Tirumala : నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే? | Huge Increase In Devotees In Tirumala | Sakshi
Sakshi News home page

Tirumala : నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?

Nov 24 2025 8:32 AM | Updated on Nov 24 2025 8:32 AM

Huge Increase In Devotees In Tirumala

తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. శ్రీవారి దర్శనానికి 25 కంపార్టుమెంట్లో వేచిఉన్న భక్తులు. ఆదివారం అర్ధరాత్రి వరకు 78,974 మంది స్వామివారిని దర్శించుకున్నారు.  28,995 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.61 కోట్లు సమర్పించారు. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 5 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించమని స్పష్టంచేసింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement