breaking news
Special Investigation Team (SIT)
-
ధర్మస్థళ తవ్వకాలపై శివకుమార్ సంచలన వ్యాఖ్యలు
దేశవ్యాప్తంగా తీవ్రచర్చనీయాంశంగా మారిన సామూహిక ఖననం కేసుపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విపక్షాల తీవ్ర విమర్శల నేపథ్యంలో ఆయన స్పందించారు. ధర్మస్థళ పుణ్యక్షేత్ర ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందని, త్వరలోనే నిజం నిలకడ మీద తెలుస్తుందని అన్నారాయన.ధర్మస్థళలో రెండు దశాబ్దాల కిందట.. హత్యలు, అత్యాచారాలు జరిగాయని, వందల సంఖ్యలో మృతదేహాలను గుట్టుచప్పుడు కాకుండా ఖననం చేశారని ఓ వ్యక్తి ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ క్షేత్రంలో మాజీ పారిశుద్ధ్య కార్మికుడిగా చెబుతున్న ఆ 61 ఏళ్ల వ్యక్తి ఆరోపణల నేపథ్యంలో.. ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేయించి అతను చూపించిన చోటల్లా తవ్వకాలు జరిపిస్తోంది. అయితే.. ఈ వ్యవహారంపై ప్రతిపక్ష బీజేపీ తీవ్ర విమర్శలు, ఆరోపణలకు దిగడంతో.. డిప్యూటీ సీఎం శివకుమార్ స్పందించారు. సిట్ దర్యాప్తుపై తనకు నమ్మకం ఉందని, త్వరలోనే ధర్మస్థళపై జరుగుతున్న కుట్ర బయటకు వస్తుందని, ఆ ఆరోపణలు రుజువుకాని పక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా తనతో ఇదే విషయాన్ని స్పష్టం చేశారని శివకుమార్ వెల్లడించారు. అయితే.. ‘‘నేను ఇప్పటికీ ధర్మస్థళ మంజునాథస్వామి భక్తుడినే. ధర్మస్థల వీరేంద్రహెగ్డే చేసిన సేవలను గౌరవిస్తాం. భక్తునికి– దేవునికి ఉన్న సంబంధానికి మనం భంగం కలిగించరాదు. అలాగని నేనేం ధర్మస్థళకు అనుకూలంగానో, వ్యతిరేకంగానో మాట్లాడడం లేదు. చట్టానికి ఎవరూ అతీతులు కారని.. చట్టం తన పని తాను చేసుకుపోతుందనే విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఒకవేళ ధర్మస్థళపై నిజంగా కుట్ర జరిగి ఉంటే విచారణలో బయటపడుతుంది. తప్పు ఎవరు చేసినా శిక్ష అనుభవించకతప్పదు. ప్రతిపక్షాల ఆరోపణల నేపథ్యంలో.. ఈ అంశంపై హోం మంత్రి పరమేశ్వర సోమవారం కర్ణాటక అసెంబ్లీలో స్పష్టమైన ప్రకటన చేస్తారు’’ అని శివకుమార్ వెల్లడించారు. గురువారం ధర్మస్థళ తవ్వకాలపై అసెంబ్లీలో హోంమంత్రి పరమేశ్వర్ మాట్లాడారు. ‘‘ఫిర్యాదు ప్రకారం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు, ఆ ప్రాంత ప్రజల డిమాండ్ మేరకు జూన్ 19 సిట్ ను ఏర్పాటుచేసి విచారణకు ఆదేశించాం. ఇది పూర్తి కావడానికి కాలపరిమితి ఉంటుంది. ఈలోపు సిట్ దర్యాప్తునకు భంగం కలిగించేలా వ్యవహరించకూడదని భావిస్తున్నాం’’ అని అన్నారాయన. 1995-2014 మధ్య తాను పని చేస్తున్న సమయంలో ధర్మస్థళ ఆలయ నిర్వాహకుల ఆదేశాల మేరకు తానే స్వయంగా ఆ మృతదేహాలను పాతిపెట్టినట్లు సదరు వ్యక్తి చెబుతున్నాడు. అందులో మహిళలు, మైనర్ బాలికల మృతదేహాలు అధికంగా ఉన్నాయని, కొందరిపై లైంగిక దాడి జరిగినట్లు ఆనవాళ్లు కూడా ఉన్నాయని మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం కూడా ఇచ్చాడు. ముసుగు ధరించిన ఆ వేగు(Whistleblower)ను.. ‘భీమా’.. ‘చిన్నయ్య’.. అని కర్ణాటక మీడియా వ్యవహరిస్తోంది. విక్టిమ్ ప్రొటెక్షన్ కింద సిట్ అతనికి రక్షణ కల్పిస్తోంది కూడా. ఇప్పటిదాకా నేత్రావతి నదీ తీరం వెంబడి అతను చూపించిన చోట్లలో సిట్ తవ్వకాలు జరిపింది. అందులో రెండు చోట్ల మాత్రమే అస్తిపంజరాలు బయటపడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు ఆ వ్యక్తి. ఇదీ చదవండి: ఆలయ నిర్వాహకులే పూడ్చాలని.. సిట్ నన్ను నమ్మడం లేదుఇదిలా ఉంటే.. తీవ్ర చర్చకు దారితీసిన ధర్మస్థలలో మృతదేహాల కోసం తవ్వకాల కేసులో గురువారం విధానసభ దద్దరిల్లింది. ధర్మస్థల మీద అసత్య ప్రచారం చేస్తున్న ప్రభుత్వం కూకటి వేళ్లతో కూలిపోతుందని బీజేపీ, జేడీఎస్ నాయకులు శాపాలు పెట్టారు. బీజేపీ ఎమ్మెల్యే సునీల్కుమార్ మాట్లాడుతూ.. ‘‘ఇటీవల గుర్తుతెలియని వ్యక్తి 10, 15 ఏళ్ల క్రితం ధర్మస్థల లో వందలాది మృతదేహాలను పూడ్చిపెట్టానని చెప్పడం ద్వారా పవిత్ర ధర్మక్షేత్రానికి చెడ్డపేరు తెచ్చేవిధంగా కుట్ర జరుగుతోంది. అస్థికల కోసం తవ్వకాలంటూ హిందూ ధార్మిక కేంద్రాలపై జరుగుతున్న అసత్య ప్రచారం సహించడం సాధ్యం కాదు. ప్రభుత్వం ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. ప్రజలు ఆవేశం చెంది పోరాటం చేసే స్థితి తీసుకురాకూడదు.. .. ప్రభుత్వం ఏం చేస్తోంది? ఇది దర్యాప్తా, హిందూ పుణ్యక్షేత్రంపై జరుగుతున్న కుట్రలో అసత్య ప్రచారంలో కాంగ్రెస్ యూట్యూబర్లు, ఇతర మతస్తుల చేతిలో కీలుబొమ్మగా మారుతోందా?’’ అని ధ్వజమెత్తారు. ఈ క్రమంలో సిట్ దర్యాప్తు చేయడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని.. అలాగని ధర్మస్థళను టార్గెట్ చేయడం సరికాదన్నారు. గుర్తుతెలియని వ్యక్తి మాటలు విని గుంతలు తవ్వే పనిచేస్తున్నారని, ధర్మస్థల పవిత్రతను కాపాడటానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఇన్ని రోజులు ఎన్ని గుంతలు తవ్వారు, ఎన్ని అస్థిపంజరాలు దొరికాయి అనేది చెప్పాలని సునీల్కుమార్ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం ఈ అంశంపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. -
పైన దేవుడు చూస్తున్నాడు.. అనుభవిస్తారు: చెవిరెడ్డి
సాక్షి, విజయవాడ: అక్రమ మద్యం కేసులో సిట్ అధికారులు తనను అక్రమంగా ఇరికించారని చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అన్నారు. ‘‘మా కుటుంబం మద్యం జోలికి పోలేదు. వేద పాఠశాల నడుపుతున్నా.. నేనెప్పుడూ అబద్ధం చెప్పను.. పైన దేవుడు చూస్తున్నాడు.. అనుభవిస్తారు’’ అంటూ కోర్టు నుంచి జైలుకి తరలించే సమయంలో ఆయన కన్నీరు పెట్టుకున్నారు.గాడ్ ఈజ్ సుప్రీం.. నేచర్ ఈజ్ సుప్రీం. అక్రమంగా కేసులు పెట్టిన అధికారులు తప్పకుండా శిక్ష అనుభవిస్తారు. మద్యం ముట్టలేదు.. అమ్మలేదు. అమ్మనురాజకీయంగా కక్ష ఉంటే మరో కేసు మోపండి. చిన్నప్పటి నుంచి దూరం పెట్టిన మద్యాన్ని రుద్దడం భావ్యం కాదు. ప్రభుత్వ పెద్దలు తప్పు చేస్తున్నారు. దానిని కప్పిపుచ్చుకోవడానికి మరో తప్పు చేస్తున్నారు’’ అంటూ చెవిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.కాగా, లిక్కర్ అక్రమ కేసులో అరెస్టైన వారికి ఏసీబీ కోర్టు రిమాండ్ పొడిగించింది. ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు మిగిలిన వారికి ఆగస్ట్ 26 వరకూ రిమాండ్ను పొడిగించింది. -
కేసీఆర్ కూతురు, అల్లుడు ఫోన్లు కూడా ట్యాప్ చేశారు: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ ప్రభుత్వ హయాంలో భారీ ఎత్తున ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కేంద్ర హోంశాఖ సహాయం మంత్రి బండి సంజయ్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన స్టేట్మెంట్ను సిట్ అధికారులు రికార్డు చేశారు. విచారణ అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. ఎక్కువగా తన ఫోన్ కాల్స్నే ట్యాప్ చేశారన్నారు.‘‘ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి గతంలోనే నోటీస్ ఇచ్చారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో విచారణకు ఆలస్యం జరిగింది. అధికారులు నా ఫోన్ ట్యాపింగ్ వివరాలు చూపెట్టిన తర్వాత నేను షాక్కు గురయ్యాను. మావోయిస్టుల ఫోన్ ట్యాపింగ్ చేయాల్సింది నా ఫోన్ ట్యాప్ చేశారు. హరీష్రావు, రేవంత్ రెడ్డి ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. వావి వరసలు లేకుండా ఫోన్ ట్యాప్ చేశారు. కేసీఆర్ కుమార్తె కవిత, అల్లుడి ఫోన్ కూడా ట్యాప్ చేశారు’’ అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.నా దగ్గర ఉన్న రిపోర్ట్ ఇచ్చాను. సిట్ అధికారులు చెప్పిన విషయాలను విని షాక్కు గురయ్యా.. పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పార్టీ కార్యాచరణను ముందుగానే సమాచారం తెలుసుకుని భగ్నం చేసేవారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఎవరు కూడా నార్మల్ కాల్ మాట్లాడుకోలేదు. వాట్సాప్ కాల్, సిగ్నల్ ద్వారానే మాట్లాడుకునే వారు. మావోయిస్టుల లిస్ట్లో మా పేర్లు పెట్టి మా ఫోన్లు ట్యాప్ చేశారు. వేలాది ఫోన్లు ట్యాప్ చేశారు. అక్కడ లిస్ట్ అంతా ఉంది..ఎస్ఐబీను సొంత అవసరాలకు కేటీఆర్ వాడుకున్నారు. కేసీఆర్ దగ్గర పనిచేసిన మంత్రుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. సినిమా వాళ్లు, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. గ్రూప్-వన్ పేపర్ లీకేజీ ఆందోళన సమయంలో పోలీసులు ముందుగానే మా ఇంటికి పోలీసులు వచ్చారు. గ్రూప్-వన్ లీకేజీ కేసు విచారిస్తున్న జడ్జి ఫోన్ కూడా ట్యాప్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ చేసిన అధికారులు ఫాల్తు గాళ్ళు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వారిని కాపాడే ప్రయత్నం చేస్తుంది.వ్యాపార లావాదేవీలు చేసిన పెద్ద వ్యాపారుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. ఖమ్మం ఎంపీ అభ్యర్థి దగ్గర పట్టుకున్న రూ.7 కోట్లు ఎక్కడ?. రూ.20 కోట్లు పట్టుకున్న దగ్గర రెండు కోట్లు మాత్రమే చూపించారు. రేవంత్ రెడ్డి ఎందుకు ఈడీకి లేఖ రాయడం లేదు. సిట్ అధికారులు నిజాయితీ గల వారు. సిట్ అధికారుల మీద అనుమానం లేదు కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద అనుమానం ఉంది. కేసీఆర్, రేవంత్ ఇద్దరు ఒక్కటే.ముఖ్యమంత్రి ఫోన్ను గతంలో ట్యాప్ చేశారు కదా... ఆయనను పిలిచి విచారణ చేస్తారా?. ఒక్కో కేసుకు ఢిల్లీలో ముఠాలు అప్పగిస్తున్నారు. డ్రగ్స్, కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ ఇలా ప్రతీ కేసుకు ఢిల్లీ కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంగా మారింది. కేసీఆర్కి రేవంత్ రెడ్డి క్లీన్ చిట్ ఇచ్చారు. కేసీఆర్కు సీఎం రేవంత్ క్లీన్ చిట్ ఇవ్వడానికి ఎవరిచ్చారు అధికారం?. ఫోన్ ట్యాపింగ్పై పోలీసులు క్లీన్ చిట్ ఇవ్వాలి.. సీఎం ఎలా ఇస్తారు?. ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి ఇవ్వడానికి అభ్యంతరం ఏంటి?. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు కేవలం తెలంగాణలోనే ఉన్నాయి. సిట్ విచారణ మీద నమ్మకం లేదు’’ అని బండి సంజయ్ అన్నారు. -
కేసిరెడ్డి కేసులో.. బాబుకు ఊహించని దెబ్బ
-
రూ. 11 కోట్ల నగదు స్వాధీనం కేసు.. ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు
విజయవాడ: సిట్ జప్తు చేసిన రూ. 11 కోట్లు అంశానికి సంబంధించి నేడు(సోమవారం, ఆగస్టు 4వ తేదీ) ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మాచవరం ఎస్బీఐలో ఆ నగదును ఎప్పుడు డిపాజిట్ చేశారో తేదీ, సమయం తెలిపాలని కోర్టు ఆదేశించింది. నగదు జమ రశీదులకు సంబంధించి వీడియో, ఫోటో క్లిప్పింగ్స్ అందించాలని ఆదేశాల్లో పేర్కొంది. తదుపరి చర్యల కోసం బ్యాంకుకు ఈ నగదు పంపించేముందు తీసిన ఫోటోలు లేదా పంచనామాలు కోర్టుకు ఇవ్వాలని పేర్కొంది. కాగా, రంగారెడ్డి జిల్లాలోని ఓ ఫాంహౌస్లో సిట్ జప్తు చేసిన రూ.11 కోట్లు రాజ్ కేసిరెడ్డికి చెందినవేనంటూ నమ్మించడానికి చేసిన యత్నం ఏసీబీ కోర్టు సాక్షిగా శనివారం బెడిసి కొట్టడంతో అప్పటికప్పుడు మరో నాటకానికి తెర లేపారు. బ్యాంకులో డిపాజిట్ చేసిన రూ.11 కోట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో పంచనామా నిర్వహించాలని, ప్రతీ నోటుపై ఉన్న సీరియల్ నంబర్ను రికార్డ్ చేయాలని సిట్ దర్యాప్తు అధికారిని ఏసీబీ కోర్టు ఆదేశించింది. డిపాజిట్ చేశామని చెబుతున్నందున అందుకు సంబంధించిన రిసీప్ట్ (కౌంటర్ ఫైల్) చూపాలని కోరగా, తమ బండారం బయట పడుతుందని దర్యాప్తు అధికారి పత్తా లేకుండా పోయిన విషయం తెలిసిందే.ఇదీ చదవండి: బేతాళ కుట్రలో మరో అంకం -
SIT బండారం బట్టబయలు.. మధ్యలో రెచ్చిపోతున్న బీజేపీ ఎంపీ
-
SIT సీన్ రివర్స్.. కోర్టు నుంచి పరార్.. అబ్బా కథ అడ్డం తిరిగిందే
-
Editor Comment: అడ్డగోలు బరితెగింపు.. ఆ నోట్ల కట్టలు నోళ్లు తెలిస్తే..
-
అడ్డంగా దొరికిపోయిన సిట్.. రద్దయిన 2000 నోట్లు ఎలా వచ్చాయి.?
-
అడ్డంగా దొరికిన సిట్!
సాక్షి, అమరావతి: మద్యం అక్రమ కేసులో సిట్ అడ్డంగా దొరికిపోయింది. ప్రధాన నిందితుడు రాజ్ కేసిరెడ్డికి చెందిన డబ్బు అంటూ సిట్ అధికారులు రంగారెడ్డి జిల్లాలోని ఓ ఫాంహౌస్లో జప్తు చేసిన రూ.11 కోట్లపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ ఏసీబీ కోర్టు శనివారం కీలక ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకులో డిపాజిట్ చేసే ముందు ఆ రూ.11 కోట్లకు పూర్తి స్థాయిలో పంచనామా నిర్వహించాలని సిట్ దర్యాప్తు అధికారిని ఏసీబీ కోర్టు ఆదేశించింది. ప్రతీ నోటుపై ఉన్న సీరియల్ నెంబర్ను రికార్డ్ చేయాలని స్పష్టం చేసింది. ఒకవేళ డబ్బును సిట్ ఇప్పటికే డిపాజిట్ చేసి ఉంటే, ఆ మొత్తాన్ని ఇతర కరెన్సీ నోట్లతో కలపకుండా వేరుగా ఉంచాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాచవరం బ్రాంచ్ను కోర్టు ఆదేశించింది. తాము తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు ఆ నోట్లను వేరుగానే ఉంచాలని తేల్చి చెప్పింది. ఈ మేరకు ఏసీబీ కోర్టు న్యాయాధికారి పి.భాస్కరరావు ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి రూ.11 కోట్ల జప్తు వ్యవహారంలో సిట్ అడ్డంగా దొరికిపోయింది. ఈ డబ్బు కేసిరెడ్డిదేనని సిట్ చెప్పగా, ఆ డబ్బుతో తనకు ఎలాంటి సంబంధం లేదని కేసిరెడ్డి ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాక 2024 ఎన్నికలకు ముందే ఈ రూ.11 కోట్లను దాచిపెట్టినట్లు సిట్ చెబుతోందని, ఆ కరెన్సీ నోట్లు ఏ సంవత్సరానివో నిగ్గు తేలాలంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రికార్డులను పరిశీలించాలని ఆయన కోర్టును కోరారు. రూ.11 కోట్ల కరెన్సీ నోట్లపై ఉన్న సీరియల్ నెంబర్లను రికార్డ్ చేసేందుకు ఓ అడ్వొకేట్ కమిషనర్ను నియమించాలని కోరుతూ రాజ్ కేసిరెడ్డి తాజాగా ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు శనివారం విచారణ జరిపింది. బ్యాంక్లో డిపాజిట్ చేసి ఉంటే స్లిప్ చూపమనండి..కేసిరెడ్డి తరఫు న్యాయవాది శెట్టిపల్లి దుష్యంత్రెడ్డి వాదనలు వినిపిస్తూ, ఆ కరెన్సీ నోట్లపై ఉన్న సీరియల్ నెంబర్లను వీడియోగ్రఫీ చేసి, దాని ఫుటేజీని కోర్టు ముందుంచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. తమకున్న సమాచారం మేరకు ఆ రూ.11 కోట్లను సిట్ ఇప్పటి వరకు బ్యాంకులో జమ చేయలేదన్నారు. ఆ నోట్లపై ఉన్న సీరియల్ నెంబర్ల విషయంలో పిటిషనర్ అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో, ఆ నోట్లను సిట్ తారుమారు చేసే అవకాశం ఉందన్నారు. సిట్పై తమకు ఏ విధమైన నమ్మకమూ లేదన్నారు. దీంతో డబ్బు డిపాజిట్ చేశారా? లేదా? అన్న విషయాన్ని నిర్ధారించుకునేందుకు కోర్టు సిట్ దర్యాప్తు అధికారి (ఐవో)ని పిలిపించింది. కోర్టు ముందు హాజరైన దర్యాప్తు అధికారి తాము రూ.11 కోట్లను బ్యాంకులో డిపాజిట్ చేసేశామని చెప్పారు. ఈ సమయంలో దుష్యంత్ జోక్యం చేసుకుంటూ, సిట్ను నమ్మలేమని, ఒకవేళ రూ.11 కోట్లను డిపాజిట్ చేసి ఉంటే డిపాజిట్కు సంబంధించిన బ్యాంక్ స్లిప్పును చూపించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. బ్యాంక్ స్లిప్పును 5 నిమిషాల్లో వాట్సాప్ ద్వారా తెప్పించుకోవచ్చన్నారు. డిపాజిట్ చేసిన డబ్బును వేరుగా ఉంచేలా బ్యాంకును ఆదేశించాలని ఆయన కోరారు. దీంతో దర్యాప్తు అధికారి అర్ధగంటలో డిపాజిట్ స్లిప్పును తీసుకొస్తానని వెళ్లారు. గంటలు గడిచినా కూడా ఆ అధికారి తిరిగి రాలేదు. ఆయన పత్తా లేకుండా పోవడంతో కోర్టు ఈ మొత్తం వ్యవహారంలో ఏదో తేడా ఉందన్న ప్రాథమిక నిర్ణయానికి వచ్చింది. దర్యాప్తు అధికారి రాకపోవడంతో డిపాజిట్ చేసిన డబ్బును వేరుగా ఉంచాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాచవరం బ్రాంచ్ అధికారులను ఆదేశించింది. అలాగే డిపాజిట్ చేసిన నోట్ల పంచనామా చేయాలని దర్యాప్తు అధికారిని ఆదేశించింది. -
ఆ నోట్ల కట్టలు నోళ్లు తెరిస్తే..?
చాలా విషయాలు బయటకొస్తాయి. ఆ నోట్ల కట్టలపై నిజాయితీగా విచారణ జరిగితే మద్యం కేసు కడుపులో దాక్కున్న గుట్టు రట్టవుతుంది. కట్టు కథలు ఎవరు చెబుతున్నారో, పుక్కిటి పురాణాలను ఎవరు వల్లెవేస్తున్నారో తేలిపోతుంది. అంతేకాదు, అపవిత్ర రాజకీయ మైత్రీబంధాల బండారం కూడా బద్దలు కావచ్చు. పన్నెండు అట్టపెట్టెల్లోని 11 కోట్ల సంగతి ఇది.ఆంధ్రప్రదేశ్ పోలీసుల సిట్ బృందం చెప్పిన లెక్క. జగన్ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ఎక్సైజ్ పాలసీలో కుంభ కోణం ఉన్నదని దర్యాప్తు కోసం సీఐడీకి అప్పగించి ఏడాది పూర్తయింది. ‘సిట్’ రంగప్రవేశం చేసి ఆరు నెలలయింది. ఈ మధ్యనే ఒక అసంపూర్ణ ఛార్జిషీట్ వేశారు. ఆయన చెప్పాడని ఈయన పేరు, ఈయన చెప్పాడని ఆయన పేరు చొప్పున ఓ నలభై ఎనిమిది మందిని ఇందులో నిందితులుగా చేర్చారు.త్వరలో ఇంకో చార్జిషీట్ను వేస్తారట! అందులో ఇంకొంత మందిని చేరుస్తారేమో! ఈ కుంభకోణం ద్వారా ఆనాటి ప్రభుత్వం 3,500 కోట్ల రూపాయల మేరకు అవినీతికి పాల్పడిందని సిట్ ఆరోపిస్తున్నది. నిందితులుగా నమోదైన వారిలో కొందరి చేత నయానో భయానో తమ స్క్రిప్టుకు అనుకూలంగా చెప్పించుకుంటున్నారనీ, కొందరు చెప్పిన వాఙ్మూలాలకు విరుద్ధంగా రాసుకొని బలవంతంగా సంతకాలు తీసుకుంటున్నారనీ వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ రకమైన వాఙ్మూలాల మీదనే కథ నడిపిస్తున్నారు తప్ప ఇంతవరకూ తమ ఆరోపణలకు బలం చేకూర్చే వస్తుగతమైన, సాంకేతికమైన, లిఖిత పూర్వకమైన ఆధారాలేవీ సిట్ సంపాదించలేక పోయిందనేది యథార్థం. ఇక తుది ఛార్జిషీట్ను వేయవలసిన దశలో 12 అట్టపెట్టెలు, 11 కోట్ల నోట్ల కట్టలు అనే వృత్తాంతాన్ని ముందుకు తెచ్చింది.వరుణ్ అనే నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్ శివార్లలోని ఒక ఫామ్హౌస్లో ప్రధాన నిందితు డైన రాజ్ కేసిరెడ్డి ఆదేశాలతో దాచిపెట్టిన 11 కోట్ల రూపాయలను గత బుధవారం సీజ్ చేసినట్టు న్యాయస్థానానికి సిట్ చెప్పింది. 2024 జూన్లోనే తాము ఈ డబ్బును అక్కడ పెట్టి నట్టు కూడా వరుణ్ చెప్పినట్టు సిట్ తెలియజేసింది. ఈ 11 కోట్లు కూడా లిక్కర్ కుంభకోణం డబ్బేనని సిట్ వాదన. దీనిపై స్పందిస్తూ రాజ్ కేసిరెడ్డి కోర్టులో ఒక పిటిషన్ వేశారు. సిట్ సీజ్ చేసినట్టు చెబుతున్న ఫామ్హౌస్ తీగల విజయేందర్రెడ్డి అనే వ్యాపారవేత్తదని, ఆయన టర్నోవర్ కోట్ల రూపాయల్లో ఉంటుందని కూడా కేసిరెడ్డి తన పిటిషన్లో తెలిపారు. విజయేందర్రెడ్డికి చెందిన ఒక ఆస్పత్రిలో తన భార్య చిన్న భాగస్వామి మాత్రమేనని, అంతకుమించి ఆ ఫామ్హౌస్తో తనకు ఎటువంటి సంబంధం లేదని ఆయన వాదించారు. సీజ్ చేసిన సొమ్ముకూ, తనకూ ఎటువంటి సంబంధం లేదని చెబుతూ 2024 జూన్ నుంచి ఫామ్హౌస్లో ఉంచినట్టు చెబుతున్న నోట్లను వీడియో తీయించాలని, ఆ సీరియల్ నెంబర్ల ఆధారంగా ఆ నోట్లను ఎప్పుడు విడుదల చేశారో రిజర్వు బ్యాంకు ద్వారా సమాచారం తెప్పించుకోవాలని ఆయన అభ్యర్థించారు. 2024 జూన్ తర్వాత విడుదల చేసినట్టు తేలితే ప్రాసిక్యూషన్ కథనం తేలిపోతుందనీ, తనకు న్యాయం జరుగుతుందనీ ఆయన వాదించారు. దీనిపై జడ్జి స్పందిస్తూ ఆ నోట్ల కట్టలను ఫోటోలు తీయించాలని దర్యాప్తు అధికారిని ఆదేశించారు. ఫోటోలు, వీడియోలు తీయకుండానే ఆ నోట్ల కట్టలను సిట్ బ్యాంకులో డిపాజిట్ చేసే ప్రయత్నం చేస్తున్నదని, దాన్ని అడ్డుకోవాలని, కోర్టు కమిషన్ ఆధ్వర్యంలో వీడియో తీయించాలని కేసిరెడ్డి న్యాయవాదులు శనివారం నాడు మరో పిటిషన్ వేశారు. తాము అప్పటికే కోర్టులో నగదు డిపాజిట్ చేశామని దర్యాప్తు అధికారి కోర్టుకు చెప్పారు. అలా చేసి వుంటే ఆ లావాదేవీ తాలూకు కౌంటర్ ఫాయిల్ చూపెట్టాలని కేసిరెడ్డి న్యాయవాదులు డిమాండ్ చేశారు. దర్యాప్తు అధికారి ఇప్పుడు తన దగ్గర లేదన్నారు. కనీసం వాట్సాప్లోనైనా పంపించాలని వారు కోరారు. చాలాసేపటి వరకు ఎటువంటి వాట్సాప్ సమాచారం రాలేదు. అంటే బ్యాంకులో డిపాజిట్ చేయకుండానే చేసినట్టు కోర్టులో సిట్ చెప్పి ఉండాలి. పిటిషన్ విచారించిన జడ్జి కీలకమైన ఆదేశాలను సిట్కు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు జారీ చేశారు. సదరు 11 కోట్లను ప్రత్యేకంగా ఉంచాలనీ, మిగతా డబ్బుతో కలపొద్దనీ చెప్పారు. అలాగే పంచనామా చేసి ఆ నోట్ల సీరియల్ నంబర్లను నమోదు చేయాలని, ఈ ప్రక్రియను వీడియో తీయాలని సిట్కు ప్రత్యేకంగా తెలిపారు.ఆ నోట్లను వీడియో తీయాలని ముందురోజు జడ్జి చెప్పినప్పటికీ, లెక్క చేయకుండా ఆ నోట్లను హడావిడిగా బ్యాంకులో డిపాజిట్ చేశామని ఎందుకు చెప్పినట్టు? ఒకసారి బ్యాంకులో డిపాజిట్ చేసిన తర్వాత, ఆ సొమ్ము మిగతా డబ్బులో కలిసిన తర్వాత దానిపై విచారణ కుదరదనే ఎత్తుగడను వేశారని అనుకోవాలా? సిట్ వ్యవహరించిన తీరు పారదర్శకంగా లేదు. న్యాయబద్ధంగా దర్యాప్తు చేస్తున్నట్టుగా లేదు. ఈ కేసులో ఇంతవరకూ ఒక్క సాక్ష్యాన్ని కూడా సమర్పించలేకపోయారని కోర్టు అక్షింతలు వేసినందువల్లనే ఈ గూడుపుఠాణీ జరిపినట్టు నిందితులు ఆరోపిస్తే దాన్ని పూర్వ పక్షం చేయగలరా? దర్యాప్తు సంస్థ నిష్పాక్షికంగా పని చేస్తున్నట్టయితే, కోర్టు కమిషన్ సమక్షంలో రిజర్వు బ్యాంకు ప్రతినిధుల సమక్షంలోనే వీడియో తీసి, నోట్ల సీరియల్ నెంబర్లను నమోదు చేసి అనంతరం బ్యాంకులో డిపాజిట్ చేసి ఉండేవారు. ఎవరూ అడగనవసరం లేదు. అది వారి కనీస బాధ్యత. ఈ నోట్ల కట్టల వ్యవహారంలో ఆది నుంచి అంతంవరకూ సిట్ వ్యవహారం తీరు పారదర్శకంగా లేదు. ‘విశ్వసనీయ’ సమాచారం మేరకు పక్క రాష్ట్రంలోకి వెళ్ళి డబ్బు సీజ్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ రాష్ట్ర పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వడమో, వారిని కూడా వెంటబెట్టుకుని వెళ్లడమో చేసి ఉండవలసింది. లేదంటే సీబీఐ లేదా ఈడీ వంటి కేంద్ర సంస్థలకు సమాచారం అందించి ఉండవలసింది. దొరికింది నల్లధనం కనుక ఆదాయం పన్ను శాఖకు కూడా సమాచారం ఇచ్చి ఉండవలసింది. దొరికిన నల్లడబ్బు ఒక పెద్ద కేసులో సాక్ష్యంగా చూపెడుతున్నారు కనుక ఈమాత్రం పారదర్శకత లేకపోతే అదొక కుట్రపూరిత వ్యవహారంగానే జనం భావిస్తారు. ఇప్పుడు ఏసీబీ కోర్టు తాజా ఆదేశాల తర్వాత సిట్ వారి స్క్రిప్టు ఏ మలుపులు తిరుగుతుందో చూడవలసి ఉన్నది.పొరుగు రాష్ట్రానికి వెళ్లి కుట్రపూరిత వ్యవహారాలకు పురుడు పోయాలంటే అదీ, ఒక వాణిజ్య ప్రముఖుని ఫామ్హౌజ్ కేంద్రంగా జరిపించాలంటే స్థానిక వ్యవస్థల సహకారం లేకుండా సాధ్యపడుతుందనేది అనుమానమే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యవస్థల మధ్య సహకార ధోరణి బాగా ఉన్నట్టే చెబుతున్నారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకొని ప్రజలకు మేలు చేసే పనులు చేస్తే మంచిదే. కానీ ఒక ప్రభుత్వ స్వార్థ రాజకీయాలకు సాయపడే విధంగా వ్యవహరించడం, ఒక ప్రభుత్వంలోని ప్రముఖ వ్యక్తికి మేలు చేయడం కోసం ఒట్టు తీసి గట్టున పెట్టడం ప్రజల్లో చర్చకు దారితీస్తున్నాయి. ‘పుష్ప’ సినిమా విడుదల సమయంలో జరిగిన తొక్కిసలాట, అల్లు అర్జున్ అరెస్టు వగైరాలు తాజా సంఘటనలే. ఆ సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఒక ప్రతిజ్ఞ చేశారు. తాను సీఎం కుర్చీలో కూర్చున్నంతకాలం సినిమా టిక్కెట్ల ధరలు పెంచడానికి, స్పెషల్ షోలు వేయడానికి అనుమతించబోనని ఖండితంగా చెప్పారు. జనం కూడా హర్షించారు. నాయకుడంటే ఈమాత్రం పట్టుదల ఉండాలని అభినందించారు. కానీ ఆరు నెలలు తిరిగే సరికి ఆ పట్టుదల పట్టు తప్పింది. ‘హరిహర వీరమల్లు’ సినిమా టిక్కెట్ రేట్లు పెంచుకోవడానికి, స్పెషల్ షోలు వేసుకోవడానికి అనుమతులు లభించాయి. ఆ సినిమా హీరో పక్కరాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ, వ్యక్తిగత సహకా రాలపై పొలిటికల్ సర్కిల్స్లోనే కాదు, బ్యూరోక్రాట్లు, వ్యాపార వర్గాలు కూడా మాట్లాడుతున్నాయి.రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ – తెలుగుదేశం పార్టీల మధ్య సహకారం కొత్తదేమీ కాదు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలోనే జగన్మోహన్రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీ స్థాపించుకున్న దగ్గర నుంచి ఈ పార్టీల బంధం కొనసాగుతున్నది. ఆయన మీద కేసులు వేయడం, జైలుకు పంపించడంలోనూ కాంగ్రెసు నాయకత్వంలోని కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలు, చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం – యెల్లో మీడియాలు సమష్టిగానే పనిచేశాయి. రాష్ట్ర విభజన తర్వాత 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని కాంగ్రెసు పార్టీ తన విజయావకాశాలను కాలదన్నుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తెలంగాణ క్షేత్రస్థాయిలో కేసీఆర్కు మళ్లీ ఆదరణ పెరుగుతున్నదని సంకేతాలు అందుతున్న నేపథ్యంలో చంద్రబాబు సరికొత్త ఆలోచనలు చేస్తున్నట్టు సమాచారం. కేసీఆర్ను అధికారానికి దూరంగా ఉంచడం కోసం ఏపీ మాదిరిగానే టీడీపీ, జనసేనలు బీజేపీ కూటమి (ఎన్డీఏ)గా పోటీ చేస్తే ప్రయోజనమా? లేక బీజేపీని ఒక్కదాన్నే పోటీలో నిలిపి తాము వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే ప్రయోజనమా అనే అంశంపై ఆయన మల్లగుల్లాలు పడుతున్నట్టు విశ్వసనీయ సమాచారం.ఆంధ్రప్రదేశ్లోని కాంగ్రెస్ పార్టీ విభాగం ఆచరణలో ఎన్డీఏలో నాలుగో పార్టీగా వ్యవహరిస్తున్నదనే భావన సామాన్య ప్రజల్లోనే కాదు, ఆ పార్టీ కార్యకర్తల్లో కూడా ఉన్నది. ఒకపక్క రాహుల్గాంధీ ఎన్డీఏపై రాజీలేని పోరాటానికి కసరత్తులు చేస్తు న్నారు. ఢిల్లీ గద్దె కోసం నాలుగో పానిపట్టు యుద్ధానికి సిద్ధమవు తున్నారు. బీజేపీపై సైద్ధాంతిక పోరాటాన్ని కూడా ప్రారంభించి అస్త్రశస్త్రాలను ఆవాహన చేసుకుంటున్నారు. ఇదే సమయంలో బీజేపీ ముసుగులో ఉన్న ఓ రాజ్యసభ సభ్యుడు కాంగ్రెస్ ముఖ్య మంత్రికి మద్దతుగా రంగంలోకి దిగి రెచ్చి పోవడం కాంగ్రెస్ పార్టీకి మేలు చేసే విషయమైతే కాదు. బీజేపీ పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేశ్కు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి 16 వేల కోట్ల కాంట్రాక్టు ఇచ్చాడని బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ ఆరోపించారు. దాన్ని ఖండించడానికి, వివరణ ఇచ్చుకోవడానికి సిఎం రమేశ్కు ఉన్న హక్కును ఎవరూ కాదనలేరు.కానీ, ఆయన అంతటితో ఆగిపోకుండా బీఆర్ఎస్ బండారం బయటపెడతానని హెచ్చరించడం, బీజేపీలో తమ పార్టీని విలీనం చేయడానికి కేటీఆర్ తన సహాయాన్ని అర్థించాడని చెప్పడం బూమెరాంగయింది. కేసీఆర్ స్థాయి నేత తన పార్టీని ఒక జాతీయ పార్టీలో విలీనం చేయాలని భావిస్తే సీఎం రమేశ్ లాంటి వాళ్ల సహాయం అవసరమా? ఇటువంటి నాసిరకం ఆరోపణను ఎవరూ విశ్వసించకపోగా ఒకరకంగా బీఆర్ఎస్కు మేలు చేసింది. బీజేపీ – బీఆర్ఎస్ల మధ్య అవగాహన ఉన్నదని నమ్మించేందుకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాలకు రమేశ్ ప్రకటన గండి కొట్టింది.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
‘అదే జరిగితే నిజాలు బయటకు.. సిట్ అధికారుల్లో కలవరం’
సాక్షి, తాడేపల్లి: ప్రభుత్వం సృష్టించిన లిక్కర్ స్కాంలో తాజాగా పట్టుబడినట్లు చెబుతున్న రూ.11 కోట్లు స్వాధీనం విషయంలో సిట్ అధికారులు వ్యవహరించిన తీరుపై అనేక అనుమానాలు కలుగుతున్నాయని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం.మనోహర్రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ సొమ్ముకు, లిక్కర్ స్కాంకు సంబంధాన్ని చూపించడంలో సిట్ అధికారులు పంచనామా రికార్డులో సరైన ప్రొసీజర్స్ను పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.లేని స్కాంలో ఆధారాలను సృష్టించే క్రమంలో సిట్ అధికారులు తప్పుపై తప్పు చేస్తున్నారని అన్నారు. హైదరాబాద్లో సిట్ స్వాధీనం చేసుకున్న సొమ్ముకు సంబంధించి కరెన్సీ నెంబర్లను రికార్డు చేయాలని, ఆ డబ్బును బ్యాంక్లో మిగిలిన కరెన్సీతో కలపకుండా ప్రత్యేకంగా ఉంచాలంటూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో సిట్ అధికారుల్లో కలవరం మొదలైందని అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే..హైదరాబాద్లోని సులోచనా ఫార్మ్ ఫాంహౌస్లో 2024 జూన్లో రాజ్ కసిరెడ్డి దాచిపెట్టిన లిక్కర్ స్కాంకు సంబంధించిన పదకొండు కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లుగా సిట్ అధికారులు ప్రకటించారు. పట్టుబడిన నగదును కోర్ట్కు సమర్పించారు. సిట్ ఆరోపణలపై ఈ కేసులో నిందితుడుగా ఉన్న రాజ్ కసిరెడ్డి ఈ సొమ్ము తనకు చెందినది కాదని న్యాయస్థానానికి స్పష్టం చేశారు.సదరు ఫాం హౌస్ యజమానులుగా ఉన్న తీగల విజయేందర్రెడ్డికి ఇంజనీరింగ్ కాలేజీలు, దేశ వ్యాప్తంగా డయాగ్నసిస్ సెంటర్లు, హాస్పటల్స్ ఉన్నాయి. వారికి వందల కోట్ల రూపాయల టర్నోవర్ చేసే వ్యాపారాలు ఉన్నాయి. వారు తనకు బినామీలు అని సిట్ ఆరోపించడం అన్యాయమంటూ ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. నలబై అయిదేళ్ళకు పైగా వారు వ్యాపారాలు నిర్వహిస్తుంటే, నలబై ఏళ్ళ వయస్సు ఉన్న నాకు వారు బినామీలు అని చెప్పడం ఎంత వరకు సమంజసమని రాజ్ కసిరెడ్డి ప్రశ్నించారు. వారి ఆస్తులను కూడా నావిగా చిత్రీకరించడం బాధాకరణమని తన ఆవేదనను న్యాయస్థానం ముందుంచారు.సిట్ బృందం నిబంధనలను పాటించలేదు:హైదరాబాద్లో పట్టుబడిన రూ.11 కోట్లు కూడా వరుణ్కుమార్ అనే వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు పట్టుకున్నామని సిట్ అధికారులు చెబుతున్నారు. లిక్కర్ స్కాంపై 23.9.2024న ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. వరుణ్ కుమార్ అనే వ్యక్తిపై 21.12.2024న కేసు నమోదు చేశారు. విట్నెస్ కింద నోటీస్ ఇచ్చి వాగ్మూలం నమోదు చేశారు. దీనినే కోర్ట్కు సమర్పించారు. దీనిలో తీగల విజయేందర్రెడ్డి, తీగల బాల్ రెడ్డిని కూడా 17.4.2025న సాక్షులుగా పిలిచి స్టేట్మెంట్ తీసుకున్నారు. ఆ రోజు విచారించిన దర్యాప్తు అధికారులే నేటికీ సిట్లో కొనసాగుతున్నారు. ఆనాడు విచారణ సందర్భంగా ఈ డబ్బు విషయం ఎక్కడా సిట్ రికార్డుల్లో ప్రస్తావించలేదు.అదే దర్యాప్తు అధికారి వరుణ్ కుమార్ను విచారిస్తే ఈ సొమ్ము బయటపడిందని తాజాగా చెప్పడం వెనుక కుట్ర కోణం ఉంది. గతంలో అదే వ్యక్తులను విచారించినప్పుడు ఈ డబ్బు ప్రస్తావన ఎందుకు రాలేదు.? హటాత్తుగా రాజ్ కసిరెడ్డి బెయిల్ విచారణ దశలో ఉండగా ఎలా బయటపడింది? పద్నాలుగు ఏ4 కాగితాలు పెట్టే బాక్స్ల్లో కొత్త కొత్త నోట్లతో ఈ సొమ్ము దొరికింది. ఏసీబీ కేసుల్లో ఎవరినైనా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న సందర్భాల్లో ప్రతి నోట్పైనా ఉన్న నెంబర్ను రికార్డు చేస్తారు.వాటిని కోర్ట్కు సమర్పిస్తారు. కానీ ఈ కేసులో పట్టుబడిన పదకొండు కోట్ల రూపాయలకు చెందిన కరెన్సీ నోట్ నెంబర్లను ఎందుకు నోట్ చేయలేదు? వీడియో ఫుటేజీని ఎందుకు రికార్డు చేయలేదు? అలాగే సులోచనా ఫార్మ్ ఫాంహౌస్లో 2024 నుంచి సిసి కెమేరా ఫుటేజీని ఎందుకు సేకరించలేదు? దీనిపైన ప్రజల్లో అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఈ కేసులో నిందితులకు బెయిల్ రానివ్వకుండా చేయడానికి చేస్తున్న కుట్ర అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.ఆ కరెన్సీ విషయంలో సిట్ ఎందుకు కంగారు పడుతోంది..?విజయేందర్ రెడ్డిని బెదిరించి వారికి చెందిన వ్యాపార సంస్థల నుంచి తెచ్చిన డబ్బును పట్టుకున్నారా లేక ప్రభుత్వమే ఒక ప్లాన్ ప్రకారం ఆ సొమ్మును సమకూర్చి కేసును పక్కదోవ పట్టిస్తోందా? అనే అనుమానాలు ఉన్నాయి. రాజ్ కసిరెడ్డి కోర్ట్లో మాట్లాడుతూ ఆ పదకొండు కోట్లు నేనే నా చేతితో ఇచ్చాను అని చెబుతున్నారు. ఆ సొమ్ముకు సంబంధించిన ఫింగర్ ప్రింట్స్ను రికార్డు చేయండి. ఆ కరెన్సీ ఏ సమయంలో ఆర్బీఐ ముద్రించారో దాని నెంబర్లపై దర్యాప్తు చేయించాలని కోర్టుకు విన్నవించారు. దీనిపై కోర్టు నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.ప్రతి కరెన్సీ నోట్ను గుర్తించి పంచనామా నివేదికలో రికార్డు చేయాలని ఆదేశించింది. బ్యాంకుకు జమ చేసి ఉంటే, మిగిలిన కరెన్సీతో కలపకుండా ప్రత్యేకంగా ఉంచాలని కూడా ఆదేశించింది. బ్యాంక్ వద్ద పోలీసులు రాత్రి నుంచే భారీ బందోబస్త్ను ఏర్పాటు చేశారు. రాత్రే బ్యాంకుకు జమ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఆ కరెన్సీపై విచారణ జరిగితే నిజాలు బయటకు వస్తాయని సిట్ అధికారులు కంగారు పడుతున్నారా? వాటి విషయంలో సిట్ బృందం వ్యవహరిస్తున్న తీరు అనేక అనుమానాలకు తావిస్తోంది. -
దొరికిపోతారనే భయంతో సిట్ కుట్రలు
-
లిక్కర్ కేసులో సిట్ కుట్ర బట్టబయలు.. నోట్ల కట్టల తారుమారు..?
-
Dharmasthala: ధర్మస్థళ మిస్టరీ ఉత్కంఠ.. వెలుగులోకి కీలక ఆధారాలు
సాక్షి,బెంగళూరు: కర్ణాటకలోని మంగళూరు దగ్గరలోని దక్షిణ కన్నడ జిల్లా పరిధిలోని ధర్మస్థళ సామూహిక ఖననం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మూడు రోజులుగా కొనసాగుతున్న తవ్వకాల్లో ఇవాళ మానవ అవశేషాలు బయటపడ్డాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్( స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) బృందం గత సోమవారం నుంచి తవ్వకాలు ప్రారంభించగా.. గురువారం ఆరవ స్థలంలో జరిపిన తవ్వకాల్లో మానవ అవశేషాలు (skeletal remains) వెలుగులోకి వచ్చాయి. ఇప్పటివరకు ఈ కేసులో బయటపడిన తొలి ఆధారం ఇదే కావడం గమనార్హం.1995 నుంచి 2014 మధ్యకాలంలో ధర్మస్థళలో పనిచేశానని, మహిళలు, మైనర్లతో సహా అనేక మృతదేహాలను అక్కడ ఖననం చేశానని చెప్పిన మాజీ పారిశుధ్య కార్మికుడు చెప్పడం, ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేయడం తెలిసిందే. ఇప్పుడు కర్ణాటక ప్రజలతో ‘భీమ’ అని పిలుచుకుంటున్న పారిశుధ్య కార్మికుడు తెలిపిన 15 స్థావరాల వివరాల ఆధారంగా సిట్ ఇప్పటివరకు ఆరు ప్రదేశాల్లో తవ్వకాలు చేసింది. ఐదు ప్రదేశాల్లోనూ ఎలాంటి మానవ అవశేషాలు కనిపించలేదు. 👉ఇదీ చదవండి: ధర్మస్థళ కథేంటీ?అనూహ్యాంగా ఇవాళ నేత్రావతి నది స్నాన ఘట్టానికి అవతలి వైపు ఉన్న ఆరో ప్రాంతంలో తవ్వకాలు జరపగా మానవ అవశేషాలు బయటపడ్డాయి. వాటిని ఫోర్సెన్సిక్ బృందం స్వాధీనం చేసుకుంది. టెస్టులు నిర్వహించి మానవ అవశేషాలు ఎవరివో వెల్లడిస్తామని కర్ణాటక ప్రభుత్వం సామూహిక ఖననం కేసులో ఏర్పాటు ప్రత్యేక దర్యాప్తు బృందం తెలిపింది. సామూహిక ఖననం కేసులో ఆధారాల్ని సేకరించేందుకు ఎస్పీ జితేంద్ర కుమార్ దయామా, పుత్తూరు అసిస్టెంట్ కమిషనర్ స్టెల్లా వర్గీస్ సహా సిట్ అధికారులు సంఘటనా స్థలంలో ఉన్నారు. డాగ్ స్క్వాడ్ను కూడా మోహరించారు. ఇక గురువారం మానవ అవశేషాలు దొరికిన ప్రాంతం అంతా నీరు చేరింది. భూమిలోతు తవ్వేకొద్ది నీరు బయటపడుతోంది. ఆ నీటిని క్లియర్ చేయడానికి డీజిల్ పంపును ఉపయోగిస్తున్నారు. జేసీబీను కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ కోసం కర్ణాటక ప్రభుత్వం నలుగురు ఐపీఎస్ అధికారులతో కలసి ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను జూలై 19న ఏర్పాటు చేసింది. వారు డా. ప్రణవ్ మహంతి ఐపీఎస్, ఎంఎన్ అనుచేత్ ఐపీఎస్, సౌమ్యలత ఐపీఎస్, జితేంద్ర కుమార్ దయామ ఐపీఎస్. వారికి మరో ఇరవై మంది పోలీసు సిబ్బందిని ఇచ్చింది.కాగా, కార్మికుడు చెప్పిన 15 ప్రదేశాల్లో ఎనిమిది నేత్రావతి నది ఒడ్డున, నాలుగు ప్రదేశాలు నదికి సమీపంలోని హైవే పక్కన ఉన్నాయి. 13వ స్థలం నేత్రావతిని ఆజుకురికి కలిపే రహదారిపై, మిగిలిన రెండు హైవే సమీపంలోని కన్యాడి ప్రాంతంలో ఉన్నాయి. -
Big Question: జైల్లో బాబు రాసిన కథ
-
‘ధర్మస్థళ’ కేసులో దొరకని అవశేషాలు
బెంగళూరు: కర్ణాటకలోని ధర్మస్థళలో జరిగిన సామూహిక ఖననం కేసులో మొదటి రెండు ప్రాంతాల్లో మానవ అవశేషాలకు సంబంధించిన ఆధారాలు లభించలేదని పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇప్పుడు మూడవ ప్రదేశంలో తవ్వకాలు ప్రారంభించింది. 1995 నుంచి 2014 మధ్యకాలంలో ధర్మస్థళలో పనిచేశానని, మహిళలు, మైనర్లతో సహా అనేక మృతదేహాలను అక్కడ ఖననం చేశానని మాజీ పారిశుధ్య కార్మికుడు చెప్పడం, ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేయడం తెలిసిందే. కార్మికుడు తెలిపిన 15 స్థావరాల వివరాల ఆధారంగా సిట్ ఇప్పటివరకు రెండు ప్రదేశాల్లో తవ్వకాలు చేసింది. ఆ రెండు ప్రదేశాల్లోనూ ఎలాంటి మానవ అవశేషాలు కనిపించలేదు. నేత్రావతి నది వెంబడి ఉన్న మొదటి ప్రదేశంలో మంగళవారం తవ్వకాలు నిర్వహించారు. జేసీబీని ఉపయోగించి లోతుగా తవ్వినప్పటికీ ఎలాంటి అవశేషాలు దొరకలేదు. రెండవ స్థలం కూడా అలాగే ఖాళీగా కనిపించింది. ప్రస్తుతం మూడో ప్రాంతంలో తవ్వకాలు జరుగుతున్నాయి. కార్మికుడు చెప్పిన 15 ప్రదేశాల్లో ఎనిమిది నేత్రావతి నది ఒడ్డున, నాలుగు ప్రదేశాలు నదికి సమీపంలోని హైవే పక్కన ఉన్నాయి. 13వ స్థలం నేత్రావతిని ఆజుకురికి కలిపే రహదారిపై, మిగిలిన రెండు హైవే సమీపంలోని కన్యాడి ప్రాంతంలో ఉన్నాయి.చీఫ్ మార్పు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం: హోంమంత్రి ఈ కేసు దర్యాప్తులో సిట్ చీఫ్ సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రణబ్ మొహంతీని మార్చే విషయం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందని కర్ణాటక హోం మంత్రి జి.పరమేశ్వర అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేయడానికి డైరెక్టర్ జనరల్ ర్యాంకుల అధికారుల జాబితాలో మొహంతీ పేరు కూడా ఉండటంతో.. మార్పు విషయమై మీడియా మంత్రిని ప్రశ్నించింది. కేంద్రంలో ఉండి కూడా ప్రత్యేక దర్యాప్తు బృందానికి నేతృత్వం వహించే అవకాశం ఆయనకు ఉంటుందని, ఆయనను కొనసాగించాలా? లేదా మరొకరిని నియమించాలా? అనే విషయం రాష్ట్ర ప్రభుత్వం చర్చించి నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. చట్టం, నియమాలు అనుమతిస్తే ఆయన అక్కడే కొనసాగుతారని, లేదంటే అదే హోదా కలిగిన అధికారిని నియమిస్తామని పరమేశ్వర స్పష్టం చేశారు. సిట్ దర్యాప్తు గురించి ప్రశ్నించగా.. ‘ప్రస్తుతం ఎలాంటి వ్యాఖ్యలు చేయను. దర్యాప్తు పూర్తయి నివేదిక అందిన తరువాత మాట్లాడతాను’అని హోంమంత్రి తెలిపారు. -
నోట్ల కట్టల మాటున బాబు
పాతాళభైరవి సినిమాలో నేపాలీ మాంత్రికుడిని తలదన్నే రీతిలో సీఎం చంద్రబాబు రోజుకో క్షుద్ర రాజకీయానికి తెరతీస్తున్నారు. తాను ఏంచెప్పినా ఎస్ బాస్ అనే పోలీసు అధికారులతో కూడిన సిట్ను మంత్రదండంగా చేసుకుని రాజకీయ కుతంత్రానికి పాల్పడుతున్నారు. సామాన్య ప్రజలనే కాకుండా ఏకంగా న్యాయస్థానాన్ని కూడా బురిడీ కొట్టించేందుకు తెగిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ ప్రధాన కార్యాలయం స్క్రిప్టుతో డ్రామాను రక్తి కట్టించేందుకు ప్రయత్నించి సిట్ బోల్తా పడింది. న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించేందుకు గత శనివారం హైదరాబాద్లోని వికాట్ కంపెనీ కార్యాలయంలో సోదాల పేరిట సిట్ హడావుడి చేసింది. అది ఫలించకపోవడంతో తాజాగా నగదు జప్తు కుతంత్రానికి తెరలేపింది. ఎన్నికల మేనిఫెస్టో అమలులో వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకు రెడ్బుక్ కుట్రతో చంద్రబాబు ప్రభుత్వం రోజుకో రీతిలో నడుపుతున్న హైడ్రామాలో తాజా ఎపిసోడ్ ఇదిగో ఇలా ఉంది..సాక్షి, అమరావతి: మద్యం అక్రమ కేసు దర్యాప్తులో ఏస్థాయికైనా దిగజారతామనేలా సిట్ మరో బరితెగింపునకు పాల్పడింది. నిందితుల బెయిల్ మంజూరును అడ్డుకునేందుకు సరికొత్త నాటకానికి తెరతీసింది. ఇన్నాళ్లైనా ఒక్క ఆధారమూ చూపలేకపోయారని సాక్షాత్తు కోర్టు తప్పుబట్టడంతో నోట్ల ‘కట్ట’కథకు సిద్ధమైంది. హైదరాబాద్కు చెందిన తీగల విజయేందర్రెడ్డి శంషాబాద్ మండలం కాచారంలో వర్ధమాన్ ఇంజినీరింగ్ కాలేజీతో పాటు డయాగ్నస్టిక్ సెంటర్లు, ఇతర వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఇవన్నీ రూ.వందల కోట్ల టర్నోవర్ సాధిస్తున్నాయి. ఆ ఇంజినీరింగ్ కాలేజీ కేంద్ర బిందువుగానే సిట్ హైడ్రామాకు తెరతీసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో లేని కుంభకోణాన్ని ఉన్నట్టు చూపేందుకు సిట్ ఇప్పటికే పలువురు అధికారులు, ఉద్యోగులు, డిస్టిలరీల ప్రతినిధులు, సాక్షులను బెదిరించి, వేధించిన విషయం తెలిసిందే. కాగా, లేని ఆధారాలు సృష్టించాలని, ఏదో ఒక విధంగా భారీగా నగదు జప్తు చేసినట్టు చూపించాలని సిట్పై టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిడి ఉంది. దాంతో రాజ్ కెసిరెడ్డికి చెందిన నగదును జప్తు చేసినట్టు చూపించేందుకు ప్రయత్నించింది. టీడీపీ కేంద్ర కార్యాలయం స్క్రిప్ట్ను అమలులోకి తెచ్చింది. అదేమిటంటే... » వర్ధమాన్ ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన రూ.11 కోట్లను గుట్టుచప్పుడు కాకుండా కాచారంలోని విజయేందర్రెడ్డికి చెందిన సులోచన ఫామ్హౌస్కు తరలించారు. అది కూడా ఇంజినీరింగ్ కాలేజీ సిబ్బందితోనే చేయించినట్టు తెలుస్తోంది. సిట్ పోలీసులే ఆ నగదు తీసుకెళ్తే ఎవరైనా మొబైల్ ఫోన్లతో వీడియోలు తీస్తారేమోనని సందేహించి ఈ విధంగా ముందు జాగ్రత్తపడ్డారు. నగదును ఫామ్హౌస్కు చేర్చాక కుట్రలో రెండో అంకం మొదలుపెట్టారు. బుధవారం తెల్లవారుజామున సిట్ అధికారులు విజయేందర్రెడ్డికి చెందిన ఫామ్హౌస్పై దాడి చేసినట్టు..రూ.11 కోట్లను జప్తు చేసినట్లు డ్రామా రక్తి కట్టించారు. ఈ నగదంతా రాజ్ కెసిరెడ్డిదేనని..2024 జూన్ నుంచే ఇక్కడ ఉంచారంటూ కట్టుకథను మీడియాకు లీకు చేశారు. కానీ, టీడీపీ ప్రధాన కార్యాలయం స్క్రిప్ట్ ప్రకారం సాగిన ఈ పన్నాగం బూమరాంగ్ అయ్యింది. మద్యం అక్రమ కేసులో న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించే సిట్ కుట్ర బెడిసికొట్టింది. చిత్తు కాగితాల అట్టపెట్టెల్లో అంత డబ్బు దాచారా?కట్టుకథతో నమ్మించేందుకు సిట్ చేసిన పన్నాగం నవ్వులపాలైంది. గతంలో ఎప్పుడూ సోదాల్లో దొరకని డబ్బు, అకస్మాత్తుగా పుట్టుకు రావడమే దీనికి కారణం. పైగా ఏకంగా 14 నెలలుగా అక్కడే ఉన్నట్లు తెలపడాన్ని బట్టి చూస్తే... ఇదంతా సిట్ పన్నాగం అని స్పష్టంగా అర్థమవుతోంది. మరోవైపు విజయేందర్రెడ్డి అనుకూలంగా మారాకనే ఇదంతా జరగడం గమనార్హం. వాళ్లకు ఆ మనిషి అనుకూలంగా మారాకనే డబ్బు దొరకడం ఏమిటి? నివాసంలోని సొమ్మును వేరేవాళ్లదిగా ఆయనతోనే చెప్పించడం ఏమిటి? అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఇక అర్థరాత్రి చకచకా పుట్టుకొచ్చి పట్టుబడినది అని చెబుతున్న నగదు అంతా ఒకే తరహా అట్టపెట్టెల్లో (ఆఫీసుల్లో ఏ4 తెల్ల కాగితాల బండిల్స్ పెట్టేవి) ఉండడం ఆశ్చర్యపరిచింది. స్టేషనరీ సామగ్రి పెట్టే సాధారణ 12 అట్టపెట్టెల్లో రూ.11 కోట్లను ఉంచారని చెప్పడం సిట్ విస్మయకర తంతు ఏవిధంగా ఉందో తెలుస్తోంది.బెయిల్ను అడ్డుకోవడానికే సిట్ కుట్రలుసిట్ అధికారులు ఇంత చీప్ ట్రిక్కు ఎందుకు పాల్పడ్డారన్నదే కదా సందేహం... అక్కడే ఉంది అసలు కథ. ఈ కేసులో తాము అక్రమంగా అరెస్టు చేసినవారికి బెయిల్ రాకుండా కోర్టును తప్పుదారి పట్టించడమే సిట్ లక్ష్యం. మద్యం విధానంపై అక్రమ కేసులో సిట్ ఒక్క ఆధారాన్ని కూడా సేకరించలేకపోయింది. కేసులో ఏ1గా పేర్కొన్న రాజ్ కెసిరెడ్డిని సిట్ ఏప్రిల్ 21న అరెస్టు చేసింది. వంద రోజులుగా ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కానీ, సిట్ ఆధారాలు చూపలేకపోయింది. దీంతో 90 రోజుల తరువాత బెయిల్ ఇచ్చేందుకు సాంకేతికంగా మార్గం సుగమైనట్టే. ఆయన బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా కోర్టు అదే విషయాన్ని ప్రస్తావించింది. వివిధ సంస్థల పేరిట బ్యాంకులో ఉన్న నగదును జప్తు చేయడం మినహా సిట్ అధికారులు దర్యాప్తులో ఏం గుర్తించారు? ఏం సాధించారు? అని ప్రశ్నించింది. దాంతో సిట్ అధికారుల గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. అందుకే లేని ఆధారాన్ని ఉన్నట్టు చూపాలని భావించి హడావుడిగా విజయేందర్రెడ్డిని తమ కుట్రలో పావుగా చేసుకున్నారని స్పష్టమవుతోంది. రూ.11 కోట్లు జప్తు చేసినట్టు, ఆ నగదు రాజ్ కెసిరెడ్డిది అని కోర్టును తప్పుదారి పట్టించాలన్నది సిట్ పన్నాగం. » అక్రమ కేసులో అక్రమంగా అరెస్టు చేసిన వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప తదితరుల బెయిల్ను అడ్డుకునేందుకు సిట్ ఇదే రీతిలో శనివారం హైడ్రామా సాగించింది. హైదరాబాద్లోని వికాట్ గ్రూప్నకు చెందిన ప్రధాన కార్యాలయంలో సోదాల పేరుతో హడావుడి చేసింది. కోర్టు నుంచి అనుమతి లేకుండా సిట్ అ«దికారుల బృందం వికాట్ కంపెనీ కార్యాలయం వద్ద రాద్ధాంతం సృష్టించి...భయపెట్టేందుకు ప్రయత్నించింది.లోకేశ్ సన్నిహితుడు కిలారి సిట్ అధికార ప్రతినిధా!?రూ.11 కోట్ల జప్తు స్క్రిప్ట్ కథ టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచే నడిపించారన్నది తేటతెల్లమైంది. ఆ నగదును జప్తు చేసినట్టు టీడీపీ అనుకూల ఎల్లో మీడియాకు మంత్రి లోకేశ్ సన్నిహితుడు కిలారి రాజేష్ తెలపడమే దీనికి నిదర్శనం. ఆయనకు ప్రభుత్వంలో ఎటువంటి పదవీ లేదు. సిట్తో అధికారికంగా సంబంధం లేదు. కానీ, సిట్ అధికార ప్రతినిధి అన్నట్టుగా బుధవారం తెల్లవారుజామునే రూ.11కోట్ల జప్తు చేసిన ఫొటోలు, సమాచారం ఇవ్వడం మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అంటే, ఈ జప్తు కథ అంతా టీడీపీ కేంద్ర కార్యాలయం డైరెక్షన్లోనే సాగిందన్నది స్పష్టమైంది. కట్టుకథలో తాజా పాత్రధారి వరుణ్మద్యం అక్రమ కేసులో నిందితుడు వరుణ్ పురుషోత్తంను నోట్ల కట్టల కట్టు కథలో సిట్ పాత్రధారిగా చేసుకుంది. ఆయన ఇచ్చిన సమాచారంతోనే తాము ఫామ్హౌస్లో తనిఖీలు చేసి నగదును గుర్తించినట్టు చెప్పుకొచ్చింది. అక్రమ కేసులో ఏ 40గా పేర్కొన్న వరుణ్ విదేశాలకు పరారయ్యారని సిట్ ఇప్పటివరకు ప్రచారం చేస్తూ వచ్చింది. ఆయనపై లుక్ ఔట్ నోటీసు కూడా జారీ చేసింది. విదేశాల్లో ఉన్న వరుణ్ పురుషోత్తం హఠాత్తుగా హైదరాబాద్లో ఎలా ప్రత్యక్షమయ్యారో మరి...? అంటే సిట్ ఆయన్ను అక్రమంగా నిర్బంధించి వేధించి తప్పుడు వాంగ్మూలం నమోదు చేయించిందని స్పష్టమవుతోందని నిపుణులు చెబుతున్నారు. కొసమెరుపు: విజయేందర్రెడ్డికి చెందిన వర్ధమాన్ ఇంజినీరింగ్ కాలేజీ సరిగ్గా సులోచన ఫామ్హౌస్కు ఎదురుగానే ఉంటుంది. దీంట్లోనే రాత్రికిరాత్రే రూ.కోట్ల నోట్ల కట్టలు ప్రత్యక్షమయ్యాయి. కానీ, అవి ఆయనవి కావు అని.. రాజ్ కెసిరెడ్డివని చెబుతుండడం. ఆ నగదు నాది కాదు.. రూ.11 కోట్ల జప్తు పేరుతో సిట్ కుట్రను రాజ్ కెసిరెడ్డి తిప్పికొట్టారు. ఆ నగదుతో తనకుగానీ తన కుటుంబానికి గానీ ఎటువంటి సంబంధం లేదని న్యాయస్థానానికి నివేదించారు. ఆ నగదుకు వర్ధమాన్ ఇంజినీరింగ్ కాలేజీ యజమాని విజయేందర్రెడ్డే సమాధానం చెప్పాలన్నారు. ఈ మేరకు రాజ్ కెసిరెడ్డి విజయవాడ ఏసీబీ కోర్టులో బుధవారం సాయంత్రం అఫిడవిట్ దాఖలు చేశారు. విజయేందర్రెడ్డి కుటుంబానికి హాస్పిటల్, డయాగ్నస్టిక్ సెంటర్లు, ఇంజినీరింగ్ కాలేజీ, ఇతర వ్యాపారాలు ఎన్నో ఉన్నాయన్నారు. ఏటా వందల కోట్ల రూపాయల టర్నోవర్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఆ వ్యాపార సంస్థలతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. సిట్ జప్తు చేసింది ఆ వ్యాపార సంస్థలకు చెందిన నగదే కావచ్చని చెప్పారు. తాను ఫాంహౌస్లో నగదు దాచలేదని నివేదించారు. -
కోర్టును బురిడీ కొట్టించేందుకే బాబు కుట్ర
సాక్షి, అమరావతి: మద్యం అక్రమ కేసులో సోదాల పేరిట మరో ‘సెన్షేషన్’కు చంద్రబాబు సర్కారు తెరతీసింది. ఇంతకాలం ప్రపంచ ప్రఖ్యాత సంస్థ వికాట్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పకు వ్యతిరేకంగా ఒక్క ఆధారం కూడా కోర్టు ముందు ప్రవేశపెట్టలేకపోయిన కూటమి ప్రభుత్వం... ఇది అక్రమ కేసేనని స్పష్టమవుతుండడంతో ఇప్పుడు మరో కుట్రకు పాల్పడుతోంది. కేసును ‘సెన్సేషన్’ చేయడానికి కొత్త డ్రామాను రక్తి కట్టిస్తోంది. ఏకంగా న్యాయస్థానాలనే తప్పుదారి పట్టించేందుకు బరితెగిస్తోంది. ఆ పక్కా పన్నాగంతోనే... బాలాజీ గోవిందప్ప బెయిల్ను అడ్డుకోవడమే లక్ష్యంగా కోర్టును బురిడీ కొట్టించేందుకు హైదరాబాద్లోని ఆయన కార్యాలయంలో సోదాల పేరుతో కొత్త పన్నాగం పన్నుతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై నమోదు చేసింది అక్రమ కేసేనని సిట్ దర్యాప్తు తీరే స్పష్టం చేస్తోంది. టీడీపీ బాస్లకు అన్నింట్లోనూ ‘ఎస్’ అనే పోలీస్ అధికారులతో ఏర్పాటైన సిట్ దర్యాప్తులో ఒక్క ఆధారాన్నీ సేకరించలేకపోయింది. బెదిరింపులు, వేధింపులు, అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలు తప్ప సాధించినదేమీ లేదన్నది తేటతెల్లమైంది. ఎల్లో మీడియా ద్వారా సాగిస్తున్న దుష్ప్రచార కుతంత్రమూ బెడిసికొడుతోంది. అసలు లేని కుంభకోణాన్ని ఉన్నట్టుగా చూపించేందుకు పన్నిన పన్నాగం బెడిసికొడుతుండడంతో చంద్రబాబు ప్రభుత్వం బెంబేలెత్తుతోంది. దీంతో మరో కుతంత్రం రచించింది. బాలాజీ గోవిందప్పను అక్రమంగా అరెస్టు చేసి 75 రోజులైంది. ఎలాంటి ఆధారాలు లేకుండా నెలల పాటు దర్యాప్తు పేరిట రిమాండ్లో ఉంచడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. దీంతో బెయిల్ ఇవ్వాలని బాలాజీ గోవిందప్ప కోర్టులో పిటిషన్ వేశారు. బాలాజీ గోవిందప్ప తదితరులకు త్వరలో బెయిల్ ఖాయమని న్యాయ నిపుణులు సైతం స్పష్టం చేస్తున్నారు. కాగా, కేసు దర్యాప్తు ఎంతవరకు వచ్చిందని సిట్ అధికారులను కోర్టు నిలదీస్తోంది. అందుకని సాంకేతిక అంశాలతో కోర్టును తప్పుదారి పట్టించేందుకు సిట్ కొత్త ఎత్తుగడ వేసింది. ఇటీవల సమర్పించిన ప్రాథమిక చార్జ్షీట్లో బాలాజీ గోవిందప్ప, రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డి తదితరుల పేర్లను ప్రస్తావించలేదు. ఈ క్రమంలోనే బెయిల్ను అడ్డుకునేందుకు సిట్ కొత్త పన్నాగం పన్నింది. వికాట్ గ్రూప్నకు చెందిన ప్రధాన కార్యాలయం, బాలాజీ గోవిందప్ప నివాసంలో హఠాత్తుగా సోదాల డ్రామాకు తెరతీసింది. కోర్టు అనుమతి లేకుండానే 20 మందితో కూడిన సిట్ బృందం వికాట్ కంపెనీ కార్యాలయం వద్ద హంగామా చేసింది. సోదాలపై కోర్టు అనుమతి పత్రం చూపించాలన్న వికాట్ ఉద్యోగులతో సిట్ అధికారులు దురుసుగా ప్రవర్తించారు. బలవంతంగా కార్యాలయంలోకి చొచ్చుకెళ్లారు. పోలీస్ మార్క్ గూండాగిరితో భయపెట్టేందుకు ప్రయత్నించారు.బాలాజీ గోవిందప్ప డైరెక్టర్గా ఉన్న వికాట్ కంపెనీ కార్యాలయంలో సిట్ సోదాలు పక్కా పన్నాగమే. ఎందుకంటే, మే 13న అక్రమంగా అరెస్టు చేసే సమయంలోనూ ఇదే రీతిలో ఆయన నివాసంలో సిట్ అధికారులు రోజంతా సోదాలు చేశారు. ఎలాంటి ఆధారాలు దొరక్కపోవడంతో బాలాజీ గోవిందప్ప కుమారుడి ల్యాప్టాప్, మొబైల్ ఫోన్లను జప్తు చేసి సిట్ తన దిగజారుడుతనాన్ని ప్రదర్శించింది. ఆ వస్తువులు తనవి కావని బాలాజీ గోవిందప్ప కోర్టులో పిటిషన్ కూడా వేశారు. సీజ్ చేసిన వస్తువులు తిరిగి అప్పగించాలని, సంబంధిత వ్యక్తులకు ఇచ్చేస్తామని కోరారు. ఇక ఆయన నివాసంలో గానీ, జప్తు చేసినట్టు ప్రకటించిన ఎలక్ట్రానిక్ పరికరాల్లో గానీ సిట్ ఆధారాలు చూపలేకపోయింది. దాంతో సిట్ పన్నాగం ఫలించలేదు. 75 రోజులు రిమాండ్లో ఉన్నా సరే దర్యాప్తులో కనీస పురోగతి సాధించలేదు. కుంభకోణం జరిగితేనే కదా?లేని కుంభకోణం ఉన్నట్టు చూపించాలన్న సీఎం చంద్రబాబు కుట్ర క్షేత్రస్థాయిలో బెడిసికొడుతోంది. ఈ పరిణామాలన్నీ సిట్ దర్యాప్తు డొల్లతనాన్ని బట్టబయలు చేస్తున్నాయి. దాంతో బాలాజీ గోవిందప్ప బెయిల్ను అడ్డుకునేందుకు సిట్ వికాట్ కార్యాలయంలో సోదాలకు దిగింది. తద్వారా ఈ కేసు ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉందని చెబుతూ కోర్టును తప్పుదారి పట్టించాలన్నది సిట్ పన్నాగం. ఆ నెపంతో బాలాజీ గోవిందప్ప బెయిల్ను అడ్డుకోవాలన్నది లక్ష్యం.చెదిరిపోతున్న చంద్రబాబు కుట్రలురాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్లో 3.58 లక్షల జీబీల డేటాను వైఎస్సార్సీపీ వర్గీయులు నాశనం చేశారని... 375 పేజీల డేటాను డిలీట్ చేశారని ఈనాడు సహా ఎల్లో మీడియా పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసింది. దీనిపై ఓ సామాజిక కార్యకర్త సమాచార హక్కు చట్టం కింద బెవరేజెస్ కార్పొరేషన్కు దరఖాస్తు చేశారు. ‘‘అసలు మా వద్ద అలాంటి డేటానే ఏనాడూ లేదు. మేం ఎలాంటి డేటాను డిలీట్ చేయలేదు’’ అంటూ స్వయంగా టీడీపీ కూటమి ప్రభుత్వంలోని బెవరేజెస్ కార్పొరేషనే లిఖితపూర్వకంగా తెలిపింది. అంటే, అక్రమ కేసుపై ఎల్లో మీడియా చేస్తున్నదంతా దుష్ప్రచారమేనని నిర్ధారణ అయింది. చంద్రబాబు, లోకేశ్ సిట్ను అడ్డుపెట్టుకుని కట్టుకథలు అల్లుతూ... వందల కొద్దీ ఎల్లో యూట్యూబ్ చానళ్లను సృష్టించి, టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులను నిపుణులు, పాత్రికేయులుగా నమ్మిస్తూ భారీగా డబ్బులు ఎరవేసి విష ప్రచారం సాగిస్తున్నారని స్పష్టమైంది.పచ్చ గ్యాంగ్ దాదాగిరీ... పరిశ్రమలు పరార్రాజకీయ కుట్రలు, కక్షసాధింపు కుతంత్రాలు, పారిశ్రామికవేత్తల నుంచి భారీ వసూళ్లు, దీనికోసం పరిశ్రమలపై దాడులు... ఇలా చంద్రబాబు ముఠా అరాచకాల కారణంగా రాష్ట్రంలో పారిశ్రామిక అనుకూల వాతావరణం ధ్వంసమైంది. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక పారిశ్రామికవేత్తలకు వేధింపులు తీవ్రమయ్యాయి. భారీగా ముడుపులు, కాంట్రాక్టుల కోసం పారిశ్రామికవేత్తలను చంద్రబాబు గ్యాంగ్ వేధిస్తోంది. దీంతో పారిశ్రామికవేత్తలు బెంబేలెత్తి వెళ్లిపోతున్నారు. » వలపు వల వేసి బడాబాబులను బురిడీ కొట్టించే కాదంబరి జత్వానీని అడ్డం పెట్టుకుని.. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన జిందాల్ స్టీల్స్ను చంద్రబాబు ప్రభుత్వం వేధించింది. ఇది తట్టుకోలేక వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో పెట్టాలని నిర్ణయించిన రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులను ఆ కంపెనీ మహారాష్ట్రకు తరలించింది.» సిమెంట్ దిగ్గజం వికాట్ గ్రూప్ యూరప్లో టాప్ కంపెనీల్లో ఒకటి. అంతటి ప్రతిష్ఠాత్మకఅంతర్జాతీయ కంపెనీలో బాలాజీ గోవిందప్ప పూర్తిస్థాయి డైరెక్టర్గా ఉన్నారు. ఆయనకు ఏపీతో గానీ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలతో గానీ ఏమాత్రం సంబంధం లేదు. కేవలం రాజకీయ కుట్రతోనే వికాట్ కంపెనీని, బాలాజీ గోవిందప్పను చంద్రబాబు లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారు.» కాకినాడ సీ పోర్టులో వాటాలు వదిలేసుకోవాలని అరబిందో గ్రూప్ను కూటమి ప్రభుత్వ పెద్దలు బెదిరించారు. లేదంటే అక్రమ కేసులు పెట్టి వేధిస్తామని సీఐడీనీ రంగంలోకి దించారు. దీంతో అరబిందో గ్రూప్ కాకినాడ సీ పోర్టులోని మెజారిటీ వాటాను వదిలేసుకోవాల్సి వచ్చింది.» అల్ట్రాటెక్ పరిశ్రమకు కర్ణాటక నుంచి ఎర్రమట్టి సరఫరా కాంట్రాక్టు కోసం ఏకంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గాలు పరస్పరం దాడులకు దిగి బెంబేలెత్తించాయి. దాంతో ఆ పరిశ్రమ యాజమాన్యం బెదిరిపోయింది.» పల్నాడులో భవ్య, చెట్టినాడ్ సిమెంట్ కంపెనీలు ఉత్పత్తి చేసే ప్రతి బస్తాకు ఇంత అని కప్పం కట్టాలని గూండాగిరీకి తెగబడ్డారు. దీనికి ఒప్పుకోకపోవడంతో ఓ కంపెనీ ఉత్పత్తిని 50 రోజలు, మరో కంపెనీని 30 రోజులు అడ్డుకున్నారు.» శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టు సెక్యూరిటీ డీజీఎం, సిబ్బందిపై సర్వేపల్లి టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దాడి చేసి బెంబేలెత్తించారు. » రామాయపట్నం పోర్టు నిర్మాణంలో తనకు వాటా ఇవ్వాలని కందుకూరు టీడీపీ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు వేధించారు. ఆ కంపెనీకి నిర్మాణ సామగ్రి సరఫరాను అడ్డుకున్నారు. » శ్రీకాకుళం జిల్లాలోని యూబీ బీర్ల ఫ్యాక్టరీపై కూటమి నేతలు దాడి చేసి విధ్వంసం సృష్టించారు. తనకు నెలనెలా కప్పం కడితేనే బీరు ఉత్పత్తుల లోడ్ లారీలను బయటకు అనుమతిస్తానని బీజేపీ ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు తేల్చి చెప్పారు. » సత్తెనపల్లి నియోజకవర్గం మీదుగా ప్రయాణించే గ్రానైట్ లారీల నుంచి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీ నారాయణ వర్గీయులు కప్పం వసూలు చేస్తున్నారు. షాడో ఎమ్మెల్యేగా పేరు పొందిన ఓ టీడీపీ నేత ఆధ్వర్యంలో కేడీ ట్యాక్స్ పేరుతో భారీ వసూళ్లకు పాల్పడుతున్నారు. » శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో కియా భూములను కొల్లగొట్టేందుకు ఆ జిల్లా మంత్రి, అక్కడి టీడీపీ ఎమ్మెల్యే వర్గాలు కొట్లాటకు దిగాయి.» రాప్తాడు నియోజకవర్గంలో ముఖ్య నేత కుమారుడు పరిశ్రమలు, వ్యాపార, వాణిజ్య వర్గాల నుంచి వసూళ్ల దందాకు పాల్పడుతున్నారు. » నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కల్వటాల వద్ద రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ రెండో ప్లాంట్ పనుల్లో తమ నీటి ట్యాంకర్లను పెట్టుకోవడం లేదని టీడీపీ నేతలు దాడి చేశారు. హైదరాబాద్లోని బాలాజీ గోవిందప్పనివాసంలో సిట్ సోదాలువికాట్ కార్యాలయాల్లో కూడా..2 ప్రత్యేక బృందాలతో ఐదున్నర గంటల పాటు సోదాలు సాక్షి, సిటీబ్యూరో: మద్యం అక్రమ కేసులో సిట్ అధికారులు ఏఎస్పీ స్నేహిత నేతృత్వంలో హైదరాబాద్ బంజారాహిల్స్లోని వికాట్ గ్రూప్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప నివాసంలో శనివారం సోదాలు నిర్వహించారు. సిట్ గతంలోనూ సుదీర్ఘంగా సోదాలు చేసినా.. ఆయనకు వ్యతిరేకంగా ఒక్క ఆధారమూ కోర్టులో ప్రవేశ పెట్టలేకపోయింది. మరోవైపు ఏసీబీ కోర్టులో బాలాజీ గోవిందప్ప వేసిన బెయిల్ పిటిషన్ ఈ నెల 29న విచారణకు రానుందని, దానిని అడ్డుకునేందుకే సోదాల పేరుతో సిట్ అధికారులు కొత్త నాటకానికి తెరలేపారని గోవిందప్ప న్యాయవాదులు అంటున్నారు. బంజారాహిల్స్లోని వికాట్ కార్యాలయాల్లో సిట్ సోదాలు నిర్వహించింది. డీఎస్పీ శ్రీనివాస్, ఆరుగురు పోలీసుల బృందంతో కలిసి సుమారు ఐదున్నర గంటలు సోదాలు చేశారు. బాలాజీ గోవిందప్ప చాంబర్లు, పరిసర ప్రాంతాలను సోదా చేసినట్లు తెలిపారు. కొన్ని డిజిటల్ డివైజ్లను సీజ్ చేశామని, వాటిలో ఏముందనేది విచారణలో తేలుస్తామని డీఎస్పీ చెప్పారు. కాగా, సోదాలు నిర్వహించేందుకు వస్తున్నామని సిట్ అధికారులు స్థానిక పోలీసు స్టేషన్లో ముందస్తు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, ఎవరు సోదాలు నిర్వహిస్తున్నారనేది బంజారాహిల్స్ ఠాణా రికార్డులో పేర్కొనలేదని తెలిసింది. కేవలం ఇద్దరు డీఎస్పీ స్థాయి అధికారులు మాత్రమే... బాలాజీ గోవిందప్ప నివాసం, వికాట్ ప్రధాన కార్యాలయంలో సోదాకు వస్తున్నట్లు రికార్డులో పేర్కొన్నట్లు సమాచారం. -
అక్రమ మద్యం కేసు.. ‘సిట్’ మరో కొత్త నాటకం
సాక్షి, హైదరాబాద్: అక్రమ మద్యం కేసులో మరో నాటకానికి సిట్ తెరతీసింది. సోదాల పేరుతో హడావుడి సృష్టించేందుకు సిట్ ప్రయత్నించింది. హైదరాబాద్లోని బాలాజీ గోవిందప్ప నివాసంలో మరోసారి సోదాల పేరుతో సిట్ అధికారులు హల్చల్ చేశారు. గతంలోనే బాలాజీ గోవిందప్ప ఇంటిలో సిట్ అధికారులు సుదీర్ఘంగా సోదాలు నిర్వహించారు.మే 13న బాలాజీ గోవిందప్పను సిట్ అరెస్ట్ చేసింది. 74 రోజులుగా ఆయన రిమాండ్లో ఉన్నారు. బాలాజీ గోవిందప్పకు వ్యతిరేకంగా ఒక్క ఆధారం కూడా కోర్టు ముందు సిట్ పెట్టలేకపోయింది. ఏసీబీలో కోర్టులో బాలాజీ గోవిందప్ప బెయిల్ పిటిషన్ వేశారు. ఆయన పిటిషన్పై ఈనెల 29న కోర్టు విచారణ చేపట్టనుంది.బాలజీ గోవిందప్ప బెయిల్ను అడ్డుకునేందుకు సోదాల పేరుతో సిట్ అధికారులు మరో కొత్త నాటకానికి తెరలేపారు. కొత్తగా ఆధారాలు దొరికాయంటూ చెప్పేందుకే ఈ నాటకం చేస్తున్నారని గోవిందప్ప న్యాయవాదులు అంటున్నారు. బాలాజీ గోవిందప్ప.. ప్రఖ్యాత అంతర్జాతీయ కంపెనీ వికాట్ ఇంటర్నేషనల్లో ఫుల్టైమ్ డైరెక్టర్గా ఉన్నారు. వికాట్ గ్రూప్కు సంబంధించిన కార్యాలయంలో కూడా సిట్ అధికారులు సోదాలు చేపట్టారు. -
సిట్ లీకులతోనే ఆ కథనాలు.. జడ్జి ఎదుట ధనుంజయ్రెడ్డి ఆవేదన
సాక్షి, విజయవాడ: అక్రమ లిక్కర్ కేసులో అరెస్టైన రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ్ రెడ్డి.. ఏసీబీ కోర్టు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. జైల్లో ఉన్న తన గురించి, బయట ఉన్న తన కుటుంబం గురించి తప్పుడు కథనాలు రాస్తున్నారంటూ జడ్జి ముందు ఇవాళ ఆవేదన వెలిబుచ్చారాయన. ‘‘మేం ఎకరం విస్తీర్ణం ఉన్న జైల్లో ఉన్నాం. జైలు పక్కన బిల్డింగ్ టెర్రస్ పైనుంచి మమ్మల్ని ఫోటోలు తీస్తున్నారు. పై నుంచి అడిగితే మేం ఫోటోస్ తీస్తున్నామని చెబుతున్నారు. నేను ఐదుగురితో మాట్లాడినట్టు సెల్ఫోన్ ట్రాక్ ద్వారా గుర్తించినట్టు పేపర్లో ఓ వార్త చూశాను. ఆ కథనంలో పేర్కొన్న ఐదుగురిలో ఇద్దరిని మాత్రమే నేను కలిశానంతే. మిగతా ముగ్గురిని ఇప్పటి వరకు ఎప్పుడూ నేను కలవలేదు. కావాలంటే ప్రపంచంలో ఏ దర్యాప్తు సంస్థతో నైనా విచారణ చేయించుకోవచ్చని కోరుతున్నానుమాజీ సీఎస్, మాజీ ఫారెస్ట్ కన్జర్వేటర్ నా బినామీలు అని కథనాలు రాస్తున్నారు. నేను విలాసవంతమైన కార్లు, విలాసవంతమైన జీవితం గడుపుతున్నట్టు అంఉదలో పేర్కొన్నారు. నేను నా లైఫ్లో కొన్న ఒకే ఒక్క శాంట్రో కారు. నా భార్య మరో కారు వాడుతోంది. ఇవి రెండు విలాసవంతమైన కార్లా?. పత్రికల్లో వస్తున్న కథనాలతో మా కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. ఈ విధంగా మాపై వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. సిట్ అధికారులే లీకులు ఇచ్చి వార్తలు రాయిస్తున్నారు.గత 20 రోజులుగా పత్రికల్లో వార్తలు చూస్తే మేం ఛార్జ్ షీట్ చదవాల్సిన అవసరం లేదు. చార్జీషీట్లో ప్రతి పేరా గురించి పత్రికల్లో రాశారు. ఇది ఖచ్చితంగా ఫ్యాబ్రికేటెడ్ కేసు. నేను కోర్టులో ఈ విషయం చెప్పాను. కాబట్టి రేపట్నుంచి సిట్ మళ్ళీ మమ్మల్ని టార్గెట్ చేస్తుంది. అయినా అన్నింటికీ సిద్ధంగా ఉన్నాం అని చెప్పారాయన. -
లేని మద్యం స్కామ్పై సిట్ కట్టుకథలు
చంద్రబాబు ప్రభుత్వానికి మతి లేదు.. టీడీపీ వీర విధేయ పోలీసు అధికారులతో కూడిన సిట్కు గతి లేదు! ఇదీ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి..వైఎస్సార్సీపీ హయాంలోని మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసులో కొండను తవ్వినంత హడావుడి చేసిన సిట్ కట్టుకథలను చూసి రాష్ట్ర ప్రజలు నివ్వెరపోతున్నారు..వైఎస్సార్సీపీ హయాంలో లేని కుంభకోణం ఉన్నట్టుగా చూపేందుకు చంద్రబాబు ప్రభుత్వం నానా కుతంత్రాలు పన్నుతోంది..బెదిరింపులు, వేధింపులు, అక్రమ అరెస్టులు తప్ప ఈ దర్యాప్తు సాధించినది ఏమీ లేదన్నది సిట్ చార్జ్జషీటే వెల్లడిస్తోంది. ఇదిగో పెళ్లిలో వీరిద్దరూ కలిశారు కాబట్టి కుంభకోణానికి పాల్పడ్డారు.. అప్పుడెప్పుడో ఫోన్లో మాట్లాడుకున్నందున అవినీతికి పాల్పడ్డారు వారిద్దరు ఒకరికి ఒకరు కనిపించగానే నవ్వుతూ పలకరించుకున్నారు కాబట్టి ఏదో గూడుపుఠాణి చేసి ఉంటారు... ఇదీ సిట్ తన చార్జ్షీట్ సాక్షిగా వెల్లడించిన నివేదిక.. ప్రపంచంలో ఇంత హాస్యాస్పదంగా నివేదిక ఇచ్చిన ఘనత చంద్రబాబు సిట్కే దక్కుతుంది. కూటమి పెద్దల కుట్రకు తలాడించడం తప్ప ఏమీ చేయలేని సిట్... కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్లు అంటూ వక్రభాష్యం చెబుతూ కనికట్టు చేసేందుకు ప్రయత్నించడం విస్మయపరుస్తోంది. రూ.3,500 కోట్లు చేతులు మారాయని ఓ తాడూ, బొంగరం లేని కట్టు కథతో దుష్ప్రచారం చేయాలన్న కుతంత్రమే చంద్రబాబు పన్నాగమని స్పష్టమవుతోంది. మోకాలికి, బోడిగుండుకు ముడిపెడుతూ రాజ్ కేసిరెడ్డి ద్వారా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె.ధనుంజయ్రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్రెడ్డి ద్వారా డబ్బులు చేతులు మారాయని నమ్మించేందుకు సృష్టించిన కల్పిత కథ బెడిసికొట్టింది.⇒ సాక్షాత్తు సీఎం చంద్రబాబు కుమారుడు, మంత్రి నారా లోకేశ్ బినామీ విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వ్యాపార భాగస్వామే రాజ్ కేసిరెడ్డి అన్న వాస్తవం మరోసారి చర్చనీయాంశమైంది. గతంలో డిస్టిలరీల ముసుగులో మద్యం దోపిడీ చంద్రబాబు బాగోతేమనని సీఐడీ నిగ్గు తేల్చిన సంగతిని అందరికీ గుర్తు చేసింది. ఆ కేసులో బెయిల్పై ఉన్న చంద్రబాబు ప్రస్తుతం దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా నీతి కథలు చెబుతుండటం విస్మయపరుస్తోంది. బాబు కనికట్టు కథను ముందుగానే ఎల్లో మీడియా చిలక జోస్యం చెప్పడంతో రెడ్బుక్ కుతంత్రం బట్టబయలవుతోంది.కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్ అంటూ బురిడీ కుట్రవైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో లేని కుంభకోణం ఉన్నట్టు చూపించేందుకు టీడీపీ వీర విధేయ సిట్ నానా తంటాలు పడుతోంది. నెలల తరబడి దర్యాప్తు పేరుతో వేధించినా, బెదిరించినా సాధించిందేమీలేదు. చివరికి చార్జ్జషీట్లో ఏం చెప్పిందంటే... 13 వేల ఫోన్ కాల్స్, వందలాది వాట్సాప్ చాటింగ్ల డేటా అంటూ వక్రీకరణలతో కనికట్టుకు యత్నించింది. అంటే దర్యాప్తు పేరుతో తాము సాధించిందీ ఏమీ లేదని ఒప్పుకొంది. ఓ ఇరవై ముప్పై మంది ఫోన్లతో పాటు వారి పీఏలు, సిబ్బంది ఫోన్ల నుంచి రెండేళ్ల సుదీర్ఘ కాలంలో 13 వేలకుపైగా ఫోన్ కాల్స్ వెళ్లాయి అన్నది ఏదో అసహజ విషయం అన్నట్టు నమ్మించేందుకు సిట్ యత్నించింది. పోనీ ఆ కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్లో మద్యం కొనుగోళ్లు, సరఫరా, డబ్బుల చెల్లింపు వంటి వ్యవహారాల గురించి ఏమైనా ఉన్నట్టు సిట్ నిరూపించిందా? అంటే అదీ లేదు. కేవలం మీటింగులు, ప్రయాణాలు, సాధారణ విషయాలే ఉన్నట్టు సిట్ చార్జ్జషీట్లోనే పేర్కొంది. ఆ సాధారణ ఫోన్కాల్స్, చాటింగ్లకు వక్రభాష్యం చెబుతూ తమ రెడ్కుట్ర కథను ఆపాదిస్తూ అటు న్యాయస్థానాన్ని ఇటు ప్రజలను తప్పుదారి పట్టించడమే చంద్రబాబు ప్రభుత్వ కుతంత్రం అన్నది స్పష్టమవుతోంది.బాబు కుతంత్రం... ఎల్లో మీడియా చిలక జోస్యంవైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో జరగని కుంభకోణాన్ని జరిగినట్టుగా చూపించే రెడ్బుక్ కుట్ర కోసం చంద్రబాబు తన భజన ఎల్లో మీడియానే నమ్ముకున్నారు. అసలు సిట్ ఏమేం చేయాలో కూడా తన రాజగురువు రామోజీ కుటుంబానికి చెందిన ఈనాడు పత్రిక ద్వారా చెప్పిస్తున్నారు. ఎవరెవరి మీద అక్రమ కేసు పెట్టాలి... ఎవరెవర్ని విచారణకు పిలవాలి... వారిని ఏఏ ప్రశ్నలు అడగాలి... ఎప్పుడెప్పుడు అరెస్టు చేయాలి అన్నవి ముందుగా ఈనాడు పత్రికలో ప్రచురితమవుతాయి. సిట్ అదే పనిని తు.చ. తప్పకుండా చేస్తోంది. న్యాయస్థానంలో దాఖలు చేసిన చార్జ్షీట్పై సిట్కు ఎలాంటి నియంత్రణ ఉండకూడదు. అది న్యాయస్థానం పరిధిలోని అంశం. ఆ చార్జ్షీట్ను స్వీకరించినట్టు ప్రకటించిన తరువాతే ఎవరైనా న్యాయస్థానం ద్వారా అధికారికంగా కాపీని తీసుకోవచ్చు. కానీ, న్యాయస్థానం స్వీకరించినట్టు ప్రకటించకముందే చార్జ్జషీట్ ఎల్లో మీడియాకు చేరిపోతోంది. అంటే కోర్టు కంటే ఎల్లో మీడియాకే తమ ప్రాధాన్యం అని చంద్రబాబు ప్రభుత్వం, సిట్ బరితెగించి ప్రకటిస్తున్నాయి. రాజ్ కేసిరెడ్డి.. లోకేశ్ బినామీ కేశినేని చిన్ని భాగస్వామి ఈ మొత్తం భేతాళ కుట్ర కథకు చంద్రబాబు ప్రధాన ఆధారంగా చేసుకున్నది రాజ్ కేసిరెడ్డినే. ఇంతకీ ఈ రాజ్ కేసిరెడ్డి ఎవరో తెలుసా...? నారా లోకేశ్కు బినామీగా ఉన్న విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)కు వ్యాపార భాగస్వామి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉండగానే అంటే 2021లోనే రాజ్ కేసిరెడ్డి కేశినేని చిన్నితో భాగస్వామిగా వ్యాపారాలు చేశారు. చిన్ని లోకేశ్ బినామీ అన్నది బహిరంగ రహస్యమే. రాజ్ కేసిరెడ్డికి చెందిన ‘ప్రైడే ఇన్ఫ్రాకాన్ ఎల్ఎల్పీ’లో కేశినేని చిన్ని దంపతులు వాటాదారులుగా ఉన్నారు. అక్రమంగా నిధులు తరలించారని సిట్ అధికారులు చెబుతున్న ఇషన్వీ ఇన్ఫ్రా ప్రాజెక్టస్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రైడే ఇన్ఫ్రా ఎల్ఎల్పీ హైదరాబాద్లోని ఒకే చిరునామాతో (జూబ్లీహిల్స్, సర్వే నంబర్ 403, ప్లాట్ నంబర్ 9)తో రిజిస్టర్ అయ్యాయి. అంతేకాదు ఆ రెండు కంపెనీలు ఒకే మెయిల్ ఐడీ (accounts@wshanviinfraprojects.com)నే ఉపయోగిస్తుండడం గమనార్హం. కేశినేని చిన్ని ఏకంగా 12 రియల్ ఎస్టేట్, విదేశీ కంపెనీల ద్వారా భారీగా నల్లధనాన్ని అమెరికా, దుబాయ్ తరలించి పెట్టుబడులు పెట్టారు. ⇒ కేశినేని చిన్ని మంత్రి లోకేశ్కు అత్యంత సన్నిహితుడే కాక బినామీ కావడంతో పట్టుబట్టి మరీ ఆయనకు విజయవాడ ఎంపీ టికెట్ ఇప్పించారు. ఆంధ్రా క్రికెట్ అసోషియేషన్ అధ్యక్షుడిని చేశారు. చిన్ని బినామీ కంపెనీ ఉర్సా ఐటీ సొల్యూషన్స్కు విశాఖలో అత్యంత విలువైన 60 ఎకరాలను కారుచౌకగా కట్టబెట్టారు. చిన్ని ముసుగులో లోకేశ్ ఇలా దోపిడీకి పాల్పడుతున్నారు. అటువంటి కేశినేని చిన్నితో రాజ్ కేసిరెడ్డి వ్యాపార భాగస్వామి. అంటే బినామీ దందా ముసుగు తొలగిస్తే లోకేశ్, రాజ్ కేసిరెడ్డి వ్యాపార భాగస్వాములు అన్నది స్పష్టమవుతోంది. అలాంటి రాజ్ కేసిరెడ్డి..వైఎస్ జగన్ ప్రభుత్వంలో మద్యం కుంభకోణానికి పాల్పడ్డారని సిట్ నమోదు చేసిన అభియోగం పూర్తిగా అవాస్తవమే అన్నది నిగ్గు తేలుతోంది. దీనిపై అటు చంద్రబాబుగానీ ఇటు సిట్గానీ స్పందించకుండా మౌనం వహించడం అంటే ఆ వాస్తవాన్ని పరోక్షంగా అంగీకరిస్తున్నట్టే.బాబు కుట్ర కథే... సిట్తో ఆడిస్తున్న తోలుబొమ్మలాటేచంద్రబాబు సిట్ ద్వారా రెడ్బుక్ తోలుబొమ్మలాట ఆడిస్తున్నారు. రెడ్బుక్ కుట్ర అమలుకు సిట్ ఆయుధంగా మారిందని తాజాగా సమర్పించిన చార్జ్జషీట్ స్పష్టం చేస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అసలు లేని కుంభకోణాన్ని ఉన్నట్టు చూపాలన్న టీడీపీ కూటమి కుట్రను సిట్ తు.చ. తప్పక అమలు చేస్తోంది. కొత్త కొత్త భేతాళ కథలను తమ రిమాండ్ రిపోర్టులు, చార్జ్జషీట్ ద్వారా ప్రచారంలోకి తెస్తోంది. ఎంతగా అంటే అసలు జరగని కుంభకోణంలో ఏకంగా రూ.3,500 కోట్లు చేతులు మారాయని నిస్సిగ్గుగా కట్టుకథను వినిపించడం సిట్కే సాధ్యపడింది. రాజ్ కేసిరెడ్డి, విజయ సాయిరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్రెడ్డి, వికాట్ సంస్థ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప... ఇలా ఒకరినుంచి ఒకరికి రూ.3,500 కోట్లు చేతులు మారాయని ఓ పకడ్బందీ కుట్రకథను అల్లడం బాబు మార్కు కుతంత్రానికి తార్కాణం. అసలు రూ.3,500 కోట్లు ఎక్కడ ఉన్నాయంటే సిట్ చెప్పదు... చెప్పలేదు. ఎందుకంటే రూ.3,500 కోట్ల అవినీతి అన్నది చంద్రబాబు సృష్టించిన కల్పిత కథ.⇒ ఓవైపు రూ.3,500 కోట్లు అక్రమంగా తరలించారని సిట్ అవాస్తవ ఆరోపణలు చేస్తోంది. మరోవైపు ఆ నిధులతో నిందితులు దుబాయ్ తదితర విదేశాల్లో జల్సాలు చేశారని అంటోంది. అంటే రెడ్బుక్ కుట్రను అమలు చేసే ఆత్రుతలో సిట్ పరస్పర విరుద్ధంగా అవాస్తవ అభియోగాలు ప్రచారంలోకి తెస్తోందని వెల్లడైంది. ఇదంతా సిట్ ద్వారా చంద్రబాబు ఆడిస్తున్న తోలుబొమ్మలాటేనన్నది అసలు వాస్తవం. ఎల్లో మీడియా ద్వారా దుష్ప్రచార రాద్ధాంతమే తప్ప అందులో ఏమాత్రం నిజం లేదన్నది సుస్పష్టం.డీబీటీ పథకాలు రూ.2.70 లక్షల కోట్లు ఇక వైఎస్సార్సీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు అత్యధిక ప్రాధాన్యమిచ్చింది. నేరుగా నగదు బదిలీ (డీబీటీ) పథకాల ద్వారా ఐదేళ్లలో ఏకంగా రూ.2.70 లక్షల కోట్లను లబ్ధిదారులకు అందించింది. అంతటి పేదల సంక్షేమ ప్రభుత్వంపై ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం కుట్రపూరితంగా అక్రమ కేసులు నమోదు చేస్తోంది.డిస్టిలరీల ద్వారా భారీ దోపిడీ చంద్రబాబు బాగోతమేడిస్టిలరీల ద్వారా మద్యం దోపిడీ అంటూ చంద్రబాబు ప్రభుత్వం కట్టుకథలు వినిపిస్తుండడం దొంగే దొంగ దొంగ అని అరుస్తున్నట్టు ఉంది. ఎందుకంటే డిస్టిలరీల ద్వారా మద్యం దోపిడీకి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబే. రాష్ట్రంలో 20 డిస్టిలరీలు ఉంటే అందులో 14 డిస్టిలరీలకు అనుమతులు ఇచ్చింది టీడీపీ ప్రభుత్వమే. మిగిలిన ఆరు డిస్టిలరీలకు అంతకుముందటి ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయి. ఇక బెవరేజస్ కార్పొరేషన్ ద్వారా మద్యం కొనుగోళ్లకు మొత్తం 20 డిస్టిలరీలను ఎంప్యానల్ చేసింది టీడీపీ ప్రభుత్వమే. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వనేలేదు. తన సన్నిహితులు, బినామీలు అయ్యన్నపాత్రుడు, పుట్టా సుధాకర్యాదవ్, డీకే ఆదికేశవులు, ఎస్పీవైరెడ్డి కుటుంబాలకు చంద్రబాబు డిస్టిలరీల ఏర్పాటుకు లైసెన్సులు జారీ చేశారు. తన బినావీులకు చెందిన 4 డిస్టిలరీలకే ఏకంగా 60 శాతానికి పైగా మద్యం కొనుగోళ్ల ఆర్డర్లు ఇచ్చారు. అందుకోసం ముందుగానే మద్యం నిల్వలను తెప్పించి సరఫరా చేశారు. అంటే మద్యం మొబిలైజేషన్ అడ్వాన్సులు చెల్లించినట్టేనని అధికార వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. కాగా, అప్పటివరకు ఊరూపేరు లేని మద్యం బ్రాండ్లను రాష్ట్రంలోకి ప్రవేశపెట్టింది కూడా చంద్రబాబు డిస్టిలరీల ముఠానే. రాష్ట్రంలోని ప్రైవేటు మద్యం సిండికేట్కు టీడీపీ నేతలే నేతృత్వం వహించారు. అందుకే... డిస్టిలరీలు, బార్లకు అడ్డదారిలో ప్రయోజనం కలిగించేలా ప్రివిలేజ్ ఫీజు రద్దు చేసేందుకు మంత్రి మండలిని బురిడీ కొట్టిస్తూ రెండు చీకటి జీవోలు జారీ చేశారు. తద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.5,200 కోట్లు గండికొట్టారు. టీడీపీ సిండికేట్కు చెందిన 4,380 మద్యం దుకాణాలు, వాటికి అనుబంధంగా 4,380 పర్మిట్ రూమ్లతో పాటు ఊరూవాడా బడి దగ్గర గుడి దగ్గర కూడా ఏకంగా 43 వేల బెల్ట్ దుకాణాలతో మద్యం ఏరులై పారించారు. ఎంఆర్పీ కంటే 20 శాతం అధిక విక్రయాలతో ఐదేళ్లలో రూ.20 వేల కోట్లు దోపిడీకి పాల్పడ్డారు. చంద్రబాబు ముఠా దోపిడీని 2023లోనే సీఐడీ ఆధారాలతో సహా నిగ్గు తేల్చింది. చంద్రబాబుతో పాటు టీడీపీ గత ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్న కొల్లు రవీంద్ర, అప్పటి ఎక్సైజ్ కమిషనర్ ఐఎస్ నరేష్ తదితరులపై ఐపీసీ సెక్షన్లు 166, 167, 409, 120(బి) రెడ్విత్ 34, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు 13(1),(డి), రెడ్విత్ 13(2) కింద సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ కేసులో చంద్రబాబు ఇప్పటికీ బెయిల్పైనే ఉన్నారన్నది అసలు నిజం.వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పారదర్శకంగానే మద్యం విధానంనాడే తేల్చిచెప్పిన కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పారదర్శకంగానే మద్యం విధానాన్ని అమలు చేశారని కేంద్రానికి చెందిన ‘కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆనాడే ప్రకటించింది. టీడీపీ నేతలు 2021లోనే వైఎస్సార్సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై సీసీఐకి ఫిర్యాదు చేశారు. బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా మద్యం కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆ ఫిర్యాదుపై విచారించిన సీసీఐ 2022 సెప్టెంబర్19న విస్పష్ట తీర్పు ప్రకటించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ మద్యం విధానంలో ఎలాంటి అవకతవకలు జరగడం లేదని, బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా మద్యం కొనుగోళ్ల విధానం పారదర్శకంగా ఉందని తన తీర్పులో స్పష్టం చేసింది. నాడు సీసీఐ తీర్పునకు పూర్తి విరుద్ధంగా ప్రస్తుతం సిట్ అక్రమ కేసు నమోదు చేసి నిరాధార అభియోగాలు నమోదు చేయడం కేవలం రెడ్బుక్ కుట్రే.సమర్థంగా దశలవారీ మద్య నియంత్రణవైఎస్ జగన్ ప్రభుత్వ ఘనతమద్యం అమ్మకాలు, లాభాలు తగ్గితే డిస్టిలరీలు ఎందుకు లంచాలు ఇస్తాయి బాబూ?డిస్టిలరీలు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో భారీ కమీషన్లు ఇచ్చాయని చంద్రబాబు తన పచ్చ పోలీసు ముఠా సిట్తో దుష్ప్రచారం చేయించేందుకు నానా తంటాలు పడుతున్నారు. అటు చంద్రబాబు ఇటు సిట్ అధికారులు ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్న వాస్తవం ఏమిటంటే... డిస్టిలరీలు సాధారణంగా కమీషన్లు ఎప్పుడు ఇస్తాయి...? తమ మద్యం అమ్మకాలు పెరిగితే... తద్వారా తమకు అధిక లాభాలు వస్తే కమీషన్లు ఇస్తాయి. ఇది చిన్న పిల్లాడికి కూడా తెలిసిన సత్యం. మరి వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో మద్యం అమ్మకాలు తగ్గాయా...? పెరిగాయా అన్నది పరిశీలిస్తే అసలు విషయం బయటపడుతుంది కదా...? ఆ చిన్న లాజిక్ను టీడీపీ కూటమి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు...? ఎందుకంటే 2019–24లో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. అప్పటి సీఎం వైఎస్ జగన్ దశలవారీ మద్య నియంత్రణ విధానాన్ని సమర్థంగా అమలు చేశారు. అంతకుముందు టీడీపీ పాలనలో దోపిడీకి పాల్పడ్డ ప్రైవేటు మద్యం దుకాణాల విధానాన్ని రద్దు చేశారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో దుకాణాలను ప్రవేశపెట్టి, వాటి వేళలను కుదించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న 4,380 మద్యం దుకాణాలను దశలవారీగా 2,934 దుకాణాలకు తగ్గించారు. చంద్రబాబు ప్రభుత్వం అనధికారిక బార్లుగా లైసైన్సులు జారీ చేసిన 4,380 పర్మిట్ రూమ్లను రద్దు చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో కొనసాగిన 43 వేల బెల్ట్ దుకాణాలను తొలగించారు. డిస్టిలరీల నుంచి సరఫరా అయ్యే ప్రతి మద్యం బాటిల్కు క్యూఆర్ కోడ్ పెట్టి పకడ్బందీగా పర్యవేక్షించారు. ఈ విప్లవాత్మక చర్యలతో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయని ఎక్సైజ్ శాఖ రికార్డులే వెల్లడిస్తున్నాయి. మద్యం అమ్మకాలు పెరిగితే డిస్టిలరీలకు లాభాలు వస్తాయి కాబట్టి ప్రభుత్వ పెద్దలకు కమీషన్లు ఇస్తాయి. కానీ, వైఎస్సార్సీపీ హయాంలో మద్యం అమ్మకాలు తగ్గడంతో డిస్టిలరీలకు లాభాలు తగ్గాయి. మరి కమీషన్లు ఎందుకు ఇస్తాయి...? ఇవ్వనే ఇవ్వవు. అయినా, వైఎస్సార్సీపీ ప్రభుత్వం డిస్టిలరీలకు అడ్డదారిలో ప్రయోజనం కలిగించిందని సిట్ అవాస్తవ అభియోగాలు నమోదు చేసింది.అటు సిండికేటు.. ఇటు కల్తీ కేటుగాళ్లు...ఇక నిరుడు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం గతంలోని తన రికార్డులను తానే తిరగరాస్తూ మద్యం దోపిడీకి తెగబడుతోంది. టీడీపీ సిండికేట్కు 3,396 మద్యం దుకాణాలను కట్టబెట్టి 75 వేల బెల్ట్ దుకాణాలతో మద్యాన్ని ఏరులై పారిస్తోంది. అత్యంత ప్రమాదకర స్పిరిట్ను అక్రమంగా దిగుమతి చేస్తూ కల్తీ మద్యం తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. కల్తీ మద్యం తయారీ యూనిట్లు కొన్నింటిని ఇటీవల ఎక్సైజ్ శాఖ అధికారులు గుర్తించి కేసులు పెట్టడమే దీనికి నిదర్శనం. అసలు సూత్రధారులైన టీడీపీ పెద్దల జోలికి వెళ్లకుండా ఎక్సైజ్ శాఖను ప్రభుత్వ పెద్దలు కట్టడి చేసింది. అలాంటి బాబు డిస్టిలరీల పేరుతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఆరోపించడం దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా ఉంది.రామోజీ, రాధాకృష్ణ కుటుంబాల ఆస్తులన్నీ బాబువేనా?చంద్రబాబు కుట్ర ఎంత హాస్యాస్పదంగా ఉందంటే... కంటికి కనిపించే వారి ఆస్తులన్నీ వైఎస్ జగన్వేనని సిట్తో కట్టుకథలు చెప్పిస్తున్నారు. మరి ఈనాడు, ఏబీఎన్, టీవీ 5 తదతర ఎల్లో మీడియాతో చంద్రబాబు అక్రమ సంబంధం అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అడ్డదారిలో సీఎం కావడానికి 1995లో వైస్రాయ్ హోటల్ జరిగిన కుట్రలో ఆయన రాజ గురువు రామోజీరావు భాగస్వామి. ఆ తర్వాత వారి అవినీతి బంధం ఊడలు వేసింది. బాబు అండతోనే రామోజీ కుటుంబం ఫిలింసిటీ పేరుతో వేలాది ఎకరాలు గుప్పిట పట్టింది. మార్గదర్శి చిట్ఫండ్స్ ముసుగులో నల్లధనం దందా సాగిస్తోంది. అంటే, రామోజీ కుటుంబం ఆస్తులన్నీ చంద్రబాబు ఆస్తులే అవుతాయి కదా..? అంతేకాదు రామోజీ దగ్గర బంధువులకు, రామోజీ కుటుంబంతో వియ్యమందిన వారికి పోలవరం ప్రాజెక్టు, రామాయపట్నం, బందరు పోర్టు కాంట్రాక్టులు కట్టబెట్టింది. అంటే, వారి ఆస్తులన్నీ చంద్రబాబువేనని కూటమి ప్రభుత్వం ఒప్పుకొంటుందా...! ఇక టీడీపీ భజన బ్యాచ్ ఆంధ్రజ్యోతి– ఏబీఎన్ రాధాకృష్ణ, టీవీ 5 బీవీఆర్ నాయుడులకు చెందిన ఆస్తులన్నీ కూడా చంద్రబాబువే అవుతాయి కదా..? రాధాకృష్ణ డొక్కు సైకిల్ తొక్కుకుంటూ వచ్చి చేతికి అంటిన గ్రీజును తన చాంబర్కు వచ్చి కడుక్కున్నారని మాజీ సీఎం కొణిజేటి రోశయ్య అసెంబ్లీలోనే చెప్పిన విషయం అందరికీ గుర్తుంది. అటువంటి రాధాకృష్ణ ఏకంగా పేపర్, టీవీ చానల్ పెట్టడంతో పాటు విద్యుత్ ప్లాంట్లను నెలకొల్పడం వెనుక ఉన్నది చంద్రబాబే కదా...? ఆ వాస్తవాన్ని చంద్రబాబు అధికారికంగా అంగీకరించి వారందరి ఆస్తులను తన ఆస్తుల జాబితాలో ప్రకటించాలి. మరి అందుకు సిద్ధమా చంద్రబాబూ..!? -
బాబు కుతంత్రం..‘అప్రూవర్’ తంత్రం
భయపెట్టి.. ప్రలోభపెట్టి.. మద్యం అక్రమ కేసులో తిమ్మినిబమ్మి చేసేందుకు కూటమి ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. ఇంతా చేసి.. కోర్టుకు సమరి్పంచిన చార్జ్షీట్, రిమాండ్ రిపోర్ట్లో ఒక్క ఆధారమూ చూపలేదు. ఒకరిద్దరిని అప్రూవర్లుగా మార్చుకోవడమే తమ ముందున్న దారి అని చెప్పకనే చెప్పింది. ఫేక్ ఇన్వాయిస్లు అంటూ తనకు తానే స్వీయ ధ్రువీకరణ ఇచ్చుకుంది. ఫలానా సమయంలో ఫలానా సెల్ టవర్ పరిధిలో ఉండటమే ఆధారమని చెప్పుకు రావడం విడ్డూరం. సిట్ దర్యాప్తు తీరు చూస్తుంటే సీఎం చంద్రబాబునాయుడు కక్ష సాధింపు తప్ప ఈ కేసులో మరేమీ లేదని తేటతెల్లమవుతోంది. సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ కుట్ర మరోసారి బట్టబయలైంది. బెదిరించి, వేధించి అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో సాగిస్తున్న అక్రమ కేసు కుతంత్రాన్ని టీడీపీ కూటమి ప్రభుత్వమే మరోసారి బయట పెట్టుకుంది. చంద్రబాబు ప్రభుత్వం రచించిన ‘అప్రూవర్ కుట్ర’ తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ అక్రమ కేసులో బెవరేజెస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, పూర్వ ఉద్యోగి సత్య ప్రసాద్ను ఇప్పటికే తీవ్రంగా వేధించి, మరీ అబద్ధపు వాంగ్మూలం నమోదు చేయించిన కూటమి ప్రభుత్వం.. తాజాగా వారి ద్వారా అప్రూవర్ కుట్రకు తెగబడేందుకు యత్నించడం గమనార్హం. ప్రభుత్వ పెద్దల డైరెక్షన్లో సిట్ అధికారులు గుట్టుచప్పుడు కాకుండా ఈ కుతంత్రాన్ని చక్కబెట్టేందుకు యత్నించిన వ్యవహారం బయటపడింది. తద్వారా వైఎస్సార్సీపీ ప్రభుత్వం పారదర్శకంగా మద్యం విధానాన్ని అమలు చేసినట్టు చంద్రబాబు ప్రభుత్వం పరోక్షంగా అంగీకరించింది. లేని కుంభకోణం ఉన్నట్టుగా చూపించేందుకు తాము అబద్ధపు వాంగ్మూలాలపైనే ఆధార పడ్డామని నిస్సిగ్గుగా వెల్లడించింది. ఆ ఇద్దరూ సిట్ చీఫ్తో భేటీరాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలతోగానీ, మద్యం విధానంతో గానీ ఏమాత్రం సంబంధం లేని వారిని కూడా ప్రభుత్వ పెద్దల సూచనల మేరకు ఏ30 నుంచి ఏ40 వరకు నిందితులుగా పేర్కొని సిట్ అరెస్టు చేసింది. వారిలో ప్రపంచ స్థాయి సిమెంట్ దిగ్గజ సంస్థ వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పతోపాటు పలువురు ఉన్నారు. ఇదే కేసులో నిందితులైన వాసుదేవరెడ్డి(ఏ2), సత్య ప్రసాద్(ఏ3)లను బెదిరించి, అప్రూవర్లుగా మారేందుకు అనుమతించాలని, వారిద్దరితో విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో పిటిషన్ వేయించాలని పన్నాగం పన్నింది. ఇందులో భాగంగా శనివారం వారు విజయవాడ ఏసీబీ న్యాయస్థానానికి వచ్చారు. ముందుగా సిట్ కార్యాలయానికి వెళ్లారు. సిట్ చీఫ్ ఎస్వీ రాజశేఖర్బాబుతోపాటు ఇతర అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం కొందరు సిట్ అధికారులతో కలసి న్యాయస్థానంలో అప్రూవర్ పిటిషన్ దాఖలు చేసేందుకు వెళ్లారు. ఇలా వారిద్దరితో మరిన్ని అబద్ధపు వాంగ్మూలాలు న్యాయస్థానంలో నమోదు చేయించాలన్నది ప్రభుత్వ పెద్దల ఎత్తుగడగా స్పష్టమైంది. అయితే న్యాయ వర్గాలతో చర్చించిన వారు అప్రూవర్ పిటిషన్ దాఖలు చేయకుండా వెనక్కి తీసుకుని వెళ్లిపోయారు. ముందస్తు బెయిల్ పిటిషన్ నాటకం వాసుదేవరెడ్డి, సత్య ప్రసాద్ అప్రూవర్ పిటిషన్లు వేయకుండా వెనుదిరగడంపై సిట్ అధికారులు ఆందోళనకు గురైనట్లు సమాచారం. వీరిద్దరూ ఎదురు తిరిగితే ఈ అక్రమ కేసు పూర్తిగా నీరుగారి పోతుందని బెంబేలెత్తిన సిట్ అధికారులు ఈ విషయాన్ని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్లారు. వారి ఆదేశాలతో కొత్త ఎత్తుగడ వేశారు. వాసుదేవరెడ్డి, సత్య ప్రసాద్తో హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేయించారు. ఆ ముందస్తు బెయిల్ పిటిషన్లను న్యాయస్థానంలో వ్యతిరేకించకుండా సహకరిస్తామని సిట్ అధికారులు వారికి చెప్పినట్టు సమచారం. కాగా హడావుడిగా అప్పటికప్పుడు దాఖలు చేసిన ఆ పిటిషన్లకు తగిన పత్రాలు జతపరచ లేదు. దాంతో సాంకేతిక కారణాలతో న్యాయస్థానం ఆ పిటిషన్లను వెనక్కి పంపింది.అబద్ధపు వాంగ్మూలాలు ఇలా...⇒ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానం పూర్తి పారదర్శకంగా అమలైందని చంద్రబాబు ప్రభుత్వమే పరోక్షంగా అంగీకరించినట్లయిందని ఈ తాజా పరిణామాలు మరోసారి స్పష్టం చేశాయి. రెడ్బుక్ కక్ష సాధింపు కోసం తాము నమోదు చేసిన అక్రమ కేసు దర్యాప్తు కోసం పూర్తిగా అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలపైనే ఆధార పడ్డామని ప్రభుత్వమే బయట పెట్టుకుంది.⇒ బెవరేజెస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డితోపాటు ఇప్పటి వరకు ఇతర అధికారులు, సాక్షులతో తాము నమోదు చేయించినవన్నీ అబద్ధపు వాంగ్మూలాలే అన్నది స్పష్టమైంది. వాసుదేవరెడ్డిని అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని సిట్ అధికారులు వేధించారు. సిట్ వేధింపులపై ఆయన మూడుసార్లు హైకోర్టును ఆశ్రయించారు. అయినా సరే ప్రభుత్వం ఆయన్ను వెంటాడి వేధించింది. డెప్యుటేషన్ ముగిసినా రిలీవ్ చేయకుండా అడ్డుకుంది. కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేసింది. దీంతో చివరికి సిట్ చెప్పినట్టుగా ఆయన అబద్ధపు వాంగ్మూలం ఇచ్చారు. ఆ వెంటనే వాసుదేవరెడ్డిని రిలీవ్ చేసి కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.⇒ బెవరేజెస్ కార్పొరేషన్ పూర్వ ఉద్యోగులు సత్య ప్రసాద్, అనూషలను వేధించి అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయించింది. అబద్ధపు వాంగ్మూలాలు ఇచ్చేందుకు సమ్మతించని వారిపై సిట్ తన ప్రతాపం చూపించింది. కొన్ని డిస్టిలరీల ప్రతినిధులు వృద్ధులని కూడా చూడకుండా విచారణ పేరుతో హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకువచ్చి వేధించింది. దాంతో వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దాంతో వారిని హైదరాబాద్లోని వారి నివాసంలోనే విచారించాలని న్యాయస్థానం ఆదేశించింది. ⇒ ఈ కేసుతో ఏమాత్రం సంబంధం లేని రాజ్ కేసిరెడ్డి తండ్రిని బలవంతంగా తీసుకువచ్చి విచారణ పేరుతో వేధించింది. మరో నిందితుడి తండ్రి, రిటైర్డ్ కానిస్టేబుల్ను అక్రమంగా నిర్బంధించి మరీ వేధించడంతో ఆ కుటుంబం హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది.⇒ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి వద్ద గతంలో గన్మెన్గా పని చేసిన గిరి, మదన్ రెడ్డిలను అక్రమంగా నిర్బంధించి అబద్ధపు వాంగ్మూలం కోసం వేధించారు. బెంబేలెత్తిన గిరి సిట్ అధికారులు చెప్పినట్టు అబద్ధపు వాంగ్మూలం ఇచ్చారు. అందుకు సమ్మతించని మదన్ రెడ్డిపై సిట్ అధికారులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం విభ్రాంతి కలిగించింది. సిట్ అధికారులు తనపై భౌతికంగా దాడి చేశారని ఆయన న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు కూడా.⇒ అబద్ధపు వాంగ్మూలం ఇస్తే నామినేటెడ్ పదవి ఇవ్వడంతోపాటు రూ.2 కోట్లు ఇస్తామని ప్రభుత్వ పెద్దలు సిట్ అధికారుల ద్వారా చెవిరెడ్డి భాస్కర్రెడ్డి స్నేహితుడు వెంకటేశ నాయుడు దంపతులను ప్రలోభ పెట్టారు. అందుకు వారు తిరస్కరించడంతోనే ఈ కేసులో ఆయన్ను అరెస్టు చేశారు. ప్రభుత్వ పెద్దల అండతో ఈ అక్రమ కేసు దర్యాప్తు పేరిట సిట్ బరితెగించి సాగిస్తున్న అధికారిక గూండాగిరీకి ఈ పరిణామాలే నిదర్శనం.అబద్ధాలూ.. వక్రీకరణలే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసు కుట్రలో ప్రభుత్వం తన కుతంత్రాలకు మరింతగా పదును పెడుతోంది. పూర్తిగా అవాస్తవాలు, వక్రీకరణలతో నిబంధనలను ఉల్లంఘిస్తోంది. సిట్ దాఖలు చేసిన చార్జ్షీట్, ఎంపీ మిథున్ రెడ్డి రిమాండ్ నివేదికలే ఆ విషయాన్ని మరోసారి బయటపెట్టాయి. లేని కుంభకోణం ఉన్నట్టుగా చూపించేందుకు సిట్ యత్నిస్తోందని ఎంపీ మిథున్ రెడ్డి రిమాండ్ నివేదిక వెల్లడించింది. ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు సృష్టించలేకపోయిన సిట్ అధికారులు వక్రభాష్యాలతో కనికట్టు చేసేందుకు యత్నించారు. ఈ కేసులో ఇతర నిందితులతోపాటు ఎంపీ మిథున్ రెడ్డి సమావేశమై అక్రమాలకు కుట్ర పన్నారని సిట్ రిమాండ్ నివేదికలో పేర్కొంది. అందుకు సిట్ చూపించిన ఆధారం ఏమిటో తెలుసా.. సెల్టవర్ లొకేషన్! హైదరాబాద్లో సమావేశం జరిగిందని చెబుతున్న రోజున ఎంపీ మిథున్ రెడ్డి, ఇతర నిందితుల సెల్ ఫోన్లు అన్ని ఒకే చోట ఉన్నట్టు సెల్ టవర్ లొకేషన్ ద్వారా తెలుసుకున్నామని సిట్ పేర్కొనడం విడ్డూరంగా ఉంది. ఎందుకంటే సెల్ టవర్ పరిధి 200 చ.మీటర్లు ఉంటుంది. అంత పరిధిలో హైదరాబాద్ వంటి కాంక్రీట్ జంగిల్ వంటి మహానగరంలో వేలాది సెల్ ఫోన్లు ఉంటాయి. అంత మాత్రాన ఆ వేలాది మంది కూడా ఒక గదిలో సమావేశమైనట్టు భావించాలా? ఎక్కడ న్యాయం? ఎక్కడ ధర్మం?ఎంపీ మిథున్ రెడ్డి ఈ కేసుకు సంబంధించిన పలువురితో సెల్ ఫోన్లో మాట్లాడినట్టు కాల్ డేటా వివరాలు వెల్లడిస్తున్నాయని సిట్ అధికారులు రిమాండ్ నివేదికలో పేర్కొనడం విడ్డూరంగా ఉంది. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న కుటుంబం నుంచి వచ్చిన ఆయన ఎంపీ. లోక్సభలో వైఎస్సార్సీపీ నేతగా కీలక బాధ్యతల్లో ఉన్నారు. అటువంటి క్రియాశీల ప్రజాప్రతినిధి రోజూ ఎందరో నేతలు, కార్యకర్తలు, వివిధ వర్గాల ప్రజలతో ఫోన్లో మాట్లాడుతునే ఉంటారు. అంత మాత్రాన వారిందరితో కలసి కుట్ర పన్నినట్టు ఎలా భావిస్తారు? ఎలాంటి ఆధారాలు లేనందునే సిట్ అధికారులు సెల్ టవర్ లొకేషన్, కాల్ డేటాలను వక్రీకరిస్తూ న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించారన్నది స్పష్టమవుతోంది. దర్యాప్తు పేరిట సిట్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని చార్జ్షీట్ వెల్లడిస్తోంది. కేంద్ర జీఎస్టీ చట్టాన్ని ఉల్లంఘిస్తూ మరీ సిట్ అధికారులు తమ పరిధిని అతిక్రమించారు. మద్యం సరఫరా చేయకుండానే చేసినట్టు ఫేక్ ఇన్వాయిస్లు సమర్పించినట్టు తమ దర్యాప్తులో వెల్లడైనట్టు సిట్ అధికారులు చార్జ్షీట్లో పేర్కొన్నారు. అవి ఫేక్ ఇన్వాయిస్లని ఎలా గుర్తించారో మాత్రం వెల్లడించనే లేదు. కేంద్ర జీఎస్టీ అధికారులు నిర్ధారించకుండా అవి ఫేక్ ఇన్వాయిస్లనీ సిట్ అధికారులు ఏకపక్షంగా ఎలా తుది నిర్ణయానికి వచ్చారో అర్థం కావడం లేదు. అంటే లేని ఆధారాలు ఉన్నట్టుగా సిట్ అధికారులు న్యాయస్థానాన్నే తప్పుదారి పట్టించేందుకు తెగిస్తున్నారన్నది స్పష్టమవుతోంది. కుట్రపూరితంగానే కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఈ కేసులో సిట్ దాఖలు చేసిన చార్జ్షీట్ ఆధారంగానే నిగ్గు తేలింది. ఈ లెక్కన ఈ కేసులో ఎక్కడ న్యాయం ఉన్నట్లు? ఎక్కడ ధర్మం ఉన్నట్లు? ప్రభుత్వం కుట్రతోనే వ్యవహరిస్తున్నదని అడుగడుగునా స్పష్టమవుతోంది. -
లేని లిక్కర్ స్కాం ఉన్నట్టుగా.. వాళ్లే టార్గెట్గా సిట్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో రాజకీయ కక్ష సాధింపులు కొనసాగుతున్నాయి. లేని లిక్కర్ స్కాం పేరుతో వైఎస్సార్సీపీ కీలక నాయకుల అరెస్టుల పర్వం సాగుతోంది. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి సహా 11 మంది అరెస్టు చేయగా.. తాజాగా ఎంపీ మిథున్ రెడ్డిని కూడా సిట్ అరెస్టు చేసింది. ఇప్పటి వరకు 12 మందిని అరెస్టు చేసి 48 మంది పేర్లను ఛార్జిషీటులో సిట్ పేర్కొంది. మాజీ సీఎం వైఎస్ జగన్ చుట్టూ ఉన్న కీలక నేతల అరెస్టే లక్ష్యంగా సిట్ అధికారులు పనిచేస్తున్నారు.నిజానికి చంద్రబాబు హయాంలో కంటే వైఎస్ జగన్ జగన్ హయాంలోనే ప్రభుత్వానికి ఎక్కువగా వచ్చింది. అయినప్పటికీ రూ.3 వేల కోట్లు పక్కదారి పట్టాయంటూ తప్పుడు కేసు నమోదు చేశారు. రూ.50 వేల కోట్లు కొట్టేశారంటూ అసెంబ్లీలో చంద్రబాబు పచ్చి అబద్దాలు చెప్పారు. రూ.35 వేల కోట్లు అంటూ పవన్ కల్యాణ్ బొంకారు. ప్రభుత్వ పెద్దలు నోటి కొచ్చినట్లు మాట్లాడుతూ లేని స్కాంని ఉన్నట్టు భేతాళ కథలు అల్లుతున్నారు.టీడీపీ కేంద్ర కార్యాలయంలో తయారయ్యే స్క్రిప్టునే ఛార్జిషీటు, రిమాండ్ రిపోర్టుల్లో సిట్ పేర్కొంటుంది. ఎల్లోమీడియా తప్పుడు రాతలు, సిట్ తప్పుడు విచారణలపై వైఎస్సార్సీపీ మండిపడింది. కోర్టుల్లోనే న్యాయ పోరాటం చేస్తామని వైఎస్సార్సీపీ అంటోంది. ఇప్పటికే ఎంపీ మిథున్రెడ్డికి ఆ పార్టీ నేతలు సంఘీభావం తెలిపారు. -
పరాకాష్టకు బాబు భేతాళ కుట్ర
చంద్రబాబు ప్రభుత్వ రెడ్బుక్ భేతాళ కుట్రలు పరాకాష్టకు చేరాయి. కక్షసాధింపు కుతంత్రాల్లో తాజా అంకానికి టీడీపీ కూటమి సర్కారు తెరతీసింది. వైఎస్సార్సీపీ లోక్సభా పక్ష నేత, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి అక్రమ అరెస్టుకు తెగబడింది. ఎన్నికల మ్యానిఫెస్టో అమలు చేయలేని తమ వైఫల్యం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు డైవర్షన్ రాజకీయాలకు మరింత పదునుపెట్టింది. అసలు మద్యం విధానం ముసుగులో దోపిడీకి బ్రాండ్ అంబాసిడర్ బాబు అన్నది బహిరంగ రహస్యం. 2014–19లో టీడీపీ హయాంలో సాగించిన మద్యం దోపిడీ కేసులో ప్రధాన నిందితుడు ఆయనే. ఏకంగా రూ.25 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని సీఐడీ దర్యాప్తులో నిగ్గుతేలడం నిఖార్సైన నిజం. సీఐడీ ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేసిన ఆ కేసులో చంద్రబాబు ఇప్పటికీ బెయిల్పై బయట ఉన్నారు. ఇక 2024లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత రికార్డులను తిరగరాస్తూ మరింత భారీ దోపిడీకి తెగబడుతుండడం ప్రస్తుతం నడుస్తున్న కూటమి ప్రభుత్వ అవినీతి చరిత్రే.అలాంటి చంద్రబాబు.. వైఎస్సార్సీపీ హయాంలో పారదర్శకంగా అమలుచేసిన మద్యం విధానంపై అక్రమ కేసు నమోదు చేయడం కేవలం రెడ్బుక్ కుట్రేనన్నది సుస్పష్టం. వైఎస్సార్సీపీ హయాంలో జరగని కుంభకోణం జరిగినట్టుగా చూపించేందుకు టీడీపీ వీర విధేయ పోలీసు అధికారులతో సిట్ను ఏర్పాటుచేయడం చంద్రబాబు మార్కు కుతంత్రం. ఇక దర్యాప్తు ముసుగులో సాక్షులు, ఇతరులను వెంటాడి వేధించి అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలు సృష్టించడం టీడీపీ ప్రభుత్వ అధికారిక గూండాగిరీకీ తార్కాణం. ఆ భేతాళ కుట్రనే సిట్ ఈ కేసులో దాఖలు చేసిన ప్రాథమిక చార్జ్షీట్లో పేర్కొని న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించింది. కేవలం ఏడాదిలోనే టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర ప్రజావ్యతిరేకత వెల్లువెత్తుతుండడంతో ప్రజల దృష్టి మళ్లించేందుకు చంద్రబాబు సాగిస్తున్న రాజకీయ భేతాళ కుట్ర ఇదిగో ఇలా ఉంది. సాక్షి, అమరావతి: బాబు స్క్రిప్టు... భేతాళ కుట్ర... అందుకుతగ్గట్టు అబద్ధపు వాంగ్మూలాలు...! చంద్రబాబు డైరెక్షన్లో సాగుతున్న భేతాళ కుట్ర కేసులో సిట్ దర్యాప్తు పేరిట బరితెగిస్తోంది. అక్రమ కేసులో లేని ఆధారాలను సృష్టించేందుకు వేధింపులనే అస్త్రంగా చేసుకుంది. సిట్ దాఖలు చేసిన చార్జ్షీట్లో పేర్కొన్న వాంగ్మూలాలన్నీ కూడా బెదిరించి, వేధించి నమోదు చేసినవే కావడం గమనార్హం. బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి అబద్ధపు వాంగ్మూలాన్నే సిట్ ఈ అక్రమ కేసుకు ప్రధాన ఆధారంగా చేసుకుంది. ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టు తొలుత అబద్ధపు వాంగ్మూలం నమోదుకు నిరాకరించిన ఆయన సిట్ బెదిరింపులకు వ్యతిరేకంగా మూడుసార్లు హైకోర్టును ఆశ్రయించారు. అయినా సరే ప్రభుత్వం వాసుదేవరెడ్డిని వెంటాడి వేధించింది. డెప్యుటేషన్ ముగిసినా రిలీవ్ చేయకుండా అడ్డుకుంది. కుటుంబసభ్యులను భయభ్రాంతులకు గురిచేసింది. చివరికి సిట్ చెప్పినట్టుగా ఆయన అబద్ధపు వాంగ్మూలం ఇచ్చారు. ఆ వెంటనే వాసుదేవరెడ్డిని రిలీవ్ చేసి కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది.⇒ ఇదే రీతిలో బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఉద్యోగులు సత్యప్రసాద్, అనూషలను వేధించి అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయించింది. ⇒ చంద్రబాబు కుట్రలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా భాగస్వామి అయ్యారు. రాజ్యసభ సభ్యుడిగా మరో మూడున్నరేళ్లు సమయం ఉన్నా సరే పదవికి రాజీనామా చేసి.. టీడీపీ కూటమికి రాజ్యసభలో ఎంపీ సీటు దక్కేలా చేశారు. అనంతరం చంద్రబాబు చెప్పమన్నట్టుగా.. సిట్ విచారణకు హాజరై అబద్ధపు వాంగ్మూలం ఇవ్వడం గమనార్హం.⇒ ఈ అక్రమ కేసులో అబద్ధపు వాంగ్మూలాలు ఇచ్చేందుకు అంగీకరించని వారిపైన సిట్ తన ప్రతాపం చూపించింది. కొన్ని డిస్టిలరీల ప్రతినిధులు వృద్ధులు అని కూడా చూడకుండా విచారణ పేరుతో హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకొచ్చి వేధించింది. దాంతో వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో... హైదరాబాద్లోని వారి నివాసంలోనే విచారించాలని కోర్టు ఆదేశించింది. కేసుతో ఏమాత్రం సంబంధం లేని రాజ్ కేసిరెడ్డి తండ్రిని బలవంతంగా తీసుకొచ్చి విచారణ పేరుతో వేధించింది. మరో నిందితుడి తండ్రి, రిటైర్డ్ కానిస్టేబుల్ను అక్రమంగా నిర్బంధించి మరీ వేధించడంతో ఆ కుటుంబం హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది.⇒ ఈ కేసులో అరెస్టయిన రాజ్ కేసిరెడ్డి, శ్రీధర్రెడ్డి విచారణలో చెప్పని విషయాలు చెప్పినట్టుగా రిమాండ్ నివేదికలో పేర్కొనడం సిట్ కుట్రను బట్టబయలు చేసింది. ⇒ వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి వద్ద గతంలో గన్మెన్గా పనిచేసిన గిరి, మదన్రెడ్డిలను అక్రమంగా నిర్బంధించి అబద్ధపు వాంగ్మూలం కోసం తీవ్రంగా వేధించారు. బెంబేలెత్తిన గిరి సిట్ అధికారులు చెప్పినట్టు అబద్ధపు వాంగ్మూలం ఇచ్చారు. అందుకు సమ్మతించని మదన్రెడ్డిపై సిట్ అధికారులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం విభ్రాంతికర విషయం. సిట్ అధికారులు తనపై భౌతికంగా దాడి చేశారని మదన్రెడ్డి న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు కూడా. ఇక అబద్ధపు వాంగ్మూలం ఇస్తే నామినేటెడ్ పదవితో పాటు రూ.2కోట్లు ఇస్తామని ప్రభుత్వ పెద్దలు సిట్ అధికారుల ద్వారా చెవిరెడ్డి భాస్కర్రెడ్డి స్నేహితుడు వెంకటేశ్నాయుడు దంపతులను ప్రలోభపెట్టారు. వారు తిరస్కరించడంతో అక్రమ కేసులో వెంకటేశ్నాయుడును అరెస్టు చేశారు. ⇒ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంతో ఏమాత్రం సంబంధం లేని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్రెడ్డిలను కూడా సిట్ అక్రమంగా అరెస్టు చేసింది. ⇒ అసలు రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలతో కూడా సంబంధం లేని ప్రపంచ దిగ్గజ సిమెంట్ కంపెనీ వికాట్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను అక్రమంగా అరెస్టు చేయడం సిట్ కుట్రకు పరాకాష్ట.విజయవాడ సిట్ కార్యాలయానికి వెళుతున్న పెద్దిరెడ్డి మిథున్రెడ్డి లేని కుంభకోణం ఉన్నట్టుగా చూపించే కుతంత్రమే..దర్యాప్తు పేరిట సిట్ ఎందుకు ఇంతగా నిబంధనలకు విరుద్ధంగా బరితెగిస్తోంది...!? అంటే వినిపించే ఏకైక సమాధానం.. అసలు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంలో ఎలాంటి అక్రమాలు జరగనే లేదు. ఎలాంటి అవినీతి లేదు కాబట్టే లేని ఆధారాలు సృష్టించేందుకు సిట్ ఇంతగా దిగజారుతోంది. 2019–24 మధ్య వైఎస్సార్సీపీ ప్రభుత్వం దశలవారీ మద్య నియంత్రణ విధానాన్ని సమర్థంగా అమలు చేసింది. అంతకుముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో దోపిడీకి పాల్పడ్డ ప్రైవేటు మద్యం దుకాణాల విధానాన్ని రద్దు చేసింది. ప్రభుత్వ మద్యం దుకాణాలను ప్రవేశపెట్టింది. దుకాణాల వేళలను కుదించింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న 4,380 మద్యం దుకాణాలను దశలవారీగా 2,934కు తగ్గించింది. చంద్రబాబు ప్రభుత్వం అనధికారిక బార్లుగా లైసైన్సులు జారీ చేసిన 4,380 పర్మిట్ రూమ్లను రద్దు చేసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో కొనసాగిన 43 వేల బెల్ట్ దుకాణాలను తొలగించింది. రాష్ట్రంలోని 20 డిస్టిలరీల్లో 14 డిస్టిలరీలకు చంద్రబాబు ప్రభుత్వమే అనుమతులు జారీ చేసింది. మిగిలిన ఆరు డిస్టిలరీలకు అంతకుముందు ప్రభుత్వాలు లైసెన్సులు మంజూరు చేశాయి. మొత్తం డిస్టిలరీలను బెవరేజస్ కార్పొరేషన్ ద్వారా మద్యం కొనుగోళ్లకు ఎంప్యానల్ చేసింది చంద్రబాబు ప్రభుత్వమే. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒక్క మద్యం డిస్టిలరీకి కూడా లైసెన్సులు మంజూరు చేయలేదు. ఈ విప్లవాత్మక చర్యలతో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయి.⇒ మద్యం అమ్మకాలు పెరిగితే డిస్టిలరీలకు లాభాలు వస్తాయి కాబట్టి ప్రభుత్వ పెద్దలకు కమీషన్లు ఇస్తాయి. కానీ, వైఎస్సార్సీపీ హయాంలో మద్యం అమ్మకాలు తగ్గడంతో డిస్టిలరీలకు లాభాలు తగ్గాయి. మరి కమీషన్లు ఎందుకు ఇస్తాయి...? ఇవ్వనే ఇవ్వవు. ఎలాంటి అవినీతి లేని వైఎస్సార్సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసులో సిట్ ఆధారాలు సేకరించలేకపోతోంది. అందుకే అప్పటి అధికారులు, ఇతర సాక్షులను బెదిరించి అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయడమే పనిగా పెట్టుకుంది. వాటి ఆధారంగా కేసును కొనసాగించడమే సిట్ ఏకైక విధానంగా మారింది. ఆ కుట్రనే చార్జ్షీట్ రూపంలో కూడా కొనసాగించింది.మిథున్ రెడ్డి అక్రమ అరెస్ట్శనివారం ఎంపీ మిథున్రెడ్డి స్వచ్ఛందంగా సిట్ అధికారుల ఎదుట హాజరయ్యారు. ఈ అక్రమ కేసులో గతంలో ఓసారి ఆయన సిట్ విచారణకు హాజరయ్యారు. ఢిల్లీ నుంచి వచి్చన మిథున్రెడ్డి నేరుగా సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 8 వరకు సిట్ అధికారులు ఆయనను విచారించారు. అనంతరం మిథున్ను అరెస్ట్ చేసి విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు తెలిపారు. మిథున్రెడ్డిని ఆదివారం ఉదయం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అనంతరం ఏసీబీ న్యాయస్థానం న్యాయమూర్తి నివాసంలో హాజరుపరుస్తారని తెలుస్తోంది. ⇒ సిట్ అధికారుల విచారణలో...వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంలో ఎలాంటి అవినీతి, అక్రమాలు జరగలేది ఎంపీ మిథున్రెడ్డి సాధికారికంగా తేల్చిచెప్పారు. ఎంపీ అయిన తనకు రాష్ట్ర ప్రభుత్వ విధానాలలో ఏమాత్రం ప్రమేయం ఉండదని కుండబద్ధలు కొట్టారు. ⇒ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై సిట్ అధికారులు మిథున్ను పలు ప్రశ్నలు వేశారు. అయితే ఆయనపై అభియోగాలకు సంబంధించి సిట్ అధికారులు సరైన ఆధారాలను చూపించలేకపోయారు. ఈ కేసులో సిట్ బెదిరించి, వేధించి నమోదు చేసిన అబద్ధపు వాంగ్మూలాల ఆధారంగానే ఎంపీ మిథున్రెడ్డిని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఆ అవాస్తవ ఆరోపణలను మిథున్ సమర్థంగా తిప్పికొట్టారు. ⇒ సిట్ అరెస్టు చేసిన రాజ్ కేసిరెడ్డితో తనకు ఎలాంటి వ్యాపార సంబంధాలు లేవని మిథున్రెడ్డి స్పష్టం చేశారు. అయినా సరే, ప్రభుత్వ పెద్దల కుట్రనే సిట్ అధికారులు ఏకపక్షంగా అమలు చేశారు. అవాస్తవాల పుట్ట.. రెడ్బుక్ కుట్ర సిట్ చార్జ్షీట్చంద్రబాబు ప్రభుత్వ రెడ్బుక్ కుట్రకు సిట్ చార్జ్షీట్ అద్దంపట్టింది. పూర్తిగా అవాస్తవాలు, అభూత కల్పనలతో దీన్ని రూపొందించింది. ప్రాథమిక చార్జ్షీట్ను సిట్ అధికారులు ఏసీబీ న్యాయస్థానం న్యాయమూర్తికి శనివారం సమర్పించారు. గతంలో తాము బెదిరించి వేధించి నమోదు చేసిన అబద్ధపు వాంగ్మూలాలు, సృష్టించిన తప్పుడు సాక్ష్యాల వివరాలను చార్జిషీట్లో పునరుద్ఘాటించారు. తద్వారా రాజకీయ కక్షసాధింపే తమ లక్ష్యమని పరోక్షంగా అంగీకరించారు. నెలల తరబడి దర్యాప్తు పేరుతో చేసిన హడావుడి అంతా కనికట్టేనని... టీడీపీ ప్రధాన కార్యాలయం ఇచ్చిన స్క్రిప్ట్నే దర్యాప్తు నివేదిక పేరుతో సమర్పించామని చేతల్లో చూపించింది. ఈ అక్రమ కేసులో అదనంగా 8 మంది.. సైమన్ ప్రసన్, కొమ్మారెడ్డి అవినాశ్రెడ్డి, అనిల్కుమార్రెడ్డి, సుజన్ బెహ్రాన్, మోహన్, రాజీవ్ప్రతాప్, బొల్లారం శివకుమార్, ముప్పిడి అవినాశ్రెడ్డిలను నిందితులుగా పేర్కొంది. దాంతో నిందితుల సంఖ్య 41కు చేరింది. జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న 11 మంది రిమాండ్, ఫోరెన్సిక్ నివేదికలు, జప్తు చేసిన స్థిరాస్తులు, స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉపకరణాల జాబితా, ఇతర వివరాలను పొందుపరచినట్టు తెలుస్తోంది. ఈ అక్రమ కేసులో త్వరలో అనుబంధ చార్జ్షీట్లను దాఖలు చేయాలని సిట్ భావిస్తోంది. ఊరూపేరు లేని 200 బ్రాండ్లను ప్రవేశపెట్టారు మద్యం కుంభకోణంలో వినిపిస్తున్న మరో మాట ఊరూపేరూ లేని బ్రాండ్లు. అసలు ఇలాంటి బ్రాండ్లను ప్రవేశపెట్టడమే దోపిడీకి కారణమైతే ఆ అవినీతి పాపం కచ్చితంగా చంద్రబాబుదే. ఎందుకంటే 2014–19 మధ్యన రాష్ట్రంలో ఎన్నడూ వినిపించని దాదాపు 200 బ్రాండ్లను తెచ్చారు చంద్రబాబు. అందులో కొన్నిటి పేర్లు... ప్రెసిడెంట్ మెడల్, గవర్నర్ రిజర్వ్, పవర్ స్టార్, లెజెండ్, లెఫైర్ నెపోలిన్, ఓక్టోన్ బారెల్ ఏజ్డ్, సెవెన్త్ హెవెన్ బ్లూ, హైవోల్టేజ్, వోల్టేజ్ గోల్డ్, ఎస్ఎన్జీ 10000, బ్రిటీష్ అంపైర్ సూపర్ స్ట్రాంగ్ ప్రీమియం బీర్, బ్రిటీష్ ఎంపైర్ అల్ట్రా, రాయల్ ప్యాలస్, న్యూ కింగ్, సైన్ అవుట్, బీరా 91, టీఐ మ్యాన్షన్ హౌస్, టీఐ కొరియర్ నెపోలియన్.వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అసలు మద్యం విధానంలో ఎలాంటి అవకతవకలు జరగనే లేదు. కొత్త డిస్టిలరీలకు అనుమతి ఇవ్వలేదు. ప్రైవేటు మద్యం దుకాణాలను తొలగించారు. పర్మిట్ రూమ్లను రద్దు చేశారు. బెల్ట్ దుకాణాలు తొలగించారు. ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏర్పాటు చేసి దుకాణాల సంఖ్యను తగ్గించారు. ఇలా అవినీతికి కారణమయ్యే అన్ని మూలాలను సమూలంగా రూపుమాపారు. అయినా సరే చంద్రబాబు ప్రభుత్వం ప్రస్తుతం అక్రమ కేసు నమోదు చేయడం కేవలం రెడ్బుక్ కుట్రే .అసలు స్కాం ఎవరిది? లంచాలు ఎవరికి ఇస్తారు?టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే వైఎస్సార్సీపీ పాలనలో అమ్మకాలు తగ్గాయి.. ఈ నేపథ్యంలో లిక్కర్ వ్యవహారంలో వాస్తవంగా స్కాంలు చేసింది ఎవరు? అనేది పరిశీలిస్తే..⇒ మద్యాన్ని ఎక్కువగా అమ్మితే లంచాలు ఇస్తారా? అమ్మకాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా? ⇒ మద్యం అమ్మకాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే లంచాలు ఇస్తారా? లేక ప్రభుత్వం ద్వారా మాత్రమే అమ్మితే లంచాలు ఇస్తారా? ⇒ విక్రయ వేళలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా? లేక ఎక్కువ సమయం అమ్మేలా చేస్తే లంచాలు ఇస్తారా? ⇒ మద్యం దుకాణాలను పెంచితే లంచాలు ఇస్తారా? దుకాణాలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా? ⇒ దుకాణాలకు తోడు పర్మిట్ రూమ్లు, బెల్టు షాప్లు పెడితే లంచాలు ఇస్తారా? లేక బెల్టు షాపులు తీసేసి, పర్మిట్ రూమ్స్ను రద్దు చేస్తే లంచాలు ఇస్తారా? ⇒ 2014-19లో చంద్రబాబు నిర్ణయించిన బేసిక్ రేట్లను పెంచి.. డిస్టిలరీల నుంచి కొనుగోళ్లు చేస్తే లంచాలు వస్తాయా? లేక పాత రేట్లను కొనసాగిస్తే లంచాలు వస్తాయా?⇒ మద్యంపై తక్కువ ట్యాక్స్ల ద్వారా ఎక్కువ అమ్మకాలు చేసే విధంగా డిస్టిలరీలకు మేలు చేస్తే లంచాలు వస్తాయా? లేక ట్యాక్స్లు పెంచి, తద్వారా అమ్మకాలు తగ్గితే లంచాలు వస్తాయా? ⇒ ఎంపిక చేసుకున్న 4ృ5 డిస్టిలరీలకు మాత్రమే అధికంగా ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా? అన్ని డిస్టిలరీలకు సమాన స్థాయిలో ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా? ⇒ ఇప్పుడున్న డిస్టిలరీలలో అధిక భాగం అనుమతులు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న వారికి లంచాలు వస్తాయా? లేక ఏ ఒక్క డిస్టిలరీకీ అనుమతివ్వని వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉన్నవారికి లంచాలు వస్తాయా? వైఎస్సార్సీపీ హయాంలో.. ⇒ 2019-24 మధ్య ఐదేళ్లలో కొత్తగా ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. మద్యం విధానంలో అక్రమ దందా సాగించే సిండికేట్ వ్యవస్థను పూర్తిగా ఎత్తివేసింది. ⇒ లిక్కర్ షాపుల నుంచి పూర్తిగా ప్రైవేటు వ్యక్తులను తొలగించింది. ప్రభుత్వ ఆధీనంలోనే అమ్మకాలు సాగించింది. ⇒ 33 శాతం మద్యం దుకాణాలను తీసివేసింది. షాపుల సంఖ్యను 4,380 నుంచి 2,934కు తగ్గించింది. ⇒ మద్యం దుకాణాలకు అనుబంధంగా ఉన్న 43 వేల బెల్టు షాపులను, 4,380 పర్మిట్ రూమ్లను రద్దు చేసింది. ⇒ మద్యం ధరలను షాక్ కొట్టేలా పెంచింది. ఎక్సైజ్కు సంబంధించిన నేరాలకు పాల్పడితే శిక్షలను కఠినం చేసింది. ⇒ మద్యం విక్రయాల వేళలను కుదించింది. ప్రతి ఊరికి ఒక మహిళా పోలీసును నియమించింది. దీంతో మద్యం అమ్మకాలు బాగా తగ్గాయి. -
మిథున్ రెడ్డి సిట్ విచారణపై ఉత్కంఠ
-
మిథున్ రెడ్డి విచారణపై దేవినేని అవినాష్ రియాక్షన్
-
విచారణపై మిథున్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్
-
విచారణకు మిథున్ రెడ్డి.. సిట్ ఆఫీస్ వద్ద భారీగా పోలీసుల మోహరింపు
-
కేసులకు భయపడే ప్రసక్తే లేదు: పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి
-
Telangana phone tapping case: బండి సంజయ్కు సిట్ నోటీసులు
సాక్షి,కరీంనగర్: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తొలిసారి వెలుగులోకి తీసుకువచ్చిన కేంద్ర మంత్రి బండి సంజయ్కు సిట్ నోటీసులు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని ఎంపీ బండి సంజయ్కు నోటీసులు జారీ చేసింది. కేంద్ర మంత్రితో పాటు పీఆర్వో, పీఏలకూ సిట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈమేరకు సిట్ విచారణలో హైదరాబాద్ లేక్ వ్యూ గెస్ట్ హౌస్లో స్టేట్మెంట్ ఇచ్చేందుకు అంగీకరించారు. అదే రోజు పీఆర్వో, పీఏల స్టేట్మెంట్ను సిట్ పోలీసులు రికార్డ్ చేయనుంది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం సిట్ అధికారులు కేంద్ర మంత్రి నివాసానికి వెళ్లి నోటీసులు అందించారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్.. ప్రభాకర్ రావుకు ఝలక్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ క్రమంలో సిట్ అధికారులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్నట్టు సమాచారం. ఈ మేరకు డీసీపీ విజయ్కుమార్, ఏసీపీ వెంకటగిరి ఢిల్లీకి వెళ్లారు.అయితే, గతంలో ప్రభాకర్ రావును అరెస్ట్ చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మినహాయింపులు రద్దు చేయాలని సుప్రీంకోర్టును సిట్ అధికారులు కోరనున్నారు. ప్రభాకర్ రావు విచారణకు సహకరించకపోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభాకర్ రావును కస్టడీకి తీసుకోవాలని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ల్యాప్టాప్, ఫోన్ను సిట్ అధికారులు సీజ్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావు డేటా కీలకంగా మారనుంది. వీటి నుంచి డేటాను సేకరించి పనిలో అధికారులు ఉన్నారు. ప్రభాకర్ రావు ల్యాప్టాప్, ఫోన్ను ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్కి సిట్ అధికారులు పంపించారు. ఈ క్రమంలో 2023 అక్టోబర్ నుండి మార్చి15 వరకు కాల్ డేటాను బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ప్రభాకర్ రావు.. పలువురు బీఆర్ఎస్ నేతలతో, పోలీసు ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపినట్టు సిట్ అనుమానం వ్యక్తం చేస్తోంది.ఇక, ఇప్పటికే నిందితులు, బాధితుల స్టేట్మెంట్ ఆధారంగా సిట్ అధికారులు ప్రభాకర్ రావును విచారిస్తున్నారు. రేపు మరోసారి సిట్ ముందుకు ప్రభాకర్ రావు రానున్నారు. 2023 నవంబర్ 15 నుండి 30 వరకు అందిన సర్వీసు ప్రొవైడర్ డేటాలో 618 ఫోన్ నెంబర్లను సిట్ గుర్తించినట్టు తెలుస్తోంది. మరోవైపు.. ధ్వంసమైన హార్డ్ డిస్కులలో ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన డేటా ఉన్నట్టు సమాచారం. దీంతో, సిట్ అధికారులు.. హార్డ్ డిస్కులపైన ఆశలు పెట్టుకున్నారు. డేటా రిట్రైవ్, హార్డ్ డిస్కులోని రహస్యాలపై సిట్ ఆరా తీస్తోంది. -
దేవుడు చూస్తూ ఊరుకోడు: చెవిరెడ్డి
సాక్షి, విజయవాడ: లిక్కర్ స్కాం కేసు ఎదుర్కొంటున్న వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తప్పుడు కేసులో తనను అక్రమంగా ఇరికించారని మీడియా ముందు వాపోయారాయన. ఈ కేసులో సిట్ కస్టడీకి తరలించే క్రమంలో మంగళవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సమయంలో పోలీసులు ఆయనతో దురుసుగా ప్రవర్తించారు.‘‘నాపై తప్పుడు కేసులు పెట్టారు. అన్నింటికీ కాలం సమాధానం చెబుతుంది. దేవుడు చూస్తూ ఊరుకోడు’’ అని అన్నారాయన. ఆ సమయంలో పోలీసులు ఆయన్ని బలవంతంగా వాహనం ఎక్కించే ప్రయత్నం చేశారు. కాగా, ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు నేటి(జులై 1వ తేదీ) నుంచి చెవిరెడ్డితో పాటు వెంకటేష్ నాయుడిని సిట్ మూడు రోజులపాటు విచారించనుంది.విచారణకు ముందు జిల్లా జైలు నుంచి చెవిరెడ్డిని అక్కడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు ముగిసిన అనంతరం విచారణ నిమిత్తం సిట్ కార్యాలయానికి తరలించారు. -
ఆడియోలు వినిపిస్తూ... పత్రాలు చూపిస్తూ!
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. బాధితుల్ని సాక్షులుగా పరిగణిస్తూ వారినుంచి వాంగ్మూలాలు సేకరించడంతో పాటు వాళ్లు కచ్చితంగా న్యాయస్థానం వరకు వచ్చి సాక్ష్యం చెప్పేలా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా వారి ఫోన్లు ఎలా ట్యాప్ అయ్యాయో చూపిస్తోంది. నేతలతో పాటు వారి కుటుంబీకులు, అనుచరుల సంభాషణల ఆడియోలను వినిపిస్తూ, సంబంధిత పత్రాలను చూపిస్తూ వాంగ్మూలాలు తీసుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 2023 నవంబర్ 15 నుంచి 30 మధ్యే ప్రభాకర్రావు నేతృత్వంలోని ఎస్ఐబీ 4,013 ఫోన్లపై నిఘా ఉంచినట్లు సిట్ గుర్తించింది. వీటిలో 618 రాజకీయ నాయకులకు సంబంధించినవిగా తేల్చింది. మరోపక్క కేసులో మరో నిందితుడు ప్రణీత్రావు ఫోన్ నుంచి సిట్ అధికారులు కొన్ని ఆడియోలు సేకరించారు. వాస్తవానికి రాష్ట్రంలో ప్రభుత్వం మారిన వెంటనే ప్రభాకర్రావుతో పాటు ఆయన టీమ్ మొత్తం తమ ఫోన్లలో ఉన్న డేటాను డిలీట్ చేయడంతో పాటు ఫోన్లను ధ్వంసం చేసింది. అయితే ప్రణీత్కు సంబంధించిన ఓ ఫోన్లో మాత్రం డేటా డిలీట్ కాకపోవడంతో అది సిట్ చేతికి చిక్కింది. రాజకీయ నాయకులతో పాటు వారి సంబంధీకుల ఫోన్లను ట్యాప్ చేసిన ప్రణీత్ ఆ ఆడియోలను ‘పెద్దలకు’ షేర్ చేసినట్లు సిట్ అనుమానిస్తోంది. ప్రస్తుతం సిట్ సాక్షులకు ఈ ఆడియోలను వినిపించడంతో పాటు వివిధ లేఖల్ని చూపిస్తోంది. ఆ తర్వాతే వివిధ అంశాలను ప్రశ్నిస్తూ వారి వాంగ్మూలం నమోదు చేస్తోంది. కొందరు సాక్షులు, నిందితుల్ని ఎదురెదురుగా పెట్టి స్టేట్మెంట్లు తీసుకుంటోంది. అప్పటి ప్రభుత్వం దిగజారి వ్యవహరించింది..ప్రణీత్రావు బుధవారం మరోసారి సిట్ ఎదుట హాజరయ్యారు. తెలంగాణ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఫహీమ్ ఖురేషీ, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్లతో పాటు కామారెడ్డికి చెందిన వివిధ పార్టీల నేతలు సిట్ ఎదుట హాజరై వాంగ్మూలాలు ఇచ్చారు. కాగా ఫహీమ్ ఖురేషీ మీడియాతో మాట్లాడుతూ.. ‘నా ఫోన్ ట్యాప్ అయిందని డీసీపీ నుంచి సమాచారం అందింది. నా ఫోన్తో పాటు నా భార్య, డ్రైవర్ ఫోన్లనూ ట్యాప్ చేశారు. అధికారం కోసం నీచానికి దిగజారారు. బహుశా ట్యాపింగ్ ద్వారా తెలుసుకున్న సమాచారంతోనే ఎన్నికల ముందు నాపై చాలా ఒత్తిడి తెచ్చారు..’ అని చెప్పారు. బల్మూరి వెంకట్ మాట్లాడుతూ..‘బీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయాల కోసం నీచానికి దిగజారింది. తల్లి, పిల్ల అనే తేడా లేకుండా అందరి ఫోన్లు ట్యాప్ చేసింది. మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసింది..’ అని చెప్పారు. కాగా 2023 ఎన్నికల సమయంలో ప్రభాకర్రావు కామారెడ్డిలో ప్రత్యేకంగా ఓ మినీ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి మరీ ట్యాపింగ్ చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. బుధవారం వరకు దాదాపు 235 మంది వాంగ్మూలాలను సిట్ నమోదు చేసినట్లు తెలిసింది. -
ట్యాపింగ్ కేసును ఇంకెంత కాలం సాగదీస్తారు: ఈటల
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ విచారణ ముగిసింది. మంగళవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో గంటన్నరపాటు ప్రశ్నించి ఈటల స్టేట్మెంట్ను పోలీసులు రికార్డు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ కేసు ఇంకెంత కాలం సాగదీస్తారు?. ఎంత కాలం విచారణ జరుపుతారు. బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. ఇంకెంత కాలం విచారిస్తారు. ఎస్ఐబీ చీఫ్గా ప్రభాకర్రావు నియామకమే అక్రమం. హుజురాబాద్ ఉప ఎన్నిక సమయంలో నా ఫోన్ ట్యాప్ చేశారు. అనేకసార్లు నా ఫోన్ ట్యాప్ చేశారు. రాజకీయ నేతలే కాదు.. జడ్జీలు, సెలబ్రిటీల ఫోన్లూ ట్యాప్ చేశారు. గవర్నర్ ఇంద్రాసేనా రెడ్డి ఫోన్ కూడా ట్యాప్ చేశారు. ఎవరి ఆదేశాలతో ప్రభాకర్ రావు ట్యాపింగ్ చేశారు?. ఎవరి అండతో ట్యాపింగ్ చేశారు? ఫోన్ ట్యాపింగ్పై సమగ్ర దర్యాప్తు జరగాలి. ఇప్పటికైనా దోషుల్ని కఠినంగా శిక్షించాలి. ఈ వ్యవహారంలో ఎంతటి వారున్న చట్టపరంగా శిక్షించాలి.. అని ఈటల డిమాండ్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు సాక్షుల స్టేట్మెంట్ను సిట్ రికార్డు చేసింది. బీజేపీ లీగల్ సెల్తో కలిసి సిట్ కార్యాలయానికి సాక్షిగా ఇవాళ్టి విచారణకు ఈటల హాజరయ్యారు. బీజేపీ నేత ప్రేమేందర్ స్టేట్మెంట్ను కూడా అధికారులు నమోదు చేశారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిట్ కీలక నిర్ణయం!
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో సిట్ దూకుడు పెంచింది. ప్రభాకర్రావు వ్యవహారంలో సిట్ బృందం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. త్వరలో సుప్రీంకోర్టును పోలీసులు ఆశ్రయించనున్నారు. ప్రభాకర్రావు విచారణకు సహకరించడం లేదంటున్న సిట్.. ఈ నేపథ్యంలో ఆయనకు ఇచ్చిన రిలీఫ్ రద్దు చేయాలని కోరనున్నట్లు సమాచారం. మరో వైపు ప్రభాకర్రావును కస్టోడియల్ విచారణ చేసేందుకు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేసే అవకాశం ఉంది.ఇప్పటికే మూడుసార్లు ప్రభాకర్రావుని విచారించిన పోలీసులు.. నాలుగోసారి కూడా విచారిస్తున్నారు. పలువురు సీనియర్ అధికారుల పేర్లు చెప్పడంతో రివ్యూ కమిటీ సభ్యులను పోలీసులు విచారించారు. త్వరలో మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి స్టేట్మెంట్ను సైతం పోలీసులు సైతం రికార్డ్ చేయనున్నారు. నిందితుల విచారణతో పాటు సాక్షుల వాంగ్మూలాలు కూడా సిట్ అధికారులు సేకరిస్తున్నారు.ఫోన్ ట్యాపింగ్ కోసం టెలికాం సర్వీసెస్కు పంపిన నంబర్లపై సిట్ ఆరా తీస్తోంది. సిట్ అధికారులు స్వయంగా వెళ్లి జితేందర్, అనిల్ నుంచి లిఖిత పూర్వకంగా వివరాలు తీసుకున్నట్లు సమాచారం. ప్రభాకర్రావు టీం మావోయిస్టు సానుభూతిపరులు అంటూ ఇచ్చిన ఫోన్ నెంబర్లు ట్యాపింగ్కు అనుమతి ఇవ్వడంపై స్టేట్మెంట్ రికార్డ్ చేశారు.ఫోన్ ట్యాపింగ్కు ఐజీ లేదా ఆ పై స్థాయి ఆఫీసర్కే అధికారం ఉంది. పదవి విరమణ పొంది.. ఓఎస్డీగా ఉన్న ప్రభాకర్రావును ఫోన్ లీగల్ ఇంటర్ సెప్సన్కు డిసిగ్నటెడ్ అథారిటీగా నియమించడంపై సిట్ ఆరా తీస్తోంది. డిసిగ్నేటెడ్ అథారిటీకి 7 రోజులు మాత్రమే అనుమానిత ఫోన్ నెంబర్లపై నిఘా పెట్టే అవకాశం.. గడువు ముగిసిన తర్వాత నిఘా పెట్టాలంటే రివ్యూ కమిటీ అనుమతి తప్పనిసరి.. కానీ ప్రభాకర్రావు ఇష్టం వచ్చినట్లు ట్యాపింగ్కు పాల్పడినట్లు సిట్ గుర్తించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్రావు, ప్రణీత్రావు స్టేట్మెంట్లు కీలకంగా మారాయి. డీజీపీ జితేందర్, మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ అనిల్ ఇచ్చిన వివరాల ఆధారంగా ఇవాళ ప్రభాకర్ రావు సిట్ అధికారులు విచారిస్తున్నారు. -
‘చంద్రబాబు సంతోషం కోసమే అక్రమ అరెస్టులు’
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతోషం కోసమే పోలీసులు తనపైన, తన కుటుంబ సభ్యులపైన అక్రమ కేసులను బనాయిస్తున్నారని చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి స్పష్టం చేశారు. లేని లిక్కర్ స్కాంను సృష్టించి వైఎస్సార్సీపీ నేతలపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా చెవిరెడ్డిని బెంగళూరు ఎయిర్పోర్టులో సిట్ అధికారులు అక్రమంగా అరెస్ట్ చేసిన నేపథ్యంలో బుధవారం బహిరంగ లేఖను విడుదల చేశారు. ఈ లేఖను ఆయన చిన్న కుమారుడు హర్షిత్రెడ్డి విజయవాడలోని సిట్ కార్యాలయం వద్ద మీడియా ముఖంగా బహిర్గతం చేశారు. ఆ లేఖ పూర్తి సారాంశం ఇదీ.‘ఎప్పుడు రమ్మంటే.. అప్పుడు వస్తానని చెప్పా’‘మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు మీ సిట్ కార్యాలయానికి వస్తాను అని నేను చాలా స్పష్టంగా చెప్పా. మీరు కేవలం నా సెల్ఫోన్కు ఒక చిన్న మెసేజ్ పెట్టి ఉన్నా మీ సిట్ కార్యాలయం ముందు నిలబడి ఉంటా. మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి నిజాయితీగా సమాధానం చెప్పి ఉంటా. నేను పగలే కాదు.. రాత్రివేళ కూడా ఏ రోజూ నా సెల్ఫోన్ ఆఫ్ చేయలేదు. నేను నిన్న కూడా విజయవాడలోనే ఉన్నా. మీరు పిలిచి ఉంటే వచ్చేవాడిని. నేను నా జీవితంలో ఎన్నడూ పారిపోలేదు. ముందస్తు బెయిల్ కూడా నా జీవితంలో ఏనాడూ అడగలేదు. అలాంటి నాపై లుకౌట్ నోటీసులు ఇవ్వడం అన్నది మీ సభ్యతను తెలియజేస్తోంది.బతుకుతెరువు కోసం అవకాశం ఉన్న ప్రదేశాలకు, దేశాలకు వెళుతుంటాం తప్పేంటి?. మీరు పిలిస్తే రానప్పుడు తప్పు అవుతుంది. కానీ నేను అలా చేయలేదు కదా!. సిట్ విచారణ ప్రారంభించి 365 రోజులవుతుంది. ఏ రోజయినా, ఏ ఒక్కరైనా, చివరకు ఏ పేపర్, ఏ చానల్ అయినా నిన్నటివరకు నా పేరు ప్రస్తావించిందా? లేదుకదా. కనీసం నిన్నటి వరకు మీ సిట్ అధికారులు ఒక్కరైనా నన్ను ఏదైనా అడిగారా?. ఒక చిన్న నోటీస్ అయినా ఇచ్చారా?. ఎప్పుడైనా పిలిచారా?. లేదు కదా! అంటే దాని అర్థ ఏంటీ!.’‘చంద్రబాబు కుటుంబం అప్పుడైనా శాంతిస్తుంది’గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాలు కూడా నన్ను ఎలా ఇబ్బందులు పెట్టారో, ఎన్ని కేసులు పెట్టారో, ఒక ఎమ్మెల్యే అని కూడా చూడకుండా అనేకసార్లు ఎంతగా కొట్టించారో మీకు తెలుసు, ప్రజలందరికీ తెలుసు. మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా వచ్చాడు. దుర్మార్గంగా అన్యాయమైన కేసులు పెట్టిస్తున్నారు. ఇక మిగిలింది.. మా పాత గన్మెన్లను తప్పుడు కేసులకు సంతకాలు పెట్టమని మీ సిట్ అధికారులు కొట్టినట్టు మీ చేత మళ్లీ నన్ను కూడా కొట్టిస్తారేమో!. అది కూడా కానిచ్చేయండి. చంద్రబాబు కుటుంబం అప్పుడైనా శాంతిస్తుంది. ఈసారి నా ఒక్కడినే కాదు.. చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాడని కేవలం 26 సంవత్సరాలు వయసు గల నా కొడుకు మోహిత్రెడ్డిని కూడా కేసులో ఇరికించి జైలుకు పంపాలనుకుంటున్నట్టు ఉన్నారు. ఒక్క మోహిత్నే ఎందుకు. ఇంట్లో ఇంకా నా భార్య, నా మరో కొడుకు కూడా మిగిలి ఉన్నారు. వాళ్లను కూడా దయచేసి ఏదో ఒక కేసులో ఇరికించి జైలుకు పంపి చంద్రబాబును, చంద్రబాబు కుటుంబాన్ని సంపూర్ణంగా శాంతింపచేయండి. మాకేం పర్లేదు. మా కుటుంబం అంతా నిత్యం కొలిచే మా వెంకటేశ్వరస్వామి మాలో ఉన్నాడు. జీవితం అంతా పోరాటాలే ఊపిరిగా జీవిస్తున్న మా జగనన్నే మాకు స్ఫూర్తిగా ఉన్నాడు. ధైర్యం ఉంది. ఎదుర్కొంటాం. సగౌరవంగా తిరిగి వస్తాం. ఆలస్యమైనా సత్యమే జయిస్తుంది అని చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఆ బహిరంగ లేఖలో పేర్కొన్నారు.నన్ను, నా తల్లిని కూడా అరెస్ట్ చేయండిమాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి తనయుడు హర్షిత్రెడ్డివిజయవాడ స్పోర్ట్స్: ‘లేని మద్యం కేసును తెరపైకి తెచ్చి అందులో నా తండ్రి చెవిరెడ్డి భాస్కర్రెడ్డిని అరెస్ట్ చేశారు. ఇదంతా సీఎం చంద్రబాబు కుట్ర. అక్రమ అరెస్టులతో మా కుటుంబంపై రాజకీయ కక్ష సాధింపులకు దిగారు. ఈ కేసుతో మా నాన్నను, అన్నను ఇబ్బంది పెడుతున్నారు. ఇక మా కుటుంబంలో నేను, నా తల్లి మాత్రమే మిగిలి ఉన్నాం. ఇంకెందుకు మా ఇద్దర్నీ కూడా అరెస్ట్ చేయండి’ అని చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి తనయుడు హర్షిత్రెడ్డి వాపోయారు. న్యాయవాది ఎం.వాణితో కలిసి హర్షిత్రెడ్డి విజయవాడలోని సిట్ కార్యాలయానికి బుధవారం వచ్చారు. అనంతరం మీడియాతో హర్షిత్రెడ్డి మాట్లాడుతూ.. ఏడాదిగా కూటమి ప్రభుత్వం అక్రమ కేసులతో తమ కుటుంబాన్ని ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. అత్యాచారానికి గురైన బాలికను, అన్యాయమైపోయిన బాలిక కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన తన తండ్రి భాస్కర్రెడ్డిపై పోక్సో కేసు నమోదు చేసేందుకు పోలీసులు విఫలయత్నం చేశారన్నారు. ఈ ఘటనతో చెవిరెడ్డి భాస్కర్రెడ్డికి సంబంధం లేదని సాక్షాత్తు బాలిక తండ్రే బహిరంగంగా వెల్లడించారని గుర్తు చేశారు ఆయన తమను పరామర్శించేందుకు వచ్చారే తప్ప ఎలాంటి తప్పు చేయలేదని ప్రకటించిన తరువాత ఈ కేసును తీసేశారని చెప్పారు. మేమెప్పుడూ మద్యాన్ని పంచలేదు కూడా..‘మద్యం అంటేనే మా కుటుంబానికి పడదు. మద్యం మహమ్మారి మా తాతయ్యను పొట్టన పెట్టుకుంది’ అని హర్షిత్రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల్లో కూడా ఏనాడూ తాము మద్యం పంపకం చేయలేదని వెల్లడించారు. అలాంటిది తమ కుటుంబ సభ్యులపై మద్యం కేసు పెట్టడమేమిటని ప్రశ్నించారు. తన తండ్రి, అన్నను మద్యం కేసుతో ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయస్థానాలపై తనకు పూర్తి నమ్మకం ఉందని, అక్రమ కేసులపై న్యాయపోరాటం చేస్తామని వెల్లడించారు. అక్రమ కేసులకు భయపడి ఎక్కడికీ పారిపోవాల్సిన అవసరం తమ కుటుంబానికి లేదన్నారు. -
ప్రభుత్వ కుట్ర.. సిట్ కుతంత్రం
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ కుట్రతో సిట్ సాగిస్తున్న అక్రమ కేసు పన్నాగం మరోసారి బట్టబయలైంది. పూర్తిగా అవాస్తవాలు, అభూతకల్పనలతో సిట్ సమర్పించిన రిమాండ్ నివేదికే ఆ కుట్రను మరోసారి బయటపెట్టింది. ఓ కానిస్టేబుల్ను ప్రలోభాలకు గురిచేసి అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేసి.. తాము చెప్పినట్టు వినని మరో కానిస్టేబుల్పై థర్డ్ డిగ్రీతో చిత్రహింసలు.. కేసే లేకుండా అక్రమంగా లుక్ అవుట్ నోటీసులు.. హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘన.. ఈసీ పరిధిలోని కేసు వక్రీకరణ.. ఇలా చెప్పుకుంటూ పోతే సిట్ అక్రమాలు, కుట్రలు అంతేలేకుండా సాగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, ఆయన స్నేహితుడు వెంకటేష్ నాయుడుపై సిట్ సమర్పించిన రిమాండ్ నివేదికలు ప్రభుత్వ పెద్దల కుట్రను మరోసారి వెలుగులోకి తెచ్చాయి. మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసులో చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, వెంకటేష్నాయుడును సిట్ అధికారులు బుధవారం ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరిచారు. ప్రభుత్వ పెద్దల రాజకీయ కుట్ర, దర్యాప్తు ముసుగులో సిట్ అధికారుల కుతంత్రాన్ని చెవిరెడ్డి్డ, ఆయన తరఫు న్యాయవాదులు దుష్యంత్రెడ్డి, వాణి తదితరులు న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. ఇది పక్కా రాజకీయ కుట్రతో పెట్టిన అక్రమ కేసేనని స్పష్టం చేశారు. ‘సత్యమేవ జయతే’ అని నినదిస్తూ..వాదనలు విన్న న్యాయస్థానం చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, వెంకటేశ్ నాయుడుకు జూలై 1 వరకు రిమాండ్ విధించింది. వెన్నునొప్పితో బాధపడుతున్న చెవిరెడ్డి భాస్కర్రెడ్డికి జైలులో పరుపు, దిండు, ఇతర సదుపాయాలు కల్పించాలని ఆదేశించింది. అనంతరం వారిద్దరిని పోలీసులు విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. జైలుకు వెళుతూ చెవిరెడ్డి ‘సత్యమేవ జయతే.. న్యాయపోరాటం చేస్తాం.. అక్రమ కేసును ఎదుర్కొంటాం.. దేవుడి ఆశీస్సులు, పార్టీ అధినేత మద్దతు మాకు ఉంది’ అని నినదించారు. గన్మెన్కు ప్రమోషన్ ప్రలోభం.. అబద్ధపు వాంగ్మూలంచెవిరెడ్డి భాస్కర్రెడ్డి వద్ద గతంలో గన్మెన్గా పనిచేసిన గిరి అనే ఆర్మ్డ్ రిజర్వ్ కానిస్టేబుల్ను బెదిరించి, ప్రలోభపెట్టి లొంగదీసుకోవడం కుట్ర తీవ్రతను బయటపెడుతోంది. అందుకోసమే కానిస్టేబుల్ గిరిని సిట్ అధికారులు తెరపైకి తెచ్చారు. దాదాపు 10 నెలలుగా సాగుతున్న ఈ అక్రమ కేసులో ఇప్పటివరకు ఆయన ప్రస్తావనే లేదు. కానీ.. హఠాత్తుగా తెరపైకి తెచ్చి ఆయనే కీలక సాక్షి అంటూ నమ్మించేందుకు సిట్ యత్నించింది. ఈ విధంగా ప్రతీసారి ఓ కొత్త పాత్రను ప్రవేశపెట్టి తమ కుట్రకు మరింత పదును పెట్టడం సిట్కు అలవాటుగా మారింది. అందుకోసం సిట్ అధికారులు పక్కా పన్నాగంతో వ్యవహరించారు. కానిస్టేబుల్ గిరిని వారం రోజులపాటు సిట్ అధికారులు తమ అదుపులో ఉంచుకుని బెదిరించారు. తాము చెప్పినట్టు అబద్ధపు వాంగ్మూలం ఇవ్వకపోతే ఆయన్ను కూడా ఈ కేసులో నిందితుడుగా చేరుస్తామని.. సస్పెండ్ చేయిస్తామని.. జైలుకు పంపుతామని బెదిరించారు. తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం ఇస్తే జీతం పెంపుదలతోపాటు కోరుకున్న విభాగంలో పోస్టింగ్ ఇస్తామని ప్రలోభపెట్టారు. దాంతో గిరి సమ్మతించారు. చెవిరెడ్డి భాస్కర్రెడ్డి చెప్పడంతో హైదరాబాద్ నుంచి నగదును వాహనంలో ఆంధ్రప్రదేశ్కు తరలించేందుకు తాను ఎస్కార్టుగా వెళ్లినట్టు ఆయనతో అబద్ధపు వాంగ్మూలం నమోదు చేయించారు. తాము చెప్పినట్టు చేసిన గిరికి వెంటనే 60శాతం జీతం పెంపుదలతో ఆయన కోరుకున్న ఆక్టోపస్ విభాగంలో పోస్టింగ్ ఇచ్చారు. అంటే గిరి బెదిరింపులు, ప్రలోభాలకు గురయ్యే ఆ వాంగ్మూలం ఇచ్చినట్టు స్పష్టమైంది. కానిస్టేబుల్ గిరి చెప్పింది నిజమేనని భావిస్తే.. నగదు అక్రమంగా తరలింపునకు సహకరించిన ఆయన ఈ కేసులో నిందితుడు కావాలి. కానీ ఆయన్ను సిట్ అధికారులు సాక్షిగా ఎలా పేర్కొంటారని చెవిరెడ్డి భాస్కర్రెడ్డి తరఫు న్యాయవాదులు ప్రశ్నించారు. అక్రమానికి సహకరించిన ప్రభుత్వ ఉద్యోగిని సాక్షిగా పేర్కొనడం సరికాదని.. నిందితుడిగానే పేర్కొనాలని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ప్రస్తావించారు. ఆధారాలు లేవు.. సేకరించాల్సి ఉందన్న విచారణ అధికారిఎలాంటి ఆధారాలు లేకుండానే అక్రమంగా కేసు నమోదు చేసినట్టు సిట్ విచారణ అధికారే పరోక్షంగా అంగీకరించడం గమనార్హం. నగదు అక్రమంగా తరలించారని సిట్ చెబుతున్న రోజుల్లో చెవిరెడ్డి భాస్కర్రెడ్డి కానిస్టేబుల్ గిరితో ఫోన్లో మాట్లాడినట్టు కాల్ డేటా రికార్డు ఉందా అని ఆయన తరఫు న్యాయవాది ప్రశ్నించారు. ఇదే విషయాన్ని న్యాయస్థానం ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. ఆయన సరైన సమాధానం చెప్పలేకపోయారు. అప్పుడు విచారణ అధికారిని న్యాయస్థానం ప్రశ్నించింది. ఆ డేటా ఇంకా లేదని.. సేకరించాల్సి ఉందని విచారణ అధికారి చెప్పారు. అంటే చెవిరెడ్డి భాస్కర్రెడ్డికి వ్యతిరేకంగా సిట్ ఇప్పటివరకు కనీస ఆధారాలు కూడా సేకరించలేదని స్పష్టమైంది. ఆధారాలు లేకుండా కేసు నమోదు చేయడం, అరెస్టు చేయడం అక్రమమని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన తరపు న్యాయవాదులు న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. తుడా వాహనంపై కట్టుకథలుగత ఏడాది ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ‘తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (తుడా)’ వాహనంలో నగదును అక్రమంగా తరలించారని సిట్ పేర్కొనడం విడ్డూరంగా ఉంది. ఎందుకంటే ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిన తరువాత తుడా వాహనం చైర్మన్ ఆధీనంలో ఉండదు. ప్రభుత్వ వాహనాలను రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు ఉపయోగించడం నిషేధం. తుడా వాహనం ఆ సంస్థ వైస్ చైర్మన్గా ఉన్న ప్రభుత్వ అధికారి ఆధీనంలో ఉంది. కానీ ఆ వాహనంలో నగదును తరలించారని అభియోగం మోపడం పూర్తిగా కుట్ర పూరితమని చెవిరెడ్డి భాస్కర్రెడ్డి న్యాయమూర్తి దృష్టికి తీసుకువెళ్లారు.అబద్ధపు వాంగ్మూలం ఇస్తే నామినేటెడ్ పదవి కట్టబెడతామన్నారుఈ అక్రమ కేసులో సిట్ అరెస్టు చేసిన వెంకటేశ్నాయుడు న్యాయస్థానంలో అసలు కుట్రను వెల్లడించారు. చెవిరెడ్డి భాస్కర్రెడ్డికి వ్యతిరేకంగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని తనను, తన భార్యను సిట్ అధికారులు తీవ్రంగా బెదిరించి, వేధించారని తెలిపారు. ఆయన చెబితే నగదును అక్రమంగా తరలించినట్టు అంగీకరించాలని వేధించారన్నారు. తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం ఇస్తే రూ.2 కోట్ల నగదుతోపాటు ప్రభుత్వంలో నామినేటెడ్ పదవి ఇస్తామని ప్రలోభపెట్టారని వెంకటేశ్నాయుడు వెల్లడించారు. అబద్ధపు వాంగ్మూలం ఇవ్వడానికి తాము సమ్మతించనందునే తనను ఈ అక్రమ కేసులో నిందితుడిగా చేర్చి అరెస్టు చేశారని ఆయనన్యాయస్థానానికి నివేదించారు. ఈసీ కేసు వక్రీకరణ.. హైకోర్టు ఆదేశాల ఉల్లంఘనచెవిరెడ్డి భాస్కర్రెడ్డి అక్రమ అరెస్టు కోసం సిట్ ఏకంగా హైకోర్టు ఆదేశాలనే సిట్ ఉల్లంఘించింది. ఈసీ పరిధిలో ఉన్న కేసును వక్రీకరిస్తూ ఆయనపై నిరాధార అభియోగాలు నమోదు చేసింది. 2024 ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్ (ఈసీ) జప్తు చేసిన రూ.8.37 కోట్ల నగదు కేసును సిట్ అధికారులు వక్రీకరిస్తూ రిమాండ్ నివేదికలో పేర్కొనడమే అందుకు తార్కాణం. 2024 ఎన్నికల ముందు ఓ ప్రైవేటు సంస్థ హైదరాబాద్ నుంచి తీసుకు వస్తున్న రూ.8.37 కోట్ల నగదును పోలీసులు జప్తు చేసి కేసు నమోదు చేశారు. ఎన్నికల కమిషన్ ఆ కేసును పర్యవేక్షిస్తోంది. కాగా.. ఆ నగదు తమ సంస్థకు చెందినదని అప్పట్లోనే తిరుపతిలోని ఈశా ఇన్ఫ్రా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ ఈసీకి తెలిపింది. ఆ సంస్థ ఎండీ ప్రద్యుమ్న చంద్రపాటి ఆ నగదుకు సంబంధించిన పూర్తి రికార్డులు, బ్యాంకు వోచర్లు, ఇతర ఆధారాలు సమర్పించారు. అంటే ఆ నగదు ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు తరలిస్తోంది కాదని.. ఓ ప్రైవేటు రియల్ ఎస్టేట్ సంస్థ తమ వ్యాపార కార్యకలాపాల కోసం అధికారికంగా తరలిస్తున్న పూర్తి వైట్మనీ అని నిర్ధారణ అయ్యింది. అందుకే ఆ సంస్థ ఎండీ ప్రద్యుమ్న చంద్రపాటి వెంటనే హైకోర్టును ఆశ్రయించారు. ఆ కేసు విచారణ పేరిట వేధింపులకు పాల్పడకుండా పోలీసులను ఆదేశించాలని కోరారు. ఆ కేసు విచారణ పేరిట ఆ సంస్థ ఎండీని గానీ, ఇతరులు ఎవర్నీగానీ పోలీస్ స్టేషన్కు పిలవవద్దని హైకోర్టు 2024 మే 31నే పోలీసులను ఆదేశించింది. అంతేకాదు ఆ కేసు విషయాన్ని ఇతర కేసుల్లో కూడా ప్రస్తావించకూడదని స్పష్టం చేసింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇప్పటికీ అమలులోనే ఉన్నాయి. అయినా సరే హైకోర్టు ఆదేశాలను సిట్ అధికారులు ఉల్లంఘించడం విభ్రాంతి కలిగిస్తోంది. సిట్ అధికారులు మాత్రం ఎన్నికల ముందు జప్తు చేసిన ఆ నగదు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఎన్నికల కోసం తరలిస్తున్న డబ్బు అంటూ అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని ఏఆర్ కానిస్టేబుళ్లను వేధించారు. అదే వక్రీకరణతో చెవిరెడ్డి భాస్కర్రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారు. ఆ ఈసీ కేసు వివరాలను ప్రస్తుత అక్రమ కేసుకు ముడిపెడుతూ నిరాధారణ ఆరోపణలు చేయడం సిట్ బరితెగింపునకు నిదర్శనమని చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, ఆయన తరఫు న్యాయవాదులు న్యాయస్థానానికి నివేదించారు.కట్ అండ్ పేస్ట్ కుట్రేముందస్తు కుట్రతోనే అక్రమ కేసులు, అరెస్టులకు పాల్పడుతున్నట్టు సిట్ మరోసారి తన రిమాండ్ నివేదిక సాక్షిగా వెల్లడించింది. ప్రైవేటు వ్యాపారి అయిన వెంకటేశ్నాయుడును రిమాండ్ నివేదికలో ఐఏఎస్ అధికారి అని పేర్కొంది. గతంలో ఐఏఎస్ అధికారి ధనుంజయ్రెడ్డిని అరెస్టు చేసినప్పటి రిమాండ్ నివేదికనే కాపీ పేస్టుచేసినట్టు బయటపడింది. ఆయనను ఐఏఎస్ అధికారిగా పేర్కొన్న సిట్ అధికారులు అదే నివేదికను కాపీ పేస్ట్ చేయడంతోనే వెంకటేశ్నాయుడు కూడా ఐఏఎస్ అధికారి అని న్యాయస్థానానికి సమర్పించిన రిమాండ్ నివేదికలో వచ్చింది. ఈ కేసులో సిట్ కాపీ అండ్ పేస్ట్ కుట్ర బయటపడటం ఇది రెండోసారి కావడం గమనార్హం.సిట్ కార్యాలయంలో చెవిరెడ్డి విచారణవిజయవాడ స్పోర్ట్స్/లబ్బీపేట (విజయవాడ తూర్పు): మద్యం విధానం కేసులో చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, ఆయన స్నేహితుడు వెంకటేష్నాయుడును సిట్ కార్యాలయంలో అధికారులు ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 వరకు విచారణ జరిపారు. ఈ స్కాం ద్వారా వచ్చిన నగదును 2024 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రగిరి నుంచి ఒంగోలుకు ఎలా తరలించారు?, ఎంత తరలించారు, ప్రధాన నిందితుడుగా పేర్కొన్న రాజ్ కేసిరెడ్డితో ఉన్న సంబంధాలు ఏమిటనే విషయాలపై అధికారులు ఆరా తీసినట్టు సమాచారం. ఈ కేసులో తాజాగా నిందితులుగా చేర్చిన బాలాజీకుమార్ యాదవ్, నవీన్, హరీష్, మోహిత్రెడ్డి పాత్రపైనా విచారణ కొనసాగినట్టు తెలుస్తోంది. విచారణ అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం ఇద్దరినీ విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కూటమి అక్రమ కేసులు పెడుతోందికూటమి ప్రభుత్వం తనపై అక్రమంగా కేసులు పెడుతోందని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అన్నారు. వైద్య పరీక్షల కోసం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి ఆయనను తీసుకు రాగా.. అక్కడ మీడియాతో మాట్లాడారు. ‘నాపై ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాను. విచారణలో వారు చెప్పినట్టు సంతకం పెట్టమంటున్నారు. వారు చెప్పినట్టు నేనెందుకు సంతకం పెడతాను. నన్ను ఎప్పుడు రమ్మంటే అప్పుడు అందుబాటులో ఉంటా. నామీద ఏ కేసులు లేవు. ఇప్పుడు అన్యాయమైన, అధర్మమైన కేసులు పెడుతున్నారు’ అని చెవిరెడ్డి వ్యాఖ్యానించారు. -
రెడ్ బుక్ అరాచకం.. హింసలు, వేధింపులు
-
సుప్రీంకోర్టు చెప్పినా సిట్కు లెక్కే లేదా?
సాక్షి, అమరావతి: చంద్రబాబు కుట్రలో భాగంగా ఏర్పడిన సిట్ రాజ్యాంగేతర శక్తిగా చెలరేగిపోతోంది. రెడ్బుక్ కుట్రలో భాగంగా అక్రమ అరెస్ట్లు, దర్యాప్తు ముసుగులో వేధింపులు, చిత్రహింసలకు బరితెగిస్తోంది. సిట్ అరాచకం ఎంతగా సాగుతోందంటే సాక్షాత్తు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాలు, హెచ్చరికలను నిర్భీతిగా ఉల్లంఘిస్తూ దాష్టీకానికి పాల్పడుతోంది. ఇదే అక్రమ కేసులో నిందితులుగా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎ.ధనుంజయ్ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్రెడ్డి, వికాట్ కంపెనీ డైరెక్టర్ గోవిందప్ప దాఖలు చేసిన పిటిషన్ను విచారిస్తూ సుప్రీంకోర్టు విస్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తు, విచారణ పేరిట ఈ కేసులో సాక్షులు, నిందితులను ఏ విధంగానూ వేధించకూడదని.. వారిని శారీరకంగా హింసించ కూడదని స్పష్టం చేసింది. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని కూడా హెచ్చరించింది. అంతేకాదు ఆధారాలు లేకుండా అరెస్టు చేయకూడదని పేర్కొంది. కేసు పెట్టాం కాబట్టి అరెస్టు చేసి తీరాలన్న ఆలోచన ఏమాత్రం సరైంది కాదని కూడా విస్పష్టంగా తేల్చి చెప్పింది. అది పౌరుడి గౌరవ ప్రతిష్టలకు సంబంధించిన వ్యవహారమని కూడా వ్యాఖ్యానించింది. అందుకు విరుద్ధంగా రాజకీయ దురుద్దేశాలతో వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని సిట్ అధికారులను సుప్రీంకోర్టు హెచ్చరించింది.మా పని మాది..సుప్రీంకోర్టు ఆదేశాలను తామేమాత్రం పట్టించుకోబోమని సిట్ చీఫ్ ఎస్వీ రాజశేఖర్బాబు, ఆయన బృందం తమ చేతల ద్వారా తేల్చి చెప్పారు. ఇప్పటికే ఎంతో మంది సాక్షులను వేధించి, హింసించిన సిట్ అధికారులు తాజాగా తమ పోలీసు శాఖకు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లపై ఏకంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించి మరీ చిత్రహింసలకు గురి చేయడం విభ్రాంతి కలిగిస్తోంది. అంతే కాకుండా చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అక్రమ అరెస్ట్ వ్యవహారంలో కూడా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించింది. ఆయనకు వ్యతిరేకంగా సిట్ ఎలాంటి ఆధారాలు ఇప్పటి వరకు చూపించనే లేదు. ఆయనకు నోటీసు ఇచ్చి విచారణకు పిలవనే లేదు. మంగవారం మధ్యాహ్నం వరకు ఆయన పేరును ఎఫ్ఐఆర్లో కూడా చేర్చనే లేదు. అయినా సరే మంగళవారం ఉదయం ఆయన్ను అక్రమంగా అరెస్ట్ చేసి.. సీఎం చంద్రబాబు కుట్రలకు సిట్ వత్తాసు పలికింది. కేవలం రాజకీయ దురుద్దేశాలతోనే చెవిరెడ్డిని అరెస్ట్ చేసినట్లుగా స్పష్టమవుతోంది. అంటే సుప్రీంకోర్టు ఆదేశాలంటే తమకు ఏమాత్రం లెక్కలేదని, ప్రభుత్వ పెద్దల రాజకీయ కుట్రలకు వత్తాసు పలికి.. వేధింపులు, కక్ష సాధింపులకు పాల్పడటమే తమ ఏకైక లక్ష్యమని సీనియర్ ఐపీఎస్ అధికారి ఎస్వీ రాజశేఖర్బాబు, ఆయన బృందం స్పష్టం చేస్తోంది. -
సిట్ అధికారులకు మోహిత్ రెడ్డి బహిరంగ లేఖ
తాడేపల్లి : నిబద్ధత, నిజాయితీ, పారదర్వకత అంటూ లేఖ రాసిన సిట్ అధికారులు తాను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా? అంటూ ప్రశ్నించారు చెవిరెడ్డి మోహిత్రెడ్డి. ఈ మేరకు సిట్ అధికారులు బహిరంగ లేఖ రాశారు. ఒక్క ఏడాది కాలంగా విచారణ చేస్తున్న సిట్ అధికారులు.. ఈ 365 రోజుల్లో ఏ రోజు కూడా చెవిరెడ్డి భాస్కర్రెడ్డికి రాజ్ కసిరెడ్డి నుంచి డబ్బులు అందాయని కానీ ప్రజలకు పంచారని కానీ ఏనాడు ప్రస్తావించకుండా ఈ రోజు చెప్పడంలో అర్థమేంటి?, అది నిజం కాదు కనకే కదా? అని లేఖ ద్వారా ప్రశ్నించారు. ఇంకో 20 సంవత్సరాలు సర్వీసున్న హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాన్ని పణంగా పెట్టి.. పోలీస్ అధికారులపై అబద్ధాలు చెప్పగలరా?, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి పదేళ్లు గన్మెన్గా పనిచేసిన మదన్రెడ్డిని సిట్ కార్యాలయంకు పిలిపించి విచారణ సమయంలో అతను చెప్పినట్టు స్టేట్మెంట్ రాయకుండా, సిట్ అధికారులు చెప్పినట్టు చెప్పాలని ఒత్తిడి చేయడం, తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వాలని హింసించడం వల్లనే కదా.. అతను చనిపోతాను అన్నది’ అని మోహిత్ రెడ్డి నిలదీశారు.ఒక హెడ్కానిస్టేబుల్ తనకంటే పై స్థాయి అధికారులు (సిట్ అధికారుల) ముందే విచారణ సమయంలో మీ అందరి పేర్లు రాసి తాను చనిపోతాను అన్నాడంటే.. ఆ హెడ్ కానిస్టేబుల్ను సిట్ అధికారులు శారీరకంగా, మానసికంగా ఎంత చిత్రవధ చేసి వుంటే అంత మాట అనగలడు. అందరూ ఆలోచించాలి’ అని అన్నారు.తప్పుడు స్టేట్మెంట్లు కోసం కుట్రలు పన్నుతుంది మీరే కదా?, అంతా పారదర్శకంగానే జరుగుతుందని దేవుడు ముందు ప్రమాణం చేయగలరా?,నిజంగానే సిట్ అధికారులకు నిబద్ధత ఉంటే సిట్టింగ్ జడ్జితో దర్యాప్తు చేయించాలని కోరే దమ్ముందా?, తప్పకుండా ఏదో ఒక రోజు సత్యమేవ జయతే అవుతుంది. ఆ రోజు తప్పు చేసిన సిట్ అధికారులందరికీ దేవుడు, న్యాయస్థానాలు శిక్ష విధిస్తాయి’ అని మోహిత్రెడ్డి లేఖ ద్వారా స్పష్టం చేశారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు: సిట్ ముందుకు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్
సాక్షి, హైదరాబాద్: కీలకమైన ఫోన్ ట్యాపింగ్ కేసులో టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేశ్కుమార్గౌడ్ సాక్షిగా సిట్ ముందు హాజరయ్యారు. ఇవాళ ఆయన జూబ్లీహిల్స్ ఏసీపీ వద్ద సాక్షిగా తన వాంగ్మూలం ఇచ్చేందుకు వెళ్లారు. 2023లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న మహేశ్గౌడ్ ఫోన్ను అప్పటి ప్రభుత్వం ట్యాప్ చేసిందని ఆయన పలుమార్లు ఇప్పటికే ఆరోపించారు.తాను కూడా ఫోన్ట్యాపింగ్ బాధితుడినేనని చెప్పారు. ఈ నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా పీసీసీ చీఫ్ ఏం చెప్తారనేది ఆసక్తిగా మారింది. ఈ క్రమంలో మహేష్కుమార్ గౌడ్ సిట్ కార్యాలయానికి చేరుకోగా.. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు కాంగ్రెస్ కార్యకర్తలు హడావుడి చేశారు. జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లోకి వెళ్లేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో వారిని అడ్డుకున్న పోలీసులు.. బయటకు పంపించారు.2018లో ఫోన్ ట్యాపింగ్ వల్లే కాంగ్రెస్ ఓడిపోయింది: మహేష్ గౌడ్సిట్ ముందు హాజరైన అనంతరం మహేష్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ కేసులో వాస్తవాలు బయటకువచ్చాయన్నారు. 2018లో ఫోన్ ట్యాపింగ్ వల్లే కాంగ్రెస్ ఓడిపోయింది. 650 మంది కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్యాప్ చేశారు. గత ప్రభుత్వంలో అధికారులు నేతల కనుసన్నల్లోనే పనిచేశారు. ఫోన్ ట్యాప్తో రాజకీయ లబ్ధి పొందారు’’ అని మహష్ గౌడ్ ఆరోపించారు. -
చెవిరెడ్డిని ఇరికించేందుకే మదన్ను హింసించారు
సాక్షి, గుంటూరు: లిక్కర్ స్కాం కేసులో వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే, పార్టీ ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్రెడ్డిని ఇరికించే కుట్ర జరుగుతోంది ఆ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి అన్నారు. ఈ క్రమంలోనే చెవిరెడ్డి దగ్గర గతంలో గన్మెన్గా పని చేసిన మదన్ను దారుణంగా హింసించారని తెలిపారాయన. మంగళవారం ఉదయం తాడేపల్లిలో మనోహర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘లిక్కర్ కేసులో చెవిరెడ్డిని ఇరికించేందుకు సిట్ అధికారులు తీవ్రంగా యత్నిస్తున్నారు. చెవిరెడ్డి పేరు చెప్పాలంటూ ఆయన మాజీ గన్మ్యాన్, హెడ్ కానిస్టేబుల్ అయిన మదన్ని చిత్రహింసలు పెట్టారు. మదన్ 10 ఏళ్లు చెవిరెడ్డి దగ్గర గన్మెన్గా పని చేశారు. చెవిరెడ్డికి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వాలని సిట్ అధికారులు మదన్పై ఒత్తిడి తెచ్చారు. ఆయన మొహం మీద, వీపు మీద పిడిగుద్దులు గుద్దారు. చేతి వేళ్లు వెనక్కి విరిచి తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వాలని టార్చర్ పెట్టారు. .. సిట్ అధికారుల హింస వల్ల మదన్ ఆరు రోజులపాటు ఆస్పత్రిలోనే ఉన్నారు. ఈ చిత్రహింసల గురించి మదన్ సీఎంతో పాటు రాష్ట్ర డీజీపీకి లేఖ కూడా రాశారు. ఆ లేఖలో వివరాలన్నీ క్షుణ్ణంగా ఉన్నాయి. ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకు వెళ్లబోతున్నాం’’ అని మనోహర్రెడ్డి మీడియాకు వివరించారు.నేడు హైకోర్టులో విచారణఏఆర్ కానిస్టేబుల్ మదన్ తరపున వైఎస్సార్సీపీ రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ఇవాళ విచారణకు వచ్చే అవకాశం ఉంది. లిక్కర్ కేసులో సిట్ అధికారులు బలవంతపు వాంగ్మూల సేకరణ జరుపుతున్నారని, భౌతిక దాడులకు దిగుతున్నారని, విచాచరణ పారదర్శకంగా జరిగేలా ఆదేశాలు ఇవ్వాలని మదన్ ఆ పిటిషన్లో అభ్యర్థించారు. ఇదీ చదవండి: చంద్రబాబు ఇలాకాలో దారుణం -
ట్యాపింగ్ కేసు.. వ్యూహం మార్చిన సిట్
సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘకాలం అమెరికాలో తలదాచుకున్న ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్రావు తిరిగి రావడం, ఆయన విచారణ పర్వం కొనసాగుతుండటంతో అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తును సిట్ అధికారులు ముమ్మరం చేశారు. విచారణ అధికారులు అడుగుతున్న ప్రశ్నలకు ఆయన దాటవేత ధోరణిలో సమాధానాలు చెప్తుండటంతో తమ వ్యూహం మార్చారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టు అయి, బెయిల్పై బయటకు వచ్చిన నిందితులను మరోసారి ప్రశ్నించాలని నిర్ణయించారు.ఎస్ఐడీలోని ఎస్ఓటీకి నేతృత్వం వహించిన డి.ప్రణీత్రావు ఈ కేసులో అరెస్టు అయిన తొలి నిందితుడు. ప్రస్తుతం బెయిల్పై ఉన్న ఈయన్ను బుధవారం ప్రభాకర్రావుతో కలిపి విచారించారు. తాజాగా శుక్రవారం సైతం విచారణ హాజరుకావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. ప్రభాకర్రావు శనివారం మరోసారి సిట్ ఎదుట విచారణకు వస్తుండటంతో ఒక రోజు ముందు ప్రణీత్ను ప్రశ్నించనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసుకు మూలం ఎస్ఐబీ కార్యాలయంలోని హార్డ్డిస్క్లు ధ్వంసం చేయడం. ఎస్ఐబీ అదనపు ఎస్పీగా పని చేస్తున్న డి.రమేష్ ఫిర్యాదు ఆధారంగా కుట్ర, నమ్మక ద్రోహం, నేరపూరిత చర్యలు, ప్రజా ఆస్తుల విధ్వంసం తదితర సెక్షన్ల కింద నమోదైన ఈ కేసులో చాన్నాళ్ల తర్వాత టెలిగ్రాఫిక్ యాక్ట్ చేర్చారు. నల్లగొండ జిల్లాలో పని చేస్తూ, ఇన్స్పెక్టర్ హోదాలో 2018లో ఎస్ఐబీలోకి ప్రవేశించిన దుగ్యాల ప్రణీత్ రావుకు 2023లో డీఎస్పీగా యాక్సిలేటరీ పదోన్నతి లభించింది. ఈయన ఎస్ఐబీలో ఉన్న మిగిలిన అధికారుల మాదిరిగా కాకుండా విధులు నిర్వర్తించారు.ఎస్ఐబీ కార్యాలయంలో తన కోసం ప్రత్యేకంగా రెండు గదులను ఏర్పాటు చేసుకున్నారు. హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ కూడా తీసుకు 17 అత్యాధునిక కంప్యూటర్లతో పని చేశారు. మావోయిస్టులు, ఉగ్రవాదులు, సంఘ విద్రోహక శక్తుల పేరుతో పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేశారనేది ప్రధాన ఆరోపణ. ప్రణీత్ తన అధికారాన్ని దురి్వనియోగం చేస్తూ నిఘాకు సంబంధించిన అనేక వివరాలను తన వ్యక్తిగత డ్రైవ్ల్లో భద్రపరుచుకున్నారని, 2023 డిసెంబర్ 4 రాత్రి ఎస్ఐబీ కార్యాలయంలోకి వచ్చిన ప్రణీత్ రావు అక్కడి సీసీ కెమెరాలు పని చేయకుండా ఆపేసి కంప్యూటర్లలో ఉన్న సమాచారాన్ని డిలీట్ చేయడంతో పాటు ఎస్ఐబీకి చెందిన 42 హార్డ్ డిస్క్లను ఎత్తుకెళ్లినట్లు అధికారులు గుర్తించారు.రెండు టీబీల డేటాను డిలీట్ చేయడంతో పాటు దాదాపు 1600 పేజీల కాల్ డేటాను కూడా ప్రణీత్ రావు తగులబెట్టినట్లు, కొన్ని హార్డ్ డిస్క్ల్ని ధ్వంసం చేయడంతో పాటు మరికొన్ని తీసుకుపోయి వాటి స్థానంలో కొత్తవి పెట్టినట్లు తేల్చారు. ప్రణీత్ రావు ఎస్ఐబీలో పని చేసినప్పుడు 30 మంది సిబ్బందితో ప్రత్యేక బృందం ఉంది.అప్పట్లో ఎస్ఐడీ చీఫ్గా ప్రభాకర్రావు ఉండటంతో ఆయనకు తెలిసే ఇదంతా జరిగిందని సిట్ అనుమానిస్తోంది. ఈ ఆరోపణల్లో అత్యధికం ప్రభాకర్రావు ఖండిస్తుండటంతో సిట్ అప్రమత్తమైంది. శుక్రవారం ప్రణీత్రావు నుంచి సేకరించే వివరాల ఆధారంగా శనివారం ప్రభాకర్రావుకు సంధించాలి్నన ప్రశ్నావళిని సిద్ధం చేయనున్నారని తెలిసింది. ప్రణీత్ తర్వాత భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్రావులకూ నోటీసులు జారీ చేసి ప్రశి్నంచేందుకు సిట్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. -
దాటవేత ధోరణిలో సమాధానం
సాక్షి, హైదరాబాద్: ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్రావును సిట్ అధికారులు మరోసారి ప్రశ్నించారు. ఈయన్ను సోమవారం ఉదయం 11.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు ప్రశ్నించిన విషయం తెలిసిందే. బుధవారం ఎనిమిదిన్నర గంటలపాటు విచారించారు. జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ రెండో అంతస్తులో ఉన్న సిట్ కార్యాలయంలో వెస్ట్జోన్ డీసీపీ ఎస్ఎం విజయ్కుమార్, సిట్ ఇన్చార్జ్గా ఉన్న ఏసీపీ పి.వెంకటగిరి నేతృత్వంలోని బృందం ప్రభాకర్రావును ప్రశ్నించింది. అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయి, ప్రస్తుతం బెయిల్పై ఉన్న ఎస్ఐబీ మాజీ డీఎస్పీ డి.ప్రణీత్రావును సిట్ అధికారులు విచారణకు పిలిచారు. ఇద్దరినీ కలిపి కొన్ని ప్రశ్నలు అడిగినట్టు తెలిసింది. అమెరికా నుంచి వచ్చిన తర్వాత సోమవారం తొలిసారిగా విచారణకు హాజరైన ప్రభాకర్రావు ఫోన్ ట్యాపింగ్తో తనకు ఏం సంబంధం అని, దానికి అనుమతి ఇవ్వడానికి సాధికారిక కమిటీ ఉంటుందని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయితే అప్పట్లో ఆయా ఫోన్లు ట్యాప్ చేయడానికి సహకరించాల్సిందిగా టెలికం సర్వీస్ ప్రొవైడర్లకు ఎస్ఐబీ నుంచి వెళ్లిన లేఖల్ని సిట్ బుధవారం తీసుకొచ్చింది.వీటిపై డిజిగ్నేటెడ్ అధికారిగా ప్రభాకర్రావు పేరు, ఆయన సంతకం ఉండటాన్ని సిట్ ప్రస్తావించింది. ట్యాపింగ్తో సంబంధం లేనప్పుడు ఆయా లేఖలపై ఎందుకు సంతకం చేశారంటూ ప్రశ్నించింది. జర్నలిస్టులు, వ్యాపారులతోపాటు నేతలు, వారి కుటుంబీకుల ఫోన్లు ఎందుకు ట్యాప్ చేశారని, వారి నంబర్లను ట్యాప్ చేస్తున్నారని తెలిసినప్పుడు లేఖలపై సంతకాలు ఎందుకు చేశారని అధికారులు ప్రశ్నించారు.కొందరు జడ్జిలకు సంబంధించిన కాల్ డిటేల్స్ సేకరించడం వెనుక ఉన్న కారణాలపై ఆరా తీశారు. అయితే పోలీసులు అడిగిన ప్రశ్న లకు ప్రభాకర్రావు దాటవేత ధోరణిలో సమాధానం ఇచ్చారు. ప్రణీత్రావుతో కలిపి ప్రభాకర్రావును విచారించిన సిట్ గతంలో సేకరించిన ఆధారాలు, తదితరాలను వీరి ముందు ఉంచారు.హార్డ్డిస్క్ శకలాల్ని మూసీలో ఎందుకు వేశారు ఇద్దరినీ వేర్వేరుగా కొన్ని ప్రశ్నలు అడిగిన పోలీసులు... కలిపి అవే అడిగి, వారు చెప్పిన సమాధానాలతో సరిచూశారు. మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ల కోసమే ఎస్ఐబీలో స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ) ఏర్పాటు చేశానని చెప్పిన ప్రభాకర్రావు సమర్థత ఆధారంగానే ఆ బాధ్యతలు ప్రణీత్కు అప్పగించినట్టు పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సిట్ అధికారులు అలాంటప్పుడు ఎస్ఓటీ కోసం ప్రత్యేకంగా కంప్యూటర్లు, సర్వర్లు ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. మావోయిస్టుల కోసం తాము చేసే కొన్ని అత్యంత రహస్య ఆపరేషన్ల కోసమే అలా ఏర్పాటు చేసినట్టు ప్రభాకర్రావు సమాధానం ఇచ్చారు. కొన్ని ఆపరేషన్లకు సంబంధించిన సమాచారం బయటకు పొక్కితే జాతీయ భద్రతతోపాటు కొందరు అధికారులకు ముప్పు అని, ఆ కారణంగానే ఆయా ఆపరేషన్ల సమాచారం ఉన్న హార్డ్డిస్్కలు పని పూర్తయిన తర్వాత ధ్వంసం చేస్తుంటామని ప్రభాకర్రావు సిట్ అధికారులకు తెలిపారు. అలా ధ్వంసం చేయడం సర్వసాధారణమే అయితే వాటి శకలాలను తీసుకెళ్లి నాగోలు వద్ద మూసీనదిలో పారేయాల్సిన అవసరం ఏమిటంటూ ప్రభాకర్రావు, ప్రణీత్రావులను సిట్ ప్రశ్నించింది. దీనికి సంబంధించి ప్రభాకర్రావు నుంచి సమాధానం రాలేదని అధికారులు చెబుతున్నారు. ఈ విచారణ మొత్తాన్ని పోలీసులు వీడియో రికార్డింగ్ చేశారు. శనివారం మరోసారి విచారణకు రావాల్సిందిగా ప్రభాకర్రావుకు నోటీసులు జారీ చేశారు. ఆ రోజు ఈ కేసులో అరెస్టు అయి, బెయిల్పై ఉన్న మరో నిందితుడితో కలిపి విచారించనున్నట్టు తెలిసింది. ఇప్పటికీ ప్రభాకర్రావు నుంచి సరైన సహకారం లభించట్లేదని, పక్కా ఆధారాలు చూపించి ప్రశ్నిస్తున్నా ఆయన సమాధానాలు చెప్పట్లేదని సిట్ చెబుతోంది. తనను ట్యాపింగ్, సీడీఆర్ల విశ్లేషణకు సంబంధించిన ఆదేశాలు ప్రభాకర్రావు నుంచి వచ్చాయని ప్రణీత్రావు చెబుతుండగా... ప్రభాకర్రావు మాత్రం వీటిని ఖండిస్తున్నారని వివరిస్తున్నారు. -
సిట్ అడిగింది తెస్తారా? ఇస్తారా?
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో(Phone Tapping Case) ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు ఇవాళ మరోసారి సిట్ ఎదుట విచారణకు హాజరు కానున్నారు. గత విచారణలో అధికారుల ప్రశ్నలకు ఆయన సరైన స్పందన ఇవ్వకపోవడంతో ఇవాళ మరోసారి తమ ఎదుట హాజరు కావాలని దర్యాప్తు బృందం ఆదేశించిన సంగతి తెలిసిందే. మరికాసేపట్లో జూబ్లీహిల్స్ పీఎస్లోని సిట్ కార్యాలయంలో విచారణకు ప్రభాకర్ రావు(Prabhakar Rao) రానున్నారు. తెలంగాణ అసెంబ్లీ సమయంలో వాడిన సెల్ఫోన్లు(రెండు), ల్యాప్ ట్యాప్, మ్యాక్ బుక్లను తీసుకురావాలని ఆయన్ని అధికారులు ఆదేశించారు. వీటి ద్వారా ఈ కేసులో కీలక సమాచారం రాబట్ట వచ్చని సిట్ భావిస్తోంది. దీంతో ఆయన వాటిని తీసుకొస్తారా? అధికారులకు అందిస్తారా? ఏదైనా కారణం చెబుతారా? అనే ఉత్కంఠ నెలకొంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్నారు ప్రభాకర్ రావు. ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు అరెస్టుతో ఈ వ్యవహారంలోకి వెలుగులోకి వచ్చాక.. ఆయన అమెరికా వెళ్లారు. సుమారు 15 నెలల తర్వాత సుప్రీం కోర్టులో అరెస్ట్ నుంచి ఊరట లభించడం, పైగా విచారణకు సహకరించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించడంతో ఈ నెల 8వ తేదీ హైదరాబాద్కు వచ్చారు. ఆపై ఆ మరుసటిరోజు సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. మొదటిసారి 8గంటల పాటు ప్రభాకర్ రావును విచారించిన సిట్.. ఫోన్ ట్యాఇపింగ్ వ్యవహారానికి సంబంధించి పలు ప్రశ్నలు సంధించింది. వాటిలో కొన్నింటికి మాత్రమే ఆయన సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. ఎస్ఐబీ మాజీ డీఎస్పీ, ఈ కేసులో మరో నిందితుడు ప్రణీత్ రావు ఎస్ఐబీకి చెందిన హార్డ్డిస్క్ల డాటా మాయం చేశాడని విచారణలో వెల్లడైన సంగతి తెలిసిందే. ఎస్ఐబీ చీఫ్గా ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ఇదంతా జరిగిందనే అభియోగాలు ఉన్నాయి. దీంతో పాటు. ఎస్ఐబీలో పాత హార్డ్ డిస్క్ల స్థానంలో కొత్తవి పెట్టడం.. కొన్ని దశాబ్దాలుగా నిఘా వర్గాలు దాచిన ఉగ్రవాద, తీవ్ర వాద సమాచారం మాయం కావడంపైనా ప్రభాకర్ రావును ఆరా తీశారు. అయితే వీటిలో దేనికి కూడా ఆయన సానుకూలంగా స్పందించలేదని తెలుస్తోంది. మరోవైపు ప్రభాకర్ రావు రెండో రౌండ్ విచారణపై రాజకీయ వర్గాల్లోనూ ఉత్కంఠ నెలకొంది. -
ప్రొసీజర్స్ ఎందుకు ఫాలో కావడం లేదు?
సాక్షి ప్రతినిధి, విజయవాడ: మద్యం విధానంపై నమోౖదెన అక్రమ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తీరుపై ఏసీబీ కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసు విషయంలో ప్రొసీజర్స్ ఎందుకు ఫాలో కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మీకేమైనా స్పెషల్ ప్రొసీజర్ ఉందా’ అని నిలదీసింది. విచారణాధికారిని అప్పటికప్పుడు కోర్టుకు పిలిపించిన న్యాయమూర్తి ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. విచారణాధికారి తీరుపై అనుమానాలు వ్యక్తమవ#తున్నాయని న్యాయమూర్తి పేర్కొన్నారు. నిందితుల కస్టడీ పిటిషన్ను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేశారు.మద్యం విధానంపై నమోదైన కేసులో నిందితులుగా ఉన్న కేసిరెడ్డి రాజశేఖరరెడ్డి, కె.ధనుంజయరెడ్డి, పి.కృష్ణమోహన్రెడ్డి, గోవిందప్ప బాలాజీ కస్టడీ పిటిషన్లపై విజయవాడలోని ఏసీబీ కోర్టులో సోమవారం విచారణ జరిగింది. కేసిరెడ్డి రాజశేఖరెడ్డిని మూడు రోజులు, కె.ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డి, గోవిందప్ప బాలాజీలను ఏడు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. నేరుగా ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపితే ఎలా! కేసిరెడ్డి, ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డి, గోవిందప్ప బాలాజీ తరఫున న్యాయవాదులు నాగార్జునరెడ్డి, దుష్యంత్రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, శరణ్ వాదనలు వినిపిస్తూ.. ఈ కేసులో ఇంతవరకు ఎవరెవరి నుంచి ఏం మెటీరియల్ సీజ్ చేశారో తెలపాలని కోరారు. సీజ్ చేసిన ఎల్రక్టానిక్ డివైజ్లను, మెటీరియల్ను కోర్టుకు సమర్పించకుండా నేరుగా ఫోరెన్సిక్ ల్యాబ్కు ఎలా పంపుతారని ప్రశి్నంచారు.ఈ కేసును మొదట్లో సీఐడీ అధికారులు దర్యాప్తు చేశారని, అప్పుడు వారు సీజ్ చేసిన ఫైళ్లు, కంప్యూటర్లు కోర్టు ద్వారా ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపిన విషయాన్ని కోర్టు దృష్టికి తెచ్చారు. సిట్ అధికారులు ప్రొసీజర్స్ ఫాలో కావడం లేదని పేర్కొన్నారు. దర్యాప్తు ప్రారంభించినప్పటి నుంచి ఏ ఒక్క ఆధారం కోర్టుకు సమరి్పంచలేదని వివరించారు. ప్రొసీజర్స్ ఫాలో కాకుండా ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపితే ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ప్రొసీజర్ ప్రకారం చేయాల్సిందే బాధితుల తరఫు వాదనలు విన్న న్యాయమూర్తి స్పందిస్తూ.. సిట్ సమరి్పంచిన మెమోలో సైతం ఏ మెటీరియల్ సీజ్ చేశారనే విషయాలే నమోదై ఉన్నాయని, అందుకు సంబంధించిన ఆధారాలు మాత్రం కోర్టుకు సమరి్పంచలేదన్నారు. సిట్ తీరుపై విస్మయానికి గురైన న్యాయమూర్తి అప్పటికçప్పుడు విచారణ అధికారి ఆర్.శ్రీహరిబాబును కోర్టుకు పిలిపించి ప్రొసీజర్స్ ఎందుకు ఫాలో కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.సిట్ తీరుపై ప్రశ్నల వర్షం కురిపించారు. వీటికి విచారణాధికారి సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. ఈ నేపథ్యంలో ‘కోర్టు ప్రొసీజర్స్ ఫాలో కాకుండా విచారణ ఎలా చేస్తారు. మీరు డైరెక్ట్గా ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపితే ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతాయి. మీరు ఏదైనా కోర్టులో పెట్టి ప్రొసీజర్స్ ప్రకారం చేయాలి’ అని న్యాయమూర్తి విచారణాధికారిని ఆదేశించారు. ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపిత కేసు బాధితుల తరఫు న్యాయవాదులు తమ వాదనల్ని కొనసాగిస్తూ.. ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపిత కేసు అని, ఎలాంటి కుంభకోణం జరగలేదని కోర్టుకు స్పష్టం చేశారు. ఆధారాలు లేకుండా అరెస్టు చేసి, అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. సిట్ అధికారులు సాక్షులను తమకు అనుకూలంగా వ్యవహరించాల్సిందిగా బెదిరిస్తున్నారన్నారు. ఈ కేసుపై తాము సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. సాక్షులను బెదిరించకుండా, ప్రొసీజర్స్ ఫాలో కావాలని స్పష్టంగా చెప్పిన విషయాన్ని న్యాయవాదులు ఏసీబీ కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రాసిక్యూషన్ తరఫున జేడీ రాజేంద్రప్రసాద్ వాదనలు వినిపిస్తూ మెమో దాఖలు చేశామని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు కస్టడీ పిటిషన్పై విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. -
రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డి అరెస్ట్
విజయవాడ: మద్యం కేసులో రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డిలను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. మూడు రోజుల విచారణ అనంతరం సిట్ అరెస్ట్ చేసింది. ఈ అరెస్టులు కక్ష పూరితమని.. ఐఏఎస్లు, ఐపీఎస్లను అరెస్టు చేసే సంస్కృతి సరికాదని ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్రెడ్డి తరపు అడ్వకేట్ సుదర్శన్ రెడ్డి అన్నారు. లిక్కర్ కేసులో రిటైర్డు ఐఏఎస్ ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను ఇవాళ రాత్రి 7.15కి అరెస్టు చేశారని.. రేపు(శనివారం) ఉదయం వైద్య పరీక్షల తర్వాత కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.కాగా, మద్యం విధానంపై చంద్రబాబు ప్రభుత్వం నమోదు చేసిన అక్రమ కేసుకు అనుకూలంగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలంటూ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డిని సిట్ తీవ్ర వేధింపులకు గురి చేసిన సంగతి తెలిసిందే. నిన్న (గురువారం) 13 గంటలకుపైగా విచారణ పేరుతో ప్రహసనం సాగించడం సిట్ కుట్రలకు అద్దం పడుతోంది.సిట్ చీఫ్గా ఉన్న విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్బాబు, ఇతర అధికారులు వారిని విడివిడిగా రోజంతా విచారించారు. మొదటి రోజు అడిగిన ప్రశ్నలనే మళ్లీ మళ్లీ అడగడం గమనార్హం. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంతో తమకు ఏమాత్రం సంబంధం లేదని ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. సీఎంవో కార్యదర్శి, ఓఎస్డీలకు మద్యం విధానం రూపకల్పన, అమలుతో ఎలాంటి సంబంధం ఉండదని నిబంధనలను ఉటంకిస్తూ తేల్చి చెప్పారు.ఆ అంశం పూర్తిగా ఎక్సైజ్ శాఖ, బెవరేజస్ కార్పొరేషన్కు సంబంధించినదని పేర్కొన్నారు. అయినా సరే సిట్ అధికారులు పదే పదే అవే ప్రశ్నలు వేస్తూ వారిని వేధించారు. ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేస్తూ వారిపై మానసిక ఒత్తిడికి గురి చేసేందుకు యత్నించారు. ఇక మెయిల్ ఐడీలు, పాస్ వర్డ్ చెప్పమని సిట్ అధికారులు అడిగారు. అందుకు వారిద్దరూ సున్నితంగా తిరస్కరించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు నడుచుకుంటామని స్పష్టం చేశారు. -
విచారణ పేరుతో వేధింపులు
సాక్షి, అమరావతి: మద్యం విధానంపై చంద్రబాబు ప్రభుత్వం నమోదు చేసిన అక్రమ కేసుకు అనుకూలంగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలంటూ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డిని సిట్ తీవ్ర వేధింపులకు గురి చేస్తోంది. గురువారం 13 గంటలకుపైగా విచారణ పేరుతో ప్రహసనం సాగించడం సిట్ కుట్రలకు అద్దం పడుతోంది. రిటైర్డ్ అధికారులైన వారిని ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11.15 గంటల వరకు విచారణ పేరుతో విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఉంచడం గమనార్హం. తాము తదుపరి విచారణ చేపట్టేవరకు ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని సిట్ను ఆదేశిస్తూ తదుపరి విచారణను సుప్రీంకోర్టు శుక్రవారానికి వాయిదా వేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారిద్దరూ బుధవారం స్వచ్ఛందంగా సిట్ ముందు విచారణకు హాజరయ్యారు. తొలిరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వారిని విచారించిన సిట్ అధికారులు మరుసటి రోజు గురువారం కూడా రావాలని పేర్కొన్నారు. దీంతో వారిద్దరూ వరుసగా రెండో రోజు గురువారం కూడా విచారణకు హాజరయ్యారు. ఉదయం 10 గంటలకే విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి చేరుకున్నారు.మళ్లీ మళ్లీ.. అవే ప్రశ్నలుసిట్ చీఫ్గా ఉన్న విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్బాబు, ఇతర అధికారులు వారిని విడివిడిగా రోజంతా విచారించారు. మొదటి రోజు అడిగిన ప్రశ్నలనే మళ్లీ మళ్లీ అడగడం గమనార్హం. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంతో తమకు ఏమాత్రం సంబంధం లేదని ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. సీఎంవో కార్యదర్శి, ఓఎస్డీలకు మద్యం విధానం రూపకల్పన, అమలుతో ఎలాంటి సంబంధం ఉండదని నిబంధనలను ఉటంకిస్తూ తేల్చి చెప్పారు. ఆ అంశం పూర్తిగా ఎక్సైజ్ శాఖ, బెవరేజస్ కార్పొరేషన్కు సంబంధించినదని పేర్కొన్నారు. అయినా సరే సిట్ అధికారులు పదే పదే అవే ప్రశ్నలు వేస్తూ వారిని వేధించారు. ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేస్తూ వారిపై మానసిక ఒత్తిడికి గురి చేసేందుకు యత్నించారు. ఇక మెయిల్ ఐడీలు, పాస్ వర్డ్ చెప్పమని సిట్ అధికారులు అడిగారు. అందుకు వారిద్దరూ సున్నితంగా తిరస్కరించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు నడుచుకుంటామని స్పష్టం చేశారు.వెళ్లిపోవచ్చంటూ.. మళ్లీ రప్పించి..ఎట్టకేలకు రాత్రి 9.30 గంటల సమయంలో ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డి నుంచి సెల్ ఫోన్లు తీసుకుని విచారణ ముగిసిందని, వెళ్లవచ్చని సిట్ అధికారులు చెప్పారు. అయితే బయటకు వెళుతున్న వారిని మరోసారి వెనక్కి రప్పించారు. సిట్ చీఫ్ ఎస్వీ రాజశేఖర్బాబు మరోసారి విచారిస్తారని, వేచి ఉండాలని సూచించారు. అయితే రాజశేఖర్బాబు పనుల మీద బయటకు వెళ్లినందున ఆయన వచ్చే వరకు వేచి ఉండాలంటూ మరో గంటన్నరకుపైగా కాలహరణం చేశారు. వారిద్దరినీ మానసికంగా, శారీరకంగా వేధించడమే లక్ష్యంగా వ్యవహరించారు. సిట్ అధికారుల తీరుపై వైఎస్సార్సీపీ లీగల్ సెల్ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. న్యాయస్థానం ఆదేశాలకు విరుద్ధంగా సిట్ అధికారులు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. దాంతో ఎట్టకేలకు రాత్రి 11.15 గంటల సమయంలో విచారణ ముగిసిందంటూ ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డిని సిట్ అధికారులు పంపించేశారు. ఇలా ఉద్దేశపూర్వకంగా వేధించాలని ముందుగానే రూపొందించుకున్న ప్రణాళికను అమలు చేశారు. శుక్రవారం కూడా మళ్లీ విచారణకు రావాలని వారికి సిట్ అధికారులు సూచించారు.సిట్ తీరు దారుణందర్యాప్తు పేరుతో ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డిని సిట్ వేధింపులకు గురి చేస్తోంది.రాజ్యాంగం, న్యాయస్థానాల తీర్పులు అంటే ఏమాత్రం లెక్కలేనట్లు కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. సీనియర్ సిటిజన్లు అయిన వారిద్దరినీ 12 గంటలకు పైగా విచారణ పేరుతో వేధించడం ప్రభుత్వ కుట్రకు తార్కాణం. పౌరుల స్వేచ్ఛ, ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారు. ఈ అక్రమ కేసులో గతంలో ఓ నిందితుడి పట్ల సిట్ అధికారులు ఇలాగే వ్యవహరిస్తే న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన ఇంటికి వెళ్లి విచారించాలని, సాయంత్రం 5 గంటల తరువాత విచారించవద్దని ఆదేశించింది. అయినా సరే సిట్ తీరు ఏమాత్రం మారలేదు. సిట్ అధికారులు రాజకీయ పార్టీ నేతల్లా వ్యవహరించడం సరికాదు. ఈ వ్యవహారాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళతాం. – మనోహర్ రెడ్డి, వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడురాజకీయ వేధింపులు...రాజకీయ కారణాలతోనే ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డిని సిట్ వేధిస్తోంది. కక్ష పూరితంగా వ్యవహరిస్తోంది. ఈ అంశాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళతాం. – మొండితోక అరుణ్కుమార్, దేవినేని అవినాశ్, వైఎస్సార్సీపీ నేతలు మద్యం విధానంపై కేసు... ముందస్తు బెయిల్పై నేడు ‘సుప్రీం’ విచారణ ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డిలకు ఇప్పటికే అరెస్టు నుంచి తాత్కాలిక ఊరట బాలాజీ గోవిందప్ప అరెస్ట్పైనా తేలుస్తామన్న ధర్మాసనం సాక్షి, న్యూఢిల్లీ: మద్యం విధానానికి సంబంధించి అక్రమ కేసు ఎదుర్కొంటున్న ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డి, బాలాజీ గోవిందప్ప దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్లపై సుప్రీంకోర్టు శుక్రవారం మరోసారి విచారించనుంది. తాము తదుపరి విచారణ చేపట్టేవరకు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డిని అరెస్టు చేయరాదని ఆదేశిస్తూ ఈ నెల 13న సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి ముందస్తు బెయిల్ పిటిషన్లు జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్.మహదేవన్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందు నేడు మరోసారి విచారణకు రానున్నాయి. ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డి ఇప్పటికే స్వచ్ఛందంగా సిట్ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. మరింత మురికిగా మార్చవద్దంటూ ఘాటు వ్యాఖ్యలు..ముందస్తు బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుందని తెలిసి కూడా అదే రోజు తెల్లవారుజామున బాలాజీ గోవిందప్పను ఆగమేఘాలపై అరెస్ట్ చేశారని గత విచారణ సందర్భంగా ఆయన న్యాయవాది సిద్ధార్థ్ దవే ధర్మాసనం దృష్టికి తెచ్చారు. గోవిందప్ప అరెస్ట్ అక్రమమని నిరూపిస్తామని, దర్యాప్తు సంస్థ తీరును పరిగణనలోకి తీసుకోవాలని అభ్యర్థించారు. దీనిపై సుప్రీం ధర్మాసనం స్పందిస్తూ.. తదుపరి విచారణలో బాలాజీ గోవిందప్ప అరెస్ట్ సంగతి కూడా తేలుస్తామని ప్రకటించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ తరపు న్యాయవాది సిద్ధార్థ్ అగర్వాల్ అభ్యంతరం వ్యక్తం చేయగా... జస్టిస్ పార్దీవాలా ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారాన్ని మరింత మురికిగా మార్చవద్దంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే గోవిందప్ప అరెస్ట్ నేపథ్యంలో ముందస్తు బెయిల్ పిటిషన్ నిరర్ధకమవుతుందంటూ వాదన వినిపించిన రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదులపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ధర్మాసనం... ఈ మొత్తం వ్యవహారంలో మీరేం చేస్తున్నారో స్పష్టంగా కనిపిస్తోందంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. -
రిమాండ్ నివేదిక సాక్షిగా.. బాబు భేతాళ కుట్రే...!
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు రెడ్బుక్ కుట్ర మరోసారి బట్టబయలైంది. టీడీపీ వీరవిధేయ పోలీసు అధికారులతో నియమించుకున్న సిట్ ద్వారా సాగిస్తున్న కుతంత్రం న్యాయస్థానానికి సమర్పించిన రిమాండ్ నివేదిక సాక్షిగా బయటపడింది. దర్యాప్తు, ఆధారాలు తదితర న్యాయపరమైన విధానాలతో నిమిత్తం లేకుండా ఏకపక్షంగా సాగిస్తున్న కుతంత్రం మరోసారి వెలుగుచూసింది. టీడీపీ ప్రధాన కార్యాలయంలో అవాస్తవాలు, అభూత కల్పనలతో రూపొందించిన నివేదికలనే సిట్ తన రిమాండ్ నివేదికలతో సమర్పించి న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించేందుకు బరితెగిస్తోందని ఆధారాలతో సహా వెల్లడైంది. ఈ అక్రమ కేసులో సిట్ తాజాగా అరెస్టు చేసిన అంతర్జాతీయ సిమెంట్ దిగ్గజ కంపెనీ వికాట్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప రిమాండ్ నివేదిక ప్రభుత్వ కుట్రను బట్టబయలు చేసింది. ఇప్పటికే రాజ్ కేసిరెడ్డి చెప్పని విషయాలు చెప్పినట్టుగా ఆయన పేరిట అబద్ధపు వాంగ్మూలంతో రిమాండ్ నివేదిక రూపొందించి సిట్ అడ్డంగా దొరికిపోయింది. ఆ వాంగ్మూలంపై ఆయన సంతకం చేసేందుకు నిరాకరించారని సిట్ అధికారులే న్యాయస్థానానికి వెల్లడించాల్సి వచ్చింది. అయినా సరే సిట్ తీరు ఏమాత్రం మారలేదు. ఈ కేసులో తాజాగా బాలాజీ గోవిందప్ప రిమాండ్ నివేదికలోనూ అదే అబద్ధపు వాంగ్మూలాల కుతంత్రానికి తెగబడింది. కర్ణాటకలో మంగళవారం అరెస్టు చేసిన ఆయన్ను సిట్ అధికారులు బుధవారం న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయస్థానం ఆయనకు ఈ నెల 20 వరకు రిమాండ్ విధించింది. మరోవైపు టీడీపీ ప్రభుత్వ కుట్రలను సవాల్ చేస్తూ ఈ కేసులో అరెస్టైన రాజ్ కేసిరెడ్డి కుటుంబం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ అరెస్టు అక్రమమని, చట్ట విరుద్ధమని నివేదించింది. దీనిపై స్పందించిన సర్వోన్నత న్యాయస్థానం ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణలో అరెస్టుకు సంబంధించిన అంశాలను పరిశీలిస్తామని ప్రకటించింది.బాలాజీ గోవిందప్పతో సిట్ అధికారులు పలు పత్రాలపై బలవంతంగా సంతకాలు చేయించారని న్యాయస్థానానికి సమరి్పంచిన మెమోలో పేర్కొన్న భాగం గోవిందప్పతో బలవంతంగా సంతకాలు చేయించిన సిట్చంద్రబాబు ప్రభుత్వ రెడ్బుక్ కుట్రతోనే ఈ అక్రమ కేసులో బాలాజీ గోవిందప్పను నిందితుడిగా చేర్చారన్నది వెల్లడైంది. ఆయన పేరిట అవాస్తవాలతో సిట్ అధికారులే అబద్ధపు వాంగ్మూలం నమోదు చేసేశారు. ఆ వాంగ్మూల పత్రంపై సంతకం చేసేందుకు బాలాజీ గోవిందప్ప నిరాకరించారని.. ఆయనతో పోలీసులు బలవంతంగా కొన్ని పత్రాలపై సంతకాలు చేయించారని న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాల్లో స్పష్టంగా ఉండటం గమనార్హం. అంతేకాదు మూడో పార్టీకి చెందిన మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లను సిట్ అధికారులు అక్రమంగా జప్తు చేశారన్నది కూడా వెలుగులోకి వచ్చింది. వాటిని ట్యాంపర్ చేయడం ద్వారా ఈ కేసులో తప్పుడు సాక్ష్యాలు సృష్టించాలన్నది సిట్ లక్ష్యమన్నది స్పష్టమవుతోంది. ఇదే విషయాలను బాలాజీ గోవిందప్ప తరపు న్యాయవాది ప్రత్యేక మెమో ద్వారా న్యాయస్థానం దృష్టికి తెచ్చారని కూడా ఆ ఉత్తర్వుల్లో పేర్కొనడం గమనార్హం. ఆ మెమోలో పేర్కొన్న అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని న్యాయస్థానం సానుకూలంగా స్పందించడం కీలకంగా మారింది. ఇక బాలాజీ గోవిందప్ప ముందస్తు బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు రానుందని తెలిసే... అంతకుముందే తెల్లవారు జామునే ఆయన్ను అక్రమంగా అరెస్టు చేశారని గోవిందప్ప న్యాయవాది న్యాయస్థానానికి నివేదించారు. సిట్లో సభ్యుడుకాని అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశ్వర్లుకు ఎలాంటి అధికారం లేనప్పటికీ బాలాజీ గోవిందప్పను అక్రమంగా అరెస్ట్ చేశారని కూడా న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. సిట్ పూర్తిగా అవాస్తవాలు, అభూతకల్పనలతో బాలాజీ గోవిందప్ప రిమాండ్ నివేదికను రూపొందించి న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించేందుకు యత్నించింది.అరెస్టుకు ముందే రిమాండ్ నివేదికలా..!ఆ నివేదిక కుట్రే... ఇదిగో సాక్ష్యం...ఇక నిందితుల అరెస్టు, విచారణతో నిమిత్తం లేకుండానే టీడీపీ కార్యాలయంలోనే రిమాండ్ నివేదికలు రూపొందిస్తున్న కుట్రలు బట్టబయలయ్యాయి. బాలాజీ గోవిందప్ప రిమాండ్ నివేదికే ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. ఆయన అరెస్టుకు కారణాలను వెల్లడిస్తూ... నిందితుడు పెళ్లకూరు కృష్ణమోహన్రెడ్డి ఇతరులు అవినీతికి పాల్పడ్డారు అని పేర్కొంది. అసలు బాలాజీ గోవిందప్ప అరెస్టుపై రిమాండ్ నివేదికలో కృష్ణమోహన్రెడ్డి పేరును ఎందుకు ప్రస్తావించినట్టు..? అంటే నిందితుల అరెస్టులతో నిమిత్తం లేకుండానే ముందుగానే టీడీపీ ఆఫీసులోనే రిమాండ్ నివేదికలు రూపొందించి.. వాటిని కాపీ, పేస్ట్ చేస్తూ న్యాయస్థానానికి సమర్పిస్తున్నట్టు వెల్లడైంది.ఎవరినైనా ఇరికిస్తాం..!బాలాజీ గోవిందప్ప వైఎస్ జగన్ దగ్గర పనిచేస్తున్నట్లు రిమాండ్ రిపోర్టులో రాశారు. కానీ ఆయన వైఎస్ జగన్ సంస్థల్లో పని చేయట్లేదు. 12 దేశాల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్న అంతర్జాతీయ దిగ్గజ కంపెనీ వికాట్లో పూర్తి స్థాయి డైరెక్టర్గా ఉన్నారు. భారతీ సిమెంట్స్లో మెజార్టీ వాటాను వికాట్ ఎప్పుడో కొనుగోలు చేసింది. వైఎస్ జగన్ కుటుంబ సభ్యులకు కంపెనీలో మైనార్టీ షేర్ మాత్రమే ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్కు చెందిన అధికారులతో గోవిందప్ప చాలా సన్నిహితంగా మెలిగి కుట్రలకు పాల్పడ్డారని రిపోర్టులో రాశారు. ఆయన ఎప్పుడూ హైదరాబాద్లోనే ఉంటారు. ఏపీకి రావడం చాలా తక్కువ. వృత్తిరీత్యా చార్టెడ్ అక్కౌంటెంట్ అయిన గోవిందప్పకు నిరంతరం ఊపిరి సలపని పనులు ఎన్నో ఉంటాయి. ఓ అంతర్జాతీయ దిగ్గజ కంపెనీ హోల్టైమ్ ఫైనాన్స్ డైరెక్టర్నే ఇలా టార్గెట్ చేసి అక్రమ కేసులో, జరగని కుంభకోణంలో ఇరికించారంటే.. ఇక దేశంలో ఎవరినైనా కేసుల్లో ఇరికించవచ్చు అనే సందేశాన్ని చంద్రబాబు సర్కారు పంపింది. దీన్నిబట్టి భేతాళ కుట్రలు మరోసారి నిరూపితమవుతున్నాయి. -
ఏపీ సీఐడీ పరిధి సంగతి తేలుస్తాం
సాక్షి, అమరావతి: ఏపీ సీఐడీ పరిధి సంగతిని తేలుస్తామని, సీఐడీ కూడా చట్ట నిబంధనల ప్రకారమే నడుచుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో పూర్తిస్థాయిలో విచారణ జరుపుతామని పేర్కొంది. మద్యం కొనుగోళ్ల వ్యవహారంలో విచారణకు హాజరు కావాలంటూ బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 179 కింద ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు తనకు నోటీసులు జారీ చేయడాన్ని సవాలు చేస్తూ రాజ్ కేసిరెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.సీఐడీ నోటీసుల్లో జోక్యానికి నిరాకరిస్తూ హైకోర్టు గత నెల 4న ఇచ్చిన ఉత్తర్వులపై స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్థీవాలా, జస్టిస్ ఆర్.మహదేవన్ ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, సీఐడీ స్టేషన్ హౌజ్ ఆఫీసర్, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారి, ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనాలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 13కి వాయిదా వేసింది.తెలంగాణ పరిధిలో జోక్యం చేసుకునే అధికారం ఏపీ సీఐడీకి లేదుఅంతకుముందు రాజ్ కేసిరెడ్డి తరఫు న్యాయవాది శ్రీహర్ష పీచర వాదనలు వినిపించారు. రాజ్ హైదరాబాద్లో నివాసం ఉంటారని, అందువల్ల ఆయనకు నోటీసులు జారీ చేసే పరిధి ఏపీ సీఐడీకి లేదని వివరించారు. ఒక రాష్ట్రం తన పరిధిలోని ప్రాంతాలకు సంబంధించిన వ్యవహారాల్లో మాత్రమే కలగజేసుకునే వీలుంటుందని తెలిపారు. తాము సీఐడీ నోటీసులను సవాలు చేస్తూ మొదట ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశామని, అయితే ఏపీ సీఐడీ పరిధిలోకి తెలంగాణ రాష్ట్రం వస్తుందంటూ 2022లో హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా తమ పిటిషన్లో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించిందని పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణ సీఐడీలకు ఇరు రాష్ట్రాలు కూడా ఒకదానికొకటి పొరుగు పోలీస్ స్టేషన్లు అవుతాయన్న తీర్పు ఇవ్వడం ద్వారా హైకోర్టు పొరపాటు చేసిందని వివరించారు. సీఐడీ పరిధి విషయంలో హైకోర్టు చెప్పిన భాష్యం వల్ల సెక్షన్ 179 నిరర్థకం అవుతోందన్నారు. హైకోర్టు తీర్పుతో ఏపీ సీఐడీకి అపరిమిత అధికారులు దఖలు పడ్డాయన్నారు. దీంతో పొరుగు రాష్ట్రంలోని వారికి సైతం నోటీసులు ఇచ్చే అధికారం సీఐడీకి కలిగిందని తెలిపారు. అందులో భాగంగానే పిటిషనర్ రాజ్ కేసిరెడ్డికి ఏపీ సీఐడీ నోటీసులు ఇచ్చిందని అన్నారు. కేవలం రాజకీయ కారణాలతోనే పిటిషనర్ను తప్పుడు కేసులో ఇరికించినట్లు చెప్పారు.ఇప్పటికే అరెస్ట్ చేశారు.. ఈ వ్యాజ్యం నిరర్థకంరాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ, సీఐడీ పరిధి విషయంలో ఏపీ హైకోర్టు చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చిందని.. పిటిషనర్ను సీఐడీ ఇప్పటికే అరెస్ట్ చేసిందని తెలిపారు. కాబట్టి నోటీసులను సవాలు చేస్తూ దాఖలు చేసిన ఈ వ్యాజ్యం నిరర్థకం అవుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఐడీ పరిధిని తేలుస్తాం అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సీఐడీ స్టేషన్ హౌజ్ ఆఫీసర్, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు అధికారి, ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనాలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 13కి వాయిదా వేసింది. మద్యం కొనుగోళ్ల వ్యవహారంలో ముందస్తు బెయిల్ కోరుతూ ఎంపీ మిథున్రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంతో కలిపి ఈ వ్యాజ్యాన్ని విచారిస్తామని తెలిపింది. -
ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు
ఢిల్లీ: మద్యం విధానం కేసులో మద్యం తనకు సీఆర్పీసీ 160 నోటీసు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ.. సుప్రీంకోర్టులో రాజ్ కేసిరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణలో నివసిస్తున్న తనకు నోటీసులు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. నోటిసు ఇచ్చే పరిధి ఏపీ సీఐడికి లేదని పిటిషన్లో ఆయన పేర్కొన్నారు.విచారణ జరిపిన జస్టిస్ జేబీ పార్థివాల, జస్టిస్ మహదేవన్ ధర్మాసనం.. ఏపీ ప్రభుత్వం, సిట్, ముఖేష్కుమార్కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. రాజ్ కేసిరెడ్డి తరపున న్యాయవాది శ్రీహర్ష వాదనలు వినిపించారు. తదుపరి విచారణ మే 13కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది. -
‘సిట్’ చిలకమ్మ.. కట్టుకథలు
సాక్షి, అమరావతి: టీడీపీ వీరవిధేయ సిట్ కట్టుకథలు అంతూ పొంతూ లేకుండా సాగుతున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసు దర్యాప్తు నివేదికల పేరిట అవాస్తవాలు, అభూతకల్పనలతో కనికట్టు చేసేందుకు బరితెగిస్తోంది. ఆ కేసులో అక్రమంగా అరెస్టు చేస్తున్నవారి వాంగ్మూలాల పేరిట న్యాయస్థానానికి సమర్పిస్తున్న రిమాండ్ రిపోర్టులే చంద్రబాబు ప్రభుత్వ కుట్రను బట్టబయలు చేస్తున్నాయి. మొన్న రాజ్ కేసిరెడ్డి.. నిన్న చాణక్య.. నేడు శ్రీధర్ రెడ్డి.. ఈ ముగ్గురి రిమాండ్ రిపోర్టులు పరిశీలిస్తే ప్రభుత్వ కుతంత్రం బయటపడుతోంది. అంతా కనికట్టే! వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరగని కుంభకోణాన్ని జరిగినట్టుగా చూపించేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్రలకు తెగబడుతోంది. దీనికోసం టీడీపీ వీరవిధేయ అధికారులతో కూడిన సిట్ ద్వారా అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలు సృష్టించేందుకు పన్నాగాలు పన్నుతోంది. ఈ కేసులో న్యాయస్థానానికి సమర్పించిన వరుసగా మూడో రిమాండ్ రిపోర్ట్ కూడా సిట్ కుయుక్తులను బయటపెట్టింది. ఈ కేసులో ఆరో నిందితుడిగా శ్రీధర్ రెడ్డిని అరెస్టు చేసి న్యాయస్థానంలో శనివారం హాజరు పరుస్తూ సిట్ రిమాండ్ రిపోర్టు సమర్పిoచింది. అంతకుముందు రాజ్ కేసిరెడ్డి, చాణక్య రిమాండు రిపోర్టుల్లో పేర్కొన్న అవాస్తవ ఆరోపణలు, కల్పిత అభియోగాలనే శ్రీధర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులోనూ సిట్ పునరుద్ఘాటించింది. వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ్రెడ్డి తదితరుల పేర్లను ప్రస్తావిస్తూ అవాస్తవాలను వండి వార్చింది. పైగా అవన్నీ కూడా శ్రీధర్రెడ్డి తమ విచారణలో వెల్లడించారని సిట్ పేర్కొనడం గమనార్హం. కానీ ఆ వాంగ్మూలంపై సంతకం చేసేందుకు శ్రీధర్ రెడ్డి నిరాకరించారని ఆ నివేదికలో పేర్కొంది. మధ్యవర్తుల సమక్షంలో తాము వాంగ్మూలాన్ని నమోదు చేశామని తెలిపింది. అంటే ఈ కేసులో కుట్ర క్రమం అంటూ సిట్ వివరించిన విషయాలేవీ వాస్తవం కాదని స్పష్టమైంది. వాటిని శ్రీధర్రెడ్డి చెప్పనే లేదని.. అందుకే ఆయన సంతకం చేసేందుకు నిరాకరించారన్నది బయటపడింది. ప్రభుత్వ పెద్దల కుట్రను అమలు చేస్తూ సిట్ అధికారులే అవాస్తవాలు, అభూతకల్పలను వాంగ్మూలంగా నమోదు చేసేశారని స్పష్టమైంది. ఇదే కేసులో రాజ్ కేసిరెడ్డి, చాణక్య కూడా చెప్పని విషయాలను చెప్పినట్టుగా సిట్ ఏకపక్షంగా వారి పేరిట వాంగ్మూలంగా నమోదు చేసింది. కానీ తాము సంతకాలు చేయలేదనే విషయాన్ని వారే న్యాయస్థానం దృష్టికి తీసుకువెళితే ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందనే సిట్ అధికారులు ఆ విషయాన్ని రిమాండ్ రిపోర్టులో తప్పనిసరై వెల్లడించారు. ఇంత బరి తెగింపా..! ఇంత నిర్భీతిగా అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో సిట్ దర్యాప్తు పేరుతో అటు న్యాయస్థానాలను ఇటు ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు అధికారులు యత్నిస్తుండటం విస్మయపరుస్తోంది. ఆ అబద్ధపు వాంగ్మూలాలను టీడీపీ అనుకూల మీడియా ద్వారా దుష్ప్రచారం చేయడమే సిట్ లక్ష్యమన్నది తేటతెల్లమవుతోంది. ఈ కేసు పేరుతో చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తుంది కేవలం రెడ్ బుక్ కక్ష సాధింపు కుట్రేనన్నది స్పష్టమవుతోంది. -
సిట్ సాక్షిగా చంద్రబాబు కుట్ర బట్టబయలు
-
సిట్ రిమాండ్ నివేదిక సాక్షిగా..బాబు భేతాళ కుట్ర బట్టబయలు
సాక్షి, అమరావతి: చంద్రబాబు భేతాళ కుట్ర బట్టబయలైంది. టీడీపీ వీరవిధేయ పోలీసు అధికారులతో కూడిన సిట్ నివేదిక సాక్షిగా రెడ్బుక్ కుతంత్రం బెడిసికొట్టింది. తద్వారా చంద్రబాబు తాను తీసిన గోతిలో తానే పడ్డారు! వైఎస్సార్సీపీ హయాంలో పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసులో రాజ్ కేసిరెడ్డిని అరెస్టు చేసి న్యాయస్థానానికి సమర్పించిన రిమాండ్ నివేదిక ఆ విషయాన్ని బట్టబయలు చేసింది. కానీ ఆయన ఇచ్చినట్లుగా చెబుతున్న వాంగ్మూలంపై సంతకం చేసేందుకు నిరాకరించారని సిట్ వెల్లడించడం అసలు కుట్రను వెల్లడించింది. అంటే రాజ్ కసిరెడ్డి చెప్పకుండానే.. తాను అబద్ధపు వాంగ్మూలం నమోదు చేసినట్లు సిట్ అంగీకరించింది. ఇక మద్యం డిస్టిలరీలకు ఆర్డర్లలో వివక్షకు పాల్పడి అవినీతి చేశారని సిట్ పేర్కొంది. కానీ అదే నివేదికలో నాడు చంద్రబాబు ప్రభుత్వంలో కేవలం నాలుగు కంపెనీల నుంచే ఏకంగా 53.21 శాతం మద్యం కొనుగోళ్లు చేశారని వెల్లడించింది. ఇక టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన సి–టెల్ సాఫ్ట్వేర్ను తొలగించడం ద్వారా వైఎస్సార్సీపీ ప్రభుత్వం మద్యం ఆర్డర్లు జారీలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపించింది. మరి సి–టెల్ సాఫ్ట్వేర్ ఉన్నప్పుడు కేవలం నాలుగు కంపెనీల నుంచి ఏకంగా 53.21 శాతం మద్యం కొనుగోళ్లు ఎందుకు చేశారనే దానిపై సిట్ మౌనం వహించింది. తద్వారా టీడీపీ హయాంలోనే మద్యం కుంభకోణానికి పాల్పడ్డారని అసలు గుట్టు విప్పింది. ఇక నెలకు రూ.50 కోట్ల నుంచి రూ.60 కోట్లు చొప్పున రాజ్ కేసిరెడ్డి వసూలు చేసి వైఎస్సార్ సీపీలోని ముఖ్యులకు ఇచ్చారని ఒకచోట... రాజ్ కేసిరెడ్డే ఆ నిధులను దేశంలో వివిధ చోట్ల పెట్టుబడి పెట్టారని మరోచోట పరస్పర విరుద్ధంగా పేర్కొనడం ద్వారా తన దర్యాప్తులో డొల్లతనాన్ని బయటపెట్టింది. తాము బెదిరించి వేధించిన వాసుదేవరెడ్డి, సత్య ప్రసాద్ తదితరులతో ఇప్పించిన అబద్ధపు వాంగ్మూలాల ఆధారంగానే దర్యాప్తు పేరిట కనికట్టు చేసినట్టు అంగీకరించింది. అంతిమంగా టీడీపీ గత ఐదేళ్లలో చేసిన అవాస్తవ ఆరోపణలు, అభూత కల్పనలనే గుదిగుచ్చి దర్యాప్తు నివేదికగా ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు బరితెగించిందన్నది స్పష్టమైంది. దర్యాప్తు పేరిట తాము సాధించింది శూన్యమని గ్రహించిన సిట్ ఏమీ చేయలేక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరును నివేదికలో ప్రస్తావించడం ద్వారా ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించింది. సిట్ నివేదిక సాక్షిగా వెల్లడైన చంద్రబాబు ప్రభుత్వ కుట్ర ఇదిగో ఇలా ఉంది...డిస్టిలరీలూ బాబు దందానే బట్టబయలు చేసిన సిట్ నివేదికవైఎస్సార్సీపీ హయాంలో కొన్ని డిస్టిలరీలకు అనుకూలంగా వ్యవహరించారని, వాటికే అత్యధిక మద్యం ఆర్డర్లు ఇచ్చారని సిట్ ఆరోపించింది. తద్వారా కొన్ని డిస్టిలరీలకు అడ్డగోలుగా లబ్ధి చేకూర్చి కమీషన్లు తీసుకున్నారని ఆవాస్తవ అభియోగాలు మోపింది. కానీ స్వామి భక్తి చాటుకునే హడావుడిలో అసలు చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే డిస్టిలరీల నుంచి మద్యం కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారనే వాస్తవాన్ని బయటపెట్టేయడం గమనార్హం. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2018–19లో కేవలం నాలుగు కంపెనీల నుంచి ఏకంగా 53.21 శాతం మద్యం కొనుగోళ్లు చేశారని సిట్ నివేదికలో తెలిపింది. అంటే చంద్రబాబు హయాంలోమద్యం కొనుగోలు ఆర్డర్లలో ఏకంగా 53.21 శాతం కేవలం నాలుగు డిస్టిలరీలకే ఇవ్వడం అంటే అక్రమాలకు పాల్పడినట్టే కదా? తద్వారా మద్యం ఆర్డర్లలో కుంభకోణానికి పాల్పడింది చంద్రబాబు ప్రభుత్వమేనని రూఢీ అయింది. సి–టెల్ సాఫ్ట్వేర్ ద్వారా కేవలం నాలుగు కంపెనీల నుంచి ఏకంగా 53.21 శాతం మద్యం కొనుగోళ్లు చేశారని, దాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం తొలగించిందని సిట్ పేర్కొంది. లోపభూయిష్టమైన ఆ సాఫ్ట్వేర్ను తొలగించడం ద్వారా వైఎస్సార్సీపీ ప్రభుత్వం సరైన నిర్ణయమే తీసుకున్నట్లే కదా!రాజ్ కేసిరెడ్డి వాంగ్మూలం పేరిట కుట్ర..సిట్ కుట్రను బయటపెట్టిన రిమాండ్ నివేదిక వైఎస్సార్సీపీ హయాంలో మద్యం విధానంలో భారీ కుంభకోణం జరిగినట్టుగా దుష్ప్రచారాన్ని ప్రజల్లో వ్యాప్తి చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించే రీతిలో కుట్రకు తెగించింది. అందుకోసమే రాజ్ కేసిరెడ్డి విచారణ ప్రక్రియను అడ్డంపెట్టుకుని పన్నాగం రచించింది. ఆయన్ను సోమవారం హైదరాబాద్లో అరెస్టు చేసిన సిట్ అధికారులు మంగళవారం సాయంత్రం వరకు విచారణ పేరుతో తతంగం నడిపించారు. అనంతరం ఆయన వాంగ్మూలంగా పేర్కొన్నారంటూ ఓ నివేదికను న్యాయస్థానానికి సమర్పించారు. అందులో మద్యం కుంభకోణం కుట్ర అంటూ కట్టుకథ అల్లారు. ఏకంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరును ప్రస్తావించడం చంద్రబాబు కుట్రలకు పరాకాష్ట. సంక్షేమ పథకాలను అమలు చేసేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఆదాయం వచ్చేలా... మరోవైపు వైఎస్సార్సీపీకి ఫండింగ్ వచ్చేలా మద్యం విధానాన్ని రూపొందించమని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తనతో చెప్పినట్టుగా రాజ్ కేసిరెడ్డి తెలిపారని ఆ నివేదికలో పేర్కొంది. కానీ వాస్తవం ఏమిటంటే... రాజ్ కసిరెడ్డి వాంగ్మూలం అంటూ సమర్పించిన నివేదికపై ఆయన సంతకం చేయడానికి పూర్తిగా నిరాకరించారని సిట్ నివేదిక వెల్లడించింది. మరి అలాంటప్పుడు ఇక కుంభకోణం ఎక్కడ...? రిమాండ్ నివేదికలో పేర్కొన్న అభియోగాలన్నీ కట్టుకథలేనని సిట్ స్వయంగా అంగీకరించినట్లైంది. సంతకం చేసేందుకు రాజ్ కేసిరెడ్డి నిరాకరించిన విషయాన్ని కూడా ఎందుకు పేర్కొన్నారంటే..న్యాయస్థానంలో హాజరు పరిచేటప్పుడు ‘మీరే చెప్పారా...? సంతకం చేశారా’ అని ఆయన్ను న్యాయమూర్తి ప్రశ్నించే అవకాశం ఉంది. అప్పుడు తమ బండారం బయటపడుతుందని ముందు జాగ్రత్తగా ఆయన సంతకం చేయలేదని వెల్లడించక సిట్ అధికారులకు తప్ప లేదు. కుట్రకు అనుకూలంగా సిట్ అధికారులు ఓ రిమాండ్ నివేదికను సృష్టించి కనికట్టు చేసేందుకు యత్నించారన్నది దీంతో బట్టబయలైంది. ఆ విషయాలను రాజ్ కేసిరెడ్డే వెల్లడించి ఉంటే...ఆయన ఆ వాంగ్మూలం కాపీపై సంతకం చేసేందుకు ఎందుకు నిరాకరిస్తారు?.. అంటే రిమాండ్ నివేదిక పేరిట సిట్ కుట్రకు పాల్పడిందన్నది స్పష్టమైంది. సిట్ అధికారులే న్యాయస్థానానికి సమర్పించిన నివేదిక దీనికి సాక్ష్యం. నాడు టీడీపీ దుష్ప్రచారమే...నేడు సిట్ రిమాండ్ నివేదికచంద్రబాబు, లోకేశ్, టీడీపీ అధికార ప్రతినిధులు టీడీపీ కార్యాలయంలో మాట్లాడిన మాటల్నే సిట్ తన రిమాండ్ నివేదికగా న్యాయస్థానానికి సమర్పించడం విడ్డూరంగా ఉంది. అందులో పేర్కొన్నవన్నీ అసత్య ఆరోపణలేననడానికి ఇవిగో తార్కాణాలు..అబద్ధపు వాంగ్మూలాలే కుట్రకు ప్రాతిపదికసిట్ అధికారులు బెదిరించి వేధించి నమోదు చేసిన అబద్ధపు వాంగ్మూలాలే ప్రాతిపదికగా రిమాండ్ నివేదిక రూపొందించినట్టు వెల్లడైంది. వైఎస్సార్సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డితోపాటు అప్పటి ఉన్నతాధికారులను ఈ అక్రమ కేసులో ఇరికించేందుకు చంద్రబాబు ప్రభుత్వం పక్కా పన్నాగానికి తెగబడింది. తాము భయభ్రాంతులకు గురిచేసి బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, పూర్వ ఉద్యోగి సత్య ప్రసాద్తో ఇప్పించిన అబద్ధపు వాంగ్మూలాలనే ప్రస్తావించింది. డిస్టిలరీల ఏర్పాటు కోసం విజయసాయిరెడ్డి నివాసంలో ఎంపీ మిథున్ రెడ్డి, బెవరేజస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి, అప్పటి ఐటీ సలహాదారు రాజ్ కేసిరెడ్డి తదితరులు సమావేశమై చర్చించినట్టు సిట్ పేర్కొంది. కారు కూతలు... కాకి లెక్కలులేని కుంభకోణం ఉన్నట్టు చూపించే కుట్రటీడీపీ కార్యాలయం చెప్పిన కాకి లెక్కలతో సిట్ అధికారులు తమ రిమాండ్ నివేదికను రూపొందించడం పోలీసు వ్యవస్థ సర్వభ్రష్టత్వాన్ని వెల్లడిస్తోంది. ఏకంగా నెలకు రూ.50కోట్ల నుంచి రూ.60 కోట్ల చొప్పున వసూలు చేసి ఇచ్చారని దుష్ప్రచారానికి తెగబడింది. మళ్లీ అదే నివేదికలో ఆ నిధులను రాజ్ కేసిరెడ్డి దేశంలోనే బంగారం, భూములు, ముడి సరుకు తదితర కొనుగోళ్ల రూపంలో పెట్టుబడి పెట్టారని చెప్పారు. నిధులు వేరే వారికి ఇచ్చారని ఓ చోట... కాదు వివిధ వివిధ స్థిర, చరాస్తులుగా పెట్టుబడి పెట్టారని పరస్పర విరుద్ధంగా పేర్కొనడం సిట్ కుట్రకు నిదర్శనం.మద్యం మాఫియా దోపిడీదారు బాబే సీఐడీ నమోదు చేసిన కేసు సంగతేమిటో...!అసలు విషయం ఏమిటంటే...రాష్ట్రంలో మద్యం దందాకు ఆద్యుడు చంద్రబాబే. మద్యం మాఫియాను ఏర్పాటు చేసి... పెంచి పోషించి వేళ్లూనుకునేలా చేసిన వ్యవస్థీకృత దందాకు ఆయనే బ్రాండ్ అంబాసిడర్. 2014–19లో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే తన బినామీలు, సన్నిహితుల మద్యం కంపెనీల ముసుగులో ఖజానాకు భారీగా గండి కొట్టారు. అందుకోసం ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు స్వయంగా సంతకాలు చేసి మరీ ఈ కుంభకోణానికి పాల్పడ్డారు. అందుకోసం మంత్రివర్గాన్ని బురిడీ కొట్టిస్తూ రెండు చీకటి జీవోలతో మోసానికి పాల్పడ్డారు. 2012 నుంచి అమలులో ఉన్న ప్రైవేటు మద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్ ఫీజును నిబంధనలకు విరుద్ధంగా తొలగించారు. అందుకోసం చీకటి జీవోలు 218, 468 జారీ చేశారు. తద్వారా ఖజానాకు ఏటా రూ.1,300 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.5వేలకోట్లకుపైగా గండి కొట్టారు. ఎంఆర్పీ కంటే ఏకంగా 20శాతం వరకు రేట్లు పెంచి విక్రయించడం ద్వారా టీడీపీ మద్యం సిండికేట్ ద్వారా ఆ ఐదేళ్లలో రూ.20వేలకోట్లు కొల్లగొట్టారు. వెరసి మొత్తం రూ.25వేలకోట్ల దోపిడీకి పాల్పడ్డారు. ఈ విషయాన్ని రాజ్యాంగబద్ధ సంస్థ ‘కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్’(కాగ్) ఆధ్వర్యంలో స్వతంత్య్రంగా విధులు నిర్వర్తించే ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ తన అభ్యంతరాలను వ్యక్తం చేసింది. చంద్రబాబు ముఠా బాగోతం ఆధారాలతోసహా బయటపడటంతో 2023లోనే సీఐడీ కేసు నమోదు చేసింది. 2014–19 టీడీపీ ప్రభుత్వంలో ఎక్సైజ్ కమిషనర్గా వ్యవహరించిన ఐఎస్ నరేష్, అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, అప్పుటి సీఎం చంద్రబాబు, తదితరులపై ఐపీసీ, సెక్షన్లు: 166, 167, 409, 120(బి) రెడ్ విత్ 34, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు: 13(1),(డి), రెడ్ విత్ 13(2) కింద సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ కేసు దర్యాప్తును అటకెక్కించింది. ప్రస్తుతం సిట్ రిమాండ్ నివేదిక సాక్షిగా చంద్రబాబు ప్రభుత్వ మద్యం విధానంలో అక్రమాలు మరోసారి వెల్లడయ్యాయి. ఇప్పటికైనా సీఐడీ ఆ కేసు దర్యాప్తు చేపట్టాలని... లేదా సీబీఐకి అప్పగించాలని నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. మరి ముఖ్యమంత్రి చంద్రబాబూ...మీరు అందుకు సిద్ధమేనా అని వైఎస్సార్సీపీ సవాల్ విసురుతోంది. అసలు స్కాం ఎవరిది? లంచాలు ఎవరికి ఇస్తారు?టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే వైఎస్సార్సీపీ పాలనలో అమ్మకాలు తగ్గాయి.. ఈ నేపథ్యంలో లిక్కర్ వ్యవహారంలో వాస్తవంగా స్కాంలు చేసింది ఎవరు? అనేది పరిశీలిస్తే..⇒ మద్యాన్ని ఎక్కువగా అమ్మితే లంచాలు ఇస్తారా? అమ్మకాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా? ⇒ మద్యం అమ్మకాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే లంచాలు ఇస్తారా? లేక ప్రభుత్వం ద్వారా మాత్రమే అమ్మితే లంచాలు ఇస్తారా? ⇒ విక్రయ వేళలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా? లేక ఎక్కువ సమయం అమ్మేలా చేస్తే లంచాలు ఇస్తారా? ⇒ మద్యం దుకాణాలను పెంచితే లంచాలు ఇస్తారా? దుకాణాలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా? ⇒ దుకాణాలకు తోడు పర్మిట్ రూమ్లు, బెల్టు షాప్లు పెడితే లంచాలు ఇస్తారా? లేక బెల్టు షాపులు తీసేసి, పర్మిట్ రూమ్స్ను రద్దు చేస్తే లంచాలు ఇస్తారా?⇒ 2014-19లో చంద్రబాబు నిర్ణయించిన బేసిక్ రేట్లను పెంచి.. డిస్టిలరీల నుంచి కొనుగోళ్లు చేస్తే లంచాలు వస్తాయా? లేక పాత రేట్లను కొనసాగిస్తే లంచాలు వస్తాయా? ⇒ మద్యంపై తక్కువ ట్యాక్స్ల ద్వారా ఎక్కువ అమ్మకాలు చేసే విధంగా డిస్టిలరీలకు మేలు చేస్తే లంచాలు వస్తాయా? లేక ట్యాక్స్లు పెంచి, తద్వారా అమ్మకాలు తగ్గితే లంచాలు వస్తాయా? ⇒ ఎంపిక చేసుకున్న 4-5 డిస్టిలరీలకు మాత్రమే అధికంగా ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా? అన్ని డిస్టిలరీలకు సమాన స్థాయిలో ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా? ⇒ ఇప్పుడున్న డిస్టిలరీలలో అధిక భాగం అనుమతులు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న వారికి లంచాలు వస్తాయా? లేక ఏ ఒక్క డిస్టిలరీకీ అనుమతివ్వని వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉన్నవారికి లంచాలు వస్తాయా? వైఎస్సార్సీపీ హయాంలో.. ⇒ 2019-24 మధ్య ఐదేళ్లలో కొత్తగా ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. మద్యం విధానంలో అక్రమ దందా సాగించే సిండికేట్ వ్యవస్థను పూర్తిగా ఎత్తివేసింది. ⇒ లిక్కర్ షాపుల నుంచి పూర్తిగా ప్రైవేటు వ్యక్తులను తొలగించింది. ప్రభుత్వ ఆధీనంలోనే అమ్మకాలు సాగించింది. ⇒ 33 శాతం మద్యం దుకాణాలను తీసివేసింది. షాపుల సంఖ్యను 4,380 నుంచి 2,934కు తగ్గించింది. ⇒ మద్యం దుకాణాలకు అనుబంధంగా ఉన్న 43 వేల బెల్టు షాపులను, 4,380 పర్మిట్ రూమ్లను రద్దు చేసింది. ⇒ మద్యం ధరలను షాక్ కొట్టేలా పెంచింది. ఎక్సైజ్కు సంబంధించిన నేరాలకు పాల్పడితే శిక్షలను కఠినం చేసింది. ⇒ మద్యం విక్రయాల వేళలను కుదించింది. ప్రతి ఊరికి ఒక మహిళా పోలీసును నియమించింది. దీంతో మద్యం అమ్మకాలు బాగా తగ్గాయి. -
మద్యం మసి పూసి.. సిట్ పోలీసుల ‘కసి’
సాక్షి, అమరావతి: అక్రమ కేసులు నమోదు చేయడం..లేని ఆధారాలు సృష్టించేందుకు బెదిరింపులు, వేధింపులకు పాల్పడడమే చంద్రబాబు ప్రభుత్వ ఏకైక విధానంగా మారింది. రెడ్ బుక్ కుట్రలను అమలు చేయడమే పనిగా పెట్టుకున్న సిట్ అధికారులు ప్రభుత్వ పెద్దల కోసం చట్టాన్ని ఉల్లంఘిస్తూ బరితెగిస్తున్నారు. ఇందులోభాగంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసు దర్యాప్తు పేరిట సిట్ పన్నాగం పరాకాష్టకు చేరింది. ఈ అక్రమ కేసులో సాక్షిగా విచారణకు పిలిచిన రాజ్ కసిరెడ్డిని సిట్ అధికారులు సోమవారం హైదరాబాద్లో అరెస్టు చేయడమే దీనికి తాజా నిదర్శనం. విజయవాడలో సిట్ అధికారుల ఎదుట మంగళవారం విచారణకు హాజరవుతానని చెప్పిన ఆయనను హడావుడిగా అరెస్టు చేయడం వెనుక పక్కా కుట్ర ఉందన్నది స్పష్టమవుతోంది. గోవా నుంచి సోమవారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్న రాజ్ కసిరెడ్డిని శంషాబాద్ విమానాశ్రయంలోనే సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం విచారణకు హాజరవుతానని చెప్పినా వినిపించుకోకుండా తమ వాహనంలోకి ఎక్కించి విజయవాడకు తరలించారు. ఓ వైపు న్యాయస్థానం పరిధిలో ఉన్న అంశం అయినప్పటికీ సిట్ అధికారుల రాజ్ కసిరెడ్డిని హడావుడిగా అరెస్టు చేయడం వెనుక అసలు పన్నాగం ఇలా ఉంది. విచారణకు వస్తానంటే అరెస్టు ఏమిటో...? రెడ్బుక్ కక్ష సాధింపే తప్ప మరొకటి తమ ఉద్దేశం కాదని చంద్రబాబు ప్రభుత్వం మరోసారి తేల్చిచెప్పింది. ఈ కేసులో రాజ్ కసిరెడ్డిని సోమవారం హడావుడిగా అరెస్టు చేసిన తీరే అందుకు నిదర్శనం. మంగళవారం సిట్ విచారణకు హాజరవుతానని ఆయన సోమవారం మధ్యాహ్నం ఆడియో సందేశం విడుదల చేశారు. అయినా సోమవారం సాయంత్రం హడావుడిగా హైదరాబాద్లో అరెస్టు చేయల్సిన అవసరం ఏమిటి? అంటే ఆయనను విచారించడం.. వాస్తవాలు తెలుసుకోవడం తమ లక్ష్యం కాదని సిట్ తన చేతల ద్వారా వెల్లడించింది. అరెస్టు చేసి వేధించి.. ప్రభుత్వ రెడ్బుక్ కుట్రకు అనుకూలంగా ఆయన పేరిట అబద్ధపు వాంగ్మూలం నమోదు చేయించడమే తమ అసలు కుట్ర అని తేల్చిచెప్పింది. రాజ్ కసిరెడ్డి విషయంలో సిట్ మొదటి నుంచీ అదే కుతంత్రంతో వ్యవహరిస్తోంది. ఈ కేసులో సాక్షిగా విచారణకు రావాలని ఆయనకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఆ సమయంలో ఆయన ఇంట్లో లేకపోవడంతో కుటంబ సభ్యులకు నోటీసులు అందించారు. తనను ఏ విషయంలో విచారించాలని భావిస్తున్నారో తెలియజేస్తే తగిన సమాచారంతో వస్తానని ఆయన సిట్ అధికారులకు ఈ–మెయిల్ ద్వారా తెలిపారు. కానీ, ఆయన అడిగిన సమాచారం ఇవ్వకుండా వెంటనే మరోసారి ఈ–మెయిల్ ద్వారా నోటీసులు పంపడం గమనార్హం. దాంతో రాజ్ కసిరెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు నిర్ణయం అనంతరం విచారణకు స్వయంగా వస్తానని.. దర్యాప్తునకు సహకరిస్తానని కూడా రెండు రోజుల క్రితం ఓ ఆడియో సందేశం పంపించారు. ఇంతలో న్యాయ ప్రక్రియకు కాస్త సమయం పడుతుండటంతో ఇక తానే మంగళవారం విచారణకు వచ్చి పూర్తిగా సహకరిస్తానని సోమవారం తెలిపారు. అంటే మంగళవారం ఆయన విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వస్తారని తెలుసు. మరి రాజ్ కసిరెడ్డిని హైదరాబాద్లో సోమవారమే అరెస్టు చేయల్సిన అవసరం ఏమొచ్చింది? న్యాయస్థానం పరిధిలో ఉన్న అంశం ఈ అంశం ప్రసుతం న్యాయస్థానం పరిధిలో ఉంది కూడా. తనకు జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ రాజ్ కసిరెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోసం కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ రెండు ప్రస్తుతం ఆయా న్యాయస్థానాల పరిధిలో ఉన్నాయి. మరోవైపు విచారణకు హాజరవుతాను.. దర్యాప్తునకు సహకరిస్తానని కూడా రాజ్ కసిరెడ్డి చెప్పారు. అయినా సరే అరెస్టు చేయడం గమనార్హం. దీని వెనుక పోలీసుల పక్కా కుట్ర ఉందన్నది సుస్పష్టం బెదిరించి లొంగదీసుకునేందకునా..! ఇప్పటికే కుటంబు సభ్యులను తీవ్రంగా వేధించిన సిట్ రెడ్బుక్ కుట్రకు అనుకూలంగా రాజ్ కసిరెడ్డితో అబద్ధపు వాంగ్మూలం నమోదు చేయించడమే సిట్ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే ఆయనను హడావుడిగా అరెస్టు చేసింది. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో సోమవారం అర్ధరాత్రి విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి తీసుకువచ్చారు. సిట్ చీఫ్, విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్బాబు ఆ సమయంలో కార్యాలయంలోనే ఉన్నారు. మంగళవారం తెల్లవారుజాము వరకు ఆయనను బెదిరించి పూర్తిగా తమకు అనుకూలంగా లొంగదీసుకోవడమే సిట్ ప్రస్తుత లక్ష్యం. ఇప్పటికే ఈ కేసులో రాజ్ కసిరెడ్డి కుటుంబ సభ్యులను సిట్ అధికారులు కొన్ని రోజులుగా తీవ్రంగా వేధించి బెంబేలెత్తించారు. హైదరాబాద్లోని రాజ్ కసిరెడ్డి నివాసానికి వెళ్లి తల్లిదండ్రులతో పాటు సమీప బంధువులను కూడా బెదిరించి వేధించారు. ఆయన సన్నిహితుడు, ఎరేట్ హాస్పిటల్స్ అధినేత విజేయంద్రరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులను కూడా బెదిరించారు. ఈ విధంగా రాజ్ కసిరెడ్డి కుటుంబ సభ్యులు, సమీప బంధువులు, స్నేహితులు అందరినీ లక్ష్యంగా చేసుకుని పోలీసులు తీవ్ర భయభ్రాంతులకు గురి చేశారు. ప్రస్తుతం రాజ్ కసిరెడ్డి పైనే పూర్తి స్థాయిలో పోలీసు మార్క్ ప్రతాపం చూపించనున్నారు. తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని ఆయనను బెదిరిస్తున్నట్టు సమచారం. మొదటినుంచీ సిట్ తీరు అంతే.. అక్రమ కేసులో లేని ఆధారాలు సృష్టించేందుకు సిట్ మొదటి నుంచి కూడా దండనీతినే నమ్ముకుంది. బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులను తీవ్రస్థాయిలో వేధించి సాధించింది. సిట్ అధికారుల బెదిరింపులపై ఆయన మూడు సార్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయినా సరే సిట్ తీరు మాత్రం మారలేదు. వాసుదేవరెడ్డిని మూడు రోజుల పాటు గుర్తు తెలియని ప్రదేశంలో అక్రమంగా నిర్బంధించి మరీ వేధించింది. తద్వారా తాము చెప్పినట్టుగా ఆయన అబద్ధపు వాంగ్మూలం ఇచ్చేలా ఒప్పించింది. వాసుదేవరెడ్డి అబద్ధపు వాంగ్మూలం ఇచ్చిన వెంటనే ప్రభుత్వం ఆయనను రాష్ట్ర సర్వీసుల నుంచి రిలీవ్ చేసి కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు అనుమతించడం గమనార్హం. అదే రీతిలో బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ స్పెషల్ ఆఫీసర్ సత్యప్రసాద్, చిరుద్యోగి అనూషను కూడా సిట్ అధికారులు వేధించి బెదిరించి వారితో అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయించారు. ఇక విజయ సాయిరెడ్డి ఎంపీగా మరో మూడున్నరేళ్లు పదవీ కాలం ఉన్నా సరే కేవలం టీడీపీకి కూటమికి రాజ్యసభలో ప్రయోజనం కలిగించేందుకే రాజీనామా చేశారు. ఉప ఎన్నిక నిర్వహిస్తే ఆ సీటు గెలుచుకునేందుకు వైఎస్సార్సీపీకి తగినంత మంది ఎమ్మెల్యేల బలం లేదని తెలిసినా విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం కేవలం చంద్రబాబు కుట్రలో భాగమే. అసలు ఎలాంటి కుంభకోణం జరగనే లేదని విజయసాయిరెడ్డే సిట్ విచారణ అనంతరం చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయినా సరే అబద్ధపు వాంగ్మూలాల నమోదు, తప్పుడు సాక్ష్యాల సృష్టికి సిట్ అధికారులు బరితెగించి బెదిరింపులకు పాల్పడుతూ అధికారికంగా గూండాగిరీకి తెగిస్తున్నారు. కుట్రతోనే వక్రీకరణ ప్రైవేట్ కంపెనీల వ్యవహారంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ఏం సంబంధం? ఎలాంటి అవినీతి లేని ఈ వ్యవహారంలో నమోదు చేసిన అక్రమ కేసు దర్యాప్తు పేరిట సిట్ కొత్త కొత్త కట్టుకథలను తెరపైకి తెస్తోంది. అదాన్ డిస్టిలరీల ఏర్పాటుకు రూ.100 కోట్ల అప్పు ఇప్పించడం అంటూ వినిపించిన కథ తాజా వక్రీకరణ. తన అల్లుడు కుటుంబానికి చెందిన అరబిందో కంపెనీ అదాన్ డిస్టిలరీ ఏర్పాటునకు రూ.100 కోట్లు అప్పు ఇచ్చిందని విజయసాయిరెడ్డి చెప్పారు. అంటే అరబిందో కంపెనీ అప్పు ఇచ్చింది. అదాన్ డిస్టిలరీస్ తీసుకుంది. అది రెండు కంపెనీల మధ్య వ్యవహారం. దేశంలో ఎన్నో ప్రైవేటు కంపెనీల మధ్య అప్పులు ఇచ్చి పుచ్చుకోవడం సర్వసాధారణం. దానిపై ఆ రెండు కంపెనీల్లో ఎవరూ కూడా ఫిర్యాదు చేయనే లేదు. మరి ఆ వ్యవహారానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ఏం సంబంధం ? ఆ వ్యవహారాన్ని వక్రీకరిస్తూ ఈ కేసుకు ముడిపెట్టాలని యత్నించడం హాస్యాస్పదంగా ఉంది. లేని కుంభకోణం ఉన్నట్టుగా చూపించే కుతంత్రమే.. దర్యాప్తు పేరిట సిట్ ఎందుకు ఇంతగా నిబంధనలకు విరుద్ధంగా బరితెగిస్తోంది...!? అంటే వినిపించే ఏకైక సమాధానం.. అసలు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంలో ఎలాంటి అక్రమాలు జరగలేదు. ఎలాంటి అవినీతి లేదు కాబట్టే లేని ఆధారాలు సృష్టించేందుకు సిట్ ఇంతగా దిగజారుతోంది. 2019–24 మధ్య వైఎస్సార్సీపీ ప్రభుత్వం దశలవారీ మద్య నియంత్రణ విధానాన్ని సమర్థంగా అమలు చేసింది. అంతకుముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో దోపిడీకి పాల్పడ్డ ప్రైవేటు మద్యం దుకాణాల విధానాన్ని రద్దు చేసింది. ప్రభుత్వ మద్యం దుకాణాలను ప్రవేశపెట్టింది. దుకాణాల వేళలను కుదించింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న 4,380 మద్యం దుకాణాలను దశలవారీగా 2,934 దుకాణాలకు తగ్గించింది. చంద్రబాబు ప్రభుత్వం అనధికారిక బార్లుగా లైసైన్సులు జారీ చేసిన 4,380 పర్మిట్ రూమ్లను రద్దు చేసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో కొనసాగిన 43వేల బెల్ట్ దుకాణాలను తొలగించింది. రాష్ట్రంలోని 20 డిస్టిలరీల్లో 14 డిస్టిలరీలకు చంద్రబాబు ప్రభుత్వమే అనుమతులు జారీ చేసింది. మిగిలిన ఆరు డిస్టిలరీలకు అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు లైసెన్సులు మంజూరు చేశాయి. కానీ, వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒక్క మద్యం డిస్టిలరీకి కూడా లైసెన్సులు మంజూరు చేయలేదు. ఈ విప్లవాత్మక చర్యలతో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. మరి మద్యం అమ్మకాలు పెరిగితే డిస్టిలరీలకు లాభాలు వస్తాయి కాబట్టి ప్రభుత్వ పెద్దలకు కమీషన్లు ఇస్తాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలు తగ్గడంతో డిస్టిలరీలకు లాభాలు తగ్గాయి. మరి కమీషన్లు ఎందుకు ఇస్తాయి..? ఇవ్వవనే ఇవ్వవు. ఎలాంటి అవినీతి లేని వైఎస్సార్సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసులో సిట్ ఎలాంటి ఆధారాలు సేకరించలేకపోతోంది. అందుకే అప్పటి అధికారులు, ఇతర సాక్షులను బెదిరించి అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయడమే పనిగా పెట్టుకుంది. వాటి ఆధారంగానే కేసును కొనసాగించడమే సిట్ ఏకైక విధానంగా మారింది. అసలు లేని కుంభకోణంపై అక్రమ కేసు నమోదు చేసి రాజ్ కసిరెడ్డి లక్ష్యంగా పావులు కదుపుతుండడం గమనార్హం. ఆయన కేవలం కొంత కాలం అదీ కోవిడ్ వ్యాప్తి ఉన్న రోజుల్లో పరిశ్రమల శాఖ సలహాదారుగా మాత్రమే వ్యవహరించారు. ఆయన పదవీ కాలాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం రెన్యువల్ కూడా చేయనే లేదు. రాజ్ కసిరెడ్డికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన మద్యం విధానానికి ఎలాంటి సంబంధమే లేదు. -
రేపు సిట్ విచారణకు హాజరవుతా: రాజ్ కేసిరెడ్డి
అమరావతి: తాను రేపు(మంగళవారం) సిట్ విచారణకు హాజరవుతున్నట్లు రాజ్ కేసిరెడ్డి వెల్లడించారు. రేపు మధ్యాహ్నం గం. 12:00ల,కు సిట్ ఆఫీసుకు వస్తానని ఆయన తెలిపారు. ఈ మేరకు సిట్ అధికారులకు సమాచారం ఇచ్చానన్నారు. ఈ విషయాన్ని ఆడియో ద్వారా తెలిపారు. ఇక తన ముందస్తు బెయిల్ అంశానికి సంబంధించి హైకోర్టులో వాదనలకు సమయం పట్టేలా ఉందని, అందుజేత సిట్ విచారణకు హజరవుతున్నట్లు పేర్కొన్నారు.రెండురోజుల క్రితం విజయసాయి రెడ్డిపై రాజ్ కేసిరెడ్డి ధ్వజమెత్తారు. విజయసాయి చెప్పే మాటలు నమ్మొద్దంటూ మీడియాకు రాజ్ కసిరెడ్డి ఆడియో విడుదల చేశారు. త్వరలోనే విజయసాయి బండారం బయటపెడతానన్నారు. పోలీసుల విచారణకు సహకరిస్తానని తెలిపారు. న్యాయపరమైన ప్రక్రియ పూర్తి అయిన తర్వాత పోలీసులకు సహకరిస్తానని పేర్కొన్నారు. కొద్దిరోజులుగా తనపై అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు.‘‘సిట్ నోటీసులపై హైకోర్టును ఆశ్రయించా. మార్చిలో సిట్ అధికారులు మా ఇంటికి వచ్చారు. నేను లేనప్పుడు మా అమ్మకు నోటీసులు ఇచ్చారు. సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశా’ అని గత ఆడియోలో పేర్కొన్నారు రాజ్ కేసిరెడ్డి. -
ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ధైర్యంగా ఎదుర్కొంటాం
చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ కక్షతో పెడుతున్న తప్పుడు కేసులకు భయపడే ప్రసక్తే లేదని, వాటిని ధైర్యంగా ఎదుర్కొంటామని వైఎస్సార్సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి స్పష్టం చేశారు. ‘కూటమి ప్రభుత్వం వచి్చన తరువాత పెట్టిన ఎన్నో కేసుల్లో ఆరోపణలు అవాస్తవమని ఇప్పటికే నిర్ధారణ అయ్యింది. అదే రీతిలో ప్రస్తుతం మద్యం విధానంపై పెట్టిన అక్రమ కేసులో ఆరోపణలు కూడా అవాస్తవమేనని త్వరలో నిర్ధారణ అవుతుంది’ అని ఆయన చెప్పారు. విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సిట్ విచారణ అనంతరం మిథున్రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. ‘ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నందున ప్రస్తుతం పూర్తి విషయాలు మాట్లాడలేను. చంద్రబాబు ప్రభుత్వం మొదట మదనపల్లిలో ఏదో జరిగిందని రెండు నెలలు రాద్ధాంతం చేసింది. ఆ కేసులో అనుమానితుడిని తీసుకెళ్లి పాలిగ్రాఫ్ టెస్ట్ చేసి విచారించారు. ఆరోపణలన్నీ కట్టు కథ అని తేలింది. తర్వాత గనుల శాఖలో అవకతవకలు, ఇసుకలో రూ.వేల కోట్లు అవినీతి అని అన్నారు. అది కూడా అవాస్తవ ఆరోపణలు, తప్పుడు కథనమేనని తేలింది. వందల గనులు అన్యాక్రాంతం అని మరో తప్పుడు ఆరోపణలు చేశారు. అవీ నిరూపించలేదు. మా సొంత భూములను అటవీ భూముల ఆక్రమణ అని కొన్నాళ్లు రాద్ధాంతం చేశారు. దీనిపై మేం కోర్టుకు వెళ్లాం. అవన్నీ అటవీ భూములు కాదని అంతా సక్రమంగానే ఉందని మళ్లీ వాళ్లే కోర్టుకు నివేదిక ఇచ్చారు. తర్వాత భూముల ఆక్రమణ అని మరో తప్పుడు కేసు పెట్టారు. ఏదీ నిరూపించలేకపోయారు. ఎర్రచందనం స్మగ్లింగ్ అని ఆరోపణ చేశారు. దీనిపై బహిరంగ చర్చకు రమ్మని సవాల్ విసిరాం. ఒక్కరూ రాలేదు. ప్రతి రెండు నెలలకు కూటమి ప్రభుత్వం ఏదో ఒక స్కాం అంటూ మాపై నిందలు వేస్తోంది. ఇదంతా రాజకీయ కక్షలో భాగమే. ఇప్పుడు లిక్కర్ స్కాం అని మరో ఆరోపణ చేస్తున్నారు. అన్నింటి మాదిరిగానే ఇదీ తప్పుడు కేసని నిర్ధారణ అవుతుంది. ఇదంతా రాజకీయ కక్షలో భాగమే. డ్రగ్స్, మానవ అక్రమ రవాణా మినహా అన్ని కేసులను మా పార్టీ నాయకులపై పెట్టి వేధించాలని ప్రయత్నించారు. లిక్కర్ స్కాం కేసు కోర్టు పరిధిలో ఉన్నందున అన్ని వివరాలు చెప్పలేకపోతున్నాను. కోర్టు నిర్ణయం వచ్చిన తరువాత మీడియా ముఖంగా అన్ని వివరాలు చెబుతాను’’ అని పేర్కొన్నారు. -
అక్రమ కేసే.. బాబు కుట్రే!
