breaking news
TTD
-
‘బీఆర్ నాయుడు మూల్యం చెల్లించుకోక తప్పదు’
టీటీడీలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి భూమన కరుణాకర్రెడ్డి అని, అలాంటి వ్యక్తి గురించి మాట్లాడే హక్కు బీఆర్ నాయుడికి ఏమాత్రం లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు.సాక్షి, తాడేపల్లి: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీటీడీలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి భూమన కరుణాకర్రెడ్డి అని, అలాంటి వ్యక్తి గురించి మాట్లాడే హక్కు బీఆర్ నాయుడికి లేదని అన్నారాయన.జుట్టు తెప్పిస్తామని, మోకాళ్ల నొప్పులు తగ్గిస్తామని మోసం చేశారు. టీఆర్రీ రేటింగ్స్ కోసం టీవీ5లో అశ్లీల ప్రోగ్రామ్లు వేయలేదా?.. అసలు శ్రీవారి టికెట్లు బ్లాక్లో అమ్ముతుంటే చర్యలేవీ? అని బీఆర్ నాయుడిని అంబటి రాంబాబు ప్రశ్నించారు.బీఆర్ నాయుడు చీటర్. బ్రోకర్ రాజకీయాలు చేసే వ్యక్తి. బాబు భజన చేసి టీటీడీ చైర్మన్ అయ్యాడు. కాలు పెట్టగానే తిరుమలలో ఆరుగురు భక్తులు చనిపోయారు. దైవాన్ని అడ్డుపెట్టుకుని బీఆర్ నాయుడు వ్యాపారం చేస్తున్నాడు. తిరుమల ప్రతిష్టను దెబ్బ తీస్తున్నాడు. గోవింద నామస్మరణ మరిచి దూషణలు చేస్తున్నాడు. అందుకు తగిన మూల్యం త్వరలోనే చెల్లించుకుంటాడు అని అంబటి అన్నారు.టీడీపీ ఎమ్మెల్యేలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఎమ్మెల్యే రాజశేఖర్ ఫారెస్ట్ సిబ్బందిపై దాడి చేశారు. ఏం చర్యలు తీసుకున్నారు?. అరెస్ట్ చేసి జైలుకు పంపాల్సిందే అని అంబటి డిమాండ్ చేశారు. హోంమంత్రి మైక్ ముందే మాట్లాడతారా? యాక్షన్ తీసుకుంటారా?. అమరావతి మునకపోతే హైవేకి గండి ఎందుకు కొట్టారు? అని చంద్రబాబు ప్రభుత్వాన్ని అంబటి నిలదీశారు. -
తిరుపతి ప్రజల డిమాండ్.. BR నాయుడుని వెంటనే TTD చైర్మన్గా తొలగించాలి
-
తిరుమల శ్రీవారి సేవలో అక్కినేని జంట
అక్కినేని జంట నాగచైతన్య-శోభిత.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో చైతూ-శోభిత.. స్వామి వారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగ నాయకుల మండపంలో నాగచైతన్య దంపతులని పండితులు ఆశీర్వదించారు. ఈ క్రమంలో ఫొటోలు వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: కదల్లేని స్థితిలో 'వెంకీ' కమెడియన్.. పక్షవాతం రావడంతో)కెరీర్ విషయానికొస్తే నాగచైతన్య.. ఈ ఏడాది 'తండేల్'తో హిట్ కొట్టాడు. ప్రస్తుతం కార్తిక్ వర్మ దర్శకత్వంలో ఓ సూపర్ నేచురల్ హారర్ మూవీ చేస్తున్నాడు. ఇది కాకుండా కొరటాల శివతోనూ కొత్త సినిమా చేయబోతున్నాడని గత కొన్నిరోజులుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. మరోవైపు శోభిత మాత్రం పెళ్లి తర్వాత కొత్త చిత్రాల్లో నటిస్తున్నట్లు లేదు. చాలారోజుల తర్వాత వీళ్లు మరోసారి జంటగా కనిపించడంతో అభిమానులు ఆనందపడిపోతున్నారు.(ఇదీ చదవండి: అనుపమ 'పరదా' సినిమా రివ్యూ) శ్రీవారిని దర్శించుకున్న హీరో నాగచైతన్యతిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని సినీ నటుడు అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల గురువారం ఉదయం దర్శించుకున్నారు. #NagaChaitanya pic.twitter.com/SQTZM6wKde— Milagro Movies (@MilagroMovies) August 21, 2025Yuvasamrat @chay_akkineni garu & our dear Sobhita garu spotted at the sacred Tirumala 🙏#NagaChaitanya #Sobhita pic.twitter.com/4j2THXMQde— Trends NagaChaitanya™ (@TrendsChaitu) August 21, 2025 -
BR నాయుడు ని ఇమిటేట్ చేసి ఏకిపారేసిన భూమన..
-
ఉడత ఊపులకు భయపడేది లేదు.. పోరాటం ఆగదు: సాక్షి మీడియా
సాక్షి, విజయవాడ: తిరుమల తిరుపతి దేవస్థానం కథనాలల వ్యహారంలో లీగల్ నోటీసుల అంశంపై సాక్షి మీడియా సంస్థ స్పందించింది. టీవీ5 లీగల్ నోటీసుల ఉడత ఊపులకు భయపడేది లేదని, పుణ్యక్షేత్రంలో జరుగుతున్న అరాచకాలపై పోరాటం ఆగదని స్పష్టం చేసింది. మీ నిర్లక్ష్యంతో తొక్కిసలాటలో భక్తులు చనిపోయారు.. అది నిజంకాదా?. క్షమాపణ చెప్తే చనిపోయిన వారు బతికొస్తారా? అని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అన్నది నిజం కాదా?. బీఆర్నాయుడి హయాంలో.. తిరుమలలో దళారుల దందా పెరిగిపోయిన మాట వాస్తవం కాదా?. మీ చేతకానితనంలో సామాన్యులకు ఇబ్బందులు వాస్తవం కాదా?. రోజుల తరబడి క్యూలైన్లో ఇబ్బంది పడుతోంది నిజం కాదా?. ఏఐ టెక్నాలజీతో దర్శనాలు సాధ్యం కాదని మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం వెంకన్న సాక్షిగా చెప్పింది నిజం కాదా?. డిప్యూటీ సీఎం పవన్ దర్శనానికి వెళ్లారనే అక్కసుతో పూజారికే మోమో ఇచ్చింది నిజం కాదా?.. అని సాక్షి మీడియా సంస్థ నిలదీసింది.భక్తులకు సరైన సదుపాయలు కల్పించాలన్నదే మా తాపత్రయం. టీడీపీని రాజకీయాలకు అతీతంగా ఉంచాలన్నదే సాక్షి ఆకాంక్ష. సామాన్య భక్తుడికి మెరుగైన సేవలు అందించాలన్నదే మా డిమాండ్. శ్రీవారిని కేవలం వీఐపీలకు పరిమితం చేయడంపై ప్రశ్నించడం ఆగదు. తిరుమల పుణ్యక్షేత్రంలో జరుగుతున్న అరాచకాలపై మా పోరాటం ఆగదు అని సాక్షి మీడియా సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. -
శ్రీవారి దర్శనానికి 24 గంటలు
తిరుమల: తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడుతోంది. క్యూ కాంప్లెక్స్లు, కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరింది. వర్షం పడుతున్నా భక్తులు లెక్కచేయకుండా శ్రీవారిని దర్శించుకునేందుకు క్యూలైన్లో వేచి ఉన్నారు. టీటీడీ అధికారులు ఎప్పటికప్పుడు క్యూలైన్లను పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూనే ఉంది. శ్రీవారి దర్శనాన్ని ముగించుకొని బయటకు వస్తున్న భక్తులు పరుగులు తీస్తూ చలవ పందిళ్ల కిందకు చేరుకున్నారు. వర్షం కారణంగా తిరుమలలోని కొన్ని దుకాణాలు మూతపడ్డాయి. శ్రీవారి దర్శనానికి 24 గంటలు సమయం పడుతోంది. శనివారం అర్ధరాత్రి వరకు 87,759 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. అదేవిధంగా 42,043 మంది తలనీలాలు సమర్పించారు. స్వామి వారికి హుండీ రూపంలో రూ.4.16 కోట్ల ఆదాయం వచి్చంది. -
18న నవంబర్ నెల శ్రీవారి దర్శన కోటా విడుదల
తిరుమల: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల నవంబర్ కోటాను ఈనెల 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల ఎల్రక్టానిక్ డిప్ కోసం ఆగస్ట్ 20న ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని తెలిపింది.ఆర్జిత సేవ టికెట్లను 21న ఉదయం 10 గంటలకు, వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్ల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఆగస్ట్ 25న ఉదయం 10 గంటలకు..తిరుమల, తిరుపతిలలో గదుల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది. -
రాజకీయ 'వైకుంఠ'పాళి
సాక్షి టాస్క్ ఫోర్స్: అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు, దేవదేవుడు, భక్తవత్సలుడు శ్రీ వేంకటేశ్వరస్వామి పుణ్యక్షేత్రం తిరుమల ప్రస్తుతం రాజకీయ వైకుంఠపాళికి నిలయమైంది. వివాదాలకు కేంద్రబిందువైంది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వ్యవహారశైలి దివ్యక్షేత్ర ప్రతిష్టను మసకబారుస్తోంది. తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిననాటి నుంచి అక్రమాలు కోకొల్లలుగా జరుగుతున్నాయి. దీనికి నిదర్శనాలెన్నో.. ఎన్నెన్నో..ఆరుగురిని బలిగొన్న నిర్లక్ష్యం ఈ ఏడాది జనవరిలో వైకుంఠ ఏకాదశి టికెట్ల పంపిణీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. దీనిలో టీటీడీ చైర్మన్, అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. ఏకాదశికి భారీగా ప్రజలు తరలివస్తారన్న సమాచారం ఉందని, అయితే అధికారులు సరైన సౌకర్యాలు కల్పించకపోవడం వల్ల తొక్కిసలాట జరిగిందని ఆనక తాపీగా ప్రకటించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఈ విషయంలో తమ వైఫల్యం ఉందనే విషయం చెప్పకనే చెప్పేశారు. నిందను అధికారులపై నెట్టబోయి తాను తీసిన గోతిలో తానే పడ్డారు. అధికారులను ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత తనదేనని మరిచిపోయారు. కనీసం తన వల్ల తప్పు జరిగిందని, క్షమాపణలు చెప్పడానికీ ఆయనకు నోరు రాలేదు. పైగా క్షమాపణ చెప్తే పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా అంటూ ఆయన దురుసుగా వ్యాఖ్యానించిన తీరు అప్పట్లో వివాదాస్పదమైంది.శ్రీవాణి ట్రస్టు రద్దుకు కుటిలయత్నాలు దేశవిదేశాల్లోని శ్రీవారి ఆలయాల నిర్మాణం, పురాతన ఆలయాల జీర్ణోద్ధరణ కోసం శ్రీవాణి ట్రస్టు ద్వారా గొప్ప కార్యక్రమానికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే గత ఎన్నికల్లో దీనిపై టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్కళ్యాణ్లు తీవ్ర ఆరోపణలు చేశారు. అబద్ధాలు వల్లెవేశారు. కూటమి సర్కారు అధికారంలోకి రాగానే టివీ5 చైర్మన్ బీఆర్ నాయుడిని టీటీడీ చైర్మన్గా నియమించడంతో ఆయన బాధ్యతలు చేపట్టడానికి ముందే శ్రీవాణి ట్రస్ట్ రద్దు చేస్తానని ప్రకటించాడు.. చంద్రబాబు మనసులోని మాటను తన నోటితో పలికారు. శ్రీవాణి ట్రస్ట్ పై విజిలెన్స్ విచారణ కూడా జరిపించారు. ఎక్కడా ఎలాంటి అక్రమాలు లేవని తేలడంతో తోకముడిచారు. కొంతకాలం శ్రీవాణి ట్రస్ట్ పేరు మారుస్తామని ప్రగల్భాలు పలికి అదీ చేయలేకపోయారు. శ్రీవాణి ట్రస్ట్ తక్కువ సమయంలో భక్తుల మన్ననలు, ఆదరణ పొందడమే దీనికి కారణం. వైఎస్సార్ సీపీ హయాంలో ప్రారంభమైంది కాబట్టే శ్రీవాణి ట్రస్టును రద్దు చేయాలనే బీఆర్నాయుడు, కూటమి పాలకులు కుటిలయత్నాలకు పాల్పడి చతికిలపడ్డారు.దళారులకు నిలయంగా చైర్మన్ కార్యాలయంటీటీడీ చైర్మన్ కార్యాలయం దళారులకు నిలయంగా మారింది. నిత్యం ఇక్కడ దర్శన టికెట్ల అమ్మకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. వేలసంఖ్యలో వీఐపీ దర్శనాల మంజూరే దీనికి నిదర్శనం. గతంలో 3 వేల వరకు మాత్రమే వీఐపీ దర్శనాలు కేటాయించేవారు. ఇప్పుడు 7 వేల వరకు మంజూరు చేస్తున్నారు. దీంతో సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికితోడు తాజాగా ఉదయం, సాయంత్రం రెండుపూటలా వీఐపీ దర్శనాలు కొనసాగించాలని పాలకమండలి తీసుకున్న నిర్ణయంతో సామాన్య భక్తుల పాలిట అశనిపాతంగా మారింది. ఈ నిర్ణయం వల్ల రోజూ పదివేల మంది సామాన్య భక్తులు దర్శనానికి దూరమవుతారు. ఇదిలా ఉంటే టీటీడీ చైర్మన్ అసంబద్ధ నిర్ణయాలపై ఎవరైనా ప్రశ్నిస్తే సొంత చానల్లో చెత్త రాతలు రాయించి ప్రత్యర్థులపై బురదచల్లి బెదిరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి వ్యక్తిని సీఎం చంద్రబాబు ఎలా చైర్మన్ను చేశారని, అతని వ్యవహారశైలి వల్ల టీటీడీ ప్రతిష్ట మసకబారుతోందని సామాన్య భక్తులూ ఆవేదన చెందుతున్నారు.దోపిడీకి కొత్తగా ఏఐ జపం సామాన్య భక్తులకు గంటలో దర్శనం చేయిస్తానని చైర్మన్ అయిన కొత్తలో ప్రగల్భాలు పలికిన బీఆర్నాయుడు ఆ తర్వాత ఆ హామీని గాలికొదిలేశారు. సంపన్నుల సేవలో తరించారు. ఇప్పుడు టీటీడీ ధనాన్ని దోచుకోవడానికి ఏఐ టెక్నాలజీ జపం చేస్తున్నారు. దీనివల్ల మూడు గంటల్లో సామాన్య భక్తులు దర్శనం చేయించుకోవచ్చని కోతలు కోస్తున్నారు. ఇది ఆచరణలో సాధ్యం కాదని తెలిసినా అదే జపం చేస్తున్నారు. ఏఐ టెక్నాలజీ పేరుతో ఐటీ కంపెనీలకు టీటీడీ సొమ్మును దోచి పెట్టడానికే ఈ ఎత్తుగడ అని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈవో, చైర్మన్ మధ్య విభేదాలు ఏఐ టెక్నాలజీ విషయంలో ఈవో శ్యామలరావు, చైర్మన్ బీఆర్ నాయుడు మధ్య విభేదాలు తలెత్తాయి. ఆచరణలో ఏఐ టెక్నాలజీ సాధ్యం కాదని శ్యామలరావు దానిని అడ్డుకోవడంతో చైర్మన్ తన ఎల్లో చానెల్ ద్వారా ఈఓపై బురద జల్లే యత్నం చేశారు. వీరి మధ్య వివాదం చిలికిచిలికిగాలివానలా మారి పంచాయితీ సీఎం వద్దకు చేరింది.బీఆర్ నాయుడు తీరు సీఎం చంద్రబాబుకూ తలనొప్పిగా మారింది. బీఆర్ నాయుడు వచ్చిన తర్వాత టీటీడీ ప్రతిష్ట పాతాళానికి పడిపోయిందనే నివేదికలు సీఎం వద్ద అప్పటికే ఉండడంతో అతడిని ఎందుకు టీటీడీ చైర్మన్గా చేశానా అని చంద్రబాబు తల పట్టుకుంటున్నారని సమాచారం. -
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి 26 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. శుక్రవారం అర్ధరాత్రి వరకు 70,480 మంది స్వామిని దర్శించుకున్నారు. 28,923 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.17 కోట్లు సమర్పించారు.టైమ్ స్లాట్ ( ఈ) దర్శనానికి సుమారు 6 గంటలు పడుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 18 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 4 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. -
ప్రచార ఆర్భాటం.. పనులేమో శూన్యం!.. టీటీడీ చైర్మన్పై భూమన ఫైర్
సాక్షి,తిరుపతి: తిరుమలలో ఏఐ టెక్నాలజీతో రెండు గంటల్లోనే భక్తులకు శ్రీవారి దర్శనం అంటూ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు చేస్తున్నదంతా ప్రచార ఆర్భాటమేనని మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి మండిపడ్డారు.తిరుపతిలో మీడియాకు విడుదల చేసిన వీడియోలో ఆయన మాట్లాడుతూ.. ఏఐ టెక్నాలజీతో రెండు గంటల్లోనే శ్రీవారి దర్శనం అంటూ మాట్లాడుతున్న చైర్మన్ శ్రీవారి దర్శనం కోసం ప్రస్తుతం ఉన్న రెండు క్యూ కాంప్లెక్స్లు సరిపోవడం లేదని మూడో క్యూ కాంప్లెక్స్కు పాలకమండిలో ఎలా నిర్ణయం తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.ఇప్పటికే ఉచితంగా మాకు ఏఐ టెక్నాలజీని ఇచ్చేందుకు ముందుకు వచ్చారంటూ గూగూల్, టీసీఎస్కు చెందిన ప్రతినిధులకు కొండపైన గెస్ట్హౌస్లను కేటాయించడం, టీటీడీ వాహనాలను వాడుకునేందుకు అనుమతించడం, టీటీడీ సిబ్బందిని వారి కోసం కేటాయించడం ఎలా చేస్తున్నారని ప్రశ్నించారు.ఆ సంస్థల ఉద్యోగులకు టీటీడీ ఖర్చుతో వాహనాలను ఎలా అందిస్తున్నారో చెప్పాలన్నారు. తొమ్మిది నెలలుగా ఏఐ టెక్నాలజీని తీసుకువస్తున్నామంటూ ఆయన పదవీ కాలం ముగిసే వారకు ఇదే చెబుతూ కాలక్షేపం చేస్తారా అని నిలదీశారు. ప్రతిరోజూ దాదాపు లక్ష మంది భక్తులు వచ్చే టీటీడీలో భక్తుల సౌకర్యాలపై దృష్టి సారించాల్సిన టీటీడీ చైర్మన్ తన ప్రచారం కోసం, పరస్పర విరుద్దమైన నిర్ణయాలను ఎలా తీసుకుంటారన్నారు.ఆలయ సంప్రదాయాలకు అనుగుణంగానే భక్తుల దర్శన ఏర్పాట్లు ఉండాలే కానీ, ఏఐ పేరుతో కొత్త విధానాలను ఆలయంలో ప్రవేశపెట్టడంపై హైందవధర్మ పరిరక్షకుల సలహాలను ఎక్కడా తీసుకోలేదని మండిపడ్డారు. -
Tirumala: నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి 25 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. శుక్రవారం అర్ధరాత్రి వరకు 70,353 మంది స్వామిని దర్శించుకున్నారు. 25,636 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.65 కోట్లు సమర్పించారు.టైమ్ స్లాట్ ( ఈ) దర్శనానికి సుమారు 4 గంటలు పడుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 8 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
Tirumala: నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొంత తక్కువగా ఉంది. ఉచిత సర్వదర్శనానికి 12 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. ఆదివారం అర్ధరాత్రి వరకు 85,486 మంది స్వామిని దర్శించుకున్నారు. 30,929 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.85 కోట్లు సమర్పించారు.టైమ్ స్లాట్ ( ఈ) దర్శనానికి సుమారు 5 గంటలు పడుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 12 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 4 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
తిరుమలలో ఒకప్పటి హీరోయిన్.. గుర్తుపట్టారా?
టాలీవుడ్లోకి ఎప్పటికప్పుడు పదుల సంఖ్యలో హీరోయిన్లు వస్తూనే ఉంటారు. తమదైన యాక్టింగ్తో అలరిస్తూ ఉంటారు. ఈమె కూడా అలానే అప్పట్లో చిరంజీవి, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంది. ఇప్పుడేమో సీరియల్స్ చేస్తోంది. మరి ఈ హింట్స్ బట్టి ఈ నటి ఎవరో కనిపెట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?పైన ఫొటోలో కనిపిస్తున్న ఆమె పేరు నిరోషా. ఇప్పటి జనరేషన్కి అయితే అస్సలు తెలియకపోవచ్చు. కానీ 90ల్లో తెలుగు సినిమాలు చూసిన వాళ్లు మాత్రం ఈమెని ఇట్టే గుర్తుపట్టేస్తారు. తెలుగులో ముద్దుల మామయ్య, నారీనారీ నడుమ మురారి, సింధూర పువ్వు, స్టూవర్టుపూరం పోలీస్ స్టేషన్ తదితర చిత్రాలతో ఆకట్టుకుంది. తర్వాత తర్వాత మూవీస్ చేసింది గానీ హిట్స్ అందుకోలేకపోయింది. తెలుగులో చివరగా 2019లో వచ్చిన 'నువ్వు తోపు రా' అనే మూవీలో కనిపించింది.(ఇదీ చదవండి: ఎన్టీఆర్కే ఎక్కువ.. 'వార్ 2'కి రెమ్యునరేషన్ ఎంత?)ఈమె వ్యక్తిగత విషయాలకొస్తే.. శ్రీలంకలోని కొలంబోలో పుట్టి పెరిగింది. కానీ తమిళ సినిమాలతో నటిగా మారింది. 1988 నుంచి ఇప్పటివరకు నటిస్తూనే ఉంది. కాకపోతే సినిమాలు చాలావరకు తగ్గించేసింది. గతేడాది రిలీజైన రజినీకాంత్ 'లాల్ సలామ్'లోనూ ఈమె నటించింది. గతంలో తెలుగులో పలు సీరియల్స్ కూడా ఈమె చేసింది. ప్రస్తుతం తమిళంలో సీరియల్స్ చేస్తోంది.1995లో నటుడు రాంకీని ఈమె పెళ్లి చేసుకుంది. అతడు కూడా తెలుగుతో పాటు దక్షిణాది సినిమాల్లో కనిపించాడు. గతేడాది రిలీజైన 'లక్కీ భాస్కర్'లో హీరో సహాయపడే ఆంటోని పాత్ర చేసింది ఈయనే. ఇక నిరోషాకు ఒకప్పటి హీరోయిన్, నటి రాధిక బంధువు అవుతుంది. తాజాగా ఈమె శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. అందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈమె ఒకప్పటి హీరయిన్ నిరోషా కదా అని నెటిజన్లు అనుకుంటున్నారు.(ఇదీ చదవండి: 'హరి హర వీరమల్లు'.. రెండోరోజు భారీగా తగ్గిన కలెక్షన్స్) -
తిరుమల తొక్కిసలాట ఘటన.. అసలు దోషులెక్కడా చంద్రబాబు
సాక్షి,తిరుపతి: తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై కంటి తుడుపు చర్యలకు చంద్రబాబు ప్రభుత్వం జ్యుడిషియల్ కమీషన్ ఏర్పాటు చేసిందని మాజీ మంత్రి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ఆరోపించారు. ఈ ఏడాది జనవరి 8వ తేదీన వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై విశ్రాంత న్యాయమూర్తి ఎం.సత్యనారాయణ మూర్తి కమిషన్ ఆధ్వర్యంలో జరిగిన విచారణపై భూమన మీడియాతో మాట్లాడారు.ఆయన ఏమన్నారంటే.. ‘‘ శ్రీరంగ పట్టణం ఆదర్శంగా తీసుకుని ఆ వైష్ణవ సంప్రదాయం తిరుమలలో 10 రోజుల పాటు వైకుంఠ ఏకాదశి దర్శనం అవకాశం కల్పించాము. 23 మంది పీఠాధిపతులు హర్షించారు. జనవరి 8 న జరిగిన జరిగిన తొక్కిసలాట పై కంటి తుడుపు చర్యలు కు జ్యుడిషియల్ కమీషన్ ఏర్పాటు చేసింది.సంఘటన జరిగిన తర్వత రోజు కలెక్టర్, ఎస్పీ, ఈవోలుపై సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తొక్కిసలాట ఘటన పై ఈవో ఛైర్మన్ల మధ్య అవగాహన లేదు, క్షమాపణ చెప్పాలని డిప్యూటీ సీఎం పవన్ సూచించారు. ఆరోజు గోశాల డైరెక్టర్ హరినాధ రెడ్డి, డీఎస్పీ రమణ సస్పెండ్ చేశారు.చంద్రబాబు ముందే నిర్ణయించుకుని ప్రభుత్వం నివేదిక ఇచ్చింది. తమకు కావాల్సిన వారితో సాక్షులు ఇప్పించారు హరినాథ్ రెడ్డి, రమణ కుమార్లను బలి ఇచ్చారు. అసలు నిందితులను వదిలి వేశారు. ఆరు మంది చనిపోయి, 50 మందికి పైగా తీవ్ర గాయాలు ఐతే పాక్షికంగా నివేదిక ఇచ్చారుఆ నివేదికను దురుద్దేశ పూర్వకంగా ఇచ్చిన నివేదికగా వైఎస్సార్సీపీ భావిస్తోంది. విజిలెన్స్ నివేదికలు బట్టి చూస్తే.. చంద్రబాబు నియమించిన ఏ విచారణ అయిన ఒక కేస్ స్టడీగా చేశారు. ఆయన కోరుకున్నట్లుగానే విచారణ కమిషన్ ఫలితం వస్తుంది అనడానికి ఇది ఒక కేస్ స్టడీ.హరినాధ రెడ్డికు 21.12.24 నా జరిగిన సమావేశంలో సూర్య ప్రకాష్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కు సమాన బాధ్యత ఇచ్చారులా అండ్ ఆర్డర్, విజిలెన్స్ వాళ్లకు క్యూ లైన్ బాధ్యతలు ఇచ్చారు. అండ్ ఆర్డర్ బాధ్యత ఎస్పీ, సీవీ అండ్ ఎస్వో ది కూడా బాధ్యత. వైఎస్సార్సీపీ పాలనలో ఏ ఒక్క చిన్న సంఘటన జరగలేదు.జనవరి 10, 11, 12 తేదీలు మాత్రమే ఎస్ఎస్డీ టోకెన్లు ఇస్తామని చెప్పారు. అధికార యంత్రాంగం ఈ ఘటనకు కారణం, దీనికి సమాధానం లేదు. చంద్రబాబు పాలనలో తొక్కిసలాట ఘటన జరిగితే ఈవోనే బాధ్యత వహించాలని గతంలో చందన ఖాన్ ఒక నివేదిక ఇచ్చారు. కౌంటర్ల వద్ద విధుల్లో ఉన్న వారిని ఎలా చర్యలు తీసుకుంటారు? క్యూ లైన్లో హోల్డింగ్ పాయింట్ అనేది ఎందుకు పెట్టారు.తొక్కిసలాట జరిగిన సమయంలో పోలీసులు చోద్యం చూశారు. వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు. మీ బాధ్యత నిర్లక్ష్యం వల్ల తొక్కిసలాట ఘటన జరిగింది. భక్తుల మనోభావాలను దెబ్బతీసిన జ్యుడిషియల్ కమీషన్ నివేదిక సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాము. మా పాలనలో వైకుంఠ ఏకాదశికు పదిలక్షలు మందికి దర్శనం చేయించాము. 23 మంది పీఠాధిపతులు స్వహస్తాలతో ఇచ్చిన సూచన ప్రకారం పదిరోజుల దర్శనం జరిగింది.పీఠాధిపతులు ఆలోచనలను పక్కన పడేస్తారా.. కేసులు పెట్టాలనే , జైలుకు తరలించాలని చూస్తున్నారు.నా గొంతు కోస్తే తప్ప నేను పోరాటం ఆగదు’’ అని స్పష్టం చేశారు. -
Tirumala: నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి 25 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. గురువారం అర్ధరాత్రి వరకు 68,838 మంది స్వామిని దర్శించుకున్నారు. 22,212 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 4.49 కోట్లు సమర్పించారు.టైమ్ స్లాట్ ( ఈ) దర్శనానికి సుమారు 5 గంటలు పడుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 18 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 4 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
రూ.3 కోట్ల విలువైన గృహం, రూ.66 లక్షల నగదు
తిరుమల: ఓ రిటైర్ట్ ఐఆర్ఎస్ అధికారి తన మరణానంతరం టీటీడీకి చెందాలని రాసుకున్న వీలునామా ప్రకారం రూ.3 కోట్ల విలువైన భవనానికి సంబంధించిన ఆస్తి పత్రాలు, రూ.66 లక్షలు నగదుకు సంబంధించిన చెక్కులను ఆయన ట్రస్టీలు గురువారం టీటీడీకి అందజేశారు. మాజీ ఐఆర్ఎస్ అధికారి వైవీఎస్ఎస్ భాస్కర్ రావు హైదరాబాద్ వనస్థలిపురంలో ‘ఆనంద నిలయం’ పేరుతో రూ.3 కోట్లతో 3,500 చదరపు అడుగుల భవనాన్ని నిర్మించుకున్నారు. దాన్ని, బ్యాంక్లో దాచుకున్న రూ.66 లక్షలను తన మరణానంతరం ఆధ్యాత్మిక కార్యకలాపాల కోసం వినియోగించాలని వీలునామా రాశారు. తను బ్యాంక్లో దాచుకున్న సొమ్ములో టీటీడీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ.36 లక్షలు, వేంకటేశ్వర సర్వ శ్రేయాస్ ట్రస్టుకు రూ.6 లక్షలు, వేంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టుకు రూ.6 లక్షలు, వేంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టుకు రూ.6 లక్షలు, శ్రీవేంకటేశ్వర విద్యాదాన ట్రస్టుకు రూ.6 లక్షలు, శ్రీవాణి ట్రస్టుకు రూ.6 లక్షలు విరాళంగా అందివ్వాలని సంకల్పించారు. ఇటీవల ఆయన హైదరాబాద్లో తుది శ్వాస విడిచారు. భాస్కర్ రావు అంతిమ కోరిక మేరకు ఆయన ట్రస్టీలు ఎం.దేవరాజ్ రెడ్డి, వి.సత్యనారాయణ, బి.లోకనాథ్లు వీలునామా ప్రకారం టీటీడీకి చెందాల్సిన ఆస్తి పత్రాలు, చెక్కులను గురువారం తిరుమలలో టీటీడీ ఏఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు.టీటీడీకి రూ.2 కోట్లు విరాళంహైదరాబాద్కు చెందిన ట్రినిటీ కంబైన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ టీటీడీ శ్రీవేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు గురువారం రూ.2 కోట్లు విరాళమిచ్చింది. సంబంధిత చెక్కులను ఏఈవోకి గురువారం అందజేసింది. -
తిరుమలలో హీరోయిన్ ప్రణీత.. మొదటిసారి అంటూ పోస్ట్!
అత్తారింటికి దారేది మూవీతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ముద్దుగుమ్మ ప్రణీత.. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోంది. పెళ్లి తర్వాత నటనకు గుడ్ బై చెప్పేసిన కన్నడ బ్యూటీ ఫ్యామిలీతో కలిసి ఎక్కువగా కనిపిస్తోంది. తాజాగా ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. తన భర్త, కుమారుడితో కలిసి వెంకటేశ్వరస్వామికి మొక్కులు చెల్లించుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ప్రణీత తన ఇన్స్టాలో తిరుమల నుంచి ఫోటోలు షేర్ చేసింది. గోవిందా గోవిందా.. నా కుమారుడు కృష్ణ మొదటిసారి స్వామివారికి తలనీలాలు సమర్పించాడని క్యాప్షన్ రాసుకొచ్చింది. కర్ణాటకకు చెందిన ఈ బ్యూటీ తెలుగుతో పాటు శాండల్వుడ్ సినిమాల్లోనూ నటించింది. టాలీవుడ్లో అత్తారింటికి దారేది మూవీతో పాటు పాండవులు పాండవులు తుమ్మెద, బ్రహ్మోత్సవం, రభస లాంటి చిత్రాల్లో కనిపించింది. Actress @pranitasubhash along with her family visited Tirumala to seek the divine blessings of Lord Venkateshwara!🙏✨#Pranita #Tollywood #TeluguFilmNagar pic.twitter.com/9awUYQJtGk— Telugu FilmNagar (@telugufilmnagar) July 16, 2025 View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) -
Tirumala: నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట శిలాతోరణం వరకు క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు. మంగళవారం అర్ధరాత్రి వరకు 73,020 మంది స్వామిని దర్శించుకున్నారు. 27,609 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 4.19 కోట్లు సమర్పించారు.టైమ్ స్లాట్ ( ఈ) దర్శనానికి సుమారు 6 గంటలు పడుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 24 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 5 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. -
19న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల అక్టోబర్ కోటా విడుదల
తిరుమల: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల అక్టోబర్ కోటాను ఈనెల 19 ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల ఎల్రక్టానిక్ డిప్ కోసం జూలై 21 ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు జూలై 21 నుంచి 23 మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లిస్తే లక్కీడిప్లో టికెట్లు మంజూరవుతాయి. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, వార్షిక పుష్పయాగం టికెట్లను జూలై 22న, అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్ల కోటాను టీటీడీ విడుదల చేస్తుంది. ఇక జూలై 23న అంగప్రదక్షిణం టోకెన్ల కోటా, అనంతరం శ్రీవాణి టికెట్ల ఆన్లైన్ కోటా, మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారికి శ్రీవారి ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తుంది. అక్టోబర్ నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను జూలై 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలలో గదుల కోటాను విడుదల చేస్తుంది. భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. -
Tirupati: తిరుపతిలో రైలు ప్రమాదం
సాక్షి,తిరుపతి: తిరుపతిలో రైలు ప్రమాదం జరిగింది. హిస్సార్ టూ తిరుపతి (04717) ట్రైన్లో మంటలు చెలరేగాయి. మంటల తీవ్రతతో రెండు బోగీలు దగ్ధమయ్యాయి. మంటలు మరో ట్రైన్ భోగీకి వ్యాపించాయి. రైలు అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. అగ్నిప్రమాపక సిబ్బంది ఎగిసి పడుతున్న మంటల్ని అదుపు చేసేందుకు ప్రయత్నించారు.ఆగి ఉన్న ట్రైన్లో జరిగిన అగ్నిప్రమాదంలో హిస్సార్ టు తిరుపతి జనరల్ కోచ్ పూర్తిగా దగ్ధం కాగా.. ట్రాక్ మీద ఉన్న ఉన్న రాయలసీమ ఎక్స్ ప్రెస్ పవర్ కార్ కోచ్కు కూడా అగ్నికీలలు వ్యాపించాయి. ఆ ట్రైన్ భోగి సైతం స్వల్పంగా కాలింది. ఇక ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ట్రైన్లో అగ్నిప్రమాదానికి గల కారణాల్ని రైల్వే అధికారులు అన్వేషిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. షార్ట్ సర్క్యూట్ వల్లే తిరుపతి టూ హిస్సార్ రైలు ప్రమాదంపై తిరుపతి స్టేషన్ మేనేజర్ చిన్నప్పరెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘జనరల్ కోచ్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా తిరుపతి హిస్సార్ మధ్య నడిచే హిస్సార్ ఎక్స్ ప్రెస్లో మంటలు చెలరేగాయి. రైళ్ల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేదు.ప్రమాద నష్టం అంచనా వేస్తున్నాం.రాయలసీమ ఎక్స్ ప్రెస్ పవర్ కోచ్కు మంటలు వ్యాపించాయి, వాటిని అదుపు చేశాం’అని తెలిపారు. -
టీటీడీ సిబ్బందిపై టీడీపీ ఎమ్మెల్యే తిట్ల పురాణం
సాక్షి, తిరుమల: తిరుమలలో టీటీడీ నిబంధనలను గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే థామస్ తుంగలో తొక్కేశారు. తనతో పాటు ఉన్న అనుచరుల అందరిని ప్రోటోకాల్ దర్శనానికి అనుమతించాలని హంగామా సృష్టించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో టీటీడీ సిబ్బందిపై తిట్ల పురాణం లంకించుకున్నారు. ఆయనతో పాటు 12 మందికి ప్రోటోకాల్ను టీటీడీ కేటాయించింది.అదనంగా జనరల్ బ్రేక్ ఇచ్చిన వారిని కూడా ప్రోటోకాల్లో తనతో పాటు పంపాలంటూ వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో టీటీడీ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. టీటీడీ సిబ్బందిపై గొడవపడి మరి ప్రోటోకాల్ దర్శనానికి ఎమ్మెల్యే తీసుకెళ్లారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ సిబ్బంది.. ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు కూడా పట్టించుకోలేదు. ఎమ్మెల్యే థామస్ తీరుపై భక్తులు మండిపడుతున్నారు. -
తిరుమలపై ఇంత పెద్ద నింద వేస్తారా?
టీటీడీలో అన్యమతస్తుల అంశంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను భూమన కరుణాకర్రెడ్డి ఖండించారు. బండి సంజయ్ వ్యాఖ్యలతో తిరుపతి ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని.. ఇది శ్రీవారి ఆలయంపై జరిగిన దాడిగానే పరిగణిస్తున్నామని అన్నారాయన. టీటీడీ సభ్యుడి సమక్షంలోనే బండి సంజయ్ అలా ఎలా ప్రకటించారని.. దీనిపై స్పందించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానికి కచ్చితంగా ఉందని భూమన డిమాండ్ చేస్తున్నారు. సాక్షి, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమతస్తులైన ఉద్యోగుల వ్యవహారం తెలంగాణ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్రెడ్డి స్పందించారు. ఇంత పెద్ద నింద వేసినా.. కూటమి ప్రభుత్వం, టీటీడీ ఇప్పటిదాకా స్పందించకపోవడం దారుణమని అన్నారాయన. టీటీడీలో 1,000 మంది అన్య మతస్తులు ఉన్నారని, వాళ్లను వెంటనే తొలగించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ టీటీడీని హెచ్చరించారు. కేంద్ర మంత్రిగా ఉండి ఇలా ప్రకటన చేశారంటే ఆయన వద్ద ఏమైనా నివేదిక ఉందా?. ఆయన అలా ప్రకటన చేసిన టైంలో పక్కనే టీటీడీ పాలకమండలి సభ్యుడు భాను ప్రకాశ్ కూడా ఉన్నారు. అలాంటప్పుడు దీనిపై వివరణ ఇవ్వాల్సిన భాద్యత కూటమి ప్రభుత్వం, టీటీడీపైన కచ్చితంగా ఉందిటీటీడీ బోర్డులో 22 మంది అన్యమతస్తులైన ఉద్యోగులు ఉన్నారని, వారిని బదిలీ చేస్తున్నట్లు గతంలో ఈవో, చైర్మన్లు ప్రకటించారు. అలాంటప్పుడు బండి సంజయ్ 1,000 మంది అని ఎలా అంటారు?. రెండింటిలో ఏది నిజం? ఆయన(బండి సంజయ్) లెక్క ప్రకారం.. 20 శాతం మంది అన్యమతస్తులే ఉన్నట్లా?. అసలు తిరుమలపై ఇంత పెద్ద నింద ఎలా వేస్తారు?. ఇది భక్తుల మనోభావాలను దెబ్బ తీయడమే. కచ్చితంగా టీటీడీని, ఉద్యోగస్తులను అవమానించడమే.అధికారంలోకి రాగానే.. తిరుమలను ప్రక్షాళన చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. అలాంటప్పుడు తిరుపతి ప్రజలను నొప్పించిన బండి సంజయ్ ప్రకటన పట్ల ఎందుకు స్పందించరు. బండి సంజయ్ వ్యాఖ్యలు చేసి 24 గంటలు గడిచినా పవన్ కల్యాణ్ సహా కూటమి నేతలు, టీటీడీలు కనీసం స్పందించలేదు.. ఖండించలేదు అని భూమన అన్నారు. -
టీటీడీ కి బండి సంజయ్ వార్నింగ్
-
TTD: అన్యమతస్తులను కొనసాగిస్తూనే ఉంటారా?
తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమత ఉద్యోగుల వ్యవహారంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ భగ్గుమన్నారు. అసలు అలాంటి వాళ్లు విధుల్లో ఎందుకని.. వాళ్లను ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారని టీటీడీని నిలదీశారాయన. సాక్షి, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంపై కరీంనగర్(తెలంగాణ) బీజేపీ ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ భగ్గుమన్నారు. శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘టీటీడీలో అన్యమతస్తులకు ఉద్యోగాలు ఇవ్వడం ఏంటి?. అలాంటి వాళ్లను కొనసాగిస్తుండడం ఏంటి?. చర్చి, మసీదుల్లో హిందువులకు ఎవరైనా ఉద్యోగాలు ఇస్తున్నారా?.. .. అన్యమతస్తులైన ఉద్యోగుల వల్ల హిందూ ఆచార వ్యవహారాల్లో చాలా ఇబ్బందులు వస్తున్నాయి. స్వామివారిపై నమ్మకం లేని వారికి జీతభత్యాలు ఇవ్వడం ఎంతవరకు సమంజసం?. అలాంటి వాళ్లు ఉన్నారని బయటకు వస్తేనే సస్పెండ్ చేస్తారా?. టీటీడీ విషయంలో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయకండి. టీటీడీలో ఇతర మతస్థులకు ఉద్యోగాలు ఇవ్వకూడదు… ఉన్న ఉద్యోగులను వెంటనే తొలగించాలి’’ అని బండి సంజయ్ టీటీడీని డిమాండ్ చేశారు. అదే సమయంలో.. తెలుగు రాష్ట్రాల్లో దూపదీప నైవేద్య నోచుకోని ఆలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత టీటీడీపైనే ఉందని స్పష్టం చేశారాయన. అనేక చారిత్రక పురాతన దేవాలయాల అభివృద్ధికి టీటీడీ తోడ్పాటు అందించాలి. కరీంనగర్లో శ్రీవారి ఆలయ నిర్మాణం కోసం భూమిపూజ నిర్వహించారు. ఈ నిర్మాణంతో పాటు కొండగట్టు, వేములవాడ, ఇల్లందకుంట రామాలయం అభివృద్ధికి టీటీడీ సహకరించాలని కోరుతున్నా అని బండి సంజయ్ అన్నారు. -
Tirumala: నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం 21 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. మంగళవారం అర్ధరాత్రి వరకు 78,320 మంది స్వామిని దర్శించుకున్నారు. 24,950 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 4.66 కోట్లు సమర్పించారు.టైమ్ స్లాట్ ( ఈ) దర్శనానికి సుమారు 5 గంటలు పడుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 12 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 4 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. -
తిరుమల భక్తులకు శుభవార్త..
తిరుమల: అన్నప్రసాద కేంద్రాల్లో ఇకపై రాత్రి భోజన సమయంలోనూ భక్తులకు వడలు వడ్డించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఏర్పాట్లు చేపట్టింది. ఈ సందర్భంగా ఆదివారం తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో స్వామి, అమ్మవార్ల చిత్రపటం వద్ద వడలను ఉంచి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పూజ నిర్వహించారు. అనంతరం ఆయన భక్తులకు వడ్డించారు. ఆదివారం నుంచి రాత్రి భోజన సమయంలోనూ భక్తులకు వడలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.రెండ్రోజులు గరుడ సేవజూలై 10న గురు పౌర్ణమి, జూలై 29న గరుడ పంచమి సందర్భంగా టీటీడీ రెండుసార్లు గరుడ వాహన సేవ నిర్వహించనుంది. శ్రీ మలయప్ప స్వామివారు గరుడ వాహనంపై నాలుగు మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. సాయంత్రం 7 నుంచి 9 గంటల వరకు గరుడ వాహన సేవ జరగనుంది.గోవిందరాజస్వామి వారికి జ్యేష్టాభిషేకంగోవిందరాజస్వామి వారి ఆలయంలో మూడు రోజుల పాటు తలపెట్టిన జ్యేష్టాభిషేకం ఉత్సవాలు ఆదివారం వేడుకగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఆషాడ మాసంలో శ్రీ గోవిందరాజస్వామి వారికి జ్యేష్టాభిషేకం నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కోలిపి కైంకర్యాలు, శతకలశ స్నపన తిరుమంజనం, మహా శాంతి హోమం చేపట్టారు.అనంతరం ఆలయంలోని కల్యాణ మండపానికి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారి ఉత్సవమూర్తులను వేంచేపు చేసి అక్కడ ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం స్వామివారం కవచాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి కవచాధివాసం చేశారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామి వారు తిరుచ్చిపై కొలువై ఆలయ మాడవీధుల్లో విహరించారు. చదవండి: సత్యదేవుని దేవేరికి 174 వజ్రాలతో హారం -
Tirumala: నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు వేచి ఉన్న భక్తులు. శనివారం అర్ధరాత్రి వరకు 87,536 మంది స్వామిని దర్శించుకున్నారు. 35,120 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.33 కోట్లు సమర్పించారు.టైమ్ స్లాట్ ( ఈ) దర్శనానికి సుమారు 6 గంటలు పడుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 18 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 5 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. -
శ్రీవాణి టికెట్ల కేంద్రం దగ్గర కనీసం మంచినీళ్ల సౌకర్యం కూడా లేదని ఫైర్
-
తిరుమల: మరో అపచారం
కూటమి పాలనలో వరస ఆలయ అపచారాల ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా.. ఏకంగా తిరుమల శ్రీవారి ఆలయం పేరుతో గేమింగ్ యాప్ వ్యవహారం వెలుగు చూసింది. అందులో ఆలయానికి సంబంధించిన వివరాలు నమోదు కావడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు.సాక్షి, తిరుమల: శ్రీవారి ఆలయంపై ఆన్లైన్లో గేమ్ యాప్ కలకలం రేపింది. తమిళనాడుకు చెందిన రోబ్లెక్స్ అనే సంస్థ ఈ యాప్ను రూపొందించింది. వర్చువల్ ఎక్స్పీరియెన్స్తో ఈ యాప్ను డిజైన్ చేసింది. శ్రీవారి ఆలయానికి సంబంధించిన వివరాలు.. ఇందులో ఆలయ మహ ద్వార ప్రవేశం, దర్శనం, హుండీ తదితర వివరాలు కనిపిస్తున్నాయి. ఈ గేమింగ్ యాప్పై పలువురు భక్తులు టీటీడీకి ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ తప్పనిసరైంది. ఈ యాప్తో రోబ్లెక్స్ సంస్థ బారీ ఆదాయం సమకూర్చుకున్నట్లు తెలుస్తోంది. -
Tirumala: నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు. ఆదివారం అర్ధరాత్రి వరకు 87,254 మంది స్వామిని దర్శించుకున్నారు. 33,777 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 4.28 కోట్లు సమర్పించారు.టైమ్ స్లాట్ ( ఈ) దర్శనానికి సుమారు 6 గంటలు పడుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 24 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 5 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. -
కూటమి పాలనలో సనాతన ధర్మానికి తూట్లు: భూమన
సాక్షి, తిరుపతి: కూటమి పాలనలో సనాతన ధర్మానికి తూట్లు పొడుస్తున్నారని వైఎస్సార్సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దేవదేవుని ఆలయంలో సాంప్రదాయానికి ఉల్లంఘనలు జరుగుతున్నాయన్నారు. సాంప్రదాయానికి తూట్లు పొడవటానికి ఓ ఉన్నతాధికారి ప్రయత్నిస్తున్నారని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు.వేద పారాయణానికి తూట్లు పొడవటానికి సిద్ధమవుతున్నారు. వేదమంటే బ్రహ్మదేవుని వాక్కు. కూటమి పాలనలో సనాతన ధర్మానికి తూట్లు. వేద పారాయణదారుల మీద వేదం వద్దని ఒత్తిడి చేస్తున్నారు. వేదం ఎవరికి అర్థం కాదని ప్రచారం చేస్తున్నారు. వేదాలను వేల సంవత్సరాలుగా కాపాడుకుంటూ వస్తున్నాం. కూటమి పాలనలో మన పూర్వీకులను అధికారులు అవమానిస్తున్నారు’’ అని భూమన ధ్వజమెతారు.‘‘శాసనాలు చెదిరినా వాక్కు ద్వారా వచ్చిన వేదం మరిచిపోలేదు. వేద పండితులు మన సనాతన, వేద వారసత్వాన్ని కాపాడుతున్నారు. వేదమంటే మన భారతీయ సంస్కృతి. ఓ అధికారి అధికార గర్వంతో వేదాలను అవమానిస్తున్నారు. ఆ అధికారి అధికార గర్వాన్ని అడ్డుకోవాలి. మన హిందూ జాతి మేల్కోవాలి. వేదాలను కాపాడుకోవాలి. నేను రాజకీయం చేయడం లేదు.. మన వేదాలను కాపాడుకోవాలి’’ అని భూమన పిలుపునిచ్చారు.‘‘ఏడు యజర్వేదాలు ఏడు కొండలయ్యాయని వేదాలు చెబుతున్నాయి. శ్రీవారి కొలువులో నాలుగు వేద పఠనాలు సాగుతుంటాయి. చతుర్ముఖ బ్రహ్మ నాలుగు వేదాలు స్వామి వారి కోసం పారాయణం చేస్తారు. స్వామివారి సేవలో వేదాలు పఠిస్తుంటారు. వేల సంవత్సరాలుగా వేద పఠనం జరుగుతోంది. టీటీడీ చాలా చోట్ల వేద పాఠశాలలు నిర్వహిస్తుంది...వైఎస్సార్ వేద విశ్వ విద్యాలయాన్న నెలకొల్పారు. పీవీఆర్కే ప్రసాద్ రాసిన పుస్తకాన్ని ఆ అధికారి చదవాలి. వేద పారాయణం కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం 700 పోస్టులు సృష్టించింది. మేం ఓడిన తర్వాత ఆ పోస్ట్లు ఏమయ్యాయో తెలియదు. వేదాలపై కామెంట్ ఆ అధికారి స్కంద పురాణం చదవాలి. చంద్రబాబు అనుమతి లేకుండా ఆ అధికారి మాట్లాడుతారా అనే అనుమానం ఉంది’’ అని భూమన కరుణాకర్రెడ్డి వ్యాఖ్యానించారు. -
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట ATGH వరకు క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు. మంగళవారం అర్ధరాత్రి వరకు 81,037 మంది స్వామిని దర్శించుకున్నారు. 30,548 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 4.12 కోట్లు సమర్పించారు.టైమ్ స్లాట్ ( ఈ) దర్శనానికి సుమారు 6 గంటలు పడుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 18 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 4 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. -
18న శ్రీవారి సెప్టెంబర్ నెల దర్శన కోటా విడుదల
తిరుమల: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల సెపె్టంబర్ నెల కోటాను జూన్ 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల ఎల్రక్టానిక్ డిప్ కోసం జూన్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. టికెట్లు పొందిన వారు జూన్ 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లిస్తే, వారికి లక్కీడిప్లో టికెట్లు మంజూరవుతాయి. కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జి సేవా టికెట్లను జూన్ 21న, అంగప్రదక్షిణం టోకెన్లు 23న, వయో వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టికెట్లను అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనుంది. ఇక 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో గదుల కోటా విడుదల చేస్తారు. శ్రీవారి సేవ (తిరుమల, తిరుపతి), పరకామణి సేవ, నవనీత సేవల ఆగస్టు నెల కోటాను జూన్ 25న విడుదల చేస్తారు. https://ttdevasthanams.ap.gov.in వెబ్సై ట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. -
ఆకలి తీర్చే అక్షయపాత్ర
భక్తుల కోరిక తీర్చడమే కాదు.. తన దర్శనానికి వచ్చినప్పుడు ఆకలి కూడా తీరుస్తున్నాడు జగత్కల్యాణ చక్రవర్తి..తిరుమల వేంకటేశ్వరుడు.. ఆ దేవదేవుడే ఆదేశించినట్లుగా ప్రతిరోజు తిరుమలలో అన్నప్రసాదవితరణ మహాయజ్ఞంలా సాగుతోంది....తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు టీటీడీ నిరంతర యజ్ఞంగా అన్నప్రసాద వితరణ ఉచితంగా చేస్తోంది. 1985, ఏప్రిల్ 6న శ్రీవేంకటేశ్వర నిత్యాన్నదానం పథకాన్ని అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారకరామారావు చేతులమీదుగా టీటీడీ ప్రారంభించింది. తదుపరి 1994, ఏప్రిల్ 1న శ్రీవేంకటేశ్వర నిత్యాన్నదానం ట్రస్టుగా, తర్వాత దీనిని శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుగా నామకరణం చేశారు. మొదటగా తిరుమలలో కల్యాణకట్ట ఎదురుగా గల పాత అన్నదానం కాంప్లెక్స్లో అన్నదానం జరిగేది. ఇప్పటి వరకు శ్రీ వైంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ కు దాతలు దాదాపు రూ. 2,190 కోట్ల విరాళాలను అందించారు. ఎందరో దాతలు ఇచ్చిన నిధులతో నిర్విరామంగా అన్నప్రసాద వితరణ సాగుతోంది. వ్యక్తిగతంగా దాతల పుట్టిన రోజు, దాతల కుటుంబ సభ్యుల పేర్లతో, దాతల ట్రస్ట్ లు, కంపెనీల పేరుతో రూ.44 లక్షలు అందించవచ్చు. శ్రీవారి పుట్టిన రోజు అయిన శ్రవణా నక్షత్రం, శ్రీ పద్మావతీ అమ్మవారి పుట్టిన రోజు అయిన ఉత్తరషాడ నక్షత్రం, పంచమితీర్థం, వైకుంఠ ఏకాదశి, శ్రీవారి, శ్రీపద్మావతీ అమ్మవారి ప్రత్యేక రోజుల్లో కూడా దాతలు విరాళంగా అందించవచ్చు.భక్తుల నుంచి విశేష ఆదరణదాతలు రూ.44 లక్షలు అన్నప్రసాద వితరణకు విరాళం అందిస్తే, ఆ రోజంతా తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్, వైకుంఠం క్యూ కాంప్లెక్స్–1లోని 20, వైకుంఠం క్యూ కాంప్లెక్స్– 2లోని 31 కంపార్ట్మెంట్లు, నారాయణగిరిలోని 9 కంపార్ట్ మెంట్లు, ఏటీసీ, ఎంబీసీ, టిబీసీ, పీఏసీ– 2, పీఏసీ – 4 కేంద్రాలు, శిలాతోరణం, కృష్ణతేజ వరకు బయటి క్యూలైన్లు, తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం కాంప్లెక్సులు, శ్రీగోవిందరాజ స్వామి ఆలయ అన్నప్రసాదరణ వితరణ కేంద్రం, రుయా ఆస్పత్రి, స్విమ్స్, మెటర్నిటి ఆస్పత్రి, బర్డ్, ఎస్వీ ఆయుర్వేద ఆస్పత్రి, తిరుచానూరులోని అన్నప్రసాద భవనం, ఒంటిమిట్టలో భక్తులకు ఉచితంగా అన్నప్రసాద వితరణ చేస్తారు. ప్రతి రోజూ టీటీడీలో అన్నప్రసాదాల తయారీ, పంపిణీకి సుమారు పలువురు ఉద్యోగులు, సిబ్బంది పనిచేస్తున్నారు. అన్నప్రసాదాలు విభాగంలో పలువురు శ్రీవారి సేవకులు సేవలు అందిస్తున్నారు. తద్వారా భక్తులు నుంచి టీటీడీ అన్నప్రసాదం విభాగం విశేష ఆదరణ పొందుతోంది.దాతలు స్వయంగా అన్న ప్రసాదం వడ్డించే అవకాశంరూ. 44 లక్షలు అందించి దాతలు స్వయంగా భక్తులు ప్రత్యేకంగా అన్నప్రసాదాలు వడ్డించే అవకాశాన్ని టీటీడీ కల్పించింది. విరాళం అందించే దాతల పేరును తిరుమల వెంగమాంబ అన్నప్రసాద భవనంలోని డిస్ ప్లే బోర్డులో ప్రదర్శిస్తారు. అదేవిధంగా ఒకరోజు అన్నప్రసాదాలను వడ్డిస్తారు. ఒక రోజు పూర్తిగా అన్నప్రసాద వితరణ రూ.44 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఉదయం అల్పాహారం కోసం రూ.10 లక్షలు, మధ్యాహ్నం భోజనం కోసం రూ.17 లక్షలు, రాత్రి భోజనం కోసం రూ.17 లక్షలు అందించి దాతలు స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలు అందిస్తారు. తిరుమల, తిరుపతి, ఒంటిమిట్టలోని టీటీడీ అన్నప్రసాదాలు వితరణ కేంద్రాల నుండి రోజుకు ఉదయం, మధ్యాహ్నం, రాత్రికి సుమారు 2.5 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాలను స్వీకరిస్తున్నారు. -
ఎస్పీఎంసీఐఎల్కు త్వరలో నవరత్న హోదా!
సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్పీఎంసీఐఎల్) పనితీరు భేషుగ్గా ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రశంసించారు. త్వరలోనే నవరత్న హోదాను దక్కించుకోగలదని ధీమా వ్యక్తం చేశారు. కరెన్సీ నోట్లు, నాణేల ముద్రణ తదితర కార్యకలాపాలు నిర్వహించే ఎస్పీఎంసీఐఎల్ కార్పొరేట్ ఆఫీసును ప్రారంభించిన సందర్భంగా ఆమె ఈ విషయాలు తెలిపారు.2015లో పునర్వ్యవస్థీకరణ అనంతరం 2016–17లో కంపెనీ మొత్తం రుణాన్ని వడ్డీతో సహా చెల్లించేయడంతో పాటు పటిష్టమైన రాబడులు అందిస్తోందని మంత్రి పేర్కొన్నారు. కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగంలో భాగమైన ఈ సంస్థకు ప్రస్తుతం షెడ్యూల్ ‘ఏ’ మినీరత్న కేటగిరీ–వన్ హోదా ఉంది. లాభాలు, నికర విలువ వంటి ఆర్థిక విషయాలతో పాటు నిర్దిష్ట అర్హతా ప్రమాణాలను బట్టి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు కేంద్రం మహారత్న, నవరత్న, మినీరత్న హోదాలు ఇస్తుంది.ఇదీ చదవండి: చిన్న ఎగుమతిదార్లకు కేంద్రం చేయూత2022–23లో ప్రభుత్వానికి రికార్డు స్థాయిలో రూ.534 కోట్లు డివిడెండ్ చెల్లించిన కంపెనీ ఆ తర్వాత సంవత్సరంలో (2023–24) రూ.364 కోట్లు అందించింది. 2024–25లో 1,200 కోట్ల బ్యాంక్ నోట్లు, 150 కోట్ల నాణేలు, 1.5 కోట్ల పాస్పోర్ట్ బుక్లెట్స్, 700 కోట్ల పైగా ఎక్సైజ్ అడ్హెసివ్ లేబుల్స్ మొదలైనవి కంపెనీ ఉత్పత్తి చేసింది. కస్టమ్స్ డిపార్ట్మెంట్ స్వాధీనం చేసుకున్న పసిడిని శుద్ధి చేయడం ద్వారా 3.4 మెట్రిక్ టన్నుల బంగారాన్ని రిజర్వ్ బ్యాంక్కి బదలాయించింది. అలాగే, తిరుమల తిరుపతి దేవస్థానం, వైష్ణోదేవీ బోర్డు నుంచి వచ్చిన వెండి, బంగారాన్ని కూడా రిఫైన్ చేసింది. -
శ్రీవారి సన్నిధిలో మద్యాన్ని ఏరులైపారిస్తున్న కూటమి ప్రభుత్వం
-
Tirumala: నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి కంపార్టుమెంట్లన్ని నిండి వెలుపల క్యూలైన్ లో వేచిఉన్న భక్తులు . శనివారం అర్ధరాత్రి వరకు 88,257 మంది స్వామిని దర్శించుకున్నారు. 45,068 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.68 కోట్లు సమర్పించారు.టైమ్ స్లాట్ ( ఈ) దర్శనానికి సుమారు 7 గంటలు పడుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 24 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 6 గంటల్లో దర్శనం లభిస్తోంది. జూన్ 9 నుంచి 11వ తేదీ వరకు జ్యేష్టాభిషేకంఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు తిరుమలలోని శ్రీవారి ఆలయంలో సాలకట్ల జ్యేష్టాభిషేకం జరుగనుంది.ప్రతి సంవత్సరం జ్యేష్టమాసంలో జ్యేష్టా నక్షత్రానికి ముగిసేట్లుగా మూడురోజుల పాటు తిరుమల శ్రీవారికి జ్యేష్టాభిషేకం నిర్వహిస్తారు.సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణ మండపంలో నిర్వహించే ఈ క్రతువును ‘’అభిద్యేయక అభిషేకం’’ అని కూడా అంటారు. తరతరాలుగా అభిషేకాలతో అత్యంత ప్రాచీనములైన స్వామివారి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా పరిరక్షించేందుకు ఈ ఉత్సవాన్ని ఏర్పాటు చేశారు.మొదటిరోజు శ్రీ మయప్పస్వామివారికి ఉన్న బంగారు కవచాన్ని తీసివేసి, హోమాలు, అభిషేకాలు పంచామృత స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఆ తర్వాత శ్రీ స్వామివారికి వజ్రకవచం అలంకరిస్తారు. రెండవరోజు ముత్యాల కవచం సమర్పిస్తారు. మూడవరోజు తిరుమంజనాదులు పూర్తిచేసి, బంగారు కవచాన్ని పునః సమర్పిస్తారు.ఈ బంగారు కవచాన్ని మళ్లీ వచ్చే ఏడాది జ్యేష్టాభిషేకం సమయంలోనే తీస్తారు. అంతవరకు సంవత్సరం పొడవునా శ్రీవారు బంగారు కవచంతోనే వివిధ ఉత్సవాల్లో పాల్గొంటారు. -
Tirumala: నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి 29 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. సోమవారం అర్ధరాత్రి వరకు 84,418 మంది స్వామిని దర్శించుకున్నారు. 34,900 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.89 కోట్లు సమర్పించారు.టైమ్ స్లాట్ ( ఈ) దర్శనానికి సుమారు 5 గంటలు పడుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 18 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 4 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
Tirumala: నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట ATGHవరకు క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు. ఉచిత సర్వదర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట శిలాతోరణం వరకు క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు. ఆదివారం అర్ధరాత్రి వరకు 78,031 మంది స్వామిని దర్శించుకున్నారు. 32,936 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.46 కోట్లు సమర్పించారు.టైమ్ స్లాట్ ( ఈ) దర్శనానికి సుమారు 6 గంటలు పడుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 24 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 5 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. -
తిరుమల శ్రీవారి ఆలయంపై మరోసారి విమానం చక్కర్లు
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంపై మరోసారి విమానం చక్కర్లు కొట్టి.. కలకలం రేపింది. ఉదయం 9 గంటల సమయంలో ఆలయంపై నుండి విమానం వెళ్లింది. ఆగమశాస్ర్త నిబంధనలు విరుద్దంగా ఆలయంపై విమానాలు వెళ్తున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయాన్ని నో ఫ్లైయింగ్ జోన్ ప్రకటించాలని అనేక మార్లు కేంద్రాన్ని కోరిన ఫలితం శూన్యం.ఇవాళ విమానం చక్కర్లపై టీటీడీ భద్రతా అధికారులు ఆరా తీస్తున్నారు. జమ్ముకశ్మీర్లోని పహల్గాంలో దాడి తర్వాత తిరుమలలో హైఅలర్ట్ ప్రకటించారు. ఉగ్రవాదుల హిట్ లిస్ట్లో తిరుమల ఉందని.. ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ గత నెల 8న కూడా తిరుమల శ్రీవారి ఆలయంపై విమానం చక్కర్లు కొట్టింది. ఆగమశాస్ర్త నిబంధనలు విరుద్దంగా ఆలయంపై విమానాలు వెళ్లడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
టీటీడీ సేవలు దారుణం
తిరుమల: తిరుమల శ్రీవారి క్యూలైన్లో శుక్రవారం రాత్రి భక్తులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ‘టీటీడీ చైర్మన్ డౌన్ డౌన్.. ఈవో డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేశారు. వేసవి సెలవులు ముగుస్తున్న తరుణంలో తిరుమలకు భారీ సంఖ్యలో భక్తులు చేరుకుంటున్నారు. గత 20 రోజులుగా క్యూ లైన్ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దాటి బయటకు వస్తోంది. అయితే టీటీడీ తీసుకున్న అనాలోచిత నిర్ణయం కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, పాలకమండలి సభ్యుల సూచనల మేరకు గత 15 రోజులుగా టీటీడీ ఏపీ, తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలను స్వీకరిస్తూ వస్తోంది. దీంతో సామాన్య భక్తులకు ప్రాధాన్యత లేకుండా పోయింది. పేరుకు బ్రేక్ దర్శన సమయాల్లో మార్పు తెచ్చినా, సర్వదర్శనం ప్రారంభం అయ్యేందుకు దాదాపు మధ్యాహ్నం 12 గంటలు అవుతోంది. క్యూలైన్లో సైతం సరైన సదుపాయాలు కల్పించడం లేదనే వీడియో శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్ కావడం విశేషం. అయితే దీన్ని పాత వీడియో అంటారనే ఉద్దేశంతో సమయం, స్థలం, తేదీతో సహా ఓ యువకుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. టీటీడీ అందిస్తున్న సేవలు దారుణంగా ఉన్నాయని భక్తులు ఆ వీడియోలో విమర్శిస్తున్నారు. సామాన్య భక్తుల వ్యధ పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. -
తిరుమలలో సౌకర్యాలలేమిపై భక్తుల ఆగ్రహం
-
Tirumala: నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట అఖీఎఏ వరకు క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు ఉచిత సర్వదర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట శిలాతోరణం వరకు క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు. బుధవారం అర్ధరాత్రి వరకు 83,621 మంది స్వామిని దర్శించుకున్నారు. 33,445 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.97 కోట్లు సమర్పించారు.టైమ్ స్లాట్ ( ఈ) దర్శనానికి సుమారు 5 గంటలు పడుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 18 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 4 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. -
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
సాక్షి, తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట ATGH వరకు క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు.. మంగళవారం అర్ధరాత్రి వరకు 83,542 మంది స్వామివారిని దర్శించుకోగా 34,265 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.24 కోట్లు సమర్పించారు.టిక్కెట్లు లేని భక్తులకు 18 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 4 గంటల్లో దర్శనం లభిస్తోంది. టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి సుమారు 5 గంటల సమయం -
తిరుమలలో ఘోర అపచారం, ఇంకెన్ని దారుణాలు చూడాలో?
తిరుమల: తిరుమలలో మరో అపచారం చోటుచేసుకుంది. తిరుమల పాపవినాశనం రోడ్డులోని కల్యాణ వేదికలో ఓ వ్యక్తి నమాజ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో గురువారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ దృశ్యాలు చూసిన భక్తులు షాక్కు గురయ్యారు. సీసీ కెమెరా ఉన్న ప్రాంతంలో ఓ వ్యక్తి నమాజ్(Namaz) చేస్తుంటే టీటీడీ అధికారులు, సిబ్బంది ఏం చేస్తున్నారని మండిపడుతున్నారు. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమలలో కొత్త పాలక మండలి ఏర్పాటైన తర్వాత వరుసగా అపచారాలు జరుగుతున్నాయని దుయ్యబట్టారు.మద్యం సేవించడం, ఎగ్ బిర్యానీ తినడం, ఆలయంపై డ్రోన్లు తిరగడం వంటి ఘటనలను మర్చిపోకముందే.. ఇప్పుడు ఏకంగా కల్యాణ వేదిక వద్ద ఓ వ్యక్తి నమాజ్ చేశాడని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీటన్నింటికీ కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, నమాజ్ చేసిన వ్యక్తి తమిళనాడుకు చెందిన వాహనంలో తిరుమలకు వచ్చినట్లు టీటీడీ సిబ్బంది గుర్తించారు. -
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
సాక్షి, తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి కంపార్టుమెంట్లన్ని నిండి వెలుపల క్యూలైన్ లో వేచిఉన్న భక్తులు. బుధవారం అర్ధరాత్రి వరకు 80,964 మంది స్వామివారిని దర్శించుకోగా 32,125 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.24 కోట్లు సమర్పించారు.టిక్కెట్లు లేని భక్తులకు 15 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 6 గంటల్లో దర్శనం లభిస్తోంది. నేడు హనుమాన్ జయంతిటిటిడిలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాలలో గురువారం హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఇప్పటికే ఆయా ఆలయాలలో ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా ఎదురు ఆంజనేయ స్వామి ఆలయం, జీటీ ఆలయం ఎదురుగా, మఠం ఆంజనేయ స్వామి ఆలయం, గాంధీ రోడ్ , అభయ ఆంజనేయ స్వామి ఆలయం, ఓల్డ్ హుజూర్ ఆఫీస్ వద్ద, శ్రీ భక్త ఆంజనేయ స్వామివారి ఆలయం, అలిపిరి శ్రీపాదాల మండపం వద్ద. కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయం పరిధిలో శ్రీ అభయ హస్త ఆంజనేయ స్వామి వారి ఆలయం, ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయంకు ఎదురుగా ఉన్న శ్రీ సంజీవరాయ స్వామి ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. -
TTD: తిరుమలలో సిఫారసు లేఖల పునరుద్ధరణ
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి 14 కంపార్టుమెంట్లో వేచిఉన్న భక్తులు. బుధవారం అర్ధరాత్రి వరకు 74,020 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 31,190 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి కానుకల రూపంలో హుండీ ద్వారా రూ.3.27 కోట్ల ఆదాయం వచ్చింది. టికెట్లు లేని వారికి 5 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ టికెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనమవుతోంది. ఈ క్రమంలోనే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ముందుగా వెళ్లిన భక్తులను అనుమతించమని వెల్లడించింది. ఏపీ, తెలంగాణ నేతల సిఫార్సు లేఖల పునరుద్ధరణకు తాత్కాలిక నిర్ణయం: టిటిడితిరుమల, 2025, మే 13: తిరుమల శ్రీవారి దర్శనార్థం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖల పునరుద్ధరణకు మాత్రమే తాత్కాలికంగా టిటిడి నిర్ణయం తీసుకుంది.ఈ నెల 15వ తేదీ నుండి సదరు నేతల సిఫార్సు లేఖలను మాత్రమే టిటిడి అనుమతించనుంది. అయితే మిగిలిన వారి సిఫార్సు లేఖల పై అంతకు ముందు తీసుకున్న నిర్ణయం కొనసాగుతుంది . నియమావళి ప్రకారం అనుమతి పొందిన భక్తులకు ఈ నెల 16వ తేదీ నుండి శ్రీవారి దర్శనం కల్పించనున్నారు. -
నటుడు సంతానంకు నోటీసులు
తమిళ నటుడు సంతానంకు తిరుపతికి చెందిన ఓ బీజేపీ నేత నోటీసులు పంపారు. సంతానం కథానాయకుడుగా నటించిన తాజా చిత్రం ‘డెవిల్స్ డబుల్ నెక్ట్స్ లెవెల్’ నిహారిక ఎంటర్టెయిన్మెంట్ సంస్థ, ఆర్యకు చెందిన షో పీపుల్ సంస్థ కలిసి నిర్మించిన చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. ఈచిత్రంలో శ్రీ వేంకటేశ్వరభక్తి గీతాలు శ్రీనివాస గోవిందా అనే పాటను పొందుపరిచారు. ఈ పాటలో నటుడు సంతానం నటించారు. కోట్లాది మంది భక్తులు ఆరాధించే శ్రీవేంకటేశ్వరస్వామి భక్తి గీతాన్ని డెవిల్స్ డబుల్ నెక్ట్స్ లెవెల్ చిత్రంలో పొందుపరిచి భక్తుల మనోభావాలను గాయపరిచినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అదేవిధంగా తిరుమల, తిరుపతి పోలీస్స్టేషన్లలో జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలు సంతానంపై ఫిర్యాదు చేశారు. అదేవిధంగా తిరుపతి నియోజకవర్గానికి చెందిన ఓ బీజేపీ నేత దీనిపై తీవ్రంగా స్పందించారు. ఈ చిత్ర విడుదలను నిషేధించాలని, ఆ చిత్రంలో భక్తి గీతాన్ని తొలగించాలని, ఇప్పటికీ ఆ పాట యూట్యూబ్ చానళ్ల ద్వారా భక్తుల్లోకి వెళ్లి వారి మనోభావాలను గాయపరిచినందుకుగాను నష్టపరిహారం చెల్లించాలని సంతానానికి, నిర్మాణ సంస్థ నిహారిక ఎంటర్టెయిన్మెంట్కు నోటీసులు పంపారు. నోటీసులపై 15 రోజుల్లోగా స్పందించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అందులో పేర్కొన్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు కోలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. -
వీఐపీ సిఫారసు లేఖల స్వీకరణపై కీలక ప్రకటన: మే 15 నుంచి..
వేసవి సెలవుల కారణంగా తిరుమలలో రద్దీ ఎక్కువవుతున్న సమయంలో సిఫారసు లేఖల బ్రేక్ దర్శనాలు 2025 మే 1 నుంచి 15 వరకు రద్దు చేస్తూ.. టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పుడు తాజాగా సిఫారసు లేఖలతో బ్రేక్ దర్శనాలను కల్పించనున్నట్లు ప్రకటించింది. ఇది ఎల్లుండి (మే 15) నుంచి అమలులోకి రానుంది. తెలుగు రాష్ట్రాల ప్రజాప్రతినిధులు సిఫారసు లేఖలపై.. మే 15 (గురువారం) నుంచి మళ్ళీ వీఐపీ బ్రేక్ దర్శనాలు కల్పించనున్నట్లు దేవదాయశాఖ మంత్రి పేర్కొన్నారు. -
తిరుమల శ్రీవారికి అవమానం? వివాదంపై స్పందించిన హీరో
తమిళ కమెడియన్ కమ్ హీరో సంతానం ఇప్పుడు వివాదంలో చిక్కుకున్నాడు. ఇతడు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'డీడీ నెక్స్ట్ లెవల్'. ఈ శుక్రవారం (మే 16)న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమాలో శ్రీనివాస గోవింద పాటని పేరడీ చేయడంతో హిందు సంఘాలు భగ్గుమంటున్నాయి. తాజాగా ఈ వివాదంపై స్వయంగా హీరోనే స్పందించాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ కామెడీ థ్రిల్లర్.. తెలుగులో నేరుగా రిలీజ్) శ్రీనివాస గోవింద అంటూ సాగే పాట తెలియని వారుండరు. అయితే ఈ గీతాన్ని 'డీడీ నెక్స్ట్ లెవల్' సినిమా కోసం పేరడీ చేశారు. పార్కింగ్ డబ్బులు గోవిందా.. పాప్ కార్న్ ట్యాక్స్ గోవిందా అంటూ సినిమా పదాలతో పేరడీ చేశారు. దీనిపై తమిళనాడులోని హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పాటని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నాయి.ఇప్పుడు ఈ వివాదంపై స్వయంగా సంతానం స్పందించాడు. తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. 'తిరుమల శ్రీవారిని మేం అవమానించలేదు. సెన్సార్ బోర్డ్ నిబంధనల మేరకు సినిమా తీశాం. రోడ్డు మీద పోయే ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి మాట్లాడుతారు. వాటిని సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు' అని అన్నాడు. ఇప్పటికే సినిమా పాటపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. మరి ఈ విషయంలో నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడాలి?(ఇదీ చదవండి: కొత్తింట్లోకి అడుగుపెట్టిన అనసూయ.. ఇంటికి పేరు కూడా) -
Tirumala: నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. .శ్రీవారి దర్శనానికి 4 కంపార్టుమెంట్లో వేచిఉన్న భక్తులు. ఆదివారం అర్ధరాత్రి వరకు 80,423 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 29,361 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి కానుకల రూపంలో హుండీ ద్వారా రూ.3.40 కోట్ల ఆదాయం వచ్చింది. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. టికెట్లు లేని వారికి 6 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ టికెట్లు ఉంటే 3 గంటల్లోనే దర్శనమవుతోంది. ఈ క్రమంలోనే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ముందుగా వస్తే క్యూలోకి అనుమతించమని స్పష్టం చేసింది. -
తిరుమల ఆలయంపై మళ్లీ విమానాల చక్కర్లు
తిరుమల, సాక్షి: తిరుమల శ్రీవారి ఆలయం మీదుగా మరోసారి విమానాలు వెళ్లడం కలకలం రేపింది. శుక్రవారం ఉదయం శ్రీవారి ఆలయం మీదుగా మూడు విమానాలు వెళ్లాయి. ఆనంద నిలయం మీదుగా విమానాల సంచారం తిరుమల ఆగమ శాస్త్ర నిబంధనలకు విరుద్ధం. అయినా తరుచుగా విమానాలు, డ్రోన్లు కొండపై కనిపిస్తున్నాయి.ఇండియా పాక్ యుద్ద వాతావరణం నేపథ్యంలో విమానాలు తిరుమల శ్రీవారి ఆలయం మీదుగా తిరగడంపై టీటీడీ భద్రతా అధికారులు ఆరా తీస్తున్నారు. గురువారం ఉదయం కూడా ఓ విమానం స్వామివారి ఆలయం మీదుగా చక్కర్లు కొట్టింది. ఇప్పటికే తిరుమల ఉగ్రవాదుల హిట్లిస్ట్ లో ఉందన్న వార్తల నేపథ్యంలో తరచూ విమానాలు తిరగడం అటు అపచారంతో పాటు ఇటు భక్తుల ఆందోళనకూ కారణమవుతోంది.ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, తిరుమలను నో ప్లైయింగ్ జోన్ గా చెయ్యాల్సిన అవసరం ఉందని భక్తులు కోరుతున్నారు. -
ముంతాజ్ హోటల్కు రూ.వేల కోట్ల విలువైన టీటీడీ భూములు: భూమన
తిరుపతి: పవిత్రమైన అలిపిరికి సమీపంలో ముంతాజ్ హోటల్కు వేల కోట్ల రూపాయల విలువైన టీటీడీ భూములను కట్టబెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని మాజీ టీటీడీ చైర్మన్, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్రెడ్డి మండిపడ్డారు. తిరుపతి క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు అలిపిరి సమీపంలోని టీటీడీ భూమిని ఏపీ టూరిజంకు బదలాయించేందుకు టీటీడీ పాలకమండలి అత్యవసర సమావేశం నిర్వహించిందన్నారు. టీటీడీ బోర్డ్ చరిత్రలోనే ఇలా ఒకే ఎజెండా కోసం అత్యవసర సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారి అన్నారు. శ్రీవారి పాదాల మంటపం అలిపిరికి సమీపంలో ముంతాజ్ హోటల్ నిర్మాణంపై సాధుపుంగవులు, హిందూ సమాజం స్పందించాలని కోరారు. ఇంకా ఆయనేమన్నారంటే...ఈ రోజు తిరుమలలో టీటీడీ పాలకమండలి అత్యవసర సమావేశంను నిర్వహించింది. భక్తుల గురించి కీలక నిర్ణయాలు తీసుకునేందుకే ఈ అత్యవసర సమావేశం నిర్వహించారని అందరూ భావించారు. కానీ ఈ పాలకమండలి సమావేశంలో అలిపిరికి అంటే శ్రీవారి పాదాల మంటపంకు రెండున్నర కిలోమీటర్ల దూరంలో టీటీడీకి చెందిన వేల కోట్ల రూపాయల విలువైన భూమిని ఏపీ టూరిజంకు బదలాయించాలనే ఎజెండా అంశాన్ని అంగీకరిస్తూ తీర్మానం చేశారు.తిరుపతి అర్బన్ సర్వే నెంబర్ 588ఏ లో టీటీడీకి ఉన్న 24.68 ఎకరాలు, అలాగే ఇదే సర్వే నెంబర్ లో ఉన్న మరో 10.32 ఎకరాల భూమిని ఏపీ టూరిజం అథారిటీకి ఇవ్వాలని, దానికి బదులుగా ఏపీ టూరిజంకు తిరుపతి రూరల్ మండలం పేరూరులో సర్వే నెంబర్ 604 లో ఉన్న 24.68 ఎకరాలు, మరో 10.32 ఎకరాలను టీటీడీ తీసుకోవాలనే అంశంపై తీర్మానం చేశారు.గతంలో ఓబెరాయ్ సంస్థకు హోటల్ నిర్మాణం కోసం వైయస్ఆర్సీపీ ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని, శ్రీవారి పవిత్రతకు దెబ్బతీస్తోందంటూ ప్రతిపక్ష నేతగా చంద్రబాబు పెద్ద ఎత్తున హంగామా సృష్టించి, మాపైన బుదరచల్లారు. సాధుపుంగవులు కూడా దీనిని వ్యతిరేకించారు. ఇదే క్రమంలో చంద్రబాబు తన మనవడి పుట్టినరోజు సందర్భంగా తిరుపతికి వచ్చినప్పుడు ముంతాజ్ హోటల్కు ఇచ్చిన అనుమతులను రద్దు చేస్తున్నాని, ప్రత్యామ్నాయంగా సమీపంలోనే మరో స్థలాన్ని కేటాయిస్తామని ప్రకటించారు.ఇప్పుడు శ్రీవారి అలిపిరికి సమీపంలోనే టూరిజం అథారిటీకి టీటీడీ భూములను కట్టబెట్టడం ద్వారా ముంతాజ్ హోటల్ను అక్కడ నిర్మించేందుకు పావులు కదుపుతున్నారు. ఇందుకోసం అత్యవసర బోర్డ్ అత్యవసర సమావేశం నిర్వహించి తీర్మానం చేసి, వెంటనే ఈ భూబదలాయింపుపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరింది. ఇదేనా శ్రీవారి పవిత్రను కాపాడే విధానం? ఆనాడు ముంతాజ్ హోటల్ ను వ్యతిరేకిస్తూ హిందూసమాజం ఆందోళనలు చేస్తే, దానిని సమర్థించిన చంద్రబాబు ఇప్పుడు అదే సంస్థకు ఏకంగా టీటీడీ స్థలానే ఎలా కేటాయిస్తున్నారు? దీనిపై హిందూ సమాజం, సాధుపుంగవులు స్పందించాలి. ఓబెరాయ్ హోటల్ కు ప్రత్యమ్నాయ స్థలాన్ని చూపించాల్సి ఉంటే, ఎయిర్ పోర్ట్ ఏరియాలో ప్రభుత్వ స్థలాలా ఖాళీగానే ఉన్నాయి. వాటిని ఇవ్వాలే తప్ప టీటీడీ స్థలంను ఎలా కట్టబెడతారు?ప్రభుత్వ తప్పిదాల మీద, అవకతవకలపై నేను పెద్ద ఎత్తున స్పందిస్తున్నాను కాబట్టే నాపైన కూటమి ప్రభుత్వం వేధింపులు ప్రారంభించింది. ఎల్లో మీడియా ద్వారా అవినీతి ఆరోపణలు చేయిస్తున్నారు. 2004లో నక్సల్స్తో ప్రభుత్వ చర్చల సందర్భంగా నక్సల్స్ ప్రధాన ఎజెండాలో భాగంగా రామోజీ ఫిల్మ్సిటీలో ప్రభుత్వానికి చెందిన చెరువులు, పోరంబోకు స్థలాలు, కుంటలను రామోజీరావు ఆక్రమించారని, వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై ఆనాడు పెద్ద ఎత్తున చర్చ జరిగింది.ఈరోజు రామోజీ కుమారుడు కిరణ్ నేతృత్వంలో నడుస్తున్న ఈనాడు పత్రిక నాపైన భూకబ్జా ఆరోపణల చేస్తుండటం విడ్డూరంగా ఉంది. నిజంగా నేను ఎక్కడైనా భూ ఆక్రమణలకు పాల్పడితే నిరూపించమని సవాల్ చేస్తున్నాను. నాలుగేళ్ల పాటు కూటమి ప్రభుత్వం నాపైన వేధింపులకు, అక్రమ కేసుల బనాయింపులకు పాల్పడుతుందని చాలా స్పష్టంగా తెలుసు. అయినా కూడా ఈ ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపడం కొనసాగిస్తూనే ఉంటాను. హైదరాబాద్ కోహినూరు హోటల్లో రాసలీలలు చేసి, ప్రభుత్వ భూములు కబ్జాలు చేయాలనుకున్న ఒక పెద్ద నేత నాపైన విచారణకు ఆదేశించారంటేనే చాలా ఆశ్చర్యం కలుగుతోంది. వీటికి భయపడేది లేదు. -
Tirumala : నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొంత తక్కువగా ఉంది. ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.నిన్న (మంగళవారం) 69,214 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 26,599 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.27 కోట్లుగా లెక్క తేలింది.తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు విశ్వహిందూ పరిషద్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ విశ్వహిందూ పరిషద్ రాష్ట్ర కార్యదర్శి తనికెళ్ళ రవి కుమార్ విశ్వహిందూ పరిషద్ జనరల్ సెక్రటరీ రాఘవలు టీ టీ డి పాలకమండలి సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి -
Tirumala : నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామి దర్శనం కోసం 5 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. శుక్రవారం అర్ధరాత్రి వరకు 74,344 మంది స్వామిని దర్శించుకున్నారు. 32,169 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 2.50 కోట్లు సమర్పించారు.టైమ్ స్లాట్ ( ఈ) దర్శనానికి సుమారు 5 గంటలు పడుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 20 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 4 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. -
పుణ్యక్షేత్రాల్లో భద్రత వైఫల్యాలు.. అమిత్ షాకు ఎంపీ గురుమూర్తి ఫిర్యాదు
సాక్షి, తిరుపతి: ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమైన దేవాలయాల్లో భద్రత వైపల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని తిరుపతి వైఎస్సార్సీపీ ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి తెలిపారు. ఏపీలోని పుణ్యక్షేత్రాల్లో పరిపాలనా లోపాలు, భద్రతా వైఫల్యాల వల్ల తరచూ జరుగుతున్న దుర్ఘటనలపై వెంటనే సమగ్ర విచారణ చేపట్టాలని కేంద్ర హోం మంత్రి అమిత్షాకు గురువారం లేఖ రాసినట్లు ఎంపీ వెల్లడించారు.ఈ సందర్భంగా ఎంపీ గురుమూర్తి.. ‘విశాఖపట్నం జిల్లా సింహాచలం దేవాలయంలో చందనోత్సవం సందర్భంగా గోడ కూలి ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. గోడ నిర్మాణంలో సరైన ఇంజనీరింగ్ పద్ధతులు పాటించకపోవడం, నాణ్యత లేని మెటీరియల్ ఉపయోగించడమే ఈ దుర్ఘటనకు కారణం. శ్రీకాకుళం జిల్లాలోని శ్రీ కూర్మనాథ స్వామి ఆలయంలో భక్తులు పవిత్రంగా భావించే అరుదైన నక్షత్ర తాబేళ్లు అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించాయి. పోస్టుమార్టం చేయకుండానే వాటిని దహనం చేశారు.తిరుమలలో భద్రతా వ్యవస్థ పూర్తిగా విఫలమైంది. జనవరి 8న తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టికెట్ కౌంటర్ల క్యూ లైన్లలో తొక్కిసలాటి జరిగి భక్తులు ప్రాణాలు కోల్పోయిన తర్వాత కూడా టీటీడీ పరిపాలనలో ఎలాంటి మార్పు రాలేదు. ఇటీవల మూడంచెల భద్రత వ్యవస్థను దాటి కొంతమంది భక్తులు పాదరక్షలతో తిరుమల శ్రీవారి ఆలయ సింహద్వారం వరకు వెళ్లారు. టీటీడీ గోశాలలో 100కు పైగా గోవులు మరణించాయి. గోశాల నిర్వహణలో నిర్లక్ష్యం, నాణ్యతలేని దాణా అందించడం, వైద్యసేవల లోపం వల్లే ఈ దారుణం జరిగింది.’ అని లేఖలో పేర్కొన్నారు. -
TTD: నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి 26 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 12 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.ఇక.. నిన్న(శుక్రవారం ) 64,536 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 30,612 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ. 3.37 కోట్లుగా లెక్క తేలింది. -
నాడు క్షీరధార! నేడు కన్నీటి వరద!
సర్వదేవ మయే దేవీ–సర్వ దేవా రలంకృతా మామాభిలషితం కర్మ–సఫలం కురు నందినీ ఇది హిందువులు చేసే గోప్రార్థన. ‘సర్వ దేవతా స్వరూపిణీ! సర్వదేవతలచే అలంక రింపబడినదానా! ఓ నందినీ! నా కోరికలను సఫలం చేయి’ అని అర్థం. కేవలం గోవును పూజిస్తే సమస్త దేవత లను పూజించిన ఫలం దక్కుతుందని పెద్దల వాక్కు. ఇది వేదం నుంచి వచ్చిన సంప్ర దాయం, నమ్మకం. హిందువులకు ఆవు ఓ జంతువు కాదు, అభీష్టా లను నెరవేర్చే దైవ స్వరూపం. ఆకలి తీర్చే అన్నపూర్ణ. హిందూ ధర్మానికి వేదం మూలం. వేదం నుంచి యజ్ఞం వచ్చింది. యజ్ఞం వల్ల వర్షం కురుస్తుంది. మానవాళి ఆకలి తీరుతుంది. ఆ యజ్ఞపు అగ్నిహోత్రానికి ఘృతాన్ని (నెయ్యి) సమర్పించాలి. యజ్ఞానికి ఆవు నెయ్యి తప్ప ఇతరాలు సమర్పించరు. గోవు అనే పదానికి సూర్యుడు, యజ్ఞము, భూమి, నీరు, స్వర్గం... ఇలా అనేక అర్థాలు ఉన్నాయి. ‘‘గవా మంగేషు తిష్ఠంతి/ భువవాని చతుర్దశ’’ గోవు శరీర భాగాలలో పదునాలుగు భువనాలు ఉంటాయట. అంటే సమస్త సృష్టికి మూలం గోవు. గోవు అంత పవిత్రమైనది కాబట్టే దాని పేడ, పంచకాలను కూడా ఔషధాలకు ఉపయోగి స్తున్నాం. శాస్త్రం అంగీకరిస్తున్న సత్యం ఇది.పూర్వకాలంలో గోవులేని ఇల్లు వుండేది కాదు. ఎన్ని గోవులుంటే అంత సంపద వున్నట్లు. మహాభారతంలో విరాటరాజు గోవులను దుర్యోధనాదులు అపహరించటానికి పూనుకున్నది ఈ కారణం వల్లే! ఆవు నడయాడిన ప్రాంతంలో క్షేమం తప్ప, క్షామం ఉండదు. నూతన గృహప్రవేశ కాలంలో గోవును తీసుకువెళ్లేది ఇందుకే!శ్రీ మన్మహావిష్ణువు... గోపాలుడు, గోవిందుడు. గోకులంలో ఉండటం, గోవులను కాయడం ఆయనకు ఇష్టం. కాయడం అంటే కేవలం కాపలా కాదు, అన్ని విధాలా రక్షించడం! శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో ఉంటాడన్నది మన నమ్మకం. నిజానికి ఆ స్వామికి నిత్య స్థానము గోలోకమట. అది వైకుంఠం కన్నా పైన ఉంటుందట.అందుకే గోవిందా అని పిలిస్తేనే ఆ స్వామికి ఇష్టం. నవనీత చోరుడు కదా! నేటికీ తిరుమలలో శ్రీవారికి నవనీత నివేదన జరుగుతూనే ఉంది. గోహృదయం తెలిసిన వైఎస్ ఆ శ్రీవారి సన్నిధానంలో గోవులకు ఆస్థానం ఉండాలని 1956లో డైరీ ఫారం పేరుతో చిన్న గోశాల ఏర్పాటు చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం వారు. 2002లో దాన్ని ట్రస్టు గానూ, 2004లో శ్రీ వేంకటేశ్వర గోరక్షణ శాలగానూ మార్చారు.ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి ముఖ్య మంత్రిగా, నేను తి.తి.దే. అధ్యక్షుడిగా ఉన్న కాలంలో తిరుపతి గోశాలను అభివృద్ధి చేసినంతగా మరెవ్వరూ చేయలేదు అన్నది అతిశయోక్తి కాదు. రైతు హృదయమే కాదు, రైతుకు సంపద అయిన గోçహృదయం కూడా తెలిసినవారు రాజశేఖరరెడ్డి. ఆయన ఆదేశంతో గోసంరక్షణ కోసం తిరుపతిలో మూడు రోజుల పాటు ‘వందే గోమాతరం’ పేరుతో అంతర్జాతీయ సదస్సు నిర్వహించాం. నోబెల్ బహుమతి గ్రహీతలైన ఇద్దరు ప్రముఖులు, అరవై మందికి పైగా గోసంరక్షణ ఉద్యమకారులు, వివిధ పీఠాధిపతులు ఆ సదస్సులో పాల్గొన్నారు. ఔషధీకరణ రీత్యా గోవిసర్జితాలు ఎంత ముఖ్యమైనవో, వీరు తమ ప్రసంగాల ద్వారా నిరూపించారు. గోసంరక్షణకు చేపట్టాల్సిన కార్యక్రమాలు వివరించారు. వందే గోమాతరం సదస్సును దేశమంతా ప్రశంసించింది. ఎందరో పీఠాధిపతులు ఆశీస్సులు పంపారు. అప్పటి రాష్ట్రపతి రాజశేఖర రెడ్డి గారిని అభినందిస్తూ లేఖ పంపారు.శ్రీవారి సన్నిధానంలో ఉన్న గోశాలను మరింత విస్తృత పరచాలన్న రాజశేఖర రెడ్డి ఆదేశానుసారం పలమనేరులో అతి పెద్ద గోశాలకు అంకురార్పణ చేశాం.తండ్రి వలెనే ప్రత్యేక శ్రద్ధ వై.ఎస్. జగన్మోహన రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తండ్రి వలెనే గోసంరక్షణ మీద ప్రత్యేక శ్రద్ధ వహించారు. గోసంపద మరింత విస్తరించాలని సాహివాల్, గిర్, కాంక్రీజ్ వంటి నాణ్యమైన దేశవాళీ గోవులు సుమారు 550 తెప్పించారు. రిలయన్స్, మై హోమ్, ఇతర పారిశ్రామిక వేత్తల సహాయంతో ఈ గోవులను పంజాబ్, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి తెప్పించారు. రవాణాలో అవి ఇబ్బందులకు గురి కాకూడదని, అప్పటి రైల్వే మంత్రితో మాట్లాడి ప్రత్యేక కంపార్టుమెంట్ల ద్వారా తెప్పించడం జరిగింది. ఇదీ నాటి ముఖ్యమంత్రి జగన్కు ఉన్న శ్రద్ధ.పూర్వకాలపు పద్ధతిలో కవ్వంతో చిలికి వెన్నతీసి, దానిని తిరుమలలో ధూప దీప నైవేద్యాలకు, అన్నప్రసాదాలకు వినియోగించాలని ఏర్పాట్లు చేయడం జరిగింది. కవ్వంతో చిలికి వెన్న తీయడాన్ని బిలోనా పద్ధతి అంటారు. దీనికి 5 కోట్ల నిధిని కేటాయించాం.ఈ 550 గోవుల ద్వారా పునరుత్పత్తి చేసి నాణ్యమైన గోవుల సంఖ్య మరింత పెంచాలని నిర్ణయించాం. దీనికి నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు సహకారం తీసుకున్నాం. దాదాపు 48 కోట్ల రూపాయల ఖర్చుతో ఆవుల కృత్రిమ గర్భధారణకు ప్రయ త్నాలు చేస్తూ, అందులో 90 శాతం ఆడ దూడల జననం కొరకు బృహత్ సంకల్పం చేశాం.నవనీత చోరుడు, నవనీత ప్రియుడు అయిన వెంకటేశ్వర స్వామి వారికి సుప్రభాత అనంతరం నవనీత (వెన్న) నివేదన చేస్తారు. ఆ వెన్నను పూర్వం బయట నుంచి కొని తీసుకువచ్చేవారు. స్వామికి వెన్న కొనడం తగదు అని తిరుమలలో గోశాలను ఎనిమిది ఎకరాలకు విస్తరించేలా చేశారు జగన్మోహన్ రెడ్డి. అందులో 50 సాహివాల్ గోవులను ఉంచి, శ్రీవారి సేవకులైన మహిళల ద్వారా వెన్న చిలికించారు. ఆ వెన్నను ప్రతిదినం గోశాల నుండి ఊరేగింపుగా తీసుకువచ్చి శ్రీవారి నవనీత సేవకు అందేలా ఏర్పాటు చేశారు.శ్రీవారికి నివేదించిన వివిధ రకాల పుష్పాలను వృథాగా పారేయక వాటి ద్వారా అగరుబత్తీలు, తదితర పరిమళ ద్రవ్యాలు తయారు చేయడానికి, గోమయంతో సబ్బులు తదితర 14 ఉత్పత్తులు గోశాల ద్వారా రావటానికి ముఖ్య కారకులు జగన్ గారే! ఈ రోజు ఆ ఉత్పత్తుల ద్వారా 40 కోట్ల రూపాయల వ్యాపారం జరుగు తోంది. శ్రీవారికి దాదాపు 10 కోట్ల లాభం వస్తోంది. డబ్బు విషయం పక్కన పెడితే, కొన్ని కోట్ల గృహాలలో శ్రీవారి అగరుబత్తీలు వెలు గుతూ తిరుమలను తలపిస్తున్నాయి.అలిపిరి దగ్గర గోప్రదక్షిణశాలను పూర్తి చేసి భక్తులకు అందు బాటులోకి తెచ్చింది జగన్ గారే. ఆవు అలమటిస్తోంది! కొండంత చేసినా కొంచెంగా ఉండటం మాకు అలవాటు. అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తిగా చేశాం తప్ప ప్రచారం కోసం కాదు. చేసినవి చెప్పుకోవడంలో తప్పులేదు. కానీ కళ్ళు మూసుకుని కనిపించలేదు అంటే అది తప్పు!ఇరువురు ముఖ్యమంత్రులు ఇంతగా అభివృద్ధి చేసిన గోశాల నేడు దీనంగా ఉంది. ఆవు అలమటిస్తోంది. క్షీరధార బదులు, కన్నీటి ధార విడుస్తోంది. నిజం చెబితే దాన్ని స్వీకరించాలి, సరిదిద్దుకోవాలి. అంతేగానీ విమర్శకు విలవిలలాడిపోయి ఎదురుదాడికి దిగితే,దొంగ కేసులు పెడితే అది వారికే నష్టం. నేను కోరేది ఒక్కటే! అధికారాలు, ప్రభుత్వాలు మారవచ్చు. కానీ పీఠంపై ఎవరున్నా శ్రీవారికి ఇష్టమైన ‘గోపతు’లుగా ఉండాలి తప్ప, ‘గోఘ్నులు’గా ఉండకూడదు అని!భూమన కరుణాకర రెడ్డి వ్యాసకర్త టీటీడీ మాజీ చైర్మన్ -
TTD: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్ది
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. స్వామి దర్శనం కోసం 7 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. ఆదివారం అర్ధరాత్రి వరకు 82,746 మంది స్వామిని దర్శించుకున్నారు. 25,078 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.85 కోట్లు సమర్పించారు.టైమ్ స్లాట్ ( ఈ) దర్శనానికి సుమారు 4 గంటలు పడుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 12 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల జూలై నెల కోటా విడుదల చేసిన టిటిడి22న ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవా టికెట్ల విడుదల.22న మద్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవల కోటా విడుదల23న ఉదయం 11 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్లు….23న. ఉదయం 11 గంటలకు శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా23 మద్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా…24న ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల24 న మద్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలలో గదుల కోటా విడుదల…https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా మాత్రమే శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని కోరడమైనది. -
నేడు శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల జూలై నెల కోటా విడుదల
తిరుపతి: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల జూలై నెల కోటాను ఏప్రిల్ 19న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.ఈ సేవా టికెట్ల లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ కోసం ఏప్రిల్ 19 ఉదయం 10 గంటల నుండి 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు.లక్కీ డిప్ ద్వారా ఈ టికెట్లు పొందిన భక్తులు ఏప్రిల్ 21 నుండి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లిస్తే వారికి టికెట్లు మంజూరవుతాయి.22న ఆర్జిత సేవా టికెట్ల విడుదలకల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్ల జూలై నెల కోటాను 22న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.22న వర్చువల్ సేవల కోటా విడుదలవర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన జూలై నెల కోటాను 22న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.23న అంగప్రదక్షిణం టోకెన్లుం.జూలై నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.23న శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటాశ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన జూన్ నెల ఆన్ లైన్ కోటాను 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటాంవయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా జూలై నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదలజూలై నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.తిరుమల, తిరుపతిలలో గదుల కోటా విడుదలంతిరుమల, తిరుపతిలలో జూలై నెల గదుల కోటాను 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు.https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా మాత్రమే శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని కోరడమైనది. -
‘100 కేసులు పెట్టినా భయపడను.. ఏ తప్పు జరిగినా నిలదీస్తూనే ఉంటా’
సాక్షి, తిరుపతి: వ్యక్తిత్వ హననం చేస్తే భయపడతాం అనుకుంటే మీ భ్రమే అంటూ కూటమి నేతలపై వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి మండిపడ్డారు. న్యాయం మా వైపు ఉంది. నాపై 100 కేసులు పెట్టినా భయపడను. ఏ తప్పు జరిగినా నేను నిలదీస్తూనే ఉంటా. మీ పాలనలో జరిగే అరాచకాలు ప్రశ్నించకపోతే పాపం అవుతుంది. దేవుడిని అడ్డుపెట్టుకుని మీరు అధికారంలోకి వచ్చారు’’ అంటూ భూమన ధ్వజమెత్తారు.తప్పుడు కేసులు.. భూమన పోరాటాలను ఆపలేవు: ఎంపీ గురుమూర్తితిరుపతి ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ, భూమన కరుణాకర్రెడ్డిపై యూనివర్సిటీ పోలీసులు కేసు నమోదు చేయడం దారుణమన్నారు. 30 వేల మహిళలు కనిపించడం లేదని.. వాలంటీర్లు వ్యవస్థ వలనే జరిగిందని పవన్ కళ్యాణ్ తప్పుడు ప్రచారం చేస్తే మేము కేసు పెట్టలేదు. ఇవాళ వాస్తవంగా గోశాలలో జరిగిన గోవుల మృతిపై ప్రశ్నించిన భూమనపై కేసు నమోదు చేస్తారా..?’’ అంటూ ఆయన ప్రశ్నించారు.‘‘విద్యార్థి దశ నుంచి పోరాటాలతో ఎన్నో కేసులు ఎదుర్కొని నిలబడిన వ్యక్తి భూమన కరుణాకర్రెడ్డి. ఇలాంటి తప్పుడు కేసులు ఆయన పోరాటాలను ఆపలేవు. గోవుల మృతిపై రాజకీయం చేసి కూటమి నేతలు వివాదం చేస్తున్నారు’’ అని గురమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
TTD గోవుల మృతిపై కోర్టులో కేసు వేస్తా
-
టీటీడీ ఈవో శ్యామలరావు బంగ్లాలో నాగుపాము కలకలం
తిరుపతి,సాక్షి: తిరుపతి టీటీడీ ఈవో శ్యామలరావు బంగ్లాలో నాగుపాము కలకలం రేపింది. గురువారం రాత్రి నాగుపాము ప్రత్యక్షమవ్వడంతో అప్రమత్తమైన టీటీడీ ఈవో శ్యామలరావు సంబంధిత అధికారులు సమాచారం ఇచ్చారు. ఈవో శ్యామలరావు సమాచారంతో పామును పట్టుకునేందుకు రిటైర్డ్ టీటీడీ ఉద్యోగి రవీందర్ నాయుడు బంగ్లాకు చేరుకున్నారు. బంగ్లాలో బుసలు కొడుతున్న పామును చాకిచక్యంగా పట్టుకున్నారు. అనంతరం, పామును గోనె సంచిలో వేస్తుండగా ఒక్కసారిగా ఆయన చేతిపై కాటు వేసింది.దీంతో అప్రమత్తమైన సిబ్బంది అత్యవసర చికిత్స నిమిత్తం రవీందర్ నాయుడును స్విమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఎమర్జెన్సీ వార్డులోనే చికిత్స కొనసాగుతోంది. -
తిరుమలలో గోవుల మృతిపై కేసు వేస్తా: సుబ్రహ్మణ్యస్వామి
సాక్షి, న్యూఢిల్లీ: తిరుమల తిరుపతి దేవస్థానంలోని గోశాలలో గోవుల మృతిపై తాను త్వరలోనే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి(Subramanian Swamy) ప్రకటించారు. అంతేకాదు ఈ విషయంలో నిర్లక్ష్యంగా మాట్లాడిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిపైనా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఢిల్లీ సాక్షి ప్రతినిధితో ఆయన శుక్రవారం మాట్లాడారు. రాజ్యాంగంలో గోవులకు అత్యున్నత స్థానం కలిపించారు. గోవు అంటే జంతువు మాత్రమే కాదు.. కోట్ల మందికి ఆరాధ్య దైవం కూడా. అలాంటిది గోవుల ఆలనా పాలనా పట్టించుకోకపోవడం వల్లే ఈ దుస్థితి తలెత్తింది. తిరుమలలో సరైన వైద్యం అందించకుండా గోవులను వదిలేస్తున్నారు. పైగా గోవుల మరణాల విషయంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు నిర్లక్ష్యపూరితంగా మాట్లాడారు. వయసు మళ్లిన మనుషుల్లాగే.. వయసు మళ్లిన ఆవులూ చనిపోతున్నాయని బాధ్యతారహిత్యంగా మాట్లాడుతున్నారు. రేపు మీరు కూడా చనిపోతారు. అప్పుడు వయసు మల్లారని పట్టించుకోకుండా మీ కుటుంబ సభ్యులు వదిలేస్తారా?. అని స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి మాటలు మాట్లాడిన చైర్మన్ను సీఎం చంద్రబాబు వెంటనే భర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ‘‘వందల సంఖ్యలో గోవులు చనిపోవడం వెనుక కుట్ర ఉంది. టీటీడీలో వ్యాపార ధోరణితో చూడడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. చనిపోయిన గోవులను రెస్టారెంట్లకు పంపుతున్నారా?. గోవుల మృతి పై దర్యాప్తు జరగాలి. టీటీడీ గోశాలలో గోవుల మృతి పై త్వరలో కోర్టులో కేసులు దాఖలు చేస్తా. ఇప్పుడున్న టీటీడీ బోర్డు పాలన అధ్వాన్నంగా ఉంది. గత టీటీడీ బోర్డు చైర్మన్ అందరికీ అందుబాటులో ఉండేవారు.. ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేవారు’’ అని సుబ్రహ్మణ్యస్వామి గుర్తు చేసుకున్నారు. -
గోమాతపై ఒట్టేసి మరీ కూటమి ప్రభుత్వం అబద్ధం! గో హంతకుల్లారా.. గో బ్యాక్
-
19న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల జూలై కోటా విడుదల
తిరుమల: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించి సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన జూలై నెల కోటాను ఏప్రిల్ 19న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ కోసం ఏప్రిల్ 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. లక్కీ డిప్ ద్వారా ఈ టికెట్లు పొందిన భక్తులు ఏప్రిల్ 21–23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల్లోపు సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్ల జూలై నెల కోటాను 22న ఉదయం 10 గంటలకు, వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్ల జూలై కోటాను మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది. జూలై నెల అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను 23న ఉదయం 10 గంటలకు, శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల జూన్ నెల ఆన్లైన్ కోటాను ఉదయం 11 గంటలకు విడుదల చేయనుంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారికి దర్శనం టోకెన్ల జూలై కోటాను ఆన్లైన్లో విడుదల చేయనుంది.24న ఎస్ఈడీ కోటా విడుదల జూలై నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన (ఎస్ఈడీ) టికెట్ల కోటాను ఈనెల 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. తిరుమల, తిరుపతిలలో జూలై నెల గదుల కోటాను 24న మ«ద్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది.https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా మాత్రమే ఆయా టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది. -
Goshala Row: ఎవరిది అసత్య ప్రచారం?.. ప్రశ్నిస్తే కేసులే!
తిరుపతి, సాక్షి: శ్రీవారి గోశాలలో గోమాతల మరణాల వ్యవహారంలో ఊహించిందే జరిగింది. వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి(Bhumana Karunakar Reddy)పై కూటమి ప్రభుత్వం కేసు నమోదు చేయించింది. గోమాతల మరణాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చర్చకు రావాలంటూ టీడీపీ నేతలే ఆయనకు సవాల్ విసిరారు. అదే టైంలో.. పోలీసుల సాయంతో భూమనను నిర్భందించి ఇబ్బంది పెట్టడంతో నిన్నంతా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తాజాగా.. గోశాలలో గోవుల మృతిపై ప్రశ్నించిన టీటీడీ మాజీ చైర్మన్(TTD Ex Chairman) భూమన కరుణాకరరెడ్డి పై కేసు బనాయించింది కూటమి ప్రభుత్వం. గోశాలపై అతస్య ప్రచారం చేస్తూ మీడియాను తప్పుదోవ పట్టించారని, భక్తుల మనోభావాలు దెబ్బ తీశారంటూ టీటీడీ పాలకమండలి సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో భూమనపై కేసు నమోదు అయ్యింది. గురువారం రాత్రి 8 గంటలకు ఫిర్యాదు నమోదు కాగా.. పోలీసులు ఆగమేఘాల మీద కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్ యాక్ట్ 353(1), 299, 74 ఆఫ్ ఐటీ యాక్ట్ సెక్షన్ లు ఈ కేసులో నమోదు అయినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. శ్రీవారి ఎస్వీ గోశాలలో గోమాతల విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే గోమాతలు చనిపోతున్నాయి. గోశాలలో 191 ఆవులు ఏడాది కాలంలో చనిపోయాయి అంటూ గోశాల అధికారులే స్పష్టం చేయడం తెలిసిందే. అయినా కూడా గోవులు మృతి చెందలేదంటున్న పాలకమండలి వాదిస్తుండడం కొసమెరుపు. -
గోశాలకు వెళ్తుంటే పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారు?: రోజా
-
బాబు పాలన చూసి నవ్వుతున్నారు!
-
గోశాల వద్ద ఘోరాల్ని వెలికితీస్తామనే.. కూటమి నేతలకు భయం పట్టుకుంది
తిరుపతి,సాక్షి: గోశాల వద్ద ఘోరాలను వెలికితీస్తామని కూటమి నేతల్లో భయం పట్టుకుందని మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు.గోశాల మరణాలపై టీడీపీ ఎక్స్ వేదికగా ఛాలెంజ్ చేసింది. టీడీపీ సవాలును మాజీ టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్వీకరించారు. ఛాలెంజ్లో భాగంగా ఉదయం 10 గంటలకు గోశాలకు బయల్దేరిన భూమన కరుణాకరరెడ్డి, ఎంపీ గురుమూర్తి, మాజీ డిప్యూటి సీఎం నారాయణ స్వామి , వైఎస్సార్సీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై పడుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మాజీ టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ..‘గోశాలకు వెళ్లకుండా మమ్మల్ని అడ్డుకోవడం అన్యాయం. గోవుల మృతిపై కూటమి నేతలో తలో మాట మాట్లాడుతున్నారు. నన్ను రమ్మన్న వాళ్లే అడ్డుకోవడం అన్యాయం. నేను ఒక్కడినే రావడానికి సిద్ధం. టీడీపీ నేతలు వెళ్లిపోయిన తర్వాత అనుమతి ఇస్తే ఏం లాభం. టీడీపీ నేతల ఛాలెంజ్ మీద స్పందించా. గోశాలకు రమ్మనమని పల్లా నాగేశ్వర్ రావు ఛాలెంజ్ చేశారు. ఆ ఛాలెంజ్ను స్వీకరించా. గోశాల వద్ద ఘోరాలను వెలకితీస్తామని కూటమి నేతల్లో భయం పట్టుకుంది. టీడీపీ నేతలు గోశాల వద్ద ఉన్నప్పుడే నన్ను అనుమతించాలి’ అని డిమాండ్ చేశారు. -
వైఎస్ఆర్ సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి హౌస్ అరెస్ట్
-
‘రేపు గోశాలలో కలుద్దాం’.. పల్లా సవాల్ను స్వీకరించిన భూమన
సాక్షి, తిరుపతి: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సవాల్ను వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి స్వీకరించారు. రేపు(గురువారం) ఉదయం 10 గంటలకు ఎస్వీ గోశాల వద్దకు వస్తున్నా, అక్కడ కలుద్దాం’’ అంటూ భూమన ప్రతిసవాల్ విసిరారు. టీటీడీ ఈవోనే 43 ఆవులు చనిపోయాయి అని చాలా స్పష్టంగా చెప్పారు. రేపు రండి.. చనిపోయిన గోవులు లెక్కలు చెప్తాం. టీటీడీ గోశాల గురించి కనీస అవగాహన లేకుండా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతున్నారు’’ అని భూమన మండిపడ్డారు.కాగా, ఆధ్యాత్మిక రాజధానిగా గుర్తింపు పొందిన పవిత్ర పుణ్యక్షేత్రంలో గత 10 నెలలుగా అన్నీ అపచారాలే జరుగుతున్నాయి. శ్రీవారి క్షేత్రంలో మద్యం బాటి ళ్లు, బిర్యానీలు, మాంసం, మందుబాబుల వికృత చేష్టలు, పాదరక్షలతో ఆలయంలోకి ప్రవేశించే యత్నం, డ్రోన్ కెమెరాల హల్చల్, పాపవినాశం తీర్థంలో బోట్ల విహారం, టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాలలో గోవుల మరణ మృదంగం, ముంతాజ్ హోటల్ అనుమతులు తదితర సంఘటనలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. వీటిపై సాక్షాత్తు స్వామిజీలు మండిపడి, టీటీడీ, ప్రభుత్వ వ్యవహారశైలికి నిరసనగా ధర్నాలు చేసిన ఘటనలు సామాన్య భక్తులతో పాటు స్థానికులను కలవరపెట్టాయి.వీటిని కట్టడి చేయాల్సిన ప్రభుత్వం, టీటీడీ అధికారులు లోపాలను ఎత్తి చూపుతున్న సామాన్యులపైనా, భక్తులపై కక్ష్య సాధింపు చర్యలు దిగడం దారుణమని పలువురు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పవిత్రపుణ్యక్షేత్రంలో జరిగే అపచారాలపై దృష్టి పెట్టకుండా రాజకీయ కోణంలో చూస్తూ అధికారులు వ్యవహరించడం సమజసం కాదంటూ స్థానికులు, భక్తులు, ప్రజాసంఘాలు, మేధావులు హితవు పలుకుతున్నారు. -
వైఎస్ జగన్ను ఎదుర్కోలేకే మత ముద్ర: మల్లాది విష్ణు
సాక్షి, తాడేపల్లి: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేక కూటమి సర్కార్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయటంలేదు. దీంతో ప్రజల్లో వ్యతిరేకత బాగా పెరిగింది. దీన్ని కప్పిపుచ్చుకోవటానికి వైఎస్ జగన్పై మతం ముద్ర వేస్తున్నారు’’ అని మల్లాది విష్ణు ధ్వజమెత్తారు.‘‘పాదయాత్రకు ముందు, తర్వాత జగన్ తిరుమల వెళ్లారు. స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. జగన్ని రాజకీయంగా ఎదుర్కోలేక కూటమి నేతలు మత ముద్ర వేస్తున్నారు. వైఎస్ జగన్పై నిలువెల్లా విషం చిమ్ముతున్నారు. గత టీడీపీ పాలనలో కనకదుర్గమ్మ గుడిలో తాంత్రిక పూజలు చేయించారు. కృష్ణా పుష్కరాల సమయంలో ఆలయాలను కూల్చారు. వాటిని జగన్ సీఎం అయ్యాక తిరిగి నిర్మించారు. మళ్లీ చంద్రబాబు సీఎం అయ్యాక కాశీనాయన క్షేత్రంలో కొన్ని సత్రాలు, గోశాలను కూల్చారు’’ అని మల్లాది విష్ణు గుర్తు చేశారు.‘‘తిరుమలలో ఎగ్ బిర్యానీ, మద్యం దొరికింది. తొక్కిసలాటలో భక్తులు చనిపోయారు. ఇలా వరుస సంఘటనలు జరిగాయి. హోంమంత్రి అనిత ఏమాత్రం బాధ్యత లేకుండా మాట్లాడారు. హోంమంత్రిలాగా తప్పుడు మాటలు మాట్లాడేవారినే క్రిమినల్స్ అంటారు, విజయకీలాద్రి మీద ఆలయాలు కట్టేందుకు చంద్రబాబు అంగీకరించలేదు. కానీ జగన్ పర్మిషన్ ఇచ్చి ఆలయాల నిర్మాణాలకు సహకరించారు. పీఠాల నిర్మాణాలకు జగన్ భూములు ఇస్తే చంద్రబాబు వాటిని లాగేసుకున్నారు. కేవలం జగన్ మాత్రమే హిందూ ధర్మాన్ని కాపాడారు. చంద్రబాబు హయాంలోనే హిందూ ధర్మంపైన దాడులు జరుగుతున్నాయి. వక్ఫ్ చట్టాన్ని ఆమోదించి చంద్రబాబు ముస్లింల మనోభావాలను దెబ్బ తీశారు’’ అని మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
టీటీడీ గోశాలలో గోవుల మృతిపై నారాయణ స్వామి ఫైర్
-
నిద్దరోతున్న నిఘా!
తిరుమల : కలియుగ దైవం, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువుదీరిన తిరుమల క్షేత్రంలో నిఘా వ్యవస్థ నిద్దరోతోంది. విరామం లేకుండా దర్శనాలతో స్వామి వారికి మాత్రం కంటి మీద కునుకు లేకపోగా, భద్రతా యంత్రాంగం మాత్రం నిద్ర మత్తులో జోగుతోంది. నిత్యం భక్త జన సందోహంంతో ఉండే ఏడు కొండలపై భద్రత కరువైందని తాజాగా డ్రోన్ ఘటన నిరూపించింది. వరుస ఘటనలతో అభాసుపాలవుతున్నా సమర్థించుకోవడం.. ఎదురు దాడి చేయడం తప్ప పాలకులు గుణపాఠం నేర్వడం లేదు. నిఘా వైఫల్యాలు టీటీడీ అధికారులకు తల నొప్పులు తెచ్చి పెడుతున్నాయి. మూడంచెల భద్రత నడుమ తిరుమల మొత్తం నిఘా నీడలో ఉంటుంది. టీటీడీ విజిలెన్స్, ఎస్పీఎఫ్, స్టేట్ పోలీస్, అక్టోపస్తోపాటు పలు విభాగాలు తిరుమలలో పహారా కాస్తున్నాయి. ప్రత్యేకంగా 2 వేల సీసీ కెమెరాలతో నిత్యం పర్యవేక్షిసూ్తం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పసిగట్టే అనాలిటిక్స్ కలిగిన అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులో ఉంది.శ్రీవారి ఆలయంతో పాటు ఆలయ పరిసర ప్రాంతాలు, వివిధ సముదాయాల వద్ద అత్యంత నాణ్యతగా చిత్రీకరించే అధునాతన నిఘా కెమెరాలను అమర్చారు. దీంతో గతంలో ఎలాంటి సమాచారం అయినా టీటీడీ నిఘా విభాగం, కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి సెకండ్ల వ్యవధిలో విజిలెన్స్ విభాగానికి చేరేది. దొంగతనాలు, మిస్సింగ్స్ ఇలా అనేక ఘటనలను సులభంగా గుర్తించి నిమిషాల వ్యవధిలో పోగొట్టుకున్న వస్తువులు తిరిగి ఇచ్చేలా క్రియాశీలక పాత్ర పోషించేది నిఘా వ్యవస్థ. అలాంటి వ్యవస్థకు ఏమైందో ఏమోగానీ పది నెలలుగా మొక్కుబడిగా విధులు నిర్వర్తిస్తోందని వరుసగా జరుగుతున్న సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి. తాజాగా డ్రోన్ కలకలంరాజస్థాన్ రాష్ట్రానికి చెందిన అన్షుమన్ తరెజా అనే ఓ యూట్యూబర్ మంగళవారం సాయంత్రం తిరుమల ఆలయంపై డ్రోన్ ఎగురవేసి తీవ్ర కలకలం సృష్టించాడు. శ్రీహరి ఆలయంపై దాదాపు 10 నిమిషాల పాటు ఎగిరిన డ్రోన్ ద్వారా వివిధ కోణాల్లో చిత్రీకరించాడు. శ్రీవారి ఆలయం మహా ద్వారం మొదలుకొనిం ఆనంద నిలయం వరకు ఏరియల్ వ్యూను చిత్రీకరించాడు. నిత్యం రద్దీగా ఉండే.. అధిక సంఖ్యలో నిఘా నేత్రాలు ఉన్న కళ్యాణకట్ట సమీపంలోని హరినామ సంకీర్తన మండపం వద్ద దర్జాగా కూర్చుని డ్రోన్ను ఆపరేట్ చేశారు. శ్రీవారి ఆలయంపై డ్రోన్ ఎగురుతుండటాన్ని గమనించిన భక్తులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఎవరికి తెలియజేయాలో తోచక చూసూ్తనే ఉండిపోయారు. పైగా దర్శనం కోసం వచ్చినందున వారి వద్ద సెల్ ఫోన్లు కూడా లేవు. ఈ క్రమంలో 12 నిమిషాల అనంతరం శ్రీవారి ఆలయంపై డ్రోన్ ఎగురుతున్నట్లు టీటీడీ విజిలెన్స్ ఎట్టకేలకు గుర్తించింది. హుటాహుటిన అక్కడికి వెళ్లిన భద్రత సిబ్బంది డ్రోన్తో సహా తరెజాను అదుపులోకి తీసుకున్నారు. తిరుమల ఒకటవ పట్టణ పోలీస్స్టేషన్కు తరలించారు. నిందితుడిపై పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, 2 వేల కెమెరాలతో నిఘా ఉన్నా, వందల సంఖ్యలో శ్రీవారి ఆలయం చుట్టూ విజిలెన్స్ పహారా ఉన్నా, అంత సేపటి వరకు డ్రోన్ ఎగురుతుండటాన్ని గుర్తించకపోవడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ఇటీవల ఎగ్ బిర్యానీ, మద్యం తాగి ఓ యువకుడు హల్చల్ చేసిన వ్యవహారం మరిచిపోక ముందే ఇప్పుడీ డ్రోన్ కలకలం రేపింది. ‘ఇంత పటిష్ట యంత్రాంగం, భద్రత ఏర్పాట్లు ఉన్నప్పటికీ 12 నిమిషాల పాటు శ్రీవారి ఆలయాన్ని ఓ యువకుడు డ్రోన్తో చిత్రీకరించడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఆలోగా జరగరానిది ఏదైనా జరిగి ఉంటే.. అని తలుచుకుంటేనే భయమేస్తోంది. లడ్డూ ప్రసాదంపై ఆరోపణలు, తొక్కిసలాట, తరచుగా అపచారాలు.. ఎందుకిలా’ అని పలువురు భక్తులు వాపోయారు. అలిపిరి వద్ద చెక్ చేయలేదా?సాధారణంగా తిరుమలకు వచ్చే భక్తుల బ్యాగులను, వ్యక్తులను అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద టీటీడీ భద్రతా సిబ్బంది, ఎస్పీఎఫ్ సిబ్బంది తనిఖీ చేసి పంపుతారు. బ్యాగులను స్కానింగ్ చేసి అందులో నిషేధిత వస్తువులు ఉంటే వాటిని గుర్తించి, తొలగించి పంపుతారు. అయితే రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన యూట్యూబర్ అన్షుమన్ తరేజా తిరుమలకు తనతో పాటు డ్రోన్ను ఎలా తెచ్చుకున్నాడనే ప్రశ్న తలెత్తుతోంది. -
బతికుంటే చాలు అన్న పరిస్థితి కి తెచ్చేసారు తిరుమల శ్రీవారి భక్తుల ఆవేదన
-
లేగదూడలు వృద్ధాప్యంతో చనిపోయాయా.. TTD చైర్మన్ కామెంట్స్ పై రామ్ నాథ్ ఫైర్
-
టీడీపీ పాలనలో టీటీడీ అభాసుపాలు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుమల వెంకన్న పాదాల సాక్షిగా అబద్ధాలు.. బుకాయింపు మరోసారి పటాపంచలయ్యాయి! టీటీడీ గోశాలలో అసలు గోవులే మరణించలేదని సీఎం చంద్రబాబు నిస్సిగ్గుగా బుకాయించగా.. స్వయంగా టీడీపీ చైర్మన్, ఈవో, తిరుపతి ఎమ్మెల్యే నిర్వహించిన ప్రెస్మీట్లతో ముమ్మాటికీ గోవులు చనిపోయాయనే విషయం రుజువైంది. ఈ సంఘటన వెలుగులోకి రాగానే అటు టీటీడీ.. ఇటు టీడీపీ అసలు అలాంటి ఘటన ఏదీ జరగనే లేదంటూ బుకాయిస్తూ మీడియా, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టాయి. వైఎస్సార్సీపీపై దుమ్మెత్తి పోశాయి. కానీ నిజం నిలకడ మీద తేలుతుందన్నట్లుగా వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని గోశాలలో గోవుల మృత్యుఘోష వెలుగు చూడటంతో ఉలిక్కిపడ్డ కూటమి సర్కారు కప్పిపుచ్చేందుకు విఫల యత్నాలు చేసింది. గోవులు చనిపోయాయంటూ అబద్ధాలాడుతున్నారని సీఎం చంద్రబాబు యథాప్రకారం బుకాయించగా.. టీటీడీ చైర్మన్, ఈవో, తిరుపతి ఎమ్మెల్యే చేసిన ప్రకటనలతో గోమాతల మృతి నిజమేనని తేటతెల్లమైంది. పరమ పవిత్రంగా పూజించే క్షేత్రంలో గోమాతల మృత్యుఘోషపై భక్తులు భగ్గుమంటున్నారు. టీటీడీ గోశాలలో వందకుపైగా గోవులు మృత్యువాత పడినట్లు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ఈనెల 11న సంచలన నిజాలను వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. మరుసటి రోజు తిరుపతి శాసనసభ్యుడు ఆరణి శ్రీనివాసులు 40 గోవులు మాత్రమే మరణించాయని మీడియా సాక్షిగా వెల్లడించారు. ఈనెల 13న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్రెడ్డి గోశాలలో పర్యటించి మీడియా సమావేశం నిర్వహించారు. 20 నుంచి 22 గోవులు మాత్రమే మరణించినట్లు ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ ప్రకటించారు. ‘ఇంట్లో మనుషులు చనిపోరా? గోశాలలో ఆవులు వృద్ధాప్యంతో మరణించి ఉంటాయి’ అంటూ వ్యాఖ్యలు చేశారు. తాజాగా టీటీడీ ఈవో శ్యామలరావు సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘మూడు నెలల కాలంలో 43 గోవులు మృతి చెందాయి..’ అని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ అసత్య ప్రచారం చేస్తోంది అంటూనే.. నిజాలను ఒప్పుకున్నారు. అయితే సీఎం చంద్రబాబు మాత్రం యథాప్రకారం అసలు గోవులు మరణించనే లేదని, అసత్య ప్రచారం చేస్తున్నారంటూ సోమవారం గుంటూరు జిల్లా పొన్నెకల్లులో వైఎస్సార్ సీపీపై అసహనం వెళ్లగక్కారు. నాలుగు రోజులుగా పొంతన లేని ప్రకటనలతో టీటీడీని అడుగడుగునా అభాసు పాలు చేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పది నెలలుగా అపచారాలు.. !కూటమి ప్రభుత్వం వచ్చాక గత పది నెలల కాలంలో టీటీడీ చరిత్రలో ఎన్నడూ చోటుచేసుకోని మహాపచారాలు చోటు చేసుకుంటున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో వరుసగా చోటుచేసుకుంటున్న మహాపచారాలను ప్రభుత్వ పెద్దలు సరిదిద్దుకోవాల్సిందిపోయి.. అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ వైఎస్సార్సీపీపై విమర్శలు చేస్తూ పార్టీ నేతలపై బెదిరింపులకు దిగుతున్నారు. పంది కొవ్వు కలిసిందంటూ..టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రంలో వరుసగా చోటు చేసుకుంటున్న అపచారాలు భక్తులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో పంది కొవ్వు కలిసింది.. అంటూ గతేడాది సెపె్టంబర్ 19న స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల పవిత్రతను దెబ్బతీసే రీతిలో వ్యాఖ్యలు చేయటం ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచింది. దీనిపై సుప్రీంకోర్టు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం తెలిసిందే. తొక్కిసలాటలో భక్తుల మృతి..ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ధారి్మక క్షేత్రం తిరుమలకు లక్షలాదిమంది భక్తులు వచి్చనా టీటీడీ చరిత్రలో గతంలో ఒక చిన్న సంఘటన కూడా చోటు చేసుకున్న దాఖలాలు లేవు. భక్తులకు అసౌకర్యం కలిగించకుండా నియంత్రించడంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్నంత పటిష్ట ప్రణాళికలు మరెక్కడా లేవు. అటువంటి చోట భక్తుల తొక్కిసలాట ఘటన మాయని మచ్చగా మిగిలిపోయింది. అసత్య ఆరోపణలే.. 20 నుంచి 22 గోవులు మృతి చెంది ఉండవచ్చు: టీటీడీ చైర్మన్ వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం సందర్భంగా తిరుపతిలో టోకెన్ల పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఆ ఘటనలో ఆరుగురు భక్తులు మృతి చెందటం, 40 మందికిపైగా గాయాలు పాలవడం అందరినీ కలచి వేసింది. ఆ తరువాత కూడా కూటమి ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది. మృతుల కుటుంబాలు, క్షతగాత్రుల పట్ల వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.మందు.. ఎగ్ బిర్యానీ⇒ పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో మద్యం, మాంసం నిషిద్ధం. ఈ ఏడాది జనవరి 17న కొందరు భక్తులు కోడిగుడ్డు బిర్యానీని నేరుగా తిరుమల ఆలయం ముందు భుజించిన ఘటన వెలుగుచూసింది. ⇒ ఈ ఏడాది మార్చి 15న తిరుమలలో మందుబాబు హల్చల్ చేశాడు. తిరుమలలో ఎంత మద్యం కావాలంటే అంత దొరుకుతుందని ప్రకటించడంతో భక్తులు నిశ్చేష్టులయ్యారు. దీనికి నిదర్శనంగా మార్చి 28న తిరుమలలో ఓ బెల్టుషాపు వెలుగులోకి వచ్చింది. తిరుమలలోని బెల్టుషాపులో మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా బెల్టుషాపులు ఏర్పాటవుతున్న రీతిలోనే తిరుమలలో కూడా బెల్టు దుకాణం వెలసిందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.⇒ తిరుమల పాపవినాశం పరిసర ప్రాంతాల్లో భారీ స్థాయిలో ఎర్రచందనం చెట్లను నరికి యథేచ్చగా తరలిస్తుండగా టాస్క్ఫోర్స్ సిబ్బంది పట్టుకున్నారు. -
గోవుల మృతిపై చంద్రబాబు వ్యాఖ్యలకు భూమన కౌంటర్
తిరుపతి: టీటీడీ గోశాలలో అధిక సంఖ్యలో గోవులు చనిపోతే వాటిని తాను బయటపెడితే అవి మార్ఫింగ్ ఫోటోలు అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు వైఎస్సార్ సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి కౌంటర్ ఇచ్చారు. టీటీడీ గోశాలలో గోవుల మృతికి సంబంధించి తాను చూపిన ఫోటోలు మార్ఫింగ్ చేసినవి కాదని, తాను ఏవైతే వ్యాఖ్యలు చేశానో ఏమైతే చూపానో వాటికి కట్టుబడి ఉన్నానన్నారు. తాను చెప్పింది అబద్ధమైతే ఎలాంటి విచారణకైనా సిద్ధమేనని భూమన చాలెంజ్ చేశారు. గోవుల మృతిపై ఎట్టకేలకు టీటీడీ ఈవో, చైర్మన్ లు నిజాన్ని ఒప్పుకున్నారని, వెంటనే ఈవోను సస్పెండ్ చేసి, చైర్మన్ ను తొలగించాలని భూమన డిమాండ్ చేశారు. తిరుపతి నుంచి ఈరోజు(సోమవారం) భూమున ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే..‘మీ పాలనలో దళారీలకు కొదవే లేదు. ఇప్పటికి దర్శనం టిక్కెట్లు బ్లాక్ లో అమ్మకాలు చేస్తున్నారు. మీ పాలనలో కొండపై బెల్ట్ షాపులు అమ్ముతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు టికెట్లను ఇవ్వొద్దు, టిడిపి నాయకులకు కోరినన్ని టికెట్ల ఇవ్వడమే మీ పని. స్వామీజీలు, పీఠాధిపతులు తో వెళ్ళి గోశాలలో పాతిపెట్టినవి వెలికి తీద్దాం. 50 ఏళ్లకు ముందే నేను జైలుకు వెళ్లిన వాడ్నిగతంలో కొండపై చర్చి కడుతున్నారు అంటూ విష ప్రచారం చేశారు, నెయ్యి కల్తీ అని ఎక్కడ నిర్ధారణ కాలేదు.. కల్తీ జరిగింది అని విష ప్రచారం చేశారు. అడుగు అడుగునా విష ప్రచారం చేశారు మీరు చెప్పిన దానికంటే ఎక్కువగా గోవులు చనిపోయాయి, మీరు అంగీకరించారు. 1500 లీటర్లు పాలు మా పాలనలో కొండకు వెళ్తే ఇప్పుడు 500 లీటర్లు. అసలు సమస్యను పక్కదారి పెట్టొద్దు. దళిత గోవిందం అనే కార్యక్రమం నేను ఛైర్మన్ గా ఉన్నపుడు చేశాను. శ్రీవారి కళ్యాణోత్సవాలు దేశం, ప్రపంచం వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువచ్చింది మేము. 36వేల మందికి కళ్యాణోత్సవం ద్వారా పెళ్ళిళ్లు చేయించాం.వేద విశ్వ విద్యాలయం తీసుకు వచ్చింది వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో జరిగింది. హైందవ మతం ప్రచారం కోసం 4 వాహనాలు దేశం నలుమూలల చేసేలా చర్యలు తీసుకున్నాం. సాధువులతో, పీఠాధిపతిలతో తిరుపతి మహాతీలో సదస్సు నిర్వహించాము. వందే గోమాతరం కార్యక్రమం చేసిన ఘనత మాది. గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని తీర్మానం చేశాం. హిందూ ధర్మం అంటున్న టిటిడి బి.ఆర్ నాయుడు కనీసం నాలుగు పద్యాలు పలుకగలరా’ అని భూమన నిలదీశారు. -
గోశాల గోవుల ఘటనపై బాబు వ్యాఖ్యలు భూమన కరుణాకర్ ఛాలెంజ్
-
గోశాల ఘటనపై టీటీడీ ఛైర్మన్ చులకన వ్యాఖ్యలు!
సాక్షి, తిరుపతి: టీటీడీ గోశాలలో గోవుల మృతిపై స్పందించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, పాలకమండలి సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి, ఎమ్మెల్యే పులివర్తి నాని స్పందించారు. గోశాలలో గోవుల మృతిని టీటీడీ చైర్మన్ అంగీకరించారు. టీటీడీ గోశాలలో ఇప్పటివరకు 22 గోవులు చనిపోయాయాన్న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు.. ఇంట్లో మనుషులు చనిపోరా అంటూ చులకనగా వ్యాఖ్యానించారు. మరో వైపు, గోశాలలో 40 ఆవులు చనిపోయాయని ఎమ్మెల్యే శ్రీనివాసులు అన్నారు. గోవుల మరణాలపై కూటమి నేతల తలోమాట మాట్లాడుతున్నారు.గోశాలలో గోవుల మరణాలపై మాట్లాడిన వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామంటూ బీఆర్ నాయుడు బెదిరింపులకు దిగుతున్నారు. అన్నిచోట్ల కేసులు నమోదు చేయిస్తాం.. ఇప్పటికే కొందరు కోర్టులు చుట్టూ తిరుగుతున్నారంటూ పరోక్షంగా పోసాని కృష్ణమురళి ఉద్దేశించి టీటీడీ చైర్మన్ వ్యాఖ్యానించారు. గోశాలలో డాక్టర్లు తక్కువగా ఉన్నారంటున్న టీటీడీ ఛైర్మన్.. అదనపు వైద్యులను నియమిస్తామని తెలిపారు. -
తిరుపతి TTD గోశాలలో గోవుల మృతిపై అఖిలపక్షం కమిటీ వెయ్యాలి: తిరుపతి MP
-
తిరుమల గోశాల ఘటనపై సుబ్రమణ్య స్వామి సీరియస్
-
‘అసలు తిరుమలలో ఏం జరుగుతోంది?’
