‘తవ్వండి.. తోలండి.. మనల్ని ఎవడ్రా ఆపేది’ | Janasena Leaders illegal excavations in Eluru Agency of Andhra Pradesh | Sakshi
Sakshi News home page

రెచ్చిపోతున్న జనసేన నేతలు.. ‘తవ్వండి.. తోలండి.. మనల్ని ఎవడ్రా ఆపేది’

Dec 2 2025 7:16 AM | Updated on Dec 2 2025 8:32 AM

Janasena Leaders illegal excavations in Eluru Agency of Andhra Pradesh

కాల్వ గట్టును జేసీబీతో తవ్వి టిప్పర్లలో తరలిస్తున్న గ్రావెల్‌

ఏలూరు ఏజెన్సీలో రెచ్చిపోతున్న జనసేన నేతలు 

పట్టించుకోని అధికారులు

బుట్టాయగూడెం: ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో జనసేన నేతలు రెచ్చిపోతున్నా­రు. ‘మనల్ని ఎవడ్రా ఆపేది’ అంటూ మ­న్యంలోని కొండలు, గుట్టల్ని తవ్వేస్తూ.. గ్రా­వె­ల్, మట్టిని మైదాన ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. టిప్పర్‌ రూ.5 వేల చొప్పున విక్రయాలు జరుపుతున్నారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా జేసీబీలతో తవ్వి టిప్పర్లలో తరలిస్తున్నారు. వీరి చర్యల వల్ల ఏజెన్సీలోని కొండలు, గుట్టలు కరిగిపోతున్నాయి. చివరకు పంట కాలువ గట్లు, పరిసర ప్రాంతాలను కూ­డా వదలటం లేదు. 

మట్టి, గ్రావెల్‌ తవ్వ­కాలు జరుపుతూ పగలు, రాత్రి టిప్పర్లలో తరలిస్తు­న్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరో­పణలు వినిపిస్తున్నాయి. అధికారు­ల సహకారంతోనే తవ్వకాలు సాగుతున్నాయా అని గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. బుట్టాయగూడెం మండలం నూతిరామన్నపాలెం సమీపంలోని కొండను నిబంధనలకు విరుద్ధంగా ఇటీవల జేసీబీతో తవ్వి తరలించారు. తాజా­గా సోమవారం బుట్టాయగూ­డెం శివారు బూసరాజుపల్లి సమీపంలోని చింతలపూడి ఎత్తిపోతల పథకం కాలువ గట్టును జేసీబీతో తవ్వి గ్రావెల్, మట్టిని తరలించడం ప్రారంభించారు. 

స్థానికులు ఫిర్యా­దు చేయడంతో ఇరిగేషన్‌ ఏఈ అక్క­డికి చేరుకుని తవ్వకాలను అడ్డుకున్నారు. అక్రమంగా మట్టి తవ్వకాలపై తహసీల్దార్‌ కార్యాలయానికి, పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఇరిగేషన్‌ డీఈ ఎం.నాగరాజు తెలిపారు. అయినా అక్రమ తవ్వకాలు చేస్తున్న వారిపై అధికారులు చర్య­లు తీసుకుంటారో లేదో వేచి చూ­డా­ల­ని గిరిజన సంఘాల నేతలు అంటున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement