్కిల్‌: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వినియోగించిన నెయ్యిలో కల్తీ జరగలేదని తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు. ‘ఎన్‌డీడీబీ, సిట్‌ నివేది­కలలో ఎక్కడా కూడా నెయ్యిలో కల్తీ జరగ­లేదని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది నచ్చక అబ­ద్ధాన్ని పదే పదే చెబితే నిజమవుతుందనే మూర్ఖ­త్వంతో ఉన్నారు’ అని ఆయన స్పష్టంచేశారు. జన­సేన ఆధ్వర్యంలో ఆదివారం తిరుపతి హరేరామ హరేకృష్ణ ఆలయం నుంచి గరుడ సర్కి­ల్‌ వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం మీడి­యాతో మాట్లా­డుతూ ఆరణి శ్రీనివాసులు ఈ వ్యా­ఖ్యలు చేశారు. 

అనంతరం ఆయన మాట మార్చి తిరు­మల లడ్డూలో కల్తీ జరిగిందని ఆరో­పించారు. కాగా, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చేసిన వ్యా­ఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారా­యి. తిరుమల లడ్డూ తయారీలో వినియో­గించిన నెయ్యిలో కల్తీ జరగలేదనే విషయాన్ని సాక్షాత్తూ ఆ స్వామివారే ఆయన నోట పలికించారని నెటిజన్లు, జనం అభిప్రాయపడుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement