breaking news
Janasena
-
పవన్ పై దాడి చేసిన దినేష్కు కానిస్టేబుల్ సహకరించినట్లు ఆరోపణలు
-
మీడియా కంటపడకుండా వినుత తంటాలు
తిరుపతి జిల్లా: తన డ్రైవర్ హత్య కేసులో రిమాండ్లో ఉన్న శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్చార్జి వినుత కోటకు చెన్నై సెషన్స్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో శనివారం ఆమె చెన్నైలోని సీ3 సెవెన్వెల్స్ పోలీస్స్టేషన్కు ద్విచక్ర వాహనంపై వచ్చి సంతకం పెట్టి వెళ్లిపోయారు. మీడియా కంటపడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ముఖానికి మాస్్క, తలకు టోపీ ధరించి..పోలీస్స్టేషన్ లోపలికి వెళ్లి సంతకం పెట్టారు. అనంతరం అక్కడి నుంచి వెళ్తుండగా మీడియా ప్రతినిధులు ఆమెను కేసు, రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన వివరాలను తెలుసుకోవడానికి ప్రయత్నించగా.. ఆమె లాయర్ చెయ్యి అడ్డుపెట్టి ఆపారు. బండిని ఆపకుండా వినూత అక్కడినుంచి వేగంగా వెళ్లిపోయారు. మరోవైపు..ఇదే కేసులో రిమాండ్లో ఉన్న కోట చంద్రబాబు, షేక్ తాసర్, శివకుమార్, గోపిలకు కోర్టు ఈ నెల 22 వరకు రిమాండ్ పొడిగించింది. -
వినుత డ్రైవర్ హత్య కేసులో నిందితులకు చుక్కెదురు
-
పవన్ కు భారీ షాక్.. వైఎస్సార్సీపీలో చేరిన జనసైనికులు..
-
సంచలన ఆడియో.. ఆ వందకోట్లు నొక్కింది వీడే.. పవన్ ఎమ్మెల్యేపై టీడీపీ నిందలు
-
బాబూ.. నేను ఎమ్మెల్యేను!
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్కుమార్ (జనసేన పార్టీ)కి మంగళవారం దుర్గగుడిలో చేదు అనుభవం ఎదురైంది. అమ్మవారి దర్శనానికి వస్తున్నట్లు ఆయన ఆలయ అధికారులకు, ప్రొటోకాల్కు సమాచారం అందించారు.ఈ క్రమంలో ఉదయం 11.30 గంటల సమయంలో కారులో ఘాట్రోడ్డు మీదగా ఓం టర్నింగ్కు చేరుకున్న ఎమ్మెల్యే కారును సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. ప్రొటోకాల్ నుంచి సమాచారం లేనందున అక్కడే కారు నిలుపుకోవాలని డ్రైవర్కు సూచించారు. కారులో ఎమ్మెల్యే ఉన్నారని డ్రైవర్ చెప్పినా సిబ్బంది వినలేదు. దీంతో ఎమ్మెల్యే కారు అద్దం కిందకు దింపి తాను ఎమ్మెల్యేనని చెప్పుకోవాల్సి వచ్చింది. ఇంతలో విషయం తెలుసుకున్న ప్రొటోకాల్ అధికారులు సెక్యూరిటీ సిబ్బందిని హెచ్చరించడంతో వారు కారును సమాచార కేంద్రం వరకు అనుమతించారు.దీంతో, అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే సిబ్బంది నిర్వాకంపై మండిపడ్డారు. ఆలయ ఈవో శీనానాయక్కు ఫోన్లో ఫిర్యాదు చేశారు. అంతటితో ఆగక తాను ఈ అంశాన్ని తేలికగా తీసుకోనని, ఆలయ ప్రొటోకాల్లో ఏం జరుగుతుందో తనకు తెలుసంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహా నివేదన అనంతరం ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించినా ఆయన శాంతించలేదు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. -
జనసేనకు ఇస్తామన్న 3 స్థానాలను ఇవ్వకుండా టీడీపీ నేతలే నామినేషన్
-
మంత్రి మనోహర్కు మహిళల షాక్!
పాడేరు: ‘గ్యాస్ సిలిండర్లు ఉచితమన్నారు. కానీ రూ.1,050 చెల్లిస్తున్నాం. కొందరికి రాయితీ సిలిండర్ల నగదు అసలు జమ అవలేదు. ఎప్పుడు అవుతుంది. ఇప్పటివరకూ ఉచిత సిలిండర్ ఒకటి మాత్రమే ఇచ్చారు. ఉన్న పింఛన్లు ఊడగొట్టారు. జీసీసీ డిపోలో పంచదార, బియ్యం తప్ప మరేమీ ఇవ్వడం లేదు. ఎప్పుడు ఇస్తారు?’ అంటూ మంత్రి నాదెండ్ల మనోహర్ను మహిళలు నిలదీశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనకు వచ్చిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మినుములూరులో పలువురు మహిళలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధి పనులు చేసి రెండు నెలలు కావస్తున్నా కూలీ సొమ్ము జమ చేయడం లేదన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక తమ గ్రామంలో 15 మంది పింఛన్లు ఎందుకు తొలగించారని సర్పంచ్ లంకెల చిట్టమ్మ ప్రశ్నించారు. మంత్రి మాట్లాడుతూ పౌరసరఫరాల శాఖను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామన్నారు. జీసీసీ డిపోల్లో మరిన్ని నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంచుతామన్నారు. గ్యాస్ సిలిండర్ల కోసం ఏజెన్సీ అదనంగా నగదు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కమాండర్ జీపుల సహాయంతో వృద్ధుల ఇళ్ల వద్దకే రేషన్ సరుకులు సరఫరా చేస్తామన్నారు. అనంతరం ఆయన సుండ్రుపుట్టు డీఆర్ డిపోతో పాటు పాడేరు జీసీసీ గోదామును పరిశీలించారు. కాగా, మంత్రి నాదెండ్ల పర్యటనలో జీసీసీ చైర్మన్, టీడీపీ నేత కిడారి శ్రావణ్ కుమార్ పాల్గొనకపోవడం చర్చనీయాంశమైంది. -
జనసేన ఎంపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
కృష్ణాజిల్లా: జనసేన ఎంపీ బాలశౌరి కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎంపీ బాలశౌరి పీఏ గోపాల్ సింగ.. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తాననని మోసం చేసిన ఘటనపై బాధితులు ఆందోళన చేపట్టారు. నిరుద్యోగులను నిండా ముంచేసిన బాలశౌరి పీఏ గోపాల్ సింగ్.. కోటిన్నర రూపాయలు వరకూ వసూలు చేసినట్లు తెలుస్తోంది. 60 మంది వద్ద రెండు లక్షల చొప్పున వసూలు చేశారు గోపాల్ సింగ్.గతంలో ఫేక్ అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చిన ఎంపీ పీఏ గోపాల్సింగ్.. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అపాయింట్మెంట్ లెటర్ల గడువు ముగిశాయంటూ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. విజయవాడలోని నోవాటెల్కు వస్తే మళ్లీ కొత్తగా అపాయింట్మెంట్ లెటర్లు ఇస్తానని నమ్మించాడు గోపాల్ సింగ్.దాంతో నిన్న (శుక్రవారం, ఆగస్టు 1వ తేదీ) నోవాటెల్ హోటల్కు బాధితులు వెళ్లగా, అక్కడకు గోపాల్ సింగ్ రాలేదు. ఈ నేపథ్యంలో మోసపోయామని గుర్తించిన బాధితులు.. తమకు న్యాయం చేయాలంటూ ఎంపీ బాలశౌరి కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఎంపీ కార్యాలయం వద్ద ఆందోళన చేయకూడదని వారిని పోలీసులు బెదిరింపులకు దిగారు. -
పోలవరం ఎమ్మెల్యే వంద కోట్లు సంపాదించాడట!
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘పోలవరం ఎమ్మెల్యే ఏడాది కాలంలోనే రూ.100 కోట్లు సంపాదించాడంట.. ఆయన గొప్పతనం యూట్యూబ్లో ఇప్పుడే కనిపించింది.. ఏడాదిలో ఇంత చెడ్డ పేరు తెచ్చుకుంటే ఎట్లా.. పవన్ కళ్యాణ్ ఏమీ పట్టించుకోరా..’ అంటూ మాజీ మంత్రి, టీడీపీ ముఖ్య నేత దేవినేని ఉమ.. జనసేన కీలక నేత కరాటం రాంబాబుతో వ్యాఖ్యానించారు. ఇద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఏడాదిలో రూ.100 కోట్లు సంపాదించాడనే విషయంతోపాటు, తరచూ వివాదాస్పద నేతగా మీడియాలో హాట్ టాపిక్గా ఉండటం తెలిసిందే. ఈ క్రమంలో టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు.. అందుకు సంబంధించిన ఓ వీడియో చూసి, మరో టీడీపీ నేత ఫోన్ నుంచి పశ్చిమ గోదావరి జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్, జనసేన నేత కరాటం రాంబాబుకు ఫోన్ చేశారు. వారిద్దరి మధ్య సాగిన సంభాషణ శుక్రవారం నుంచి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇదేమి దోపిడీ అన్నట్టు టీడీపీ నేత ఉమా జనసేన నేతను ప్రశ్నించడం.. పవన్ కళ్యాణ్ మిమ్మల్ని ఎప్పుడూ అడగలేదా అని ఆరా తీయడం.. తమకూ చాలా ఇబ్బందిగా ఉందని జనసేన నేత చెప్పడం.. ఏడాదిగా ఏ ఒక్కరూ తనతో మాట్లాడలేదని బదులివ్వడం.. కూటమి పారీ్టల్లో హాట్ టాపిక్గా మారింది. వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ ప్రధానాంశాలు.. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు: రాంబాబు గారూ.. బాగున్నారా.. ఎక్కడ ఉన్నారు.. ఏదో యూట్యూబ్లో మీ ఎమ్మెల్యే గొప్పతనం కనపడితే మీరు గుర్తుకు వచ్చారు. సంవత్సరంలోనే వంద కోట్లంటే దేశ చరిత్రలోనే గొప్ప విషయం. జనసేన కీలక నేత కరాటం రాంబాబు: ఇప్పుడు వ్యవస్థ అంతా పాడైపోయింది. ఉమా: సంవత్సరంలోనే ఎందుకు ఇంత చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు.. ఇంకా నాలుగేళ్లు ఉందిగా? కరాటం: నాలుగేళ్లు ఉండటమేమిటండీ.. చెడ్డ పేరు తెచ్చుకోవడమేమిటండీ. పార్టీకి ఇంత డ్యామేజీ. ఎమ్మెల్యే నా దగ్గరికి వచ్చినప్పుడు కేకలు వేస్తూనే ఉంటాను. అల్లరి ఎక్కువగా జరుగుతోంది.. ఉమా గారు.. మీరు ఎక్కడ ఉన్నారండీ.. ఉమా: నా మీద 82 కేసులున్నాయి కదా.. కోర్టు పని మీద రాజమండ్రికి వచ్చాను. ఇదంతా యూట్యూబ్లో చూసి ఎలా ఉన్నారు.. ఏమిటని అడుగుదామని ఫోన్ చేశాను. చాలా కష్టపడి మీరు తీసుకువచ్చి పెట్టారు. అందరిని కలుపుకుని మీరు కూడా అంతా తగ్గి ఒప్పించారు. కరాటం: ఇబ్బందిగానే ఉందండి. మాకున్నదే దానం చేశాం.. ఎప్పడూ చెయ్యి చాచడం అంటే తెలియదండీ.. కంట్రోల్ చేస్తున్నానండి. మళ్లీ మాములు స్థితికి తీసుకురావాలి. కూటమి అంతా దెబ్బ తినేస్తుంది. ఉమా: ఇదంతా పవన్ కళ్యాణ్కు తెలుస్తుంది కదా.. కరాటం: ఏమోనండి.. మరీ ఏం జరుగుతుందో.. ఉమా: మిమ్మల్ని కూడా అడగటం లేదా? కరాటం: ఇప్పటి వరకు నాకు ఎవరూ ఫోన్ చేయలేదు. ఉమా: అసలు రాంబాబు గారు ఎలా ఉన్నారని గానీ, ఏమిటని గానీ.. కరాటం: ఇప్పటి వరకు అసలు ఏ ఫోన్ రాలేదు. వాళ్లు ఫోన్ చేయనప్పుడు నేను కూడా సైలెంట్గానే ఉన్నానండి. మీరు ఫోన్ చేసి చెప్పినప్పుడు పని చేసిపెట్టాను. ఆ సోంబాబు ఏం చేశాడు కోటి రూపాయలు తీసుకున్నానని పెట్టాడు. ఉమా: ఆ.. అదంతా పట్టించుకోకండి.. కరాటం: జైలులోకి వెళ్లిపోతాడంటే కాపాడింది నేనండి.. ఉమా: అవునండీ.. నాకు తెలుసండీ.. కలుద్దాం.. అటు వైపు వచ్చినప్పుడు కలుద్దామండీ.. కరాటం: అలాగేనండీ.. -
జనసేన ఎమ్మెల్యే అవినీతిపై.. టీడీపీ నేతల ఫోన్కాల్ సంభాషణ వైరల్
సాక్షి,ఏలూరు: ఏలూరు జిల్లాలో ఇద్దరు టీడీపీ నేతల ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా, డీసీసీబీ మాజీ ఛైర్మన్ కరాటం రాంబాబుల మధ్య ఫోన్ సంభాషణ జరిగింది.ఇరువురి సంభాషణలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అవినీతిపై చర్చకు వచ్చింది. ఈ చర్చలో ఏడాదిలోనే రూ.100 కోట్లు దోచేశారని దేవినేని ఉమా ప్రస్తావించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఇవన్నీ తెలుసా? అని రాంబాబును ఉమ ప్రశ్నించారు. అందుకు రాంబాబు స్పందిస్తూ .. ఇప్పటివరకు పవన్ నాకు ఫోన్ చేయలేదని అన్నారు. -
YSRCPలో చేరిన జనసేన సీరియర్ నేత సామిరెడ్డి లక్ష్మణ
-
అందరి ముందు పరువు పాయే..!
-
నాగబాబుకు స్టేజ్ మీద షాక్ ఇచ్చిన జనసేన నేత
-
జనసేనలో ముసలం
విశాఖ సిటీ: జనసేన పార్టీలో ముసలం రాజుకుంది. ఆ పార్టీ జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ భీశెట్టి వసంతలక్ష్మిపై వేటుకు రంగం సిద్ధమవుతోంది. కూటమిలో జనసేనకు విలువ లేదన్న వాస్తవాన్ని ఆమె భర్త చెప్పిన పాపానికి జనసేన పెద్దలు వారిపై కక్ష కట్టేశారు. బీసీ మహిళా నేతను పదవి నుంచి పక్కన పెట్టాలన్న నిర్ణయానికి వచ్చారు. కూటమిలో జనసేన ప్రాధాన్యత కోసం పార్టీ నేతలు, కార్యకర్తలు పట్టుబడుతుంటే.. దాన్ని పార్టీ ధిక్కార స్వరంగా అధినాయకులు పరిగణిస్తుండడం శ్రేణులను షాక్కు గురి చేస్తోంది. పార్టీ నేతల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా నిర్ణయాలు తీసుకుంటుండడం తీవ్ర చర్చకు దారిస్తోంది.ప్రాధాన్యత లేదన్న పాపానికి..కూటమి ప్రభుత్వంలో జనసేన నేతలకు, కార్యకర్తలకు విలువ లేకుండా పోయింది. సాక్షాత్తు జనసేన ఎమ్మెల్యేలు సైతం నియోజకవర్గాల్లో పనులు జరగడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు అనేకమున్నాయి. పోలీస్స్టేషన్లో సిఫార్సు చేసిన వారికి పోస్టింగ్లు ఇవ్వలేదన్న కోపంతో పెందుర్తి జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్బాబు గన్మెన్లను సరెండ్ చేసిన అంశం అప్పట్లో హట్ టాపిక్గా నిలిచింది. దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఇప్పటికీ నియోజకవర్గంలో టీడీపీ ఇన్చార్జ్ సీతంరాజు సుధాకర్ పెత్తనానికి చెక్ పెట్టేందుకు కిందా మీదా పడుతూనే ఉన్నారు. ఎమ్మెల్యేల పరిస్థితే ఇలా ఉంటే.. ఇక పార్టీ నేతలు, ద్వితీయ స్థాయి నాయకులు పరిిస్థితి మరింత అధ్వానంగా మారింది. ఏ ప్రభుత్వ కార్యాలయంలోని చిన్న పని కూడా జరగని పరిస్థితి నెలకొంది. కూటమిలో ఆత్మగౌరవం కోసం జనసేన నేతలు గత ఏడాది కాలంగా పట్టుబడుతూనే ఉన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే అనేక సార్లు పార్టీ అధినాయకుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకుండా పోయింది. తాజాగా సీతంపేట ప్రాంతంలోని పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు, ఎమ్మెల్సీ నాగబాబు సమక్షంలో సమావేశం నిర్వహించారు. దీనికి జనసేన కార్పొరేటర్లతో పాటు నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఇందులో జిల్లాలో నెలకొన్న పరిస్థితులపై కొందరు నేతలు గోడు చెప్పుకున్న పాపానికి నాగబాబు ఒంటి కాలిపై లేచారు. కూటమిలో తమకు విలువ ఇవ్వడం లేదని, తమ అభిప్రాయాలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన వారిపై వేటు వేయాలన్న నిర్ణయానికి వచ్చారు. ఎన్ని సమస్యలు వచ్చినా కూటమిలో సర్దుకొని పనిచేయాల్సిందే అని నాగబాబు తెగేసి చెప్పడంతో జనసేన నాయకులు, కార్యకర్తలు ఖంగుతిన్నారు.చేతికి మట్టి అంటకుండా..నాగబాబు సమావేశంలో జీవీఎంసీ జనసేన ఫ్లోర్ లీడర్ భీశెట్టి వసంతలక్ష్మి భర్త భీశెట్టి గోపీకృష్ణ పార్టీ పరిస్థితిపై మాట్లాడారు. కూటమిలో జనసేన పార్టీ నేతల అభిప్రాయాలకు విలువ ఇవ్వడం లేదని మాత్రమే చెప్పారు. ఇంతలో ఎమ్మెల్సీ నాగబాబు కల్పించుకుని గోపీకృష్ణపై ఫైర్ అయ్యారు. సమావేశం నుంచి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు. వెంటనే అక్కడి నేతలు గోపీకృష్ణ చేతిలో ఉన్న మైక్ లాక్కున్నారు. అక్కడి నుంచి పంపించేశారు. దీంతో ఫ్లోర్లీడర్ భర్త అవమానభారంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. కూటమిలో జనసేన ప్రాధాన్యత కోసం మాట్లాడుతుంటే.. దానికి మద్దతుగా నిలవాల్సిన పార్టీ పెద్దలు.. వారిపైనే ఆగ్రహం వ్యక్తం చేయడంతో అక్కడున్న వారంతా విస్తుపోయారు. ఇదిలా ఉంటే.. వెంటనే ఫ్లోర్లీడర్ భీశెట్టి వసంతలక్ష్మిని ఆ పదవి నుంచి తప్పించేందుకు ఏర్పాట్లు జరిగిపోతుండడం గమనార్హం. నాగబాబు సమావేశంలో ఆమె భర్త మాట్లాడడాన్ని పార్టీ పెద్దలు తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పార్టీ పెద్దల చేతికి మట్టి అంటకుండా తెలివిగా కార్పొరేటర్లను ముందు పెట్టి కథను నడిపిస్తున్నారు. దీనిపై పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్కు లేఖ అందజేయడం ఇప్పుడు జనసేనలో హాట్ టాపిక్గా మారింది.ఫ్లోర్ లీడర్పై ఆరోపణలతో లేఖ జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ భీశెట్టి వసంతలక్ష్మిపై వేటుకు ప్లాన్ ఎమ్మెల్సీ నాగబాబు సమావేశంలో ఆమె భర్త ప్రశ్నించారనే అక్కసుతోనే..స్టాండింగ్ కమిటీలోనూ జనసేనకు నో చాన్స్ జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల అంశం జనసేనలో అగ్గి రాజేస్తోంది. స్థాయీ సంఘంలో కూడా జనసేనకు ప్రాతినిథ్యం లేకుండా పోయింది. ఇందులో 10 స్థానాలు ఉండగా.. 9 టీడీపీ, ఒకటి బీజేపీ సర్దేసుకున్నాయి. జనసేనకు ఒక్క స్థానాన్ని కూడా కేటాయించకపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే.. కొద్ది రోజుల క్రితం స్టాండింగ్ కమిటీ ఎన్నికలపై జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్బాబు సమావేశం నిర్వహించి జనసేనకు మూడు స్థానాలను కేటాయిస్తున్నట్లు చెప్పారు. వీటిలో ఒకటి పెద్దిశెట్టి ఉషశ్రీ, మరొకటి మహమ్మద్ సాధిక్, మరొకరికి అవకాశం దక్కే ఛాన్స్ ఉందని ఆశ పెట్టారు. దీంతో ఆ కార్పొరేటర్లు ఊహల్లో తేలారు. చివరికి జనసేనకు ఒక్క స్థానాన్ని కూడా కేటాయించకపోవడంతో అందరూ నోరెళ్లబెట్టారు. అయితే 11వ సభ్యుడిగా సాధిక్ నామినేషన్ దాఖలు చేశారు. 10 మందిలో ఎవరైనా విత్డ్రా అయితేనే సాధిక్కు అవకాశం ఉంటుంది. లేకుంటే స్టాండింగ్ కమిటీలో జనసేనకు ప్రాతినిథ్యం లేకుండా పోతుంది.జనసేన ఫ్లోర్లీడర్గా ఉషశ్రీ?ప్రస్తుత ఫ్లోర్లీడర్ భీశెట్టి వసంతలక్ష్మిని ఆ పదవి నుంచి తప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ స్థానంలో 43వ వార్డు కార్పొరేటర్ పెద్దిశెట్టి ఉషశ్రీ పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వైఎస్సార్సీపీ నుంచి గెలిచిన ఆమె కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జనసేనలోకి జంప్ అయ్యారు. డిప్యూటీ ఫ్లోర్లీడర్ పదవిని ఆశించి భంగపడ్డారు. కనీసం స్టాండింగ్ కమిటీలో అయినా ఛాన్స్ వస్తుందని ఆశపడ్డారు. అందులో జనసేనకు ప్రాతినిథ్యమే లేకపోవడంతో ఇప్పుడు ఫ్లోర్లీడర్పై కన్నేశారు. జనసేన పార్టీ పెద్దలు కూడా ఉషశ్రీ వైపే మొగ్గు చూపినట్లు సమాచారం. త్వరలోనే ఇందుకు సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.పార్టీ పెద్దల స్కెచ్ ప్రకారం జనసేన కార్పొరేటర్లు ఎమ్మెల్యే వంశీకృష్ణకు లేఖ అందజేశారు. ఇందులో ఫ్లోర్లీడర్ భీశెట్టి వసంతలక్ష్మిని మార్చాలని పేర్కొన్నారు. ఆమె స్వప్రయోజనాలు, వారి సమస్యల పరిష్కారం కోసమే దృష్టి పెట్టారని ఆరోపించారు. మిగిలిన జనసేన కార్పొరేటర్లను నిర్లక్ష్యం చేశారని తెలిపారు. అలాగే ఆమెకు ఫ్లోర్లీడర్కు అవసరమైన అనుభవం, నాయకత్వ లక్షణాలు లేవని విమర్శించారు. ఈ పదవికి అనుభవజ్ఞుడైన వ్యక్తి అవసరమన్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం జీవీఎంసీలో జనసేనకు చెందిన 11 మందిలో ఒకరిని ఫ్లోర్ లీడర్గా నియమించాలని కోరారు. ఈ లేఖ వెనుక జనసేన పెద్దలు ఉన్నట్లు పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. అతడు పార్టీ నేతల తరఫున మాట్లాడిన పాపానికి వసంతలక్ష్మిపై వేటుకు రంగం సిద్ధం చేయడాన్ని తప్పుబడుతున్నారు. పార్టీ ఉనికి కోసం నేతలు పోరాటం చేస్తుంటే.. వారిపైనే వేటు వేస్తుండడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. -
విశాఖలో ఎమ్మెల్సీ నాగబాబుకు షాక్ ఇచ్చిన జనసేన వీరమహిళ
-
ఎమ్మెల్సీ నాగబాబుకు జనసేన వీర మహిళ షాక్
సాక్షి, విశాఖపట్నం: ‘జనసేన నేతలకు, కార్యకర్తలకు ఏం పనులు జరగడం లేదు. మీ వెనుక మేమెందుకు నడవాలని పార్టీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. వారికి ఏం సమాధానం చెప్పాలి’ అని జనసేన 15వ వార్డు అధ్యక్షురాలు కళ ఆ పార్టీకీలక నేత, ఎమ్మెల్సీ కె.నాగబాబును నిలదీశారు. ఇదే విషయమై 33వ వార్డు జనసేన కార్పొరేటర్, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ భీశెట్టి వసంతలక్ష్మి భర్త భీశెట్టి గోపీకృష్ణ కూడా ఎమ్మెల్సీ నాగబాబును నిలదీయగా.. వీరిద్దరినీ తీవ్రంగా అవమానించడం కలకలం రేపింది.ఎమ్మెల్సీ కె.నాగబాబు విశాఖ సీతంపేటలోని పార్టీ కార్యాలయంలో సోమవారం నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జనసేన వీరమహిళ కళ మాట్లాడారు. తమ వెనుక ఉన్న వారికి ఒక్క పని కూడా చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తుండగా.. పార్టీ నాయకులు వెంటనే ఆమె మాట్లాడుతున్న మైక్ను కట్ చేశారు. మైక్ ఇవ్వాలని ఆమె అడిగినప్పటికీ.. మైక్ను వేరొకరికి ఇవ్వాలని వేదికపై ఉన్న నాయకులు ఆదేశించారు. దీనిపై ఎమ్మెల్సీ నాగబాబు స్పందిస్తూ.. ‘పార్టీ కార్యకర్తలు అసహనంతో పనిచేయొద్దు. వ్యక్తిగతమైన సమస్యల్ని వదిలేసి కూటమితో కలిసి పనిచేయాల్సిందే’ అని తెగేసి చెప్పడంతో సమావేశానికి హాజరైన నాయకులు షాక్కు గురయ్యారు.జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ భర్తకూ అవమానం ఇదే సమావేశంలో జనసేన నాయకులు, కార్యకర్తల గోడును విన్నవించుకునే ప్రయత్నం చేసిన 33వ వార్డు జనసేన కార్పొరేటర్, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ భీశెట్టి వసంతలక్ష్మి భర్త గోపీకృష్ణకు సైతం తీవ్ర అవమానం ఎదురైంది. కూటమి ప్రభుత్వం తమ మాటకు విలువ ఇవ్వడం లేదని గోపీకృష్ణ చెప్పే ప్రయత్నం చేయగా.. నాగబాబు సీరియస్ అయ్యారు. మైక్ కట్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ మండిపడ్డారు. పవన్ను నమ్మి తన భార్యను కార్పొరేటర్గా గెలిపించుకుంటే.. ఇలా అవమానిస్తారా? అని గోపీకృష్ణ సన్నిహితుల వద్ద వాపోయినట్టు తెలిసింది. -
కొలుసుకు భూ గొలుసు
బడాబాబుల లులుకు సబ్సిడీ ఎందుకు? హైదరాబాద్లో ప్రభుత్వంతో సంబంధం లేకుండా మార్కెట్ రేటుకే లీజుకు.. ఏపీలో మాత్రం రూ.వేల కోట్ల ఖరీదైన ప్రభుత్వ భూములు నామమాత్రపు లీజుకు అప్పగింత హైపర్ మార్కెట్ నిర్మించాక భారీగా అద్దెలు వసూలు చేసుకుని జేబులు నింపుకోనున్న లులు ఈ ఆదాయంలో రాష్ట్ర ప్రభుత్వానికి చిల్లిగవ్వ కూడా దక్కదు! హైపర్ మార్కెట్ ద్వారా వచ్చేవి కూడా తక్కువ జీతాలుండే ఉద్యోగాలేఅయినవారికి అడ్డంగా కట్టబెట్టడం... కావాల్సినవారికి నిలువునా దోచిపెట్టడంలో కూటమి ప్రభుత్వం బరితెగించి వ్యవహరి స్తోంది...! అత్యంత విలువైన భూములను పప్పుబెల్లాలు మాదిరి కారుచౌకగా పంచేస్తోంది..! ఉర్సా నుంచి లులు వరకు... సత్వ మొదలు కపిల్ చిట్ ఫండ్ దాక.. పట్టపగ్గాల్లేకుండా భూ పందేరానికి పాల్పడుతోంది..! కూటమి పార్టీల నేతలకు కట్టబెట్టేస్తోంది...! ఈ క్రమంలో నిన్న జనసేన ఎంపీ బాలశౌరి సంస్థకు 115 ఎకరాలు ధారాదత్తం చేయగా. నేడు మంత్రి కొలుసు పార్థసారథికి చెందిన కంపెనీకి ఏకంగా 845 ఎకరాలు రాసిచ్చేసింది..! ఆ కథాకమామీషు ఇదిగో...!సాక్షి, అమరావతి: ‘‘అధికారాన్ని వ్యక్తిగత ప్రయోజనాలకు వినియోగించను’’ అంటూ... దైవసాక్షిగా మంత్రులు ప్రమాణం చేస్తారు. కానీ, దాన్ని పక్కకుపెట్టి సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తన నియోజకవర్గంలోని విలువైన భూములను సొంత సంస్థకు దక్కించుకున్నారు. పరిశ్రమల కోసం అంటూ వందల ఎకరాలను నితిన్ సాయి కన్స్ట్రక్షన్స్కు కూటమి ప్రభుత్వం ధారదత్తం చేసింది. ఈ సంస్థ మంత్రి పార్థసారథి సతీమణి కమలాలక్ష్మి, ఆయన డ్రైవర్ కొలుసు ప్రసాద్ పేరిట ఏర్పాటైనదే..! కన్స్ట్రక్షన్, టెలికాం, కేబుల్స్ నిర్మాణ రంగాల్లో ప్రభుత్వ కాంట్రాక్టు పనులు చేస్తోంది.⇒ తాజాగా రూ.150 కోట్ల పెట్టుబడితో ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లి వద్ద 20 టీపీడీ (టన్స్ పర్ డే) సామర్థ్యంతో కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) ప్లాంట్కు ఇలా దరఖాస్తు చేసుకోగానే అలా ఏకంగా రూ.845.60 ఎకరాల భూమిని అప్పగిస్తూ కూటమి ప్రభుత్వం శరవేగంగా ఉత్తర్వులు ఇచ్చేసింది. ⇒ మొత్తం భూమిలో రూ.5 లక్షల చొప్పున 45.60 ఎకరాలను నితిన్ సాయి కన్స్ట్రక్షన్స్కు పూర్తిగా విక్రయించేలా, సీబీజీ ప్లాంట్ పక్కనే ఖాళీగా ఉన్న మరో 800 ఎకరాలను నైపర్ గడ్డి పెంపకం కోసం లీజు విధానంలో కూటమి ప్రభుత్వం కేటాయించింది. దీనికి ఏడాదికి రూ.15 వేల వంతున.. 25 ఏళ్లకు లీజుకు ఇచ్చింది. ప్రతి రెండేళ్లకు ఒకసారి ఈ లీజు మొత్తాన్ని 5 శాతం చొప్పున పెంచుతారు.అమ్మిన భూమి విలువే రూ.31 కోట్లుప్రస్తుతం ఆగిరిపల్లి మండలంలో ఎకరం భూమి ధర రూ.60 లక్షల నుంచి రూ.70 లక్షలు పైనే పలుకుతోంది. అదే రోడ్డు పక్క భూములైతే రూ.కోటి పైమాటే. అంటే, ప్రభుత్వ ధర ప్రకారమే రూ.590 కోట్లకు పైగా విలువైన భూమి అన్నమాట. ఇందులో ఎకరం రూ.5 లక్షలు చొప్పున 45.60 ఎకరాలను అమ్మేసింది. దీని విలువే రూ.31.50 కోట్లు. ఇక రూ.15 వేలు లీజు చొప్పున 800 ఎకరాలను మంత్రి సంస్థకు కూటమి ప్రభుత్వం కానుకగా కట్టబెట్టిందనే చెప్పాలి. ఈ ప్లాంట్ ద్వారా కేవలం 500 మందికి ఉపాధి కల్పించనున్నట్లు ఒప్పందంలో స్పష్టంగా పేర్కొన్నారు. కేవలం భూములే కాకుండా ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ కింద మరిన్ని రాయితీలతో పాటు కేంద్ర గ్రాంట్లను కూడా అందించనున్నట్లు ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు.రిలయన్స్ ప్లాంట్కు మించి..వాస్తవానికి మంత్రి పార్థసారథి సంస్థకు కేటాయించిన భూములు.. దిగ్గజ వ్యాపార సంస్థ రిలయన్స్ ఏర్పాటు చేస్తున్న సీబీజీ ప్లాంట్కు కూడా ఇవ్వలేదు. ఈ స్థాయిలో కేటాయింపు అంటే.. దీనివెనుక ఏదో అర్థం ఉందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ కేంద్రంగా కంపెనీలుపార్థసారథి సతీమణి కమలా లక్ష్మి పేరిట నితిన్సాయి కన్స్ట్రక్షన్స్, మరో 4 కంపెనీలు ఉన్నాయి. 2006లో రూ.3.47 కోట్ల మూలధనంతో 301, స్వర్ణ ప్యాలెస్ 13, శ్రీనగర్ కాలనీ, హైదరాబాద్ చిరునామాతో ఓ సంస్థను ఏర్పాటు చేశారు. కారుణ్య పవర్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్, హరిత పవర్ ప్రైవేట్ లిమిటెడ్తో పాటు నేరుగా కొలుసు పార్థసారథి పేరును సూచించేలా కేపీఆర్ టెలీ ప్రొడక్ట్స్ పేరిట మరో కంపెనీ ఉంది. ఈ కంపెనీలతో తన అధికారాన్ని ఉపయోగించుకుని కన్స్ట్రక్షన్, సబ్ స్టేషన్లు, టెలికాం కేబుల్స్ నిర్మాణం వంటి కాంట్రాక్టులను దక్కించుకుంటున్నారు.బడాబాబుల లులుకు సబ్సిడీ ఎందుకు?హైదరాబాద్ లులు మాల్కు వెళ్లి కాఫీ తాగాలంటే కనీసం రూ.100 చెల్లించాలి. పిల్లలు ముచ్చట పడ్డారని పాప్కార్న్ కొందామంటే తక్కువలో తక్కువ రూ.250 వరకు వదిలించుకోవాలి. ఆ మాల్లోని సినిమా థియేటర్లు, బ్రాండెడ్ ఔట్ లెట్స్లో అయితే దీనికి రెట్టింపు ధర చెల్లించాల్సిందే. సీఎం చంద్రబాబుతో లులు గ్రూపు చైర్మన్ యూసఫ్ ఆలీ కేవలం బడాబాబులు విలాసాల కోసం మాల్లు నిర్మించే లులుకు విలువైన ప్రభుత్వ భూములను అత్యంత చౌకగా కేటాయించడంపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. విచిత్రం ఏమంటే... కేరళ, హైదరాబాద్లో మాల్స్ నిర్మించిన లులుకు ఎక్కడా ప్రభుత్వాలు భూములను కేటాయించలేదు. హైదరాబాద్లో ప్రైవేటు సంస్థల నుంచి దీర్ఘకాలం లీజుకు తీసుకుని రూ.1,500 కోట్ల పెట్టుబడితో నిర్మించింది. లులూ హైపర్ మార్కెట్ ద్వారా వచ్చేవి కూడా తక్కువ జీతాలుండే ఉద్యోగాలే. అలాంటి లులుకు చంద్రబాబు ప్రభుత్వం విజయవాడ, విశాఖపట్నంలో అత్యంత ఖరీదైన భూములను కారుచౌకగా అప్పగించడంపై ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది. విశ్రాంత ఐఏఎస్ అధికారి ఒకరు.. లులుకు భూ కేటాయింపులపై సీబీఐ దర్యాప్తు చేయాలంటూ నేరుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్కే లేఖ రాశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అయితే.. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు పప్పుబెల్లాల్లా భూములను పంచిపెట్టాడాన్ని బహిరంగంగానే తప్పుపడుతున్నారు. విజయవాడలో ఏపీఎస్ఆర్టీసీకి చెందిన భూమిని లాగేసుకుని లులుకు ఇవ్వడంపై ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంటోంది. తక్షణం ఈ జీవో ఉపసంహరించుకోవాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్త బంద్కు సిద్ధమంటున్నాయి ఆర్టీసీ కార్మిక సంఘాలు. అత్యంత విలువైన భూములను బ్యాంకుల్లో తనఖా పెట్టి ఆర్టీసీనే పెద్ద భవనం నిర్మించి వాణిజ్య కార్యకలాపాలు కొనసాగిస్తే ఆస్తులతో పాటు సంస్థకు ఆదాయం పెరిగేదని ఒక ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు. అలాకాకుండా ప్రభుత్వమే ప్రజల ఆస్తులను ధ్వంసం చేస్తూ బడాబాబుల విలాసాల కోసం లులుకు అప్పగించడం దారుణం అని పేర్కొంటున్నారు. లులు గ్రూపు చైర్మన్ యూసఫ్ అలీ ఇలా విజయవాడ వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబును కౌగిలించుకోగానే.. అలా రెండు రోజుల్లోనే జీవో వచ్చిందంటే వీరి అనుబంధం ఎంత దృఢమైనదో అర్థం అవుతోందని మరో అధికారి వ్యాఖ్యానించారు.ఎంపీ బాలశౌరి తనయుడి కంపెనీకి మల్లవల్లిలో 115 ఎకరాల భూమిజనసేన ఎంపీ బాలశౌరి తనయుడు అనుదీప్ వల్లభనేనికి చెందిన అవిశా ఫుడ్స్ అండ్ ఫ్యూయల్స్కు మల్లవల్లి వద్ద ఎకరం రూ.16.5 లక్షలు చొప్పున 115.65 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం అక్కడ అభివృద్ధి చేసిన భూమి ఎకరం ధర రూ.90 లక్షలుగా ఉంది. అంటే రూ.104 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.19 కోట్లకే రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. మల్లవల్లి ఫుడ్ పార్కులో 13.85 ఎకరాల్లో అవిశాఫుడ్స్.. 83.50 ఎకరాల్లో 500 కేఎల్పీడీ సామర్థ్యంతో బయో ఇథనాల్ యూనిట్ను ఏర్పాటు చేయనుంది. -
నెల్లూరులో జనసేన రౌడీమూకల అరాచకం
నెల్లూరు సిటీ: కూటమి నేతల అరాచకాలకు అంతేలేకుండా పోతోంది. రౌడీమూకలు పేట్రేగిపోతున్నాయి. ఫలితంగా సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. తాజాగా శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ నియోజకవర్గం శ్రామికనగర్లో జనసేన గూండాలు సోమవారం అరాచకం సృష్టించారు. తినీతినక రూపాయిరూపాయి పోగేసి సామాన్యులు కట్టుకున్న ఇళ్లను యంత్రాలు తీసుకొచ్చి మరీ నిర్ధాక్షిణ్యంగా కూల్చివేశారు. వివరాల్లోకి వెళ్తే శ్రామికనగర్లో 3.9 ఎకరాల స్థలంలో బెల్లంకొండ తిరుపాల్ అనే వ్యక్తి ఎకరన్నరం పొలంలో లేవుట్ వేశారు.అప్పట్లో 10 మంది భూమిని విభజించుకుని కొన్నారు. ఆ తర్వాత పేద, మధ్య తరగతి ప్రజలు 40 మంది వరకు ఆ లేఅవుట్లోని ప్లాట్లను కొని రిజి్రస్టేషన్లూ చేయించుకున్నారు. ప్రస్తుతం ఆ స్థలాల విలువ భారీగా పెరిగింది. ఈ క్రమంలో కూటమి అధికారంలోకి వచ్చాక జనసేన పార్టీ మీడియా చైర్మన్, ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్కుమార్, మరో ఐదుగురు ఈ లేఅవుట్ వేసిన భూమి తమదంటూ హద్దురాళ్లు ఏర్పాటు చేసే యత్నం చేశారు. ప్లాట్ల యజమానులు కోర్టుకు వెళ్లడంతో ఆ తర్వాత మిన్నకుండిపోయారు.ఈ క్రమంలో రెండుమూడు నెలలుగా దశలవారీగా అర్ధరాత్రుళ్లు నిర్మాణ దశలో ఉన్న నాలుగు ఇళ్లను దుండగులు కూల్చేశారు. ఎవరి పనో తెలీక నిర్మాణదారులు అయోమయపడ్డారు. ఈ నేపథ్యంలో సోమవారం జనసేన గూండాలు పేట్రేగిపోయారు. జనసేన నేత నూనె మల్లికార్జున్యాదవ్ కుమారుడు తన అనుచరులు, రౌడీమూకలు, యంత్రాలతో వచ్చి లేఅవుట్లో వేసిన మరో మూడు ఇళ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చివేయడానికి సిద్ధమయ్యారు. సమాచారం తెలుసుకున్న ప్లాట్ల యజమానులు అక్కడికి చేరుకుని కూల్చివేతలను అడ్డుకున్నారు.112 ద్వారా కంట్రోల్రూం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సిబ్బంది వచ్చి కూల్చివేతలను ఆపాలని ముక్తసరిగా చెప్పి వెళ్లిపోయారు. పోలీసులు వెళ్లిన గంట తర్వాత జనసేన రౌడీలు మూడు ఇళ్లను నేలమట్టం చేశారు. అంతటితో ఆగకుండా రోడ్డునూ మూసివేస్తూ అప్పటికప్పుడు గోడ కట్టేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు లేఅవుట్లోనే కాపుగాశారు. అక్కడే మద్యం తాగుతూ హల్చల్ చేసి స్థానికులను భయభ్రాంతులకు గురిచేశారు. అయితే బాధితులు ఎస్పీ గ్రీవెన్స్లో ఫిర్యాదు చేయడంతో సీఐ తమ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. పోలీసులు రాగానే రౌడీమూకలు గోడలు దూకి పరారయ్యారు. ప్రధాన పాత్ర వహించిన కొందరిని పోలీసులు వేదాయపాళెం పోలీస్స్టేషన్కు తరలించారు. -
పవన్ సినిమా చూడాలంటూ.. నాదెండ్ల మనోహర్ రిక్వెస్ట్
-
Political Corridor: నన్నే ప్రశ్నిస్తావా.. ఔట్..!
-
జనసేన నేతల కాళ్ళపై పడిన గండి ఆంజనేయ స్వామి ఆలయ ఈవో
-
Audio Leak: పవన్ సినిమా సక్సెస్ కోసం జనసేన నేతల పాట్లు
-
జనసేన కార్యకర్తల స్వైరవిహారం
గాందీనగర్ (విజయవాడసెంట్రల్)/శ్రీకాళహస్తి: ఎన్టీఆర్ జిల్లా విజయవాడ, తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిల్లో బుధవారం రాత్రి హరిహర వీరమల్లు సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్ద జనసేన కార్యకర్తలు, పవన్కళ్యాణ్ అభిమానులు వీరంగం వేశారు. జనసేన జెండా ఊపుతూ ఎవడ్రా మమ్మల్ని ఆపేదంటూ రెచ్చిపోయారు. విజయవాడలో కారుతో స్వైరవిహారం చేయగా, శ్రీకాళహస్తిలో థియేటర్ అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో సినిమా చూసేందుకు వచ్చినవారు భయంతో పరుగులు తీశారు. పోలీసులు, స్థానికులు తెలిపిన మేరకు.. విజయవాడ గాం«దీనగర్లోని శైలజ థియేటర్ వద్దకు బుధవారం రాత్రి 10 గంటల సమయంలో ఏపీ 39 ఆర్వీ 8252 నంబరు కారు దూసుకొచ్చింది. ఐదుగురు యువకులు కారును ‘ఎస్’ ఆకారంలో వెనక్కు ముందుకు నడుపుతూ రెచ్చిపోయారు. ఒక బైక్ను ఢీకొట్టారు. అక్కడున్న పోలీసు వాహనంపైకి కారుతో దూసుకెళ్లారు. స్థానికుల సమాచారంతో అక్కడికి వచ్చిన త్రీ టౌన్ ట్రాఫిక్ సీఐ కిషోర్బాబు, ఎస్ఐ కుమార్, సిబ్బంది కారును ఆపేందుకు ప్రయతి్నంచినా ప్రయోజనం లేకపోయింది. పోలీసులను చూసి కారులోని నలుగురు యువకులు వెళ్లిపోగా డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి మాత్రం మద్యం మత్తులో ఇష్టారీతిన ప్రవర్తించాడు. ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో పోలీసులు అతడిని డ్రైవింగ్ సీటులోంచి బయటకు లాగేశారు. అతడిని, కారుని త్రీ టౌన్ ట్రాఫిక్ పోలీసు స్టేషన్కు తరలించారు. ఆ సమయంలో అతడు పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. మద్యం తాగి నిర్లక్ష్యంగా కారు నడిపిన వ్యక్తిని ఇబ్రహీంపట్నం ఏ కాలనీకి చెందిన వంశీగా గుర్తించినట్లు త్రీటౌన్ ట్రాఫిక్ సీఐ కిషోర్బాబు తెలిపారు. అతనిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసి కారు సీజ్ చేసినట్లు తెలిపారు.శ్రీకాళహస్తిలో రౌడీయిజం శ్రీకాళహస్తిలో జనసేన కూటమి కార్యకర్తలు ఆర్ఆర్ థియేటర్లోకి టికెట్ లేకుండా వెళ్లేందుకు ప్రయత్నించారు. అడ్డుకున్నవారిపై రౌడీయిజం చేశారు. థియేటర్ అద్దాలను ధ్వంసం చేశారు. పోలీసులు వారించినా వినకుండా దురుసుగా ప్రవర్తిస్తూ దుర్భాషలకు దిగారు. ఇష్టారాజ్యంగా అరుస్తూ ఊగిపోయారు. వారంతా కూటమి వారే కావడంతో పోలీసులు కేవలం వీడియో తీసుకుని వెళ్లిపోయారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ విషయమై 1వ పట్టణ సీఐని అడగగా థియేటర్ అద్దాలు పగిలినట్లు యాజమాన్యం ఫిర్యాదు చేసిందని చెప్పారు. పరిశీలించి కేసు నమోదు చేస్తామని తెలిపారు. -
విజయవాడలో ధియేటర్ అద్దాలు పగలగొట్టిన పవన్ సైకో ఫ్యాన్స్
-
మద్యం సేవించి జనసేన కార్యకర్తల వీరంగం
-
అభిమానమా?.. ఉన్మాదమా..?: కారుమూరి
సాక్షి, పశ్చిమ గోదావరి: రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నియంత పాలనను సాగిస్తోందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రీజనల్ కో-ఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. తణుకు క్యాంప్ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక మాజీ మంత్రిగా పనిచేసిన తనపైన జనసేన సైకోలు దారుణంగా దాడికి తెగబడ్డారంటే, ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, పోలీస్ వ్యవస్థను దారుణంగా నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే..కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో నియంతృత్వంతో కూడిన రాచరిక పాలన నడుస్తోంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపుతప్పాయి. మాజీ మంత్రిగా ఉన్న నాకే సరైన రక్షణ లేదు. ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. నిన్న'బాబు ష్యూరిటీ- మోసం గ్యారెంటీ' కార్యక్రమానికి వెళ్తుండగా తణుకు టౌన్ బాయ్స్ హైస్కూల్ వద్ద జనసేనకి చెందిన కొంతమంది రౌడీ మూకలు నా కాన్వాయ్ వాహనం పైకి ఎక్కి దాడి చేసి వాహనాన్ని ధ్వంసం చేశారు. వాహనంపైన ఉన్న మా పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ ఫొటోలపైన నిలబడి హరి హర వీరమల్లు సినిమా జెండాలతో, జనసేన పార్టీ జెండాలతో వీరంగం సృష్టించారు. దాదాపు 15 నిమిషాలకు పైగా రణరంగం సృష్టించారు.గతంలో ఎన్నో సినిమాలు రిలీజైనప్పటికీ ఏ హీరో అభిమానులు కూడా ఇలాంటి సైకో దుందుడుకు చర్యలకు దిగడం తణుకు చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. జనసేన అల్లరి మూకలు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేసిన ఈ చర్యలకు సామాన్య ప్రజలు సైతం భయభ్రాంతులకు గురయ్యారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలు మంచిది కాదు. జనసేన కార్యకర్తల తల్లిదండ్రులు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి.ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులదే. ఇప్పటికే ఈ ఘటనపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. రౌడీ మూకలను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. గతంలోనూ ఎంపీపీ ఎన్నిక సందర్భంగా కూటమి పార్టీలకు చెందిన నాయకులంతా కలిసి అత్తిలిలో నా ఇంటిపైన దాడిచేసి వీరంగం సృష్టించారు.ఒకపక్క పవన్ కళ్యాణ్ ని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు అంతగా ప్రేమిస్తుంటే.. ఆయన మాత్రం టీడీపీ నాయకులు అన్యాయం చేస్తున్నారని ప్రశ్నించిన సొంత పార్టీ వారిని సంజాయిషీ కూడా అడగకుండానే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నారు. చంద్రబాబే 15 ఏళ్ళు సీఎంగా ఉంటారని పవన్ పదే పదే చెప్పడాన్ని ఆ పార్టీ కార్యకర్తలు ఓర్చుకోలేకపోతున్నారు. మొన్న తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఇదే విషయాన్ని ఆవేదనపూరితంగా చెబితే, పవన్ మాత్రం చాలా క్యాజువల్గా పార్టీ నుంచి వెళ్లిపోవచ్చని సూచించారంటే ఆ పార్టీ వారికి ఆయనిచ్చే గౌరవం అలాంటిది. ఆయన సొంత జనసేన కార్యకర్తల కంటే టీడీపీ నాయకత్వాన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నారు. -
Soil Mafia: మనల్ని ఎవడ్రా ఆపేది
-
YSRCP ప్రచార రథం ఎక్కి జనసేన రౌడీల వీరంగం..
-
తణుకులో జనసేన రౌడీ మూకల వీరంగం
సాక్షి, పశ్చిమ గోదావరి: తణుకులో జనసేన రౌడీ మూకలు వీరంగం సృష్టించారు. మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు కాన్వాయ్లోని ప్రచార రథంపై దాడి చేశారు. హరిహర వీరమల్లు రిలీజ్ సందర్భంగా తణుకులో జనసేన కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. అదే మార్గంలో ‘బాబు షూరిటీ-మోసం గ్యారంటీ’ కార్యక్రమానికి వెళుతున్న కారుమూరి కాన్వాయిని జనసేన కార్యకర్తలు చుట్టుముట్టారు.ప్రచార రథంపై ఎక్కి.. జనసేన జెండాలు ఊపుతూ.. ప్రచార రథాన్ని ధ్వంసం చేశారు. ప్రచార రథం వెనుక.. కారులో కారుమూరి ఉన్నారు. జనసేన రౌడీ మూకలపై వైఎస్సార్సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. -
పిఠాపురంలో జనసేన ఆఫీసును ముట్టడించిన మత్స్యకారులు
-
రాయుడు హత్య కేసులో పవన్ మౌనం వెనుక..
-
ఇంకెన్నాళ్లు ఇట్టాగా..
పార్టీ పెట్టి 15 ఏళ్లయింది. ఇన్నేళ్లుగా సొంతంగా పోటీ చేయడం అనేది లేకపోయింది. చంద్రబాబు పొత్తుతోనో బిజెపి అండతోను ఎన్నాళ్ళని నడుస్తాం.. వాళ్లని గెలిపించడానికి పడుతున్న కష్టం ఏదో మనంతట మనం గెలవడానికి నిలవడానికి పడితే ప్రయోజనం ఉంటుంది కదా. మన పార్టీని నమ్ముకుని ఉన్నవాళ్లకు కూడా ఆసరా ఇచ్చినట్లు ఉంటుంది కదా.. ఊత కర్ర వదిలేద్దాం సొంతంగా నడుద్దాం అనే ఆలోచనలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఉన్నారా.. తాను మరో 15 ఏళ్ల పాటు చంద్రబాబుకు మద్దతు ఇవ్వడానికి ఎలాంటి ఇబ్బంది లేదని గతంలో చెప్పినప్పటికీ పార్టీలో అంతర్గతంగా జరిగిన చర్చ నేపథ్యంలో ఇలా ఉంటే కుదరదని.. చంద్రబాబు తనను నిమ్మరసం పిండినట్లు పిండేసి తొక్కలు బయటకు విసిరేసినట్లుగా తనను బయట వదిలేస్తాడని జ్ఞానబోధ అయిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తానే బలపడేందుకు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ తరఫున 21 మంది ఎమ్మెల్యేలు శాసనసభలో ఉన్నారు వచ్చే ఎన్నికల నాటికి. ఇలా గుప్పెడు సీట్లు తీసుకుంటే కుదరదని.. మూడెంతల సీట్లు డిమాండ్ చేసే పరిస్థితికి ఎదగాలని పవన్ కళ్యాణ్ కు పార్టీ సీనియర్లు కాపు నేతలు సైతం హిత బోధ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తీరు పట్ల కాపు నేతల్లో తీవ్రమైన అసంతృప్తి ఉంది. క్యాడర్లో కూడా తాము ఎంతసేపు తెలుగుదేశం మోచేతి నీళ్లు తాగడమేనా ప్రభుత్వాన్ని నిలబెట్టింది మేము తీసుకొచ్చింది మేము అయినప్పటికీ మాకు ఎంగిలి మెతుకులే తప్ప ప్రధాన పదవులు కానీ ఇతరత్రా అధికారాల్లో కానీ వాటా లేదన్న మనోవేదన కనిపిస్తోంది. దీంతోపాటు తెలుగుదేశం నాయకుల చేతిలో జనసైనికులు పలు సందర్భాల్లో అవమానాలకు గురైన సంఘటనలు సైతం ఉన్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా తనకు ఉన్న బలాన్నీ బేరిజు వేసుకోడానికి అంతర్గతంగా ఒక సర్వే నిర్వహించినట్లుగా తెలుస్తోంది. దాదాపుగా ఆంధ్రప్రదేశ్ మొత్తంలో 60 నియోజక వర్గాల్లో ఇప్పటికే సర్వే పూర్తికాగా వాటిలో దాదాపుగా 50 నియోజకవర్గాల్లో తమకు బలం పుంజుకునే అవకాశం ఉన్నట్లుగా ఒక అంచనాకు వచ్చారు.వాస్తవానికి పార్టీకి ఎంతవరకు రాష్ట్ర జిల్లా కార్యవర్గాలు ఏర్పాటు చేయలేదు. నియోజకవర్గ ఇన్చార్జిలతో కథ నడిపిస్తూ వస్తున్నారు. రాష్ట్ర జిల్లా స్థాయి నుంచి మండల స్థాయికి పార్టీని తీసుకువెళ్లాలంటే జిల్లా కమిటీలు ఏర్పాటు చేయక తప్పదు. ఆ తరువాత గ్రామ బూత్ కమిటీ వేయాల్సి ఉంటుంది. ఇవేమీ లేకుండా రాత్రి కి రాత్రి ఎన్నికల్లో గెలిచేయడం అన్ని సందర్భాల్లోనూ సాధ్యం కాదని పవన్ కళ్యాణ్ కు రాజకీయ సలహాదారులు చెప్పినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇకపై పార్టీని గాలికి వదిలేయకుండా 65 నియోజకవర్గాల్లో బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో కనీసం 50 ఎమ్మెల్యే టికెట్లు డిమాండ్ చేసే పరిస్థితికి ఎదగాలని సేనాని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే త్వరలో జిల్లా అధ్యక్షులు నియమకాలు కూడా చేపడతారని పార్టీ సమాచారం. ఎంతసేపు చంద్రబాబు చేయి పట్టుకొని ఆయన అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్లడం పార్టీకి మంచిది కాదని.. ఇలా చేయడం ద్వారా మున్ముందు పార్టీ ఒక పరాన్న జీవి మాదిరిగా మిగిలిపోతుంది అన్న భయాన్ని పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్లోకలిగించారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మున్ముందు సొంతంగా ఎదిగి మరింత బలోపేతం అయ్యేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా చేతిలో ఉన్న సినిమాలను త్వరగా పూర్తిచేసి పార్టీ నిర్మాణాన్ని చేపట్టాలని పవన్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఎత్తులకు చంద్రబాబు ఏ విధమైన పైఎత్తులు వేస్తారో.. జనసేన ఎదుగుదలను చంద్రబాబు తన కుయుక్తులతో ఏ విధంగా నియంత్రిస్తారో చూడాలిసిమ్మాదిరప్పన్న -
వినుత డ్రైవర్ హత్యలో పవన్ పాపమెంత?
-
మాకు ప్రాణహాని ఉంది.. పవన్ కళ్యాణ్ స్పందించకపోతే.. డ్రైవర్ రాయుడు చెల్లి షాకింగ్ కామెంట్స్
-
పవన్ కి అన్నీ తెలుసు అందుకే దాక్కున్నాడు..
-
పార్టీ వాళ్ళు ఏమైనా అవ్వని.. బాబు కోసం పవన్ మౌన దీక్ష
-
కాళ్లు పట్టుకున్నా కనికరించకుండా చంపేశారు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తన మనవడిని చంపేస్తారని భయంతో కాళ్లుపట్టుకున్నా కనికరించలేదని శ్రీనివాసులు రాయుడు అమ్మమ్మ రాజేశ్వరమ్మ కన్నీరు మున్నీరయ్యారు. పవన్ కళ్యాణ్ని పిచ్చిగా అభిమానించిన తన సోదరుడిని హత్యచేశారని తెలిసినా జనసేన అధినేత ఇంతవరకు స్పందించకపోవడం అన్యాయమని రాయుడు సోదరి కీర్తి ఆవేదన వ్యక్తం చేశారు. రాయుడి హత్య విషయంపై తమకు న్యాయం చేయాలని కీర్తితోపాటు ఆమె అమ్మమ్మ రాజేశ్వరమ్మ గురువారం శ్రీకాళహస్తి డీఎస్పీని కలిశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. జనసేన మాజీ ఇన్చార్జ్ కోట వినుత డ్రైవర్ రాయుడి హత్య కేసును ఏపీకి బదిలీచేస్తే కేసు నీరుగారిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాయుడు హత్య కేసును ఏపీకి బదిలీ చేయాలని కుట్రలు చేస్తున్నారని, తమిళనాడు పోలీసులే విచారణ జరపాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరగాలంటే తమిళనాడు పోలీసులు విచారణ జరపాలని అప్పుడే వాస్తవాలు వెలుగు చూస్తాయని పేర్కొన్నారు. రాయుడిని చంపిన వారిని చట్ట పరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తన అభిమాని, జనసేన కార్యకర్త హత్యకు గురైతే ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ పరామర్శ లేదని, ఫోన్ కూడా చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.బొజ్జల అనుచరుడు మోసం చేశాడు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అనుచరుడు పేట చంద్రతో తన మనవడు ఫోన్ టచ్లో ఉన్నాడని రాజేశ్వరమ్మ వెల్లడించారు. వినుత సమాచారం, వీడియోలు పంపిస్తే డబ్బులు ఇస్తామని ఆశ చూపించారని విమర్శించారు. పేట చంద్ర ద్వారా తన మనవడితో మాట్లాడిన సంభాషణలు, చాటింగ్ మెసేజ్లు ఉన్నాయని, తాను దొరికిపోయాను అని ఎమ్మెల్యే అనుచరుడు చంద్రకు రాయుడు మెసేజ్ చేస్తే ‘‘నీ చావు నువ్వు చావు, మా పేర్లు చెప్పొద్దు’’ అని మెసేజ్ పెట్టినట్లు కన్నీరుపెట్టుకున్నారు. రాయుడిని చంపక ముందు ఐదుసార్లు పంచాయితీ జరిగిందని, మనవడిని చంపొద్దు అని వినుత దంపతుల కాళ్ళు పట్టుకుని బతిమిలాడానని, అయినా కనికరం చూపలేదని రాజేశ్వరమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. చంపేస్తారని తెలిసి వినుత ఇంటి నుంచి దూకి పారిపోయేందుకు రాయుడు యత్నించడం వల్ల అతడి కాళ్లు విరిగాయని, అది సీసీ ఫుటేజీలో రికార్డు అయిందని, ఆ తరువాత రాయుడిని పక్కనే కూర్చొని పెట్టుకుని వినుత దంపతులు తనతో మాట్లాడారని రాజేశ్వరమ్మ చెప్పారు. ఎక్కడికి పారిపోకుండా ఇద్దరితో కలిసి వినుత దంపతులు రాయుడిని నిర్బంధించి కాళ్లు, చేతులు కట్టి కూర్చోబెట్టారని విమర్శించారు. రాయుడికి డబ్బులు ఇచ్చారని చెబుతున్నారని, ఆ డబ్బు ఎక్కడుందో తెలియాలని డిమాండ్ చేశారు.పవన్ రావాలి.. మాకు న్యాయం చేయాలితనకు అన్న లేకుండా చేశారని సోదరి కీర్తి ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న చిన్న విషయాలకు స్పందించే పవన్ కళ్యాణ్ ఇంత జరిగినా కనీసం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పవన్కల్యాణ్ రావాలి, తమకు న్యాయం చేయాలని కీర్తి డిమాండ్ చేశారు. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. తమకు కూడా రక్షణ కల్పించాలని కోరారు. రాయుడి హత్య తరువాత తమకు రూ.30 లక్షలు ఆఫర్ ఇచ్చారని, తాము డబ్బుకు లొంగేవాళ్లం కాదని, తమకు న్యాయం జరగాలని డిమాండ్చేశారు. సోషల్ మీడియాలో రాయుడిపై ఏవో విష ప్రచారం చేస్తున్నారని, ఈ కేసులో చాలామంది ఉన్నారని, వారందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.రాయుడు హత్యలో నా ప్రమేయం లేదుశ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డితిరుమల: రాయుడి హత్య వెనుక తన ప్రమేయం లేదని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు. గురువారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. రాయుడు హత్య, వినుత విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. రాజకీయ కోణంలో తనపై అబాంఢాలు వేస్తున్నారన్నారు. -
‘మా అన్న చనిపోతే పవన్ కనీసం పలకరించలేదు’
తిరుపతి జిల్లా: తన అన్న హత్య చేసిన కేసులో తమకు న్యాయం జరగాలని మరొకసారి స్పష్టం చేసింది శ్రీనివాసులు అలియాస్ రాయుడు సోదరి కీర్తి. ఈరోజు(గురువారం జూలై 17) శ్రీకాళహస్తి డీఎస్పీని కలిసిన కీర్తి.. తమకు న్యాయం జరగాలని కోరడంతో పాటు రక్షణ కల్పించాలని ఫిర్యాదు చేసింది. ఈ మేరకు డీస్పీని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె.. ‘ మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. మాకు రక్షణ కల్పించాలి కోరాం. చిన్న చిన్న విషయాలకు పవన్ కల్యాణ్ స్పందిస్తారు, మా అన్న చనిపోతే కనీసం పలకరింపు లేదు. పవన్ కళ్యాణ్ దగ్గరికి అయినా మమ్మల్ని తీసుకువెళ్ళండి. హత్య జరిగిన తర్వాత మాకు రూ. 30 లక్షలు ఆఫర్ చేశారు. మేము డబ్బులకు లొంగే వాళ్ళము కాదు, మాకు న్యాయం జరగాలి. సోషల్ మీడియాలో మా అన్నపై ఏవో విష ప్రచారం చేస్తున్నారు. ఈ కేసులో చాలా మంది ఉన్నారు..వాళ్ళను కూడా అరెస్ట్ చేయాలి’ అని డిమాండ్ చేసింది. కాగా, తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి జనసేన ఇన్చార్జి కోట వినుత మాజీ డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు దారుణ హత్య తీవ్ర కలకలం సృష్టించింది. అయితే, రాయుడు హత్యపై అటు జనసేన అధినేత పవన్కళ్యాణ్, ఇటు కూటమి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. ఇక, తన మనవడు రాయుడు హత్యపై రాజేశ్వరమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనపై పవన్ కల్యాణ్ స్పందించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.రాయుడు అమ్మమ్మ రాజేశ్వరమ్మ తాజాగా సాక్షితో మాట్లాడుతూ..‘నా మనవడిని ఏం చేయవద్దని కాళ్లు పట్టుకుని వేడుకున్నాను. కాళ్లు పట్టుకున్నా కనికరించకుండా చంపేశారు. హత్యకు ముందు ఐదుసార్లు పంచాయితీ జరిగింది. ఏ మాత్రం కనికరం లేకుండా నా మనవడిని హత్య చేశారు’ అని రాజేశ్వరమ్మ కన్నీటి పర్యంతమైంది.‘అయ్యా పవన్.. నా మనవడి కోసం కాళ్లు పట్టుకున్నా సామీ’ -
సంచలన నిజాలు బయటపెట్టిన డ్రైవర్ రాయుడు అమ్మమ్మ
-
అయ్యా పవన్.. నా మనవడి కోసం కాళ్లు పట్టుకున్నా సామీ: రాజేశ్వరమ్మ
సాక్షి, శ్రీకాళహస్తి: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి జనసేన ఇన్చార్జి కోట వినుత మాజీ డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు దారుణ హత్య తీవ్ర కలకలం సృష్టించింది. అయితే, రాయుడు హత్యపై అటు జనసేన అధినేత పవన్కళ్యాణ్, ఇటు కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం పట్టింపులేదు. ఇక, తన మనవడు రాయుడు హత్యపై రాజేశ్వరమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనపై పవన్ కల్యాణ్ స్పందించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.రాయుడు అమ్మమ్మ రాజేశ్వరమ్మ తాజాగా సాక్షితో మాట్లాడుతూ..‘నా మనవడిని ఏం చేయవద్దని కాళ్లు పట్టుకుని వేడుకున్నాను. కాళ్లు పట్టుకున్నా కనికరించకుండా చంపేశారు. హత్యకు ముందు ఐదుసార్లు పంచాయితీ జరిగింది. ఏ మాత్రం కనికరం లేకుండా నా మనవడిని హత్య చేశారు. ఈ ఘటనపై పవన్ కల్యాణ్ స్పందించకపోవడం బాధాకరం. నా మనవడికి డబ్బు ఇచ్చారని చెబుతున్నారు. ఆ డబ్బు ఎక్కడుందో తెలియాలి. తమిళనాడు పోలీసులే మాకు న్యాయం చేస్తారు. ఏపీకి కేసు బదిలీ చేస్తే కేసు నీరుగారిపోతుంది’ అని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో తనను చంపేస్తున్నారని.. టీడీపీ నేతకు కూడా రాయుడు మెసేజ్ పెట్టాడు. కానీ, ఆయన ఏమీ స్పందించలేదు. నా పేరు బయటకు చెప్పవద్దు.. మీ చావు మీరు చావండి అని అన్నాడని చెప్పుకొచ్చారు. అంతకుముందు.. రాయుడు సోదరి కీర్తి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. తనకున్న ఒకే ఒక్క సోదరుడు శ్రీనివాసులు అని.. అతన్ని పొట్టన పెట్టుకున్నారంటూ కన్నీరుమున్నీరవుతోంది. దీన్ని ఇక్కడితో వదిలేస్తే రేపు ఇంకోటి జరుగుతుందని.. తమకు న్యాయం జరగాల్సిందేనని ఆమె పట్టుబడుతోంది. అంతేకాక.. ‘నా అన్నను నాకు లేకుండా చేశారు. మా అన్నను చంపిన వాళ్లను ప్రాణాలతో వదలం. పవన్ రావాలి.. మాకు న్యాయం చేయాలి. న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తాం. మా అన్నను చంపిన వాళ్లకు కఠినంగా శిక్ష పడాల్సిందే’.. అని చెప్పింది.ఇదిలా ఉండగా.. అతి సామాన్య కుటుంబానికి చెందిన శ్రీనివాసులును కోట వినుత ఆమె భర్త చంద్రబాబు మరో ముగ్గురితో కలిసి అతికిరాతకంగా మట్టుబెట్టిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఘటనపై ముఖ్యనేతలెవరూ స్పందించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. తమిళ మీడియాలో కూడా ఈ ఉదంతంపై వరుస కథనాలు వస్తున్నప్పటికీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంగానీ, జనసేన అధినేతగానీ ఇప్పటివరకు నోరువిప్పలేదు. అయితే, మృతుడు కుటుంబ సభ్యులు మాత్రం పవన్ రావాలి.. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.హత్య ఎందుకు జరిగింది..ఎలా చేశారంటే?జనసేన నేత వినుత వద్ద ఉన్న శ్రీనివాసులుపై నిఘా పెట్టిన శ్రీకాళహస్తి నియోజకవర్గ ముఖ్యనేత అతడికి డబ్బులు ఎర చూపి, వారి రాజకీయ వ్యూహాలు, ఇతర వ్యక్తిగత విషయాలకు సంబంధించి కీలక సమాచారాన్ని తెలుసుకున్నట్లు సమాచారం. దీన్ని కోట వినుత, ఆమె భర్త చంద్రశేఖర్నాయుడు గుర్తించినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే గత నెల 21న శ్రీనివాసులును విధుల నుంచి తొలగించారు. అయితే కోట వినుతతో ఉన్న కొన్ని వీడియోలు బయట పడడంతో అతడిని మట్టుబెట్టాలని గత నెలలోనే పక్కా ప్లాన్ వేసినట్లు చెన్నై పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం.అయితే అందులోని కొన్ని వీడియోలు బహిర్గతం కావడంతో జీర్ణించుకోలేని కోట చంద్రశేఖర్నాయుడు అతడిని ఎలాగైనా అంతమొందించాలని భావించినట్టు తెలిసింది. తలచిందే తడువుగా పక్కా ప్లాన్ ప్రకారం పార్టీలోని మరో నలుగురు వ్యక్తుల సహాయంతో శ్రీనివాసులును శ్రీకాళహస్తిలోని ఓ గోడౌన్కు తీసుకెళ్లి అక్కడ విచక్షణా రహితంగా కొట్టి చంపినట్టు చెన్నై పోలీసులు భావిస్తున్నారు. అక్కడి నుంచి కారులో చెన్నైకి తీసుకెళ్లి మింట్ ఏరియా కూవం నదిలో పడేసి ఆంధ్రాకు తిరిగి వచ్చేశారని చెన్నై పోలీసులు వెల్లడించారు.నిందితులను పట్టించిన పచ్చబొట్టుచెన్నై నగరం, నార్త్ జోన్ సెవన్ వెల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రైనేజీ కాల్వలో యువకుడి మృతదేహాన్ని ఈనెల 8వ తేదీన గుర్తించిన పోలీసులు పోస్టుమార్టంలో హత్య జరిగినట్లు నిర్ధారణకు వచ్చారు. అయితే మృతుడి చేతి మీద జనసేన పార్టీ గుర్తు, వినుత పేరు పచ్చబొట్టు ఉండడంతో ఆ దిశగా దర్యాప్తు కొనసాగించారు. సీసీ ఫుటేజ్ లభించడంతో శనివారం తెల్లవారుజామున శ్రీకాళహస్తికి చేరుకున్న చెన్నై పోలీసులు జనసేన ఇన్చార్జి కోట వినుత, ఆమె భర్త చంద్రశేఖర్నాయుడు, హత్యకు సహకరించిన రేణిగుంటకు చెందిన దస్తా సాహెబ్, శ్రీకాళహస్తికి చెందిన కె.శివకుమార్, తొట్టంబేడు మండలానికి చెందిన ఎస్.గోపిని తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేసి చెన్నైకి తీసుకెళ్లారు. -
Big Question: డ్రైవర్ రాయుడికి కోటి రూపాయల ఆఫర్..! హత్య వెనుక విస్తుపోయే నిజాలు
-
Big Question: తమిళ పోలీసుల చేతిలో ప్రూఫ్.. మాస్టర్ మైండ్ అతనే..
-
Driver Rayudu Case: డ్రైవర్ హత్య కేసులో.. పవన్ పేరు బయటపెట్టిన వినుత
-
Driver Rayudu Case: కాళహస్తి జనసేన ఇన్ ఛార్జ్ వినుత కోట ఇంట్లో బొజ్జల కోవర్ట్ ఆపరేషన్
-
పవన్ కళ్యాణ్కు అంతా తెలుసు
సాక్షి, అమరావతి: ‘మా వ్యక్తిగత వీడియోలతో టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్రెడ్డి మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేశారు. ఆ విషయాన్ని వెంటనే డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్కు చెప్పాం. ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి ఎలాంటి ఇబ్బంది లేకుండా సెటిల్ చేస్తానని హామీ ఇచ్చారు. కానీ ఆయన పట్టించుకోలేదు. ఆయన వెంటనే బాధ్యతాయుతంగా స్పందించి ఉంటే డ్రైవర్ శ్రీనివాస్ హత్య వరకు వ్యవహారం దారి తీసేది కాదు’ అని జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ మాజీ ఇన్చార్జ్ కోట వినూత, ఆమె భర్త చంద్రబాబు దంపతులు విస్పష్టంగా వెల్లడించారు. డ్రైవర్ శ్రీనివాస్ హత్య కేసులో వారిద్దరినీ చెన్నై పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం వారు అక్కడి పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెల్లడించారు. తమ వ్యక్తిగత వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తున్న విషయం పవన్ కల్యాణ్కు ముందే తెలుసని వారు కుండబద్ధలు కొట్టడం గమనార్హం. తమ పార్టీ మహిళా నేతను వ్యక్తిగత వీడియోలతో టీడీపీ ఎమ్మెల్యే బ్లాక్ మెయిల్ చేస్తున్నారని తెలిసినా ఆయన పట్టించుకోలేదని వారు వాపోయారు. చెన్నై పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం కోట వినూత, ఆమె భర్త చంద్రబాబు తమ వాంగ్మూలంలో వెల్లడించిన విషయాలు ఇలా ఉన్నాయి.గొడవ చేయొద్దు.. సర్దుబాటు చేస్తానన్నారు‘టీడీపీ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్రెడ్డి మా బెడ్రూమ్లో రహస్య కెమెరాలు పెట్టించి వీడియోలు రికార్డు చేయించారు. మా డ్రైవర్ శ్రీనివాస్ను ప్రలోభపెట్టి ఆయనకు అనుకూలంగా మార్చుకున్నారు. అనంతరం ఆ వీడియోలను డ్రైవర్ శ్రీనివాస్ రూ.30 లక్షలకు ఎమ్మెల్యే సుధీర్కు విక్రయించారు. వాటితో ఆయన తన వర్గీయుల ద్వారా మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయించారు. ఈ విషయం తెలియగానే శ్రీనివాస్ను పని నుంచి తొలగించాం. వ్యక్తిగత వీడియోలతో మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తుండటంతో వెంటనే మా పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లాం. టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీరే ఇదంతా చేయిస్తున్నారని వివరించాం. ఆ విషయాన్ని ఎవరికీ చెప్దొద్దు.. టీడీపీ వారితో గొడవ పడొద్దని ఆయన మాతో చెప్పారు. ‘నేను ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మెల్యే సుధీర్తో మాట్లాడతాను. విషయాన్ని సర్దుబాటు చేస్తాను. మీరు పోలీసులకు ఫిర్యాదు చేయొద్దు. ప్రభుత్వానికి, రెండు పార్టీలకు ఇబ్బంది కలుగుతుంది’ అని పవన్ కల్యాణ్ అన్నారు. పార్టీ అధినేత అలా హామీ ఇవ్వడంతో ఆయన మాటలు విశ్వసించాం. ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మెల్యే సుధీర్తో ఏం మాట్లాడారో మాకు తెలీదు. కానీ ఎమ్మెల్యే సుధీర్ తన వర్గీయులతో మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తూ బెదిరింపులు కొనసాగించారు. అంటే పవన్ కల్యాణ్ మా ఆవేదనను పట్టించుకోలేదని స్పష్టమైంది.పూర్తి వివరాలు తెలుసుకునేందుకే శ్రీనివాస్ను పిలిపించాం టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వర్గీయులు బ్లాక్ మెయిలింగ్ కొనసాగిస్తునే ఉన్నారు. దాంతో శ్రీనివాస్ను పిలిపించి గట్టిగా నిలదీశాం. ఎందుకు ఇంత పని చేశావని ప్రశ్నించాం. తనకు టీడీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి రూ.30 లక్షలు ఇచ్చి ఆ వీడియోలు తీసుకున్నారని అతను తెలిపాడు. అందులో రూ.20 లక్షలు ఖర్చు చేసేశానని, తన వద్ద ఇక రూ.10 లక్షలు మాత్రమే ఉన్నాయని చెప్పాడు. దాంతో తీవ్ర వాగ్వాదం, ఘర్షణ చోటుచేసుకున్నాయి. ఆ ఘర్షణలోనే శ్రీనివాస్ హతమయ్యాడు.పవన్ స్పందించి ఉంటే ఇంతవరకు వచ్చేదే కాదువ్యక్తిగత వీడియోలతో తమను బ్లాక్ మెయిల్ చేస్తున్న విషయాన్ని చెప్పగానే పవన్ కల్యాణ్ బాధ్యతాయుతంగా స్పందిస్తారని ఆశించాం. పార్టీలో ఓ మహిళా నేత ఆవేదనను అర్థం చేసుకుంటారని, న్యాయం చేస్తారని అనుకున్నాం. కానీ ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ సమస్యనే పట్టించుకోకపోవడం తీవ్ర ఆవేదన కలిగించింది. పవన్ కల్యాణ్ వెంటనే స్పందించి.. ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి, టీడీపీ ఎమ్మెల్యే సుధీర్ను కట్టడి చేసి ఉండే పరిస్థితి ఇంత వరకు వచ్చేది కాదు. మేము పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నప్పుడు అడ్డుకోకుండా ఉన్నా బాగుండేది. దాంతో పోలీసులే కేసు నమోదు చేసి దర్యాప్తు చేసేవారేమో. అటు టీడీపీ ఎమ్మెల్యే సుధీర్ బ్లాక్మెయిలింగ్.. మరోవైపు మా పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పట్టించుకోకపోవడం.. దీంతో ఏం చేయాలో మాకు తోచలేదు. దాంతో డ్రైవర్ శ్రీనివాస్తో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకోవాలని అనుకున్నాం. ఆ తర్వాత మాటా మాటా పెరిగి పరిస్థితి చేయిదాటిపోయింది. అతను హతమయ్యాడు. బ్లాక్ మెయిలింగ్ బాధితులమైన మేము హత్య కేసులో చిక్కుకున్నాం. మా రాజకీయ జీవితాన్ని నాశనం చేయాలనుకున్న టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ తన పంతం నెగ్గించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో భాగస్వామి అయిన జనసేన నియోజకవర్గ ఇన్చార్జికే ఇంతటి దుస్థితి ఏర్పడితే.. ఇక జనసేన పార్టీ సామాన్య కార్యకర్తల పరిస్థితి ఇంకెంత ఘోరంగా ఉంటుందో అర్థమవుతోంది’ అని వారు పేర్కొన్నారు. -
శ్రీనివాసులు హత్య కేసులో నా కొడుకుకు ఎలాంటి సంబంధం లేదు: తాసిర్ తల్లి
-
జనసేన రాయుడు హత్య వెనుక ఎమ్మెల్యే హస్తం
-
Kovvuru Constituency: భగ్గుమన్న జనసేన
-
జైల్లో జనసేన వీరమహిళ! మర్డర్ మిస్టరీ..
-
వాళ్ళని కూడా అలాగే చంపేయండి.. డ్రైవర్ రాయుడు చెల్లి కన్నీరు
-
వినుత మాస్టర్ ప్లాన్.. ఆ వీడియోల కోసమే చంపేసింది!
-
వినుత వీడియోలతో వ్యాపారం.. జనసేన ఆఫీసులో ప్రత్యక్షం!
-
చేసిందంతా టీడీపీ ఎమ్మెల్యేనే.. జనసేన వినుత సంచలనం
-
డ్రైవర్ దారుణ హత్యపై కూటమి గప్చుప్!
సాక్షి టాస్క్ఫోర్స్ : తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి జనసేన ఇన్చార్జి కోట వినుత మాజీ డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు దారుణ హత్య ఎంతో కలకలం సృష్టించినా అటు జనసేన అధినేత పవన్కళ్యాణ్కు గానీ, ఇటు కూటమి ప్రభుత్వానికి గానీ ఈ ఘటన ఏమాత్రం పట్టడంలేదు. అతిసామాన్య కుటుంబానికి చెందిన శ్రీనివాసులును కోట వినుత ఆమె భర్త చంద్రబాబు మరో ముగ్గురితో కలిసి అతికిరాతకంగా మట్టుబెట్టిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఘటనపై ముఖ్యనేతలెవరూ స్పందించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. తమిళ మీడియాలో కూడా ఈ ఉదంతంపై వరుస కథనాలు వస్తున్నప్పటికీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంగానీ, జనసేన అధినేతగానీ ఇప్పటివరకు నోరువిప్పలేదు. అయితే, మృతుడు కుటుంబ సభ్యులు మాత్రం పవన్ రావాలి.. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా.. ఆదివారం మృతుడి సోదరి కీర్తి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. తనకున్న ఒకే ఒక్క సోదరుడు శ్రీనివాసులు అని.. అతన్ని పొట్టన పెట్టుకున్నారంటూ కన్నీరుమున్నీరవుతోంది. దీన్ని ఇక్కడితో వదిలేస్తే రేపు ఇంకోటి జరుగుతుందని.. తమకు న్యాయం జరగాల్సిందేనని ఆమె పట్టుబడుతోంది. అంతేకాక.. ‘నా అన్నను నాకు లేకుండా చేశారు. మా అన్నను చంపిన వాళ్లను ప్రాణాలతో వదలం. పవన్ రావాలి.. మాకు న్యాయం చేయాలి. న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తాం. మా అన్నను చంపిన వాళ్లకు కఠినంగా శిక్ష పడాల్సిందే’.. అని చెప్పింది. -
డ్రైవర్ చెల్లి కన్నీటి పర్యంతం
-
అసలు నిజాలు చెప్పిన జనసేన ఇన్ ఛార్జ్ వినుత డ్రైవర్ చెల్లి
-
ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి హస్తం ఉంది: వినుత భర్త చంద్రబాబు
-
అలా ప్రశ్నిస్తావా?.. చంద్రబాబు కోసం సేనాని సంచలన నిర్ణయం
నేనే పాతికేళ్ల పాటు చంద్రబాబు పల్లకి మోయాలని నిర్ణయించుకున్నాను. ఆయన ఎన్నాళ్ళు సీఎంగా ఉన్న ఆయన గుమ్మం ముందు కాపలాకు సిద్ధమయ్యాను.. అలాంటిది చంద్రబాబును, ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నిస్తే ఎలా ఊరుకుంటాను అన్నట్లుగా ఉంది పవన్ కళ్యాణ్ ఐడియాలజీ. ఏమైనా గానీ పార్టీలో ఎదగాలంటే పార్టీ అధినేత కనుసన్నల్లో.. ఆయన మనసెరిగి ప్రవర్తిస్తేనే ముందుకు వెళ్లగలరు.. ఉన్నతమైన స్థానాలు పొందగలరు. అలాకాకుండా అధినేత నిర్ణయాలకు వ్యతిరేకంగా న్యాయబద్ధమైన కావచ్చు ప్రశ్నలు సంధిస్తే మాత్రం ఖర్చయిపోతారు అని జనసేన అని రుజువు చేస్తున్నారు.వాస్తవానికి సేనాని పొత్తు లేకపోతే మొన్నటి ఎన్నికల్లో కూటమికి అధికారం దక్కేది కాదు. కానీ, గెలిచిన తర్వాత ప్రభుత్వంలో క్యాబినెట్లో పవన్ కళ్యాణ్కు ఏపాటి ప్రాధాన్యం దక్కుతుంది అన్నది జనం మొత్తానికి తెలుసు. ఇది ఎలా ఉంటే గ్రామాల్లో పట్టణాల్లో మండలాల్లో జన సైనికులను తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. జన సైనికులను రాజకీయ కార్యకర్తలుగా కన్నా డబ్బులు ఇస్తే వచ్చే కూలీలుగానే ట్రీట్ చేస్తూ వస్తున్నారు. ఏకంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన స్థాయిని తగ్గించుకుని చంద్రబాబు వద్ద తాబేదారుగా పని చేస్తున్నపుడు మధ్యలో మీరు ఎందుకు గొంతెత్తుతారు అన్నట్లుగా టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు.అంతేకాకుండా ప్రభుత్వం తరఫున జనసేనకు రావలసిన నామినేటెడ్ పదవులు విషయంలో కూడా అన్యాయం జరుగుతున్నది. ఎక్కడ ఏ విభాగంలో నామినేటెడ్ పోస్టులు నియామకాలు జరుగుతున్నా అక్కడ జన సైనికులకు కచ్చితంగా అన్యాయమే జరుగుతుంది. మంచి పోస్టులు ప్రాధాన్యం ఉన్న పోస్టులన్నీ తెలుగుదేశం వాళ్ళు తన్నుకుపోతుండగా మిగిలిపోయిన చిన్నా చితకా పదవులు నామ్ కే వాస్తే జన సైనికులకు దక్కుతున్నాయి. భారీ వేట అనంతరం సింహం తినగా మిగిలిన ఎముకలు బొమికలు దక్కించుకుని కుక్కలు నక్కలు పండగ చేసుకున్నట్లుగా జన సైనికుల పరిస్థితి ఉంది.మొన్న కొవ్వూరు నియోజకవర్గం పరిధిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు సంబంధించి చైర్మన్లను ప్రభుత్వం నియమించింది. మొత్తం 14 పదవులకు గాను 12 పదవులు తెలుగుదేశానికి కేటాయించారు. ఆ పదవులన్నీ కమ్మ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ కార్యకర్తలకే ఇచ్చారు. మిగిలిన రెండు పోస్టులు జనసేనకు చెందిన కాపు నేతలకు ఇచ్చారు. మొత్తం 14 పోస్టుల్లో దాదాపుగా 90 శాతం పదవులు తెలుగుదేశం వారే తీసుకోవడాన్ని అక్కడి జనసేన నియోజకవర్గం ఇంచార్జ్ టీవీ రామారావు అవమానకరంగా భావించారు.తమ పార్టీని ఇంత చిన్నచూపు చూడటమా.. మరీ బిచ్చం వేసినట్లు రెండంటే రెండు పదవులు ఇస్తారా అంటూ మీడియా ముందు తన ఆవేదన వెళ్లగక్కారు. వాస్తవానికి ఇలాంటి పదవులు పంపిణీ జరిగేటప్పుడు జనసేన, తెలుగుదేశం నాయకులు మధ్య సమన్వయం అవసరం. ఇరుపార్టీల నాయకులు చర్చించుకుని పదవులు పంచుకోవాలి. అయితే, రాష్ట్రంలో జనసేనకు పవన్ కళ్యాణ్ మినహా మరో నాయకుడు లేరు. నాగబాబు అప్పుడప్పుడు కనిపించి వెళ్లడమే తప్ప పార్టీలో ఆయనకు అధికారం లేదు.. బాధ్యత కూడా లేదు. దీంతో తమ కష్ట నష్టాలు ఎవరికి చెప్పుకోవాలో కూడా కార్యకర్తలకు నాయకులకు అర్థం కావడం లేదు. పవన్ కళ్యాణ్ను కలవడం అసాధ్యం. దీంతో టీవీ రామారావు అలాంటి సీనియర్ నాయకులు ఇలా తమ ఆవేదనను వెళ్లగక్కుతుంటారు.కార్యకర్తలకు జరిగిన అన్యాయాన్ని మీడియా ముఖంగా బయట పెట్టినందుకు టీవీ రామారావుపై పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకున్నారు. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీని బలోపేతం చేసే ఉద్దేశమే పవన్ కళ్యాణ్కి ఉంటే ఇలాంటి అంశాలను నోట్ చేసుకొని.. కార్యకర్తలు నాయకులతో చర్చించి తమకు రావాల్సిన పదవులు వాటాను తెచ్చుకునేవారు. కానీ, పవన్కు పార్టీ మీద, కార్యకర్తల మీద ఎలాంటి ఆపేక్ష లేనట్లు ఈ సస్పెన్షన్తో అర్థమవుతుంది. నేనే చంద్రబాబుకు మరో పాతికేళ్ళు బేషరతుగా మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాక ప్రశ్నించడానికి మీరు ఎవరు?. పదవులు కానీ ఇంకేమైనా ప్రయోజనాలు కానీ చంద్రబాబు దయాదాక్షిణ్యలతో ఇస్తే తీసుకోవాలి తప్ప ప్రశ్నిస్తే ఊరుకునేది లేదు అన్నట్లుగా పవన్ నిర్ణయం తీసుకున్నారు. టీవీ రామారావు వంటి సీనియర్ నాయకుడికే పార్టీలో రక్షణ లేకపోతే కిందిస్థాయిలో ఉండే తమకు ఇంకేం ఉంటుందని మండల స్థాయి నాయకులు లోలోన కుమిలిపోతున్నారు-సిమ్మాదిరప్పన్న. -
ఏపీలో బీసీ మహిళా జెడ్పీ చైర్పర్సన్పై 'టీడీపీ గూండాయిజం'
గుడివాడ రూరల్/గుడివాడ టౌన్: రాష్ట్రంలో ప్రజాస్వామ్య హననం జరుగుతోందనడానికి మరో తార్కాణం.. రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోందనడానికి మరో నిదర్శనం.. రాష్ట్రంలో శాడిస్టు ప్రభుత్వం రాజ్యమేలుతోందనడానికి నిలువుటద్దం.. కృష్ణా జిల్లా గుడివాడలో శనివారం సాక్షాత్తు జిల్లా ప్రథమ పౌరురాలు, జెడ్పీ చైర్పర్సన్, బీసీ మహిళ ఉప్పాల హారికపై టీడీపీ, జనసేన గూండాలు విచక్షణా రహితంగా మారుణాయుధాలతో దాడి చేశారు. తాలిబన్లు, ఐసిస్, హమాస్, హిజ్బుల్లా ఉగ్రవాదులను మరిపించే రీతిలో పోలీసుల సమక్షంలోనే బూతులు తిడుతూ దాడికి తెగబడ్డారు. ‘బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ’ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తుండగా అడ్డుకుని మరీ దాడి చేయడం విస్తుగొలుపుతోంది. మద్యం, గంజాయి సేవించి.. సైకోల్లా కేకలు వేస్తూ.. చంపండి.. కొట్టండి.. అని అరుస్తూ బండరాళ్లు, కర్రలతో దాడులు చేస్తున్నా పోలీసులు అడ్డుకోవడానికి ఏమాత్రం ముందుకు రాకపోవడం రాష్ట్రంలో రెడ్బుక్ పాలనకు అద్దం పడుతోంది. దాడిని నిలువరించక పోగా, సినిమా షూటింగ్ చూస్తున్నట్లు వ్యవహరించడం.. తీరా దాడి చేసి వెళ్లిపోతుండగా హంగామా చేయడం పోలీసులు ప్రభుత్వ పెద్దల ఆదేశాలకు ఎంతగా లొంగి పోయారన్నది తేటతెల్లం చేస్తోంది. ఇదే రీతిలో నెల్లూరులో కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్రెడ్డి ఇంటిపై కూడా టీడీపీ గూండాలు విచక్షణా రహితంగా దాడికి పాల్పడటం తెలిసిందే. దాడి చేసిన టీడీపీ మూకలపై ఇప్పటి దాకా కేసు కూడా నమోదు చేయని పోలీసులు.. బాధితుడైన ప్రసన్న కుమార్రెడ్డి పైనే కేసు నమోదు చేయడం చంద్రబాబు ప్రభుత్వ దురీ్నతిని బయట పెడుతోంది. అంతకు మందు ఉమ్మడి అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ గూండాల తరఫున వకాల్తా పుచ్చుకున్న సీఐ.. వైఎస్సార్సీపీ శ్రేణులపై రివాల్వర్ ఎక్కుపెట్టి.. కాల్చేస్తానని బెదిరించడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. హైకోర్టు అనుమతితో.. అదీ ఏడాది తర్వాత సొంత నియోజకవర్గం తాడిపత్రిలోని తన ఇంట్లో అడుగుపెట్టిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని టీడీపీ గూండాల ఒత్తిళ్లకు తలొగ్గి.. పోలీసులే ఆయన్ను బలవంతంగా వాహనంలోకి ఎక్కించి అనంతపురం పంపడం రాష్ట్రంలో ప్రభుత్వ దుర్మార్గానికి అద్దం పట్టింది. గుడివాడలో దాడి జరిగిందిలా.. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ఊరారా ఎండగట్టేలా ‘బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ’ కార్యక్రమాన్ని గుడివాడ మండలం లింగవరంలోని కె.కన్వెన్షన్లో వైఎస్సార్సీపీ శ్రేణులు నిర్వహించ తలపెట్టాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఉమ్మడి కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్, బీసీ నాయకురాలు ఉప్పాల హారిక తన భర్త, ఇతరులతో కలిసి వాహనంలో బయలు దేరారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల నుంచి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చాయి. ఈ విషయం తెలియడంతో కూటమి నేతల కన్ను కుట్టింది. గుడివాడ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం విజయవంతం కాకుండా చూడాలని ప్రభుత్వ పెద్దల నుంచి స్థానిక టీడీపీ, జనసేన నేతలకు ఆదేశాలు అందాయి. దీంతో ఆ కార్యక్రమానికి వచ్చే వైఎస్సార్సీపీ శ్రేణులను నాగవరప్పాడు వద్ద అడ్డుతగులుతూ, రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరించారు. రాళ్లు, కర్రలు చేత పట్టుకుని యుద్ధ వాతావరణాన్ని సృష్టించారు. కర్రలు, రాడ్లతో సభకు వెళ్లే వారిని అడ్డగించి, అడ్డువచ్చిన వాహనాలపై దాడులకు తెగబడ్డారు. అయినప్పటికీ వైఎస్సార్సీపీ శ్రేణులు సంయమనం పాటించాయి. ఈ క్రమంలో సభకు హాజరయ్యేందుకు గుడివాడ మీదుగా లింగవరం వెళ్తున్న జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక కారు అక్కడికి రాగానే.. టీడీపీ, జనసేన నేతలు రాళ్లు, కర్రలు, రాడ్లతో పోలీసుల సమక్షంలో దాడులకు తెగబడ్డారు. కారు అద్దాలను ధ్వంసం చేశారు. కారుపై బండరాళ్లు విసిరారు. బీసీ మహిళ అని కూడా చూడకుండా బూతులు తిట్టారు. కారును ముందుకు కదలనివ్వకుండా అడ్డుకున్నారు. కారుపై పదిసార్లు విచ్చలవిడిగా దాడి చేయడంతో గంటన్నర సేపు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జెడ్పీ చైర్పర్సన్, ఆమె భర్త కారులోనే ఉండిపోయారు. ఈ తతంగం అంతా జరిగాక, అక్కడే ఉన్న పోలీసులు తాపీగా అక్కడికి చేరుకుని ఉప్పాల హారికను అక్కడి నుంచి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు. దాడికి పాల్పడిన వారిని పల్లెత్తు మాట అనకుండా జెడ్పీచైర్పర్సన్, అమె భర్త, వైఎస్సార్సీపీ నేతలనే తప్పు పట్టేలా వ్యవహరించారు. చంపేస్తారనుకున్నా.. కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువైందని జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక కన్నీటి పర్యంతమయ్యారు. స్థానిక వన్టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో శనివారం రాత్రి ఆమె విలేకరులతో మాట్లాడారు. గుడివాడ మండలం లింగవరం వద్ద వైఎస్సార్సీపీ తలపెట్టిన కార్యక్రమంలో పాల్గొనేందుకు తన భర్త రాముతో కలసి కారులో వెళ్తుంటే మార్గమధ్యంలో నాగవరప్పాడు వద్ద టీడీపీ, జనసేన నాయకులు గూండాల్లా కర్రలు, రాడ్లతో కారుపై పోలీసుల సమక్షంలోనే దాడి చేసి కారు అద్దాలను పగలకొట్టారని చెప్పారు. తమను హతమార్చేందుకు ప్రయత్నించారని కన్నీటిపర్యంతమయ్యారు. ఓ దశలో తనను చంపేస్తారనుకున్నానని చెప్పారు. తన మామ, తన భర్త, తాను రాజకీయాల్లో ఉన్నా, ఇప్పటి వరకు ఎవరినీ విమర్శించలేదని, తన దారిలో తాను వెళ్తుంటే బీసీ మహిళ అని కూడా చూడకుండా నోటితో చెప్పలేని విధంగా అసభ్య పదజాలంతో దూషించి తమను చంపేందుకు యత్నించారన్నారు. సీఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో అక్కడ ఉండగానే, వారి సమక్షంలోనే తమపై దాడి చేశారన్నారు. కూటమి ప్రభుత్వంలో జిల్లా ప్రథమ పౌరురాలినైన తనకే రక్షణ లేకపోతే సామాన్య మహిళలకు ఏం రక్షణ ఉంటుందని ఆమె ప్రశ్నించారు. తనపై జరిగిన దాడికి సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనిత వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తనపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని, ఇప్పటికే గుడివాడ వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని తెలిపారు. జిల్లా ఎస్పీని కలసి దాడి గురించి ఫిర్యాదు చేస్తానని హారిక తెలిపారు. పెడన నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి ఉప్పాల రాము మాట్లాడుతూ టీడీపీ నేతలు మద్యం తాగి వచ్చి వీధి గూండాల్లా కర్రలు, రాడ్లతో తమపై దాడి చేసి తమను హతమార్చేందుకు ప్రయత్నించారన్నారు. దాదాపు 400 మంది పోలీసుల సమక్షంలోనే తమపై దాడి చేశారన్నారు. కారులో తాను ఒక్కడినే ఉంటే భయపడేవాడిని కాదని, మహిళ అయిన తన భార్య ఉండటంతో ఆందోళన చెందానన్నారు. తన భార్యను ఇష్టానుసారంగా దుర్భాషలాడి, తమను చంపేందుకు ప్రయత్నించారని, దీనిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన నందివాడ జెడ్పీటీసీ సభ్యురాలి భర్త కందుల నాగరాజుపై కూడా దాడికి దూసుకు వచ్చారన్నారు. కూటమి నేతలకు బీసీ మహిళలు అంటే అంత చులకనా? ఓట్ల కోసమే బీసీలు కావాలా? అని ప్రశ్నించారు. ఈ దాడిపై గుడివాడ ఎమ్మెల్యే రాము స్పందించాలని, దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్య నాయకుల హౌస్ అరెస్ట్ గుడివాడ కార్యక్రమానికి జిల్లా నాయకులు వస్తున్నారన్న సమాచారంతో ముందస్తుగానే అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లతో పోలీసులు హౌస్ అరెస్ట్లు చేశారు. మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని), పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త పేర్ని కృష్ణమూర్తి(కిట్టు)లను పోలీసులు ముందుగానే మచిలీపట్నంలో హౌస్ అరెస్ట్ చేశారు. కేవలం గుడివాడలో వైఎస్సార్సీపీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక టీడీపీ నేతలు గూండాలుగా మారి దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఇదిలా ఉండగా టీడీపీ నాయకులు, గూండాలు వైఎస్సార్సీపీ తలపెట్టిన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. వైఎస్సార్సీపీ తలపెట్టిన కార్యక్రమంలో దాదాపు మూడు వేల మంది పాల్గొనడంతో గుడివాడ దద్దరిల్లిపోయింది. ఈ కార్యక్రమానికి వస్తున్న జెడ్పీ చైర్మన్ కారుపై పచ్చమూకలు దాడికి తెగబడ్డారన్న విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నాయకులు రోడ్డుపైకి రావడంతో ఒక్కసారిగా టీడీపీ నేతల్లో కంగారు మొదలైంది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి వైఎస్సార్సీపీ నాయకులకు సర్దిచెప్పారు. రాష్ట్రంలో ఆటవిక పాలన కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్పై దాడిని తీవ్రంగా ఖండించిన వైఎస్ జగన్ ఉప్పాల హారికతో ఫోన్లో మాట్లాడి పరామర్శ ధైర్యంగా ఉండాలని.. పార్టీ అండగా ఉంటుందని భరోసా కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై టీడీపీ, జనసేన మూకల దాడిని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా ఖండించారు. శనివారం బాధితురాలితో ఫోన్లో మాట్లాడి దాడి వివరాలు తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. దాడి జరిగిన విషయాన్ని పార్టీ నాయకులు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. ఒక బీసీ మహిళ, జిల్లా ప్రథమ పౌరురాలు భయంతో వణికిపోయే పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయంటే ఇంతకంటే దారుణం ఉంటుందా.. అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో ప్రజాస్వామ్య హననం జరుగుతోందని, ఆటవిక పాలన సాగుతోందని మండిపడ్డారు. వాహనాలు, అంబులెన్స్ను అడ్డుకుని వీరంగంగుడివాడలో వైఎస్సార్సీపీ కార్యకర్తల సమావేశాన్ని అడ్డుకోడానికి కూటమి ప్రభుత్వంలోని టీడీపీ, జనసేన కార్యకర్తలు చేయని ప్రయత్నం లేదు. వారు శనివారం స్థానిక నాగవరప్పాడు వంతెన వద్ద వీరంగం సృష్టించారు. గంజాయి, మద్యం మైకంలో ఏమి చేస్తున్నారో తెలియక వచ్చి పోయే వాహనాలను అడ్డుకుని సాధారణ ప్రజలను ఇబ్బందులకు గురిచేశారు. పోలుకొండ రోడ్లో రోగిని తీసుకెళ్లేందుకు వెళ్తున్న అంబులెన్స్ను సైతం అడ్డుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకోవడంతో దానిని వదిలివేశారు. ఇలా ప్రతి వాహనాన్ని ఆపడం, అందులో ఉన్న వారిని గుర్తించి.. వైఎస్సార్సీపీ నాయకులని భావిస్తే వారిపై దాడులకు తెగబడ్డారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరుడు సూర నరసారావు ఏలూరు వెళుతుండగా నాగవరప్పాడు వంతెన వద్ద టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. తాను సమావేశానికి వెళ్లడం లేదని, వ్యక్తిగత పనిపై ఏలూరు వెళుతున్నానని చెప్పినా వినిపించుకోకుండా కారుపై దాడి చేసి అద్దాలు పగులగొట్టేయత్నం చేశారు. అరాచకానికి పరాకాష్టరాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలీసులను గుప్పిట్లో పెట్టుకుని, యథేచ్ఛగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ప్రశ్నించే గొంతుకలను నొక్కేస్తూ.. పౌర హక్కులను కాలరాస్తోంది. తమను ప్రశ్నించే వారే ఉండకూడదన్నట్లు తాలిబన్లను మరిపిస్తోంది. ఇందులో భాగంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనలను సైతం అడ్డుకుంటోంది. ఆయన కార్యక్రమాల్లో పాల్గొన్న వారిపై తప్పుడు కేసులు నమోదు చేస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలతో పాటు మిగతా హామీలన్నీ అమలు చేయాలన్న డిమాండ్ ప్రజల నుంచి రాకుండా ముందే భయభ్రాంతులకు గురి చేసేలా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోంది. ఈ కమ్రంలో ప్రజా సమస్యలు ఎత్తి చూపేందుకు ప్రజల్లో వెళ్తున్న వైఎస్ జగన్కు భద్రత కల్పించకుండా కుట్ర పూరితంగా వ్యవహరిస్తోంది. రైతులకు అండగా నిలిచేందుకు వైఎస్ జగన్ గుంటూరు మిర్చి యార్డు పర్యటన, టీడీపీ గూండాల చేతిలో హతమైన బీసీ నాయకుడు కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు ఉమ్మడి అనంతపురం జిల్లా రామగిరి మండల పర్యటనకు వెళ్లినప్పుడు అడ్డంకులు సృష్టించింది. ఇదే రీతిలో ప్రకాశం జిల్లా పొదిలిలో పొగాకు రైతులకు అండగా నిలిచేందుకు వెళ్లినప్పుడు, పల్నాడు జిల్లా సత్తెనపల్లెలో టీడీపీ గూండాల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న వైఎస్సార్సీపీ నాయకుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లినప్పుడు, నిన్నటికి నిన్న చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో మామిడి రైతులకు మద్దతు ధర కోసం గళం విప్పేందుకు వెళ్లినప్పుడు ఇదే తరహాలో అడ్డంకులు సృష్టించింది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న రైతులు, నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించింది. -
ఉప్పాల హారికను ఫోన్లో పరామర్శించిన వైఎస్ జగన్
సాక్షి, విజయవాడ: కృష్ణా జిల్లా జడ్పీ చైర్మన్ ఉప్పాల హారికను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్లో పరామర్శించారు. ఆమెతో మాట్లాడి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్న వైఎస్ జగన్.. బీసీ మహిళపై జరిగిన పాశవిక దాడిని ఆయన ఖండించారు. టీడీపీ, జనసేన మూకలు దాడి చేసిన విషయం పార్టీ నాయకులు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు.ఒక బీసీ మహిళ, జిల్లా ప్రథమ పౌరురాలు భయంతో వణికిపోయే పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయంటే ఇంతకంటే దారుణం ఉంటుందా? అంటూ ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో ప్రజాస్వామ్య హననం జరుగుతోందని, ఆటవిక పాలన సాగుతోందని వైఎస్ జగన్ మండిపడ్డారు. హారిక ధైర్యంగా ఉండాలని, పార్టీ అండగా ఉంటుందని ఆయన భరోసానిచ్చారు.బీసీ మహిళ, జడ్పీ ఛైర్మన్ ఉప్పాల హారికపై టీడీపీ, జనసేన గూండాల దాడికి పాల్పడ్డారు. ఆమె కారును చుట్టుముట్టి విచక్షణారహితంగా దాడికి దిగారు. వైఎస్సార్సీపీ సమావేశానికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.కృష్ణా జిల్లా జెడ్పీ ఛైర్పర్సన్ ఉప్పాల హారికపై టీడీపీ, జనసేన గూండాల దాడి అమానుషం అని వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి మండిపడ్డారు. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. టీడీపీ, జనసేన గూండాలు పట్టపగలే విచక్షణారహితంగా దాడికి పాల్పడడం దారుణమన్నారు. కూటమి పార్టీ కార్యకర్తలు ఉన్మాదంతో దాడి చేస్తున్నా.. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం దారుణం. రెడ్ బుక్ రాజ్యాంగంలో మహిళా ప్రజా ప్రతినిధికే రక్షణ లేదు. ఇక సామాన్య మహిళలకు ఈ ప్రభుత్వం ఏం రక్షణ ఇస్తుంది.?’’ అంటూ వరుదు కల్యాణి ప్రశ్నించారు...ఒక జిల్లా ప్రథమ పౌరురాలికే పోలీసులు రక్షణ కల్పించలేకపోవడం సిగ్గు చేటు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లు దీనికేం సమాధానం చెబుతారు?. మహిళా హోంమంత్రి అనిత ఎందుకు స్పందించడం లేదు?. ఈ అకృత్యాలకు కచ్చితంగా ప్రజా కోర్టులో తగిన గుణపాఠం చెప్పే రోజు త్వరలోనే ఉంది’’ అని వరుదు కళ్యాణి హెచ్చరించారు. -
జనసేన ఇంచార్జ్ డ్రైవర్ దారుణ హత్య.. గోడౌన్ లో చిత్రహింసలు పెట్టి..!
-
విజయనగరం జిల్లాలో జనసేన కార్యకర్తల తిరుగుబాటు
-
గుర్తుపెట్టుకోండి.. జక్కంపూడి గణేష్ కౌంటర్
-
కొవ్వూరు నియోజకవర్గ కూటమి పార్టీల్లో చీలిక
-
విశాఖ డ్రగ్స్ కేసులో కూటమి నేతలకు లింకులు
-
కూటమి పాలనపై జనసేన నేత తిరుగుబాటు
తిరువూరు: కూటమి ధర్మాన్ని విస్మరించి ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, ఆ పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని జనసేన నియోజకవర్గ కన్వినర్ మనుబోలు శ్రీనివాసరావు సామాజిక మాధ్యమాల్లో ధ్వజమెత్తారు. తిరువూరు నియోజకవర్గంలో కొందరు తనను నిత్యం బెదిరిస్తున్నారని, వారి బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. కూటమి ధర్మాన్ని విస్మరించి టీడీపీ ఏమి చేసినా భరించడానికి ఎవరూ సిద్ధంగా లేరని, కూటమి గెలుపు కోసం కృషిచేసిన వారిని అవినీతిపరులంటూ ముద్ర వేస్తున్నారని ఆరోపించారు.తనపై భౌతికదాడికి కూడా ఎమ్మెల్యే ప్రోత్సహించడం ఆశ్చర్యం కలిగిస్తోందని, కూటమిలో భాగస్వామ్యమైన జనసేనతో కనీసం సంప్రదించకుండా సుపరిపాలనకు తొలి అడుగు పేరుతో ఎమ్మెల్యే, టీడీపీ నాయకులు సొంత అజెండా రూపొందించుకోవడాన్ని ఖండించారు.నియోజకవర్గానికి మంజూరైన సీసీ రోడ్లలో కూటమి భాగస్వామ్య పార్టీలకు సంబంధం లేకుండా టీడీపీ నాయకులే కాంట్రాక్టు పనులు చేసుకుంటే పొత్తు ధర్మం ఎలా వర్తిస్తుందని ప్రశ్నించారు.చెరువుల్లో మట్టిని టీడీపీ నాయకులే పోటీపడి అమ్ముకోవడం, రేషన్ మాఫియా వద్ద నెలవారీ మామూళ్ళు వసూలు, జాతీయ ఉపాధిహామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ల నుంచి వసూళ్ళ పర్వం, విద్యుత్ సబ్స్టేషన్లలో కాంట్రాక్టు కార్మికుల నియామకానికి లక్షలాది రూపాయలు వసూలు చేయడం, తిరువూరులో గతంలో అక్రమ కట్టడంగా గుర్తించినది ఇప్పుడు సక్రమంగా ఎలా మారిందనే విషయాలపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని మనుబోలు చెప్పారు. ఏ కొండూరు మండలం గోపాలపురంలో మట్టి అక్రమ క్వారీ నిర్వహణపై కూడా ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
మీ అడుగులకు మడుగులొత్తలేం.. సైడైపోతున్న జనసేన, బీజేపీ
కూటమి ప్రభుత్వం ఏడాది పాలనతో హనీమూన్ పీరియడ్ ముగిసింది. ఎన్నికలకు ముందు అందరూ కలిసికట్టుగా ఉన్నామన్నట్లుగా కలరింగ్ ఇచ్చి తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు మూకుమ్మడిగా పోటీ చేసి అధికారాన్ని చేజిక్కించుకున్నాయి. పవర్ చేతిలోకి వచ్చాక ఎవరి చేతికి ఎక్కువ పవర్ దక్కిందన్న విషయంలో పార్టనర్ల మధ్య విభేదాలు అప్పుడప్పుడు బయటపడుతున్నప్పటికీ అంతా గుంభనగా ఉన్నట్లుగా మ్యానేజ్ చేస్తూ వస్తున్నారు.అన్నిటికి మించి పొత్తులకు ముందు ఓడ మల్లయ్య అని పిలిచే చంద్రబాబు ఎన్నికల్లో గెలిచాక బోడి మల్లయ్య అంటారన్న విషయం జనసేన, బీజేపీలకు మరో మరో అర్థమయింది. దీంతో ఇప్పుడు వాళ్లు నడి సముద్రంలో ఉన్నట్లుగా ఫీల్ అవుతూ ఓడలో నుంచి బయటకు రాలేక.. అందులోనే ప్రయాణం చేయలేక సతమతమవుతున్నారు. ఇదిలా ఉండగా ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు కాంట్రాక్టర్లు ఇతరత్రా వ్యవహారాల్లో కూడా తెలుగుదేశం వాళ్ళు జనసేన, బీజేపీ నాయకులను కేవలం పెయిడ్ కూలీలుగా మాత్రమే భావిస్తూ ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వడం లేదు.నీకు ఇవ్వాల్సిన కూలి డబ్బులు ఇచ్చేసాంగా ఎవరి కోసం మా జెండా మోస్తారు అన్నట్లుగా తెలుగుదేశం నాయకులు తీరు ఉంది. ఇదే తరుణంలో ప్రభుత్వంలో చంద్రబాబుకు బదులుగా లోకేష్ పెత్తనం పెరిగిపోవడం బీజేపీ, జనసేన నాయకులను తొక్కేస్తూ కేవలం టీడీపీ వారికి ప్రాధాన్యం ఇస్తూ వెళ్లడం కూడా భాగస్వామి పక్షాలైన ఈ రెండు పార్టీలకు ఇబ్బందికరంగా మారింది.లోపల సరుకు పుచ్చిపోయినా.. బయట మంచి కలరింగ్.. కవరింగ్ ఇచ్చేసి జనానికి అంటగట్టే వ్యాపారి మాదిరిగా చంద్రబాబు సైతం ఇటు తన ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వెలువెత్తుతున్న దాన్ని మీడియా ఇతర పబ్లిసిటీ సంస్థలు మాటున దాచిపెట్టి అంతా బాగుంది అన్నట్లుగా ప్రజలను భ్రమింపజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏడాది పాలన పూర్తి అయిన సందర్భంగా తొలి అడుగు అంటూ ఇంటింటికి తన ప్రభుత్వ విజయాన్ని ప్రచారం చేసేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారు.ఇందులో భాగంగా భాగస్వామి పక్షాలైన జనసేన, బీజేపీతో బాటు టీడీపీ నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు సైతం ఇంటింటికి వెళ్లి తమ ప్రభుత్వం చేసిన పథకాలు సాధించిన అభివృద్ధిని ప్రచారం చేస్తారు. అయితే చంద్రబాబు పాలనపై ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకత వెల్లువెత్తుతున్నట్లుగా సర్వేల్లో వెళ్లడవడం.. ఎంతసేపు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడం, తెలుగుదేశం నాయకుల అలవిమాలిన అవినీతి.. దందాలు.. గూండాగిరి వంటి అంశాల ద్వారా ప్రజల్లో ఘోరమైన అప్రదిష్టను ఏడాదిలోనే మూటగట్టుకుంది.దాదాపుగా యాభై మంది ఎమ్మెల్యేలు ఈ క్షణమే ఓడిపోతారని.. ఇంకా ఎంతోమంది ఓటమి అంచులో ఉన్నారని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో బాటు గెలిచిన తరువాత టీడీపీ నాయకుల్లో అహంకారం పెరగడం.. జనసేన, బీజేపీ నేతలను చిన్నచూపు చూస్తుండడం వంటి అంశాలు కూడా గ్రామ స్థాయిలో కూడా చర్చలకు కారణమవుతున్నట్లు.. ఇలాంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం చేపట్టిన తొలి అడుగు ప్రచార కార్యక్రమానికి జనసేన, బీజేపీ నాయకులు దూరంగా ఉంటున్నారు."మీ అవకాశవాదానికి ఒక దండం.. మీ అడుగులకు మేం మడుగులొత్తలేం" అంటూ చిన్నగా సైడ్ అయిపోతున్నారు. మంచి ప్రభుత్వం పేరిట చేపట్టని ఈ ప్రచారానికి కేవలం తెలుగుదేశం నాయకులు మాత్రమే హాజరవుతున్నారు. అక్కడక్కడ అరా ఒకటి తప్ప జనసేన-బీజేపీ నాయకుల హాజరు లేనేలేదు. కూటమి గెలవడానికి మా అవసరం ఉంది.. ఆ పొత్తు లేకపోతే చంద్రబాబు మళ్ళీ సీఎం అయ్యేనా అంటూ ఇటు జనసేన-బీజేపీ నాయకులు లోలోన భావిస్తున్నారు. అలాంటపుడు తమ నాయకులకు ప్రాధాన్యం ఇవ్వాల్సిందే కానీ అధికారం దక్కాక బాబు.. టీడీపీ నేతల తీరు మారిందని ఈ రెండు పార్టీలు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎక్కడా వీళ్లు ఆ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. దీంతో ఊసురో మంటూ కేవలం టీడీపీ నేతలు ఈ ప్రచారాన్ని చేపడుతున్నారు.-సిమ్మాదిరప్పన్న -
పవన్ నిన్ను నమ్ముకుంటే.. అడుక్కునే స్టేజికి తీసుకొచ్చావ్..
-
జనసేన కార్యకర్తనని చిన్నచూపా?
చిత్తూరు జిల్లా: ‘కూటమి ప్రభుత్వంలో జనసేన కార్యకర్తలను అసలు పట్టించుకోరా? బిడ్డకు లివర్ మార్పిడి సర్జరీ కోసం సీఎం చంద్రబాబును కలిసేందుకు సిఫార్సు లేఖపై సంతకం పెట్టమని ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డిని అడిగితే స్థానిక టీడీపీ నాయకుల మాటలు విని సంతకం పెట్టలేదు. నా బిడ్డ చనిపోయింది’ అంటూ చిత్తూరు జిల్లాలోని బైరెడ్డిపల్లి మండలం తీర్థం పంచాయతీ కైగల్ గ్రామానికి చెందిన శ్రీనివాసులు అనే జనసేన కార్యకర్త మృతి చెందిన బిడ్డ, లేఖ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది ఇప్పుడు వైరల్గా మారింది. అందులోని విషయం ఏమిటంటే... శ్రీనివాసులు జనసేన పార్టీ కార్యకర్త. కూలీ చేసుకునే ఇతనికి ముగ్గురు పిల్లలు. రెండో కుమార్తె సౌమ్యకు పచ్చకామెర్లు ముదిరి కాలేయం దెబ్బతింది. దీంతో పలు ఆసుపత్రుల్లో చికిత్సలు చేయించారు. అయితే వైద్యులు కాలేయ మార్పిడి చేయాలని, అందుకోసం రూ.30 లక్షల దాకా ఖర్చు అవుతుందని తెలిపారు. దీంతో సీఎం చంద్రబాబును కలిసి ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా సాయం పొందే అవకాశం ఉందని కొందరు చెప్పడంతో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి సిఫార్సు సంతకం కోసం వెళ్లగా ఆయన లోకల్ నాయకుల మాట విని సంతకం పెట్టలేదు. పరిస్థితి విషమించి ఈ నెల 24న ఆ పాప మృతి చెందింది. -
సింగిల్గా అయితే సీన్ సితారే
ఎవరెన్ని అనుకున్నారు.. భారీ మెజారిటీతో గెలిచాం అని లోలోన చంకలు గుద్దుకుంటున్నప్పటికి.. కూటమి నాయకులకు మాత్రం ఇంకా వైఎస్ జగన్ అంటే భయం పోలేదు. జగన్కు జనంలో ఉన్న మాస్ ఇమేజ్ కూటమి నాయకులకు నిద్రలేకుండా చేస్తుంది. జగన్ ఇల్లు దాటడం లేదని ఓవైపు అంటూనే ఆయన వీధిలోకి వస్తే జనసంద్రం ఎలా ఉంటుందో చూసి లోలోన టీడీపీ, జనసేన నాయకులు కుళ్ళు కుంటున్నారు.మొన్న ఏదో మూడు పార్టీల మధ్య పొత్తు కలిసి వచ్చి అలా గెలిచేసారు కానీ అన్ని సందర్భాల్లోనూ ఇదే ఫార్ములా వర్కౌట్ అవుతుందని చెప్పలేం అని సాక్షాత్తు కూటమి నాయకులే ఒప్పుకుంటున్నారు. ఓకే కాంబినేషన్తో మళ్లీ మళ్లీ వస్తే సినిమా హిట్ అవుతుందని గ్యారెంటీ లేదని వాళ్ళే అంగీకరిస్తున్నారు. అన్నిటికి మించి మూడు పార్టీల మధ్య పొత్తు ఉంటే తప్ప విడివిడిగా పోటీ చేస్తే వైఎస్ జగన్ అలవోకగా అధికారాన్ని చేపడతారని తెలుగుదేశానికి వంతపాడే మీడియా సంస్థలు కూడా అంగీకరిస్తున్నాయి.నిత్యం వైఎస్ జగన్ను ఆడిపోసుకునే ఓ చానల్లో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ ఒంటరిగా పోటీ చేస్తే కూటమికి చావు దెబ్బ తప్పదని అంగీకరించారు. మరోవైపు సూపర్ సిక్స్ హామీలు ఏవి అమలు చేయకుండా కేవలం మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా హైప్ తెచ్చుకొని తెచ్చుకొని అంతా బాగుందని చెప్పుకుంటాను కూటమి నాయకులకు.. దాని పెయిడ్ మీడియాకు కూడా సమాజంలో ఏం జరుగుతుందో అన్న విషయం స్పష్టంగా తెలుసు. ఎన్నికలకు ముందు నోటికి వచ్చిన హామీలు ఇచ్చి.. వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఏమాత్రం ఆధారాలు లేని అభాండాలు వేసి రకరకాల మాయలు చేసి గెలిచిన కూటమి నాయకులు ఇప్పటికే ప్రజల్లో చులకన అయ్యారు.హామీలు ఎగ్గొట్టడమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా దండాలు దోపిడీలు రౌడీయిజం ప్రతిపక్ష నాయకుల మీద దాడులు అరాచకం మినహా ఇంకేమీ పనులు చేయకపోవడంతో ప్రజలకు సైతం ప్రభుత్వం మీద అసహ్యం మొదలైంది. మొదటి ఏడాదిలోనే ఇంత వెగటు పుడితే రానున్న నాలుగేళ్లలో ఇది మరింత ముదిరి కూటమి నాయకులను తన్ని తరిమేసే పరిస్థితికి వస్తుందని వారికి అర్థమైంది. ఒకసారంటే వీరి మాటలు ప్రజలు నమ్మారు కానీ మళ్ళీ మళ్ళీ అవే హామీలు అవే మోసకారి మాటలు చెబితే ప్రజలు నమ్మి నెత్తిన పెట్టుకోరు అనే విషయం కూటమి నాయకులతో పాటు ఆ మీడియాకు సైతం ఎప్పటికే అర్థమైంది.అంతేకాకుండా ఇటీవల పలు ప్రైవేట్ సంస్థలు చేసిన సర్వేల్లో కూడా దాదాపుగా 50 శాతం మంది ఎమ్మెల్యేలకు రెండోసారి గెలిచే అవకాశం లేదని తేలడంతో వారు ఇప్పుడు బిత్తిరి చూపులు చూస్తున్నారు. ఏదైతేనేం ఉన్న ఈ నాలుగేళ్లు ఉన్న కాడికి దండుకుందాం అనే టార్గెట్తో చాలామంది ఎమ్మెల్యేలు సహజం వనరులతో పాటు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దందా చేస్తూ సొమ్ములు వెనకేస్తున్నారు.ఈ పరిస్థితి కూడా కూటమి మీడియాకు తెలుసు.. అందుకే తాజాగా జరిగిన డిబేట్లో ఓ యాంకర్ సైతం ఇదే విషయాన్ని చెప్పలేక చెప్పలేక కుమిలిపోతూ చెప్పారు. కూటమి పొత్తులో లేకపోతే వైఎస్ జగన్ నిలువరించడం అసాధ్యం అని యాంకర్తో పాటు రఘురాం కృష్ణంరాజు సైతం అంగీకరించారు. ఏడాదిలోనే వారి పాలనపై వారికే నమ్మకం కోల్పోవడంతో.. ప్రజల ఇప్పుడు వైఎస్ జగన్పై దృష్టిసారించారు. ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజలకు మరింత వివరించి వారి మద్దతు కూడగట్టుకునేందుకు వైఎస్సార్సీపీ శ్రేణులు కూడా సమాయత్తం అవుతున్నాయి..* సిమ్మాదిరప్పన్న -
రాసిపెట్టుకో... ప్రజలు కన్నెర్ర చేసే రోజు దగ్గరలోనే ఉంది
అవనిగడ్డ: కూటమి ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్, ఆయన కుటుంబ సభ్యుల తీరుపై స్థానిక టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నియోజకవర్గంలో టీడీపీని లేకుండా చేయాలనే కుట్రలను సాగనివ్వమని హెచ్చరించారు. ‘‘మీరు ఏం చేసినా ఊరుకుంటారను కుంటున్నారేమో.. ప్రజలు కన్నెర్ర జేస్తారు.. తిరగబడే రోజు దగ్గరలోనే ఉంది’’ అంటూ స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చారు. కోడూరు మండలంలో 13 పంచాయతీల టీడీపీ గ్రామకమిటీ ఎన్నికల తీరుపై గురువారం ప్రత్యేక సమావేశం జరిగింది. కోడూరు మండల సంస్థాగత ఎన్నికల పరిశీలకుడు బత్తిన దాస్ ఈ కార్యక్రమానికి విచ్చేయగా ఆయన ముందే ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ తీరుపై తెలుగు తమ్ముళ్లు తీవ్రస్థాయిలో మండి పడడం గమనార్హం.అధికారంలో ఉన్నా ఏం చేయలేకపోతున్నాం: టీడీపీ మండల అధ్యక్షుడు బండే శ్రీనివాసరావుపార్టీ అధికారంలో ఉన్నా నియోజకవర్గంలో ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నామని టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు, మాజీ జెడ్పీటీసీ బండే శ్రీనివాస రావు సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో టీడీపీని లేకుండా చేయాలని చూస్తున్నారని, అది ఎన్నటికీ జరగదని, పార్టీని కాపాడుకునేందుకు ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉన్నారని అన్నారు. పనుల కోసం ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లి లెటర్ ఇవ్వమంటే ఇవ్వరని, పదవుల్లో టీడీపీ, జనసేనకు ఫిప్టీ ఫిప్టీ అనే సూత్రాన్ని పాటించడం లేదని, గ్రామాల్లో ఒక్క కార్యకర్తకు పనిచేయలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మండ లంలో మొత్తం 70 సీసీ రోడ్లు వేస్తే ఒక్క రోడ్డు కూడా టీడీపీ నాయకుడు, కార్యకర్తకు ఇవ్వలేదని, ఇదేం న్యాయమని నిలదీశారు. అవసరమైతే మన సమస్యలు చెప్పుకునేందుకు చంద్రబాబు దగ్గరకో, లోకేష్ దగ్గరకో వెళదామని, పనిచేసే కార్యకర్తకు న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత పార్టీపై ఉందన్నారు. మండల స్థాయి నుంచి సచివాలయ స్థాయి వరకూ జరిగే బదిలీలన్నీ ఎమ్మెల్యే కుటుంబ కనుసన్నల్లోనే జరుగుతున్నాయన్నారు.రాజాబాబు ఏమన్నా తోపా? ఏదైనా అంటే జనసేన నాయకుడు రాజా బాబుకు చెబుతామంటున్నారని, రాజా బాబు ఏమన్నా తోపా అని వి.కొత్తపాలెంకు చెందిన ఓ టీడీపీ నాయకుడు మండిపడ్డారు. తామందరం లేకుండా రాజాబాబు వచ్చారా... ఎన్నికలప్పుడు కాళ్లూ, గడ్డాలు పట్టుకున్నారని, మీరు లేకపోతే దిక్కులేదన్నారని, అప్పుడేమో ఇళ్లకు వచ్చి బతిమ లాడారని.. ఇప్పుడేమో లెక్కచేయడం లేదని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ తనయుడు రాజా, అల్లుడు అశ్విని కుమార్ని ఉద్దేశించి ఓ టీడీపీ నేత ఆగ్రహం వ్యక్తం చేశారు.రాసిపెట్టుకో... ప్రజలు కన్నెర్ర చేసే రోజు దగ్గరలోనే ఉందిముసుగులు వేసుకునే నాయకుడు ఒక్కో ముసుగు తీసి పార్టీలు మారుతున్నాడని, మీ ఇష్టానుసారంగా మాట్లాడితే ఎదురు చెప్పేవారు లేరనుకుంటున్నారా అంటూ బడేవారిపాలెంకు చెందిన ఓ సీనియర్ టీడీపీ నేత తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడున్న కార్యకర్త లెవరికీ న్యాయం జరగడం లేదని, ప్రతిపక్షంలో ఉన్నామో, అధికార పక్షంలో ఉన్నామో అర్ధంకాని దుస్ధితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు పనులు చేసే ఎమ్మార్వోలు, అధికారులు, పోలీసులను ఎమ్మెల్యే బదిలీ చేయిస్తున్నారని, మీరు చేసే దురాగాతాలను రాసిపెట్టుకోవాలని, ప్రజలు కన్నెర్ర జేసే రోజు దగ్గరలోనే ఉందని ఎమ్మెల్యే, ఆయన కుటుంబ సభ్యులను హెచ్చరించారు.కంగుతిన్న పరిశీలకుడు బత్తిన...స్థానిక జనసేన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్పై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడటంతో సమావేశానికి విచ్చేసిన మండల పరిశీలకుడు బత్తిన దాసు కంగుతిన్నారు. మండలంలో ఉన్న ఈ పరిస్థితిని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళతానని చెప్పి బుజ్జగించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా స్థానిక ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్, ఆయన కుటుంబ సభ్యులపై టీడీపీ నేతలు మండిపడ్డ తీరు కూటమి పార్టీలు జనసేన, టీడీపీ మధ్య మరింత అగ్గి రాజేసినట్టయింది. -
తిరుపతిలో జనసేన కార్పొరేటర్ అరాచకాలు
-
బూతులతో రెచ్చిపోయిన జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి
-
రెచ్చిపోయిన జనసేన ఎమ్మెల్యే..
రాజానగరం: తూర్పు గోదావరి జిల్లా రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఓ కార్యకర్తపై పచ్చి బూతులతో విరుచుకుపడ్డారు. దీనికి సంబంధించిన ఆడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. చెరువుల తవ్వకం విషయమై తన వద్దకు వచ్చిన ఒక కార్యకర్తపై ఎమ్మెల్యే బలరామకృష్ణ తీవ్రస్థాయిలో దుర్భాలాడారు.ఈ ఘటనను అదే పార్టీకి చెందిన మరో కార్యకర్త తన సెల్ఫోన్లో రికార్డు చేసి, సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. ‘జన సైనికుడిపై జనసేన ఎమ్మెల్యే బూతు పురాణం’ పేరిట ఆ ఆడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ‘నువ్వెంత పోటుగాడివిరా.. ఎక్కువ మాట్లాడకు.. నువ్వెందుకు దెం.. దెం.. యి,’ వంటి బూతులతో పాటు ఇంకా ఘాటైన పదాలతో దూషించినట్లు ఆడియో ఉంది.నీతి, న్యాయం, ధర్మం గురించి డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్కళ్యాణ్ తెగనీతులు చెబుతుంటారని.. ఇప్పుడు బూతులతో రెచ్చిపోయిన తన పార్టీ ఎమ్మెల్యేపై ఆయన ఇప్పుడేమంటారని పలువురు ఘాటువ్యాఖ్యలు చేస్తున్నారు. -
నువ్వు బలిజవి.. కమ్మోళ్లకే ఉద్యోగం
శ్రీరంగరాజపురం: కూటమి నేతలు చిరుద్యోగులపైనా కక్ష సాధిస్తున్నారు. దీంతో సోమవారం చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురం మండలంలో ఫీల్డ్ అసిస్టెంట్ వెంకటేష్ విషం సీసాతో వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ‘‘నా చావుకు ఎంపీడీవోనే కారణం’’ అని ఆరోపించాడు. వివరాలు అతడి మాటల్లోనే.. ‘‘నేను శ్రీరంగరాజు మండలం ఎగువ కమ్మకండ్రిగ పంచాయతీ ఫీల్డ్ అసిస్టెంట్గా 2016 నుంచి పనిచేస్తున్నాను. కూటమి ప్రభుత్వం వచి్చన రోజు నుంచి నన్ను వేధిస్తున్నారు. జనసేన పార్టీ బ్యానర్లో నా భార్య సుబ్బలక్ష్మి ఫొటో వేయడంతో లేనిపోని ఆరోపణలతో నన్ను ఫీల్డ్ అసిస్టెంట్గా తొలగించేలా చేశారు. నేను బలిజ సామాజిక వర్గానికి చెందినవాడిని. ఉద్యోగ భద్రత కలి్పంచాలని అడిగితే కులం పేరుతో అవమానించారు. కమ్మ కులస్తులకే ఉద్యోగం ఉస్తామని చెప్పడంతో హైకోర్టును ఆశ్రయించా. నాకు అనుకులంగా తీర్పు వచ్చింది. ఎంపీడీఓ నాపై తప్పుడు నివేదికలు సమరి్పంచారు. నాకు ఉద్యోగ భద్రత కలి్పంచకుంటే ఆత్మహత్య చేసుకుంటా’’ అంటూ ట్యాంక్ ఎక్కాడు. పోలీసులు, తహసీల్దార్, ఎంపీడీవో ఘటనా స్థలానికి చేరుకుని ఉద్యోగ భద్రత కలి్పస్తామని హామీ ఇవ్వడంతో కిందికి దిగొచ్చాడు. కాగా, తన భర్తకు ఏమైనా జరిగితే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటామని వెంకటేష్ భార్య సుబ్బలక్ష్మి హెచ్చరించారు. చిన్న ఉద్యోగమే తమ కుటుంబానికి ఆధారమని, కొన్నాళ్లుగా టీడీపీ నాయకులు, అధికారుల వేధింపులు తీవ్రంగా ఉన్నాయని తెలిపింది. ‘‘మేం ఏం పాపం చేశాం..? ఎందుకు మాపై ఇంత కక్ష?’’ అంటూ కన్నీరు పెట్టుకుంది. -
జనసేనలో ‘మట్టి’ కుస్తీ
పిఠాపురం: వరుస వివాదాలతో కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని జనసేన నాయకులు పరువు తీసుకుంటున్నారు. శనివారం ఇసుక వివాదం సద్దుమణగక ముందే ఆదివారం చెరువు మట్టి కోసం జనసేనలోని రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి. ఈ ఘర్షణలో తమపై దాడి చేశారని విరవ గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ కురుమళ్ళ రాంబాబు పిఠాపురం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలివీ.. రైతుల అవసరాల పేరుతో ఎఫ్కే పాలెం – విరవాడ గ్రామాల మధ్య పాపిడిదొడ్డి చెరువులో మట్టి తవ్వకాలకు అధికారుల నుంచి జనసేన నాయకులు అనుమతులు పొందారు. చెరువులోని మట్టిని మండలంలోని పలు ఇటుక బట్టీలకు విక్రయిస్తున్నారు. మట్టి తరలింపులో కొన్ని బట్టీలకే ప్రాధాన్యం ఇస్తున్నారని, మిగిలిన వారికి ఇవ్వడం లేదని జనసేన నేత కురుమళ్ళ రాంబాబు ఆరోపించారు. చెరువులో మట్టి తవ్వకాలను పరిశీలించేందుకు ఆదివారం వెళ్లిన ఆయన మట్టి తరలింపు చేపడుతున్న వారిని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో మట్టి తవ్వకందారులు రాంబాబుతోపాటు సకుమళ్ళ నాగేశ్వరరావు, కురుమళ్ళ మణికంఠ స్వామి, ఆకుల ఆదినారాయణలపై దాడికి పాల్పడ్డారు. రాంబాబు చొక్కా చించివేశారు. కొందరికి గాయాలయ్యాయి. దీంతో కురుమళ్ళ రాంబాబు తదితరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమపై దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వారిని వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు ప్రభుత్వాస్పత్రికి పంపించారు. పేట్రేగిపోతున్న మట్టి మాఫియాపై అధికారులు, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
పవన్కు ఝలక్.. జనసేన నేతల దందాపై వర్మ సెటైర్లు
సాక్షి, కాకినాడ: ఏపీ డిప్యూటీ సీఎం ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో యథేచ్ఛగా జనసేన నేతలు ఇసుక దందా చేస్తున్నారు. తాజాగా ఇసుక దందాను టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ సాక్ష్యాలతో సహా బయటపెట్టారు. దీంతో జనసేన, టీడీపీ మధ్య రాజకీయం ఆసక్తికరంగా మారింది. పవన్ కళ్యాణ్ ఇలాకా పిఠాపురంలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. ఈ నేపథ్యంలో ఇసుక మాఫియాపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ సంచలన ఆరోపణలు చేశారు. తాజాగా మల్లివారితోటలో ఇసుక అక్రమ తవ్వకాలను వర్మ పరిశీలించారు. అనంతరం, వర్మ మీడియాతో మాట్లాడుతూ.. రాత్రి కాగానే పిఠాపురం పోలీసులకు రేచీకటి వస్తోంది. పిఠాపురం పోలీసులకు స్పెషల్ గ్లాసెస్ ఇవ్వాలి. అనుమతులు లేకుండా ఇసుక తవ్వుతున్నారు. పోలీసులు మాఫియాతో కుమ్మక్కైపోయినట్టున్నారు. రోజుకు 200 నుండి 300 లారీల ఇసుక వెళ్లిపోతుంది. రాత్రుళ్లు ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది. ఇసుక రవాణా కనిపించడం లేదంటే వాళ్లకు కావాల్సిన మామూళ్లు వస్తున్నాయి. పోలీసులు ముందే సమాచారం ఇచ్చి సర్దుకోమంటున్నారు. ఇక్కడ దొంగతనం జరుగుతుందని చెప్పినా పట్టించుకోవడం లేదు. 20 రోజులుగా పోలీసులకు చెప్పినా పట్టించుకోలేదు. రమణక్కపేటలో అక్రమ రవాణాకు మరో శంకుస్థాపన చేశారు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
అవకాశవాదమే పవన్ సిద్ధాంతం!
భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ ద్వారా తనదైన రాజకీయ క్రీడ సాగిస్తోందా? కొంతకాలం క్రితం తమిళనాడు పర్యటన సందర్భంగా పవన్కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే.. అవుననే అనిపిస్తోంది. బీజేపీ అవసరాలకు తగ్గట్టుగా మాట్లాడేందుకు పవన్ సిద్ధంగా ఉన్నట్లు స్పష్టమవుతుంది. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో తన రాజకీయ అవసరాల కోసం ఒక సామాజిక వర్గాన్ని ఎలా వాడుకున్నారో అందరూ చూశారు. ఈ అవకాశవాదాన్నే బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకునేందుకు పావులు కదుపుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కరుణ తనపై ఉంటే రాజకీయాల్లో ఢోకా ఉండదన్న ధీమాతో పవన్ అనుకుంటున్నారు. అలాగే తమిళనాట పవన్ సినిమా గ్లామర్ తనకు ఓట్లు తెచ్చిపెడుతుందని బీజేపీ కూడా భావిస్తోంది. అన్నాడీఎంకేతో పెట్టుకున్న పొత్తుతో తమిళనాడులో పాగా వేయాలన్నది బీజేపీ ఎత్తుగడ. పవన్ కళ్యాణ్ బీజేపీ అజెండాను భుజాన వేసుకుని తిరుగుతుండడం చూస్తుంటే, భవిష్యత్తులో ఏపీలో కూడా ఈ రెండు పార్టీలు కలిసి కొత్త ప్లాన్ అమలు చేస్తాయా అన్న సందేహం కలుగుతుంది. గత అనుభవాల రీత్యా టీడీపీ రాష్ట్రంలో బీజేపీను అంటిపెట్టుకుని ఉండడానికే ప్రాధాన్యత ఇవ్వవచ్చు. అయినా వచ్చే కాలంలో బీజేపీ, జనసేనలు ఏపీలో కూడా సొంత అజెండాతో ముందుకు వచ్చి టీడీపీని వెనక్కి నెట్టినా ఆశ్చర్యం ఉండకపోవచ్చు. ప్రస్తుతానికి దీనికి ప్రాతిపదిక కనిపించక పోవచ్చు. కానీ రాజకీయాలలో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. పవన్ కళ్యాణ్ కొద్ది రోజుల క్రితం చెన్నై వెళ్లి జమిలి ఎన్నికలపై మాట్లాడి వచ్చారు. దేశ అభివృద్ధి, ఆర్థిక వ్యవస్థ బాగుకు జమిలి ఎన్నికలు ఉపయోగపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఓకే కానీ.. పవన్ గతంలో దీనికి పూర్తి వ్యతిరేక భావజాలమున్న పార్టీలతో కలిసి పనిచేశారు. ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జమిలి ఎన్నికలపై ఒకసారి మంచిదని.. ఇంకోసారి అవి మోడీ నియంతృత్వ ఆలోచన అని వ్యాఖ్యానించారు. ప్రజలు వీటిలో దేన్ని నమ్మాలి? ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉన్నారు కనుక వారి భావజాలానికి మద్దతు ఇస్తున్నారు. గతంలో పవన్, చంద్రబాబు అనేక పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. పవన్ 2019లో కమ్యూనిస్టులు, బీఎస్పీలతో కలిసి పోటీ చేశారు. ఆ పార్టీలు బీజేపీ సిద్దాంతాలకు పూర్తి వ్యతిరేకం. జమిలి ఎన్నికలు దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరమని, రాష్ట్రాల హక్కులను హరించడానికే ఈ ప్రతిపాదన అని కమ్యూనిస్టులు విమర్శిస్తుంటారు. అప్పుడు ఆ పార్టీలతో కలిసి పోటీచేసి ఓడిపోయిన తర్వాత మొత్తం ప్లేట్ తిప్పేసి పవన్ కళ్యాణ్ బీజేపీని బతిమలాడుకుని వారితో కలిశారు. సినీ నటుడు కనుక ఎందుకైనా పనికి వస్తారులే అని బీజేపీ కూడా ఓకే చేసింది. చంద్రబాబు నాయుడు అయితే జమిలి ఎన్నికలు మంచిదేనని 2004 కి ముందు బీజేపీతో కలిసి ఉన్నప్పుడు అనేవారు. ఆ తర్వాత కాలంలో ఆయన కూడా కమ్యూనిస్టులతోను, టీఆర్ఎస్తోను జత కట్టారు.అప్పుడు ఫలితం దక్కకపోవడంతో తిరిగి బీజేపీ చెంతకు చేరారు. 2014లో అధికారంలోకి వచ్చినా, 2018 నాటికి బీజేపీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు.ఆ సమయంలో ప్రధాని మోడీని వ్యక్తిగతంగా దూషించడమే కాకుండా, బీజేపీ విధానాలన్నిటిని తీవ్రంగా దుయ్యబట్టేవారు. ఆ క్రమంలో కాంగ్రెస్,తదితర బీజేపీ వ్యతిరేక పార్టీలతో కలిసి జమిలి ఎన్నికలను కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. తాజాగా పవన్ కళ్యాణ్ సనాతన రాగం ఆలపించారు. పశ్చిమ బెంగాల్ లో షర్మిష్ట అనే యూట్యూబర్ను అక్కడి ప్రభుత్వం అరెస్టు చేయడంపై ఆయన విమర్శలు చేశారు. ఈ సందర్భంగా సనాతన ధర్మం గురించి మళ్లీ ప్రస్తావించారు. ఏపీలో సోషల్ మీడియాపై ప్రభుత్వం దాడులు చేస్తుంటే పవన్ ఎన్నడూ పట్టించుకోలేదు. తిరుమల లడ్డూపై అపచారపు మాటలతో సహా అనేక సందర్భాలలో పవన్ కళ్యాణే సనాతన ధర్మం కాదు కదా.. అసలు ధర్మమే పాటించలేదన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు వేరే రాష్ట్రంలో సనాతనం గురించి మాట్లాడుతున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు ఒక సిద్దాంతం అంటూ ఏమీ లేదు. అవకాశవాదమే తమ సిద్దాంతంగా వీరు మలచుకుని రాజకీయాలు చేస్తూ కొంత సఫలం అయ్యారు. ఈ నేపథ్యంలో పవన్కు ఏవో కొత్త ఆశలు కలిగి ఉండాలి. ప్రధాని మోడీ ఈయనకు పిలిచి మరీ చాక్ లెట్ ఇచ్చిన ఉత్సాహం ఎటూ ఉంది. దాంతో ఆయన తమిళనాడు వెళ్లి డీఎంకేకి వ్యతిరేకంగా ప్రచారం ఆరంభించారు. జమిలి ఎన్నికలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ మద్దతు ఇవ్వాలని కోరారు. కరుణానిధి జమిలిని సపోర్టు చేశారని, ఇప్పుడు అందుకు విరుద్దంగా ఆయన కుమారుడు ఎలా వెళతారని పవన్ ప్రశ్నించడం ఆశ్చర్యమే. అందుకే పవన్ పై సోషల్ మీడియాలో పలు వ్యాఖ్యానాలు వచ్చాయి. తన తండ్రి కమ్యూనిస్టు ని పవనే చెప్పారు. అలాంటప్పుడు ఇప్పుడు బీజేపీతో ఎలా స్నేహం చేస్తున్నారని కొందరు విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. అలాగే తన సోదరుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తే,ఆయనను గౌరవించి ఎందుకు ఆ పార్టీలో చేరలేదని మరొకరు ప్రశ్నించారు. స్టాలిన్ ను విమర్శించే ముందు తను చేసిందేమిటో గుర్తుంచుకోవాలని అన్నారు. అయితే తమిళనాడు ప్రజలకు ఈ విషయాలు పెద్దగా తెలియకపోవచ్చన్నది ఆయన విశ్వాసం కావచ్చు. అలాగే ఈవీఎంల గురించి పవన్ మాట్లాడడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. 2019లో ఈవీఎంల వల్ల కూడా వైసీపీ గెలిచి ఉండవచ్చని చెప్పిన ఈయన 2024లో మాత్రం ఈవీఎంలను సమర్ధిస్తూ వ్యాఖ్యలు చేశారు. బహుశా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల మాదిరి మాటలు మార్చిన వారు ,ఎప్పుడు ఏది అవసరమైతే దానిని మాట్లాడేవారు దేశ రాజకీయాలలో మరొకరు ఉండకపోవచ్చు. జమిలి ఎన్నికలకు సంబంధించి బీజేపీ ఇచ్చిన స్క్రిప్ట్ మొత్తం చదివినట్లు అనిపిస్తుంది. మీడియాతో మాట్లాడుతూ తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని చెప్పారు. ఆ విషయం వేరే చెప్పనవసరం లేదు. అదే సందర్భంలో సనాతన ధర్మంపై అడిగిన ప్రశ్నకు ఈ భూమి సనాతన ధర్మానిది అని, భారతీయ సంస్కృతిలోనే ఉందని ఆయన అన్నారు. వినడానికి, చెప్పడానికే బాగానే ఉంటుంది. కాని ఆచరణలో పవన్ ధర్మంగా ఉంటున్నారా అన్న ప్రశ్న వస్తుంది. సడన్ గా సనాతని వేషం దాల్చి తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసిందన్న అపచారపు మాటలు ,అబద్దాలు చెప్పాలని ఏ ధర్మం చెబుతుందో ఆయనకే తెలియాలి. కులం, మతం అన్ని విషయాలలో పవన్ ఎన్ని అసత్యాలు చెప్పారో పలు వీడియోలు తెలియ చేస్తాయి. కొందరు ఇస్లాం, క్రిస్టియానిటిపై దాడి చేయరట. హిందూ మతంపైనే దాడి చేస్తారట. ఎల్లో మీడియాలోనే ఈ కథనం వచ్చింది. ఇది చదివితే ఏమనిపిస్తుంది.అన్ని మతాలు సమానం.. ఎవరూ ఎవరిపై దాడి చేయవద్దని చెప్పవలసిన ఉప ముఖ్యమంత్రి అచ్చంగా బీజేపీ భాషను అరువుకు తీసుకుని మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. కొద్ది రోజుల క్రితం కావలిలో జరిగిన ఒక కార్యక్రమంలో ఎంతకాలం సహిస్తాం...హిందువులకు ఉన్నది ఒకటే దేశం..అదే ముస్లింలపై దాడి జరిగితే ఊరుకుంటారా..అంటూ యుద్దం చేయాలన్నట్లుగా మాట్లాడిన ఆయన, తదుపరి ఒకటి,రెండు రోజులకే ఏమని అన్నారు.. భారతదేశం శాంతి కోరుకుంటుంది.. సంయమనంగా ఉంటుంది..అని మాట మార్చేశారే. పనిలో పని ఆయన 1985, 1986 ప్రాంతంలో కశ్మీర్లో షూటింగ్ లలోపాల్గొన్నట్లు ఏదో కూడా చెప్పారు కదా! దీనిపై సోషల్ మీడియాలో వ్యంగ్యంగా వచ్చిన వార్తలు చూస్తే నవ్వు వస్తుంది. పవన్ కళ్యాణ్ పుట్టింది 1971లో అయితే 15 ఏళ్లకే ఎప్పుడు సినిమాలలో నటించారని నెటిజన్లు ప్రశ్నించారు. ఇలా అనేక విషయాలలో రెండు నాలుకల దోరణి అవలంభించే పవన్ కళ్యాణ్ కు పెద్దగా సిద్దాంత, రాద్దాంతాల పని ఉండదన్న భావనతో బీజేపీ ఈయనను తన గేమ్ లో ఒక పావుగా మార్చుకుని ప్రచారానికి వాడుకున్నట్లు ఉంది.ఆంధ్ర ప్రజల మాదిరి తమిళ ప్రజలు ఈ మాటలకు బోల్తా పడతారా! -కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
పిఠాపురంలో తన్నుకున్న టీడీపీ - జనసేన కార్యకర్తలు
-
పవన్ నియోజవర్గంలో టీడీపీ, జనసేన బాహాబాహీ
పిఠాపురం: టీడీపీ, జనసేనలు పొత్తు పరంగా కలిసి ఉన్నా, కార్యకర్తల దగ్గరకు వచ్చే సరికి ఆ రెండు పార్టీల మధ్య సఖ్యత లేదనేది మరోసారి బయటపడింది. ఈరోజు(ఆదివారం, జూన్1) డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో టీడీపీ, జనసేన మధ్య రగడ చోటు చేసుకుంది. పిఠాపురం మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రమాణ స్వీకారంలో టీడీపీ, జనసేన శ్రేణులు రెచ్చిపోయి మరీ ఒకరిపై ఒకరు వాగ్వాదానికి దిగారు.పిఠాపురం జనసేన ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ సమక్షంలోనే ఇరు పార్టీల విభేదాలు బహిర్గతమయ్యాయి. ఆ కార్యాక్రమానికి హాజరైన రెండు పార్టీల శ్రేణులు పోటా పోటీగా నినాదాలు చేసుకున్నారు. జై జనసేన, జై టీడీపీ అంటూ ఇరు వర్గాల నినాదాలు చేసుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఇరు పార్టీల కార్యకర్తల్లో సఖ్యత అనేది లేకపోవడంతో ఏ కార్యక్రమం జరిగినా అక్కడ పరిస్థితులు గందరగోళానికి దారి తీసిన సందర్బాల్లో తరచు జరుగుతూనే ఉన్నాయి. ఇదీ చదవండి: పొత్తుపై పవన్ పునరాలోచన!.. వైరాగ్యమా.. వికారమా!! -
పొత్తుపై పవన్ పునరాలోచన!.. వైరాగ్యమా.. వికారమా!!
పవన్ కళ్యాణ్కు అధికారం సంపాదించడంలో ఉన్నంత ఆరాటం.. నేడు ప్రజల కోసం చేస్తున్న పోరాటంలో కనిపించడంలేదు.. ఏదో చేసేద్దాం అనుకుని వచ్చాను.. ఏమీ చేయలేకపోతున్నానంటున్నారు. తనకు జ్ఞనోదయం అయిందా?. విషయం అవగతమైందా?. చంద్రబాబు నీడలో తన ఉనికి తనకే కనిపించక కళ్లు మసకలు.. బైర్లు కుమ్ముతున్నాయా తెలియని పరిస్థితుల్లో పవన్ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన తనలోని నైరాశ్యాన్ని నిర్వేదాన్ని వెళ్లగక్కారు..వాస్తవానికి ఆయన ప్రభుత్వ పరంగా డిప్యూటీ సీఎం అయినప్పటికీ ఆయనకు ప్రభుత్వ నిర్ణయాలు.. పాలసీలతో సంబంధం లేకుండా పోతోంది. ఎంతసేపు లోకేష్ను ఎలివేట్ చేసి రేపు ఆయన్ను సీఎంగా తీర్చిదిద్దే పనిలో ఉన్న చంద్రబాబు పవన్ను జస్ట్ పెయిడ్ రౌడీ మాదిరిగా మాత్రమే వాడుకుంటూ పక్కన పెట్టేస్తున్నారు. అంటే పాత సినిమాల్లో సత్యనారాయణ జస్ట్ ఇలా చప్పట్లు కొట్టి జగ్గూ అనగానే పెద్ద కండలతో ఒక రౌడీ వచ్చి హీరో మీద దాడి చేస్తాడు కదా.. ఆ టైప్ పాత్రకు తనను వాడుకుంటున్నట్లు పవన్ గ్రహించారు.ప్రభుత్వానికి ఇబ్బంది కలిగే పరిణామాలు ఎదురైనప్పుడు మాత్రమే తనను వాడుకుని ఆ తర్వాత పక్కన పెట్టేస్తున్న విషయం పవన్ గ్రహించారు.. అందుకే తన అసంతృప్తిని తాజాగా వెళ్లగక్కారు. తన 15 ఏళ్ల పాటు పొత్తులో ఉందామని అనుకున్నాను కానీ పరిస్థితులు చూస్తుంటే మాట మార్చాల్సి వచ్చేలా ఉందని చెప్పేశారు. రాష్ట్రంలో క్రైమ్ పెరిగిపోతుందని అంటూ అధికారులు ఇంకా ప్రభుత్వానికి సహకరించడం లేదని పవన్ నిందారోపణ చేశారు. వాస్తవానికి రాష్ట్రంలో అధికారం మొత్తం చంద్రబాబు.. లోకేష్ చేతిలో మాత్రమే ఉంది వారు చెప్తే తప్ప పూచిక పుల్ల కూడా కదలని పరిస్థితి.ఆఖరికి తన పంచాయతీరాజ్ అటవీ శాఖల్లో కూడా పవన్ కళ్యాణ్ ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉంది. లోకేష్ చెబితే తప్ప పవన్ శాఖలో కూడా ఏమీ జరగడం లేదు. అంటే కేవలం తన ఇమేజ్ ద్వారా ఓట్లు కొల్లగొట్టిన చంద్రబాబు ఇప్పుడు తన కొడుకు లోకేష్ రాజకీయ భవిష్యత్తుకు పాటలు వేస్తున్నారు తప్ప తనకు ఏ రకమైన గౌరవ మర్యాదలు రాజకీయ ప్రాధాన్యం దక్కనివ్వడం లేదని పవన్ కళ్యాణ్ ఎప్పటికీ తన అంతరంగికుల వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తుంది. తనను కేవలం ఓట్ల తెచ్చే యంత్రంగా వాడుకొని ఇప్పుడునట్లు లూజ్ చేసి పక్కన పడేస్తున్నారు అని పవన్ గ్రహించారు. అందుకే పొత్తుల విషయమై ఆయన బరస్ట్ అయినట్లుగా తెలుస్తుంది.దీంతోపాటు రాష్ట్రంలో ఎక్కడ చూసినా తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఆగడాలు రౌడీయిజం కూడా పవన్లో ఆగ్రహానికి కారణమైంది. రాజకీయ హత్యలు. అత్యాచారాలు సాధారణమైనాయి.. ఉద్యోగుల పట్ల కూడా తెలుగుదేశం నాయకులు అమర్యాదగా ప్రవర్తిస్తూ ప్రభుత్వాన్ని డిఫెన్స్లో పడేస్తున్నారు. వాస్తవానికి అధికరణకు వచ్చిన కొత్తల్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తాను కక్ష పూర్తి రాజకీయాలు చేయబోనని.. వైఎస్ఆర్సిపి కార్యకర్తలపై దాడులకు తాను వ్యతిరేకం అని చెప్పారు. కానీ నేడు జరుగుతున్నది దానికి విరుద్ధంగా ఉన్నది. పల్లెలు పట్టణాలు గ్రామాల్లో తెలుగుదేశం నాయకులు పూర్తిగా ఆధిపత్యం సాధించే దిశగా వెళుతూ ఎక్కడికక్కడ వైఎస్సార్సీపీ కార్యకర్తల మీద దాడులు హత్యలకు పాల్పడుతున్నారు.ఇదంతా పవన్ కళ్యాణ్ గమనించి తన అసంతృప్తిని ఇలా వెళ్లగక్కారని అంటున్నారు. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ సభలో మాట్లాడుతూ 30 వేల మంది మహిళలు అదృశ్యం అయ్యారని ఆరోపించారు. నేడు అంతకుమించి దారుణాల జరుగుతున్నాయి దీనికి పవన్ సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉంది. అందుకే తాను 15 ఏళ్ల పాటు పొత్తులో ఉందామని అనుకున్న పరిస్థితులు అలా లేవంటూ ఇప్పుడు తాను పునర్ ఆలోచిస్తున్నట్లుగా ఆయన మాటలు చెబుతున్నాయి.వచ్చే నాలుగేళ్లలో పవన్ పరిస్థితి ప్రభుత్వంలో మరింత దిగజారితే.. లోకేష్ ప్రాబల్యం ప్రాధాన్యం పెరిగితే అప్పుడు జనసేన ని ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ప్రస్తుతం తనను డిప్యూటీ సీఎం హోదాలో ప్రోటోకాల్.. బుగ్గ కారు.. ఓ ఆఫీసు ఓ పదిమంది స్టాఫ్ మినహా ప్రభుత్వంలో ఎలాంటి ప్రాధాన్యం పాలసీల విషయంలో తన సంప్రదించకపోవడం వంటి అంశాలు పవన్ను ఇబ్బంది పెడుతున్నాయి. తనకు రాజకీయంగా జీరో నాలెడ్జ్ అని భావించడం వల్లనే చంద్రబాబు కూడా తనను చిన్నచూపు చూస్తున్నారని పవన్ లోలోన మదన పడుతున్నట్లుగా తెలుస్తోంది. అందుకే ఆయన మనసులోని ఆవేదనను ఈ విధంగా వెళ్లగక్కి చంద్రబాబుకు ఇండికేషన్ పంపించినట్లుగా జన సైనికులు భావిస్తున్నారు.-సిమ్మాదిరప్పన్న -
సీజ్ ద థియేటర్.. అంటారేమో!
సాక్షి నెట్వర్క్: సినిమా థియేటర్ల విషయంలో ‘అత్త మీద కోపం దుత్త మీద చూపిందన్నట్లు’ తయారైంది కూటమి ప్రభుత్వ పరిస్థితి. సినిమా థియేటర్ల బంద్.. ఆపై విరమణ ప్రకటనల నేపథ్యంలో ప్రభుత్వం కన్నెర్ర చేయడంతో ఎక్కడ ‘సీజ్ ద థియేటర్..’ అంటారోనని థియేటర్ల యజమానులు వణికిపోతున్నారు. జూన్ 12న తాను నటించిన హరి హర వీరమల్లు చిత్రం విడుదలవుతున్నందున ఇప్పుడు థియేటర్లు బంద్ చేస్తారా.. సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది.. దీని వెనుక ఎవరున్నారంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తీరా దీని వెనుక జనసేన నేత ఉన్నారని తెలిసి ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకుంది ప్రభుత్వం. ఇంత హంగామా చేసి మిన్నకుండిపోతే బావుండదని భావించి రాష్ట్రవ్యాప్తంగా థియేటర్లను తనిఖీ చేయాలని ఆదేశించింది. ఆయా థియేటర్లలో ఉన్న లోపాలన్నింటిపై నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో బుధవారం పలు నగరాలు, పట్టణాల్లో పోలీస్, రెవెన్యూ, ఆహార కల్తీ నిరోధక శాఖ, మున్సిపల్ శాఖ, తూనికలు, కొలతలు తదితర శాఖల అధికారులు థియేటర్లలో తనిఖీలు చేపట్టారు. మచిలీపట్నంలో ఆర్డీవో కె స్వాతి మల్టీప్లెక్స్ థియేటర్ను తనిఖీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో అల్లు అరవింద్కు చెందిన గీతా అన్నపూర్ణ థియేటర్తో పాటు అడబాల, కోడి రామకృష్ణకు చెందిన మారుతి థియేటర్లను తనిఖీ చేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్కు చెందిన మూడు థియేటర్లలో ఆర్డీవో కె.మధులత ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. లైసెన్స్లు, టికెట్ల ధరలు, తినుబండారాలు, శీతల పానీయాల ధరలు, మరుగుదొడ్లు, ఫైర్ సేఫ్టీ.. తదితరాలను పరిశీలించారు. నరసరావుపేట డివిజన్లో 22 థియేటర్లు ఉన్నాయని, వాటన్నింటిలో తనిఖీలు చేయాలని ఆయా మండలాల తహసీల్దార్లను ఆదేశించామని ఆర్డీవో తెలిపారు. రాజమహేంద్రవరంలోని గీతా అప్సర, శ్యామల, స్వామి థియేటర్లను జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు తనిఖీ చేశారు. విజయవాడ గాందీనగర్లోని శైలజ, రాజ్ యువరాజ్, ఐనాక్స్, అలంకార్ థియేటర్లలో తనిఖీలు నిర్వహించారు. గుంటూరు జిల్లా పొన్నూరు, ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల, వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, శ్రీకాకుళం, నెల్లూరు, అమలాపురం, అన్నమయ్య జిల్లా రాయచోటి, రైల్వేకోడూరు తదితర పట్టణాల్లోనూ థియేటర్ల తనిఖీలు కొనసాగాయి. ఉన్నట్లుండి ఈ తనిఖీలేంటి? తనిఖీల సమయంలో థియేటర్ల యజమానులు అధికారులతో వారి కష్టాలు చెప్పుకున్నారు. ఇప్పటికే అరకొర ఆదాయాలతో నష్టపోతున్నామని, చిన్నచిన్న లోపాలను సాకుగా తీసుకుని ‘సీజ్ ద థియేటర్’ అంటే తమ గతి ఏం కావాలని వాపోయారు. ఇదే సమయంలో ఆయా ప్రాంతాల్లో కొంతమంది ప్రేక్షకులు కలుగజేసుకుంటూ విజయవాడ తదితర నగరాల్లోని మల్టీఫ్లెక్స్లలో తినుబండారాలు, మంచినీటి బాటిల్ ధర ఆకాశాన్నంటుతున్నాయని.. చిత్తశుద్ధి ఉంటే అక్కడి నుంచి మొదలు పెట్టండని ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్టీఫ్లెక్స్ థియేటర్లలో కళ్లెదుటే అధిక ధరలతో తినుబండారాలు విక్రయిస్తుంటే ఏమీ చేయలేకపోతున్నారని వాపోయారు.ఇదీ సంగతి మల్టీఫ్లెక్స్ థియేటర్లలో సినిమాలు ప్రదర్శిస్తే మొదటి వారం రెవెన్యూలో 53 శాతం మల్టీప్లెక్స్ యజమానికి, 47 శాతం డిస్ట్రిబ్యూటర్ తీసుకునే విధంగా నిర్ణయించారు. రెండో వారం కూడా అదే సినిమా ప్రదర్శిస్తే మల్టీప్లెక్స్ యజమానికి 50 శాతం, డిస్ట్రిబ్యూటర్ 50 శాతం తీసుకుంటున్నారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో కేవలం షోల ఆధారంగానే అద్దెలు చెల్లిస్తున్నారు. ఒక షో ప్రదర్శనలో హాల్ ఫుల్ అయితేనే అద్దె వస్తోందని, ఫుల్ కాకపోతే రెవెన్యూలో 40 శాతం మాత్రమే చెల్లిస్తున్నారని.. అలా కాకుండా మల్టీప్లెక్స్ల మాదిరిగా తమకు కూడా పర్సంటేజీలు ఇవ్వాలని థియేటర్ యజమానులు డిమాండ్ చేస్తున్నారు. -
థియేటర్ల బంద్ కుట్ర వెనుక జనసేన నేత.. పార్టీ నుంచి సస్పెండ్
-
ఏపీలో థియేటర్ల బంద్ కుట్ర వెనుక జనసేన
-
ఏపీలో థియేటర్ల బంద్ కుట్ర వెనుక జనసేన హస్తం
సాక్షి,విజయవాడ: ఏపీలో థియేటర్ల బంద్ కుట్ర వెనుక జనసేన హస్తం ఉన్నట్లు తేలింది. ఏపీ సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కందుల దుర్గేష్ (Kandula Durgesh) ప్రధాన అనుచరుడు, జనసేన నేత అత్తి సత్యనారాయణ బంద్ కుట్రకు పాల్పడినట్లు తేలింది. ఈ నేపథ్యంలో.. పార్టీకి మరక అంటకుండా హడావిడిగా సత్యనారాయణపై వేటు వేస్తున్నట్లు ప్రకటించింది .రాజమండ్రి సిటీ జనసేన ఇన్ ఛార్జ్గా ఉన్న సత్యనారాయణను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. బంద్ ప్రతిపాదన నిజమా..? అబద్ధమా..? తేలేవరకు దూరంగా ఉండాలని ఆదేశిస్తూ వేముల పాటి అజయ్ కుమార్ పేరుతో ఓ ప్రకటనను విడుదల చేసింది. ‘హరి హర వీరమల్లు’ మూవీ విడుదల సమయంలో థియేటర్ల బంద్ విషయం తెరపైకి వచ్చింది. దీంతో డిప్యూటీ సీఎం పవన్ సినీపెద్దలపై, థియేటర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. థియేటర్ల బంద్ అంశంలో ఆ నలుగురు పెద్దలను విచారించాలని మంత్రి దుర్గేష్ హోంశాఖ కార్యదర్శిని ఆదేశించారు. అయితే ఇప్పుడు ఆ కుట్ర చేసింది దుర్గేష్ అనుచరుడే అని నిర్ధారణయ్యింది. ఫలితంగా తాము ప్రజల్లో అభాసుపాలయ్యామంటూ జనసేన నేతల్లో కలవరం మొదలైంది. -
అవినీతి ని ప్రశ్నించినందుకు జనసేన నేతపై ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అనుచరులు దాడి
-
కూటమి నుంచి టీడీపీ ఎన్నిసార్లు బయటకు రాలేదు: జ్యోతుల నెహ్రూ
సాక్షి, కాకినాడ: టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కూటమి ఎన్నాళ్లు ఉంటుంది.. పార్టీ ఆవిర్భావం తర్వాత ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకోలేదు.. కూటముల నుంచి ఎన్నిసార్లు బయటకు రాలేదు అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రభుత్వంలో పదవులు ఎవరికి ఇస్తున్నారు?. పార్టీ నిర్ణయాల వల్ల టీడీపీ నిర్వీర్యం అయిపోతుందని చెప్పుకొచ్చారు.టీడీపీ కాకినాడ జిల్లా మహానాడులో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ..‘కాకినాడ జిల్లాలో పదవులు ఏ పార్టీకి వెళ్లాయో ఆలోచించండి. మెజారిటీ ఉన్న తెలుగుదేశం పరిస్థితి ఏంటి?. ఒక వ్యక్తికి రెండు పదవులు అవసరమా?.(కుడా చైర్మన్, డీసీసీబీ చైర్మన్గా ఉన్న జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు). కూటమిలో పార్టీ నిర్ణయాల వల్ల టీడీపీ నిర్వీర్యం అయిపోతుంది. కూటమి ఎన్నాళ్లు ఉంటుంది.. పార్టీ ఆవిర్భావం తర్వాత ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకోలేదు. ఎన్నిసార్లు బయటకు రాలేదు.టీడీపీతో పొత్తు వల్ల కమ్యూనిస్టు పార్టీలు నిర్వీర్యం అయిపోయాయి. అదే పరిస్థితి టీడీపీకి రాకుండా చూడాలి. నేను వాళ్లకు ఇవ్వకూడదు అని అనడం లేదు. మా నిష్పత్తి ప్రకారం టీడీపీకి కూడా ఇవ్వండి అంటున్నాను. ద్వితీయ శ్రేణి నేతలు తమ ఇంట్లో వారికి కూడా సమాధానం చెప్పలేకపోతున్నారు. మా వాటా పదవులు మాకు సక్రమంగా ఇవ్వండి’ అని డిమాండ్ చేశారు. -
జనసేనపై పిఠాపురం టీడీపీ నేతలు సంచలన వ్యాఖ్యలు..
-
జనసేనకు కీలక పదవి.. టీడీపీ నేతలు ఆగ్రహం
సాక్షి, విశాఖ: విశాఖ డిప్యూటీ మేయర్ ఎంపిక విషయమై కూటమిలో ట్విస్ట్ చోటుచేసుకుంది. డిప్యూటీ మేయర్ ఎంపిక కూటమిలో చిచ్చు రాజేసింది. జనసేనకు డిప్యూటీ మేయర్ కేటాయింపుపై టీడీపీ కేడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీంతో, పలువురు టీడీపీ నేతలు ఎన్నికకు హాజరు కాకపోవడంతో డిప్యూటీ మేయర్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది.వివరాల ప్రకారం.. విశాఖ డిప్యూటీ మేయర్ పదవిని జనసేనకు కేటాయించడంపై పచ్చ పార్టీ నేతలు మండిపడుతున్నారు. జనసేనకు చెందిన డల్లి గోవింద రెడ్డికి డిప్యూటీ మేయర్ అవకాశం ఇవ్వడంపై టీడీపీ నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే ఈరోజు జరిగిన సమన్వయ సమావేశం నుంచి కాపు, యాదవ సామాజిక వర్గాలకు చెందిన కార్పొరేటర్లు అలిగి అక్కడి నుంచి వెళ్లిపోయారు.డిప్యూటీ మేయర్ ఎన్నికకు ఈ వర్గానికి చెందిన కార్పొరేటర్లు హాజరుకాలేదు. కోరం సరిపడకపోవడంతో ఎన్నికను అధికారులు వాయిదా వేశారు. డిప్యూటీ మేయర్ ఎన్నికకు కావలసిన సంఖ్యాబలం 56 కావాల్సి ఉండగా.. 54 మంది హాజరయ్యారు. దీంతో, ఎన్నికను రేపటికి వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో అలకబూనిన కౌన్సిలర్లతో టీడీపీ హైకమాండ్ చర్చించే అవకాశం ఉంది. మరోవైపు.. జీవీఎంసీ డిప్యూటీ మేయర్ సతీష్ మాట్లాడుతూ..‘అధికార దాహంతో జీవీఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ను పదవి నుంచి దింపేశారు. నగర అభివృద్ధిపై కూటమికి చిత్తశుద్ధి లేదు. కూటమి నేతల మధ్య సమన్వయ లోపం ఉంది. డిప్యూటీ మేయర్ ఎన్నికకు కోరం సభ్యులు కూడా లేరు. మేము చేసిన అభివృద్ధిని కూటమి ఖాతాలో వేసుకుంటుంది. రేపు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. సామాజిక వర్గాల వారీగా జీవీఎంసీ కార్పొరేటర్లు విడిపోయారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు అంతా ఒకే మాట మీద ఉన్నాం’ అని అన్నారు. -
గిరిజనుల రక్తం తాగుతున్న జనసేన ఎమ్మెల్యే
-
పవన్ పై పిఠాపురం రైతులు ఫైర్
-
జనసేనలో భగ్గుమన్న వర్గ విభేదాలు
-
జనసేన కార్యకర్త కుటుంబాన్ని పట్టించుకోని పవన్
-
కార్యకర్త చనిపోతే పట్టించుకోని పవన్.. దళితులంటే చిన్నచూపా
-
జనసేన జోగినేని మణిపై కేసు నమోదు
సాక్షి, అన్నమయ్య: జనసేన రాయలసీమ జోన్ కన్వీనర్ జోగినేని మణిపై ఎట్టకేలకు పోలీసులు కేసు నమోదు చేశారు. పత్తి రాజేశ్వరి అనే మహిళపై దాడి చేసిన ఘటనకు సంబంధించి.. బాధితురాలి ఫిర్యాదుతో ఓబులవారిపల్లె పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు.వివరాల ప్రకారం.. కొద్దిరోజుల క్రితమ శ్రీరామనవమి రోజున జోగినేని మణి.. చెన్నరాజుపోడు గ్రామానికి చెందిన మహిళ రాజేశ్వరిని కాళ్లతో తన్ని దిక్కున్న చోట చెప్పుకోమంటూ బెదిరింపులకు గురిచేశాడు. అనంతరం, పత్తి రాజేశ్వరిపై దాడి చేశాడు. ఈ సందర్భంగా మణి.. తనకు పవన్ కల్యాణ్, హోం మంత్రి అందరూ తెలుసు. నీకు దిక్కున్న చోట చెప్పుకోమంటూ చులకన చేసి మాట్లాడాడు. దీంతో, మణి వల్ల తనకు ప్రాణహాని ఉంది బాధితురాలు.. పోలీసులకు ఫిర్యాదు చేసింది.దీంతో, ఆనాడు పోలీసులు ఫిర్యాదు చేయగా.. ఇప్పటికి ఓబులవారిపల్లె పోలీసులు జోగినేని మణిపై కేసు నమోదు చేసినట్టు చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా, అంతకుముందు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను విమర్శించాడంటూ పోసాని కృష్ణమురళిపై మణి కేసు పెట్టిన విషయం తెలిసిందే. అతని ఫిర్యాదు మేరకు అప్పట్లో ఆఘమేఘాలపై పోసానిని అరెస్టు చేశారు పోలీసులు. తాజాగా మణి అరాచకాలను బాధితురాలు.. పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. ఈ క్రమంలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. -
జనసేన కార్యాలయం వద్ద పీఈటీ అభ్యర్థుల నిరసన
మంగళగిరి టౌన్: మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయం వద్ద పీఈటీ (ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్) అభ్యర్థులు మంగళవారం నిరసన చేపట్టారు. డీఎస్సీలో పీఈటీ పోస్టుల భర్తీ లేకపోవడాన్ని నిరసిస్తూ ధర్నా నిర్వహించారు. యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ హామీ ఇచ్చి మోసం చేశారని, మీరైనా న్యాయం చేయాలంటూ డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ను ఉద్దేశిస్తూ ఫ్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. డీఎస్సీలో ఖాళీ పీఈటీ పోస్టుల భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆమరణ నిరాహార దీక్షలకు దిగుతామని హెచ్చరించారు. కాన్వాయ్లో పవన్ కళ్యాణ్ వస్తున్న సమయంలో పెద్దగా నినాదాలు చేసినా పట్టించుకోకుండా వెళ్లిపోవడంపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తంచేశారు. -
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి కూటమిలో ఫ్లెక్సీ వార్
-
శ్మశాన వాటికనూ వదలని జనసేన నేత.. తిరగబడిన స్థానికులు
సాక్షి, ధర్మవరం: శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో కూటమి నాయకుల దౌర్జన్యానికి అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. పట్టణంలోని ఎల్సీకేపురంలో దశాబ్దాలుగా ఉన్న శ్మశాన వాటికకు నకిలీ పట్టాలు సృష్టించి రిజిస్ట్రేషన్లు చేసి కబ్జా చేసేందుకు జనసేన నాయకుడు తొండమాల రవి యత్నించడం కలకలం రేపింది. వివరాల ప్రకారం.. ధర్మవరం పట్టణంలోని ఎల్సీకేపురంలో సర్వే నంబర్ 649లో భవన నిర్మాణ కార్మికులకు ఇంటి స్థలాల కోసం 30 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. ఇందులో రెండు ఎకరాలకుపైగా మిగులు భూమి ఉండటంతో 2002లో ప్రభుత్వం శ్మశాన వాటికకు కేటాయించింది. అప్పటి నుంచి శివారు ప్రాంత కాలనీ ప్రజలు శ్మశాన వాటికగా ఉపయోగించుకుంటున్నారు. అయితే ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ స్థలంపై జనసేన నాయకుడు తొండమాల రవి కన్ను పడింది. ఈ రెండు ఎకరాల స్థలాన్ని తన బినామీల పేరిట అక్రమ రిజిస్ట్రేషన్ చేయించారు. ఆపై ఆక్రమించుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో శనివారం జేసీబీలతో స్థలాన్ని చదును చేసేందుకు వెళ్లడంతో స్థానికులు అవాక్కయ్యారు. ఇది శ్మశాన వాటిక స్థలమని, ఎందుకు చదును చేస్తున్నారని ప్రశ్నించారు. తమ స్థలం అంటూ జనసేన నాయకుడు రవి చెప్పడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే జేసీబీలను తీసుకెళ్లాలని భీష్మించారు. చదును పనులను అడ్డుకున్నారు. విషయం తెలిసిన పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అనంతరం పట్టణ పోలీస్స్టేషన్లో జనసేన నేత రవిపై స్థానికులు ఫిర్యాదు చేశారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి శ్మశాన వాటికను కాపాడాలని కోరారు. -
ఇలా చేస్తున్నావేంటి మండలి?.. తెలుగు తమ్ముళ్ల ఫైర్
సాక్షి, కృష్ణా జిల్లా: అవనిగడ్డ కూటమిలో విభేదాలు భగ్గుమన్నాయి. జనసేన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ తీరుపై అవనిగడ్డ తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొత్తు ధర్మం పాటించడం లేదంటూ మండిపడుతున్నారు. ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ కుటుంబ దోపిడీని టీడీపీ నేతలు బయటపెట్టారు. పెద్దన్న పాత్ర పోషించాల్సిన బుద్ధప్రసాద్ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడంటూ చల్లపల్లిలో జరిగిన ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ఇంఛార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమకు కనీస మర్యాద కూడా ఇవ్వడం లేదంటూ వాపోయారు.మీ వల్ల నేను గెలవలేదని ఎమ్మెల్యే మమ్మల్ని పదే పదే అవమానిస్తున్నారు. ప్రభుత్వం అధికారంలో ఉండి చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేకపోతున్నాం. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాకు ఇలాంటి పరిస్థితులు ఎదురు కాలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేం ఏ చిన్న పనిమీద వెళ్లినా అధికారులు మమ్మల్ని గౌరవించేవారు. మమ్మల్ని అవమానిస్తున్న ఎమ్మెల్యేతో ఎలా కలిసి పనిచేయాలంటూ టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రశ్నించారు.ఇసుక, మట్టిని ఎమ్మెల్యే కుటుంబం దోచుకుంటోందని టీడీపీ నేతలు ఆరోపించారు. టీడీపీ కార్యకర్త ఎవరైనా ట్రక్కు మట్టి సొంత పొలం నుంచి ఇంటికి తోలుకున్నా.. అధికారులను ఉసిగొల్పుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక, మట్టి అక్రమ రవాణా గురించి పోస్టు పెట్టినందుకు కోడూరు మండల తెలుగు యువత నాయకుడిపై కేసు పెట్టించారని.. తక్షణమే అవనిగడ్డ నియోజవర్గానికి టీడీపీ ఇంఛార్జిని నియమించాలంటూ ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. -
కాకినాడలో టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వర్సెస్ జనసేన
-
పిఠాపురంలో పవన్ ‘రచ్చ’బండ రద్దు
కాకినాడ, సాక్షి: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు సొంత నియోజకవర్గంలోనే వరుస షాకులు తగిలాయి. రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించకుండానే.. రద్దు చేసుకుని తిరుగుపయనం అయ్యారాయన. అదే సమయంలో ఈ పర్యటనలోనే కూటమిలో విబేధాలు కూడా మరోసారి బయటపడ్డాయి.పవన్ కల్యాణ్ శుక్రవారం పిఠాపురం రచ్చబండలో పాల్గొనాల్సి ఉంది. అయితే.. రైతులు, ఇతర వర్గాల ప్రజలు తమ సమస్యలపై నిరసన తెలిపే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో.. కార్యక్రమాన్ని నిర్వహించకుండానే అర్ధాంతరంగా వెళ్లిపోయారు. మరోవైపు, ఈ పర్యటనలో కూటమిలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. డిప్యూటీ సీఎం, పలు శాఖల మంత్రి హాజరయ్యే కార్యక్రమానికి టీడీపీ మాజీ ఎమ్మెల్యే, పార్టీ ఇంచార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ గైర్హాజరయ్యారు. ఇక.. ఉప్పాడలో పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేసిన టీటీడీ కళ్యాణ మండపం, సీతారాముల దేవాలయం శంకుస్థాపన శిలాఫలకాల్లో సీఎం చంద్రబాబు పేరు కనిపించలేదు. దీంతో టీడీపీ నేతలు బహిరంగంగానే అక్కడ అసంతృప్తి వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. -
నీకు దమ్ముంటే నాపై పోటీ చెయ్.. జనసేన నేతపై సంచలన వ్యాఖ్యలు
-
భలే మంచి ‘ఉద్యోగ’ బేరమూ..!
తాడేపల్లి రూరల్: ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ రాజధాని ముఖద్వారం ఉండవల్లి కేంద్రంగా దాదాపు 200 మంది నిరుద్యోగులను మోసం చేయడానికి సిద్ధపడిన ఒక జనసేన నాయకుని ప్రయత్నం ఆదిలోనే బెడిసికొట్టిన వైనమిది. సేకరించిన వివరాల ప్రకారం, విజయవాడ ఎన్టీఆర్ కాంప్లెక్స్లో పార్కింగ్ ఫీజు వసూలు చేసే శివ అనే ఒక జనసేన నాయకుడు ఉండవల్లిలోని మూడు బొమ్మల సెంటర్లో ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. రాష్ట్రంలోని దేవదాయ శాఖ, పౌరసరఫరాల శాఖలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, ఎటువంటి పరీక్షలు లేకుండా నేరుగా ఎంపీతో, మంత్రితో మాట్లాడి ఆ ఉద్యోగాలు ఇప్పిస్తానని రాష్ట్ర వ్యాప్తంగా తమ నాయకులు, కార్యకర్తలతో గడచిన కొంత కాలంగా ప్రచారం నిర్వహించాడు.ఈ ప్రచారం మేరకు దాదాపు 200 మంది నిరుద్యోగులు రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి సోమవారం ఉండవల్లిలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. వీరి నుంచి రూ.10 వేల నుంచి రూ. 2 లక్షల వరకూ వసూళ్ల దందా ప్రణాళికను సిద్ధం చేసుకున్న నిందితుడు నిరుద్యోగుల నుంచి నగదు, సర్టిఫికెట్లు సేకరించడానికి మధ్యాహ్నం 3 గంటల సమయంలో సమాయత్తం అవుతుండగా, మీడియా రాకతో ఒక్కసారిగా ఖంగుతిన్నాడు.అయితే ‘తగ్గేదేలే..’ అన్నట్లు ఎంపీ, మంత్రులు తన వెనుక ఉన్నారంటూ బెదిరింపులకు దిగాడు. ఇంతలో ఘటనా స్థలానికి పోలీసులు కూడా చేరుకోవడంతో, ఉద్యోగాలు ఇవ్వడం కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నానని ఒప్పుకున్నాడు. డిగ్రీలు చదివి ఎవరో గుర్తుతెలియని వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటే ఎలా నమ్మారంటూ నిరుద్యోగులను ప్రశ్నించగా, ఎంపీ బాలశౌరి, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహన్ తనకు తెలుసని, వారి ద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తామని నిందితుడు చెప్పినట్లు అక్కడివారు తెలిపారు. ఇంకా ఎవ్వరూ డబ్బులు చెల్లించలేదని కూడా వారు పేర్కొనడం గమనార్హం. -
మహిళలపై చేయి వేస్తే తోలు తీస్తామన్న పవన్ ఏం చేస్తున్నారు: బ్రహ్మనాయుడు
-
కూటమిలో ట్విస్ట్.. జనసేన కారణంగా టీడీపీ కీలక నేతల రాజీనామా
సాక్షి, తూర్పు గోదావరి: ఏపీలో కూటమి పార్టీ మధ్య విభేదాలు పీక్ స్టేజ్కు చేరుకున్నాయి. కూటమిలో భాగంగా అసలు తమను గుర్తించడం లేదని కొందరు నేతలు ఆరోపిస్తున్నారు. ఇక, తాజాగా మంత్రి కందుల దుర్గేష్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ టీడీపీ కీలక నేత కొమ్మిన వెంకటేశ్వర రావు రాజీనామా చేశారు. దీంతో, కూటమి పార్టీ రాజకీయం ఆసక్తికరంగా మారింది.వివరాల ప్రకారం.. నిడదవోలులో ఎన్డీయే కూటమిలో విభేదాలు భగ్గుమన్నాయి. మంత్రి కందుల దుర్గేష్ తీరుపై టీడీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ పట్టణ అధ్యక్ష పదవికి కొమ్మిన వెంకటేశ్వరరావు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా నిడదవోలు జనసేన విధానాలతో విసుగు చెందినట్టు చెప్పుకొచ్చారు. మంత్రి కందుల దుర్గేష్ వ్యవహారంపై వేలివెన్నులో కార్యకర్తల సమావేశంలో టీడీపీ కేడర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇక, నిడదవోలు మున్సిపాలిటీ జనసేన కైవసం చేసుకోవడంతో అంతర్యుద్ధం మొదలైనట్టు పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు.మరోవైపు.. తనకు గుర్తింపు దక్కడం లేదంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు అసంతృప్తి వ్యక్తం చేశారు. కూటమిలో భాగంగా అసలు తమను గుర్తించడం లేదని ఆరోపించారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను జనసేనలో చేర్చుకోవడంలో ఎలాంటి సమాచారం తమకు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, అన్నా క్యాంటీన్ ప్రారంభానికి కూడా ఆహ్వానం అందలేదని అసహనం ప్రదర్శించారు. అధిష్టానం స్పందించకుంటే మరిన్ని రాజీనామాలు ఉంటాయని శేషారావు హెచ్చరించారు. -
చంద్రబాబు పీ4 విధానం ఓ బోగస్: సీపీఐ రామకృష్ణ
సాక్షి, అనంతపురం: వక్ఫ్ బిల్లుకు టీడీపీ, జనసేన మద్దతు ఇవ్వడం దుర్మార్గమంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. వక్ఫ్ బిల్లులో సవరణలు చేయకుండానే ఎందుకు మద్దతు ఇచ్చారో చంద్రబాబు సమాధానం చెప్పాలని ఆయన నిలదీశారు. వక్ఫ్ బిల్లు రాజ్యాంగ విరుద్ధం. వక్ఫ్ బిల్లు దేశంలో లౌకిక వాదాన్ని దెబ్బతీసేలా ఉంది. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులకు ఏం పని?’’ అంటూ రామకృష్ణ ప్రశ్నించారు.‘‘హిందూ ధార్మిక సంస్థల్లో ముస్లింలకు చోటిస్తారా?. ముస్లిం, క్రైస్తవ ఆస్తులపై బీజేపీ ప్రభుత్వం కన్నేసింది. చంద్రబాబు పీ4 విధానం ఓ బోగస్. తిరుపతిలో గోవుల మరణాలపై సమగ్ర విచారణ చేయాలి’’ అని రామకృష్ణ డిమాండ్ చేశారు.‘‘భూమన కరుణాకరరెడ్డి ఆరోపణలపై పాజిటివ్గా స్పందించాలి. సీఎం చంద్రబాబు, ఈవో పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారు. ప్రతి విషయం వైఎస్ జగన్కు ఆపాదించడం మంచి పద్ధతి కాదు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ తమ వైఖరి మార్చుకోవాలి’’ అని రామకృష్ణ హితవు పలికారు. -
పిఠాపురంలో ‘గ్లాస్’ మేట్స్ గలాటా
పిఠాపురం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇలాకా పిఠాపురంలో నిన్నటి వరకూ టీడీపీ, జనసేన నాయకులే కొట్టుకుంటూ రాగా...తాజాగా జనసేనలోనే రెండు వర్గాలు బాహాబాహీకి దిగాయి. ఇంతకీ ఏం జరిగిందంటే.. పిఠాపురంలో సోమవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకలు జరిగాయి. పార్టీ తరపున పలు కార్యక్రమాల్లో పిఠాపురం జనసేన ఇన్చార్జి మర్రెడ్డి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆయన వెంట హాజరైన జనసేన నేతల్లో కొందరు రెండు వర్గాలుగా విడిపోయి వివాదానికి తెర లేపారు.పిఠాపురం పట్టణం ఇందిరా నగర్ రజాలపేటలో ఇరువర్గాలూ వాగ్వాదానికి దిగాయి. ‘పార్టీ పెట్టినప్పటి నుంచీ ఉన్న మేమే అంబేడ్కర్ జయంతి వేడుకల్లో పాల్గొంటామని, మీరు వెనకాల రావాలని’ ఓ వర్గాన్ని మరో వర్గం అడ్డగించింది.‘మమ్మల్ని అడ్డుకోడానికి మీరెవరు? మీరు ఎప్పుడు వస్తే మాకేంటి? మేము పార్టీకి పని చేశాం. మేమూ నేతలమే.మేం వస్తాం, ఎవరడ్డుకుంటారో చూస్తాం’ అంటూ మరో వర్గం తిరగబడింది. దీంతో ఇరువర్గాల మధ్య వాదోపవాదాలు పెరిగి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరువర్గాలనూ సముదాయించేందుకు కొందరు చేసిన ప్రయత్నాలు చాలాసేపు ఫలించలేదు. ఈ గొడవను కవర్ చేసేందుకు ప్రయత్నించిన మీడియా ప్రతినిధులపై జనసేన నేతలు దురుసుగా ప్రవర్తించారు. దీనిపై మీడియా ప్రతినిధులు తీవ్ర నిరసన తెలిపారు. -
ఏలూరు జిల్లాలో జనసేన నాయకుడి దౌర్జన్యం
-
సంచలన సర్వే.. బయట పడ్డ టీడీపీ, జనసేన ఎమ్మెల్యేల బండారం
-
టీడీపీ, జనసేన మధ్య ఏం నడుస్తోంది?
ఆంధ్రప్రదేశ్ కూటమి భాగస్వాములు టీడీపీ, జనసేనల మధ్య అంతా బాగానే ఉందా? లేక ఎవరికి వారు తమదైన రాజకీయ క్రీడలు ఆడేస్తున్నారా? ఈ అనుమానం ఎందుకొస్తోందంటే.. ఒకపక్క సీఎం చంద్రబాబు కుమారుడు, మంత్రి లోకేశ్.. పవన్ కళ్యాణ్ను అతిగా పొగిడేస్తూంటే.. ఇంకోపక్క పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆకాశానికి ఎత్తేస్తూండటం!. ఇదే సమయంలో చంద్రబాబు కూడా పవన్ కళ్యాణ్ నాకు మంచి మిత్రుడంటూ పలు కార్యక్రమాల్లో ప్రశంసిస్తూండటం.. ఏదో తేడా కొడుతున్నట్టుగానే ఉంది రాజకీయ విశ్లేషకులకు! ఇప్పటికిప్పుడు ఇరు పార్టీల్లో పెద్ద విభేదాలేవీ స్పష్టం కాకపోయినప్పటికీ పిఠాపురం వ్యవహారం మాత్రం వివాదాల్లోనే ఉంటోంది.జనసేన గెలిచిన ఇతర నియోజకవర్గాల్లోనూ టీడీపీ స్థానిక నేతలు తాము చెప్పిన వారికే పనులు చేయాలని ఏకంగా లేఖలు రాస్తుండటం కూడా ఇరు పార్టీల మధ్య సయోధ్యపై ప్రశ్నలు విసురుతోంది!. అక్కడ వర్మకు ఎమ్మెల్సీ పదవి రాకుండా పవన్ టీడీపీపై ఒత్తిడి చేయగలిగారని అంటారు. అంతేకాక తన బదులు నాగబాబును నియోజకవర్గంలో తిప్పుతూ ప్రభుత్వ కార్యక్రమాలు చేయిస్తున్నారు. ఈ సందర్భంగా వర్మకు అసలు విలువ ఇవ్వడం లేదు. దాంతో రెండు వర్గాల వారు పోటాపోటీగా నినాదాలు చేసుకుంటున్నారు. నాగబాబుకు అసాధారణ స్థాయిలో పోలీసులు భద్రత కల్పించడం కూడా ఆసక్తికరమైన విషయమే. రెండు వర్గాల మధ్య ఏదైనా గొడవ చెలరేగితే వచ్చే ఇబ్బందుల రీత్యా ఇలా చేసి ఉండవచ్చు.నెల్లిమర్ల నియోజకవర్గంలో స్థానిక టీడీపీ నేత తాము చెప్పినవారికే పనులు చేయాలని అధికారులకు ఉత్తరం రాయడం విశేషం. ఇక్కడే కాదు. ఆయా చోట్ల జనసేన ఎమ్మెల్యేలు ఉన్నా, పెత్తనం టీడీపీ వారే చేస్తున్నారన్నది జనసేన కేడర్లో బాధగా ఉంది. తిరువూరులో టీడీపీ ఎమ్మెల్యేపై విమర్శలు చేస్తే, సమస్య ఏమిటో తెలుసుకోకుండా జనసేన అధిష్టానం తన పార్టీ నేతనే మందలించిందన్న వార్తలు వచ్చాయి. రాజకీయాలలో ఇవన్ని సాధారణంగా జరిగేవే. అయినా ఒక్కొక్కటిగా గొడవలు పెరుగుతూ, ఆ తర్వాత రోజులలో అవే పెద్దవిగా మారుతుంటాయి. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్టయిన తర్వాత పవన్ కళ్యాణ్, లోకేశ్ల మధ్య స్నేహం పెరిగిన మాట నిజమైనా.. ఎన్నికల తరువాత మాత్రం వీరిద్దరూ అంటీ అంటనట్టుగానే ఉన్నారు. తిరుపతి తొక్కిసలాట ఘటన తరువాత లోకేశ్ ఒకరకంగా పవన్ కళ్యాణ్ను అవమానించేలా వ్యాఖ్యానించారు కూడా. టీటీడీ అధికారులు, ఛైర్మన్ క్షమాపణ చెప్పాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేస్తే, అది ఆయన పార్టీ అభిప్రాయం అని లోకేశ్ తీసిపారేశారు. చైర్మన్తో తూతూ మంత్రంగా క్షమాపణ చెప్పించారు తప్పితే పవన్ కోరినట్లు అధికారులపై ముఖ్యమంత్రి చర్య తీసుకోలేదు. క్షమాపణలు కూడా చెప్పించ లేదు. పవన్ కళ్యాణ్ వద్ద పనిచేసే అధికారుల నియామకం విషయంలో కూడా లోకేశ్ జోక్యం చేసుకున్నారని వార్తలు వచ్చాయి. దానిపై పవన్ ఢిల్లీలో కూడా నిరసన చెప్పారని కథనాలు వ్యాపించాయి.అటవీ శాఖకు చెందిన భూమిలో ఉందన్న సాకుతో కాశీనాయన ఆశ్రమంలో భవనాలు కూల్చిన ఘటనపై పవన్ మాట్లాడ లేదు కానీ, లోకేశ్ క్షమాపణ చెప్పడం విశేషం. నిజానికి లోకేశ్కు జనసేనతో పొత్తు అంత ఇష్టం లేదని ఎన్నికల ముందు ప్రచారం జరిగింది. దానికి తగినట్లే పవన్కు ముఖ్యమంత్రి పదవి షేరింగ్ ఉండదని, ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం పాలిట్బ్యూరో నిర్ణయమని లోకేశ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. అయినా పవన్ సర్దుకుపోయారు. బీజేపీ వారు ఏభై సీట్లు డిమాండ్ చేయమని సూచించినా, పవన్ పట్టుబట్టలేదు. పైగా టీడీపీకి చెందిన వారికే కొందరికి తన పార్టీ టిక్కెట్లు ఇచ్చి చంద్రబాబు ఏం చెబితే అది చేశారని అంటారు.2017 ప్రాంతంలో లోకేశ్పై పవన్ చాలా తీవ్రమైన వ్యాఖ్యలే చేసినా 2020 నాటికి రాజీపడిపోయి చంద్రబాబుతో చేతులు కలిపారు. 2024లో అధికారం వచ్చిన తర్వాత చంద్రబాబు, పవన్ల కన్నా లోకేశ్ పవర్ఫుల్ అయ్యారన్న అభిప్రాయం సర్వత్రా ఏర్పడింది. తాను కూడా అలాగే ఇతర శాఖలలో జోక్యం చేసుకోవాలని అనుకున్నారో ఏమో తెలియదు కానీ, పౌర సరఫరాల శాఖలో వేలు పెట్టి ‘సీజ్ ద షిప్’ అని అధికారులను ఆదేశించి పవన్ నవ్వులపాలయ్యారు. చంద్రబాబు, పవన్ల మధ్య సంబంధాలు దెబ్బతిన్నట్లు ఇంతవరకు కనిపించలేదు కానీ.. లోకేశ్కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అంశంలో పవన్ అభ్యంతరం చెప్పారని రెండు పార్టీలలో గుసగుసలు వినిపించాయి. అందువల్లే లోకేశ్ కోరిక తీరలేదని అంటారు. ఇప్పటికే లోకేశ్ను సీఎంను చేయాలని చంద్రబాబుపై కుటుంబపరంగా ఒత్తిడి ఉందని చెబుతారు. అయినా పవన్ కళ్యాణ్ నుంచి సమస్య వస్తుందని చంద్రబాబు సర్ది చెబుతుండవచ్చన్నది ఎక్కువ మంది అభిప్రాయం.ఇక, ఇది నిజమా? కాదా? అన్నది చెప్పలేం కానీ.. పవన్ కళ్యాణ్ ఆయా సభలలో చంద్రబాబు పదిహేనేళ్లు సీఎంగా ఉండాలని, ఆయన సమర్థుడని, అనుభవజ్ఞుడని పనికట్టుకుని పొగుడుతున్న తీరు లోకేశ్ అనుచరులకు మింగుడుపడటం లేదనిపిస్తుంది. కేవలం లోకేశ్ను సీఎం కానివ్వకుండా, లేదా డిప్యూటీ సీఎం ప్రమోషన్ రానివ్వకుండా చూడడానికి పవన్ ప్రకటనలు ఉపయోగపడుతున్నట్లుగా ఉంది. ఈ నేపథ్యంలోనే లోకేశ్ వ్యూహం మార్చి తన ప్రమోషన్కు పవన్ కళ్యాణ్ నుంచి ఆటంకం లేకుండా ఉండడానికి ప్రయత్నాలు ఆరంభించారా అన్న సందేహం కలుగుతుంది. కొన్నాళ్లుగా లోకేశ్ తనకు సంబంధం లేని శాఖలలో కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు హాజరవుతున్నారు. ఆ సభలలో ఒకటికి రెండుసార్లు 'పవనన్న, పవనన్న’ అని ప్రస్తావిస్తూండటం.. ‘పవనన్న పట్టుబడితే సాధించి తీరుతారని, కేంద్రం నుంచి కూడా నిధులు తెస్తున్నారని’ పొగడ్తలు కురిపిస్తున్నారు.గతంలో ఇలాంటి ప్రోగ్రాంలను చంద్రబాబు వదలి పెట్టేవారు కారు. ఇప్పుడు తన కుమారుడి ఆధిపత్యానికి ఆయన అడ్డు చెప్పడం లేదు. దాంతో టీడీపీ మంత్రులు లోకేశ్ను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. ప్రకాశం, అనకాపల్లి జిల్లాలలో లోకేశ్ పర్యటనలే ఇందుకు నిదర్శనం. చంద్రబాబు తర్వాత పెత్తనం ఎటూ లోకేశ్దే కనుక ఇందులో పెద్దగా ఆక్షేపించవలసింది ఉండకపోవచ్చు. పార్టీ పరంగా అయితే ఏమైనా చేసుకోవచ్చు కాని, ప్రభుత్వ పరంగా లోకేశ్ ఇలా పెత్తనం చెలాయించడం కరెక్టేనా అన్న చర్చ వస్తుంది.మరోవైపు, పవన్ కళ్యాణ్ మాత్రం సభలలో చంద్రబాబునే పొగుడుతూ, లోకేశ్ను పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. అయినప్పటికీ లోకేశ్ బుజ్జగించి పవన్ను తన దారిలోకి తెచ్చుకోవడం పెద్ద కష్టం కాకపోవచ్చన్నది పలువురి భావన. పదిహేనేళ్లు కలిసి ఉండాలని అనుకుంటున్నప్పుడు మరీ తేడా ఏదైనా వస్తే తప్ప భవిష్యత్తులో లోకేశ్కు కూడా విధేయత ప్రదర్శించక తప్పని స్థితి పవన్కు వస్తుందని అంటున్నారు. చంద్రబాబుకు ఇప్పటికే 74 ఏళ్లు వచ్చినందున భవిష్యత్తులో ఆ పరిణామం జరగవచ్చు. లోకేశ్ మరో మాట కూడా చెబుతున్నారు.టీడీపీ, జనసేనల మధ్య ఎన్ని గొడవలు వచ్చినా కూర్చుని పరిష్కరించుకుంటాము తప్ప వేరు పడబోమని అన్నారు. ఇది కూడా గమనించవలసిన అంశమే. రాజకీయాలలో పైకి ఒకటి చెబుతారు. లోపల జరిగేవి వేరుగా ఉంటుంటాయి. అలాగే పవన్ కళ్యాణ్, లోకేశ్లు ఎవరి వ్యూహాలతో వారు ముందుకు వెళుతూ, కలిసి ఉన్నట్లు కనిపిస్తూనే ఎవరికి వారు పైచేయి తెచ్చుకునేందుకు యత్నించినా ఆశ్చర్యం ఉండదు. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
చంపేస్తా.. దిక్కున్న చోట చెప్పుకోండి..!
రైల్వేకోడూరు అర్బన్/ఓబులవారిపల్లె: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాలూకా అంటూ ఒక జనసేన నాయకుడు ఎన్ఆర్ఐ దంపతులపై దాడి చేసిన దారుణ ఘటన అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం, చెన్నరాజుపోటులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, బుధవారం రాత్రి గ్రామంలో శ్రీ సీతారాముల గ్రామోత్సవాన్ని నిర్వహించారు.ఒంటిగంట సమయంలో దేవుడి ఊరేగింపు ఎన్నారై పత్తి సుబ్బరాయుడు ఇంటి వద్దకు చేరుకుంది.ఆరోజే కువైట్ నుంచి ఇండియాకు వచ్చిన ఆయన, భార్య రాజేశ్వరితో కలిసి బయటకు వచ్చి దేవుడి దర్శనం చేసుకుంటుండగా, మాజీ సర్పంచ్, జనసేన పార్టీ రాయలసీమ జోనల్ కన్వీనర్ జోగినేని చిన్నమణి ఇనుపరాడ్తో ఇరువురిపై దాడిచేసి, చంపేస్తానంటూ బెదిరించాడు.డిప్యూటీ సీఎం, హోం మినిస్టర్, జిల్లా ఎస్పీ అందరూ తెలిసిన వారేనని పేర్కొంటూ, మీకు దిక్కున్న చోట చెప్పుకోమంటూ వెళ్లిపోయాడు. బాధిత దంపతులు రైల్వేకోడూరు సీఐ కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడుతూ, గతంలో గ్రామంలో పొలాల వద్ద చిన్నమణికి తమకు విభేదాలు ఉన్నాయని, అవి మనసులో పెట్టుకొని తమపై కక్షపెట్టుకుని చంపుతానని బెదిరిస్తున్నాడని అన్నారు. దీనిపై సీఐ వెంకటేశ్వర్లుకు ఫిర్యాదు ఇచ్చామని తెలిపారు. -
జనసేన జోగినేని మణి అరాచకం.. మహిళతో అనుచిత ప్రవర్తన
సాక్షి, వైఎస్సార్: ఏపీలో జనసేన నాయకుడు జోగినేని మణి అరాచకాలు వెలుగులోకి వస్తున్నాయి. శ్రీరామనవమి రోజున ఓ మహిళను కాళ్లతో తన్ని.. తనకు దిక్కున్న చోట చెప్పుకోమంటూ బెదిరింపులకు గురిచేసిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. దీంతో, సదరు బాధితురాలు.. మణి వల్ల తమకు ప్రాణహని ఉందని పోలీసులను ఆశ్రయించారు.వివరాల ప్రకారం.. పోసాని కృష్ణమురళిపై ఓబులవారిపల్లి పీఎస్లో కేసు పెట్టిన జనసేన నాయకుడు జోగినేని మణి అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. శ్రీరామనవమి రోజున మణి.. అదే మండలం చెన్నరాజుపోడు గ్రామానికి చెందిన మహిళ రాజేశ్వరిని కాళ్లతో తన్ని దిక్కున్న చోట చెప్పుకోమంటూ బెదిరింపులకు గురిచేశాడు. అనంతరం, పత్తి రాజేశ్వరిపై దాడి చేశాడు. ఈ సందర్భంగా మణి.. తనకు పవన్ కల్యాణ్, హోం మంత్రి అందరూ తెలుసు. నీకు దిక్కున్న చోట చెప్పుకోమంటూ చులకన చేసి మాట్లాడాడు. దీంతో, మణి వల్ల తనకు ప్రాణహాని ఉంది బాధితురాలు.. పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఇక, జనసేన రాయలసీమ జోన్ కన్వీనర్గా జోగినేని మణి కొనసాగుతున్నాడు. అంతకుముందు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను విమర్శించాడంటూ పోసాని కృష్ణమురళిపై మణి కేసు పెట్టిన విషయం తెలిసిందే. అతని ఫిర్యాదు మేరకు అప్పట్లో ఆఘమేఘాలపై పోసానిని అరెస్టు చేశారు పోలీసులు. తాజగా మణి అరాచకాలను బాధితురాలు.. పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. ఈ క్రమంలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. -
ఇసుక తోడేళ్లు!
చూడు నాగిరెడ్డి..! నేను ఎన్నికల్లో రూ.10 లక్షలు ఖర్చు చేశా. మా ఊరి నుంచి ఇసుక నేనే తవ్వుకుంటా. ఎవరూ అడ్డు రావద్దు..! నేను ఎమ్మెల్యే (జయనాగేశ్వరరెడ్డి)కి చెప్పి ఇసుక తోలుతున్నా. సీఐకి రూ.50 వేలు ఇచ్చినా..! నా టిప్పర్తోనే ఇసుక తోలుతా. ఇసుక బండి ఆపేదెవడు? దమ్ముంటే రమ్మను!- కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం నందవరం మండలం టీడీపీ నేతలు గురజాల జయరాముడు, రాయచోటి నాగిరెడ్డి ఫోన్ సంభాషణ ఇదీ!నాకు తెలియకుండా మట్టి తోలుతున్నావ్..! నాకు చెప్పాలి కదా..? బండ్లు మనయే ఉన్నాయ్..!రామలింగారెడ్డి (ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి కుడి భుజం)తో మాట్లాడా..! ఎమ్మెల్యే.. తహసీల్దార్కు కూడా చెప్పాడు. మట్టి శాంపిల్ కూడా తీశా. మనమే ఒకటిగా లేకుంటే ఎట్టా...? వచ్చే డబ్బులో రామలింగారెడ్డి వాటా ఆయనకు పోతాది. వైఎస్సార్సీపీ వాళ్లు బండ్లు ఆపుతున్నారు..ఆపోజిట్ వాళ్లు ఎవడైనా బండి ఆపితే టిప్పర్తోనే కొడతా..! రమ్మను..!- శ్రీశైలం నియోజకవర్గం మహానంది మండలంలో టీడీపీ నేతలు క్రాంతి కుమార్, శ్రీనివాసులు ఫోన్ సంభాషణ ఇదీ!!మీ ఓనర్కు ఫోన్ చేసి రెండు నెలలైంది.. ఎమ్మెల్యే వద్దకు వచ్చి మాట్లాడుకోవాలని చెప్పినా కలవలేదు. మీ ఓనర్ వచ్చి మాట్లాడే దాకా లారీ స్టేషన్లోనే ఉంటుంది..-లారీ డ్రైవర్ లంకన్నకు ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి పీఏ నాగరాజు గౌడ్ బెదిరింపులు!ఉచిత ఇసుక పేరుతో పచ్చ ముఠాలు ఏ స్థాయిలో బరి తెగించి సామాన్యులపై రౌడీయిజం చేస్తున్నారో చెప్పేందుకు ఇవి కొన్ని నిదర్శనాలు మాత్రమే! టీడీపీ కూటమి ప్రజా ప్రతినిధులు నదులు, వాగులు, వంకల్లో ఇసుకను యథేచ్ఛగా అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. అధికారం అండతో రెవెన్యూ, పోలీసు యంత్రాంగాన్ని చెప్పు చేతుల్లో పెట్టుకుని వాటాలు పంచుకు తింటున్నారు. ఆరు లారీలు.. మూడు ట్రాక్టర్లు అనే రీతిలో ఈ అక్రమాల పర్వం రాష్ట్రవ్యాప్తంగా విచ్చలవిడిగా సాగుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, కూటమి ప్రజాప్రతినిధులు నదులు, వాగులు, వంకలే కాకుండా పొలాలను కూడా వదలకుండా ఇష్టం వచ్చినట్లు ఇసుక తవ్వి అక్రమంగా తరలించి అమ్ముకుంటున్నారు. గోదావరి, కృష్ణా, పెన్నా, చిత్రావతి, నాగావళి సహా అన్ని నదుల నుంచి అక్రమ రవాణా అడ్డూ అదుపూ లేకుండా సాగిపోతోంది. నిబంధనలకు విరుద్ధంగా పొక్లెయిన్లు, జేసీబీలు, హిటాచీలు లాంటి భారీ యంత్రాలతో నదీ గర్భాలను గుల్ల చేస్తున్నారు. పేరుకు ఫ్రీ అంటున్నా ఎక్కడా ఉచితంగా ఇవ్వడం లేదు. 18 టన్నుల లారీ ఇసుకను రూ.30 వేల నుంచి 60 వేల వరకూ అమ్ముతున్నారు. ఎన్టీఆర్ జిల్లా సరిహద్దుల నుంచి హైదరాబాద్కు, అనంతపురం సరిహద్దుల నుంచి కర్ణాటకకు, చిత్తూరు సరిహద్దు నుంచి కర్ణాటక, తమిళనాడుకు భారీఎత్తున ఇసుక నిత్యం అక్రమంగా తరలిపోతోంది. అన్నిచోట్లా కూటమి ప్రజా ప్రతినిధుల కనుసన్నల్లో అక్రమ తవ్వకాలు జరుగుతుండగా.. కమీషన్లు కరకట్ట బంగ్లాకు ఠంచనుగా చేరిపోతున్నాయి. ముఖ్యనేతకు కప్పం కట్టి ఎక్కడికక్కడ నదులు, వాగులను కొల్లగొట్టేస్తూ రూ.వేల కోట్లు సొమ్ము చేసుకుంటున్నారు.– సాక్షి, అమరావతి, నెట్వర్క్తెలంగాణకు అక్రమ రవాణాఉమ్మడి కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులు ఇసుక దందాలో ఆరితేరిపోయారు. పెనుగంచిప్రోలు, సుబ్బాయిగూడెం, శనగపాడు గ్రామాల నుంచి రాత్రిళ్లు తెలంగాణకు అక్రమంగా తరలిస్తున్నారు. ఆళ్లూరుపాడు ఇసుక క్వారీ నుంచి పొక్లెయిన్లు, జేసీబీలతో లోడు చేసి లారీ లోడు రూ.30 వేల నుంచి రూ.60 వేల వరకు వసూలు చేస్తున్నారు. నందిగామ నియోజకవర్గంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అనుచరులు ప్రభుత్వానికి డబ్బులు కట్టకుండా లారీకి రూ.10 వేలు చొప్పున వసూలు చేసి ఎంత కావాలన్నా సై అంటున్నారు. మున్నేరు నుంచి ఇసుక అక్రమంగా వైరా, మధిర తదితర ప్రాంతాలకు తరలిపోతోంది. నిషేధిత జాబితాలో ఉన్న యనమలకుదురు, హైకోర్టు స్టే పరిధిలో ఉన్న పెదపులిపాక, సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసిన చోడవరం క్వారీల్లో సైతం యంత్రాలతో పెద్ద ఎత్తున ఇసుకను తవ్వి తరలిస్తున్నారు.అమరావతిలో యథేచ్చగా అక్రమాలుగుంటూరు జిల్లా తుళ్లూరు మండలం దొండపాడు, అబ్బురాజుపాలెం గ్రామాల్లో ఇసుకను అక్రమంగా నిల్వ చేసి రాత్రి పూట బయట ప్రాంతాలకు చేరవేస్తున్నారు. మంత్రి లోకేశ్ ప్రాతినిథ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలోని గొడవర్రులో పొక్లెయిన్లతో ఇసుక తవ్వి తరలిస్తున్నారు. గుండిమెడ, పాతూరు, చినరావూరులో అనుమతులు లేకపోయినా టీడీపీ నాయకులు అక్రమంగా ఇసుక తోడేస్తున్నారు. కొల్లిపర, తెనాలి, చెరుకుపల్లి మండలాల్లో అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం అమరావతి మండలం మల్లాది గ్రామం, అచ్చంపేట మండలం చింతపల్లి నుంచి ఇసుక అక్రమంగా కూటమి నేతలు తరలిస్తున్నారు. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కనుసన్నల్లో ఇసుక హైదరాబాద్కు తరలిస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. బాపట్ల జిల్లాలో పెసర్లంక, గాజుల్లంక, వోలేరు ప్రాంతాల్లోని కృష్ణా నది నుంచి టీడీపీ నేతలు రేయి పగలు తేడాలేకుండా యంత్రాలతో తోడేస్తున్నారు.నెల్లూరు.. అందరూ అందరే..నెల్లూరు జిల్లాలో పెన్నానదిలోని సంగం, సూరాయపాలెం, పోతిరెడ్డిపాలెం డీ సిల్టింగ్ పాయింట్లకు గడువు పూర్తయినా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. సూరాయపాలెంలో ఓ అధికార పార్టీ నేత నేరుగా నదిలోకి రహదారి ఏర్పాటు చేసి హిటాచీతో 12 టైర్ల టిప్పర్లకు లోడింగ్ చేస్తున్నారు. పల్లిపాడులో ఓపెన్ రీచ్లో యంత్రాలు ఉపయోగించి లోడింగ్ జరుగుతోంది. ఆత్మకూరు, వెంకటగిరి, కోవూరు, నెల్లూరు రూరల్, సిటీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల కనుసన్నల్లో భారీ యంత్రాలతో పెన్నా నదిలోకి బాటలు వేసి ఇసుక లోడింగ్ చేస్తున్నారు. రోజుకు 200కు పైగా టిప్పర్లు చెన్నై, కర్ణాటక రాష్ట్రాలకు తరలి వెళ్తున్నాయి. లోకేశ్ టీమ్ పేరుతో మన్నేరు నుంచి టీడీపీ నాయకులు భారీగా ఇసుకను తరలిస్తున్నారు. కరేడు అటవీ భూముల్లో టీడీపీ నాయకుడు పోలుబోయిన శ్రీనివాసులు ఇసుకను హేచరీలకు తరలించారు.ప్రకాశంలో ఇష్టారాజ్యం ప్రకాశం జిల్లాలో ఇసుక మాఫియా చెప్పిందే వేదంగా నడుస్తోంది. అన్నిచోట్లా టన్నుకు రూ.200 నుంచి రూ.500 వరకు అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారు. ఒంగోలు, కొండపి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, మారిటైంబోర్డు చైర్మన్ దామచర్ల సత్య ఆధ్వర్యంలో అక్రమ రవాణా జరుగుతోంది. కొండపి నియోజకవర్గం నుంచి ఒంగోలుకు ఇసుక తరలించే విషయంలో దామచర్ల సోదరుల వర్గీయుల మధ్య వివాదం తలెత్తి పరస్పరం పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేసుకున్నారు. దామచర్ల అనుచరుల ప్రైవేటు సైన్యం వేధింపులు భరించలేక టిప్పర్ల యజమానులు కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగారు. దర్శిలో టీడీపీ ఇన్చార్జ్ గొట్టిపాటి లక్ష్మి, గిద్దలూరులో ఎమ్మెల్యే అశోక్రెడ్డి కనుసన్నల్లో మాఫియా చెలరేగుతోంది. మార్కాపురంలో కూటమి నాయకుల నేతృత్వంలో ఇసుక విక్రయాలు సాగుతున్నాయి.పశ్చిమలో ఎడాపెడా బాదుడుపశ్చిమ గోదావరి జిల్లాలోని ఆరు రీచ్లు, ఐదు డీసిల్టేషన్ పాయింట్లు కోస్టల్ రెగ్యులేటరీ జోన్ పరిధిలోకి వెళ్లడంతో మూసివేసినందున ఇసుక దొరకడంలేదు. దీంతో తీపర్రు, పెండ్యాల, పందలపర్రు, జొన్నాడ, గోపాలపురం తదితర ర్యాంపులకు వెళ్లాల్సి వస్తోంది. అక్కడ లారీకి రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు ర్యాంపు నిర్వాహకులు అదనంగా వసూలు చేస్తున్నారు. భీమవరానికి లారీ ఇసుక చేరవేసేందుకు రూ.16 వేల నుంచి రూ.17 వేల వరకు వసూలు చేస్తున్నారు. జిల్లాకు రోజుకు 500 నుంచి 600 ట్రిప్పుల వరకు ఇసుక రవాణా జరుగుతుండగా.. అదనపు వసూళ్ల రూపంలో జిల్లాలోని వినియోగదారులపై రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు భారం పడుతోంది.గోదావరి గుల్ల గుల్ల.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో గోదావరిని గుల్ల చేస్తూ నిషేధిత ప్రాంతాల్లో సైతం తవ్వకాలు జరుగుతున్నాయి. కోటిలింగాల, కొవ్వూరు ర్యాంపుల్లో నిషేధిత డ్రెడ్జింగ్ అడ్డగోలుగా సాగుతోంది. ఒక్కో ర్యాంపు నుంచి రోజుకు 50కి పైగా లారీల్లో ఇసుకను అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఒక్కో లారీ (18 టన్నులు) ఇసుకను రూ.20 వేల నుంచి రూ.35 వేల వరకూ విక్రయిస్తున్నారు. రాజమహేంద్రవరం వద్ద గోదావరిపై రోడ్ కమ్ రైల్వే వంతెన, గామన్ వంతెనల సమీపంలో ఇసుక తవ్వకాలను నిషేధించారు. బ్రిడ్జిలు దెబ్బ తినే ప్రమాదం ఉన్నందున అక్కడ ఇసుక తవ్వకూడదని గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించింది. అయినా కూటమి నేతలు లెక్క చేయకుండా రెండు బోట్ల ద్వారా అక్రమ తవ్వకాలు జరుపుతున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో అనుమతి లేకుండానే పలు ప్రాంతాల్లో యంత్రాలతో తవ్వకాలు చేస్తున్నారు. ఇసుక తవ్విన గోతుల్లో ఇటీవల కొత్తపేట గ్రామానికి చెందిన 21 ఏళ్ల యువకుడు దుర్గాప్రసాద్ స్నానానికి దిగి మునిగిపోయి మరణించాడు.సిక్కోలులో మంత్రులకు వాటాలు!శ్రీకాకుళం జిల్లాలో అంబళ్లవలస, బట్టేరు, అంగూరు, బూరవల్లి, గార, గోపాల పెంట, కాఖండ్యాంలోని రీచ్లను కూటమి నేతలు తమకు కావాల్సిన వారికి ఇప్పించుకుని దర్జాగా దోపిడీ చేస్తున్నారు. ఈ దోపిడీలో సైలెంట్గా ఓ సెంట్రల్ మినిస్టర్.. వయలెంట్గా మరో మినిస్టర్ వాటాలు వసూలు చేసుకుంటున్నారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ తన బినామీలతో రాత్రిపూట పెద్ద ఎత్తున ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. ఆమదాలవలసలో టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ అనుచరులు బూర్జ మండలం నారాయణపురం, చిన అంకలాం వద్ద భారీ లారీల్లో ఇసుక తరలించేస్తున్నారు. నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఇసుక రీచ్లను సొంత జాగీర్లుగా మార్చుకుని రాజ్యమేలుతున్నారు. పాతపట్నం నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఇసుక వ్యాపారాన్ని ఇష్టానుసారం సాగిస్తున్నారు. ఎచ్చెర్లలో బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వరరావు ఇసుక తన సరిహద్దు దాటాలంటే లారీకో రేటు ఫిక్స్ చేశారు. మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు టెక్కలిలో ఇసుక డంపింగ్ కేంద్రాలు పెట్టించి తన కార్యకర్తలతో పాటు కుటుంబ సభ్యులకు ఇసుకలో వాటాలు ఇస్తున్నారు.చిత్తూరు టు కర్ణాటక, తమిళనాడు తిరుపతి జిల్లాలోని స్వర్ణముఖి నది, అరుణానదిలోని ఇసుకను ఒక ఎమ్మెల్యే అనుచరులు, బంధువులు భారీ యంత్రాలతో తోడి కర్ణాటక, తమిళనాడుకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. టిప్పర్ ఇసుక రూ.60 వేల చొప్పున విక్రయిస్తున్నారు. శ్రీకాళహస్తి, చంద్రగిరి, సత్యవేడు, సూళ్లూరుపేట, గూడూరు నియోజక వర్గాల పరిధిలో ఇసుక అక్రమ రవాణాలో ఎమ్మెల్యేల అనుచరులు, బంధువులే కీలక పాత్రపోషిస్తున్నారు. నాయుడుపేట మండలం అన్నమేడు, మర్లపల్లి, భీమవరంలో స్వర్ణముఖి నదినుంచి ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ తండ్రి పేరుతో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. చిత్తూరు రూరల్ మండల పరిధిలో బీఎన్ఆర్పేట రీచ్ను టీడీపీ ఎమ్మెల్యే జగన్మోహన్రావు అనుచరులు అడ్డాగా చేసుకుని అక్రమ వ్యాపారానికి తెర తీశారు. పలమనేరు నియోజక వర్గ పరిధిలోని కౌండిన్య నది, జీడిమాకనపల్లి, పెద్దచెరువులో కేటిల్ఫాం నుంచి వైయస్సార్ జలాశయం దాకా ఇసుకను ట్రాక్టర్లలో తోడి నిల్వ చేస్తున్నారు.కర్నూలులో దర్జాగా దందాకర్నూలు జిల్లాలోని కర్నూలు, కల్లూరు మండలాల పరిధిలో తుంగభద్ర, హంద్రీ నదుల్లో యథేచ్ఛగా ఇసుకను తోడేస్తున్నారు. సుంకేసుల, మునగాలపాడు, నిడ్జూరు, పంచలింగాల తదితర గ్రామాల్లో అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు గ్రామానికి ఒకరిని నియమించుకుని దర్జాగా ఇసుక దందా నిర్వహిస్తున్నారు. కర్నూలు జిల్లా మునగాలపాడు సమీపంలో తుంగభద్ర నదీ తీరంలో ఇసుకను తవ్వి ట్రాక్టర్లలో తరలిస్తున్న అక్రమార్కులు పెద్ద సంఖ్యలో ట్రాక్టర్లు, టిప్పర్లు, లారీలు హైదరాబాద్కు తరలి వెళుతున్నాయి. ఒక్కో ట్రాక్టర్కు నెలకు రూ.10 వేలు చొప్పున పోలీసు అధికారులకు మామూళ్లు ఇస్తున్నారు. రీచ్ల వద్ద అదనంగా రూ.1,000 వసూలు చేస్తున్నారు. టిప్పర్కు రూ. 15 వేలు ఇవ్వాల్సిందే. ఈ డబ్బంతా స్థానిక ప్రజాప్రతినిధి భర్తకు చేరుతోంది. వైఎస్సార్ జిల్లాలో పచ్చ నేతల చేతివాటంవైఎస్సార్ జిల్లాలో కొండాపురం మండలం బెడుదూరు నుంచి స్థానిక టీడీపీ నేతలు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. పెండ్లిమర్రి, కమలాపురం మండల పరిధిలోని ఇసుక రీచ్ల నుంచి స్థానిక ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్యరెడ్డి అనుచరులు అక్రమ వ్యవహారాలు కొనసాగిస్తున్నారు. నాగావళిని చెరబట్టిన ఇసుకాసురులు విజయనగరం జిల్లా సంతకవిటి మండలంలో టీడీపీ నాయకులు నాగావళిని చెరబట్టారు. జావాం సమీపంలో రెండు పొక్లెయినర్లతో రాత్రీపగలు తవ్వుతున్నారు. బొబ్బిలి, బాడంగి, రామభద్రపురం మండలాల్లో ఇసుక అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. పెంట, అలజంగి, కారాడ గ్రామాల వద్ద వేగావతీ నదీతీరంలో ప్రభుత్వ ఇసుక రీచ్ లేకపోయినా వేలం పాట నిర్వహించి మరీ ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గంలో నాగావళి నదీతీరం వెంబడి ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా యథేచ్ఛగా సాగిపోతోంది. జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ కనుసన్నల్లోనే తవ్వకాలు జరుగుతున్నాయి.వేదవతిని ఊడ్చేస్తున్న తమ్ముళ్లు..అనంతపురం జిల్లాలోని కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన రాయదుర్గంలో ఇసుక అక్రమ రవాణా పెద్దఎత్తున జరుగుతోంది. కణేకల్లు, బొమ్మనహాళ్, డి హీరేహాళ్, రాయదుర్గం, గుమ్మఘట్ట మండలాల్లో వేదావతి హగరి నది చుట్టూ కర్ణాటక సరిహద్దు ఆనుకుని ఉంది. టీడీపీ నాయకులు చీకటి పడగానే జేసీబీలతో టిప్పర్లలో ఇసుక లోడ్చేసి బళ్లారి, బెంగళూరు, తుమకూరు, చిత్రదుర్గం, సండూరు తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా ఇసుక అడ్డగోలుగా అక్రమ రవాణా జరుగుతోంది. చిత్రావతి, పెన్నా, కుముద్వతి, జయమంగళి నదులను జేసీబీలతో తోడేస్తున్నారు. పెనుకొండ, హిందూపురం, మడకశిర చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కర్నాటకకు భారీగా ఇసుక తరలిస్తున్నారు. రొద్దం, చిలమత్తూరు, పుట్టపర్తి, గోరంట్ల, హిందూపురం నుంచి రాత్రింబవళ్లు ఇసుక ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా తరలిపోతోంది. -
కూటమిలో కమీషన్ల కొట్లాట!.. ఇన్ఛార్జ్ మంత్రికి షాక్
సాక్షి, అమరావతి / కర్నూలు(అర్బన్): రాష్ట్రంలో కమీషన్లు, వాటాల పంపకంలో తేడాలతో కూటమి పార్టీల నేతల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. అనేక నియోజకవర్గాల్లో నేతల మధ్య పొసగక బహిరంగంగానే ఘర్షణలకు దిగుతున్నారు. వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో మంగళవారం జరిగిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవిత సమక్షంలోనే రెండు వర్గాల నేతలు గొడవకు దిగారు. అక్కడి టీడీపీ ఇన్ఛార్జి బీటెక్ రవి, ఎమ్మెల్సీ రాంగోపాల్రెడ్డి వర్గాలు ఒకరిపై ఒకరు దూసుకు రావడంతో సమావేశం రసాభాసగా మారింది.ఎమ్మెల్సీ రాంగోపాల్రెడ్డి వేదికపై నుంచి దిగిపోవాలని బీటెక్ రవి వర్గం గొడవకు దిగడంతోపాటు ఆయనపై దాడికి యత్నించింది. మంత్రి సవిత, ఇతర నేతలు ఎంత సర్దిచెప్పినా, ఇరు వర్గాల మధ్య తోపులాట, తిట్లవర్షం కొనసాగింది. మద్యం, ఇసుక, మైనింగ్లో వచ్చిన అవినీతి డబ్బు పంపకాలు, కమీషన్ల తేడాలతో ఇరు వర్గాల మధ్య చాలా రోజులుగా పరస్పరం దూషణలు, ఆరోపణలు చేసుకుంటున్నాయి. అవి శ్రుతిమించడంతో మంగళవారం విభేదాలు రచ్చకెక్కాయి. మంత్రి నిమ్మలను నిలదీసిన ఆదోని టీడీపీ శ్రేణులు కర్నూలు స్టేట్ గెస్ట్హౌస్ వేదికగా టీడీపీ, బీజేపీ నేతల మధ్య విభేదాలు బట్టబయలయ్యాయి. ఏకంగా మంత్రి నిమ్మల రామానాయుడినే టీడీపీ శ్రేణులు నిలదీశాయి. బీజేపీకి చెందిన ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి తమను పట్టించుకోవడం లేదంటూ టీడీపీ క్యాడర్ ఆందోళనకు దిగింది. ఆదోని ఎమ్మెల్యే డౌన్ డౌన్.. అంటూ కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. ఆదోని టీడీపీ ఇన్ఛార్జి మీనాక్షి నాయుడు, ఎమ్మెల్యే పార్థసారథి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. పార్థసారథి టీడీపీ నేతలను దూరం పెట్టడం, కాంట్రాక్టర్లు, పనుల్లో వారికి వాటాలు ఇవ్వనీయక పోవడంతో వారు తీవ్ర స్థాయిలో గొడవకు దిగారు.‘ఆదోని నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ బి.పార్థసారథి మమ్మల్ని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఆదోనిలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు బిచ్చగాళ్లు అయిపోయారు. ఇక నుంచి అలా జరగడానికి వీల్లేదు. ఏ పనిలోనైనా 70 శాతం టీడీపీ, మిగిలిన 30 శాతం ఎమ్మెల్యేకు అప్పగించాలి. మేము లేకుంటే బీజేపీ ఎలా గెలిచేది? దమ్ముంటే ఆయన రాజీనామా చేసి మళ్లీ బీజేపీ తరఫున గెలవాలని సవాల్ చేస్తున్నాం. ఎక్కడో ఉన్న ఆయన్ను తీసుకువచ్చి మా నెత్తిన కూర్చోబెట్టారు’ అంటూ మంత్రిని చుట్టుముట్టారు. వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేస్తూ నాలుగు మాటలు మాట్లాడి, మంత్రి గెస్ట్హౌస్లోకి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ నేతలు చొచ్చుకు రావడంతో గెస్ట్హౌస్ డోర్ ఆద్దాలు పగిలిపోయాయి. తిరువూరులో తారాస్థాయికి విభేదాలు ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, అక్కడి పార్టీ క్యాడర్ మధ్య మొదటి నుంచి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. క్యాడర్కు వ్యతిరేకంగా కొలికిపూడి నియోజకవర్గంలో వీరంగం వేయడం, వారు తిరుగుబాటు చేయడంతో అక్కడ పరిస్థితి చేయిదాటి పోయింది. క్యాడర్ అంతా కలిసి కొలికపూడి తమకు వద్దని నియోజకవర్గంతోపాటు మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి వచ్చి ఆందోళనలు చేసింది. దీంతో రెండు వర్గాలను బుజ్జగించడం, చివరికి కొలికపూడిని పిలిచి విచారించడం మినహా పార్టీ అధిష్టానం ఏమీ చేయలేకపోయింది. వర్మ వర్సెస్ జనసేన కాకినాడ జిల్లా పిఠాపురంలో ఇటీవల టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ, జనసేన క్యాడర్ మధ్య విభేదాలు రాజుకుంటున్న విషయం తెలిసిందే. వర్మకు వ్యతిరేకంగా జనసేన ప్లీనరీ సమావేశంలో ఎమ్మెల్సీ నాగబాబు చేసిన వ్యాఖ్యలపై టీడీపీలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఈ క్రమంలో ఐదు రోజుల క్రితం నాగబాబు పిఠాపురంలో పర్యటించగా, టీడీపీ శ్రేణులు ఆయన్ను అడ్డుకుని నినాదాలు చేశాయి. వర్మకు మద్దతుగా వారు నాగబాబును నిలదీయడం చర్చనీయాంశమైంది. అనేక నియోజకవర్గాల్లో ఆయా పార్టీల నేతల మధ్య వివాదాలు సర్వసాధారణంగా మారాయి.ఇన్ఛార్జి మంత్రిని లెక్క చేయని చిత్తూరు ఎమ్మెల్యేలు చిత్తూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న మండిపల్లి రాంప్రసాద్రెడ్డిని ఆ జిల్లా ఎమ్మెల్యేలు అసలు పట్టించుకోక పోవడం చర్చనీయాంశంగా మారింది. తనకు మంత్రి పదవి రాకపోవడంతో అసంతృప్తిగా ఉన్న ఆ జిల్లా సీనియర్ నేత, పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్రెడ్డి నేతృత్వంలో ఎమ్మెల్యేలు ఇన్ఛార్జి మంత్రిని లెక్క చేయడం లేదు. ఇంత వరకు సమన్వయ కమిటీ సమావేశమే మంత్రి నిర్వహించలేకపోయారు. ఏ నియోజకవర్గంలోనూ ఆయన పర్యటించేందుకు ఎమ్మెల్యేలు ఒప్పుకోవడం లేదని సమాచారం. అందుకే టీడీపీ ఎమ్మెల్యే లేని పుంగనూరుకు వెళ్లి, మొక్కుబడిగా మాట్లాడి వచ్చేస్తున్నారు. ఇతరత్రా ఎక్కడికైనా మంత్రి వెళితే ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదు. మీరు కూడా వెళ్లొద్దంటూ వారి ముఖ్య అనుచరులను ఆదేశిస్తున్నట్లు సమాచారం. -
జనసేన నేతల మధ్య రగడ.. అర్ధరాత్రి ఉమ ఇంటిపై దాడి
సాక్షి, కోనసీమ జిల్లా: ఏపీలో జనసేన పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. పార్టీలో రెండు వర్గాల నేతల మధ్య దాడి ఘటన చోటుచేసుకుంది. తాజాగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జనసేన నాయకుడిపై దాడి చేసిన ఘటనలో పార్టీ మండల అధ్యక్షుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. జనసేన నాయకుడు తొలేటి ఉమకు తీవ్ర గాయాలు కావడంతో ఆయన్ను ఆసుపత్రికి తరలించారు.వివరాల ప్రకారం.. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అయినవిల్లిలో జనసేన పార్టీ నేతల మధ్య విభేదాలు పీక్ స్టేజ్కు చేరుకున్నాయి. పార్టీ నాయకుడు తోలేటి ఉమపై జనసన మండల అధ్యక్షుడు పోలిశెట్టి రాజేష్, ఆయన అనుచరులు దాడి చేశారు. ఆదివారం అర్ధరాత్రి రాజేష్, అనుచరులు.. ఉమ ఇంట్లోకి చొరబడి కర్రలతో దాడి చేశారు. ఈ దాడి సందర్భంగా ఉమను తప్పించే ప్రయత్నం చేసిన ఆయన భార్యపై కూడా వారు దాడి చేయడంతో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి.రాజేష్ వర్గం.. ఉమపై కర్రలతో విచక్షణారహితంగా దాడి చేయడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో, అర్ధరాత్రి హుటాహుటిన ఉమను అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మరోవైపు.. ఉమపై దాడి ఘటనను సీరియస్గా తీసుకున్న అతడి అనుచరులు.. రాజేష్ కారును ధ్వంసం చేశారు. దాడి ఘటన కారణంగా ఉద్రిక్తత నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు.. జనసేన మండల అధ్యక్షుడు పోలిశెట్టి రాజేష్, సహా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఆదివారం మధ్యాహ్నం పి.గన్నవరం పార్టీ ఆఫీసులో జరిగిన సమావేశంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదం కారణంగానే దాడి జరిగినట్టు పలువురు చెబుతున్నారు. -
కాకినాడ జిల్లా పిఠాపురంలో ముదురుతున్న టీడీపీ, జనసేన పంచాయితీ
-
కూటమిలో కుంపట్లు రాజేస్తున్న ఎమ్మెల్సీ నాగబాబు.. టీడీపీ శ్రేణులపై కేసులు
కాకినాడ జిల్లా,సాక్షి: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఎమెల్సీ నాగబాబు పర్యటన కూటమిలో కుంపట్లు రాజేస్తోంది. పిఠాపురంలో వరుస పర్యటనలు చేస్తున్న నాగబాబును టీడీపీ శ్రేణులు అడుగడునా అడ్డుకుంటున్నారు. ఈ తరుణంలో పిఠాపురంలో టీడీపీ కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.శనివారం ఎమ్మెల్సీ నాగబాబు పర్యటనలో భాగంగా గొల్లప్రోలు మండలం, చిన్న జగ్గంపేటలో టీడీపీ కార్యకర్తలు జనసేనకు వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మను ఆహ్వానించడం లేదంటూ ఆయన అభిమానులు,టీడీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.ఈ తరుణంలో తనను అడ్డుకుని మోటార్ సైకిల్ అద్దాలు పగలగొట్టారని టీడీపీ కార్యకర్తలపై జనసేన నేత మొయిళ్ళ నాగబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే సంఘటనలో తమ విధులకు ఆటంకం కల్పించారని టీడీపీ కార్యకర్తలపై పిఠాపురం అడిషనల్ ఎస్సై జానీ భాష మరో ఫిర్యాదు చేశారు. ఈ రెండు ఫిర్యాదులపై గొల్లప్రోలు పోలీసులు వేరు వేరుగా కేసులు నమోదు చేశారు.అంతకుముందు పిఠాపురంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కుమారపురంలో సీసీ రోడ్ల ప్రారంభోత్సవాలకు ఎమ్మెల్సీ నాగబాబు రాగా.. టీడీపీ, జనసేన కార్యకర్తలు బలాబలాలు ప్రదర్శించుకున్నారు. జై వర్మ, జై టీడీపీ అంటూ తెలుగుదేశం కార్యకర్తలు నినాదాలు చేయగా.. ప్రతిగా జై జనసేన, జై పవన్ అంటూ జనసైనికులు నినాదాలు చేశారు. సీసీ రోడ్ల ప్రారంభోత్సవాలకు వర్మకు ఆహ్వానం లేదంటూ టీడీపీ నాయకులు ఆరోపించారు. ఈ తరుణంలో టీడీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేయడంతో పిఠాపురం కూటమిలో నాగబాబు పర్యటన కుంపట్లు రాజేస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
అడుగడుగునా ఆధిపత్య పోరు
పిఠాపురం: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో జనసేన నేత, ఎమ్మెల్సీ కె.నాగబాబు రెండో రోజు శనివారం నిర్వహించిన కార్యక్రమాలు రసాభాసగా జరిగాయి. టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ అనుచరులు అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గెలుపు టీడీపీ నేత వర్మ వల్లే అయ్యిందని, తన నియోజకవర్గాన్ని, తనకు రావాల్సిన సీటును త్యాగం చేసిన ఆయనే లేకపోతే పవన్కు పదవి ఎక్కడిదని టీడీపీ వర్గాలు బాహాటంగా విమర్శిస్తూ నినాదాలు చేయడం చర్చనీయాంశంగా మారింది. టీడీపీ నేతల తీరును దుయ్యబడుతూ జనసేన వర్గాలూ పోటీగా నినాదాలు చేశాయి. టీడీపీ నేతలను బయటకు గెంటేసే ప్రయత్నం చేశాయి. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాటలు చోటు చేసుకున్నాయి. ఈ సందర్భంగా నాగబాబు మీడియాతో మాట్లాడుతూ, తాము అభివృద్ధికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తామని, ఎన్ని అడ్డంకులు సృష్టించినా అభివృద్ధి చేసి తీరుతామని చెప్పారు. నినాదాలు... ప్రతి నినాదాల హోరు పిఠాపురం మండలం కుమారపురంలో సీసీ రోడ్లు ప్రారంభించడానికి వచ్చిన నాగబాబు కాన్వాయ్ని టీడీపీ నేతలు అడ్డుకున్నారు. జై వర్మ అంటూ నినదిస్తూ నాగబాబుకు తమ నిరసన తెలిపేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు. ప్రతిగా జనసేన వర్గాలు నాగబాబుకు అండగా నినాదాలు చేశారు. ఇరు వర్గాలూ నినాదాలు చేస్తూ ఒకరిపై ఒకరు దూసుకు వచ్చే ప్రయత్నం చేయడంతో కుమారపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాగా, గొల్లప్రోలు మండలంలో తమను అడ్డుకుని దౌర్జన్యానికి దిగారంటూ టీడీపీ కార్యకర్తలపై జనసేన కార్యకర్తలు గొల్లప్రోలు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చంద్రబాబు ఫొటో లేకుండా ఫ్లెక్సీలు, శిలాఫలకాలా? కొత్తపల్లి మండలం ఉప్పాడ శివారు కొత్త మాయాపట్నంలో తమ పార్టీ నేత ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటో లేకుండా ఫ్లెక్సీలు, శిలాఫలకాలు పెట్టారంటూ టీడీపీ నేతలు నిరసన తెలిపి, నాగబాబును అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులు నిలువరించారు. తమను కార్యక్రమాలకు ఆహా్వనించి అవమానించారంటూ టీడీపీ నేతలు జనసేన నేతలపై మండిపడ్డారు. అయితే కార్యక్రమాలకు వచ్చిన వారు హుందాగా వ్యవహరించాలి తప్ప దౌర్జన్యాలు, నిరసనలకు దిగడం ఏమిటని జనసేన వర్గాలు ఎదురు దాడికి దిగాయి. దీంతో ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం చెలరేగింది. పోలీసులు వారిని వారించి, టీడీపీ వర్గాలను దూరంగా తరిమేశారు. ఈ వివాదాల నేపథ్యంలో నాగబాబు పర్యటనను బహిష్కరిస్తున్నట్లు టీడీపీ నేతలు ప్రకటించి, అక్కడి నుంచి వెనుదిరిగారు. మీ పార్టీయే ఎమ్మెల్సీ ఇవ్వలేదు... మాకేంటి సంబంధం: జనసేన వర్గాలు వర్మకు అనుకూలంగా టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేయడంపై జనసేన వర్గాలు మండిపడుతూ.. ‘మీ పార్టీయే వర్మకు ఎమ్మెల్సీ ఇవ్వలేదు. దానితో జనసేనకు ఎటువంటి సంబంధం లేదు. అలాంటప్పుడు ఇక్కడ వర్మకు జిందాబాద్ కొడితే ఉపయోగం ఏమిటి’ అని టీడీపీ నేతలను పలుచోట్ల ఎద్దేవా చేయడం గమనార్హం. -
అభిమానుల గుండెల్లో పవన్ గునపాలు!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన అభిమానులతోపాటు కాపు సామాజిక వర్గం వారందరి గుండెల్లోనూ గునపాలు దించేలా మాట్లాడారు. తన రాజకీయ అవసరాల కోసం ఎవరినైనా వాడుకుని వదిలేస్తానని, వారి ఆకాంక్షలకు తగినట్లు పనిచేయడం తన పని కాదన్నట్టుగా వ్యవహరించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో డ్రామా ‘పీ-4’ ప్రారంభం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పవన్ మాట్లాడుతూ తనకు సత్తా లేకపోవడం వల్లనే సమర్థుడు, అనుభవజ్ఞుడు అయిన చంద్రబాబుకు 2014 నుంచి మద్దతిస్తున్నాని చెప్పడం విని అభిమానులు హతశులయ్యే ఉంటారు.చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్లకు మాత్రం ఈ మాటలు చెవికి ఇంపుగా అనిపించి ఉండవచ్చు. పవన్ మన చెప్పుచేతల్లోనే ఉంటాడులే అని మనసులో ఉప్పొంగిపోయి ఉండవచ్చు కూడా. కానీ.. పదేళ్లుగా పవన్ ఎక్కడకు వెళ్లినా సీఎం, సీఎం అంటూ నినాదాలు చేసే అభిమానుల మాటేమిటి? వాస్తవానికి ఇలాంటి అభిమానులు పవన్ లాంటి నేతను నమ్ముకోవడం వారి దురదృష్టం. ఒక్కటైతే వాస్తవం.. పవన్ ఏనాడూ నిజాయితీగా, నిబద్ధతతో వ్యవహరించలేదు. అభిమానులకు కష్టంగా ఉండవచ్చు కానీ.. ఆయన కేవలం సినిమా గ్లామర్ మాత్రమే ఆయన్ను ఈ స్థాయికైనా చేర్చింది. కాపు సామాజికవర్గం నేతలు చాలా మంది ఈయన కన్నా బాగా వారికి అండగా నిలబడ్డారు. అయినా ఎందుకో వారికి ఈయనపైన అభిమానం పెరిగింది. బహుశా మెగాస్టార్ చిరంజీవి సోదరుడు కావడం, ప్రజారాజ్యం పార్టీని పెట్టినా నిలదొక్కుకోలేకపోయారన్న సానుభూతి కావచ్చు. పవన్ కళ్యాణ్ ఆ లోటును తీర్చి తాము కోరుకున్న విధంగా ముఖ్యమంత్రి అవుతారన్న ఫీలింగ్ కావచ్చు.. వీటన్నిటి రీత్యా వీరంతా మద్దతు ఇచ్చారు.గతంలో కాపు సామాజికవర్గం వైఎస్సార్సీపీకి కూడా బలంగా మద్దతు ఇచ్చినా, 2024లో మాత్రం అత్యధికులు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వైపే మొగ్గారన్నది ఎక్కువ మంది విశ్లేషణ. అందులో వాస్తవం కూడా ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే విపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఈయనకు గాలం వేసి తనవైపు లాగడంలో సఫలమయ్యారు. పవన్ కళ్యాణ్ కూడా 2019లో ఘోర పరాజయం రీత్యా భయపడి, చంద్రబాబు ఏం చెబితే అది చేశారని అంటారు. జాక్ పాట్ తగిలినట్లుగా కూటమి అధికారంలోకి రావడం, చంద్రబాబు సీఎం, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు కుమారుడు లోకేశ్ మంత్రి అయ్యారు. చంద్రబాబు, పవన్లకంటే లోకేశే ప్రభుత్వాన్ని శాసిస్తున్నారని, రెడ్ బుక్ పేరుతో అరాచకాలను ప్రోత్సహిస్తున్నా వీరు మాట్లాడలేని పరిస్థితి ఏర్పడిందని చాలామంది చెబుతున్నారు.పవన్ కళ్యాణ్ ఈ క్రమంలో అప్పడప్పుడూ తన శాఖను పర్యవేక్షిస్తూ, మిగిలిన టైమ్ లో సనాతని వేషం కట్టడం, ఇతర రాష్ట్రాలలో పర్యటించడం, ఎప్పుడైనా చంద్రబాబుకు అవసరమైతే ఆ పాత్రను పోషించడం, వైఎస్సార్సీపీ అధినేత జగన్ను నిందించడం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పవన్ మొదటి నుంచి గందరగోళంగానే మాట్లాడుతూ వచ్చారు. ఆయన కావాలని అలా మాట్లాడుతున్నారా? లేక అవగాహన లేక వ్యవహరిస్తున్నారో తెలియదు. గత పదేళ్లలో ఆయన ఎన్ని రకాలుగా మాటలు మార్చారో చెప్పతరం కాదు. తన వ్యక్తిగత జీవితం మొదలు, తన పుట్టిన ప్రదేశం, చదువుకున్న ఊరు, ఇతరత్రా పలు అంశాలపై భిన్నమైన ప్రకటనలు చేసినా ఆయన అభిమానులు, కాపు సామాజికవర్గం వారు ఆదరించారనే చెప్పాలి.పిఠాపురంలో ఎన్నికలకు ముందు టీడీపీ నేత వర్మ చేతులు పట్టుకుని మీరే గెలిపించాలని అన్నారు. గెలిచిన తర్వాత ఆయన దేముందని తన సోదరుడు నాగబాబు అంటే కనీసం ఖండించలేదు. పిఠాపురం సభలో నలభై ఏళ్ల టీడీపీని తానే నిలబెట్టానని చెప్పారు. కాని ఇప్పుడేమో తనకు సత్తా లేదని అంటారు. తన తండ్రి గురించి సైతం రెండు రకాలుగా మాట్లాడటం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఆయన కమ్యూనిస్టు, దీపారాధన దీపం వద్ద సిగరెట్ ముట్టించుకున్నారని ఒకసారి, ఎప్పుడూ రామజపం చేస్తారని మరోసారి చెప్పి విస్మయ పరిచారు. 2017 తర్వాత తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు, లోకేశ్లను ఎంత తీవ్రంగా విమర్శించారో, వారిద్దరిని ఎంత అవినీతిపరులుగా చూపారో, ఇప్పుడు అంతకన్నా ఎక్కువగా పొగుడుతున్నారు. వారిలో ఇప్పుడు అవినీతి కనిపించడం లేదు. సమర్దత మాత్రమే కనిపిస్తోంది. చంద్రబాబు పదిహేనేళ్లు సీఎంగా ఉండాలని అంటున్నా, భవిష్యత్తులో లోకేశ్ సీఎం అయినా కాదనకుండా పవన్ కళ్యాణ్ విధేయుడుగానే ఉంటారన్నది పలువురి నమ్మకంగా ఉంది.చంద్రబాబు, లోకేశ్లు కూడా ఆ రోజుల్లో పవన్ను బాగానే విమర్శించేవారు. అయినా ఇప్పుడు వారు పొగుడుతున్నట్లు నటిస్తున్నారు. రెండు పార్టీలు కలిసి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలు గురించి పవన్ కళ్యాణ్ నోరు విప్పడం లేదు కనుక వారికి ఆనందంగానే ఉంటుంది. అలా ఉన్నంతకాలం ఆయన మంచి మిత్రుడుగానే కనిపిస్తారు. ప్రశ్నించడానికి పార్టీని పెట్టానని చెప్పిన పవన్ అసలు ప్రశ్న అంటే ఏమిటో మర్చిపోయారు. గతంలో తన తల్లిని, తనను దూషించారని చెప్పిన టీడీపీని భుజాన ఎత్తుకున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఏకంగా తనకు సత్తా లేదని చెప్పడం చూస్తే, ఒకరకంగా నిజం చెప్పారని కొందరు, తమ పరువు తీశారని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. పవన్ ఇంతగా దిగజారిపోతారని తాము ఊహించలేకపోయామని ఆయనకు మద్దతు ఇచ్చినవారు వాపోతున్నారు.కాపు సామాజికవర్గ నేతలు పలువురు ముఖ్యమంత్రి చంద్రబాబుపై హోరాహోరీ పోరాడారు. కాపు రిజర్వేషన్ ఉద్యమం పెద్ద ఎత్తునసాగింది. అలాంటి వారందరిని కాదని, కాపుల రిజర్వేషన్ గురించి, కాపుల కులభావన గురించి పలుమార్లు మాట మార్చిన పవన్నే ఈసారి కాపు వర్గం వారు ఎంపిక చేసుకున్నారు. సీఎం అని అభిమానులు నినాదాలు ఇస్తుంటే గతంలో ఓటు వేయండి. సీఎం అవుతానని అనేవారు. ఆ తర్వాత టీడీపీతో పొత్తు అనంతరం తమకు సీఎం అయ్యేంత బలం లేదని, ఎమ్మెల్యేగా గెలవడం ముఖ్యం అన్నట్లు మాట్లాడేవారు. అదే పవన్ కళ్యాణ్ టీడీపీని తానే గెలిపించానని చెబితే టీడీపీ సోషల్ మీడియా ఆయనపై విరుచుకుపడింది. జనసేన మద్దతుదారులను ఒక ఆట ఆడుకుంది. అయినా పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదు. తిరువూరులో టీడీపీ ఎమ్మెల్యే తీరుతెన్నులపై అక్కడి జనసేన స్థానిక నేత ఆరోపణలు చేస్తే వాటి గురించి వాకబు చేయకుండా, ఆయనకే నోటీసు ఇవ్వడం విశేషం. దీన్ని బట్టి పవన్ పార్టీని బలోపేతం చేసుకోవడం కన్నా, పదవిని ఎంజాయ్ చేయడం, టీడీపీకి సేవ చేయడం ద్వారా తాను కూడా లబ్ది పొందడానికే పరిమితం అయ్యారని అర్థం అవుతోందని అంటున్నారు. చిత్రం ఏమిటంటే ఏపీలో సత్తా లేదని చెబుతున్న పవన్ కళ్యాణ్ కొద్ది కాలం క్రితం తమిళనాడు వెళ్లి అక్కడ జనసేనను విస్తరిస్తానని చెప్పి వచ్చారు. ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్లుగా ఉందీ వైఖరి. వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిందే చంద్రబాబు కోసమని, ఆయన నుంచి వచ్చే ప్రయోజనాల కోసమని ఎద్దేవా చేశారు. బీజేపీ ఆడినట్లు పవన్ ఆడతారని కొంతమంది అనుకుంటున్నా, ప్రస్తుతానికి చంద్రబాబు ఏం చెబితే అది చేయడానికి సిద్దంగా ఉన్నారని అంటున్నారు. ప్రభుత్వపరంగా చూస్తే ఆయన శాఖలలో వేలాది ఫైళ్లు పెండింగులో ఉన్నట్లు చంద్రబాబు సర్కారే ప్రకటించింది. ఇందులో మొదటి ర్యాంకు ఇచ్చింది. అయినా పవన్ దానిపై పెద్దగా ఫీల్ అయినట్లు లేరు. నిజానికి పవన్ కళ్యాణ్ పెద్దగా చదువుకోలేదు. కానీ, వేల పుస్తకాలు చదువుకున్నట్లు కనిపించాలన్నది ఆయన తాపత్రయంగా కొందరు అభివర్ణిస్తుంటారు. అసలు ఏ మనిషి అయినా ఎనభై వేల పుస్తకాలు చదవడం సాధ్యమేనా అని ఒకరు ప్రశ్నించారు. అదేమిటంటే ఒక మనిషి వందేళ్లు జీవిస్తాడనుకుంటే, అందులో మొదటి పదిహేనేళ్ల నుంచి ఇరవై ఏళ్ల వరకు విద్యకు కేటాయించవలసి ఉంటుంది. అలాగే చివర ఇరవై ఏళ్లు కూడా పెద్దగా చదవలేని పరిస్థితి రావచ్చు. మనిషి వందేళ్లు జీవించడం అంటే 36500 రోజులు బతకడం అన్నమాట. రోజూ ఒక పుస్తకం చదవడం ఎక్కువ సందర్భాలలో అసాధ్యం. అందువల్ల ఎవరైనా ఏభై వేల పుస్తకాలనో, ఎనభై వేల పుస్తకాలనో, రెండు లక్షల పుస్తకాలనో చదివేశానని చెబితే అదంతా గ్యాస్ అని ఆయన వివరించారు.అంటే ఇదంతా రాజకీయ నేతల హిపోక్రసీ అన్నమాట. ప్రభుత్వపరంగా పెద్దగా పని చేయలేక, ఇటు పార్టీ పరంగా నిర్మాణం చేయలేక, ఏదో పదవిని ఎంజాయ్ చేస్తూ ఉన్న పవన్ కళ్యాణ్ పార్టీని నడపడం కన్నా వేరే పార్టీలో విలీనం చేయడం బెటర్ కదా అని కొందరు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ సత్తా ఉపన్యాసాలలో అబద్దాలు చెప్పడంలో మాత్రం బాగానే ఉంది. కానీ, ప్రజలకు ఉపయోగపడటంలో మాత్రం విషయం కొరవడింది. అందుకే ఆయన తనకు సత్తా లేదని అంగీకరించారని అనుకోవచ్చా!.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
Big Question :సత్తా లేనోడి తాలూకా
-
ఎస్ఐకి డబ్బులు కొట్టాం.. సెక్షన్లు తీసిపడేశారు!
తణుకు అర్బన్: ‘పెట్టిన కేసు వాపసు తీసుకోకపోతే నీ ఉద్యోగం పీకించేస్తా’ అంటూ జనసేన దువ్వ అధ్యక్షుడు శ్రీరాములు దుర్గారావు అలియాస్ చిన్ని, తణుకు మండల అధ్యక్షుడు చిక్కాల వేణుతో కలిసి వెంకటలక్ష్మి అనే ఒక మహిళా ఉద్యోగిని వేధించిన వ్యవహారం మరింత ముదురుతోంది. ఈ ఇరువురిపై కేసు నమోదయిన నేపథ్యంలో వేణు మాట్లాడినట్టుగా ఉన్న ఆడియో తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఆడియోలో ఉన్న ప్రకారం.. ‘ఇక్కడ ఎవరున్నారు. ఏమి గొడవ జరిగింది. ఎంఎల్ఏ దగ్గరకు వెళ్లారు. కేసు పెట్టారు. ఎస్ఐని సెక్షన్లు తీసేయమన్నాం. తియ్యనన్నారు. ఎంతకావాలని అడిగాం. రెండో మాట లేదు. టేబుల్ పైన పెట్టేసి వచ్చేశాం. సెక్షన్లు తీసిపడేసారు. ఏమవుతాది..?’ అన్న మాటలు ప్రకంపనలు సృష్టిస్తుండడంతో పోలీసు వర్గాలకు సైతం చిర్రెత్తుకొచ్చినట్లు సమాచారం. ఇప్పటివరకు అధికార బలంతో అధికారులపై ఒత్తిడి తెస్తున్న కూటమి నాయకులు, నేడు పోలీసులనే కొనేశాం అని ధైర్యంగా చెప్పే పరిస్థితి తణుకు నియోజకవర్గంలో దాపురించడంతో ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రాణభయం ఉంది: బాధిత మహిళ ఈ వ్యవహారంపై పనిగట్టుకుని అందరికీ ఫోన్లు చేసి.. తనకు దూరంగా ఉండాల్సిందిగా జనసేన నాయకులు చెబుతున్నారని బాధితురాలు వెంకటలక్ష్మి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనపై చాలా కక్షపూరితంగా ఉన్నారని, తనను బతకనిచ్చేలా లేరన్నారు. ఈ వ్యవహారంపై తణుకు రూరల్ ఎస్ఐ చంద్రశేఖర్ను సాక్షి వివరణ కోరగా వెంకటలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామన్నారు.గతేడాది జూలైలో బాధితురాలు బావ నరసింహస్వామి అలియాస్ అంతర్వేదికి– చిన్నికి మధ్య ఘర్షణలో అంతర్వేదికి ముఖంపై గాయాలయ్యాయి. అప్పట్లో దీనిపై కేసు నమోదైంది. ఈ కేసును వెనక్కి తీసుకునేలా అంతర్వేదిని ఒప్పించాలని చిన్ని, వేణులు వెంకటలక్ష్మిపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. వేధింపులు భరించలేక ఆమె వీరిరువురిపై కేసు పెట్టారు. -
కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన నేతల ఓవరాక్షన్
-
వలంటీర్లు ‘పచ్చడి’
ఇదిగో బాబు.. ‘ఈనాడు’లో నీ ఉగాది హామీసరిగ్గా ఏడాది కిందట టీడీపీ కార్యాలయంలో జరిగిన ఉగాది వేడుకలో చంద్రబాబు మాట్లాడుతూ.. ‘వలంటీర్లను తొలగించం. గౌరవ వేతనాన్ని రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతాం’ అని ప్రకటించారు. కానీ గద్దెనెక్కిన తర్వాత వలంటీర్లను నిండా ముంచేశారు. సాక్షి, అమరావతి: ఎన్నికలకు ముందు ప్రజలకు సూపర్ సిక్స్ సహా ఎన్నో హామీలిచ్చి.. ఓట్లు వేయించుకుని గద్దెనెక్కిన చంద్రబాబు, కూటమి పార్టీల నేతలు ఆపై మాట మార్చేశారు. ‘సూపర్ సిక్స్’ అమలు చేస్తానని మోసపూరిత హామీలతో అధికారం చేపట్టాక ప్రతి వర్గాన్ని మోసం చేసిన చంద్రబాబు.. వలంటీర్లను సైతం మోసం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల్లో ఎలాంటి అవినీతి, అక్రమాలు, పైరవీలు, పక్షపాతం లేకుండా క్షేత్ర స్థాయిలో సేవలు అందించిన వలంటీర్ల వ్యవస్థనూ ఒక్కసారిగా కుప్పకూల్చారు. కులం, మతం, వర్గం, ప్రాంతం, రాజకీయం.. చివరకు తనకు ఓటు వేయని వారికైనా సరే అర్హత ఉంటే చాలు ప్రభుత్వ పథకాలు వర్తింప చేయాలన్న నాటి సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు వలంటీర్లు విధులు నిర్వర్తించారు. వారికి కేటాయించిన ఇళ్లకు స్వయంగా వెళ్లి.. వారికి ఏయే పథకాలకు అర్హత ఉందో గుర్తించి.. వారితో దరఖాస్తు చేయించి.. ఆయా పథకాలు వర్తింప చేసి.. ప్రభుత్వం ద్వారా లబ్ధి కలిగేలా కృషి చేశారు. ఇంతగా సేవలు అందించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రామ సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థను ప్రస్తుత టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టింది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం నుంచి వలంటీర్లకు చిక్కులు మొదలయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వలంటీర్లకు విధులు అప్పజెప్పడం మానేసింది.ఇప్పుడు మళ్లీ ఉగాదొచ్చింది..ఇప్పుడు మళ్లీ ఉగాది వచ్చింది. గత ఏడాది జూన్లో రాష్ట్రంలో కొత్తగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రిగా చంద్రబాబే కొనసాగుతున్నారు. ఈ ఏడాది కాలంలోనే రాష్ట్రంలో వలంటీర్లందరి ఉద్యోగాలు పోయాయి. 2024 జూన్ ఒకటో తేదీన సైతం వలంటీర్లు గౌరవ వేతనాలు పొందారు. అయితే 2023 ఆగస్టు నుంచే రాష్ట్రంలో వలంటీర్ల వ్యవస్థ ఉనికిలో లేదంటూ చంద్రబాబు ప్రభుత్వమే వలంటీర్లందరినీ ఉద్యోగాల నుంచి తొలగించింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు గత ఏడాది ఉగాది పండుగ రోజున చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పుడు వారి వేతనాలు పెరగకపోగా, ఏకంగా వారి ఉద్యోగాలే లేకుండా పోయాయి. పది నెలలుగా వారి వేతన చెల్లింపులు కూడా నిలిచిపోయాయి. అసలు రాష్ట్రంలో వలంటీర్ల వ్యవస్థే ప్రస్తుతం ఉనికిలో లేదని సాక్షాత్తు ఆ శాఖ మంత్రి బాల వీరాంజనేయస్వామి నిస్సిగ్గుగా ప్రకటించారు. ‘ఆ వ్యవస్థే లేనప్పుడు వారిని ఎలా కొనసాగిస్తాం? వలంటీర్ల వ్యవస్థే లేనప్పుడు జీతాల పెంపు అంశం ఎక్కడ ఉంటుంది?’ అంటూ ఎదురు ప్రశ్నించడంతో వలంటీర్ల దిమ్మ తిరిగిపోయింది. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇదే విషయాన్ని వల్లె వేశారు. ‘అసలు వలంటీర్లు అఫీషియల్గా లేరు. ముఖ్యమంత్రి చంద్రబాబు జీతాలు పెంచడానికి చూస్తున్నా, జీవోలో ఎక్కడా వాళ్లు లేరు. ఏదన్నా చేద్దాం.. ముందుకెళదామంటే వాళ్లు ఉద్యోగంలో ఉంటే చేయవచ్చు’ అంటూ వ్యాఖ్యానించడంతో అందరూ విస్తుపోయారు. దీంతో తామంతా దారుణంగా మోసపోయామని వలంటీర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కారు. గత ఉగాది పండుగ పూట మీకు తీపి కబురు చెబుతున్నామన్న చంద్రబాబు ఇంత దుర్మార్గంగా తమను మోసం చేస్తారని అనుకోలేదని నిప్పులు చెరిగారు. తమకు ఇచ్చిన హామీని అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా పది నెలలుగా ఎక్కడికక్కడ ధర్నాలకు దిగారు. 2.66 లక్షల మంది వలంటీర్లు వివిధ రూపాల్లో ఆందోళనలు చేయడంతో పాటు వినతులు ఇస్తున్నా, చంద్రబాబు ప్రభుత్వం వారి గురించి కనీస ఆలోచన చేయడం లేదు. కరోనా సమయంలో కీలక సేవలువైఎస్ జగన్ హయాంలో ఎలాంటి అవినీతి, వివక్ష, పైరవీలకు తావులేకుండా ఆయా పథకాలను నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దనే అందించారు. ప్రజలకు ప్రభుత్వ ఆఫీసుల్లో ఏ పని ఉన్నా వలంటీర్లే గ్రామ సచివాలయాల ద్వారా చేయించారు. కరోనా వంటి అత్యంత విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రతి నెలా రెండు విడతల చొప్పున కేవలం మూడు రోజుల సమయంలో అన్ని కుటుంబాల్లో ఫీవర్ సర్వే పూర్తి చేశారు. తద్వారా ఎప్పటికప్పుడు రోగుల గుర్తింపులో కీలక పాత్ర పోషించారు. వరదల సమయంలో బాధిత ప్రజలకు గతంలో ఎప్పుడూ లేనంత వేగంగా సహాయక చర్యలు అందించడంలో ముందు వరుసలో నిలిచారు. గత ప్రభుత్వంలో ఈ వ్యవస్థ ఏర్పాటైనప్పటి నుంచి ఎన్నికల వరకు చంద్రబాబు సహా కూటమి నేతలంతా తీవ్ర విమర్శలు చేశారు. తీరా పోలింగ్ తేదీ దగ్గర పడేసరికి మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత 2.66 లక్షల కుటుంబాలను నిట్ట నిలువునా ముంచేశారని వలంటీర్లు వాపోతున్నారు. ఇప్పుడు ఊడగొట్టిన ఉద్యోగాలే ఎక్కువ కూటమి ప్రభుత్వంలో కొత్తగా ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారని చూస్తే ఆ ఊసే లేదు. ఊడకొట్టిన ఉద్యోగాలే ఎక్కువ. 2.66 లక్షల మంది వలంటీర్ల ఉద్యోగాలు పోయాయి. బేవరేజ్ కార్పొరేషన్లో 18 వేల మందిని తొలగించారు. ఫైబర్ నెట్, ఏపీఎండీసీ, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్, వైద్య ఆరోగ్య శాఖ.. ఇలా ఆయా ప్రభుత్వ విభాగాల్లో వేల సంఖ్యలో ఉద్యోగాలు తీసేశారు. ఇవన్నీ ఒక ఎత్తయితే గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులను ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీల్లో సర్దుబాటు చేసే కార్యక్రమం మొదలు పెట్టారు. ఆ విధంగా ఆయా విభాగాల్లో ఉన్న ఖాళీలను పూర్తిగా కుదించేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు..తెలుగుదేశం.. ఎన్డీయే మూడు పార్టీల కూటమి తరఫున మీకు హామీ ఇస్తున్నాం. మీ ఉద్యోగాలు తీసేయం. వలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఉగాది పండుగ రోజున తీపి కబురు చెబుతున్నాం. రూ.5 వేలు కాదు, మీకు రూ.10 వేలు పారితోషకం ఇచ్చే బాధ్యత మాది.-అసెంబ్లీ ఎన్నికల ముందు 2024 ఏప్రిల్ 9న ఉగాది పండుగ సందర్భంగా చంద్రబాబువలంటీర్లకు నేను ఒకటే చెబుతున్నా.. వలంటీర్లలో లక్ష మంది మహిళలున్నారని వైఎస్సార్సీపీ మంత్రులు మాట్లాడుతున్నారు. అమ్మా, నేను ఓ అన్నగా చెబుతున్నా. మీకు ఐదు వేలు వస్తుంటే, ఇంకో ఐదు వేలు పెంచి ఇచ్చే మనసున్న వ్యక్తిని నేను. నేను ఎప్పుడూ మీ పొట్ట కొట్టను. -ఎన్నికల ప్రచార సభలో జనసేన అధినేత పవన్కళ్యాణ్అధికారంలోకి వచ్చాక..వలంటీర్లు అసలు అఫీషియల్గా లేరు ఇప్పుడు. ముఖ్యమంత్రి చంద్రబాబు జీతాలు పెంచడానికి చూస్తున్నా, ఎక్కడా.. జీవోలో వాళ్లు అసలు లేరు. ఏదన్నా చేద్దాం.. ముందుకెళదామంటే వాళ్లు ఉద్యోగంలో ఉంటే చేయవచ్చు. అంటే ఇది ఒక టెక్నికల్ ఇష్యూ అయింది. -నాలుగు నెలల క్రితం మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో సర్పంచుల సంఘ ప్రతినిధుల సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్రూ.4.57 లక్షల కోట్ల పంపిణీలో కీలక పాత్ర2019 ఆగస్టు 15న అప్పటి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతిష్టాత్మక వలంటీర్ల వ్యవస్థకు నాంది పలికింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 50 ఇళ్లకు ఒకరు చొప్పున, పట్టణ ప్రాంతాల్లో 75–100 ఇళ్లకు ఒకరు చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 2.66 లక్షల మందిని నియమించింది. 2024లో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చే వరకు ఎలాంటి వివక్ష, రాజకీయ పక్షపాతం, పైరవీలు, అవినీతికి తావులేకుండా ప్రభుత్వం ద్వారా లబ్ధిని ప్రజల గడప వద్దకే అందజేయడంలో వలంటీర్లు కీలక పాత్ర పోషించారు. ఆ ఐదేళ్లలో రూ.2.73 లక్షల కోట్లు డీబీటీ రూపంలో, మరో రూ.1.84 లక్షల కోట్లు నాన్ డీబీటీ రూపంలో మొత్తంగా రూ.4.57 లక్షల కోట్ల మేర లబ్ధిదారులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించడంలో క్షేత్ర స్థాయిలో క్రియాశీలక పాత్ర పోషించారు. అరచేతిలో వైకుంఠం చూపారుచంద్రబాబు వలంటీర్లకు అరచేతిలో వైకుంఠం చూపారు. అది నిజమనుకుని, ఆ హామీలు నమ్మాం. తీరా అధికారంలోకి వచ్చాక మోసం చేశారు. గతేడాది ఉగాది నాడు నూతన పట్టు వస్త్రాలు ధరించి, నుదుట బొట్టుతో చంద్రబాబు మా భవిష్యత్ గురించి ఎంతగానో తపన పడుతున్నట్లు మాట్లాడారు. మమ్మల్ని ఊరిస్తూ బూటకపు హామీలు ఇచ్చారు. ఆ హామీని నమ్మి దగా పడ్డ వలంటీర్లంతా ఈ ఉగాదిని కూటమి దగా–దినంగా పాటించాలని నిర్ణయించుకున్నాం. పండుగ పూట పస్తుండి నిరసనలు తెలుపుతాం. – హుమాయూన్ బాషా, ఏపీ గ్రామ వార్డు వలంటీర్ల సంఘం అధ్యక్షుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలిసీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉండగా మాకు (వలంటీర్లకు) ఎన్నో హామీలు ఇచ్చారు. అధికారంలోకి రాగానే రూ.10 వేల గౌరవ వేతనం ఇస్తామన్నారు. చంద్రబాబు గత ఉగాది నాడు పచ్చడి తింటూ ఈ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వలంటీర్ల వ్యవస్థ లేదని చెబుతున్నారు. మంత్రులు ‘పుట్టని బిడ్డ’ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. సెప్టెంబర్లో విజయవాడకు వరదలు వచ్చిన సమయంలో మా సేవలు వినియోగించుకున్నారు. పుట్టని బిడ్డతో సేవలు ఎలా చేయించుకున్నారు? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. ఉగాది పర్వదినాన చంద్రబాబు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి. వలంటీర్ వ్యవస్థను కొనసాగించాలి. –గాలి షైనీ, వలంటీర్, విజయవాడమా ఉసురుతో ఈ ప్రభుత్వం పతనం ఉగాది పండుగ రోజున వలంటీర్ వ్యవస్థకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబును మరిచిపోలేం. గతేడాది ఉగాది రోజున వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, వేతనాలు రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చి ఓట్లు వేయించుకున్నారు. కరోనా సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి పని చేసిన మమ్మల్ని సీఎం చంద్రబాబు మోసం చేశారు. వలంటీర్లంతా పేద కుటుంబాలకు చెందిన వారే. అలాంటి కుటుంబాల్లో వలంటీర్ ఉద్యోగం కల్పించి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మేలు చేసింది. కానీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ ఇద్దరూ చేసిన మోసాన్ని మేము మరిచిపోలేం.. మా ఉసురు ఈ ప్రభుత్వ పతనానికి దారి తీయడం ఖాయం. – చేపల రాజు, వలంటీర్, రేవుపోలవరం, అనకాపల్లి జిల్లాదుర్మార్గంగా పక్కన పెట్టేశారువలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, వేతనాలు సైతం రెట్టింపు చేస్తామని గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని విస్మరించి సీఎం చంద్రబాబు మమ్మల్ని మోసం చేశారు. అధికారంలోకి వచ్చి పది నెలలైనా మా గురించి పట్టించుకోవడం లేదు. జీతాలు పెంచే విషయం అటుంచి.. ఏకంగా వలంటీర్ల వ్యవస్థనే రద్దు చేశారు. గత ఐదేళ్లలో వలంటీర్లు ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలు అందించాము. కరోనా సమయంలో మేము చేసిన సేవలు, త్యాగాలు వెలకట్టలేనివి. చంద్రబాబు ఇచ్చిన హామీలు నమ్మి జీతాలు పెరుగుతాయని అనుకున్నాం. తీరా అధికారంలోకి వచ్చాక దుర్మార్గంగా పూర్తిగా పక్కన పెట్టేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికైనా ఇచ్చిన హమీని నిలబెట్టుకోవాలి. – అన్నపూర్ణ, వలంటీర్, రాములవీడు గ్రామం, పొదిలి మండలం, ప్రకాశం జిల్లానమ్మించి నట్టేట ముంచేశారుచంద్రబాబు, పవన్ కళ్యాణ్ వలంటీర్లను నమ్మించి నట్టేట ముంచేశారు. రూ.5 వేలు కాదు.. రూ.10 వేలు ఇస్తామని చెప్పి వలంటీర్లను మోసం చేశారు. ఎన్నికల్లో నెగ్గాక ఈ వ్యవస్థే లేదంటూ దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. కరోనా సమయంలో, ఇతరత్రా మా సేవలు చూసి యావత్ దేశ ప్రజలంతా ప్రశంసించడం నిజం కాదా? మీకు చిత్తశుద్ధి ఉంటే వలంటీర్లకు చేసిన వాగ్దానాన్ని వెంటనే నెరవేర్చాలి. లేదంటే తగిన బుద్ధి చెబుతాం.– పెదపూడి చినబాబు, వలంటీర్, ఎన్ఆర్పీ అగ్రహారం, భీమవరం, పశ్చిమగోదావరి జిల్లాదగ్గరలోనే బుద్ధిచెప్పే రోజులు వలంటీర్లను కొనసాగించడానికి పరిపాలన అనుమతులు లేవని సాకులు చెప్పి నిలిపివేశారు. అయితే విజయవాడలో వరదలు వచ్చిన సమయంలో వలంటీర్ల సేవలను ఏ అధికారంతో వినియోగించుకున్నారో చెప్పాలి. గత ప్రభుత్వానికి సాధ్యమైంది.. ఈ ప్రభుత్వానికి ఎందుకు కావడం లేదు? వలంటీర్లను తప్పించాలనే దురుద్దేశంతో ప్రభుత్వం సాకులు చెబుతోంది. చాలా మంది డిగ్రీ వరకు చదువుకొని ఉన్న ఊరిలో ఇంటి పనులు, ప్రజా సేవ చేస్తూ జీవనం సాగించే వారు. కూటమి ప్రభుత్వం కుట్రతోనే వలంటీర్లను పక్కనపెట్టింది. ఇది నిజం. వారికి తగినబుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. – రామ్గోపాల్, చిన్నటేకూరు, కల్లూరు మండలం, కర్నూలు జిల్లాఉగాది చేదు జ్ఞాపకంఉగాది పండుగ మా వలంటీర్లందరికీ చేదు జ్ఞాపకం. ఎన్నికలకు ముందు గత ఉగాది పండుగను పురస్కరించుకుని విజయవాడలో చంద్రబాబునాయుడు ఒక ప్రకటన చేశారు. ఉగాది రోజు వలంటీర్లందరికీ తీపి కబురు చెబుతున్నామన్నారు. రూ.10 వేలు జీతం ఇచ్చే బాధ్యత మాది అని హామీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ సైతం అదే మాట చెప్పారు. ఇప్పుడేమో వలంటీర్లకు జీతాలు పెంచాలని చూస్తున్నాం కానీ వారందరూ ఎక్కడా జీవోలో లేనే లేరు అని తప్పించుకోవడం బాధాకరం. చిరు జీతానికి పని చేసుకుంటున్న మమ్మల్ని మోసం చేయడం సబబు కాదు. – చలపతి, పాదిరికుప్పం, కార్వేటినగరం మండలం, చిత్తూరు జిల్లా -
నిర్వాసితునికి జనసేన ఎమ్మెల్యే బెదిరింపులు
మునగపాక: అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ సహనం కోల్పోయారు. సందర్భాన్ని బట్టి ఓర్పు, సహనంతో నియోజకవర్గ ప్రజలను సముదాయించాల్సిన ఆయన విరుచుకుపడ్డారు. భూసేకరణలో టీడీఆర్ బాండ్లు వద్దు.. నగదు చెల్లించాలని ఓ బాధితుడు కోరడమే ఆయన ఆగ్రహానికి కారణం. జిల్లాలోని మునగపాక జనసేన కార్యాలయం ఆవరణలో గురువారం పూడిమడక రోడ్డు విస్తరణ బాధితులతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు నిర్వాసితులు టీడీఆర్ బాండ్లు ఇవ్వకుండా పరిహారం కింద నగదు అకౌంట్లో జమచేయాలని కోరారు. తిమ్మరాజుపేటకు చెందిన తనకాల జగ్గారావు మాట్లాడుతూ.. తాను టీడీఆర్ బాండ్ల కోసం అనకాపల్లిలో వాకబు చేశానని.. ఈ బాండ్లు అమ్ముకోవడం కష్టతరమని చెప్పారని.. ఇలా అయితే ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్పారు. పరిహారాన్ని నేరుగా నగదు రూపంలో అందించాలని కోరారు. ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ జోక్యం చేసుకుని.. టీడీఆర్ బాండ్లను ఎక్కడైనా అమ్ముకోవచ్చని, అనకాపల్లిలో తప్ప ఇతర ప్రాంతాల్లో అమ్ముకోలేమని అనడం సరికాదంటూ బెదిరింపు ధోరణలో చెప్పారు.దీంతో.. ఇద్దరి మధ్య మాటామాటా పెరుగుతుండడంతో ఎమ్మెల్యే సహనం నశించి.. ‘ఉండు.. నువ్వుండు.. ఆగమంటున్నానా.. కౌంటర్ ఇవ్వడం కాదు. నేను తలచుకుంటే నీపై కేసు పెట్టలేనా?’ అని మండిపడ్డారు. నిర్వాసితుల్లో అనుమానాలు రేకెత్తించేలా ప్రవర్తించడం సరికాదంటూ హెచ్చరించారు. విస్తరణలో భూములు, ఇళ్లు కోల్పోయే బాధితులకు మెరుగైన పరిహారం అందజేస్తామన్నారు. వీఎంఆర్డీఏ ఎక్కడైనా భూములను సేకరించేటప్పుడు టీడీఆర్ బాండ్లు ఇస్తుందని.. ఇక్కడ కూడా ఇస్తారేమోనని విజయ్ అన్నారు. తాను ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి బాధితులకు నగదు రూపంలో పరిహారం అందించేలా చూస్తానని హామీ ఇచ్చారు. -
స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయకేతనం
సాక్షి, తాడేపల్లి : స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి చావుదెబ్బ తగిలింది. వైఎస్సార్సీపీ విజయకేతనం ఎగురవేసింది. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని వైఎస్సార్సీపీ కేడర్ ఎదురొడ్డి పోరాడింది. అక్రమ కేసులు, కిడ్నాపులు, దాడులను ఎదుర్కొని వైఎస్సార్సీపీ గెలిచింది. రాష్ట్రంలో గురువారం జడ్పీలు, మండల పరిషత్లలో మొత్తం 53 పదవులకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఏకంగా 32 పదవులను కైవసం చేసుకుంది. వాస్తవానికి ఆ 53 పదవులూ గతంలో వైఎస్సార్సీపీవే. అయితే, పలు కారణాల వల్ల ఖాళీ అవ్వడంతో ఎన్నికలు అనివార్యమైంది. ఈ ఎన్నికల్లో సంఖ్యా బలం లేకపోయినా కూటమి ప్రభుత్వం బరిలోకి దిగింది. రెడ్బుక్ అమలు చేసి గెలవటానికి అనేక కుట్రలు, కుతంత్రాలు చేసింది. అన్నిటినీ ఎదర్కొని ధైర్యంగా వైఎస్సార్సీపీ కేడర్ నిలిచింది. దీంతో టీడీపీ కేవలం తొమ్మిది స్థానాల్లో గెలుపును సరిపెట్టుకుంది. ఆ గెలుపును కూడా వైఎస్సార్సీపీ సభ్యులను తమవైపు తిప్పుకుని ఆ గెలుపుని తమ ఖాతాలో వేసుకుంది. కూటమి ప్రభుత్వంలోని భాగస్వామ్యులైన బీజేపీ, జనసేనలు పోలీసులను ప్రయోగించి చెరో ఎంపీపీని కైవసం చేసుకున్నాయి.కోరం లేక 10 చోట్ల ఎన్నికలు వాయిదా పడింది. వైఎస్సార్సీపీ కేడర్ పోరాట స్పూర్తికి సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.పది నెలల్లోనే మోసకారి ప్రభుత్వంపై ఇది తిరుగుబాటుగా ప్రజల్లో చర్చ కొనసాగుతోంది. -
పిఠాపురంలో మళ్లీ దబ్బిడి దిబ్బిడి
సాక్షి,కాకినాడ జిల్లా: పిఠాపురంలో జనసేన వర్సెస్ టీడీపీల మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. తమ నాయకుడు ఎస్వీఎస్ఎన్ వర్మ చెప్పబట్టే పవన్కు ఓటేశామంటూ జనసేన ఇన్ ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్పై వర్మ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మర్రెడ్డి శ్రీనివాస్పై వాగ్వాదానికి దిగారు. దీంతో టీడీపీ, జనసేన శ్రేణుల మధ్య తోపులాట జరిగింది.బుధవారం పిఠాపురంలో జనసేన శ్రేణుల్ని టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. గొల్లప్రోలు మండలం చెందూర్తిలో ఆర్వో ప్లాంట్ ఆవిష్కరణకు జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ వచ్చారు. అయితే, ఈ కార్యక్రమానికి ఎస్వీఎస్ఎన్ వర్మకు ఆహ్వానం అందలేదు. ఇదే అంశంపై వర్మ అనుచరులు మర్రెడ్డి శ్రీనివాస్ను నిలదీశారు. దీంతో ఏం చేయాలో పాలుపోని మర్రెడ్డి కార్యక్రమం మధ్యలోనే తిరిగి వెళ్ళిపోయారు. వెళ్లే సమయంలో టీడీపీ,జనసేన శ్రేణులు ఒకరిపై ఒకరు వ్యతిరేకంగా నినాదాలు చేసుకున్నారు. వర్మ చెప్పబట్టే పవన్కు ఓటు వేశామని వర్మ అనుచరులు,టీడీపీ కార్యకర్తలు తన మనసులో మాటను భయటపెట్టారు. వారికి పోటీగా జనసేన శ్రేణులు రావడంతో వాగ్వాదం జరిగింది. ఒకరినొకరు నెట్టుకున్నారు. నాగబాబు ఏమన్నారంటే?మార్చి 14న పిఠాపురం చిత్రాడలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ నిర్వహించింది. ఆ సభలో నాగబాబు ..పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జి ఎస్వీఎస్ఎన్ వర్మను ఉద్దేశిస్తూ పరోక్షంగా మాట్లాడారు. ‘పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలుపులో ప్రధానంగా రెండు ఫ్యాక్టర్స్ పని చేశాయి. ఒకటి జనసేన ప్రెసిడెంట్ పవన్ కల్యాణ్. రెండు జనసైనికులు, పిఠాపురం ఓటర్లు’ మరెవరైనా పవన్ గెలుపులో తమ పాత్ర ఉందని అనుకుంటే అది వారి ఖర్మ’ అని నాగబాబు నొక్కి మరీ చెప్పారు. నాగబాబుకు వర్మ కౌంటర్గా ఆ వ్యాఖ్యలపై వర్మ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సభ జరిగిన తర్వాత వర్మ సైతం సోషల్ మీడియా వేదికగా జనసేనకు కౌంటర్ వేస్తూ పోస్టులు పెడుతూ వచ్చారు. ఈ తరుణంలో వర్మ అభిమానులు పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్పై బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేయడం చర్చాంశనీయంగా మారింది. -
సాయం పేరుతో స్వాహా!
సాక్షి ప్రతినిధి, ఏలూరు : విజయవాడ వరద బాధితులను ఆదుకోవడానికి అందరూ బియ్యం ఇవ్వాలంటూ జనసేన శ్రేణులు గత ఏడాది ఊరూరా తిరిగి సేకరించారు. ఇలా దాతలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యా సంస్థల నుంచి భారీగా సేకరించారు. చివరికి అనుకున్న స్థాయిలో బియ్యం సేకరించాక ఆ మొత్తాన్ని జనసేన నియోజకవర్గ ఇన్చార్జి ఒకరు అమ్మేసి సొమ్ము చేసుకున్నారు. ఇప్పుడిది బయటకు పొక్కింది. దీంతో.. ఆ మొత్తం డబ్బును పార్టీకి విరాళంగా ఇస్తానని.. ఇదంతా మంత్రి కందుల దుర్గేష్కు చెప్పేచేశానని ఆయన తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయినా వివాదం ముదరడంతో రెండ్రోజుల క్రితం జంగారెడ్డిగూడెంలో దీనిపై పంచాయితీ జరిగింది. అయినా సెటిల్ కాకపోవడంతో జిల్లా ఇన్చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ దృష్టికి వ్యవహారం తీసుకెళ్లారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో ఇప్పుడీ వ్యవహారం కలకలం రేపుతోంది. ఆ వివరాలు..అసలేం జరిగిందంటే.. విజయవాడ వరద బాధితులను ఆదుకోవడానికంటూ జనసేన పార్టీ గోపాలపురం నియోజకవర్గ ఇన్చార్జి దొడ్డిగర్ల సువర్ణరాజు నేతృత్వంలో గతేడాది నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో భారీగా బియ్యం సేకరించారు. కానీ, ఇలా సేకరించిన బియ్యాన్ని విజయవాడలో బాధితులకు పంచకుండా ఆయన విక్రయించేశారు. ఈ సొమ్మును నియోజకవర్గ ఇన్చార్జే స్వాహా చేశాడని ఒక వర్గం దుమ్మెత్తిపోస్తుండగా.. ఇన్చార్జి వర్గం మాత్రం సొమ్ము తమవద్దే ఉందని, పార్టీకి విరాళం ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటే కుదరడంలేదని, మంత్రి కందుల దుర్గేష్కు విషయం చెప్పామని, ఆయన విరాళం ఇవ్వడానికి పవన్కళ్యాణ్ వద్దకు తీసుకువెళ్తారంటూ చెబుతున్నారు. అయితే, నాలుగు నెలల క్రితం జనసేన అధ్యక్షుడు పవన్కళ్యాణ్ ద్వారకాతిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం వచ్చినప్పడు కూడా ఆయనకు చెక్కు ఇవ్వడం కుదరలేదా అని ప్రత్యర్థి వర్గం నిలదీస్తోంది.రూ.10 లక్షలు కాదు.. 16 లక్షలకు అమ్ముకున్నారు..జనసేన నియోజకవర్గ ఇన్చార్జి సువర్ణరాజు, ఆయన వ్యతిరేక వర్గం మధ్య ఈ విషయంలో కొద్దిరోజులుగా తారాస్థాయిలో వివాదం నడుస్తోంది. సేకరించిన బియ్యాన్ని రూ.10.27 లక్షలకు విక్రయించానని సువర్ణరాజు చెబుతుంటే.. రూ.16 లక్షలకు అమ్ముకున్నారని వ్యతిరేక వర్గం చెబుతోంది. దీనిపై పార్టీ జిల్లా నేతల వద్ద పంచాయితీ నిర్వహించారు. ఈ నేపథ్యంలో.. రెండ్రోజుల క్రితం జంగారెడ్డిగూడెంలో జనసేన నాయకుడు కరాటం సాయి పార్టీ ఆదేశాలతో గోపాలపురం నియోజకవర్గ నేతలతో సమావేశం నిర్వహించారు. సువర్ణరాజు అనుకూల, వ్యతిరేక వర్గాలు ఘర్షణకు దిగడంతో సమావేశం రసాభాసగా మారింది. దీంతో కరాటం సాయి చేతులెత్తేసి జిల్లా ఇన్చార్జి నాదెండ్ల మనోహర్ దృష్టికి వ్యవహారం తీసుకెళ్తున్నట్లు చెప్పి సమావేశం ముగించారు. -
విలువే లేకుండా పోయింది.. ఎందుకీ ఊడిగం!
కూటమి విజయానికి మనమే కారణం అయ్యాం... మనం లేకుంటే చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు అయ్యేనా.. ఆయన సీఎం అయ్యేనా.. కాపులంతా గంపగుత్తగా ఓట్లేయకపోతే కూటమికి ఇంత మెజారిటీ ఎలా వస్తుంది.. ఇన్ని సీట్లు ఎలా వస్తాయి..ఈ కూటమి ప్రభుత్వ రథానికి మనమే చక్రాలం..మనమే ఇరుసు..మనమే ఇంధనం కానీ ఇప్పుడు మనం కరివేపాకులం అయిపోయాం. పులుసులో ముక్కలం అయిపోయాం .. మనకు ఎక్కడ విలువ గౌరవం దక్కడం లేదు.దేనికోసం ఇంత త్యాగాలు చేయాలి అంటూ జనసేన ఎమ్మెల్యేలు మదన పడుతున్నారు. కూటమి ప్రభుత్వంలో జనసేన కీలక భాగస్వామి.. అందులో 21 మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు ఉన్నారు. వారిలో పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ కందుల దుర్గేష్ ఈ ముగ్గురికి క్యాబినెట్లో స్థానం దక్కింది.. మిగతా 18 మంది వట్టి ఎమ్మెల్యేలు గానే ఉన్నారు. అయితే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు విలువ లేకుండా పోతుందని జనసేన బాధపడుతుంది.జనసేన ఎమ్మెల్యే కన్నా టిడిపి ఇంచార్జీ మిన్నతాము ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీని ఆ నియోజకవర్గాల్లో టిడిపి ఇన్చార్జిలకే అధికారులు గౌరవిస్తున్నారని వారి మాట వింటున్నారని తమకు ఏమాత్రం విలువ లేకుండా పోయిందని జనసేన ఎమ్మెల్యేలు ఆవేదన చెందుతూ కాసేపటి క్రితం విజయవాడలోని హోటల్లో సమావేశం అయ్యారు. దీనికి నాదెండ్ల మనోహర్ కొందరు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మనోహర్ తో ఎమ్మెల్యేలంతా ఈ విషయాన్ని మొరపెట్టుకున్నట్లు తెలిసింది. స్థానికంగా తమ ఎమ్మెల్యేలుగా ఉన్నప్పటికీని తమ మాటను పోలీసులు రెవెన్యూ పంచాయతీ అధికారులు ఎవరూ వినడం లేదని తెలుగుదేశం వారు చెబితేనే అక్కడ మాట చెల్లుబాటు అవుతుందని మనోహర్ ఎదుట వాపోయారు.మంత్రులుగా ఉన్న ఆ ముగ్గురికి నియోజకవర్గంలో కాస్త గౌరవం ఉన్నప్పటికీ మిగతా ఎమ్మెల్యేలు ఎవరికి ఇండిపెండెంట్గా పని చేసే అవకాశం దక్కడం లేదు. నియోజకవర్గాల పెద్ద పని ఏదైనా ఉంటే ఆ జిల్లా మంత్రి వద్దకు వెళ్లాల్సి వస్తుంది. పైగా ఆ మంత్రి కూడా లోకేష్ కంట్రోల్లో పనిచేస్తున్నారు. లోకేష్ కూడా జనసేన ను పెద్దగా పట్టించుకోకుండా జిల్లాల తన సొంత టీం ఏర్పాటు చేసుకొని ముందుకు సాగుతున్నారు. దీంతో అనివార్యంగా జనసేన నాయకులకు ప్రాధాన్యం తగ్గిపోతుంది. పలుచోట్ల వ్యాపారాల్లోనూ అక్రమ ఆదాయం తెలుగుదేశం జనసేన మధ్య పోటీ నెలకొన్న తరుణంలో తెలుగుదేశం వారు పలువురు జనసేన కార్యకర్తలను వెంటాడి కొట్టిన ఘటనలు ఉన్నాయి.ఇంత బతుకు బతికి ఇంటి వెనక చచ్చినట్లు తెలుగుదేశానికి ఊడిగించేయడం కోసమే తమ పార్టీ ఉందా.. సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని తెలుగుదేశం ఇన్చార్జిలకు అధికారులు గౌరవం ఇవ్వడం దానికి ఎంత అవమానం అన్నది ఈ సమావేశంలో వారంతా నాదెండ్ల మనోహర్ కు మొరపెట్టుకున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని తెలుగుదేశం పెద్దలతో మాట్లాడి సెటిల్ చేస్తే జిల్లాలో తమ గౌరవం నిలబడుతుందని అంతిమంగా పార్టీ కూడా బలపడే అవకాశం ఉంటుందని వారు చెప్పుకున్నారు.కానీ జనసేన బలపడాలని తెలుగుదేశం ఏ కోశానా కోరుకోదు. జనసేన బలం తమకు బలం కావాలని తెలుగుదేశం భావిస్తుంది తప్పితే జనసేన సొంతంగా తన కాళ్లపై తన నిలబడి పోటీ చేసే పరిస్థితి వస్తే తెలుగుదేశానికి ఎంత ఇబ్బంది అన్నది చంద్రబాబు లోకేష్ లకు తెలుసు. అందుకే ఎక్కడికి అక్కడ జనసేన నాయకులను కార్యకర్తలను తమ కాళ్ళ కింద పెట్టి ఉంచుతూ ఆయా ప్రాంతాల్లో తెలుగుదేశం క్యాడర్ను మాత్రమే గుర్తిస్తూ పనులు పథకాలు పైరవీలు అని వాళ్ల ద్వారా జరిగేలా చూస్తున్నారు.నియోజకవర్గాల్లో పనులు అంటూ జరిగితే తెలుగుదేశం వారి ద్వారానే జరగాలి లేదంటే లేదు. అంతేతప్ప జనసేన నాయకుడికి ఎక్కడా మర్యాద దక్కకూడదు అనే సింగల్ పాయింట్ ఏజెండాతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఇదంతా తమకు అవమానంగా భావిస్తున్న జనసేన ఎమ్మెల్యేలు తమ గౌరవానికి భంగం కలగకుండా చూడాల్సిన బాధ్యత మీదే అంటూ మనోహర్ మీద ఒత్తిడి తెచ్చారు. మరోవైపు లోకేష్ కూడా పవన్ కళ్యాణ్ శాఖను సైతం హైజాక్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇదంతా జనసేన మనుగడకు.. భవిష్యత్తుకు ముప్పుగా మారుతుందని వారు కలవరపడుతూ దిద్దుబాటు చర్యలకు డిమాండ్ చేస్తున్నారు. ఇది ఏ స్థాయి ఫలితాలు ఇస్తుందో చూడాలి.-సిమ్మాదిరప్పన్న -
‘తెలంగాణలో జనసేన, టీడీపీతో పొత్తు బీజేపీకే నష్టం’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో జనసేన, టీడీపీతో పొత్తు కడితే బీజేపీకి నష్టం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి చేసిన వ్యాఖ్యలకు బలం చేకూరుతుందన్నారు. ఇదే సమయంలో రాజాసింగ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. తెలంగాణ ప్రజలకు పాత ఇనుప సామాను అంటే ఎవరో బాగా తెలుసు అంటూ వ్యాఖ్యలు చేశారు.అసెంబ్లీ సమావేశాల సందర్బంగా బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మీడియాతో చిట్బాట్ మాట్లాడుతూ.. తెలంగాణలో కూటమి గురించి బీజేపీ హైకమాండ్ ఆలోచన చేయవద్దు. జనసేన, టీడీపీతో కలిసి వెళ్తే బీజేపీ నష్టం జరుగుతుంది. అంతరాష్ట్ర వ్యవహారాల్లో ఇబ్బంది అవుతుంది. బీఆర్ఎస్ లాంటి పార్టీలకు లబ్ధి జరుగుతోంది. కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి చేసిన వ్యాఖ్యలకు బలం చేకూరుతోందన్నారు.రాజాసింగ్ కామెంట్స్ స్పందిస్తూ..‘తెలంగాణ ప్రజలకు పాత ఇనుప సామాను అంటే అందరికీ తెలుసు. పార్టీ అంతర్గత వ్యవహారాలు వేదికలపై కాకుండా ఎవరికి చెప్పాలో వారికి చెప్పాలి. రాజాసింగ్ తెలంగాణ బీజేపీకి ఆస్తి వంటి నాయకులు. ప్రధాని మోదీకి ఇక్కడ ఏం జరుగుతుందో పిన్ టూ పిన్ రిపోర్ట్ వెళ్తుంది. అధిష్ఠానం అంతా గమనిస్తోంది. పార్టీకి మంచి జరిగేది నలుగురిలో చెప్పాలి.. చెడు జరిగేది అధిష్ఠానం చెవిలో చెప్పాలి.పార్టీ ప్రెసిడెంట్గా ఈటల, అరవింద్, రామచందర్ రావు, డీకే అరుణ, రఘునందన్ రావు ఎవరో ఒకరు అవుతారు. అధ్యక్షుడితో పాటు ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లు పెడితే బాగుంటుంది. ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో పార్టీ బలోపేతం కోసం ప్రత్యేకంగా ఇంచార్జ్లను పెట్టాలి. రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ప్రక్షాళన చేస్తారని వినిపిస్తోంది. అదే జరిగితే కొండా సురేఖ, తుమ్మల, జూపల్లి మంత్రి పదవులు పోతాయి అంటున్నారు అని ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
జనసైనికుల సాక్షిగా బయటపడ్డ 2 లక్షల పుస్తకాల బాగోతం
-
పవన్ను పిచ్చాసుపత్రిలో చేర్చాలి: నారాయణ
బి.కొత్తకోట: రోజుకో మాట మాట్లాడుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను పిచ్చాసుపత్రిలో చేర్చాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. అన్నమయ్య జిల్లా బి.కొత్తకోటలో సీపీఐ శత వార్షికోత్సవ సభ ఆదివారం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన నారాయణ ఈ సందర్భంగా మాట్లాడుతూ పవన్ ఒకసారి చేగువేరా, మరొకసారి సావర్కర్, ఇప్పుడు సనాతన ధర్మం అంటున్నారని అన్నారు. ‘సనాతన ధర్మంలో భర్త చనిపోతే భార్య చితి మంటల్లో ఆహుతి అవుతుంది. ఇలాంటి ధర్మాన్ని ఒప్పుకుంటారా.. మూడు పెళ్లిళ్ల పవన్ కళ్యాణ్’ అని ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వానికి అండగా నిలుస్తున్న చంద్రబాబు, పవన్ ఆయన మాటలకు తలూపుతున్నారని అన్నారు. -
‘ప్రతిసారి అలగడం, ఏడవడమే బాలినేని చరిత్ర’
సాక్షి, ప్రకాశం జిల్లా: వైఎస్ జగన్మోహన్రెడ్డి గురించి బాలినేనికి మాట్లాడే అర్హత లేదంటూ జడ్పీ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైవీ, వైస్సార్ కుటుంబం లేకపోతే నువ్వెవరవి అంటూ బాలినేనిని ప్రశ్నించారు. ఆదివారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రతిసారి ఏదో ఒక సాకుపెట్టు కొని మా మీద ఏడుస్తావు. గతంలో కూడా మా కుటుంబం మీద కుట్రలు చేశావ్. ఇప్పటికీ నీ బుద్ధిమారలేదు’’ అంటూ వెంకాయమ్మ మండిపడ్డారు.‘‘బూచేపల్లి కుటుంబంపై కుట్రలు చేసి.. ఇవాళ నువ్వే రోడ్డున పడ్డావు. వైఎస్ జగన్ను ఓడిస్తావా..? నీ తరం కాదు. 2024 ఎన్నికలో నా కుమారుడు బూచేపల్లి శివ ప్రసాద్రెడ్డి గెలవకూడదని కుట్ర పన్నావ్...? నువ్వే ఓడిపోయావు. నన్ను చైర్ పర్సన్ పదవి నుంచి దించుతావా..? నా కుర్చి టచ్ చేసి చూడు.. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగనే సీఎం.. ఎవరూ అడ్డుకోలేరు.?...2004 నుంచి రాజకీయాల్లో ఉండి.. నీతిగా రాజకీయాలు చేస్తున్నాం. మా ప్రాణాలు పోయే వరకు వైఎస్ జగన్తోనే ప్రయాణం. మా కుటుంబం మీద అభిమానంతో వైఎస్ జగన్ నన్ను జడ్పి చైర్ పర్సన్ని చేశాడు. నీకు దమ్ముంటే... నా కుర్చీ జోలికిరా..? చూస్తా.. ప్రతీ సారి వైఎస్ జగన్ మీద అలగడం.. ఎడవడమే.. బాలినేని చరిత్ర?. జిల్లాలో పార్టీ నేతల దగ్గర డబ్బు దోచుకున్న అవినీతి పరుడు బాలినేని’’ అంట వెంకాయమ్మ ధ్వజమెత్తారు. -
మెగా బ్రదర్స్ అత్యుత్సాహం..
మాటలు నేర్చిన కుక్కను వేటకు తీసుకెళ్తే ఉస్కో అంటే ఎదురు మళ్ళా ఉస్కో అందట.. ఆలా అయింది తెలుగుదేశం పరిస్థితి. పార్టీ పెట్టి పుష్కరం దాటి.. అసెంబ్లీ గేటు కూడా దాటలేకపోయిన పవన్ కళ్యాణ్ తెలుగుదేశం.. బీజేపీతో పొత్తు పుణ్యాన ఈసారి అసెంబ్లీ లోపలి అడుగుపెట్టారు. పవన్ ప్రాధాన్యాన్ని గుర్తించిన చంద్రబాబు సైతం ఆయనకు డిప్యూటీ సీఎం హోదా ఇచ్చారు. ఇక జనసేనలో మొదట్నుంచి ఉన్న నాగబాబు సైతం గతంలో ఎంపీగా పోటీ చేసి మట్టికరిచారు. ఇక డైరెక్ట్ ఎన్నికల్లో పోటీ చేయడం అచ్చిరాదనుకున్నారో ఏమో అడ్డదారిలో శాసనమండలిలోకి అడుగుపెట్టారు. ఇక చట్టసభలో ప్రజల తరఫున మాట్లాడాల్సిన నాగబాబు తొలిసారిగా మైక్ అందుకుని ఇక ఒంటి మీద స్పృహ లేకుండా నోటికొచ్చింది వాగేశారు. తెలుగుదేశానికి లైఫ్ ఇచ్చింది తామేనని పవన్ అంటే.. అసలు పవన్ను గెలిపించింది ప్రజలు.. జనసైనికులే తప్ప ఇంకెవరూ కాదని గట్టిగా చెప్పారు. వాస్తవానికి ఎన్నికలకు ముందు పిఠాపురం సీటును పవన్ కోసం త్యాగం చేసిన వర్మను నాగబాబు.. పవన్ ఇద్దరూ భుజానికి ఎత్తుకుని మోశారు. నా గెలుపు బాధ్యత మీదే.. మీ భుజాల మీదనే ఉందని మునగ చెట్టు ఎక్కించారు. ఇక గెలిచాక.. వర్మ త్యాగం గాలిలో కలిసిపోయింది.. అసెంబీ గేటు వరకూ ఓడ వర్మ.. గేటు దాటాక బోడి వర్మ అన్నట్లుగా మాట్లాడుతున్నారు. అంతేకాకుండా కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న నలభయ్యేళ్ళ తెలుగుదేశాన్ని తామే నిలబెట్టినట్లు ఈ బ్రదర్స్ చెప్పుకున్నారు.పాలన గురించి ఒక్క ముక్కాలేదు..అటవీ, పంచాయతీ రాజ్ మంత్రిగా ఉన్న పవన్ ఈ తొమ్మిది నెలల్లో చేసిన ఒక్క మంచి పని గురించి కూడా చెప్పలేదు.. ఎంతసేపు తన స్వోత్కర్ష.. సొంత ఎలివేషన్ తప్పితే ప్రజలకు పనికొచ్చేది.. సమాజానికి ఉపయోగపడే మాట ఒక్కటీ లేదు.. పైగా జనసైనికులు కూడా అచ్చం అలాగే తయారయ్యారు.. 2029 నాటికి పవన్ను సీఎం అభ్యర్థిగా చూడాలన్నది వారి అభిలాష అని అక్కడ ఓపెన్ అయిపోయారు.. ఈ అన్నదమ్ముల అత్యుత్సాహం తెలుగుదేశాన్ని ఇరిటేట్ చేస్తోంది. ఇప్పటికే తెలుగుదేశం అనుకూల సోషల్ మీడియా ఖాతాల్లో ఈ బ్రదర్స్ గురించి ట్రోలింగ్ మొదలైంది. తెలుగుదేశం లేకపోతే జనసేన ఎక్కడ ఉంటుంది. ఇదేంటి ఇంత ఓవర్ యాక్షన్ అంటూ పోస్టులు పెడుతున్నారు. మరోవైపు తన గురించి మాటమాత్రం ప్రస్తావించకపోవడం పిఠాపురం వర్మను మరింత వేడెక్కిస్తోంది. ఈ అంశం లోకేష్ వద్దకు కూడా చేరింది.. పలువురు కార్యకర్తలు లోకేష్ తో మాట్లాడుతూ నాగబాబు.. పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లు ఆయన దృష్టికి తీసుకెళ్లారు.చెప్పులోని రాయి చెవిలోని జోరీగకంటిలోని నలుసు కాలి ముల్లుఇంటిలోని పోరు ఇంతింత గాదయావిశ్వదాభిరామ వినురవేమ!అన్నట్లుగా తయారైంది టీడీపీ పరిస్థితి. తమ గెలుపులో కీలకపాత్ర పోషించిన పవన్ను ఇప్పుడు చెప్పులమాదిరిగా బయట వదిలేయలేక.. వాళ్ళ అన్నదమ్ముల కామెంట్లు చెవిలో జోరీగమాదిరిగా ఇబ్బంది పెడుతున్నా భరించలేక.. సతమతమవుతున్నారు. మొత్తానికి నోటి దురుసు ఉన్న నాగబాబు ఎప్పటికైనా కూటమిలో చిచ్చుకు కారణం అవుతారని అంటున్నారు..-సిమ్మాదిరప్పన్న -
సొంత డబ్బా.. చంద్రబాబు భజన
-
పార్టీ జెండాతోనే కొడుతున్నరు పబ్లిక్ను
-
జనసేన ఆవిర్భావ సభలో హామీల ఊసే ఎత్తని పవన్
-
టీడీపీ వర్మకు పవన్ వెన్నుపోటు.. బయటపడ్డ అసలు నిజాలు
-
నాగబాబు వ్యంగ్యాస్త్రాలు.. మరింత అగ్గి రాజేసేలా!
పిఠాపురం: పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవడానికి టీడీపీకి చెందిన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ పాత్ర ఏమీ లేదని జనసేన నేత నాగబాబు ఒక్క దెబ్బలో తేల్చి పారేశారు. అసలు పవన్ గెలుపునకు ఏ నేతైనా కారణం అనుకుంటే అది వారి ‘ఖర్మ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇది కూడా పిఠాపురం వేదికగా ఈరోజు(శుక్రవారం) జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో నాగబాబు పరోక్షంగా చురకలు అంటించారు. కేవలం పవన్ విజయానికి పిఠాపురం ప్రజలు, జన సైనికులే కారణమని ఒక్క ముక్కలో చెప్పేశారు నాగబాబు. ఇక్కడ పవన్ గెలుపునకు పవనే ప్రధాన కారణంగా చెప్పుకొచ్చారు. వర్మ సీటు త్యాగం సంగతి ఏంటో..?అసెంబ్లీలో అడుగు పెట్టడమే కలగా మారిన పవన్ కళ్యాణ్కు సహకరించి.. ఆ కల నెరవేరేలా చేసింది పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ. ఇక్కడ తన సీటును త్యాగం చేసి మరీ పవన్ ను భుజాన వేసుకున్నారు వర్మ, అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో వర్మకు ఎమ్మెల్సీ టికెట్ ఇస్తామని చంద్రబాబు ఆశ చూపడంతో పాటు దానికి పవన్ కళ్యాణ్ కూడా వంత పాడటం కూడా జరిగింది. సర్లే.. చంద్రబాబు మన నాయకుడే.. పవన్ కూడా మన వాడే అనుకున్నాడో ఏమో వర్మ.. ఎమ్మెల్సీ టికెట్ అన్నారు కదా అని ఆ ఎమ్మెల్యే సీటను త్యాగం చేశారు వర్మ,. మరి తీరా చూస్తే వర్మకు ఊహంచని పరిణామం ఎదురైంది. ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వకుండా పెద్ద షాకిచ్చారు చంద్రబాబు..పవనే దెబ్బ కొట్టారా..?ఆయనే రాజకీయంగా దెబ్బకొట్టారనే చర్చ జోరుగా జరుగుతోంది. ఆయనకు ఎమ్మెల్సీ సీటు రాకుండా పవన్ అడ్డుపడ్డారని టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇస్తే పిఠాపురంలో తనకు ఇబ్బందులు వస్తాయని ఆయన చంద్రబాబుకు చెప్పడం వల్లే పక్కన పెట్టారని టీడీపీ నేతలు చెబుతున్నారు.తనకు ప్రొటోకాల్ సమస్యలు వస్తాయని, వర్మకు ఎమ్మెల్సీ సీటు ఇవ్వవద్దని స్వయంగా పవనే .. చంద్రబాబుకు చెప్పారని రెండు పార్టీల్లోనూ చర్చించుకుంటున్నారు. అలాగే వర్మకు పదవి లభిస్తే పిఠాపురంలో ఆయన ప్రాధాన్యత పెరిగి రెండు అధికార కేంద్రాలు ఏర్పాటవుతాయనే ఆందోళనలోనూ పవన్ కళ్యాణ్ ఉన్నట్లు చెబుతున్నారు.అదే జరిగితే వచ్చే ఎన్నికల్లో మళ్లీ తాను అక్కడి నుంచి పోటీ చేయడం కష్టమవుతుందనే భావనలో ఆయన ఉన్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. వర్మ ఎమ్మెల్సీ అయితే నియోజక వర్గానికి చెందిన కూటమి నేతలు ఆయన వద్దకే వెళతారని, ఇది రాజకీయంగా తమకు నష్టమని పవన్ అంచనా వేస్తున్నట్లు సమాచారం. మరింత అగ్గి రాజేసేలా..పవన్ కూడా వర్మ రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది లేకుండా చూస్తానని అంతర్గతంగా చెప్పినట్లు ప్రచారం జరిగింది. దీంతో పవన్ను గెలిపించేందుకు వర్మ అహర్నిశలు పనిచేశారు. టీడీపీ శ్రేణులు పలుచోట్ల ఆయనను తిట్టినా లెక్క చేయకుండా తిరిగి పవన్ను గెలిపించారు. రెండుచోట్ల ఓడిపోయిన వ్యక్తికి తన సీటును త్యాగం చేసి గెలిపించి అసెంబ్లీకి పంపడంలో కీలకపాత్ర పోషించారు.ఇప్పుడు ఆయనకే పవన్ అడ్డుపడడం ఏమిటని టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన వర్మను పవన్ దెబ్బకొట్టడం దారుణమని వాపోతున్నాయి. ఎమ్మెల్సీ స్థానాల కేటాయింపులో ఆయనకు అన్యాయం జరిగిందని ఆవేదన చెందుతున్నాయి. ఇప్పుడు ఏకంగా నాగబాబు నోటి వెంట వర్మ పేరు రాలేదు.. కదా పరోక్షంగా సెటైర్లు వేయడం ఇప్పుడు మరో చర్చకు దారి తీసింది. ఇప్పటికే టీడీపీ-జనసేనలపై ఆగ్రహంగా ఉన్న వర్మ వర్గంలో మరింత అగ్గి రాజేశారనే వాదన తెరపైకి వచ్చింది. -
కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన గూండాల అరాచకం
-
మేం ‘పిఠాపురం’ తాలుకా.. మమ్మల్ని ఎవడ్రా ఆపేది!
సాక్షి, కాకినాడ: జనసేన (Janasena) పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఆ పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయారు. ఒకవైపు యువ కార్యకర్తలు రోడ్లపై బైకులతో ప్రమాదకరమైన స్టంట్లతో వాహనదారుల్ని హడాలెత్తించగా.. ఇంకోవైపు ట్రాఫిక్కు అంతరాయం కలిగించి మరీ వాహనదారులతో వాగ్వాదానికి దిగారు మరికొందరు.పిఠాపురం శివారు ప్రాంతమైన చిత్రాడలో ‘జయకేతనం’(JSP JayaKethanam Sabha) పేరిట సభ నిర్వహిస్తున్నారు. అయితే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నియోజకవర్గం కావడంతో ఆ పార్టీ శ్రేణులు అతి చేష్టలకు దిగాయి. ‘‘పిఠాపురం డిప్యూటీ సీఎం తాలుకా.. మమ్మల్ని ఎవడ్రా ఆపేది?’’ అంటూ నినాదాలు చేస్తూ.. దారినపోయేవాళ్లను దుర్భాషలాడుతున్నారు.ఈ క్రమంలో.. జనసేన స్టికర్లు, జెండాలతో ఉన్న బైకులు, కార్లతో రోడ్లపై హల్ చల్ చేశాయి. కత్తిపూడి-కాకినాడ 216 జాతీయ రహదారిపై జనసైనిక్స్ బైక్లతో ప్రమాదకర ఫీట్లు చేస్తూ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. దీంతో ఆ దారి గుండా వెళ్లే పలువురు వాహనదారులు హడలెత్తిపోతున్నారు. ఇంకోవైపు.. ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తూ జనసేన నేతలు సామాన్యులకు చుక్కలు చూపించారు.ఈ క్రమంలో చిత్రాడ వద్ద బైక్ మీద వెళ్తున్న ఓ వ్యక్తికి.. జనసేన నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. ట్రాఫిక్ క్లియర్ చేయాలని కోరాడతను. ఈలోపు వెనక నుంచి జెండాతో వచ్చిన ఓ వ్యక్తి అతన్ని చితకబాదాడు. సదరు వ్యక్తిని బూతులు తిట్టాడు. ఆ వీడియోలు సైతం వైరల్ అవుతున్నాయి. అయితే పిఠాపురంలో ఎర్ర టవల్ బ్యాచ్ ఇంత చేస్తున్నా.. అక్కడి పోలీసులు చోద్యం చూస్తూ ఉండిపోవడం గమనార్హం -
పోసానిపై పైశాచికం!
సాక్షి, అమరావతి: సినిమాల్లో విలన్లు.. వృద్ధులు, మహిళలను వేధిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నట్లు చూపిస్తారు..! అక్రమ కేసులతో వేధిస్తున్న చంద్రబాబు సర్కారు అదే రీతిలో రెడ్బుక్ పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తోంది!! తాము బనాయిస్తున్న అక్రమ కేసులు ఎలాగూ న్యాయస్థానాల్లో నిలబడవు కాబట్టి విచారణ పేరుతో వేధించాలని పోలీసులను పురిగొల్పుతోంది. సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై లెక్కకు మించి అక్రమ కేసులు బనాయించింది. రోజుకో కేసులో అరెస్ట్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లు, జైళ్ల చుట్టూ రోడ్డు మార్గంలో ఏకంగా 2,501 కి.మీ. తిప్పి రాక్షసత్వాన్ని ప్రదర్శించింది! 67 ఏళ్ల వయసున్న పోసాని కృష్ణ మురళికి కొంతకాలం క్రితమే గుండెకు శస్త్ర చికిత్స జరిగింది. ఆయనకు ఇతరత్రా తీవ్ర ఆరోగ్య సమస్యలున్నాయి. దీంతో చాలా ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటూ హైదరాబాద్లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. అయినా సరే చంద్రబాబు ప్రభుత్వం రెడ్బుక్ కుట్రలను ఆపలేదు. టీడీపీ, జనసేన పార్టీల నేతలు పక్కా పన్నాగంతో పోసాని కృష్ణ మురళిపై వివిధ జిల్లాల్లో అక్రమ కేసులు పెట్టారు. అనంతరం వరుస అరెస్టులతో దాష్టీకానికి తెగించారు. జనసేన కార్యకర్త ఫిర్యాదు మేరకు మొదట అరెస్ట్ చేయగా అక్కడ నుంచి రాష్ట్రమంతా తిప్పుతూ వరుసగా అరెస్ట్ల పర్వం కొనసాగించారు. 17 అక్రమ కేసులు బనాయించగా నాలుగు కేసుల్లో అరెస్టు చేశారు. ఫిబ్రవరి 26న హైదరాబాద్లోని పోసాని కృష్ణ మురళి నివాసంపై పోలీసులు దండెత్తారు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో నమోదు చేసిన కేసులో పోసానిని అరెస్ట్ చేశారు. రాత్రంతా వాహనంలో తిప్పి ఫిబ్రవరి 27న మధ్యాహ్నం 12 గంటలకు ఓబులవారిపల్లెకు తీసుకువచ్చారు. జిల్లా ఎస్పీ విద్యా సాగర్ నాయుడు పోసానిని ఏకంగా 9 గంటల పాటు విచారించడం గమనార్హం.ఫలించిన న్యాయ పోరాటం..నేడు జైలు నుంచి పోసాని విడుదలయ్యే అవకాశంవిశాఖపట్నం, పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ, అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు తదితర పోలీస్ స్టేషన్లలో నమోదు చేసిన అక్రమ కేసుల్లో పోసాని కృష్ణ మురళిని అరెస్ట్ చేసి ఆ జిల్లాలకు వరసగా తరలించాలని పోలీసులు భావించారు. అయితే పోసాని న్యాయ పోరాటం ఫలించింది. ఆయనపై బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 111 ప్రకారం వ్యవస్థీకృత నేరాల కింద కేసుల నమోదుకు న్యాయస్థానాలు సమ్మతించలేదు. పోసానిపై నమోదు చేసిన కేసులకు ఆ సెక్షన్ వర్తించదని స్పష్టం చేసింది. ఇక పోసాని కృష్ణ మురళిపై నమోదు చేసిన అన్ని కేసుల్లోనూ న్యాయస్థానాలు బెయిళ్లు మంజూరు చేశాయి. విశాఖ వన్టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదు చేసిన కేసులో విచారణను నిలిపివేయాలని న్యాయస్థానం ఆదేశించింది. పోసానికి బెయిల్ మంజూరు చేస్తూ కర్నూలు మొదటి అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్, ఆదోని ఇన్చార్జి అపర్ణ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కర్నూలు జిల్లా జైలులో ఉన్న పోసాని కృష్ణ మురళి బుధవారం విడుదలయ్యే అవకాశం ఉంది. -
అంగన్వాడీ టీచర్ ఆత్మహత్య
నకరికల్లు: టీడీపీ, జనసేన నాయకుల బెదిరింపులు భరించలేక ఒక అంగన్వాడీ టీచర్ ఆత్మహత్య చేసుకున్నారు. పల్నాడు జిల్లా నకరికల్లు మండలం పాపిశెట్టిపాలేనికి చెందిన షేక్ ఫాతిమాబేగం (35) అదే గ్రామంలో 11 ఏళ్లుగా అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆమెను అంగన్వాడీ టీచర్ పోస్టు నుంచి తొలగించి, తమవారిని నియమించుకుంటామని గ్రామానికి చెందిన టీడీపీ, జనసేన నాయకులు బెదిరిస్తున్నారని ఫాతిమాబేగం కుటుంబ సభ్యులు తెలిపారు. దాదాపు 9 నెలలుగా ఆమెను బెదిరిస్తూనే ఉండటంతో తీవ్ర ఒత్తిడికి గురవుతోందని చెప్పారు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఫాతిమాబేగాన్ని అంగన్వాడీ టీచర్ ఉద్యోగం నుంచి తొలగిస్తారని టీడీపీ, జనసేన నాయకులు ప్రచారం చేస్తుండటంతో తీవ్ర ఆందోళనకు గురైన ఆమె ఆదివారం తమ ఇంట్లోనే గడ్డిమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. వెంటనే బంధువులు నరసరావుపేటలోని ఒక ప్రైవేటు వైద్యశాలకు తీసుకువెళ్లారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో మంగళగిరిలోని ఎన్ఆర్ఐ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందారు. ఫాతిమాబేగం భర్త సైదావలి గుంటూరులో మెకానిక్గా పని చేస్తున్నారు. వారికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. తన భార్య మృతిపై సైదావలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో జనసేన నాయకుడు వీరంగం
-
నువ్వు డాక్టర్వా.. గేదెలు కాస్తున్నావా?
ప్రత్తిపాడు: రాష్ట్రంలో కూటమి నేతల దాడులు, దౌర్జన్యాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. తాజాగా.. జనసేన పార్టీకి చెందిన నియోజకవర్గ ఇన్చార్జి వరుపుల తమ్మయ్యబాబు ఏకంగా మహిళా డాక్టర్పై విరుచుకుపడి నానా రాద్ధాంతం సృష్టించారు. ఎప్పటిలాగే పోలీసులు ప్రేక్షకపాత్రకు పరిమితమయ్యారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో చోటుచేసుకున్న ఈ ఘటన పూర్వాపరాలు ఏమిటంటే.. ఏలేశ్వరం మండలం లింగంపర్తికి చెందిన కాపవరపు చంద్రకళ పదేళ్ల కుమారుడు చంద్ర శేఖర్తో కలిసి ఆటోలో లింగంపర్తి వస్తోంది.ఆమె ప్రయాణిస్తున్న ఆటోను తునివైపు వెళ్తున్న కారు రామవరం వద్ద ఢీకొట్టి బోల్తా పడింది. చికిత్స నిమిత్తం తల్లీకొడుకును హైవే అంబు లెన్సులో స్థానిక సీహెచ్సీకి తీసుకొచ్చారు. డ్యూటీ డాక్టర్ శ్వేత వెంటనే స్పందించి, సిబ్బంది సహాయంతో వైద్యసేవలు అందించారు. అదే సమయంలో తమ గ్రామానికి చెందిన క్షత గాత్రులను పరామర్శించేందుకు లింగంపర్తి నుంచి వచ్చిన కొందరు వ్యక్తులు ఆస్పత్రిలోకి దూసు కొచ్చి, బాధితులను తీసుకొచ్చిందెవరంటూ నానా యాగీ చేశారు. గాయపడిన వారిని ఎవరైనా తీసుకొస్తే వివరాలు లేకుండానే చికిత్స చేస్తారా అంటూ వారు వైద్యురాలితో ఘర్షణకు దిగారు. సిబ్బంది వారిస్తున్నా వినకుండా వారిపై ఎదురుదాడికి దిగారు. హైవే అంబులెన్సులో తీసుకొచ్చారని, పోలీసులకు సమాచారం అందించామని ఎంత చెబుతున్నా వినకుండా ఆçస్పత్రికి తీసుకొచ్చిన వారి వివరాలు చెప్పాలని రాద్ధాంతం చేశారు. అలాగే, తమ నాయకుడు వరుపుల తమ్మయ్యబాబుతో మాట్లాడాలంటూ డాక్టర్ శ్వేతకు సెల్ఫోన్ ఇచ్చారు. దీంతో అవతలి వ్యక్తి ఎవరో తెలియని డాక్టర్ బాధితులకు వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు. అంతే.. ఆగ్రహావేశాలతో ఊగిపోతూ వరుపుల తమ్మయ్యబాబు ఆస్పత్రికి చేరుకున్నారు. ‘తమ్మయ్యబాబు అంటే తెలీదా.. జీతాలు తీసుకోవడంలేదా.. నువ్వు డాక్టర్వా.. గేదెలు కాస్తున్నావా’.. అని నోటికొచ్చినట్లు అరుస్తూ ఆస్పత్రిలో హడావుడి చేశారు. దీంతో రోగులు, సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. సెల్ఫోన్ లాక్కుని.. నగదు దోచుకుని..ఈ తతంగమంతా ఓ పారిశుధ్య కార్మికురాలు తన సెల్లో వీడియో తీస్తుండగా జనసేన కార్య కర్తలు ఆమె సెల్ఫోన్ను లాక్కుని వెళ్లిపోయారు. ఆ తర్వాత దాన్నుంచి రూ.2,700 నగదును ట్రాన్సఫర్ చేసుకుని, వీడియోలన్నీ తొలగించి రాత్రి 11 గంటలకు తిరిగిచ్చారు. ఇంత జరుగుతున్నా అక్కడే ఉన్న పోలీసులు మాత్రం ప్రేక్షకపాత్ర పోషించారు. మరోవైపు.. తమకు స్వేచ్ఛ, రక్షణ కల్పించాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా స్పష్టమైన హామీ కావాలనివైద్యులు డిమాండ్ చేశారు. కాగా, డాక్టర్ శ్వేత పట్ల అనుచితంగా ప్రవర్తించిన తమ్మయ్యబాబు ను సస్పెండ్ చేస్తున్నట్లు జనసేన తెలిపింది. -
సీనియర్లకు బాబు ఝలక్!
సాక్షి, అమరావతి: ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో టీడీపీ సీనియర్ నేతలు, గత ఎన్నికల్లో సీటు దక్కని ముఖ్య నేతలు, సిట్టింగ్లకు మొండిచేయే మిగిలింది. చివరి వరకు నమ్మించి, మరోమారు దగాకు గురిచేశారనే చర్చ ఆ పార్టీలో మొదలైంది. యనమల రామకృష్ణుడి స్థానాన్ని ఆయనకివ్వకుండా పూర్తిగా పక్కన పెట్టేశారు. పార్టీ కార్యాలయంలోనే ఉండి చంద్రబాబు చెప్పిన పనులన్నీ చేసిన మరో సిట్టింగ్ ఎమ్మెల్సీ అశోక్బాబుకు సైతం అవకాశం ఇవ్వలేదు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు క్రియాశీలకంగా పని చేసిన మరో సిట్టింగ్ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావుదీ అదే పరిస్థితి. మరోసారి ఎమ్మెల్సీ అవకాశం ఇస్తామంటూ ఆశ చూపించి, రాజీనామా చేయించి టీడీపీలో చేర్చుకున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి చంద్రబాబు దెబ్బ కొట్టారు. మరో వైపు ఈసారి శాసన మండలిలో అడుగు పెట్టడం ఖాయమనుకున్న ఎస్వీఎస్ఎన్ వర్మ, దేవినేని ఉమామహేశ్వరరావుకు అవకాశం దక్కలేదు. దళిత నేత కేఎస్ జవహర్, బీసీ నేత బుద్ధా వెంకన్నతో పాటు ఈ సీట్లపై ఆశలు పెట్టుకున్న చాలా మంది నేతలను చంద్రబాబు పక్కన పెట్టారు. ఎమ్మెల్సీ స్థానాలపై ఆశలు పెట్టుకున్న నేతలకు ఆదివారం సాయంత్రం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో ఫోన్ చేయించి ఈసారి అవకాశం ఇవ్వలేకపోతున్నామని చెప్పించారు. ఎంపిక చేసిన అభ్యర్థులకు చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసి చెప్పినట్లు తెలిసింది. వారు సోమవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. పవన్ అడ్డుకోవడం వల్లే...పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మకు ఎమ్మెల్సీ స్థానం దక్కకపోవడంపై టీడీపీ శ్రేణుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. చంద్రబాబు ఆయనకు అవకాశం ఇవ్వకుండా ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ అడ్డుకున్నారనే ప్రచారం జరుగుతోంది. వర్మను ఎమ్మెల్సీ చేస్తే పిఠాపురం నియోజకవర్గంలో రెండో అధికార కేంద్రం తయారు చేసినట్లవుతుందని పవన్ భావించారని, అందుకే వర్మకు సీటు ససేమిరా అన్నారని చెబుతున్నారు. పవన్ అడ్డు చెప్పడం వల్లే వర్మకు చంద్రబాబు సీటు ఇవ్వలేదని టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పిఠాపురం పూర్తిగా తన చేతిలో ఉండాలంటే.. అక్కడ తాను తప్ప మరో నాయకుడు ఉండకూడదని పవన్ భావించడం వల్లే వర్మను పక్కన పెట్టారని నియోజకవర్గంలో చర్చ మొదలైంది. ఇదివరకు రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ కోసం ఎమ్మెల్యే సీటు త్యాగం చేసిన వర్మకు ఇది తీరని అన్యాయమని టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. హామీ ఇచ్చి.. చివరకు మోసంగత ఎన్నికల్లో పొత్తులో భాగంగా తన సీటును పవన్ కళ్యాణ్కు కేటాయించినప్పుడు వర్మ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక దశలో టీడీపీకి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో చంద్రబాబు తన వద్దకు పిలిపించుకుని బుజ్జగించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి దఫాలోనే ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తానని, మంచి రాజకీయ భవిష్యత్ ఉంటుందని హామీ ఇచ్చారు. వర్మ రాజకీయ భవితవ్యానికి ఢోకా లేకుండా చేస్తానని నియోజకవర్గ నేతలకు సైతం మధ్యవర్తుల ద్వారా చెప్పించారు. పవన్ గెలుపు కోసం పని చేయాలని ఒత్తిడి చేశారు. దీంతో పార్టీ కోసం వర్మ తన సీటును త్యాగం చేయడంతోపాటు పవన్ పక్కనే నిలబడి ఆయన్ను గెలిపించేందుకు నియోజకవర్గం అంతా తిరిగారు. టీడీపీ శ్రేణులు పలుచోట్ల ఆందోళనలు చేసినా, ఎవరి కోసమో పని చేయడం ఏమిటని తిట్టినా పట్టించుకోకుండా పవన్ కోసం పని చేశారు. ఆయన ఎటువంటి ఇబ్బందులు సృష్టించకుండా పని చేయడం వల్లే శాసనసభలో అడుగుపెట్టాలనే పవన్ కల నెరవేరింది. తన కలను నెరవేర్చడానికి పని చేసిన వర్మను పవన్ రాజకీయంగా పూర్తిగా తొక్కేయాలనుకోవడం, ఇందుకు చంద్రబాబు సహకరించడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. పార్టీ కోసం పని చేసిన వారిని పట్టించుకోకుండా పక్క పార్టీ కోసం పని చేయడం తమ వల్ల కాదని టీడీపీ నేతలు ఆవేదన చెందుతున్నారు. పవన్కళ్యాణ్ తన రాజకీయ భవితవ్యం కోసం వర్మ అవకాశాలను దెబ్బ తీయడం, ఇదే సమయంలో తన సోదరుడు నాగబాబుకు మాత్రం పదవి ఇప్పించుకోవడం దారుణమని వాపోతున్నారు.టీడీపీ అభ్యర్థులు వీళ్లే..టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో ఒకరైన బీద రవిచంద్ర మంత్రి లోకేశ్కు అత్యంత సన్నిహితుడు కావడంతో ఆయన పేరు ఖరారు చేశారు. లోకేశ్ పాదయాత్రతో పాటు గత ఎన్నికల్లో ఆయన వ్యవహారాల్లో రవిచంద్ర కీలకంగా వ్యవహరించారు. రాయలసీమ ప్రాంతం నుంచి ఒక్కరికైనా అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో సిట్టింగ్ ఎమ్మెల్సీ బీటీ నాయుడుకు అవకాశం ఇచ్చారు. మూడో స్థానాన్ని టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తె గ్రీష్మను ఎంపిక చేశారు. ఇద్దరు బీసీలు, ఒక ఎస్సీకి అవకాశం ఇచ్చినట్లు టీడీపీ నేతలు తెలిపారు. జనసేన తరఫున నాగబాబుకు ఒక స్థానం, బీజేపీకి ఇంకో స్థానం కేటాయించారు. కాగా, బీజేపీ తన అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు, మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, పార్టీ నేతలు పాకా వెంకటసత్యనారాయణ, గారపాటి సీతారామాంజనేయచౌదరి, మాలతీరాణి పేర్లు అధిష్టానం పరిశీలనలో ఉన్నాయి. -
కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో రెచ్చిపోయిన జనసేన నాయకుడు
-
జనసేన నేత వీరంగం.. వైద్యురాలిపై దౌర్జన్యం
సాక్షి, కాకినాడ జిల్లా: అధికారం చేతిలో ఉంది కదా అని కూటమి నేతలు బరితెగిస్తున్నారు. జనసేన నాయకుడు రెచ్చిపోయాడు. ప్రత్తిపాడు సిహెచ్సీ వైద్య సిబ్బందిపై దౌర్జన్యానికి దిగారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉద్యోగం చేయాలంటూ వేలు చూపిస్తూ వైద్యులకు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ వరుపుల తమ్మయ్య బాబు వార్నింగ్ ఇచ్చాడు.రోగులకు వైద్యం చేస్తున్న సమయంలో డాక్టర్ శ్వేతకు తమ్మయ్యబాబు ఫోన్ చేశారు. ఆయనెవరో తెలియదని.. వేరొకరికి వైద్యం చేస్తున్నానని వైద్యురాలు చెప్పారు. ఫోన్లో మాట్లాడడానికి వైద్యురాలు నిరాకరించడంతో తమ్మయ్య బాబు.. నేరుగా ఆసుపత్రికి వచ్చి డాక్టర్ శ్వేతతో పాటుగా అక్కడున్న వైద్య సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించారు. జ్ఞానం ఉందా?.. నోర్మూయ్ అంటూ వైదురాలిపై అరుపులతో వీరంగం సృష్టించారు. -
తమ్ముడికి శుభాకాంక్షలు.. పవన్పై అంబటి రాంబాబు సెటైర్లు
సాక్షి, తాడేపల్లి: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. ‘‘అన్నను దొడ్డిదారిన మంత్రివర్గంలోకి తీసుకురావడంలో ఘన విజయం సాధించిన తమ్ముడికి శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు.కాగా, శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా కొణిదెల నాగబాబు పేరును ఆ పార్టీ అధ్యక్షుడు పవన్కళ్యాణ్ ఖరారు చేశారు. ఈ మేరకు బుధవారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘నాగబాబు జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పార్టీకి సేవలందిస్తున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలని నాగబాబుకు పార్టీ సమాచారం ఇచ్చింది. పార్టీ పరంగా కూడా నామినేషన్కు అవసరమైన పత్రాలు సిద్ధం చేయాలని పవన్కళ్యాణ్ ఆదేశించారు.’ అని తెలిపింది. కాగా, ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.అయితే, నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడంపై టీడీపీలో కొందరు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. గతంలో కూడా సోషల్ మీడియా వేదికగా నాగబాబును విపరీతంగా ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే.. పదేళ్లుగా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవని వ్యక్తిని.. ఇలా ఎమ్మెల్సీ కోటాలో మంత్రిని చేయడం ఏంటంటూ పోస్టులు పెట్టారు. గతంలో నారా లోకేష్ను టార్గెట్ చేసుకుని నాగబాబు చేసిన పోస్టులను కూడా కొందరు ప్రస్తావిస్తున్నారు. ఆ పోస్టుల వెనుక.. మంత్రి నారా లోకేష్ ఉన్నాడనే చర్చ కూడా నడిచింది.2024 ఎన్నికల కోసం టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుగా వెళ్లాయి. ఆ టైంలో అనకాపల్లి ఎంపీ పోటీ కోసం నాగబాబు తెర వెనుక ప్రయత్నాలు చేసినప్పటికీ.. పొత్తు అడ్డం వచ్చింది. అసెంబ్లీ సీటు కోసం ప్రయత్నించినా అదీ కుదరలేదు. ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడి ఒక్కరోజు గడవకముందే.. టీటీడీ బోర్డు చైర్మన్ పదవి మెగా బ్రదర్కే అంటూ ఓ ప్రచారం నడిచింది. కానీ, చంద్రబాబు దాన్ని కూడా లాగేసుకున్నారు. ఆపై ఖాళీ అయిన మూడు రాజ్యసభ సీట్లలో ఒకటి నాగబాబుకే దక్కవచ్చనే చర్చా నడిచింది. అది జరగలేదు. మొత్తం మీద తమ్ముడి సాయంతో నాగబాబు త్వరలో ఏపీకి మంత్రి కాబోతున్నారమాట.. అన్నను దొడ్డిదారిన మంత్రివర్గంలోకి తీసుకురావడంలో ఘన విజయం సాధించిన తమ్ముడికి శుభాకాంక్షలు!@NagaBabuOffl @PawanKalyan— Ambati Rambabu (@AmbatiRambabu) March 6, 2025 -
ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు.. జనసేన ప్రకటన
సాక్షి, విజయవాడ: జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొణిదెల నాగబాబు పేరును జనసేన ప్రకటించింది. ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా నాగబాబు పేరును జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఖరారు చేశారు.ఏపీలో శాసన సభ్యుల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమిలో భాగంగా నాగబాబు పేరును పార్టీ అధ్యక్షుడు పవన్ ఖరారు చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలని నాగబాబుకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు జనసేన ట్విట్టర్ వేదికగా వివరాలను వెల్లడించారు.ఎమ్మెల్సీ అభ్యర్థిగా శ్రీ @NagaBabuOffl గారి పేరు ఖరారు శాసన సభ్యుల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థిగా శ్రీ కొణిదెల నాగబాబు గారి పేరును పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు ఖరారు చేశారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా శ్రీ నాగబాబు గారు… pic.twitter.com/B4yBXjG96X— JanaSena Party (@JanaSenaParty) March 5, 2025