YV Subba Reddy: స్వామి సేవలో ఎలాంటి అవినీతికి పాల్పడలేదు
Nov 20 2025 11:45 PM | Updated on Nov 21 2025 11:31 AM
సిట్ అధికారులకు స్పష్టం చేసిన టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
2014 నుంచి టీటీడీకి నెయ్యి సరఫరాపై విచారణ చేయాలని కోరాను
ఆ 4 ట్యాంకుల్లోని నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందా? లేదా సిట్ చెప్పాలి
వైఎస్సార్ సీపీ హయాంలో స్వామి వారి ప్రతి రూపాయిని కాపాడాం
కిలో నెయ్యి రూ.276తో కొనుగోలు చేసినప్పుడు కల్తీ జరిగిందంటే ఒప్పుకుంటారా?
సాక్షి, అమరావతి: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి సేవలో ఎలాంటి అవినీతికి పాల్పడలేదని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. టీటీడీ చైర్మన్గా తాను శ్రీవారి నిధులను ఆదా చేయడానికి, భక్తులకు మరింతగా సేవలు అందించడానికే పెద్దపీట వేశానని తేల్చి చెప్పారు. రాజకీయ కుట్రతోనే సీఎం చంద్రబాబు శ్రీవారి లడ్డూ ప్రసాదానికి అపవిత్రత ఆపాదించేలా దుష్ప్రచారం చేస్తున్నా
సాక్షి, అమరావతి: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి సేవలో ఎలాంటి అవినీతికి పాల్పడలేదని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. టీటీడీ చైర్మన్గా తాను శ్రీవారి నిధులను ఆదా చేయడానికి, భక్తులకు మరింతగా సేవలు అందించడానికే పెద్దపీట వేశానని తేల్చి చెప్పారు. రాజకీయ కుట్రతోనే సీఎం చంద్రబాబు శ్రీవారి లడ్డూ ప్రసాదానికి అపవిత్రత ఆపాదించేలా దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్లోని సుబ్బారెడ్డి నివాసంలో గురువారం ఏపీ సిట్ అధికారులు ఆయన్ను విచారించారు.
అనంతరం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా బాధ్యత గల పదవిలో ఉన్న సీఎం చంద్రబాబు స్వామి వారి ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందనే వ్యాఖ్యలపై సిట్ అధికారులు తనను స్పష్టత ఇవ్వాలని కోరారన్నారు. 2019 నుంచే కాకుండా 2014 నుంచి.. వీలైతే అంతకు ముందు నుంచి కూడా టీటీడీకి నెయ్యి సరఫరా వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టాలని సిట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి ఇంకా ఏమన్నారంటే..
‘ఏపీ సీఎం చంద్రబాబు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో స్వామి వారి లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని ప్రచారం చేశారు. దీనిపై దేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. భక్తులకు వాస్తవాలు తెలియాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాం. దేశ సర్వోన్నత న్యాయ స్థానం సిట్ను నియమిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత విచారణ చేయకుండా భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా కీలక పదవుల్లో ఉండే వ్యక్తులు కామెంట్ల చేయడంపై విస్మయం వ్యక్తం చేసింది.
2024 జూన్లో నాలుగు ట్యాంకుల ద్వారా కల్తీ నెయ్యి (అడల్టెడ్) సరఫరా చేశారా? అందులో జంతువుల కొవ్వు కలిసిందా? లేకుంటే ఏ విధంగా కల్తీ జరిగిందో నిర్ధారించాలని సిట్ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నాలుగు ట్యాంకుల కల్తీ నెయ్యిని లడ్డూల తయారీలో వినియోగించారా? లేదా? విచారణ చేయాలని డైరెక్షన్స్ ఇచ్చింది. మొదట వాటిని నివృత్తి చేయాలని సిట్ అధికారులను కోరాను. అయితే, అధికారులు విచారణ పూర్తి కాలేదని చెబుతున్నారు. కానీ, ఇప్పటికే దాఖలు చేసిన చార్జిషీట్లో కల్తీ నెయ్యిలో విజిటబుల్ ఆయిల్స్ వంటివి మాత్రమే కలిశాయని పొందుపరిచారు.
విచారణలో భాగంగా ల్యాబ్ రిపోర్టులో వచ్చిన అంశాలనే చార్జిషీట్లో పెట్టామని చెబుతున్నారు. చార్జిషీట్లోనే వెనక్కి వెళ్లిన ట్రక్కులు మళ్లీ వేరే పేరుతో వచ్చాయని, వాటిని వాడారని పొందుపరిచారు. అందులో జంతువుల కొవ్వు కలిసిందా.. లేక పామాయిల్, ఇతర వాటి ద్వారా కల్తీ జరిగిందా అని సిట్ అధికారులు చెప్పాలి. పది రోజుల నుంచి ఓ వర్గం మీడియాలో నా మాజీ పీఏ చిన్నఅప్పన్నను అడ్డుపెట్టుకుని నేను అవినీతికి పాల్పడినట్టు దు్రష్పచారం చేయడం దారుణం. ఆయన 2014–18 వరకు మాత్రమే నా దగ్గర పని చేశాడు. ఆ తర్వాత ఎంపీ ప్రభాకర్రెడ్డికి పీఏగా, కొన్నేళ్లు తెలంగాణాకు చెందిన మరో ఎంపీకి పీఏగా చేసినట్టు సమాచారం ఉంది. అయనతో నాకు ఎలాంటి సంబంధం లేదు. దయచేసి దు్రష్పచారాన్ని అడ్డుకోవాలి.
స్వామి వారి ప్రతి రూపాయి కాపాడాం 2014 నుంచి కూడా విచారణ చేయాలని కోరాను. టీటీడీలో అవినీతికి పాల్పడి డబ్బు సంపాదించుకోవాలనుకుంటే కోట్లాది రూపాయిల ప్రాజెక్టులు ఉంటాయి. నేను ఎప్పుడూ నీచంగా ఆలోచించలేదు. శ్రీనివాస్సేతు బిడ్జి కోసం సుమారు రూ.690 కోట్లు కేటాయిస్తే.. మేము రూ.90 – 100 కోట్లు వరకు తగ్గించి నిర్మాణం చేసి ప్రారంభించాం. స్వామి ప్రతి రూపాయి కాపాడటానికి శ్రమించాం.
టీడీపీ ప్రభుత్వం రూ.1,100 కోట్లు స్వామివారి కానుక నిధులు ఎస్ బ్యాంకులో డిపాజిట్ చేస్తే మేము వాటిని జాతీయ బ్యాంకుల్లోకి మారి్పంచాం. ప్రైవేటు బ్యాంకులో డబ్బు ఉంటే ఏదైనా ఇబ్బందులు వస్తే భక్తుల కానుకలు నిరీ్వర్యం అయిపోతాయని డిపాజిట్లను విత్ డ్రా చేశాం. అది జరిగిన ఒకట్రెండు నెలల్లోనే ప్రైవేటు బ్యాంకు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. ఇలా స్వామివారి కానుకలు కాపాడాం. శ్రీవాణి పథ కంతో దళారులను నిర్మూలించాం. దేశ వ్యాప్తంగా దేవాలయాలు నిర్మించాం. పద్మావ తి హృదయాలయ ఆస్పత్రిల్లో చిన్నారుల ప్రాణాలను కాపాడటానికి నిధులు వెచి్చంచాం.