తిరుపతి: వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలకు సంబంధించి దర్శన కోటా వివరాలను విడుదల చేసింది టీటీడీ ...నవంబర్ 18న ఉదయం 10 గంటలకు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల( సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ) కు సంబంధించిన ఫిబ్రవరి నెల కోటాను విడుదల చేయనుంది.
- 21న ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవా టికెట్ల విడుదల
- 21న మద్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవల కోటా విడుదల
- 24న ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ టోకెన్లు విడుదల
- 24న ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన కోటా విడుదల
- 24న మధ్యాహ్నం 3 గంటలకు వృద్దులు, దివ్యాంగుల కోటా విడుదల.
- 25న ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల
- .25న మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో వసతి కోటా ఆన్లైన్లో విడుదల.