తాడేపల్లి : టీటీడీ గోశాలలో ఆవులు చనిపోవడంపై నిజా నిర్దారణ కమిటీ వేయాలని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. టీటీడీ గోశాలలో గోవుల మృతికి కారణాలను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ పరిస్థితులు ఎందుకు వచ్చాయో నిజానిర్దారణ చేయాలన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి శనివారం మాట్లాడిన మల్లాది విష్ణు.. టీటీడీని రాజకీయ పునరావాసంగా మార్చేశారని ధ్వజమెత్తారు. ‘ఈరోజు కూడా కొందరు పాదరక్షలతో మహాద్వారం వరకు వెళ్లారంటే విజిలెన్స్ ఏం చేస్తోంది?, స్వామివారికి నైవేద్యం కూడా పది నిమిషాలు ఆలస్యంగా పెట్టారు. అసలు తిరుమలలో ఏం జరుగుతోంది?, గోమాతల మృతికి కారణం సరైన ఆలనాపాలన లేకపోవడమే. ఆహారం, పర్యవేక్షణ లేకనే గోవులు చనిపోయాయి.టీటీడీ అధికారులు గోవుల మృతిపై ఎందుకు స్పందించలేదు?, సెలెబ్రిటీలే తప్ప సామాన్యులకు స్వామివారిని దర్శించుకునే అవకాశం లేకుండా చేశారు. టీటీడీని టీడీపీ ఆఫీసుగా మార్చారు. లోకేష్ పిఏ దందా కొండ మీద పెరిగి పోయింది. తిరుమలలో ఎగ్ పలావు దొరకటం, మద్యం దొరకటం ఏంటి?, క్యూలలో ఫ్రాంక్ వీడియోలు తీస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు?, గోమాత టీడీపీ వారికి పబ్లిసిటీ కావచ్చు, మాకు మాత్రం సెంటిమెంట్. గత చంద్రబాబు హయాంలో కూడా విజయవాడలో గోవులు చనిపోయాయి. టీడీపీ గోశాలలో గోవుల మృతిపై సుబ్రహ్మణ్య స్వామి పిల్ వేయాలనుకోవటం గొప్ప విషయం. ఆయన పోరాటం ఆయన చేస్తారు. మేము కూడా గోవుల మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. తిరుమలలో స్వామీజీలపై అరాచకంగా ప్రవర్తించారు. వారిపై పెట్టిన కేసులను తొలగించాలి. స్వామిజీలపై ఈ రకమైన కక్షసాధింపు మంచిది కాదు’అని మల్లాది విష్ణు హెచ్చరించారు. -
తిరుమల గోశాల ఘటనపై సుబ్రహ్మణ్యస్వామి సీరియస్
సాక్షి, తిరుపతి: తిరుమల గోశాలలో గోవుల మృతి ఘటనపై మాజీ ఎంపీ, బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు నెలల వ్యవధిలో పలు గోవులు చనిపోవడం తీవ్రంగా కలిచివేసిందని ఎక్స్ వేదికగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘గోవుల మృతి విషయం టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి ద్వారా తెలిసింది. దీనిపై మరింత సమాచారం సేకరిస్తున్నా.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 48 ప్రకారం గోసంరక్షణ ప్రభుత్వ బాధ్యత. పూర్తి సమాచారంతో త్వరలోనే ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేస్తాను’’ అని సుబ్రహ్మణ్యస్వామి ట్వీట్ చేశారు.Fmr TTD Chair Karunakar Reddy has alleged that in the past 3 months, several sacred indigenous cows have died due to illness and lack of proper feed at TTD Goshala. I am gathering more information, Art 48 of the Indian Constitution, its State’s duty to protect them. PIL underway.— Subramanian Swamy (@Swamy39) April 12, 2025టీటీడీ గోశాలలో పెద్ద సంఖ్యలో గోవుల మృతిపై వైఎస్సార్సీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి నిన్న(శుక్రవారం) సంచలన విషయాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. ‘టీటీడీ గోశాలలో దేశవాలి అవులు వందకు పైగా మృత్యువాత పడ్డాయి. నిర్వాహకులు ఈ విషయం పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆవులు ఎలా చనిపోయాయో తెలుసుకునేందుకు పోస్ట్మార్టం కూడా నిర్వహించలేదు. డీఎఫ్ఓ స్థాయి అధికారిని గోశాలకు ఇన్ చార్జిగా నియమించారు. ఆయనకు గోపరిరక్షణకు ఎటువంటి సంబంధం లేదు. దీనిపై వెంటనే విచారణ జరిపించాలి’ అని డిమాండ్ చేశారు. -
తిరుమలలో భద్రత డొల్ల మరోసారి బయటపడింది: భూమన
-
తిరుమలలో మరో అపచారం
సాక్షి, తిరుమల: తిరుమలలో మరో అపచారం వెలుగు చూసింది. శ్రీవారి దర్శనానికి ముగ్గురు భక్తులు పాదరక్షలతో మహా ద్వారం వరకు రావడం తీవ్ర కలకలం సృష్టించింది. వీరు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుండి పాదరక్షలు ధరించి వచ్చారు. అయితే, మూడు ప్రాంతాలలో తనిఖీ చేసిన టీటీడీ విజిలెన్స్ అధికారులు వీరిని గుర్తించకపోవడం గమనార్హం.ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలో భద్రతాలోపం మరోసారి బయటకు వచ్చింది. భక్తులు ఏకంగా చెప్పులు వేసుకుని మహా ద్వారం వరకు రావడం అధికార నిర్లక్ష్య ధోరణికి అద్దం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుండి వీరు పాదరక్షలు ధరించి మహా ద్వారం వరకు చేరుకున్నారు. వీరు వచ్చిన మార్గంలో టీటీడీ విజిలెన్స్ అధికారుల తనిఖీలు ఉన్నప్పటికీ ఇంత దూరం పాదరక్షలతో ఎలా వచ్చారని పలువురు భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో భద్రతా తీరు, టీటీడీ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు.. ఈ ఘటనపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి స్పందించారు. ఈ సందర్బంగా భూమన మాట్లాడుతూ.. ‘తిరుమలలో భద్రత డొల్ల మరోసారి బయట పడింది. పాద రక్షలు వేసుకుని మహా ద్వారం వరకు భక్తులు వెళ్ళారు అంటే ఎలాంటి భద్రత ఉందో తెలుస్తోంది. శ్రీవాణి దర్శన వైకుంఠ క్యూ కాంప్లెక్స్ నుంచి మహా ద్వారం వరకు పట్టించుకోలేదు. మేజోళ్ళుకు అనుమతి ఉంది అని ఏ బోర్డులో తీర్మానం చేశారో చెప్పండి. తిరుమల కొండపై జరుగుతున్న అపచారాలు గురించి చెప్తుంటే వితండ వాదనలు చేస్తున్నారు. తిరుమల కొండపై ప్రక్షాళన చేస్తామని చెప్పిన తర్వాతనే ఇవన్నీ జరుగుతున్నాయి.రాష్ట్రపతి కూడా ఈ సాహసం చేయలేదు, చెప్పులు వేసుకుని మహాద్వారం వరకు ఏనాడు రాలేదు. భద్రత డొల్లతనం ఏమిటి అన్నది తెలుస్తోంది. టీటీడీలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. గోశాలలో ఆవులు చనిపోయాయి, దీనికి ప్రత్యక్ష సాక్షాలు ఉన్నాయి. జేసీబీలతో వెళ్ళి పూడ్చిన కళేబరాలు త్రవ్వి మీడియా సమక్షంలో బయటపెడదాం. టీటీడీ పాలకమండలి వెంటనే రాజీనామా చేయాలి డిమాండ్ చేస్తున్నా. దీనికి కారణమై సెక్యూరిటీ, ఇతర అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలి. తిరుమల భద్రత ఎంత అధ్వాన్న పరిస్థితికి వెళ్ళింది అనేది తేట తెల్లమైంది. తిరుపతి గోశాలలో గోవులు చనిపోయాయి అని చెప్తే, మాపై ఎదురు దాడి విమర్శలు చేస్తున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు. -
గోవుల మృతి విషయాన్ని కూటమి ప్రభుత్వం దాచిపెట్టింది
-
Big Question: కూటమి పాపమే తిరుమల కొండకు శాపమా?
-
టీటీడీకి బండి సంజయ్ లేఖ
కరీంనగర్: తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్(టీటీడీ) చైర్మన్ కు కేంద్ర హోంశాక సహాయ మంత్రి బండి సంజయ్ లేఖ రాశారు. కరీంనగర్ శివారులో రెండేళ్ల క్రితం టీటీడీ ఆలయ నిర్మాణానికి భూమి పూజ జరిగినా ఇప్పటికే ముందడుగు పడకపోవటం దురదృష్టకమరమన్నారు బండి సంజయ్. ఈ మేరకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు లేఖ రాశారు.‘కరీంనగర్ కేంద్రంగా ఆధ్యాత్మిక శోభతో శ్రీవారు ఆలయ నిర్మాణాన్ని త్వరగా చేపట్టాలి. 20223, మే 31వ తేదీన పద్మానగర్ లో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి ఘనంగా భూమి పూజ చేశారు. మళ్లీ ఆలయ నిర్మాణంలో ముందడుగు పడకపోవడం దురదృష్టకరం.యావత్తు శ్రీవారి భక్తులు ఎంతో ఆశగా ఆలయ నిర్మాణ పనులను త్వరగా ప్రారంభించి కరీంనగర్ ప్రాంతానికి ఆధ్యాత్మిక శోభను అందించాలని కరీంనగర్ ప్రాంత ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను’ అని బండి సంజయ్ తన సోషల్ మీడియా అకౌంట్ ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.కరీంనగర్ కేంద్రంగా ఆధ్యాత్మిక శోభతో శ్రీవారు ఆలయ నిర్మాణాన్ని త్వరగా చేపట్టాలని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారికి లేఖ వ్రాయడం జరిగింది.గతంలో 2023 సంవత్సరంలో మే 31న కరీంనగర్ లోని పద్మానగర్ ప్రాంతంలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ… pic.twitter.com/UecjISFw7S— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) April 5, 2025 -
Sri Rama Navami టీటీడీ నిర్లక్ష్యం : అయ్యో... ఆంధ్రావాల్మీకి!
భద్రాచలం రామయ్య కోసం గుడి నిర్మించి రామభక్తుల హృదయాల్లో చిరస్ధాయిగా నిలిచిపోయారు రామదాసు.. అదే తరహాలో ఒంటిమిట్ట కోదండ రాముని ఆలయ జీర్ణోద్ధరణ కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మరో రామదాసు వావికొలను సుబ్బారావు. అయితే వావికొలనును తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పట్టించుకోవడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల నేపథ్యంలో రామభక్తుడైన వావికొలను సుబ్బారావు సేవలపై కథనం. ఒంటిమిట్ట(రాజంపేట): భద్రాచలంలో రామయ్య గుడి కట్టించిన భక్తరామదాసు కీర్తి ప్రతిష్ణలు తెలంగాణా ప్రభుత్వం ఇనుమడింప చేసే విధంగా ముందుకెళుతోంది..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం అధికారిక రామాలయం నిర్మాణానికి సూత్రధారి అయిన అపరరామదాసు, ఆంధ్రవాల్మీకిగా ప్రసిద్ధికెక్కిన వావికొలను సుబ్బారావు గురించి పట్టించుకోవడం లేదు.టీటీడీ వావికొలను సుబ్బారావు కీర్తిప్రతిష్టలు ప్రాచుర్యంలోకి తీసుకొచ్చేందుకు ఎటు వంటి అడుగువేయలేదన్న ఆరోపణలు ఉన్నాయి. సుబ్బారావు బోటు(గుట్ట)ను టీటీడీ అభివృద్ధి చేయలేదు. ఇటీవల ఒంటిమిట్టకు వచ్చిన ప్రభుత్వ బృందం దృష్టికి వావికొలను అంశం వెళ్లినట్లు తెలిసింది. వావికొలను జీవితమిలా.. ఆంధ్రావాల్మీకి వావికొలను సుబ్బారావు జనవరి 23, 1863న ప్రొద్దుటూరులో జన్మించారు. తండ్రి రామచంద్ర, తల్లి కనకమ్మ, భార్య రంగనాయకమ్మ. 1883లో ప్రొద్దుటూరు తాలుకా ఆఫీసులో గుమస్తాగా చేరి రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొంది 1896 వరకు పనిచేశారు. ఆగస్టు1, 1936లో మద్రాసులో పరమపదించారు. టెంకాయచిప్పను చేతిలో ధరించి.. రాజులు ఆలయానికి ఇచ్చిన వందలాది ఎకరాల మాన్యాలు ఎవరికివారు భోంచేశారు. దీంతో ఒంటిమిట్ట రామయ్యకు నైవేద్యం కూడా పెట్టలేని స్థితికి ఆలయం వచ్చింది. ఈ నేపథ్యంలో ఆలయాన్ని ఉద్ధరించడానికి వావికొలను కంకణం కట్టుకున్నారు. టెంకాయచిప్పను చేతపట్టుకొని ఆంధ్రప్రదేశ్లో ఊరురా తిరిగి బిచ్చమెత్తారు. వచ్చిన ధనంతో రామాలయాన్ని పునరుద్ధరించారు. టెంకాయ చిప్పలో ఎంత డబ్బు పడినా.. ఏదీ ఉంచుకోలేదు. అంతా ఆలయ అభివృద్ధికే ఇచ్చారు. అలాగే రామాయణంతోపాటు శ్రీకృష్ణలీలామృతం, ద్విపద భగవద్గీత, ఆంధ్రవిజయం, దండకత్రయం, టెంకాయ చిప్పశతకం లాంటి ఎన్నో రచనలు కూడా వావికొలను చేశారు. వానప్రస్ధం 1920లో మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో తెలుగుపండితునిగా పనిచేశారు. వైరాగ్యపూరితుడై భోగమయ జీవితాన్ని త్యజించి గోచి ధరించి రాముని కోసం ఒంటిమిట్టలో ఏళ్ల తరబడి తపస్సు చేశారు. కాని ఊరిలో కొందరు స్వార్ధపరులు కుళ్లు రాజకీయాలతో ఆయన్ను అవమానించారు. ఆలయంలోకి రానివ్వకుండా చేశారు.ఊరిలో నిలువలేని పరిస్ధితులును కల్పించారు. వావికొలను దుఖించి, ఆ ఊరిని వీడి. మొదట గుంటూరు జిల్లా నడిగడ్డపాలెంలోనూ, అంగలకుదురులో తన ఆశ్రమాన్ని స్థాపించుకుని అక్కడే ఉన్నారు. ఈయన మొదలుపెట్టిన గురు పరంపర నేటికి కొనసాగుతోంది. ఆంధ్రావాల్మీకిగా.. సుబ్బారావు వాల్మీకి సంస్కృత రామాయణాన్ని 24వేల చందోభరిత పద్యాలుగా తెలుగులో రాశారు. వాల్మీకి రామాయణాన్ని (24000 శ్లోకాలను)108సార్లు పారాయణం చేయటం వల్ల ఆయనకు అందులోని నిగూఢ అర్థాలు స్ఫురించాయి. ఆయన రాసిన రామాయణాన్ని మహాసభమద్యలో ఒంటిమిట్ట రామాలయంలో శ్రీరామునికి అంకితం ఇచ్చాడు. అప్పుడు బళ్లారి రాఘవ అధ్యక్షతన జరిగిన సభలో మహాపండితులు ఆయనకు ఆంధ్రవాల్మీకి అని బిరుదు ప్రదానం చేశారు.శృంగిశైలాన్ని అభివృద్ధి చేయాలి రామాలయం నిర్మాణంæ కోసం తన సర్వస్వాన్ని కోల్పోయిన వావి కొలను సుబ్బారావుకు స్మారకమందిరం నిర్మించాలి. ఆయన నివసించిన శృంగిశైలం (సుబ్బారావుబోటు)ను అభివృద్ధి చేయాలి. – గానుగపెంట హనుమంతరావు, సాహితివేత్త, కడపవావికొలను సుబ్బారావును టీటీడీ మరవరాదు ఆంధ్రవాల్మీకి సుబ్బారావు గురించి టీటీడీ మరవ రాదు. ఆయన నివాసం ఉన్న గుట్ట అభివృద్ధికి నోచుకోలేదు. ఆయన పేరుతో ప్రాజెక్టు ఏర్పాటు చేసి ప్రాచుర్యం కల్పించాలి –ఆకేపాటి వేణుగోపాల్రెడ్డి, మాజీ డైరెక్టర్, గిడ్డంగులశాఖ కార్పోరేషన్, ఒంటిమిట్ట -
‘రియల్ ఎస్టేట్ వెంచర్లో శ్రీవారి ఆలయమా?’
తిరుపతి: ఓ రియల్ ఎస్టేట్ సంస్ధలో టీటీడీ ఆలయాలు కట్టాలనే సీఎం చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చూస్తుంటే.. శ్రీ వేంకటేశ్వరస్వామిని, టీటీడీని రియల్ ఎస్టేట్ వెంచర్స్ ప్రమోటర్లుగా వాడుకోవడానికి సిద్ధమైనట్లుగా కనిపిస్తోందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ధ్వజమెత్తారు.‘రియల్’ వెంచర్ లో శ్రీవారి ఆలయమా?రోజూ తిరుమల ప్రక్షాళన గురించి మాట్లాడే చంద్రబాబు ఒక పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థ అయిన జీ స్వ్కేర్ వెంచర్ లో టీటీడీ ఆలయాన్ని నిర్మిస్తే తప్పేంటి అని అనడం దారుణం. కూటమి పాలనలో శ్రీవారి పేరు మీద భవిష్యత్తులో ఇంకెన్ని దారుణాలు చూడాల్సి వస్తుందోనని భయాందోళనలు కలుగుతున్నాయి.దేశంలో ఎన్నో రియల్ ఎస్టేట్ సంస్థలున్నాయి. వారంతా తమ సొంత ఖర్చుతో ఆలయాలు నిర్మిస్తే వాటిని టీటీడీ తీసుకుంటుందా? ఆ వెంఛర్లకు టీటీడీ ప్రమోటర్గా ఉంటుందా? శ్రీ వేంకటేశ్వరస్వామిని వెంచర్లకు ప్రమోటర్గా చేయడం కాదా ఇది? వెంచర్ల ఆదాయం పెంచడానికి శ్రీవారిని వాడుకోవడం దుర్మార్గం కాదా? దీనికి ఆగమశాస్త్ర పండితులు సలహాలు సూచనలు ఇవ్వాలనడం ఇంకెంత దారుణమైన విషయం?తిరుమలలో వరుస దారుణాలు👉కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరుమల ఆలయ ప్రతిష్ట రోజురోజుకీ దిగజారిపోతుందని నెత్తీనోరూ మొత్తుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. తిరుమలలో జరుగుతున్న వరుస సంఘటనలు నిరూపిస్తూనే ఉన్నాయి.👉శ్రీవారి లడ్డూలో కొవ్వు కలిసిందని సీఎం చంద్రబాబు చేసిన దుష్ప్రచారం నుంచి మొదలుపెడితే ఆనాటి నుంచి అనేక ఘటనల్లో కూటమి ప్రభుత్వ దుర్మార్గాలు వరుసగా బయటపడుతూనే ఉన్నాయి. లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు నిజమేనని చెప్పడానికి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ ఇప్పటికీ ఎలాంటి ఆధారాలు చూపించలేకపోయింది.👉చంద్రబాబు అనుమతించిన హోటల్కి స్వామీజీలు ధర్నాలు చేస్తే వారిని పోలీసులతో మెడపట్టి గెంటేయించారు. దేశవ్యాప్తంగా ఉన్న హిందూ సమాజం నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడంతో చంద్రబాబు వెనక్కి తగ్గి అనుమతులు రద్దు చేయాల్సి వచ్చింది.👉తిరుమలలో జోరుగా మద్యం, మాంసం అమ్మకాలు జరుగుతున్నాయి. కొండపై బిర్యానీలు తింటున్నారు. గంజాయి, మద్యం మత్తులో భక్తుల మీద దాడులు చేస్తున్నారు. ఇవన్నీ వైఎస్సార్సీపీ చేస్తున్న ఆరోపణలు కాదు. తిరుమల పోలీసులే ఆధారాలతో సహా పట్టుకున్నట్టు అన్ని మీడియాల్లో ఫొటోలతో సహా ప్రచురితం అయ్యాయి. 👉ఇటీవల ఒక అన్యమతస్తుడు బైకుపై తిరుమలకు వెళితే మానసిక వికలాంగుడు అని ప్రభుత్వం కవర్ చేసుకుంది. పాపవినాశనం జలపాతంలో జరిగిన బోట్ షికారు ఎందుకునే దానిపై ప్రభుత్వ శాఖల నుంచే భిన్నమైన అభిప్రాయాలు చెప్పినా, వాస్తవం ఏంటనేది ఇంతవరకు ప్రభుత్వం నుంచి సరైన వివరణ రాకపోవడం ఆశ్చర్యకరంగా ఉంది. అడుగడుగునా విజిలెన్స్ లోపాలు కొట్టొచ్చినట్టు కనపడుతున్నా ప్రభుత్వం కళ్లుండీ చూసీచూడనట్టు వదిలేస్తుంది.తేడాను ప్రజలే గుర్తించారుతన చేతకానితనాన్ని ఒప్పుకోలేని ప్రభుత్వం భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారంటూ తమకుతామే కితాబిచ్చుకోవాల్సి దుస్థితి నెలకొంది. లడ్డూ నాణ్యత పెరిగిందని, అన్న ప్రసాదం బాగుందని తమకు తామే చెప్పుకోవడం తప్పించి, లోపాలు ఆధారాలతో సహా బహిర్గతం అవుతున్నా నష్టనివారణ చర్యలు తీసుకోవడానికి మాత్రం ప్రభుత్వానికి చేతకావడం లేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన తిరుమల వైభవానికి ఇప్పుడు జరుగుతున్న అరాచకాలకు తేడాను పది నెలల్లోనే భక్తులు గుర్తించారు. గత మా ప్రభుత్వంపై బురదజల్లేందుకు తిరుమల కేంద్రంగా జనసేన-టీడీపీ కలిసి చేయించిన దుష్ప్రచారాన్ని ప్రజలు ఇప్పటికే అర్థం చేసుకున్నారు. లోకేష్ పీఏ 12 లెటర్లు పంపుతున్నాడు👉కూటమి ప్రభుత్వం వచ్చాక తిరుమలను వీఐపీల అడ్డాగా మార్చేశారు. గత మా ప్రభుత్వ హయాంలో వీఐపీలకు రోజుకు 4 వేలు వీఐపీ టికెట్లు ఇస్తే, ఇప్పుడు రోజుకు 7500 టికెట్లు ఇచ్చి దర్శనం కోసం వస్తున్న సామాన్య భక్తులను గంటలపాటు క్యూ లైన్లలో మగ్గేలా చేసి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. సమీక్షలో మాత్రం సామాన్యులకు పెద్ద పీట వేస్తామని పచ్చి అబద్ధాలు మాయమాటలు చెప్పుకుంటున్నారు.👉మంత్రికి వీఐపీ బ్రేక్ కోసం రోజుకు ఒక లెటర్ చొప్పున ఆమోదిస్తుంటే, మంత్రి నారా లోకేష్ పీఏ సాంబశివరావు రోజుకు 12 వీఐపీ లెటర్లు పంపుతున్నాడు. అది కూడా పీఎస్ టూ సీఎంఓ పేరుతో సాంబశివరావు పంపుతున్నాడు.👉అధికారంలోకి వచ్చి 10 నెలలైనా ఇంతవరకు ఎస్వీబీసీ చైర్మన్ను, తిరుమల జేఈవోను, సీవీఎస్వోను, బర్డ్ డైరెక్టర్ను నియమించలేకపోయారు. కొండ మీద పాలన పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం’ అని మండిపడ్డారు.వైఎస్సార్సీపీ హయాంలో తిరుమల పవిత్రత కాపాడాంభక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించే ఉద్దేశంతో అలిపిరి వద్ద ధర్మశాలను కట్టాలనే నిర్ణయం కూడా వైఎస్సార్సీపీ హాయాంలో జరిగిందే. అదేదో తామే చేస్తున్నట్టు ప్రచారం చేసుకుంటున్నారు.రాయలసీమకు తలమానికంగా ఉన్న స్విమ్స్ ఆస్పత్రిని కూటమి అధికారంలోకి వచ్చాక నిర్వీర్యం చేశారు.ఏ విషయంలోనూ వైఎస్సార్సీపీ కన్నా మిన్నగా కూటమి పాలనలో తిరుమలలో ప్రక్షాళన చేశారో చంద్రబాబు చెప్పాలి.ఇన్ని అరాచకాలు జరుగుతున్నా సనాతన ధర్మ పరిరక్షకుడిగా చెప్పుకునే పవన్ కళ్యాణ్, ఇంకెప్పుడు మాట్లాడతారు? కొండమీద జరుగుతున్న అపవిత్రత గురించి ప్రశ్నించలేరా?చంద్రబాబుకి ఇదే నా సవాల్. టీడీపీ నుంచి ఏ నాయకుడిని పంపినా తిరుమల పవిత్రతపై వారితో బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నా.తిరుమల కొండ మీద ఏం జరిగిందో తెలుసుకోవాలని కేంద్ర హోంశాఖ విచారణకు ఆదేశిస్తే వారి కాళ్లూ వేళ్లూ పట్టుకుని అడ్డుకున్న సంఘటన కూటమి పాలనలో జరిగిందా? లేదా? ఇలాంటి ఘటనలు ఏనాడైనా వైఎస్సార్సీపీ పాలనలో జరిగినట్టు నిరూపించగలరా?ఏ మతస్తుడైనా హిందువుగా మారడానికి తిరుమలలో ఒక వేదిక ఏర్పాటు చేయాలన్న నిర్ణయం తీసుకున్నది కూడా మా హయాంలోనే అనేది గర్వంగా చెబుతున్నా.గోవింద కోటి రాసిన వారికి కుటుంబ సమేతంగా వీఐపీ దర్శనం కల్పించాలనే నిర్ణయం తీసుకున్నది కూడా వైఎస్సార్సీపీ హయాంలోనే. వేంకటేశ్వర దివ్యానుగ్రహ హోమం కూడా మేం తీసుకున్న నిర్ణయమే.లడ్డూ నాణ్యత మా హయాంలో ఎలా ఉన్నదో ఇప్పుడూ అలాగే ఉన్నది. గడిచిన పది నెలల కూటమి పాలనలో ఒక్క విషయంలోనైనా ప్రక్షాళన జరిగి ఉంటే చూపించాలి. వేంకటేశ్వరుని స్వామిని రాజకీయాలకు వాడుకోవాలనే దురుద్దేశం ఇప్పటికైనా విడనాడాలి. -
సనాతన ధర్మాన్ని కాపాడడానికి నువ్వు ఎవరు పవన్ కళ్యాణ్..?: ప్రకాశ్ రాజ్
సౌత్ ఇండియా పాపులర్ నటుడు ప్రకాశ్ రాజ్ (Prakash Raj) మరోసారి ఏపీ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan)ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఆయన పలుమార్లు పవన్ రాజకీయ తీరుపై విమర్శలు చేసిని విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట మరింతగా వైరల్ అవుతున్నాయి.పవన్ కల్యాణ్ కొద్దిరోజుల క్రితం సనాతన పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేస్తానన్నారు కదా దానిపై మీ అభిప్రాయం చెప్పండి అంటూ ప్రకాశ్రాజ్ను కోరారు. అందుకు ఆయన ఇలా సమాధానం ఇచ్చారు. ' సనాతన ధర్మాన్ని కాపాడడానికి పవన్ ఎవరు..? అతనికి ఎలాంటి అర్హతలు ఉన్నాయో చెప్పాలి. అధికారంలో లేనప్పుడు ప్రజా సమస్యల గురించి పవన్ మట్లాడారు. కానీ, ఎప్పుడైతే ఎన్నికల్లో గెలుపొందారో వాటిని పక్కన పెట్టేశారు. రాష్ట్రంలో నిరుద్యోగత ఉంది. విపరీతమైన అవినీతితో నిండిపోయింది. ఎక్కడ చూసిన కూడా లంచాలే కనిపిస్తున్నాయి. ఆడబిడ్డల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. చాలాచోట్ల రోడ్లు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించకుండా సెడెన్గా తను కాస్ట్యూమ్స్ మార్చేసి ఇలా సమయం ఎందుకు వృథా చేస్తున్నారు..? ఇలా రకరకాలుగా దుస్తులు మార్చేసి మాట్లాడటానికి ఇదేం సినిమా కాదు. అసలు అతను ఏపీ డిప్యూటీ సీఎం అని చెప్పడానికి నేను చాలా అన్ కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నాను. డెమోక్రసీలో అపోజిషన్ అనేది లేకుంటే ఎలా..? ప్రజల పక్షాన నిలబడి వారిని ఎవరు ప్రశ్నించాలి..?' అని ప్రకాశ్రాజ్ అన్నారు.తిరుమల లడ్డూ వివాదంపై ప్రకాశ్ రాజ్అదే ఇంటర్వ్యూలో ఆయన తిరుమల లడ్డూ వివాదం గురించి కూడా ఇలా మాట్లాడారు. 'సనాతన ధర్మానికి నేను వ్యతిరేకం కాదు. చాలా సున్నితమైన అంశాన్ని రాజకీయం చేస్తున్నారు. కోట్లమంది భక్తుల మనోభావాలకు సంబంధించించిన తిరుమల లడ్డూపై ఎవరైనా మాట్లాడే సమయంలో సరైన ఆధారాలతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అలా కాకుండా నోటికొచ్చినట్లు మాట్లాడటం ఏంతమాత్రం కరెక్ట్ కాదు. లడ్డూ తయారీలో కల్తీ జరిగింటే అందుకు కారణమైన వారిని డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న మీరు కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోండి.' అంటూ ఆయన సూచించారు. He has no vision. I'm feeling very uncomfortable with him being the Deputy Chief Minister. - @prakashraaj about @PawanKalyan #PawanKalyan #SanatanaDharmaRakshanaBoard pic.twitter.com/AjZJWO77Ec— Telugu Chitraalu (@TeluguChitraalu) April 2, 2025 -
Big Question: ఏడుకొండల్ని రాజకీయాల గుట్టగా మార్చిన బాబు
-
శ్రీవారికి కునుకు కరువాయె!
తిరుమల: కూటమి ప్రభుత్వం ప్రజలకే కాదు.. తిరుమల వేంకటేశ్వరస్వామికి కూడా కునుకు లేకుండా చేస్తోంది. కూటమి ప్రభుత్వం నియమించిన టీటీడీ అధికారులు, పాలక మండలి చైర్మన్ వీఐపీల సేవలో తరిస్తూ.. సామాన్య భక్తులకు స్లాట్ ప్రకారం దర్శనం చేయించలేక, అర్ధరాత్రి వరకు దర్శనాలు కొనసాగిస్తున్నారు. దీంతో బ్రహ్మండ నాయకుడైన తిరుమల శ్రీనివాసునికి విశ్రాంతి కరువైంది. టీటీడీ అధికారులు ఆగమ శాస్త్ర నిబంధనలను పాటించక పోవడం మహాపచారంగా మారుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో రోజుకు మూడు వేలకు మించి విఐపీ బ్రేక్ దర్శన టికెట్లు కేటాయించే వారు కాదు. కానీ నేడు ఆ సంఖ్య 7 వేల నుంచి 7,500 వరకు పెరిగింది. దీంతో ఉదయం 8 గంటలకు వీఐపీ బ్రేక్ దర్శనం ప్రారంభమై మధ్యలో ప్రొటోకాల్ బ్రేక్, శ్రీవాణి దర్శనం, దాతలు, రెఫరల్ ప్రొటోకాల్ దర్శనాలు వరుసగా మధ్యాహ్నం 1:30 గంట వరకు కొనసాగుతున్నాయి. ఆ తర్వాత గంట సమయం కలిగిన ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు, టైం స్లాట్ టోకెన్లు కలిగిన భక్తులకు దర్శనం మొదలై 5 నుంచి 6 గంటల సమయం పడుతోంది. ఇలా ఒక్కో స్లాట్ ఆలస్యం అవుతుండటంతో తర్వాతి స్లాట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వెరసి రాత్రి నుంచి పడిగాపులు కాచిన సామాన్య భక్తులకు చాలా ఆలస్యంగా దర్శనం మొదలై అర్ధరాత్రి దాటినా కొనసాగిస్తున్నారు. ప్రతిరోజు ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా టీటీడీ దాదాపు 45 వేల టికెట్లు కేటాయిస్తుండగా, సర్వ దర్శనంలో దాదాపు 20 వేల మంది భక్తులు వస్తుంటారు. వీరందరికీ దర్శనం చేయించడానికి అర్ధరాత్రి దాటుతోంది. టీటీడీ అధికారులు విఐపీలకు ఇచ్చే ప్రాధాన్యత శ్రీవారికి ఇవ్వడం లేదని సామాన్య భక్తులు వాపోతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక తిరుమలను రాజకీయంగా వాడుకోవడం పరిపాటిగా మారిందని, దేవదేవుడికి కూడా విశ్రాంతి లేకుండా చేశారని నిట్టూరుస్తున్నారు. కూటమి ప్రభుత్వం తీరు వల్ల ముందస్తుగా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్లైన్ ద్వారా పొందిన వారికి కూడా నిర్ధేశించిన సమయానికి టీటీడీ దర్శనం చేయించలేకపోతోంది. గత ప్రభుత్వంలో ఈ దర్శనం రెండు మూడు గంటల్లో పూర్తయ్యేది. ఇప్పుడు నాలుగైదు గంటలు పడుతోంది. ఏకాంత సేవ సమయాన్ని పెంచాలిపెరుగుతున్న భక్తుల రద్దీతో స్వామి వారు సేదదీరే సమయం తగ్గిపోతోంది. ఈ నేపథ్యంలో స్వామి వారి ఏకాంత సేవ సమయాన్ని పెంచాలని అర్చక, పండిత బృందం టీటీడీ అధికార యంత్రాంగానికి సూచిస్తోంది. రోజూ వేకువజామున సుప్రభాత సేవతో స్వామికి నివేదనలు మొదలవుతాయి. ప్రస్తుతం వేకువజామున 2.30 గంటలకు మహాద్వారం, వెండి వాకిలి, బంగారు వాకిలి తలుపులు తెరిచి 3 గంటలకు సుప్రభాత సేవ నిర్వహిస్తున్నారు. అంతకంటే ముందు అర్ధరాత్రి 12 గంటలలోపే ఏకాంత సేవ నిర్వహించాలి. అయితే కొన్ని నెలలుగా ఈ సేవ నిర్వహణ సమయం అర్ధరాత్రి 1–2 గంటల మధ్యకు మారిపోయింది. కొన్నాళ్లుగా తెల్లవారుజామున 2.30 గంటలకు ఏకాంత సేవ నిర్వహించి, ఆలయం తలుపులు మూస్తున్నారు. ఒక్కోసారి 2.50 గంటలకు ఏకాంత సేవ పూర్తిచేసి, ఆ వెంటనే.. అంటే కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే తిరిగి ఆలయం తలుపులు తెరుస్తున్నారు. క్యూలైన్లు భారీగా ఉండి, కంపార్టుమెంట్లలో గంటల తరబడి భక్తులను నిరీక్షింప చేస్తున్నందున అర్ధరాత్రి దాటినా సరే దర్శనం పూర్తి చేయించాలనే ఉద్దేశం వల్ల ఈ పరిస్థితులు నెలకొంటున్నాయి.వెరసి రోజుకు 23 గంటలకు పైగా శ్రీవారి దర్శనాలు కొనసాగుతున్నాయి. అయితే, ఇది సరికాదని, గర్భాలయంలోని మూల మూర్తికి కనీసం గంట నుంచి గంటన్నర సేపైనా ఏకాంతం కల్పించాలని అర్చకులు, కొందరు పండితులు టీటీడీ అధికారులకు సూచించినట్లు తెలిసింది. ఏకాంత సమయంలోనే దేవతలు భూలోకానికి వచ్చి శ్రీనివాసుడిని ఆరాధిస్తారని, స్వయంగా బ్రహ్మదేవుడే వచ్చి పూజ చేస్తారని పురాణాల్లో ఉందని.. దేవతల ఆగమన సమయంలో మానవ సంచారం ఉండకూడదని ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు. -
నారా లోకేష్ పీఏ దందా.. తిరుమల దర్శనాల టికెట్స్..
సాక్షి, తిరుమల/మంగళగిరి: తిరుమల దర్శనాల్లో మంత్రి నారా లోకేష్.. పీఏ దందా వెలుగులోకి వచ్చింది. వీఐపీ దర్శనాల కేటాయింపుల్లో అక్రమాలు బయటకు వచ్చాయి. పీఎస్ టూ సీఎంవో అంటూ దర్శన సిఫార్సు లేఖలు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.మంత్రి నారా లోకేష్ పీఏ సాంబశివరావు తిరుమల దర్శనాలకు సంబంధించిన దందా తాజాగా వెలుగులోకి వచ్చింది. పీఎస్ టూ సీఎంవో అంటూ సాంబశివరావు.. తిరుమల జేఈవో కార్యాలయానికి దర్శన సిఫార్సు లేఖలు పంపిస్తున్నారు. రోజుకు 12కుపైగా సిఫార్సు లేఖలతో దర్శనాలు ఇప్పిస్తున్నట్టు తెలిసింది. సాంబశివరావు పనిచేసేది మంగళగిరిలో అయితే తిరుమల జేఈవో కార్యాలయంలో సీఎంవో పేరుతో దర్శనాలు ఇప్పిస్తున్నారు.ఇక, ఏపీ సీఎంవో పేషీతో ఎలాంటి సంబంధం లేని సాంబశివరావు సిఫార్సు లేఖలకు టీటీడీ అధికారులు దర్శనాలు కొనసాగిస్తున్నారు. అయితే, మంత్రుల సిఫార్సు లేఖలతో రోజుకు రెండు దర్శనాలు మాత్రమే అనుమతి ఉంది. వారి సిఫార్సులతో వీఐపీ దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం మాత్రమే ఒక్క రోజుకు అనుమతి ఉంటుంది. కానీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోజుకు ఐదు నుంచి ఆరు వేలకు పైగా వీఐపీ దర్శనాలు పెరిగాయి. ఇష్టారాజ్యంగా కూటమి ప్రభుత్వంలో వీఐపీ దర్శనాలను పెంచి సామాన్య భక్తుల దర్శనాలను మరింత ఆలస్యం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సిఫార్సు లేఖలపై విచారణ చేపట్టాలని హిందుత్వ సంఘాలు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
ప్రధాని, హోంమంత్రికి వైఎస్సార్సీపీ ఎంపీ లేఖ
సాక్షి, ఢిల్లీ: తిరుమలలో వరుసగా జరుగుతున్న భద్రత వైఫల్యాలపై కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరుతూ.. ప్రధానమంత్రి, హోం మంత్రి, హోంశాఖ కార్యదర్శికి వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి లేఖ రాశారు. ‘‘వైకుంఠ ఏకాదశి రోజున ఆరుగురు భక్తులు తొక్కిసలాటలో చనిపోయారు. అన్నదానం క్యూ కాంప్లెక్స్లో భక్తులను నియంత్రించలేక తొక్కిసలాట జరిగింది. నాన్ వెజ్ పదార్థాలను కొండపైకి తీసుకెళ్లి తిన్న ఘటనలు జరిగాయి’’ అని లేఖలో ఆయన పేర్కొన్నారు.‘అలిపిరి చెక్ పాయింట్ను దాటుకుని సులభంగా గంజాయి, ఆల్కాహాల్ తీసుకెళ్తున్నారు. పవిత్రమైన పాప వినాశనం డ్యామ్లో నిబంధనలకు విరుద్ధంగా బోట్లను తిప్పారు. మార్చి 31న మతిస్థిమితం లేని వ్యక్తి బైక్పై తిరుమల కొండపైకి చేరుకున్నాడు. టీటీడీ పరిపాలన అస్తవ్యస్తంగా మారింది. దానివల్లే సమన్వయ లోపం, భద్రత లోపం తలెత్తింది. తిరుమల జాతీయ ప్రాధాన్యత కలిగిన పవిత్ర పుణ్యక్షేత్రం. వరుసగా జరుగుతున్న భద్రతా వైఫల్యంపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని తగిన చర్యలు తీసుకోవాలి’’ అని ఎంపీ గురుమూర్తి డిమాండ్ చేశారు. -
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
సాక్షి, తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 31 కంపార్టుమెంట్లో వేచిఉన్న భక్తులు. సోమవారం అర్ధరాత్రి వరకు 73,007 మంది స్వామివారిని దర్శించుకోగా 27,440 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.04 కోట్లు సమర్పించారు.టిక్కెట్లు లేని భక్తులకు 18 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 6 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
బాబూ.. శ్రీవారికి నిద్ర లేకుండా చేస్తున్నావ్: ఆర్కే రోజా
సాక్షి, తిరుపతి: ఏపీలో కూటమి ప్రభుత్వంలో మనుషులకే కాదు, చివరికి ఆ దేవదేవుడికి కూడా నిద్ర లేకుండా పోతుంది! అని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి ఆర్కే రోజా. తిరుమలలో స్వామి వారి దర్శనానికి సిఫార్సు లేఖలకు ప్రాధాన్యత ఇచ్చి, డబ్బు ఉన్నవారికే దర్శన అవకాశం కల్పిస్తున్నారని అన్నారు. భగవంతుడికి విశ్రాంతి సమయం కూడా లేకుండా చేస్తున్నారని ఆరోపించారు.మాజీ మంత్రి ఆర్కే రోజా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘కూటమి ప్రభుత్వంలో మనుషులకే కాదు, చివరికి ఆ దేవదేవుడికి కూడా నిద్ర లేకుండా పోతుంది!. సంప్రదాయం ప్రకారం, భగవంతుడికి విశ్రాంతి సమయం కేటాయించాలి. అది భగవంతుడి కోసమే కాకుండా, మన కోసమూ. సాంప్రదాయాలను పాటిస్తే భగవంతుడు మనల్ని చల్లగా చూస్తాడు.వైఎస్ జగన్ పాలనలో రోజుకు లక్ష మందికి పైగా భక్తులకు దర్శన భాగ్యం ఉండేవి. కానీ, ఇప్పుడు స్వామికి నిద్ర లేకుండా చేస్తూ, భక్తుల సంఖ్యను తగ్గిస్తున్నారు. దర్శనాల సంఖ్య 60వేల చుట్టూ పరిమితం చేస్తూ, రోజుకు 7 నుంచి 10 వేల బ్రేక్ దర్శనాలకు టీటీడీ ప్రాధాన్యత ఇస్తోంది. దీంతో సామాన్య భక్తులకు స్వామి దర్శనం మరింత దూరమవుతోంది. సిఫార్సు లేఖలకు ప్రాధాన్యత ఇచ్చి, డబ్బు ఉన్నవారికే దర్శన అవకాశం కల్పిస్తున్నారు. ఇదేనా కూటమి సనాతన ధర్మం? పవన్, బీజేపీ. ఇది చంద్రబాబు నమూనా ప్రక్షాళన?. భగవంతుడు అన్నీ గమనిస్తున్నాడు!! అంటూ కామెంట్స్ చేశారు. -
Bhumana Karunakar: కూటమి పాలనలో తిరుమల కొండపై అరాచకాలు కొనసాగుతున్నాయి
-
‘వాటిని అపవిత్రం చేస్తుంటే పవన్ ఏం చేస్తున్నాడు?
తిరుపతి: తిరుమలలో అరాచకాలు పెరిగిపోయాయని మండిపడ్డారు వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. పాప ప్రదాయినిగా బావించే పాపవినాశనంలో ప్రవిత్ర జలాలను అపవిత్రం చేశారని ధ్వజమెత్తారు భూమన. ఈరోజు తిరుపతి నుంచి ప్రెస్ మీట్ లో భూమన మాట్లాడుతూ.. ‘తిరుమల పాపవినాశనంలో బోటు షికారు ట్రయిల్ రన్ చేశారు. కూబింగ్ కోసమని బోట్లు తిప్పామని అన్నారు. అటవీశాఖ ట్రయల్ రన్ నిరతవహిస్తున్నామను అని అన్నారు. అనితర మేము వేసిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో గోరంతను కొండంత చేసిన కూటమి ప్రభ/త్వం.. నేడు పాప ప్రదాయినిగా భావించే పాప వినాశనంలో పవిత్ర జలాలను అపవిత్రం చేసింది. చట్ట వ్యతిరేకంగా కార్యక్రమాలు జరుగుతున్నాయని, అందుకే బోట్లు సర్వే చేశామని అన్నారు. ఇప్పటికి ఐదు రోజులైంది. కానీ టీటీడీ అధికారులు ఎవ్వరూ ఇంతవరకూ వివరణ ఇవ్వలేదు.పవన్ ఏం చేస్తున్నాడు..?నడుం బిగించానని చెప్పిన పవన్ కు నడుం నొప్పి ప్రారంభమైంది. అటవీశాఖ పవన్ పరిధిలో ఉంటుంది, అలాంటిది పవిత్ర జలాలకు అపవిత్రం చేస్తుంటే పవన్ ఏం చేస్తున్నాడు?, ఎందుకు స్పందించలేదు?, నిన్న బాలాజీ నగర్ లో పోలీసులు మద్యం పట్టుకొన్నారు. కొండపై మధ్యం విచ్చలవిడిగా దొరుకుతుంది. తిరుమల కొండపై మద్యం నిషేధించి దశాబ్దాలు అయినా అక్కడ మద్యం ఏరులై పారుతోంది. తిరుమల కొండపై ఎక్సైజ్ శాఖ ఉంది. పది రోజులకు ముందు గంజాయి, మద్యం మత్తులో భక్తులపై దాడి చేశారు. వీరిని పట్టుకోవడానికి భద్రత సిబ్బంది కష్టపడాల్సివచ్చింద15 రోజులకు ముందు ఆలయం సమీపంలో మద్యం మత్తలో ఓ యువకుడు హాల్ చల్ చేశాడు. ఆలయ సమీపంలో ఇలా జరుగుతుంటే ఏం చేస్తున్నారు?, . ఆలయం సమీపంలో ఇలా జరుగుతుంటే ఏం చేస్తున్నారుతిరుమలను బోట్లు ద్వారా పర్యాటక కేంద్రంగా మార్చాలని చూడలేదా?, .సీఎం చంద్రబాబు అన్నిదేవాలయాలను కలుపుతూ టూరిజం ఏర్పాటు చేస్తామని అన్నారు. టీటీడీ ప్రక్షాళన చెయ్యడానికే ఈఓ శ్యామలా రావు నియమించానన్నారు సీఎం చంద్రబాబు. ఇదేనా ప్రక్షాళన అంటే చంద్రబాబుకూటమి ప్రభుత్వంలో రోజుకో అరాచకంవైఎస్సార్సీపీ పాలనలో అన్నీ అరాచకలే అన్న మీరు.. ఒక్కటి కూడా నిరూపించలేదు. కానీ నేడు కూటమి ప్రభ/త్వంలో రోజుకో అరాచకం జరుగుతుంది. ముంతాజ్ హోటల్ అనుమతి ఇచ్చిందే చంద్రబాబు, అలాంటి ముంతాజ్ హోటల్ పై పెద్దఎత్తున స్వామీజీలు నిరసనలు చేశారు. అనంతరం వెనక్కి తగ్గారు. కూటమి ప్రభుత్వం చేసే మోసాలు, అరాచకాలు ప్రజలు గమనిస్తున్నారు. తిరుమలలో వరుస ఘటనలు ఎవరు జవాబు చెప్తారు’ అని ప్రశ్నించారు భూమన -
Tirumala : నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి 9 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు . శుక్రవారం అర్ధరాత్రి వరకు 65,569మంది స్వామిని దర్శించుకున్నారు.21,780 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.15 కోట్లు సమర్పించారు.టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి సుమారు 5 గంటలు పడుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 10 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. -
Tirumala : నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. స్వామి దర్శనం కోసం 31 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. ఆదివారం అర్ధరాత్రి వరకు 58,358 మంది స్వామిని దర్శించుకున్నారు. 27,024 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 4.45 కోట్లు సమర్పించారు.టైమ్ స్లాట్ ( ఈ) దర్శనానికి సుమారు 5 గంటలు పడుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 18 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 4 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. మార్చి 25న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంవార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో మార్చి 25న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, మార్చి 26వ తేదీన అంకురార్పణ, మార్చి 27వ తేదిన మేషలగ్నంలో ఉదయం 9.15 గంటల నుండి 9.30 గం.ల వరకు ధ్వజారోహణం జరుగుతుందన్నారు. ఏప్రిల్ 03వ తేదీన ఉదయం 9.15 గం.లకు రథోత్సవం, ఏప్రిల్ 07వ తేదీన రాత్రి 07 గం.ల నుండి 9.30 గం.ల వరకు శ్రీ సీతారాముల కళ్యాణం జరుగుతుందని, భక్తులు వీక్షించేలా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. వేసవి నేపథ్యంలో భక్తులు నడిచేందుకు వీలుగా వైట్ పెయింట్, చలువ పందిళ్లు, త్రాగునీటి సౌకర్యం కల్పించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, డిప్యూటీ ఈవో శ్రీమతి బి. నాగరత్న, ఏఈవో శ్రీ రవి, ఆలయ ఇస్పెక్టర్ శ్రీ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. -
Tirumala : నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. స్వామి దర్శనం కోసం 31 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. ఆదివారం అర్ధరాత్రి వరకు 84,198 మంది స్వామిని దర్శించుకున్నారు. 26,821 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.98 కోట్లు సమర్పించారు.టైమ్ స్లాట్ ( ఈ) దర్శనానికి సుమారు 5 గంటలు పడుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 18 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 4 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. శ్రీశైలానికి పోటెత్తిన భక్తులుఉగాది సందర్భంగా శ్రీశైల పుణ్యక్షేత్రానికి భక్తుల తాకిడి పెరిగింది. ఆలయంలోని క్యూ కాంప్లెక్స్ లు నిండిపోయాయి. దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. క్యూ లైన్లలోని భక్తులకు ఆలయ సిబ్బంది అల్పాహారం, మంచినీరు అందిస్తున్నారు. శ్రీశైలం వీధులు... భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కర్ణాటక నుంచి సైతం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దోర్నాల, తెలంగాణ నుంచి వందల సంఖ్యలో వాహనాలు ఒక్కసారిగా రావడంతో... ట్రాఫిక్ పెరిగింది. -
TTD: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్ది
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ఉచిత సర్వదర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట ATGH వరకు క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు. శనివారం అర్ధరాత్రి వరకు 75,428 మంది స్వామిని దర్శించుకున్నారు. 31,920 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.40 కోట్లు సమర్పించారు.టైమ్ స్లాట్ ( ఈ) దర్శనానికి సుమారు 5 గంటలు పడుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 18 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 4 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. -
చంద్రబాబుకి అలా చెప్పిన అధికారి ఎవరు?: భూమన
తిరుపతి, సాక్షి: తమ రాజకీయ అవసరాల కోసం దేవుళ్లను, సనాతన ధర్మాన్ని వాడుకోవడం మాత్రమే చంద్రబాబు, పవన కల్యాణ్లకు మాత్రమే తెలుసని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి(Bhumana Karunakara Reddy) అంటున్నారు. తాజాగా తిరుమల పర్యటనలో సీఎం చంద్రబాబు చేసిన ప్రకటనలకు, విమర్శలకు భూమన ఘాటుగా బదులిచ్చారు. గతంలో మేము చేసిన తీర్మానం చంద్రబాబు ఓసారి చూడాలి. హిందువులను తప్ప ఇతరులకు ప్రవేశం లేదన్నది వైఎస్ఆర్ పాలనలో తీసుకున్నదే. కానీ ప్రచారం మాత్రం మీరు చేసుకుంటున్నారు. అలిపిరి వద్ద ముంతాజ్ హోటల్ అనుమతులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నాం. కానీ, తుడా అనుమతులు ఇచ్చింది ఆయన పాలనలోనే అనే విషయం గుర్తించాలి... తిరుమలలో ఆధ్యాత్మికానికి.. పర్యాటకానికి ఎక్కడా పొంతన ఉండదు. 2014-19 టీడీపీ పాలనలో దేవలోక్(Devlok)కు చంద్రబాబు అనుమతులు ఇచ్చారు. అదీ మా పాలనపై రుద్దుతున్నారు. హిందూ ధర్మంకు కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసానికి స్వామీజీలు, సన్యాసులు అంతా కదన రంగానికి కదలి వచ్చారు. ఆ కారణంగా భయపడే విరమించుకున్నారు. శ్రీవాణి ట్రస్ట్ టీడీపీ హయాంలోనే ఏర్పాటు చేశారు. కానీ, వైఎస్సార్సీపీ(YSRCP) పాలనలో అత్యద్భుతంగా నిర్వహించాం. వేల కోట్ల రూపాయలు ఈ ట్రస్ట్ ద్వారానే జమ అయ్యాయి. టీటీడీ తరఫున దేశంలోని వివిధ ప్రాంతాల్లో వేంకటేశ్వర స్వామి ఆలయాలు నిర్మించాం. జగన్ పాలనలో 3,600 దేవాలయాలు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా నిర్మాణం చేయించారు. ఇది చూసి ఓర్వలేక.. ట్రస్ట్ నిధులు దుర్వియోగం అయ్యాయని అసత్యప్రచారాలకు దిగారు. విజిలెన్స్ విచారణ జరిపించారు. టీటీడీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టగానే బీఆర్ నాయుడు ఆ ట్రస్ట్ను రద్దు చేస్తామని ప్రకటించారు. కానీ, విజిలెన్స్ రిపోర్ట్ సమర్థవంతంగా నిర్వహించిన్నట్లు వచ్చింది. దీంతో.. శ్రీవాణి ట్రస్ట్ గురించి మాట్లాడటం మానేశారు. తిరుమలలో తాగునీటి కొరత రాబోతోంది.. ఆలయం మూసేయాలని ఓ అధికారి తనతో చెప్పారని చంద్రబాబు అనడంపై భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. మీతో ఆలయం మూసి వేస్తామని చెప్పిన అధికారి ఎవరు?. అధికారులు మూసేయాలి అనుకున్నారు.. అని ఎలా చెప్తారు?. 90 రోజుల్లో చర్యలు తీసుకోకుంటే .. వారిని అరెస్టు చేయిస్తామని హెచ్చరించడం ఏంటి?. ఏ చట్టంతో మీరు అధికారులు ను అరెస్టు చేస్తారు? భయపెడుతున్నారు?. తప్పు చేసే అధికారులు అధికారులు తప్పు చేస్తే, వారినీ సస్పెండ్ చేయాలి లేదంటే బదిలీ చేయాలి. కేవలం వేంకటేశ్వరస్వామిని వాడుకోవడానికి అధికారులను తెరపైకి తెస్తున్నారు. 👉తన తమ్ముడు రామ్మూర్తి నాయుడు చనిపోయి ఇంకా ఏడాది కూడా పూర్తి కాలేదు. అయినా కూడా చంద్రబాబు తిరుమలకు ఎలా వస్తారు?. అదేమైనా చిత్తూరు జిల్లా సాంప్రదాయం?.. సద్దులు చెప్పడానికేనా? మీరు పాటించరా చంద్రబాబు?. పైగా తిరుమల వేంకటేశ్వర స్వామిని అరకు కాఫీతో పోలుస్తారా?(అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు భూమన)👉తిరుమలలో సీఎంవో కార్యాలయం నుంచే వీఐపీల దర్శన దందా నడుస్తోంది. ఈ కారణంగానే సామాన్యులకు మధ్యాహ్నం దాటితే కానీ దర్శనం కావడం లేదు. 👉సనాతన ధర్మం కాపాడతాం అని చెప్పిన పవన్ కల్యాణ్.. విజయవాడలో గణపతి ఆలయం కూల్చివేస్తే ఎక్కడ ఉన్నారు?. మౌనంగానే ఉండి కాపాడుతున్నారా? ఇప్పటికైనా పవన్ సమాధానం చెప్పాలి. అధికారంలోకి రాగానే.. తిరుమలలో ప్రక్షాళన శ్యామలరావుతో మొదలు పెట్టాం అని చెప్పారు. శ్యామల రావు నెయ్యిలో ఎలాంటి జంతు పదార్థాలు కలవలేదు అని చెప్పారు. గతంలో అడిషనల్ ఈవో గా పనిచేసిన ధర్మా రెడ్డిపై చంద్రబాబు ఆరోపణలు చేశారు. ఇప్పుడున్న అడిషనల్ ఈవో.. తిరుమలలో ఉన్న నిర్వాసితులను వైఎస్సార్సీపీ సానుభూతిపరులంటూ బెదిరిస్తున్నారు అంటూ భూమన మండిపడ్డారు. -
TTD: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్ది
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. స్వామి దర్శనం కోసం 31 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. శుక్రవారం అర్ధరాత్రి వరకు 64,170 మంది స్వామిని దర్శించుకున్నారు. 26,821 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.98 కోట్లు సమర్పించారు.టైమ్ స్లాట్ ( ఈ) దర్శనానికి సుమారు 5 గంటలు పడుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 18 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 4 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. -
తిరుమలలో కొత్తగా మరో ట్రస్టు
తిరుమల: శ్రీవాణి ట్రస్టు పేరుతో ఇప్పటికే ఒక ట్రస్టు ఉన్నప్పటికీ శ్రీవారి ఆలయ నిర్మాణ ట్రస్టు పేరుతో నూతన ట్రస్టును ఏర్పాటుచేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమలలో ప్రకటించారు. శ్రీవాణి ట్రస్టు కూడా కొనసాగుతుందన్నారు. తన మనుమడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం వీఐపీ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం అన్నప్రసాద కేంద్రంలో ఒకరోజుకు సరిపడా రూ.44 లక్షల విరాళాన్ని టీటీడీకి అందించారు. ఆ తర్వాత టీటీడీ అధికారులతో సీఎం భేటీ అయ్యారు. ఆలయాల నిర్మాణాల కోసం నూతన ట్రస్టు..అనంతరం.. చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో ఇప్పటికీ చాలా గ్రామాల్లో వేంకటేశ్వరస్వామి ఆలయాల్లేవు. అలాంటిచోట్ల ఈ ఆలయాల నిర్మాణాల కోసం నిధులు సేకరించేందుకు నూతన ట్రస్టు ఏర్పాటుచేస్తాం. నాడు ఎన్టీఆర్ అన్నదానం, నేను ప్రాణదానం కార్యక్రమాలు ప్రవేశపెట్టాం. మూడో కార్యక్రమంగా ఆలయాల నిర్మాణాన్ని తలపెడుతున్నాం. మాధవసేవ కోసమే ఆలయాల నిర్మాణానికి ట్రస్టు ఏర్పాటుచేస్తాం. స్వామివారి ఆస్తులు ఎవరు కబ్జాచేసినా వాటిని తిరిగి దేవుడికే చెందేలా చేస్తాం’.. అని అన్నారు.టీటీడీలో హిందువులే పనిచేయాలి..‘టీటీడీలో పనిచేసేవారు హిందువులై ఉండాలి. ఇతర ఏ మతానికి సంబంధించిన ఆలయాల్లో ఆ మతం వారే ఉంటారు. దేశంలోని అన్ని రాజధానుల్లో శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం నిర్మించాలని సంకల్పించాం. దీనికోసం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాస్తాం. అలాగే, ప్రపంచ దేశాల్లో హిందువులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయాలు నిర్మిస్తాం’.. అని చంద్రబాబు చెప్పారు.ఆ హోటళ్లకు భూకేటాయింపులు రద్దు..తిరుమల కొండకు ఆనుకుని ముంతాజ్, ఎమర్, దేవలోక్ హోటళ్లకు అనుమతులిచ్చి 35.32 ఎకరాలు కేటాయించారు. ఆ భూముల కేటాయింపులను రద్దుచేస్తున్నామని చంద్రబాబు శుక్రవారం ప్రకటించారు. ఏడుకొండలను ఆనుకుని ఎవరూ వ్యాపారం చేయడంగాని, అపవిత్రంగాని చేయకూడదన్నారు. రాజకీయాల కోసమే శ్రీవాణి ట్రస్ట్పై ఆరోపణలుగతంలో శ్రీవాణి ట్రస్టులో అనేక అవకతవకలు జరిగాయంటూ చంద్రబాబు, పవన్కళ్యాణ్ పెద్దఎత్తున విమర్శలు చేశారు. కానీ, నేడు శ్రీవాణి ట్రస్టు కొనసాగుతుందని చెబుతూ మరో కొత్త ట్రస్టు ఏర్పాటు అంటున్నారు. అంటే.. శ్రీవాణి ట్రస్టులో గతంలో ఎలాంటి అక్రమాలూ జరగలేదని సీఎం చెప్పకనే చెప్పేశారని.. అందుకే శ్రీవాణి ట్రçస్టు కొనసాగుతుందంటున్నారని భక్తులు చెబుతున్నారు. రాజకీయాల కోసం శ్రీవారిని వాడుకుంటారనేది చంద్రబాబు మరోసారి నిరూపించారని వారంటున్నారు. -
TTD: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్ది
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. స్వామి దర్శనం కోసం 31 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. బుధవారం అర్ధరాత్రి వరకు 72,388 మంది స్వామిని దర్శించుకున్నారు. 26,145 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.97 కోట్లు సమర్పించారు.టైమ్ స్లాట్ ( ఈ) దర్శనానికి సుమారు 5 గంటలు పడుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 18 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 4 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. -
టీటీడీ తరహాలో యాదగిరిగుట్టకు పాలక మండలి
సాక్షి, హైదరాబాద్: యాదగిరిగుట్ట దేవాలయానికి తిరుమల తిరుపతి దేవస్థానాల తరహాలో పాలక మండలిని ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమమైంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ప్రవేశపెట్టిన తెలంగాణ ధార్మిక హిందూ మత సంస్థల, ధర్మాదాయాల చట్టం–1987 సవరణ బిల్లుకు శాసనసభ మంగళవారం ఆమోదం తెలిపింది. సాలీనా రూ.100 కోట్లకుపైగా ఆదాయం ఉన్న ఆలయాలకు పాలకమండళ్లను నియమించేందుకు ఇది వీలు కల్పించనుంది. 18 మందితో బోర్డు.. యాదగిరిగుట్ట ఆలయానికి ఏర్పాటు చేయబోయే బోర్డు చైర్మన్ను ప్రభుత్వం నియమిస్తుంది. దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, దేవాదాయ శాఖ కమిషనర్ సభ్యులుగా, దేవాలయ కార్యనిర్వహణాధికారి సభ్య కార్యదర్శిగా, యాదగిరిగుట్ట దేవాలయ అభివృద్ధి ప్రాధికార సంస్థ (వైటీడీఏ) వైస్ చైర్మన్, వ్యవస్థాపక ధర్మకర్త (ఓటు వేయు హక్కు కలిగి ఉంటారు) తదితరులు సభ్యులుగా ఉంటారు. వీరే కాకుండా మరో 9 మందితో కలిపి మొత్తం 18 మందిని ప్రభుత్వం నియమిస్తుంది.ఇందులో ఒకరు శాసనమండలి సభ్యులు, ఒక ఎస్సీ, ఒక బీసీ వర్గాలకు చెందిన వారు, కనీసం ఒక మహిళ ఉండాల్సి ఉంటుంది. ఆలయ స్థానాచార్యులు కూడా బోర్డు సభ్యుడిగా కొనసాగుతారు. బోర్డుకు సహాయ సహకారాలు అందించేందుకు తొలి రెండేళ్ల పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.. మొదటి ఐదేళ్ల కాలానికి యాదాద్రి భువనగిరి కలెక్టర్ కూడా సభ్యులుగా కొనసాగుతారు. దేవాలయ పాలనపరమైన నిర్ణయాలన్నీ ఈ బోర్డే తీసుకుంటుంది. వైటీడీ పేరుపై అభ్యంతరం! యాదగిరిగుట్ట దేవస్థానాన్ని వైటీడీ అని ప్రభుత్వం బిల్లులో ప్రస్తావించింది. బిల్లుపై చర్చలో పలువురు సభ్యులు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. టీటీడీ అంటే తిరుమల తిరుపతి దేవస్థానాలు అని.. వైటీడీ అంటే యాదగిరిగుట్ట టెంపుల్ దేవాలయమా? అని బీజేపీ సభ్యుడు హరీశ్బాబు ప్రశ్నించారు. టీటీడీ తరహాలో ధ్వనించేలా పోటీగా ఆ పేరు పెట్టినట్టు కనిపిస్తోందని పేర్కొన్నారు. కాగా యాదగిరిగుట్ట అభివృద్ధి అథారిటీ మనుగడ ఉండనందున.. దేవస్థానం పేరును వైజీడీ (యాదగిరిగుట్ట దేవస్థానం)గా మార్చాలని కాంగ్రెస్ సభ్యుడు రాజగోపాల్రెడ్డి సూచించారు.కేసీఆర్ పేరు చిరస్థాయిలో ఉంటుంది.. యాదగిరిగుట్ట బోర్డులో ఎమ్మెల్సీ సభ్యుడు/సభ్యురాలు ఉండనున్నట్టు బిల్లులో ఉందని.. ఓ ఎమ్మెల్యేకు కూడా సభ్యత్వం కల్పించాలని బీఆర్ఎస్ సభ్యుడు హరీశ్రావు కోరారు. యాదగిరిగుట్ట ఆలయ పునర్నిర్మాణం చేపట్టిన మాజీ సీఎం కేసీఆర్ పేరును మంత్రి ప్రస్తావించకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే కేసీఆర్ పేరు చరిత్రలో నిలిచిపోతుందని, తెలంగాణ ఇచ్చిన వ్యక్తిగా సోనియా పేరు చిరస్థాయి అయినట్టు, యాదగిరిగుట్ట ఆలయ పునర్నిర్మాణం విషయంలో కేసీఆర్ పేరు ఉంటుందని మంత్రి కొండా సురేఖ సమాధానంగా చెప్పారు.ఇక ఉమ్మడి నల్గొండలో ఎస్టీల జనాభా అధికంగా ఉన్నందున.. బోర్డులో ఓ ఎస్టీ కూడా ఉండేలా చూడాలని హరీశ్రావుతోపాటు బీజేపీ సభ్యుడు హరీశ్బాబు విజ్ఞప్తి చేశారు. వేములవాడ, భద్రాచలం, బాసర, కొండగట్టు దేవాలయాలకు కూడా ట్రస్టుబోర్డులను ఏర్పాటు చేయాలని సీపీఐ సభ్యుడు కూనంనేని సాంబశివరావు, కాంగ్రెస్ సభ్యుడు ఆది శ్రీనివాస్, బీజేపీ సభ్యుడు హరీశ్బాబు తదితరులు కోరారు.యాదగిరిగుట్ట వేద పాఠశాలను విశ్వవిద్యాలయం స్థాయికి పెంచాలని, హిందూ ధర్మ ప్రచార పరిషత్ నిధులను కోటి నుంచి రూ.5 కోట్లను పెంచాలని బీఆర్ఎస్ సభ్యుడు వేముల ప్రశాంత్రెడ్డి కోరారు. ఈ బిల్లుకు మద్దతు తెలుపుతున్నామని.. నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ రూ.82 వేల నగదు, ముఖరంజా భార్య ఇజ్రా రూ.8 లక్షల విలువైన ఆభరణాలను యాదగిరిగుట్ట దేవాలయానికి గతంలో సమరి్పంచారని మజ్లిస్ సభ్యుడు కౌసర్ మొహియుద్దీన్ పేర్కొన్నారు.‘గుట్ట’ వార్షికాదాయం రూ.224 కోట్లు.. యాదగిరిగుట్టలో కనీస వసతులు కూడా లేకపోవటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న తీరు చూసి.. గత 15 నెలల్లో పలు వసతులు కల్పించామని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ వసతి వల్ల కూడా దేవాలయానికి వచ్చే భక్తుల సంఖ్య పెరిగిందన్నారు. ప్రస్తుతం ఆలయ వార్షికాదాయం రూ.224 కోట్లకు చేరిందని వెల్లడించారు.దళితవాడల్లో యాదగిరీశుడి కల్యాణోత్సవాల నిర్వహణపై దృష్టి సారిస్తామని తెలిపారు. రూ.42 కోట్ల నిధులతో బాసర ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని.. గోదావరి, సరస్వతీ పుష్కరాలకు ఏర్పాట్లు ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. బ్రాహ్మణ పరిషత్తును బలోపేతం చేస్తామని, ధూపదీప నైవేద్య పథకం చెల్లింపుల్లో పెండింగ్ లేకుండా చూస్తామని చెప్పారు. -
నేడు శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల జూన్ కోటా విడుదల
తిరుమల: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల జూన్ నెల కోటాను మార్చి 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ కోసం మార్చి 18 నుంచి 20 ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. లక్కీ డిప్ ద్వారా ఈ టికెట్లు పొందిన భక్తులు మార్చి 20 నుంచి 22 మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లిస్తే టికెట్లు మంజూరవుతాయి. కాగా, ఆర్జిత సేవా టికెట్లు, జూన్ 9 నుంచి 11వరకూ జరిగే శ్రీవారి జ్యేష్టాభిషేకం టికెట్లు, వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను టీటీడీ మార్చి 21న ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఇక అంగప్రదక్షిణం టోకెన్లు, శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు, వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు శ్రీవారిని దర్శించుకునే టోకెన్ల కోటాను 22న ఆన్లైన్లో విడుదల చేయనున్నారు.ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, తిరుమల, తిరుపతిలలో గదుల కోటాను మార్చి 24న ఆన్లైన్లో టీటీడీ విడుదల చేయనుంది. https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా మాత్రమే శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. -
TTD: తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలతో శ్రీవారి దర్శనం
-
TTD : తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై శ్రీవారి దర్శనం..
తిరుపతి, సాక్షి: తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు టీటీడీ (TTD) అంగీకరించింది. ఇందులో భాగంగా అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఆ ప్రకటన మేరకు.. తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలకు శ్రీవారి దర్శనం కల్పించే విధానం మార్చి 24 నుండి అమల్లోకి రానుంది. వీఐపీ బ్రేక్,రూ.300 దర్శనాలకు మాత్రమే అనుమతి ఇచ్చింది. సోమవారం,మంగళవారం వీఐపీ బ్రేక్ దర్శనం, బుధవారం, గురువారం రూ.300 ప్రత్యేక దర్శనానికి అనుమతి ఇస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఒక్కో ప్రజాప్రతినిధికి రోజుకు ఒక లేఖకు మాత్రమే అనుమతి కల్పిస్తుండగా.. సిఫార్సు లేఖపై టీటీడీ ఆరుగురికి శ్రీవారిని దర్శనం చేసుకోవచ్చు. -
శ్రీవారిమెట్టులో కొనసాగుతున్న టోకెన్ల దందా!
చంద్రగిరి: శ్రీవారిమెట్టు మార్గంలో టోకెన్ల దందా కొనసాగుతోంది. విజిలెన్స్ సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారంటూ పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నా టీటీడీ ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో ఎంతో దూరం నుంచి ఆదివారం శ్రీవారి దర్శనం కోసం వచి్చన సామాన్య భక్తులు టోకెన్లు లభించక తీవ్ర అగచాట్లు పడ్డారు. ఆటో డ్రైవర్లతో కలిసి పలువురు సిబ్బంది అడ్డదారిలో టోకెన్లు విక్రయిస్తున్నారని భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాలు.. శ్రీవారిమెట్టు నుంచి తిరుమలకు కాలినడకన వెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) యంత్రాంగం కొన్ని నెలలుగా రోజుకు కేవలం 3 వేల టోకెన్లే జారీ చేస్తోంది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే వారాంతాల్లోనూ అదే రీతిలో టోకెన్లు ఇస్తోంది. ఆదివారం తెల్లవారుజామున సుమారు 10 వేల మందికి పైగా భక్తులు శ్రీవారిమెట్టు వద్దకు పోటెత్తారు. ఉదయం 6 గంటలకే భక్తులు భారీగా తరలిరావడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. శ్రీవారిమెట్టు మార్గంలోని పంపు హౌస్ వద్ద బారికేడ్లతో భక్తుల వాహనాలను విజిలెన్స్ సిబ్బంది అడ్డుకున్నారు. కానీ ఆటోలను మాత్రం ముందుకు అనుమతించారు. దీంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బారికేడ్లతో పాటు సెక్యూరిటీ సిబ్బందిని తోసుకుంటూ శ్రీవారి మెట్టుకు చేరుకున్నారు. తిరుపతి నుంచే వసూలు మొదలు.. తిరుపతిలో తమ వాహనాలు ఎక్కితే.. శ్రీవారి దర్శన టోకెన్లు ఇస్తామంటూ ఆటో డ్రైవర్లు జనాన్ని తీసుకువస్తున్నారని భక్తులు ఆరోపించారు. గ్రూపులుగా వచ్చే వారిని టార్గెట్ చేస్తున్నారని చెప్పారు. సుమారు ఏడుగురు ఉండే గ్రూప్ నుంచి రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నారని భక్తులు ఆరోపించారు. బెంగళూరుకు చెందిన కృష్ణమూర్తి అనే భక్తుడు మాట్లాడుతూ.. “బెంగళూరు నుంచి కుటుంబసభ్యులతో శ్రీవారిమెట్టు సమీపానికి శనివారం అర్ధరాత్రికే వచ్చా. అప్పటి నుంచి సెక్యూరిటీ సిబ్బంది మమ్మల్ని అనుమతించలేదు. కానీ ఆటోలను మాత్రం పంపించారు. దీనిపై ప్రశ్నిస్తే జవాబు చెప్పట్లేదు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులను ఇలా ఇబ్బందులు పెట్టడం దారుణం’ అని ఆవేదన వ్యక్తం చేశారు. కాలినడకన తిరుమలకు వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని తగినన్ని టోకెన్లు జారీ చేయాలని టీటీడీని కోరారు. టోకెన్లను బ్లాక్లో విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
శ్రీవారి దర్శనం పేరుతో నటిని మోసగించిన దళారి
తిరుమల శ్రీవారి దర్శనం కోసం దేశ, విదేశాల నుంచి భక్తులు వస్తుంటారు. పేద వాడి నుంచి వీఐపీల వరకు స్వామి దర్శనం కోసం చాలా దూరం నుంచి వెళ్తుంటారు. అయితే, ప్రత్యేక దర్శన టిక్కెట్ల పేరుతో తనను మోసం చేశారని సినీ నటి పేర్కొన్నారు. స్వామిని దర్శించుకునేందుకు కొందరు ఆన్లైన్లో దర్శన టికెట్లు కొంటే.. మరికొందరు సిఫార్సు లేఖలతో తిరుమల చేరుకుంటారు. ఇంకొందరు సరైన అవగాహన లేకుండా శ్రీవారి దర్శనం, సేవ, లడ్డూలు, గదుల కోసం దళారులను నమ్మి మోసపోతున్నారు. గతంలో ఏడాదికి 50-60 వరకు కేసులు నమోదవుతుండగా.. కేవలం ఈ రెండు నెలల్లోనే 30కి పైగా కేసులు నమోదయ్యాయని తెలుస్తోంది.కోలీవుడ్ స్టార్ హీరోలు కమల్ హాసన్, రజనీకాంత్లతో కలిసి నటించిన ప్రముఖ నటి 'రూపిణి'ని తిరుమల దర్శనం పేరుతో ఒకరు మోసం చేశారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న ఆమె ముంబైలో కుటుంబంతో సెటిల్ అయిపోయారు. అయితే, ప్రతి ఏడాది ఆమె కుటుంబంతో తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్తుంటారు. ఈ క్రమంలో తమిళనాడుకు చెందిన శరవణన్ అనే వ్యక్తి ప్రత్యేక దర్శన టిక్కెట్లు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చి రూపిణిని సంప్రదించాడు. అందుకు గాను అతనికి రూ. 1.5 లక్షలు ఆమె బదిలీ చేశారు. అయితే, ప్రత్యేక దర్శనం టికెట్లు అతను పంపకపోవడంతో గట్టిగా నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. ఆపై అతను ఫోన్ ఆఫ్ చేయడంతో తాను మోసపోయానని రూపిణి గ్రహించారు. తనను మోసం చేసిన వ్యక్తిపై పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు.1980ల చివరలో తమిళ సినిమా రంగంలో ప్రముఖ నటిగా రూపిణి రాణించారు. రజనీకాంత్తో కలిసి మనితన్ చిత్రంలో హీరోయిన్గా నటించించారు. ఒంటరి పోరాటం, గాండీవం వంటి తెలుగు సినిమాల్లో కూడా ఆమె కీలకపాత్రలలో నటించారు. మైఖేల్ మదన కామ రాజన్,విచిత్ర సోదరులు వంటి చిత్రాలలో కమల్ హాసన్తో నటించారు. 1995లో మోహన్ కుమార్తో వివాహం తర్వాత ఆమె నటనకు స్వస్తి చెప్పారు. ముంబైలో బాగా చదువుకున్న కుటుంబంలో జన్మించిన రూపిణి డాక్టర్ విద్యను పూర్తి చేశారు. -
ఇదేం వివక్ష?.. తిరుమలకే వచ్చి తాడో పేడో తేల్చుకుంటాం
తిరుపతి, సాక్షి: సిఫార్సు లేఖల విషయంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల పట్ల టీటీడీ వ్యవహరిస్తున్న తీరుపై బీజేపీ ఎంపీ రఘునందన్రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కుటుంబ సమేతంగా శుక్రవారం తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లిన ఆయన.. లెటర్ల అంశంపై మాట్లాడారు. ఈ క్రమంలో టీటీడీకి ఆయన అల్టిమేటం జారీ చేశారు. ఉమ్మడి స్టేట్లో ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులందరి సిఫార్సు లేఖలు పరిగణనలోకి తీసుకున్నారు. మొత్తం 294 మంది ఎమ్మెల్యేలకు బ్రేక్ దర్శనాలు, వసతి సౌకర్యాలు కల్పించేవాళ్లు. రాష్ట్ర విభజన తరువాత ఆంద్రప్రదేశ్ ప్రజాప్రతినిధుల లేఖలు మాత్రమే అనుమతిస్తున్నారు. ఈ వివక్ష బాధాకరం. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు కూడా స్వీకరించాలని స్వయంగా సీఎం చంద్రబాబు ఆదేశించారు. పాలక మండలి కూడా అందుకు అంగీకరించింది. అయితే.. స్వయంగా సీఎం ఆదేశించినా.. అధికారులు మాత్రం అమలు చేయడం లేదు.. ఎందుకు?. తెలంగాణ ప్రజాపతినిధుల లెటర్లకు వెంటనే దర్శనాలు, గదుల సౌకర్యం కల్పించాలి. ఈ వివక్షపై టీటీడీ పునరాలోచించాలి. ఈ విషయమై పాలకమండలి అత్యవసర సమావేశం నిర్వహించి చర్చించాలి. వేసవి సెలవుల్లో సిఫార్సు లేఖలు జారీ చేస్తాం. అనుమతించకపోతే ఎమ్మెల్యేలంతా తిరుమలకు వచ్చి తేల్చుకుంటాం. పార్టీలకతీతంగా నేను ఇది చెబుతున్నా’’ అని హెచ్చరించారాయన. -
ఆ విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం.. టీటీడీకి హైకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి: తిరుమలలో నిర్మాణాలపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా పలు మఠాలు నిర్మాణాలు చేపట్టాయని.. వాటిపై చర్యలు తీసుకునేలా అధికారులు ఆదేశించాలంటూ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్పై బుధవారం.. హైకోర్టు విచారణ జరిపింది. తిరుమలలో నిర్మాణాల విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని టీటీడీని హైకోర్టు హెచ్చరించింది.ఎంతో సుందరమైన తిరుమలను కాంక్రీట్ జంగిల్ కాకుండా చర్యలు తీసుకోవాలని టీటీడీకి హైకోర్టు తేల్చి చెప్పింది. తిరుమలలో నిర్మాణాలను ఇలానే కొనసాగిస్తే కొంతకాలం తర్వాత తిరుమల అటవీ ప్రాంతం కనుమరుగవుతుందని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. తిరుమల వ్యవహారంలో చాలా కఠినంగా వ్యవహరిస్తామని హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది. తిరుమలలో ధార్మిక సంస్థలు, మతం పేరుతో ఎలా పడితే అలా నిర్మాణాలు చేస్తామంటే కుదరదని న్యాయస్థానం తేల్చి చెప్పింది.ఇప్పటికే ఒక మఠం చేపట్టిన నిర్మాణాలపై చర్యలకు ఆదేశించామని పేర్కొన్న హైకోర్టు.. తిరుమలలో నిర్మాణాలు చేసిన పలు మఠాలకు నోటీసులు జారీ చేసింది. దేవాదాయ శాఖ కార్యదర్శి, టీటీడీ ఈవో, టీటీడీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్కు నోటీసులిచ్చింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని టీటీడీని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ మే 7 తేదీకి కోర్టు వాయిదా వేసింది. -
ఆ గానానికి గమ్యం – శ్రీహరి సన్నిధే!
సంగీతం ఆపాతమధురం. భావుకతతో, సమసమాజ భావనలతో, ప్రకృతి వర్ణనలతో... ఇలా హరివిల్లులా సంగీత జగత్తు నాదమయం. అలాగే భక్తి, ప్రపత్తి, శరణాగతులతో గానం చేసిన వారి కీర్తి అజరామరం. మన సమకాలంలో గానం చేస్తున్న, చేసిన సంగీత విద్వాంసులలో తనదైన విలక్షణ గాత్రంతో వెలిగిన ధ్రువతార శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్.నాకు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్తో దశాబ్దాల అనుబంధం. సౌజన్యం, సంస్కారం, వినమ్రత – పరిచయమైన క్షణంలోనే సూదంటురాయిలా ఆకర్షించిన అంశాలు. శక్తి, భక్తి, రక్తి కలిగిన తిరుమల ఆలయ కవి అన్నమయ్య కీర్తనలు పాడి తరించిన సంకీర్తన మహతి.స్వామి పుష్కరిణీ తీరంలో వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామిని గానం చేసిన భావ పుష్కరిణి అన్నమయ్య. ఆ కీర్తనలలోని రసాత్మ కతను దర్శించి, అనుభవించి స్వర పరచిన మహనీయులలో ఆరాధ్యుడు, అనవధ్యుడు శ్రీ గరిమెళ్ళ. ఒక వాగ్గేయకారుని సహస్ర కీర్తనలు స్వర పరిచి, పాడి, తన శిష్య ప్రశిష్యులతో పాడించిన కారణ జన్ముడు. స్వయంగా వాగ్గేయకారుడు. ‘ఆంజనేయ కృతి మణిమాల’, ‘నవగ్రహ కీర్తనలు’ వంటివి ఇందుకు మణిదర్పణం. లలిత సంగీత రచనల్లో 200 పాటల అందమైన బాలకృష్ణ భావలహరి అజరామరం.గాయకుడిగా, వాగ్గేయకారుడిగా, స్వరకర్తగా, శిష్య ప్రశిష్యులను తీర్చిదిద్దిన సంగీత కులపతి ఆయన. ఉద్యాన వనంలో ఆనేకమైన పూలకుండే పరిమళంలా, ప్రతి పాటకు తాను చేసిన స్వర రచనలో ఎంతో వైవిధ్యం, ఎంతో శాస్త్రీయత ఉట్టిపడుతాయి. అయితే, అంత కన్నా ఎంత ఆర్ద్రత నిండుగా ఉంటుందో స్మరిస్తే పులకించిపోతాం.సంగీత అక్షయ పుణ్యకోశమైన శ్రీ బాలకృష్ణ ప్రసాద్కు నాపై ఉండే ఆదరం నిరుపమానం. లెక్కకు మించిన సార్లు నా ఇంటికి వచ్చి నాకు నచ్చిన పాటలు వినిపించిన ఆత్మబంధువు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అధ్యక్షుడిగా నేను రూపకల్పన చేసిన ‘దళిత గోవిందం’, ‘కల్యాణమస్తు’, ఇంకా, దేశ విదేశాల్లో జరిగిన కల్యాణాల్లో, ఇతర ధార్మిక కార్యక్రమ ప్రస్థానంలో, ఆయన నా సహచరుడు. దళిత గోవిందం, శ్రీనివాస కల్యాణాల్లో – ‘బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే’, ‘ఇతడొక్కడే సర్వేశ్వరుడు’ వంటి కీర్తనలు ఆయన ఆలపించిన తీరు నాలో చెరగని ముద్ర వేశాయి. బాలకృష్ణ ప్రసాద్ ఛాందసుడు కాడు. మానవత్వం మొగ్గ తొడగాలని, సమాజంలో అన్ని వర్గాల మధ్య మమతా బంధాలు బలపడాలనే తాత్వికుడు. ఈ సత్యాన్ని తెలిపే వారి లలిత గీతాలు – ఆకాశవాణిలో ఎన్నో ప్రసారం అయ్యాయి. సామ్యవాదాన్ని, సౌమ్య వాదాన్ని మేళవించుకొన్న స్థితప్రజ్ఞడు.రాజకీయ నాయకుల్లో మాట తప్పని, మడమ తిప్పని మహ నీయుడు శ్రీ వై.ఎస్.రాజశేఖర రెడ్డి గారితో చేయించిన సన్మానం తనకొక మధుర స్మృతిగా నాకు తరచూ చెప్పేవాడు. జన హృదయ నేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆదేశిస్తే, తి.తి.దే. అధ్యక్షుడిగా ఆయనకు ‘పద్మశ్రీ’ ఇవ్వాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపించాను. కేంద్ర సంగీత నాటక ఆకాడమీ సన్మానితుడిగా, తి.తి.దే. ఆస్థాన పండితుడిగా, బిరుదులకే గౌరవాన్ని తెచ్చిన, లేదా పెంచిన ప్రజ్ఞాశాలి ఆయన. లాలిపాటల నుండి జోల పాటల వరకు కులశేఖరపడి వద్ద పాడిన అపర అన్నమయ్య.శ్రీవారి సేవలో నాద విద్వాంసుడిగా జీవించిన పూర్ణకాముడు. ఆ గాత్రానికుండే ప్రత్యేకత ఆరు దశాబ్దాల కాలం, ఇలలో సౌగంధికా సౌరభాన్ని నింపింది. ఇక కోనేటి రాయుని కొలువులో నారద,తుంబురులతో గానం చేస్తాడు. అన్నమయ్య కీర్తనలను, తన కీర్తనలను కలిపి గానం చేస్తూ తాళ్ళపాక కవులను ఆనంద పారవశ్యంలో ముంచెత్తుతాడు. పులుకు తేనెల తల్లి అమృత హస్తాలతో ఆనందామృతాన్ని గ్రోలుతాడు. ఆ మహనీయుని ధర్మపత్ని శ్రీమతి రాధ, వారి పుత్రులైన శ్రీ అనిల్ కుమార్, శ్రీ పవన్ కుమార్లకు – జాలి గుండెలవాడైన ఏడుకొండలస్వామి నిండైన అండదండగా ఉంటాడని విశ్వసిస్తున్నాను.భూమన కరుణాకర రెడ్డి వ్యాసకర్త పూర్వ అధ్యక్షులు,తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి -
టీటీడీ ఆస్థాన గాయకుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ కన్నుమూత
-
గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ మృతిపై వైఎస్ జగన్ సంతాపం
సాక్షి,తాడేపల్లి : ప్రముఖ సంగీత విద్వాంసులు, శాస్త్రీయ సంగీత గాయకుడు, స్వరకర్త గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ మృతిపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. గరిమెళ్లకు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్ధానం ఆస్ధాన విద్వాంసుడిగా బాలకృష్ణ ప్రసాదు అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు వైఎస్ జగన్. సంగీత విద్వాంసుడిగానే కాకుండా ప్రముఖ సంకీర్తనాచార్యులు తాళ్లపాక అన్నమాచార్యుల వారి సంకీర్తలనకు స్వరకల్పన చేసి.. అన్నమాచార్యుల వారి సంగీత, సాహిత్యాలను ప్రజలకు చేరవేయడంలో ఆయన సేవలు వెలకట్టలేనివని కొనియాడారు వైఎస్ జగన్. -
టీటీడీ ఆస్థాన విద్వాంసుడు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ కన్నుమూత
సాక్షి,తిరుపతి: టీటీడీ ఆస్థాన విద్వాంసుడు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ కన్నుమూశారు. 1978 నుండి 2006 వరకు టీటీడీలో ఆస్థాన గాయకుడిగా పనిచేసిన గరిమెళ్ళ 600లకు పైగా అన్నమాచార్య సంకీర్తనలకు స్వరకల్పన చేశారు. గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ భౌతిక దేహానికి టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి నివాళులర్పించారు. అంనతరం భూమన మాట్లాడుతూ.. ఆయనకు మరణం వేంకటేశ్వర స్వామి భక్తులకు తీరని లోటు. అన్నమయ్య కీర్తనలను గానం చేసి నేటి తరం భక్తులకు అందించిన మహనీయుడు గరిమెళ్ళ బాలకృష్ణ మరణించడం దురదృష్టకరమని అన్నారు. వినరో భాగ్యము విష్ణుకథ, జగడపు చనువుల జాజర,పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు వంటి సుప్రసిద్ధ కీర్తనలకు స్వరాలు సమకూర్చిన గరిమెళ్ళ సంప్రదాయ కర్ణాటక సంగీతంలో, లలిత సంగీతంలో, జానపద సంగీతంలోనూ పాటలు పాడారు. -
జూబ్లీహిల్స్ : వైభవంగా టీటీడీ శ్రీ వేంకటేశ్వరస్వామి 5వ వార్షిక బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
-
మరోసారి తొక్కిసలాట తిరుమలలో తీవ్ర విషాదం..
-
బోర్డు మెంబర్ నరేష్ తో ఉద్యోగికి క్షమాపణలు చెప్పించిన EO
-
టీటీడీ ఉద్యోగులకు క్షమాపణలు చెప్పిన బోర్డు సభ్యుడు
సాక్షి, తిరుమల: టీటీడీ ఉద్యోగుల నిరసన ఫలించింది. టీటీడీ బోర్డుపై ఉద్యోగ సంఘాల నేతలు విజయం సాధించారు. టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్తో ఉద్యోగికి క్షమాపణలు చెప్పించారు ఈవో. దీంతో, ఉద్యోగులు నిరసనను నిలిపివేసినట్టు తెలుస్తోంది.టీటీడీ ఉద్యోగుల నిరసన నేపథ్యంలో పాలక మండలి దిగొచ్చింది. ఎట్టకేలకు బోర్డు సభ్యుడు నరేష్తో ఉద్యోగికి క్షమాపణలు చెప్పించారు. అయితే, ఉద్యోగిపై దురుసు ప్రవర్తన నేపథ్యంలో పాలక మండలి సభ్యుడి వ్యవహారంపై భక్తుల నుంచి విమర్శలు వచ్చాయి. నరేష్ వెంటనే క్షమాపలు చెప్పాలని ఉద్యోగులు 48 గంటల పాటు నిరసనల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే నరేష్ వారిని క్షమాపణలు చెప్పారు. ఇదిలా ఉండగా.. తిరుమల శ్రీవారి ఆలయం వద్ద టీటీడీ ఉద్యోగిపై బోర్డు మెంబర్ నరేష్ బూతులతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. కర్ణాటకకు చెందిన పాలకమండలి సభ్యుడు నరేష్ ఆలయం వెలుపలి నుంచి వస్తున్న సమయంలో అక్కడే ఉన్న టీటీడీ ఉద్యోగి గేటు తీయలేదు. మహా ద్వారం ముందున్న గేటు తీసేందుకు సదరు ఉద్యోగి నిరాకరించాడు. అయితే, ప్రోటోకాల్ పరిధిలో టీటీడీ బోర్డు సభ్యుడికి గేటు తెరవలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు బోర్డు మెంబర్ నరేష్. అనంతరం, సదరు ఉద్యోగిపై బూతులతో మండిపడ్డారాయన. బయటకు పోవాలని చిర్రుబుర్రులాడారు. ఇలాంటి వారిని ఇక్కడ విధుల్లో ఎందుకు ఉంచారని ఆగ్రహంతో రగిలిపోయారు. అతడిని వెంటేనే అక్కడ నుంచి పంపించి వేయాలని అధికారులకు సూచించారు. అనంతరం, అక్కడి నుంచి టీటీడీ బోర్డు మెంబర్ నిష్క్రమించారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. -
రెండోరోజు టీటీడీ ఉద్యోగుల నిరసనలు.. ఐక్యవేదిక హెచ్చరిక ఇదే..
సాక్షి, తిరుపతి: టీటీడీ ఉద్యోగుల నిరసన కార్యక్రమం రెండో రోజు కొనసాగుతోంది. టీటీడీ పరిపాలనా భవనం ప్రధాన ద్వారం ఎదుట ఉద్యోగులు మౌన నిరసన తెలుపుతున్నారు. టీటీడీ పాలకమండలి సభ్యుడు నరేష్ను బోర్డు నుంచి తొలగించాలని, బహిరంగ క్షమాపణ చెప్పాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.టీటీడీ పాలకమండలి సభ్యుడు నరేష్ ఉద్యోగి బాలాజీపై దురుసు ప్రవర్తనకు నిరసనగా ఉద్యోగులు మౌన నిరసనలు తెలుపుతున్నారు. 48 గంటల నిరసన కార్యక్రమంలో భాగంగా వారు రెండో రోజు నిరసనల్లో పాల్గొన్నారు. శుక్రవారం ఉదయం నుంచి టీటీడీ పరిపాలనా భవనం ప్రధాన ద్వారం ఎదుట నిరసనలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులు.. పాలకమండలి సభ్యుడు నరేష్ను తొలగించాలని, బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం స్పందించకుంటే సోమవారం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని టీటీడీ ఉద్యోగుల ఐక్యవేదిక హెచ్చరికలు జారీ చేసింది.ఇదిలా ఉండగా.. తిరుమల శ్రీవారి ఆలయం వద్ద టీటీడీ ఉద్యోగిపై బోర్డు మెంబర్ నరేష్ బూతులతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. కర్ణాటకకు చెందిన పాలకమండలి సభ్యుడు నరేష్ ఆలయం వెలుపలి నుంచి వస్తున్న సమయంలో అక్కడే ఉన్న టీటీడీ ఉద్యోగి గేటు తీయలేదు. మహా ద్వారం ముందున్న గేటు తీసేందుకు సదరు ఉద్యోగి నిరాకరించాడు. అయితే, ప్రోటోకాల్ పరిధిలో టీటీడీ బోర్డు సభ్యుడికి గేటు తెరవలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు బోర్డు మెంబర్ నరేష్. అనంతరం, సదరు ఉద్యోగిపై బూతులతో మండిపడ్డారాయన. బయటకు పోవాలని చిర్రుబుర్రులాడారు. ఇలాంటి వారిని ఇక్కడ విధుల్లో ఎందుకు ఉంచారని ఆగ్రహంతో రగిలిపోయారు. అతడిని వెంటేనే అక్కడ నుంచి పంపించి వేయాలని అధికారులకు సూచించారు. అనంతరం, అక్కడి నుంచి టీటీడీ బోర్డు మెంబర్ నిష్క్రమించారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. -
రెండో రోజు టీటీడీ ఉద్యోగుల నిరసన కొనసాగింపు
-
టీటీడీ ఉద్యోగ సంఘాలతో బోర్డు సభ్యుల చర్చలు విఫలం
సాక్షి, తిరుపతి: టీటీడీ ఉద్యోగుల నిరసన నేపథ్యంలో టీటీడీ ఉద్యోగ సంఘాల నాయకులతో టీటీడీ అడిషనల్ ఈవో, జేఈవో చర్చలు జరిపారు. ఆందోళన విరమించాలని టీటీడీ సభ్యులు కోరారు. పాలక మండలి సభ్యుడు నరేష్ను తొలగించే వరకు ఆందోళన విరమించేది లేదని ఉద్యోగులు తేల్చి చెప్పారు.ఉద్యోగిని దూషించినందుకు క్రిమినల్ చర్యలు తీసుకోవాలని.. టీటీడీ ఉద్యోగులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రేపటి నుంచి 48 గంటలపాటు మౌన నిరసన చేయాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. టీటీడీ ఉద్యోగ సంఘాలతో బోర్డు సభ్యుల చర్చలు విఫలమయ్యాయి. ప్రభుత్వం స్పందించకుంటే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని టీటీడీ ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక హెచ్చరించింది. -
టీటీడీకే ఇదొక మాయని మచ్చ
-
TTD పరిపాలనా భవనం వద్ద ఉద్యోగుల ఆందోళన
-
తిరుమలలో మరోసారి విమానం చక్కర్లు
-
క్షమాపణలు చెప్పాల్సిందే.. టీటీడీ ఉద్యోగులు నిరసన
సాక్షి, తిరుపతి: టీటీడీ పరిపాలనా భవనం ముందు టీటీడీ ఉద్యోగులు నిరసన చేపట్టారు. టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్ను తక్షణమే విధులు నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు నిరసన తెలుపుతున్నారు. అలాగే, బోర్డు సభ్యుడు నరేష్.. వెంటనే టీటీడీ ఉద్యోగులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ పరిపాలనా భవనం లోపలికి మీడియాను సెక్యూరిటీ అనుమతించడం లేదు. పరిపాలన భవనం లోపల ప్రధాన ద్వారం వద్ద ఉద్యోగ సంఘాలు నిరసన తెలుపుతున్నారు. పరిపాలన భవనం మెయిన్ రోడ్ గేట్ ముందు మీడియాను లోపలికి పంపించడం లేదు.ఇదిలా ఉండగా..తిరుమల శ్రీవారి ఆలయం వద్ద టీటీడీ ఉద్యోగిపై బోర్డు మెంబర్ నరేష్ బూతులతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. కర్ణాటకకు చెందిన పాలకమండలి సభ్యుడు నరేష్ ఆలయం వెలుపలి నుంచి వస్తున్న సమయంలో అక్కడే ఉన్న టీటీడీ ఉద్యోగి గేటు తీయలేదు. మహా ద్వారం ముందున్న గేటు తీసేందుకు సదరు ఉద్యోగి నిరాకరించాడు. అయితే, ప్రోటోకాల్ పరిధిలో టీటీడీ బోర్డు సభ్యుడికి గేటు తెరవలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు బోర్డు మెంబర్ నరేష్.అనంతరం, సదరు ఉద్యోగిపై బూతులతో మండిపడ్డారాయన. బయటకు పోవాలని చిర్రుబుర్రులాడారు. ఇలాంటి వారిని ఇక్కడ విధుల్లో ఎందకు ఉంచారని ఆగ్రహంతో రగిలిపోయారు. అతడిని వెంటేనే అక్కడ నుంచి పంపించి వేయాలని అధికారులకు సూచించారు. అనంతరం, అక్కడి నుంచి టీటీడీ బోర్డు మెంబర్ నిష్క్రమించారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. -
శ్రీవారి సన్నిధిలో బూతు పురాణం
-
టీటీడీ ఉద్యోగిపై టీటీడీ బోర్డ్ మెంబర్ బూతుపురాణం
సాక్షి,తిరుమల : తిరుమల శ్రీవారి మహా ఆలయం వద్ద టీటీడీ ఉద్యోగిపై బోర్డు మెంబర్ బూతులతో విరుచుకుపడడం కొండపై హాట్టాపిగ్గా మారింది. కర్ణాటకకు చెందిన పాలకమండలి సభ్యుడు నరేష్ ఆలయం వెలుపలి నుంచి సమయంలో అక్కడే ఉన్న టీటీడీ ఉద్యోగి గేటు తీయలేదు. మహాద్వారం ముందున్న గేటు తీసేందుకు సదరు ఉద్యోగి నిరాకరించాడు. అయితే, ప్రోటోకాల్ పరిధిలో టీటీడీ బోర్డు సభ్యుడికి గేటు తెరవలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు బోర్డు మెంబర్ నరేష్. ఉద్యోగిపై బూతులతో మండిపడ్డారాయన. భయటకు పోవాలని చిర్రుబుర్రులాడారు. ఇలాంటి వారిని ఇక్కడ విధుల్లో ఉంచుకోవద్దని అక్కడే ఉన్న అధికారులకు సూచించారు. అనంతరం, అక్కడి నుంచి టీటీడీ బోర్డు మెంబర్ నిష్క్రమించారు. -
హిందూ ధర్మం విశ్వజనీనం
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ‘హిందూ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయడమే లక్ష్యం. దేశాభివృద్ధిలో టెంపుల్ టూరిజందే ప్రధాన పాత్ర. సంస్కృతి, వారసత్వ సంపద పరిరక్షణలో ఆలయాల పాత్ర కీలకం’ అని ఏపీ, మహారాష్ట్ర, గోవా ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, దేవేంద్ర ఫడ్నవీస్, డాక్టర్ ప్రమోద్ సావంత్ అన్నారు. టెంపుల్ కనెక్ట్ సంస్థ ఆధ్వర్యంలో అంత్యోదయ ప్రతిష్టాన్ సహకారంతో మూడు రోజుల పాటు తిరుపతిలో నిర్వహిస్తున్న ‘అంతర్జాతీయ దేవాలయాల సదస్సు, ఎక్స్పో’ సోమవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మూడు రాష్ట్రాల సీఎంలతో పాటు ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో 2025 – ఫౌండర్, అంత్యోదయ ప్రతిష్ఠాన్ ప్రవీణ్ దారేకర్, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు హాజరయ్యారు.అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయాలుఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయాలు నిర్మిస్తామని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానంతో ఆలయాల పరిరక్షణ, భద్రత, ఆర్థిక స్వయం సమృద్ధి సాధిస్తామన్నారు. ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచం ముందంజలో ఉన్నప్పటికీ, విశ్వాసం ముందు అవి ఏమీ చేయలేవని చెప్పారు. టీటీడీ పాలకమండలిలో బ్రాహ్మణులు, నాయీ బ్రాహ్మణ వర్గాలను సభ్యులుగా చేరుస్తామన్నారు. మతపరమైన టూరిజాన్ని పెంచేందుకు అటవీ, ఎండోమెంట్, పర్యాటక శాఖ మంత్రులతో ఆలయ కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అర్చకుల వేతనాన్ని, నిరుద్యోగ వేద పండితులకు గౌరవ వేతనం పెంచుతామని, ఆలయాలు, వేద వ్యవహారాల్లో స్వయంప్రతిపత్తికే అవకాశం కల్పిస్తామని తెలిపారు. తిరుమల బాలాజీని మోసం చేస్తే ఆయన క్షమించడని చెప్పారు. హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులను సాంస్కృతిక, ఆర్థిక ఉద్యమంలో ఏకం చేయడంలో ఈ సమావేశం చొరవ చూపడం హర్షణీయమని అన్నారు.భారత ఆలయాలు శక్తి స్వరూపాలు : దేవేంద్ర ఫడ్నవీస్ ప్రపంచ దేశాల ప్రజలు భారత ఆలయాలను ఆధ్యాత్మిక నిలయాలుగా, శక్తి స్వరూపాలుగా పరిణగనిస్తున్నారని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. దేశంలోని దేవాలయాల చరిత్ర అతి పురాతనమైనదని, దక్షణ భారత్లోని ఆలయాలు చూసి ప్రపంచదేశాలు ఆశ్చర్యపోతున్నాయని తెలిపారు. వేల ఏళ్ల క్రితం ఇలాంటి ఆలయ నిర్మాణం ఎలా జరిగిందని ఆరా తీస్తూ భక్తి భావానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తిస్తున్నారన్నారు. ప్రపంచవ్యాప్తంగా 55 శాతం మంది ధర్మ పర్యటనల వైపు మొగ్గు చూపుతున్నారని చెప్పారు. ప్రపంచ దేశాలు సైతం భారత్ వైపు చూడటానికి ఆధ్యాత్మిక సంపద, సంస్కృతే కారణమని వివరించారు. సనాతన భక్తి భావం పెంపొందించడంలో, హిందువుల సమైక్యత, సంస్కృతిని కాపాడడంలో ఈ ఇంటర్నేషనల్ టెంపుల్ కన్వెన్షన్ ఎక్స్పో దోహదపడుతుందని తెలిపారు.ధర్మ రక్షణే భారత ప్రజల సిద్ధాతం: డాక్టర్ ప్రమోద్ సావంత్ధర్నాన్ని రక్షిస్తే అది మనల్ని కాపాడుతుంది అనేదే భారత ప్రజల సిద్ధాంతమని గోవా సీఎం డాక్టర్ ప్రమోద్ సావంత్ చెప్పారు. గోవులను పూజించడం, రక్షించడం మన కర్తవ్యం కావాలని అన్నారు. హిందువులు ఐక్యతగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. దేశ పవిత్రతకు మూల స్తంభాలైన దేవాలయాలను పరిరక్షించాల్సిన భాద్యత ప్రతి హిందువుకూ ఉందని చెప్పారు.ఎక్స్పో ప్రధాన ఉద్దేశమిదీ..అంతర్జాతీయ దేవాలయాల సదస్సులో 58 దేశాల నుంచి హిందూ, సిక్కు, బౌద్ధ, జైన మతాల భక్తి సంస్థల ప్రతినిధులు పాల్గొని, 1581 దేవాలయాలను ఓకే వేదికపై అనుసంధానించడం లక్ష్యంగా ఈ ఎక్స్పో నిర్వహించారు. ప్రధానంగా స్థిరత్వ, పునరుత్పాదక ఇంధనం, దేవాలయ పాలన, దేవాలయ ఆర్థిక వ్యవస్థ, లక్ష్యాలు, స్మార్ట్ టెంపుల్ పరిష్కారాలు వంటి అంశాలపై మూడు రోజుల పాటు సెమినార్లు నిర్వహించనున్నారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు కులకర్ణి, ఐటీసీ పూర్వ చైర్మన్ ప్రసాద్ లాడ్ భవిష్యత్ కార్యక్రమాలను వివరించారు. కేంద్ర సహాయ మంత్రి శ్రీపాద నాయక్, సాధు ప్రతినిధి ఆచార్య గోవింద్ దేవ్ మహారాజ్, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి ముకుంద్ తదితరులు ప్రసంగించారు. ఈ సభలో రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, గోవా రాష్ట్ర మంత్రులు ఆశీష్ షెలార్, విశ్వజిత్ రాణే, ప్రభుత్వ సలహాదారు రోహన్ కౌంటే తదితరులు పాల్గొన్నారు. -
TTD: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. .శ్రీవారి దర్శనానికి10 కంపార్టుమెంట్లో వేచిఉన్న భక్తులు. శుక్రవారం అర్ధరాత్రి వరకు 64,527 మంది స్వామివారిని దర్శించుకోగా 23,129 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.70 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కె ట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 8 గంట ల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 4 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
‘ముంతాజ్’ అనుమతులు రద్దు చేయాలి
తిరుపతి కల్చరల్: అలిపిరికి సమీపంలో టీటీడీకి విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్న ముంతాజ్ హోటల్ అనుమతులను వెంటనే రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి స్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీ సాధు పరిషత్ ఆధ్వర్యంలో సాధువులు, మఠ, పీఠాధిపతులు పెద్ద ఎత్తున బుధవారం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ముందు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమలకు సమీపంలో ముంతాజ్ హోటల్కు అనుమతి ఇవ్వడం దుర్మార్గమన్నారు. దీనిపై అనేకసార్లు విజ్ఞప్తి చేసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం విడ్డూరమన్నారు. తాము అధికారంలోకి వస్తే తిరుమలను ప్రక్షాళన చేసి ధర్మాన్ని కాపాడతామని నాడు చంద్రబాబు ప్రకటించారని, ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే వారాహి డిక్లరేషన్, సనాతన ధర్మ రక్షణే లక్ష్యం, సనాతన ధర్మ రక్షణ బోర్డు తెస్తాం అంటూ ప్రగల్భాలు పలికారన్నారు. వీరిని నమ్మి తాము ధర్మ రక్షణ కోసం మద్దతు పలికామని చెప్పారు. టూరిజం మంత్రిగా జనసేన పార్టీ నేత ఉండడంతో ముంతాజ్ హోటల్కు అనుమతుల వెనుక జనసేన హస్తం ఉందని స్పష్టమవుతోందన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం చెప్పిన మాట నిలబెట్టుకుని ముంతాజ్ హోటల్ అనుమతులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే నిరసన దీక్షను ఆమరణదీక్షగా కొనసాగిస్తూ తమ ప్రాణాలైనా ఇవ్వడానికి తాము సిద్ధమని హెచ్చరించారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన సుమారు 250 మంది సాధువులు, మఠాధిపతులు, పీఠాధిపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
‘సిట్ రిపోర్ట్లో నెయ్యిలో కల్తీ జరిగినట్లు ఎక్కడా చెప్పలేదు’
సాక్షి, తాడేపల్లిగూడెం: టీటీడీ టెండర్లలో ఉల్లంఘనలకు పాల్పడ్డారంటూ నలుగురిని సిట్ అరెస్ట్ చేసిన ఘటనను శ్రీవారి లడ్డూకి వాడే నెయ్యిలో కల్తీ ఆరోపణలకు ముడిపెట్టడం ఒక్క చంద్రబాబుకు మాత్రమే సాధ్యమని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. తాడేపల్లిగూడెంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవారి లడ్డూలో కల్తీనెయ్యి వినియోగించారంటూ ఎటువంటి ఆధారాలు లేని ఆరోపణలు చేయడంపై సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా చంద్రబాబులో మాత్రం మార్పు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన ఈ అంశంలో నిర్ధిష్టమైన ఆధారాలు లేకుండానే ఇష్టారాజ్యంగా చంద్రబాబు, ఆయనకు నిత్యం భజన చేసే ఎల్లో మీడియా తప్పడు ప్రచారాలతో రాజకీయ లబ్ధికి ప్రయత్నిస్తున్నారని ఆక్షేపించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..కూటమి ప్రభుత్వం వంద రోజుల వైఫల్యాలను వైఎస్సార్సీపీ బయటపెడుతుందనే భయంతో చంద్రబాబు గత ఏడాది సెప్టెంబర్ నెలలో ప్రపంచ వ్యాప్తంగా శ్రీవారి భక్తులు తల్లడిల్లేలా తప్పుడు ఆరోపణలు చేశారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో పందికొవ్వు, గొడ్డు కొవ్వు కలిసాయంటూ ఒక పథకం ప్రకారం ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు సెప్టెంబర్ 18వ తేదీన ప్రకటించారు. తరువాత సెప్టెంబర్ 25న కేసు నమోదు చేశారు. 26వ తేదీన రాష్ట్రప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. తరువాత దీనిపై సుప్రీంకోర్ట్ లో వ్యాజ్యం దాఖలైన నేపథ్యంలో సీబీఐ నేతృత్వంలో సిట్ ను ఏర్పాటయ్యింది.టెండర్లలో ఉల్లంఘనలను మాత్రమే గుర్తించిన సిట్ నెయ్యిలో కల్తీ జరిగిందా లేదా అనే అంశంపై విచారణకు వచ్చిన సిట్ ముందుగా టీటీడీ నిర్వహిస్తున్న టెండర్లను పరిశీలించింది. దీనిలో నిబంధనల ఉల్లంఘన జరిగిందని గుర్తించి, దానికి కారణమైన నలుగురిపై కేసు నమోదు చేసి వారిని అరెస్ట్ చేసింది. ఈ అంశాన్ని మరోసారి చంద్రబాబు, ఆయనకు వంతపాడే ఎల్లో మీడియా మరోసారి వక్రీకరిస్తూ తప్పుడు ప్రచారానికి తెగబడ్డారు. నెయ్యిలో కల్తీ జరిగిపోయిందని, ఈ కల్తీ నెయ్యి విషయంలోనే నలుగురి అరెస్ట్ జరిగిందంటూ అసత్య ప్రచారానికి తెర తీశారు. నెయ్యిలో కల్తీ జరిగిందనే అంశాన్ని సిట్ నిర్ధారించక ముందే ముఖ్యమంత్రిగా చంద్రబాబు, ఆయనకు నిత్యం భజన చేసే ఎల్లో మీడియా నిర్ధారించి తీర్పులు కూడా చెప్పేయడం దుర్మార్గం.ఆది నుంచి చంద్రబాబు ప్రతి అంశాన్ని తనకు అనుకూలంగా వాడుకోవడం, వైఎస్సార్సీపీపై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారు. శ్రీవారి ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటూ మొదట్లో తప్పుడు ప్రచారం చేశారు. నీచమైన రాజకీయాలకు పవిత్రమైన శ్రీవారి ప్రసాదాన్ని అడ్డం పెట్టుకోవడం అత్యంత దుర్మార్గం. చంద్రబాబు తన స్వార్థం కోసం ఏఅంశాని అయినా సరే వాడుకోగల ఘనుడు. నిత్యం అబద్ధాలతోనే రాజకీయాలు చేసే చంద్రబాబుకు ఎల్లో మీడియా అండగా నిలుస్తోంది. చంద్రబాబు చెప్పే ప్రతి దుర్మార్గమైన మాటను విస్తృతంగా ప్రచారం చేస్తూ ప్రపంచంలోని కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీశారు.నెయ్యిలో నాణ్యతా ప్రమాణాలను గుర్తించే ల్యాబ్లు టీటీడీకి ఉన్నాయి. 2024 జూన్ 12, 20, 25, జూలై 4వ తేదీల్లో లడ్డూ ప్రసాదం తయారీ కోసం టీటీడీకి సరఫరా అయిన నెయ్యి ట్యాంకర్ల నుంచి నెయ్యి శాంపిళ్లను తీసి టీటీడీ ల్యాబ్లో పరిశీలించారు. ప్రమాణాలకు అనుగుణంగానే ఈ శాంపిళ్లు ఉన్నాయని నిర్థారించడం కూడా జరిగింది. అంటే లడ్డూ తయారీకి వస్తున్న నెయ్యిని పూర్తి స్థాయిలో పరిశీలించే ల్యాబ్లు, మెకానిజం టీటీడీకి ఉంది. ఈ పరిశీలనలో ఏ మాత్రం నాణ్యాతా ప్రమాణాలు తక్కువగా ఉన్నట్లు తేలినా ఆ నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపిస్తారు.ఈ విషయాన్ని మొదటి నుంచి వైఎస్సార్సీపీ చెబుతూనే ఉంది. కానీ చంద్రబాబుకు, ఎల్లో మీడియాకు వాస్తవాలు అక్కరలేదు. ఏదో ఒక రకంగా చంద్రబాబు వైఫల్యాలను ప్రజలు మరిచిపోయేలా చేయాలంటే ఒక బలమైన అంశంతో ప్రజలను డైవర్ట్ చేయాలన్నదే వారి లక్ష్యం. హిందూధర్మాన్ని అనుసరించే భక్తులు శ్రీవారి లడ్డూలో పందికొవ్వు, గొడ్డు కొవ్వు కలిసిందని ఉచ్ఛరించడానికే ఇష్టపడరు. అలాంటిది దుర్మార్గమైన కుట్రకు చంద్రబాబు పాల్పడ్డారు.వెనక్కి పంపిన ఆ నాలుగు ట్యాంకర్ల నెయ్యిని ఎలా వినియోగిస్తారు?గత ఏడాది జూలై 6, 12వ తేదీల్లో నాలుగు ట్యాంకర్ల ద్వారా కల్తీ నెయ్యి తిరుమలకు వచ్చిందనే ఆరోపణలు వచ్చాయి. వీటి నుంచి ఎన్డీడీపీకి టెస్ట్ కోసం నెయ్యి శాంపిళ్ళను పంపించారు. ఇదే అంశాన్ని రిమాండ్ రిపోర్ట్లో రాశారు. దీనిలో కూడా ఈ నెయ్యిలో కల్తీ జరిగినట్లు ఎక్కడా లేదు. ఎన్డీడీపీ తన నివేదికలో ఈ నెయ్యిలో వనస్పతి కలిసి ఉండే అవకాశం ఉందని, మా నివేదిక తప్పు కూడా అయ్యేందుకు అవకాశం ఉందని కూడా చెప్పింది. ఇదే విషయాన్ని సాక్షాత్తు సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించింది.ఇదీ చదవండి: మళ్లీ అధికారంలోకి వస్తాం.. అందరి లెక్కలు తేలుస్తాం: వైఎస్ జగన్అదే విధంగా జూలై 23నే టీటీడీ ఈవో శ్యామలరావు మాట్లాడుతూ ఈ నాలుగు ట్యాంకర్ల ద్వారా వచ్చిన నెయ్యిని వెనక్కి పంపించేశామని, ప్రసాదంలో ఉపయోగించలేదని కూడా ప్రకటించారు. ఈ నాలుగు ట్యాంకర్ల నెయ్యిని వాడకపోయినా రెండు నెలల తరువాత అంటే సెప్టెంబర్ 18న చంద్రబాబు ఆ నెయ్యిని వాడినట్లు ప్రకటించడం రాజకీయ దురుద్దేశంతో కాదా? ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఆర్ డెయిరీ నుంచి నెయ్యి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచే సరఫరా ప్రారంభించారు. దీనిని సీబీఐ కూడా గుర్తించింది. సీఎం చంద్రబాబు లడ్డూ కల్తీపై మాట్లాడేప్పుడు ఏ ఆధారాలతో నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసినట్లు ఆరోపించారని సుప్రీంకోర్టు ప్రశ్నించడంతో పాటు తప్ప పట్టింది. దీనికి చంద్రబాబు ఎటువంటి సమాధానం చెప్పలేదు. -
తిరుమల ఏడుకొండలు రక్షించుకుందామంటూ దీక్ష
-
Tirumala : తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. శ్రీవారి దర్శనానికి 30 కంపార్టుమెంట్లో వేచిఉన్న భక్తులు. మంగళవారం అర్ధరాత్రి వరకు 67,192 మంది స్వామిని దర్శించుకున్నారు. 20,825 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.15 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన వారికి సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 15 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 6 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లోకి వెళ్లా లని టీటీడీ విజ్ఞప్తి చేసింది. -
Tirumala : నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి 27 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు . అదివారం అర్ధరాత్రి వరకు 84,536మంది స్వామిని దర్శించుకున్నారు.25,890 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.67 కోట్లు సమర్పించారు. టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి సుమారు 5 గంటలు పడుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 18 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 5 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. -
దేవాలయాలకు పాకుతున్న ‘రెడ్బుక్’ సంస్కృతి!
ఏపీలో రెడ్బుక్ రాజ్యాంగ విష సంస్కృతి కోరలు చాస్తోంది. అన్ని ప్రభుత్వ శాఖలు, సంస్థలకూ పాకుతోంది. ఆధ్యాత్మిక కేంద్రం తిరుమల, తిరుపతి దేవస్థానంలోనూ ఈ రకమైన నీచ రాజకీయాలు ప్రవేశించాయి. తమకు గిట్టనివారిపై మాత్రమే సాగుతున్న రెడ్బుక్ కుట్రలతో పోలీసు శాఖకు కూడా అప్రతిష్ట ఏర్పడుతోంది. సాటి అధికారులపైనే కుట్రలకు దిగుతుండటం బహుశా దేశ చరిత్రలోనే మొదటిసారి కావచ్చు.టీటీడీ ఇటీవల కొంతమంది యూట్యూబ్ ఛానళ్ల నిర్వాహకులపై కేసులు పెట్టింది. ప్రభుత్వ సలహాదారు.. ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు తిరుమల సందర్శించిన సందర్భంగా ఆయనకు తగిన గౌరవ మర్యాదలు ఇవ్వలేదని, అధికారులు ప్రోటోకాల్ను కూడా ఉల్లంఘించారని ఈ ఛానళ్లలో కొన్ని కథనాలు ప్రసారం కావడమే నిర్వాహకులు చేసిన ఘోర తప్పిదం. ఈ కథనాల కారణంగా టీటీడీ ప్రతిష్ట దెబ్బతిందని, వారి మనోభావాలు గాయపడ్డాయని ఆరోపణలు చేసి జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఛానల్ నిర్వాహకుడు వైఎన్ఆర్తోపాటు ఇతరులపై కేసులు నమోదు చేశారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కూడా ఓ శాటిలైట్ ఛానెల్ యజమానే. ఆ ఛానెల్లో ఎన్ని అసత్య కథనాలు ప్రసారమయ్యాయో ప్రజలకు, విమర్శకులు అనేకులకు తెలిసిన విషయమే.టీడీపీ భజంత్రీ ఛానెల్గా మాత్రమే ఉండాలని అనుకుంటున్న బీఆర్ నాయుడు వీటిని పట్టించుకోకపోవచ్చు. అది వారి ఇష్టం కానీ.. అందరూ తనలానే అధికార పార్టీకి అణిగిమణిగి ఉండాలని కోరుకోవడమే అభ్యంతరకరం. టీటీడీ ప్రతిష్ట దెబ్బతిందని అంటున్నారు. ఎవరివల్ల? దాని గురించి చెప్పగలిగే ధైర్యం టీటీడీకి ఉందా?. దేవస్థానాన్ని అడ్డం పెట్టుకుని దిక్కుమాలిన రాజకీయం చేసిందెవరు?. భక్తులు పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదంలో జంతువు కొవ్వు కలిసిందని అసత్య ఆరోపణలు చేయడం వల్ల కదా టీటీడీ ప్రతిష్ట మసకబారలేదా?. సీఎం వంటి బాధ్యతాయుతమైన హోదాలో ఉంటూ బాధ్యతారాహిత్యంగా ఆయన చేసిన ఆరోపణలతో టీటీడీ పరువు ఏపీలోనే కాదు.. ప్రపంచం అంతటా పోయింది వాస్తవం కాదా?కోట్లాది హిందువులు ఏ దేశంలో ఉన్నా అంతా బాధపడ్డారా? లేదా? తీరా చూస్తే ఆయనే మళ్లీ మాటమార్చారు. సిట్ అని, సీబీఐ అని రకరకాలుగా విచారణలు చేయించారు. వాటి సంగతి ఏమైందో తెలియదు.టీటీడీ ఈవో శ్యామలరావు లడ్డూలో కల్తీ జరగలేదని తొలుత చెప్పి, ఆ తర్వాత చంద్రబాబుకు వంత పాడేలా మాట్లాడినప్పుడు పరువు పోలేదా? వారిపై టీటీడీ కేసులు పెట్టిందా?. అధికారం అంతా వారి చేతిలోనే ఉంది కనుక ఎవరూ వారి జోలికి వెళ్లలేరు. ఎవరైనా తమ మనోభావాలు గాయపడ్డాయని కేసులు పెట్టే ప్రయత్నం చేసినా పోలీసులు పట్టించుకోరు. ఎప్పుడో మూడు, నాలుగేళ్ల క్రితం తమ నేత చంద్రబాబు, తదితరులను దూషించారని, దానివల్ల తమ మనోభావాలు దెబ్బతిన్నాయని టీడీపీ వారు ఎవరైనా కేసు పెడితే మాత్రం పోలీసులు ఆగమేఘాల మీద హైదరాబాద్ వెళ్లి మరి ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ వంటివారిని అరెస్టు చేసే ప్రయత్నం చేస్తారు. దీనినే రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు. పలుకుబడి లేనివారినైతే అరెస్టు చేసి వేధిస్తుంటారు. ఇక పవన్ కళ్యాణ్ సంగతి చూద్దాం. చంద్రబాబు తిరుమల లడ్డూపై అసత్య ఆరోపణలు చేయడమే దారుణం అనుకుంటే పవన్ కళ్యాణ్ మరో అడుగు ముందుకు వేసి సనాతని వేషం కట్టి అయోధ్యకు పంపిన లడ్డూలలో సైతం కల్తీ నెయ్యి కలిపారని టీటీడీ పరువు మంట కలిపారు. తీరా చూస్తే అయోధ్యకు పంపిన లడ్డూలను బోర్డు సభ్యులు ఇద్దరు స్వచ్ఛమైన నెయ్యితో వ్యక్తిగతంగా తయారు చేయించారని వెల్లడైంది. అంటే పవన్ తప్పుడు ఆరోపణ చేసినట్లే కదా!. మరి టీటీడీ ఆయనపై ఎందుకు కేసు పెట్టలేదు. బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేస్తే ఒకప్పుడు ఎంత హోదాలో ఉన్నా కేసులు నమోదు చేసేవారు. ఇప్పుడు ఏపీలో ఆ పరిస్థితి లేదు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం టిక్కెట్ల కోసం వెళ్లిన భక్తులు తొక్కిసలాటకు గురై ఆరుగురు మరణిస్తే టీటీడీకి మచ్చ రాలేదు. దీనికి సంబంధించిన అధికారులపై తూతూ మంత్రంగా చర్యలు తీసుకుని ముఖ్యమైన అధికారుల జోలికి వెళ్లలేదు.ఇదే సమయంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణ చెప్పడానికి కూడా తొలుత మొరాయించారు. క్షమాపణతో సరి పెట్టుకున్నారే తప్ప.. తను చైర్మన్గా ఉన్నప్పుడు ఇది జరిగింది కనుక నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తానని మాత్రం ప్రకటించలేదు. నిజంగా టీటీడీ ప్రతిష్ట దారుణంగా దెబ్బతీసిన వారిపై ఎలాంటి చర్యలు లేవు కానీ, యూట్యూబ్ ఛానళ్ల నిర్వాహకులపై మాత్రం కేసులు పెట్టేశారట. వారు నిజంగానే పొరపాటు మాట్లాడి ఉంటే ఖండన ఇచ్చి అదే రకంగా వార్తలు ప్రసారం చేయాలని కోరి ఉంటే సరిపోయేది. అలా కాకుండా కేసులు పెట్టారంటే అది కక్ష కాక మరేమిటి?. టీటీడీలో రెడ్బుక్ పాలన ఇంకేమిటి? అందుకే వైఎస్సార్సీపీ నేతలు ఈ రెడ్బుక్ను పిచ్చి కుక్కలతో పోల్చి అవి ఎవరి మీద ఎప్పుడు పడతాయో తెలియని పరిస్థితి ఏర్పడిందని విమర్శిస్తున్నారు.టీటీడీలోనే కాదు.. వైఎస్సార్సీపీ నేతలు అనేక మందిపై రెడ్బుక్ పేరుతో కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఇప్పటికే అనేక మంది సోషల్ మీడియా కార్యకర్తలపై దారుణమైన రీతిలో కేసులు పెట్టారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా చేయడమే వీరి లక్ష్యం. తాజాగా మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై అటవీ భూముల ఆక్రమణ అంటూ ఓ కథ సృష్టించి ఏదోలా కేసు పెట్టాలని చూస్తున్నారు. రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డిలు ఇచ్చిన వివరణ చూస్తే అది ఎప్పుడో పాతికేళ్ల క్రితం కొన్న భూములు. వాస్తవం ఉన్నా, లేకపోయినా రెడ్బుక్ ప్రకారం కేసులు పెట్టడానికి ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి నిత్యం ప్రభుత్వాన్ని ఉసికొల్పుతున్నాయి. రెడ్బుక్ సృష్టికర్త లోకేష్ అయినా మర్చిపోతారేమో కానీ, ఈ ఎల్లో మీడియా మాత్రం తమ కక్షలు తీర్చుకోవాడానికి మాత్రం పూర్తిగా వాడుకునే పనిలో ఉంది. వీరి వ్యవహార శైలి చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలు వైఫల్యాల నుంచి డైవర్ట్ చేయడానికి చేసే ప్రయత్నంగా ఒక వైపు కనిపిస్తుంది.మరోవైపు ప్రభుత్వాన్ని వీరే నడుతున్నట్లుగా ఇష్టారాజ్యంగా వైఎస్సార్సీపీ వారిపై, తమకు గిట్టనివారిపై కథనాలు ఇస్తున్నారు. దీనివల్ల కూటమికి కూడా భవిష్యత్తులో నష్టమే తప్ప మరొకటికాదు. ఇప్పటికే పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై రెడ్బుక్ను ప్రయోగించారు. పలువురికి పోస్టింగ్లు నెలల తరబడి ఇవ్వడం లేదు. కొందరిని అరెస్టు చేయడానికి యత్నిస్తున్నారు. తాజాగా కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణా అభియోగంపై విచారణకు వేసిన సిట్ అధికారి వినీత్ బ్రిజ్ లాల్ను కూటమి పెద్దలు ఆదేశించినట్లుగా నివేదిక ఇవ్వాలని పోలీసు ఉన్నతాధికారులు చెప్పారట. ఆయన అలా కుదరదని, వాస్తవ పరిస్థితిని నివేదిస్తానని చెప్పారట. కాదు.. కూడదంటే ఉద్యోగానికి రాజీనామా చేస్తానని అన్నారట. దాంతో డీజీపీ, మరో ఉన్నతాధికారి ఆయనను బదిలీ చేయాలని నిర్ణయించారట. ఇదంతా మీడియాలో వచ్చిన సమాచారమే.ఇలా పోలీసు శాఖలోని వారు కూడా తమ పదవులు, పోస్టింగ్ల కోసం అధికారంలో ఉన్నవారికి వంతపాడే పనిలో ఉంటే అది వ్యవస్థకు ఎంతవరకు ప్రయోజనమో ఆలోచించాలి. ఇలా తప్పుడు కేసులు పెట్టించడం కొనసాగిస్తే, అదే రెడ్బుక్ కూటమి నేతల మెడలకు కూడా ఎప్పుడో ఒకప్పుడు చుట్టుకునే అవకాశం ఉంటుంది. పామును పెంచితే ఎంత ప్రమాదమో, రెడ్బుక్ అంటూ సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తే కూడా అంతే ప్రమాదం అన్న సంగతిని నేతలు ఎప్పటికి గుర్తిస్తారో !.- కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
Tirumala : నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొంత తక్కువగా ఉంది. ఉచిత సర్వ దర్శనానికి 2 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. నిన్న (శుక్రవారం)51,818 మంది స్వామివారిని దర్శించుకోగా 19,023 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.2.52 కోట్లు సమర్పించారు. టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 2 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు దర్శనానికి 4 గంటల సమయం . దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 8 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. పిభ్రవరి 4న రథసప్తమికి వైభవంగా ఏర్పాట్లుపటిష్ట భద్రతా చర్యలుఫిబ్రవరి 3 నుండి 5వ తేది వరకు ఎస్ఎస్ డి టోకెన్ల జారీ నిలిపివేతటీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు ఫిబ్రవరి 4వ తేది రథసప్తమి(సూర్య జయంతి) సందర్భంగా తిరుమలలో అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ శ్రీ బి.ఆర్.నాయుడు తెలిపారు. గత అనుభవాల దృష్ట్యా భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేశారు. రథ సప్తమి రోజున 2 ృ 3 లక్షల మంది భక్తులు తిరుమలకు వస్తారని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో చైర్మన్ అధ్యక్షతన శుక్రవారం టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో రథ సప్తమి ఏర్పాట్ల గురించి ఛైర్మన్ వివరించారు.సమావేశంలోని ముఖ్యాంశాలువాహన సేవల వివరాలు⇒ ఉ. 5.30 ృ 8 గం.ల వరకు (సూర్యోదయం 6.44 - సూర్య ప్రభ వాహనం⇒ఉ. 9 ృ 10 గంటల వరకు ృ చిన్న శేష వాహనం⇒ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు- గరుడ వాహనం⇒ మధ్యాహ్నం 1 నుండి 2 గంటల వరకు- హనుమంత వాహనం⇒ మధ్యాహ్నం 2 నుండి 3 గంటల వరకు- చక్రస్నానం⇒ సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు- కల్పవృక్ష వాహనం⇒ సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు- సర్వభూపాల వాహనం⇒రాత్రి 8 నుంచి 9 గంటల వరకు- చంద్రప్రభ వాహనంపలు సేవలు, ప్రివిలేజ్ దర్శనాలు రద్దు⇒ అష్టదళ పాద పద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలు రద్దు.⇒ ఎన్.ఆర్.ఐలు, చంటి బిడ్డల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాల రద్దు.⇒ తిరుపతిలో ఫిబ్రవరి 3 ృ 5 వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు జారీ రద్దు.⇒ ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు, బ్రేక్ దర్శనాలకు సంబంధించి ఫిబ్రవరి 03న ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు.⇒ ప్రత్యేక ప్రవేశ దర్శనం ( ఉఈ) టిక్కెట్లు ఉన్న భక్తులు వేచి ఉండకుండా నిర్ణీత సమయంలో మాత్రమే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద రిపోర్ట్ చేయాలని విజ్ఞప్తి. -
Tirumala : నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొంత తక్కువగా ఉంది. ఉచిత సర్వ దర్శనానికి 3 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. నిన్న (గురువారం ) 51,349 మంది స్వామివారిని దర్శించుకోగా 14,082 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.65 కోట్లు సమర్పించారు. టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 2 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు దర్శనానికి 4 గంటల సమయం . దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 8 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. తిరుమలలో నేడు టీటీడీ పాలకమండలి సమావేశంఫిబ్రవరి 4న రథసప్తమిని పురస్కరించుకొని పాలకమండలి భేటీ కానుండగా.. రథసప్తమి ఏర్పాట్లపై సభ్యులు, అధికారులతో సమీక్ష జరపనున్నారు ఛైర్మన్ బీఆర్ నాయుడు. భక్తులకు కల్పించాల్సిన సదుపాయాలు, సౌకర్యాలపై అధికారులకు పలు సూచనలు చేయనున్నారు. రథసప్తమి నాడు ఏడు వాహనాలపై భక్తులకు దర్శనమివ్వనున్న శ్రీవారు. 2 లక్షల మందికిపైగా భక్తులు వస్తారని టీటీడీ అంచనా -
తిరుమలలో చిరుత కలకలం.. సర్వదర్శన టోకెన్ల క్యూలైన్ వద్ద అలర్ట్!
సాక్షి, తిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో మరోసారి చిరుత సంచారం తీవ్ర కలకలం రేపింది. చిరుత సంచారం భక్తులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. తిరుమల శిలాతోరణం వద్ద గురువారం సాయంత్రం చిరుత సంచరిస్తున్నట్లు భక్తులు గుర్తించారు. దీంతో, వెంటనే టీటీడీ అధికారులకు సమాచారం అందించారు.వివరాల ప్రకారం.. తిరుమలలో చిరుత సంచారం భక్తులను మరోసారి భయాందోళనకు గురిచేస్తోంది. తిరుమల శిలాతోరణం వద్ద గురువారం సాయంత్రం చిరుత సంచరిస్తున్నట్లు భక్తులు గుర్తించారు. ఈ క్రమంలో వెంటనే టీటీడీ, అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అయితే, ప్రస్తుతం సర్వదర్శన టోకెన్ల క్యూలైన్ సమీపంలోని అటవీ ప్రాంతంలోనే చిరుత సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో, భక్తులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తులను టీటీడీ అప్రమత్తం చేసింది. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. -
TTD: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొంత తక్కువగా ఉంది. ఉచిత సర్వ దర్శనానికి 3 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. నిన్న (మంగళవారం) 70,610 మంది స్వామివారిని దర్శించుకోగా 17,310 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.78 కోట్లు సమర్పించారు.టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 2 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు దర్శనానికి 4 గంటల సమయం . దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 8 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
డ్రెస్ కోడ్ ‘గోవిందా.. గోవింద..!’
తిరుమల: సంప్రదాయ దుస్తులు లేకున్నా తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనానికి ఓ భక్తురాలిని అనుమతించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వీఐపీ బ్రేక్ దర్శనం, రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులు సంప్రదాయ దుస్తులతో దర్శనానికి వెళ్లాలి. పురుషులైతే ధోతీ/కుర్తా పైజమా ధరించాలి. స్త్రీలైతే పంజాబీ డ్రెస్, లంగా వోణీ, చీరలు ధరించి దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. అయితే వైకుంఠంలో పనిచేసే టీటీడీ, విజిలెన్స్ అధికారులు తాము అనుకుంటే ఎలాగైనా దర్శనానికి అనుమతిస్తామని సోమవారం రుజువు చేశారు. ఓ మహిళ టీ షర్టు, నైట్ ప్యాంటు వేసుకుని వీఐపీ బ్రేక్ దర్శనానికి రావడం.. ఆమెను అనుమతించడం పలు విమర్శలకు దారి తీసింది. -
Tirumala: తిరుమలలో రద్దీ ఈరోజు ఎలా ఉందంటే?
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొంత తక్కువగా ఉంది. ఉచిత సర్వదర్శనానికి 4 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. నిన్న (సోమవారం) 65,278 మంది స్వామివారిని దర్శించుకోగా 22,077 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.70 కోట్లు సమర్పించారు. టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 3 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు దర్శనానికి 4 గంటల సమయం. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 8 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
ఫిబ్రవరి 4న శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో రథసప్తమి
తిరుపతి: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఫిబ్రవరి 4వ తేదీన రథసప్తమి పర్వదినం వైభవంగా జరుగనుంది. ఈ సందర్భంగా స్వామివారు దేవేరులతో కలిసి ఏడు వాహనాలపై ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు.తెల్లవారు జామున 3 నుండి 5 గంటల వరకు శ్రీచక్రత్తాళ్వార్ను ఊరేగింపుగా శ్రీ కపిలేశ్వరస్వామి వారి ఆలయంలోని ఆళ్వారు తీర్థానికి వేంచేపు చేసి చక్రస్నానం నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 5.30 నుండి 7.30 గంటల వరకు సూర్యప్రభ వాహనంతో శ్రీగోవిందరాజస్వామి వారి వాహన సేవలు ప్రారంభమవుతాయి.ఉదయం 8 నుండి 9 గంటల వరకు హంస వాహనం, ఉదయం 9.30 నుండి 10.30 గంటల వరకు హనుమంత వాహనంపై స్వామివారు ఊరేగనున్నారు. ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పెద్దశేష వాహనం, మధ్యాహ్నం 1 నుండి 2.30 గంటల వరకు ముత్యపు పందిరి వాహనం, మధ్యాహ్నం 3 నుండి 4.30 గంటల వరకు సర్వభూపాల వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు ఊరేగుతూ భక్తులను అనుగ్రహించనున్నారు.రాత్రి 7 నుండి రాత్రి 8.30 గంటల వరకు గరుడ వాహనాన్ని అధిష్టించి శ్రీవారు దర్శనమిస్తారు. రథసప్తమి వేడుకలను అర్ధ బ్రహ్మోత్సవమని, ఒక రోజు బ్రహ్మోత్సవమని కూడా భక్తులు అంటారు. TTD: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంతిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. .శ్రీవారి దర్శనానికి రెండు కంపార్టుమెంట్లో వేచిఉన్న భక్తులు. శుక్రవారం అర్ధరాత్రి వరకు74,742 మంది స్వామివారిని దర్శించుకోగా 22,466 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.67 కోట్లు సమర్పించారు.దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 6 గంట ల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
TTD: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో 5 కంపార్ట్మెంట్లు ఖాళీగా ఉన్నాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు77,651 మంది స్వామివారిని దర్శించుకోగా 26,677 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.07 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కె ట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 8 గంట ల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. శ్రీశైలం మల్లశ్రీశైలం మల్లన్న ఆలయానికి పెరిగిన భక్తుల రన్న ఆలయానికి పెశ్రీశైలం మల్లన్న ఆలయానికి భారీగా పెరిగిన భక్తుల రద్దీరిగిన భక్తుల రద్దీశ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. వేకువజామునే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం మల్లన్న దర్శనానికి భారీగా క్యూలైన్లలో బారులు తీరారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆది, సోమవారాలలో ఆర్జిత అభిషేకాలు,కుంకుమార్చన నిలుపుదల చేశారు. శ్రీస్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతుం. భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. భక్తుల రద్దీతో క్షేత్ర పురవీధులన్నీ కిటకిటలాడాయి.