సాక్షి, అమరావతి: కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్టుగా తయారైంది చంద్రబాబు ప్రభుత్వ రెడ్బుక్ అక్రమ కేసుల పరిస్థితి. టీడీపీ వీర విధేయ పోలీసు అధికారులతో నియమించిన సిట్ దర్యాప్తులోనే ఆ కేసుల డొల్లతనం బట్టబయలైంది. తాము బెదిరించి.. వేధించి నమోదు చేసిన అబద్ధపు వాంగ్మూలాల ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తోందన్నది నిగ్గు తేలింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై నమోదు చేసిన తప్పుడు కేసు దర్యాప్తులో భాగంగా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డిని సిట్ అధికారులు విచారించిన తీరే అందుకు నిదర్శనం. కేవలం గాలి పోగేసి నిరాధార ఆరోపణలతోనే ఈ కేసు కేసు పెట్టారన్నది స్పష్టమైంది. న్యాయస్థానం ఆదేశాలతో తన న్యాయవాదితో కలిసి మిథున్రెడ్డి శనివారం ఉదయం 10.30 గంటలకు విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి చేరుకున్నారు. సాయంత్రం 6.30 వరకు న్యాయవాది సమక్షంలో ఆయనను రెండు దఫాలుగా సిట్ అధికారులు విచారించారు. కేవలం తాము వెంటాడి వేధించి నమోదు చేసిన అబద్ధపు వాంగ్మూలాల ప్రాతిపదికనే ఎంపీ మిథున్రెడ్డిని సిట్ అధికారులు విచారించడం ఈ కేసులో డొల్లతనాన్ని బట్టబయలు చేసింది. అసలు కుంభకోణమే లేనప్పుడు దర్యాప్తు అధికారులు చేయగలిగేదీ ఏమీ ఉండదని తేలిపోయింది. అబద్ధపు వాంగ్మూలాలే సిట్కు ఆధారం విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. దర్యాప్తు ముసుగులో సిట్ అధికారులు తాము వెంటాడి వేధించి నమోదు చేయించిన అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాల ఆధారంగానే మిథున్రెడ్డిని ప్రశి్నంచారు. బెవరేజెస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, ఆ సంస్థలో పూర్వ ఉద్యోగి సత్యప్రసాద్లను వేధించి బలవంతంగా తీసుకున్న అబద్ధపు వాంగ్మూలాలు, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వాంగ్మూలం ఆధారంగానే ప్రశ్నలు వేయడం గమనార్హం. తప్పుడు వాంగ్మూలం ఇవ్వాలని సిట్ అధికారులు వేధిస్తున్నారని, కుటుంబసభ్యులను బెదిరిస్తున్నారంటూ వాసుదేవరెడ్డి మూడు సార్లు కోర్టుకెళ్లినా.. ఆయనను బెంబేలెత్తేలా చేసి, సిట్ అధికారులు అబద్ధపు వాంగ్మూలంపై సంతకం తీసుకున్నారు. అదే వాంగ్మూలంలోని అంశాల గురించి ఎంపీ మిథున్రెడ్డిని విచారణలో ప్రశి్నంచారని తెలిసింది. వైఎస్సార్సీపీకి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి చెప్పిన విషయాల ఆధారంగా మరికొన్ని ప్రశ్నలు అడిగారని, అంటే గంటల పాటు సిట్ విచారణ అంతా పూర్తిగా అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాల ఆధారంగానే సాగిందని తెలుస్తోంది.సిట్ ప్రశ్నలకు మిథున్ సమాధానాలివీ...అబద్ధపు వాంగ్మూలాల ఆధారంగా సాగిన సిట్ విచారణను ఎంపీ మిథున్ రెడ్డి దీటుగా తిప్పికొట్టారని, అధికారుల ఆరోపణలన్నీ నిరాధారం, అవాస్తవాలని ఆయన ఆధారసహితంగా బదులిచ్చారని సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆ విచారణ ఇలా సాగింది.. సిట్: అడాన్ కంపెనీని నెలకొల్పేందుకు విజయసాయిరెడ్డి నివాసంలో జరిగిన సమావేశంలో మీరు పాల్గొన్నారా? మీరు పాల్గొన్నట్లు ఆయన చెప్పారు కదా? మిథున్రెడ్డి: విజయసాయిరెడ్డి చెప్పింది పచ్చి అబద్ధం. ఆయన నివాసంలో ఆ తేదీల్లో ఎలాంటి సమావేశంలోనూ నేను పాల్గొనలేదు. నాకు ఆ వ్యవహారాలతో ఎలాంటి సంబంధం లేదు. కావాలంటే మీరు గూగుల్ టేక్ అవుట్ తెప్పించండి. విజయసాయిరెడ్డి చెప్పింది పూర్తిగా అవాస్తవమని తేలుతుంది. (దాంటో సిట్ అధికారులు మౌనం వహించారు) సిట్: ఓ కంపెనీ నుంచి మీ కుటుంబ వ్యాపార సంస్థ పీఎల్ఆర్ గ్రూప్నకు రూ.5 కోట్లు బదిలీ అయ్యాయి కదా.. ఎందుకు? మిథున్రెడ్డి: ఔను. ఆ సంస్థ మా కంపెనీతో కలిసి నిర్మాణ కాంట్రాక్టులు చేయాలని భావించింది. అందుకు అగ్రిమెంట్ కుదుర్చుకుంది. కాంట్రాక్టు పనుల ఈఎండీ, బ్యాంక్ గ్యారంటీ కోసం 2019 నవంబరులో రూ.5 కోట్లు చెల్లించింది. కానీ కోవిడ్ వ్యాప్తితో పనులు చేయలేకపోయింది. దీంతో రూ.5 కోట్లను తిరిగిచ్చేశాం. ఆ కంపెనీ నుంచి ఎలాంటి ప్రయోజనాలు పొందలేదు. అందుకు ఇవిగో ఆధారాలు.. (అగ్రిమెంట్ కాపీ, బ్యాంకు లావాదేవీల రికార్డులు చూపించారు). ఇందులో నిబంధనలకు విరుద్ధమైనది ఏమీ లేదు. ఇప్పుడు సిట్ దర్యాప్తు చేస్తుందని మేం ఆరేళ్ల క్రితమే ఈ అగ్రిమెంట్లు చేసుకోం కదా..? ఇదంతా పారదర్శకంగా సాగిన వ్యవహారం. (దాంతో సిట్ అధికారులు ఈ అంశాన్ని విడిచిపెట్టారు) సిట్: రాజ్ కసిరెడ్డి కంపెనీ కోసం విజయసాయిరెడ్డి అల్లుడి కుటుంబ వ్యాపార సంస్థ నుంచి రూ.100 కోట్లు అప్పు ఇప్పించారా? మిథున్రెడ్డి: ఆ వ్యవహారంతో నాకేం సంబంధం? అది ఎవరో కొందరు ప్రైవేటు వ్యక్తుల మధ్య వ్యవహారం. దానిపై నేనేం చెబుతాను? విజయ సాయిరెడ్డి అల్లుడి కంపెనీ ఎవరికో అప్పు ఇస్తే.. అప్పు ఇచ్చిన అరబిందో కంపెనీ వాళ్లను, తీసుకున్నవాళ్లను, ఇప్పించిన విజయసాయిరెడ్డిని అడగాలి. (దాంతో సిట్ అధికారులు ఆ అంశాన్ని కొనసాగించలేకపోయారు) సిట్: రాజ్ కసిరెడ్డి తెలుసా.. ఆయనతో మీకు వ్యాపార సంబంధాలున్నాయా? మిథున్రెడ్డి: రాజ్ కసిరెడ్డితో పరిచయం మాత్రమే ఉంది. ఆయనతో ఎలాంటి వ్యాపార సంబంధాలు లేవు. సిట్: మీరు కొన్ని రియల్ ఎస్టేట్ ప్లాట్లు కొనుగోలు చేశారు కదా? (అని కొన్ని పత్రాలు చూపించారు) మిథున్రెడ్డి: అవును. అవన్నీ సక్రమంగా కొనుగోలు చేసిన ఆస్తులే. ఆ వివరాలన్నీ నా ఎన్నికల అఫిడవిట్లో కూడా వెల్లడించాను. రాజకీయ కుట్రతో నమోదు చేసిన కేసు.. వాంగ్మూలంలో నమోదు టీడీపీ కూటమి ప్రభుత్వంరాజకీయ కుట్రతోనే తమపై ఈ అక్రమ కేసు నమోదు చేసిందని మిథున్రెడ్డి సిట్ అధికారులకు విస్పష్టంగా చెప్పారు. అంతే కాదు ఆ విషయాన్ని తాను వెల్లడించినట్టుగా వాంగ్మూలంలో సిట్ అధికారులతో రికార్డు చేయించారు. తన అభిప్రాయాన్ని అధికారికంగా నమోదు చేయాలని ఆయన పట్టుబట్టారు. దాంతో సిట్ అధికారులు ఆ విషయాన్ని నమోదు చేశారు. -
సిట్ కార్యాలయానికి YSRCP నేత మిథున్ రెడ్డి
-
భేతాళ కుట్రే.. బాబు స్క్రిప్టే
సాక్షి, అమరావతి: రెడ్బుక్ కుట్రలతో చంద్రబాబు ప్రభుత్వం వెర్రితలలు వేస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై అక్రమ కేసుతో బరితెగిస్తోంది. లేని కుంభకోణాన్ని ఉన్నట్టుగా చూపించేందుకు పచ్చగణంతో కూడిన ‘సిట్’ ద్వారా దర్యాప్తు పేరిట అరాచకాలకు తెగబడుతోంది. అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయించేందుకు.. తప్పుడు సాక్ష్యాలు సృష్టించేందుకు.. వేధింపులు, బెదిరింపులు, కిడ్నాపులు, దాడులతో పోలీసులు గూండాగిరీకి తెగిస్తున్నారు. బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, మరో ఇద్దరు ఉద్యోగులను వెంటాడి వేధించి అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయించారు. తనను వేధిస్తున్నారని కోర్టును ఆశ్రయించిన వాసుదేవరెడ్డి.. అనంతరం సిట్ చెప్పినట్టుగా వాంగ్మూలం ఇవ్వడం గమనార్హం. ఆ వాంగ్మూలానికి ఏం విశ్వసనీయత ఉంటుందని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఇక డిస్టిలరీల ప్రతినిధులపై దాడులు చేస్తూ బెంబేలెత్తిస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంతో నిమిత్తం లేని ఐటీ సలహాదారు రాజ్ కసిరెడ్డి చుట్టూ దర్యాప్తును కేంద్రీకృతం చేస్తున్నారు. ఏమాత్రం సంబంధంలేని ఎంపీ మిథున్రెడ్డి, తదితరులను అక్రమ కేసులో ఇరికించడమే లక్ష్యంగా కుట్రలకు పదును పెడుతున్నారు.వైఎస్సార్సీపీకి రాజీనామా చేసిన విజయ సాయిరెడ్డిని అందుకే తెరపైకి తెచ్చారు. ఇలా చంద్రబాబు పక్కా పన్నాగంతో ఓ భేతాళ కథ అల్లుతున్నారు. ఇంతటి కుట్రలు, అరాచకానికి చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు తెగబడుతోందంటే... సమాధానం ఒక్కటే. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానం పారదర్శకంగా అమలు చేయడమే. లేని కుంభకోణాన్ని ఉన్నట్టుగా చూపించేందుకే కూటమి ప్రభుత్వం ఇంతటి కుతంత్రాలకు పాల్పడుతోందన్నది సుస్పష్టం.దర్యాప్తు ముసుగులో సిట్ అరాచకంవైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అసలు జరగని కుంభకోణాన్ని జరిగినట్టుగా చూపించేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్రలకు తెగిస్తోంది. అందుకోసం అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేసేందుకు బెదిరింపులకు పాల్పడుతోంది. బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, ఆ సంస్థలో ఉద్యోగులు సత్య ప్రసాద్, అనూష ఉదంతమే ఇందుకు తార్కాణం. కేంద్ర సర్వీసుల నుంచి వచ్చిన ఆయన డెప్యుటేషన్ ముగిసినప్పటికీ రిలీవ్ చేయలేదు. తాము చెప్పినట్టుగా సీఆర్పీపీ 164 సెక్షన్ కింద అబద్ధపు వాంగ్మూలాలు ఇవ్వాలని వాసుదేవరెడ్డిని పోలీసులు తీవ్ర స్థాయిలో వేధించారు. తాము చెప్పినట్టు చేస్తేనే రిలీవ్ చేస్తామని, లేకపోతే ఎప్పటికీ సర్వీసులో చేరలేరని హెచ్చరించారు. ఆయన్ను అపహరించుకునిపోయి మూడు రోజులపాటు గుర్తు తెలియని ప్రదేశంలో ఉంచి బెదిరించారు. కుటుంబ సభ్యులను సైతం బెదిరించారు. పోలీసుల దౌర్జన్యానికి వ్యతిరేకంగా వాసుదేవరెడ్డి న్యాయస్థానాన్ని మూడుసార్లు ఆశ్రయించారు కూడా. అయినా సరే చంద్రబాబు ప్రభుత్వం తన కుతంత్రాలను కొనసాగించింది. ఆయన్ను తీవ్ర స్థాయిలో రోజుల తరబడి బెదిరించి లొంగదీసుకుంది. వాసుదేవరెడ్డితో అబద్ధపు వాంగ్మూలం నమోదు చేయించింది. ఆ వెంటనే ఆయన్ను రాష్ట్ర సర్వీసుల నుంచి రిలీవ్ చేస్తూ కేంద్ర సర్వీసుల్లో చేరేందుకు ఢిల్లీ వెళ్లేందుకు అనుమతించడం గమనార్హం. అంటే చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసు కోసం ఎంతగా బరితెగిస్తోందన్నది స్పష్టమవుతోంది. అదే రీతిలో బెవరేజస్ కార్పొరేషన్ ఉద్యోగులు సత్య ప్రసాద్, అనూషలను కూడా తీవ్ర స్థాయిలో వేధించారు.అబద్ధపు వాంగ్మూలం ఇస్తే ఈ కేసులో సాక్షులుగా పేర్కొంటామని.. లేకపోతే అక్రమ కేసుల్లో దోషులుగా ఇరికించి వేధిస్తామని బెదిరించారు. దాంతో వారిద్దరు కూడా సిట్ అధికారులు చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేశారు. ఈ విధంగా బెదిరించి, వేధించి నమోదు చేసే వాంగ్మూలాలకు ఏం విశ్వసనీయత ఉంటుంది.. ఏం ప్రామాణికత ఉంటుంది..? అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.బరితెగిస్తున్న సిట్ఈ కేసులోదర్యాప్తు ముసుగులో సిట్ అధికారులు చేస్తున్న అరాచకాలకు అంతూ పొంతూ లేకుండా పోతోంది. హైదరాబాద్తోపాటు ఇతర ప్రాంతాల్లో డిస్టిలరీల ప్రతినిధుల నివాసాల్లో సోదాల పేరుతో సిట్ అధికారులు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. డిస్టిలరీల ప్రతినిధులను బలవంతంగా విజయవాడకు తీసుకువచ్చి విచారణ పేరుతో వేధించారు. ఒకర్ని తీవ్రంగా కొట్టారు కూడా. వృద్ధులని కూడా చూడకుండా శార్వాణీ ఆల్కో బ్రూ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు ఇ.చంద్రారెడ్డి, ఠాకూర్ కాళీ మహేశ్వర్ సింగ్లను సిట్ అధికారులు కొట్టి, అసభ్య పదజాలంతో దూషించారు. దాంతో వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తమను ఇంటి వద్దే విచారించేట్టుగా ఆదేశించాలని కోరారు. ఇ.చంద్రారెడ్డి, ఠాకూర్ కాళీ మహేశ్వర్ సింగ్ను వారి ఇంటి వద్దే న్యాయవాదుల సమక్షంలో విచారించాలని న్యాయస్థానం ఆదేశించింది. అబద్ధపు వాంగ్మూలాల నమోదు కోసం సిట్ పాల్పడుతున్న అరాచకాలకు ఈ ఉదంతం ఓ మచ్చుతునక మాత్రమే.అందుకే తెరపైకి విజయ సాయిరెడ్డి అక్రమ కేసు కుట్రను కొనసాగిస్తూ చంద్రబాబు పక్కా పన్నాగంతోనే మాజీ ఎంపీ విజయ్ సాయిరెడ్డిని తెరపైకి తెచ్చారు. ఇప్పటికే వైఎస్సార్సీపీకి రాజీనామా చేసిన ఆయనతో తాము లక్ష్యంగా చేసుకున్నవారి పేర్లు చెప్పించాలన్నదే ప్రభుత్వ కుతంత్రం. మూడున్నరేళ్లు పదవీ కాలం ఉన్నా రాజ్యసభలో కూటమికి ప్రయోజనం కలిగించేందుకే ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. తాజాగా సిట్ విచారణకు హాజరైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడిన మాటలు అసలు కుట్రను బయట పెట్టాయి. మద్యం విధానంపై కొందరు తన ఇంట్లో నిర్వహించిన సమావేశంలో కొందరు పాల్గొన్నారు.మరికొందరు పాల్గొన్నారో లేదో గుర్తు లేదని విజయ్ సాయిరెడ్డి వ్యాఖ్యానించడం గమనార్హం. గుర్తుకు వచ్చాక ఆ విషయం చెబుతానన్నారు. అంటే భవిష్యత్లో చంద్రబాబు ఏం చెప్పమంటే అది చెబుతా అని పరోక్షంగా స్పష్టం చేశారు.మద్యం విధానంతో రాజ్ కసిరెడ్డికి ఏం సంబంధం!?మాజీ ప్రభుత్వ సలహాదారు రాజ్ కసిరెడ్డి కేంద్ర బిందువుగా దర్యాప్తు కొనసాగిస్తుండటం కూడా సిట్ కుట్రలో భాగమే. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మద్యం విధానంతో అసలు రాజ్ కసిరెడ్డికి ఏం సంబంధం? ప్రభుత్వంలో ఎందరో సలహాదారుల్లో ఆయన ఒకరు. సలహాదారుగా ఆయన పదవీ కాలాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం రెన్యువల్ కూడా చేయనే లేదు. ఇక రాజ్ కసిరెడ్డికి బెవరేజస్ కార్పొరేషన్ వ్యవహారాలతో సంబంధమే లేదు. ఆయనకు ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తే బెవరేజస్ కార్పొరేషన్కు చైర్మన్గానే నియమించి ఉండేవారు కదా.. కానీ ఆయనకు అంతా తెలుసని విజయ సాయిరెడ్డి చెప్పడం వెనుక చంద్రబాబు కుట్ర ఉందన్నది తేటతెల్లమవుతోంది. తద్వారా మునుముందు మరిన్ని అబద్ధపు వాంగ్మూలాల నమోదు, తప్పుడు సాక్ష్యాలు సృష్టించేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం సిద్ధపడుతోందని స్పష్టమవుతోంది.అవినీతి లేదు.. కుంభకోణం అసలే లేదు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పారదర్శకంగా మద్యం విధానంచట్టాలను ఉల్లంఘిస్తూ.. న్యాయ స్థానాలను బేఖాతరు చేస్తూ మరీ చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు ఇంతగా బరితెగిస్తోందన్నది ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై నమోదు చేసింది అక్రమ కేసు కాబట్టి. అసలు మద్యం విధానంలో విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టిందే వైఎస్సార్సీపీ ప్రభుత్వం. అంతకు ముందు 2014–19లో టీడీపీ ప్రభుత్వ హయాంలో యథేచ్ఛగా సాగిన మద్యం సిండికేట్ దోపిడీని నిర్మూలించింది. ప్రైవేటు మద్యం దుకాణాలను రద్దు చేసింది. ప్రభుత్వ మద్యం దుకాణాల విధానాన్ని ప్రవేశ పెట్టింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న 4,380 మద్యం దుకాణాల సంఖ్యను 2,934 కు తగ్గించింది. చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న 43 వేల బెల్ట్ దుకాణాలను పూర్తిగా తొలగించింది. 2019 వరకు మద్యం దుకాణాలకు అనుబంధంగా అనధికారిక బార్లుగా కొనసాగిన 4,380 పర్మిట్ రూమ్లను రద్దు చేసింది. చంద్రబాబు ప్రభుత్వం 14 డిస్టిలరీలకు అనుమతులు ఇవ్వగా... వైఎస్ జగన్ ప్రభుత్వం ఒక్క కొత్త డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. మద్యం దుకాణాల వేళలను కుదించింది. మద్యం ధరలను షాక్ కొట్టేలా పెంచి మద్యం వినియోగాన్ని నిరుత్సాహ పరిచింది. ఈ విప్లవాత్మక చర్యలతో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. మద్యం అమ్మకాలు తగ్గితే డిస్టిలరీలకు లాభాలు తగ్గుతాయన్నది అందరికీ తెలిసిన విషయమే. మరి లాభాలు తగ్గితే డిస్టిలరీలు ప్రభుత్వానికి ఎందుకు కమీషన్లు ఇస్తాయని ఎవరైనా ప్రశ్నిస్తారు. మద్యం అమ్మకాలను పెంచితే.. తద్వారా లాభాలు పెరిగితే అందుకు ప్రతిగా ప్రభుత్వానికి కమీషన్లు ఇస్తారు. కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన విధానాలతో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయని ఎక్సైజ్ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్న వాస్తవం. మరి డిస్టిలరీలు.. కమీషన్లు ఇవ్వవవన్నది నిగ్గు తేలిన నిజం. అయినా సరే కేవలం రెడ్బుక్ కుట్రతోనే చంద్రబాబు ప్రభుత్వం వైఎస్సార్సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై అక్రమ కేసు నమోదు చేసింది. అందుకోసమే అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలు సృష్టించేందుకు కుతంత్రాలకు తెగబడుతోందన్నది సుస్పష్టం. వాస్తవంగా కుంభకోణమే జరిగితే.. దర్యాప్తు పేరిట ఇంతటి అరాచకాలకు పాల్పడాల్సిన అవసరం లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మద్యం విధానంలో ఎలాంటి అవకతవకలు, అవనీతి జరగలేదని తెలుసు కాబట్టే అబద్ధపు సాక్ష్యాలు సృష్టించేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలకు తెగబడుతోందన్నది సుస్పష్టం. -
కిడ్నాప్లు.. బెదిరింపులు
సాక్షి, అమరావతి: కిడ్నాపర్ల నుంచి రక్షించాల్సిన పోలీసులే కిడ్నాపులకు పాల్పడితే.. వేధించేందుకు సాక్షి తండ్రిని అపహరిస్తే.. కుమారుడిని బెదిరించేందుకు తండ్రికి నోటీసులు ఇస్తే.. అది కచ్చితంగా చంద్రబాబు మార్కు పోలీసు జులుం అని చెప్పొచ్చు. విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు నేతృత్వంలోని సిట్ బృందం ఇంతగా బరితెగిస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం చేతిలో కిరాయి మూకగా మారి.. చట్ట నిబంధనలతో పని లేదని, రెడ్బుక్కే తమ రాజ్యాంగమని తేల్చి చెబుతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసు దర్యాప్తు పేరిట సిట్ అరాచకం సృష్టిస్తోంది. లేని అక్రమాలను నిరూపించేందుకు అబద్ధపు సాక్ష్యాలు సృష్టించడమే ఏకైక మార్గమని భావిస్తోంది. అందుకోసం కొందర్ని సాక్షులుగా పేర్కొంటూ అబద్ధపు సాక్ష్యాలు చెప్పాలని వేధిస్తోంది. ఇందులో భాగంగా తిరుపతికి చెందిన కిరణ్ రెడ్డి అనే యువకుడిని సిట్ బృందం కొన్ని రోజులుగా బెంబేలెత్తిస్తోంది. తాను అబద్ధపు సాక్ష్యం చెప్పనని ఆ యువకుడు స్పష్టం చేయడంతో సిట్ పోలీసులు సందిగ్దంలో పడ్డారు. దాంతో ఆయన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకున్నారు. సివిల్ దుస్తుల్లో వెళ్లి కిరణ్ నివాసంపై అర్ధరాత్రి దండెత్తారు. ఆయన ఇంట్లో ప్రవేశించి బీభత్సం సృష్టించారు. ఆ సమయంలో కిరణ్ ఇంట్లో లేడు. దాంతో ఆయన తండ్రి, రిటైర్డ్ కానిస్టేబుల్ సుబ్రమణ్యం రెడ్డిని తమతో బలవంతంగా తీసుకెళ్లారు. తాను పోలీసు కానిస్టేబుల్గా పని చేశానని, నిబంధనలకు విరుద్ధంగా తనను ఎలా తీసుకువెళ్తారని ఆయన అభ్యంతరం వ్యక్తం చేసినా సిట్ అధికారులు ఏమాత్రం పట్టించుకో లేదు. ఈ కేసులో తన కుమారుడిని సాక్షిగా పేర్కొంటూ.. తనను బలవంతంగా తీసుకెళ్లడం ఏమిటని ఆయన ఎంతగా వాదించినా ఫలితం లేకపోయింది. 60 ఏళ్లు పైబడిన వృద్ధుడిని ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పాలని కుటుంబ సభ్యులు ఎంతగా ప్రాథేయపడినా వినిపించుకో లేదు. అర్ధరాత్రి వేళ ఆయన్ని సిట్ బృందం కిడ్నాప్ చేసింది. ఈ వ్యవహారంపై సుబ్రమణ్యంరెడ్డి బంధువు వెంకట్రామిరెడ్డి హైకోర్టులో గురువారం పిటిషన్ వేశారు. తన మామను పోలీసులు కిడ్నాప్ చేశారని, ఆయన్ను వెంటనే ప్రవేశ పెట్టాలని కోరారు. ఈ వ్యవహారంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. సుబ్రమణ్యం రెడ్డి ఎక్కడ ఉన్నా న్యాయస్థానంలో హాజరయ్యేందుకు అడ్డంకులు సృష్టించవద్దని ఆదేశించింది. మరోవైపు కిరణ్ కూడా కనిపించక పోవడంతో కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఆయన్ను కూడా పోలీసులే అపహరించుకుపోయి ఉంటారని చెబుతున్నారు. ఈ వ్యవహారంతో చంద్రబాబు ప్రభుత్వ అరాచకం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. కొడుకు మీద కేసు.. తండ్రికి నోటీసులా? అక్రమ కేసు అయినా సరే.. ఎవరి మీద కేసు పెడితే వారిని విచారణకు పిలవడం అన్నది దర్యాప్తు ప్రాథమిక సూత్రం. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఈ నిబంధనలను నిర్భీతిగా ఉల్లంఘిస్తూ అరాచకానికి తెగబడుతోంది. వైఎస్సార్సీసీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసులో అప్పటి ప్రభుత్వ సలహాదారు రాజ్ కసిరెడ్డిని లక్ష్యంగా చేసుకుంది. ఆయన్ని నిందితుడిగా చేర్చారో.. సాక్షిగా చేర్చారో అన్నది స్పష్టత ఇవ్వకుండా వేధింపులకు దిగుతోంది. ఈ నేపథ్యంలో రాజ్ కసిరెడ్డిని విచారించాలని సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆయన ప్రస్తుతం విచారణకు రాలేనని, సమయం కావాలని కోరారు. దీనిపై అభ్యంతరాలు ఉంటే ఆయనతో సిట్ అధికారులు సంప్రదించాలి. తగిన రీతిలో చట్టబద్ధంగా విచారించాలి. కానీ చంద్రబాబు జమానాలో పోలీసులు తమకు రెడ్బుక్కే రూల్ బుక్ అని పేట్రేగిపోతూ రాజ్ కసిరెడ్డి తండ్రి ఉపేంద్ర రెడ్డిని లక్ష్యంగా చేసుకున్నారు. విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో విచారణకు రావాలని ఆయనకు సైతం నోటీసులు ఇచ్చారు. ఏ ప్రాతిపదికన ఆయనకు నోటీసులు ఇస్తారని న్యాయ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. నిందితులో, సాక్షులో అందుబాటులో లేకపోతే వారి కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేస్తాం.. విచారణకు పిలుస్తాం.. అని ఏపీ పోలీసులు బరితెగిస్తున్నారని విమర్శిస్తున్నారు. కేసుతో సంబంధం లేని వారిని వేధించడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనేనని స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉపేంద్రరెడ్డి తన న్యాయవాదితో కలిసి గురువారం ఉదయం 11.30 గంటలకు విజయవాడలోని పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వచ్చారు. కానీ కార్యాలయం ప్రధాన గేటు వద్దే ఆ న్యాయవాదిని పోలీసులు అడ్డుకున్నారు. ఉపేంద్ర రెడ్డిని మాత్రమే లోపలికి అనుమతించారు. పలు దఫాలుగా రాత్రి 7.30 గంటల వరకు విచారించారు. ఉద్దేశ పూర్వకంగా ఏకంగా 8 గంటలపాటు సిట్ అధికారులు ఆయన్ను ఒత్తిడికి గురిచేశారు. ఈ కేసుతోగానీ, అందుకు సంబంధించిన కంపెనీలతోగానీ ఆయనకు ఎలాంటి ప్రమేయం లేకపోయినా అంత సుదీర్ఘ సమయం కార్యాలయంలోనే ఉంచడం సిట్ అధికారుల వేధింపులకు తార్కాణం. మేం చెప్పినట్లు వినాల్సిందే విచారణలో ఉపేంద్ర రెడ్డిని విజయవాడ సీపీ, సిట్ చీఫ్ రాజశేఖర్బాబు తీవ్ర స్థాయిలో బెదిరించారు. తాము చెప్పినట్లు అబద్ధపు వాంగ్మూలాలు ఇవ్వకపోతే కుమారుడు రాజ్ కసిరెడ్డినే కాకుండా యావత్ కుటుంబ సభ్యులందరిపై కేసులు పెడతామని హెచ్చరించారు. తమ మాట వినకపోతే మును ముందు మరింతగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరింపులకు దిగారు. శుక్రవారం కూడా విచారణకు రావాలని చెప్పారు.21న హాజరుకండి తీవ్రంగా స్పందించిన హైకోర్టు ధర్మాసనంఏం నేరం చేశారో చెప్పకుండా.. ఏ కేసులో అదుపులోకి తీసుకుంటున్నారో తెలియచేయకుండా 60 ఏళ్ల వృద్ధుడిని తిరుపతి నుంచి విజయవాడకు తీసుకొచ్చి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు నిర్బంధించిన ఘటనపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ నెల 21న స్వయంగా తమ ముందు హాజరు కావాలని ఆ వృద్ధుడిని ఆదేశించింది. కోర్టు ముందు హాజరయ్యేందుకు వీలుగా ఈ నెల 20, 21వ తేదీల్లో ఏ అధికారి ముందు గానీ, దర్యాప్తు అధికారి ముందు గానీ హాజరు కానవసరం లేదని స్పష్టం చేసింది. వృద్ధుడిని ఇంటి నుంచి తీసుకెళ్తుండటానికి సంబంధించి పిటిషనర్ సమర్పించిన ఫొటోల్లోని పోలీసులు ఎవరో గుర్తించి, ఆ వివరాలను తమ ముందుంచాలని సిట్ అధికారులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్రావు, డాక్టర్ జస్టిస్ కుంభజడల మన్మథరావు ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 60 ఏళ్లు పైబడిన వృద్ధుడు, మాజీ పోలీసు అయిన టి.బాల సుబ్రహ్మణ్యంరెడ్డిని గుర్తు తెలియని పోలీసులు ఈ నెల 16వ తేదీ అర్ధరాత్రి 11.50 గంటలకు తిరుపతిలోని ఆయన ఇంటి వద్ద నుంచి తీసుకెళ్లారని, ఆయన ఆచూకీ తెలియడం లేదని, ఆయన్ను కోర్టు ముందు హాజరు పరిచేలా ఆదేశాలివ్వాలని బంధువు మేకా వెంకటరామిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గురువారం లంచ్మోషన్ రూపంలో దాఖలు చేసిన ఈ వ్యాజ్యంపై జస్టిస్ రఘునందన్రావు ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది సుబ్రహ్మణ్య శ్రీరామ్, పోలీసుల తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) విష్ణు తేజ వాదనలు వినిపించారు. -
స్కిల్ కేసులో అటకెక్కిన చార్జిషీట్లు!
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు కుట్రదారు, లబ్దిదారుగా సాగిన కుంభకోణాల కేసులను నీరుగార్చేందుకు ఎంతకైనా తెగిస్తామని సీఐడీ పదే పదే స్పష్టం చేస్తోంది. న్యాయస్థానాల్లో ఆ కేసుల విచారణను అడ్డుకునేందుకు ప్రభుత్వ కుట్రను పకడ్బందీగా అమలు చేస్తోంది. అందుకే చంద్రబాబు అవినీతి కేసుల్లో చార్జ్షీట్లను విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో పునఃదాఖలు చేయకుండా ఉద్దేశ పూర్వకంగా కాలయాపన చేస్తోంది. ఎంతగా అంటే.. ఏసీబీ న్యాయస్థానం న్యాయమూర్తి బి.సత్యవెంకట హిమబిందు బదిలీ అయ్యేంత వరకు ఏకంగా 10 నెలలపాటు చార్జ్షీట్లు దాఖలు చేయకుండా సాగదీయడం గమనార్హం.తాజా బదిలీల్లో హిమబిందును రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్య కార్యదర్శిగా నియమించారు. ప్రస్తుతం ఈ విషయం పోలీసు శాఖ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2014–19లో టీడీపీ ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణం కేసులో 2023లో అరెస్టు అయిన ప్రధాన నిందితుడు చంద్రబాబుకు న్యాయమూర్తి హిమబిందు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. అప్పట్లో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పూర్తి ఆధారాలతో సహా దాఖలు చేసిన రిమాండ్ నివేదిక పట్ల సంతృప్తి చెందిన న్యాయమూర్తి ఆ మేరకు ఆదేశాలు జారీ చేశారు. దాంతో చంద్రబాబు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో 52 రోజులపాటు రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. అప్పట్లో ఈ పరిణామానికి వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం తీవ్ర కలకలం రేగింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం న్యాయమూర్తి హిమబిందుకు ప్రత్యేక భద్రత కూడా కల్పించింది. కేసులు నీరుగార్చే కుట్ర.. సాక్షులకు బెదిరింపులు రాష్ట్రంలో గత ఏడాది టీడీపీ కూటమి ప్రభుత్వం రాగానే చంద్రబాబుపై అవినీతి కేసులను సీఐడీ అటకెక్కించింది. ఆ కేసులను నీరుగార్చడమే పనిగా పెట్టుకుంది. చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని న్యాయస్థానంలో సీఆర్పీసీ సెక్షన్ 164 కింద వాంగ్మూలం ఇచ్చిన సాక్షులు, అధికారులను బెదిరించి బెంబేలెత్తిస్తోంది. వారితో అబద్ధపు వాంగ్మూలాలు మళ్లీ నమోదు చేయిస్తోంది. అంతేకాకుండా చంద్రబాబు అవినీతి కేసుల్లో చార్జ్షీట్లను న్యాయస్థానంలో పునఃదాఖలు చేయకుండా సీఐడీ కుట్ర పూరితంగా వ్యవహరిస్తుండటం గమనార్హం. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు అవినీతిని ఆధారాలతో సహా నిగ్గు తేల్చిన సిట్.. విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో చార్జిషీట్లు దాఖలు చేసింది. న్యాయస్థానం కొన్ని వివరణలు కోరుతూ చార్జిషీట్లను గత ఏడాది ఏప్రిల్లో వెనక్కి పంపింది. వివరణలతో ఆ చార్జిషీట్లను మళ్లీ దాఖలు చేయాలని ఆదేశించింది. అప్పటి సీఐడీ అధికారులు ఆ వివరణలతో సహా చార్జిషీట్లను సిద్ధం చేశారు. కానీ గత ఏడాది జూన్లో రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొత్తగా నియమితులైన సీఐడీ ఉన్నతాధికారులు ఆ చార్జిషీట్లను తొక్కిపెట్టారు. వాటిని న్యాయస్థానంలో దాఖలు చేయకుండా ఉద్దేశ పూర్వకంగా జాప్యం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజా బదిలీల్లో విజయవాడ ఏసీబీ న్యాయస్థానం న్యాయమూర్తి హిమబిందు బదిలీ అయ్యారు. న్యాయమూర్తి ప్రశ్నించినా స్పందించని సీఐడీ చంద్రబాబు అవినీతి కేసుల్లో చార్జ్షీట్లను పునఃదాఖలు చేయక పోవడాన్ని కొన్ని నెలల క్రితం న్యాయమూర్తి ప్రశ్నించారు కూడా. చంద్రబాబు, నారాయణ ప్రధాన నిందితులుగా ఉన్న అసైన్డ్ భూముల కేసులో గతంలో సిట్ అధికారులు ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి నివాసంలో సోదాలు నిర్వహించి కీలక పత్రాలు స్వా«దీనం చేసుకున్నారు. అసైన్డ్ భూముల కుంభకోణం అంతా వివరిస్తానని ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి చెబుతూ తనను అప్రూవర్గా గుర్తించమని న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. సిట్ జప్తు చేసిన తన పత్రాలను విడుదల చేయాలని కూడా ఆయన న్యాయస్థానాన్ని కోరారు. దీనిపై కొన్ని రోజుల క్రితం విచారించిన న్యాయమూర్తి అసలు సీఐడీ చార్జిషీట్లను ఇంకా ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించారు. ఆ చార్జిషీట్లు దాఖలు చేయనంత వరకు ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి అప్రూవరా.. నిందితుడా.. అన్నది నిర్ధారించలేమన్నారు. చార్జిషీట్లను ఇంకా ఎందుకు దాఖలు చేయడం లేదని న్యాయమూర్తి ప్రశ్నించగా.. సీఐడీ తరఫు న్యాయవాది సరైన సమాధానం చెప్పలేకపోయారు. న్యాయమూర్తి ప్రశ్నించిన ఐదారు నెలల తర్వాత కూడా సీఐడీ ఆ చార్జ్షీట్లను పునఃదాఖలు చేయకపోవడం గమనార్హం. అంటే న్యాయమూర్తిగా హిమబిందు ఉన్నంత వరకు సీఐడీ చార్జ్షీట్లను దాఖలు చేయకూడదని నిర్ణయించుకుందనే చర్చ రాష్ట్రవ్యాప్తంగా సాగుతోంది. న్యాయమూర్తిపైనే ఇంటెలిజెన్స్ నిఘా! చంద్రబాబు కేసులను విచారిస్తున్న న్యాయమూర్తి హిమబిందుపై రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులు నిఘా పెట్టడం కలకలం సృష్టించింది. ఆ న్యాయమూర్తి ఇంటి పరిసరాల్లో ఇంటలిజెన్స్ అధికారులు తిష్ట వేసి, ప్రతి కదలికనూ గమనిస్తూ ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తుండటం గమనార్హం. నిఘా వేసిన ఇంటెలిజెన్స్ అధికారులను న్యాయమూర్తి సిబ్బంది గుర్తించారు. న్యాయమూర్తి కోసం వాకబు చేస్తున్న విషయాన్ని కూడా వారు తెలుసుకున్నారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన న్యాయమూర్తి, పోలీసు అధికారిని ఆ అంశంపై న్యాయస్థానంలోనే ప్రశ్నించడం గమనార్హం. తన నివాసం వద్ద ఇంటెలిజెన్స్ అధికారులు ఎందుకు మాటు వేశారు? తన ప్రతి కదలికను ఎందుకు పరిశీలిస్తున్నారు? అని సూటిగా ప్రశ్నించడంతో ఆ పోలీసు అధికారి తత్తరపాటుకు గురయ్యారు. -
శ్రవణ్ ఫోన్లపైనే సిట్ ఫోకస్.. ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు విచారణ!
హైదరాబాద్,సాక్షి: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏ6గా ఉన్న శ్రవణ్ రావు ఇవాళ మరోసారి సిట్ విచారణను ఎదుర్కోనున్నారు. విచారణలో శ్రవణ్ రావు వినియోగించిన రెండు ఫోన్లు కీలకం కానున్నాయి.ఇప్పటికే శ్రవణ్ రావు రెండు సార్లు సిట్ విచారణకు హాజరయ్యారు. విచారణలో భాగంగా గత ఎన్నికల సందర్భంగా శ్రవణ్ రావు వాడిన ఫోన్లను స్వాధీనం చేయాలని సిట్ నోటీసులు జారీ చేసింది.దీంతో రెండోసారి సిట్ విచారణకు హాజరైన శ్రవణ్ రావు ఓ పాత తుప్పు పట్టిన ఫోన్ ఇచ్చారు. ఆ తుప్పు పట్టిన ఫోన్ను చూసిన విచారణ అధికారులు విస్మయానికి గురయ్యారు. సుప్రీంకోర్టు స్పష్టంగా సిట్ విచారణకు సంపూర్ణంగా సహకరించాలని ఆదేశించినా శ్రవణ్ రావు సహకరించకపోవడం వారిని అసంతృప్తికి గురి చేసింది. తాము అడిగిన రెండు సెల్ ఫోన్లతో పాటు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానంతో ఈనెల 8వ తేదీన మరోసారి విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు నోటీసులు ఇచ్చింది. దీంతో ఇవాళ ఆయన సిట్ ఎదుట హాజరు కానున్నారు. -
వీర విధేయులతో ‘సిట్’
పచ్చ చొక్కాలు ధరించలేదు.. అదొక్కటే తక్కువ..! ఖాకీ దుస్తులు వేసుకున్నాగానీ రెడ్బుక్ కుట్రలు అమలు చేయడంలో నాలుగాకులు ఎక్కువే చదివారు..! ఇదీ చంద్రబాబు సర్కారు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) తీరు!! వైఎస్సార్సీపీ హయాంలో మద్యం విధానంపై అక్రమ కేసుతో వేధించేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం నియమించిన సీఐడీ దర్యాప్తు బెడిసికొట్టిన సంగతి తెలిసిందే. కొండను తవ్వినప్పటికీ కనీసం ఎలుకను కూడా పట్టుకోలేక చేతులెత్తేసింది. దాంతో బరితెగించి బెదిరింపులకు పాల్పడి అక్రమ కేసుతో వేధించేందుకే సిట్ను ఏర్పాటు చేసింది. టీడీపీ వీర విధేయ పోలీసు అధికారులను ఏరికోరి మరీ సిట్లో సభ్యులుగా నియమించింది. ప్రభుత్వ పెద్దల అంచనాలను అందుకోవడమే లక్ష్యంగా సిట్ సభ్యులు దర్యాప్తు పేరుతో యథేచ్ఛగా వేధింపులకు తెగబడుతున్నారు. అక్రమ నిర్బంధాలు, బెదిరింపులు, వేధింపులతో అరాచకంగా వ్యవహరిస్తున్నారు. దర్యాప్తు ప్రమాణాలను నిర్భీతిగా ఉల్లంఘిస్తూ సిట్ సభ్యులు సాగిస్తున్న వ్యవహారాలపై పోలీసు వర్గాల్లోనే తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. సిట్ సభ్యుల ట్రాక్ రికార్డే అంతేననే ఏకాభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. – సాక్షి, అమరావతిరెడ్బుక్ కోసమే.. తెలంగాణ నుంచి ఏపీకిసిట్లో మరో సభ్యుడు ఎల్.సుబ్బారాయుడి కుటుంబానికి టీడీపీతో బలమైన అనుబంధం ఉంది. అనంతపురం జిల్లాకు చెందిన ఆయన కుటుంబం టీడీపీ తరఫున రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంది. తెలంగాణ క్యాడర్కు చెందిన సుబ్బారాయుడును అందుకే చంద్రబాబు పట్టుబట్టి మరీ ఏపీకి డిప్యుటేషన్పై రప్పించుకుని రెడ్బుక్ కుట్ర అమలు బాధ్యతలను అప్పగించారు. తిరుపతి ఎస్పీగా ఉండగా సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు, అక్రమ నిర్బంధాలతో ఆయన వేధించారు. వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ సందర్భంగా తిరుపతిలో టికెట్ల జారీలో తొక్కిసలాట చోటు చేసుకుని ఆరుగురు భక్తులు దుర్మరణం చెందటానికి ఎస్పీగా ఆయన వైఫల్యమే ప్రధాన కారణం. అయినప్పటికీ సుబ్బారాయుడును ప్రభుత్వం సస్పెండ్ చేయకుండా బదిలీతో సరిపెట్టింది. ఆ వెంటనే ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధక టాస్క్ ఫోర్స్ ఎస్పీగా నియమించి చిత్తూరు జిల్లాలోనే పోస్టింగ్ ఇచ్చింది. అనంతరం మద్యం విధానంపై అక్రమ కేసు దర్యాప్తునకు ఏర్పాటు చేసిన సిట్లో సభ్యుడిగా నియమించింది.పచ్చ బాస్కు వీరవిధేయుడుసిట్ ఇన్చార్జ్గా నియమితులైన విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్బాబు వ్యవహార శైలి ఆది నుంచి తీవ్ర వివాదాస్పదమే. అసలు డీజీ స్థాయి అధికారి చీఫ్గా ఉన్న సీఐడీకి అప్పగించిన కేసును... ఐజీ స్థాయి అధికారి అయిన రాజశేఖర్బాబు నేతృత్వంలోని సిట్కు అప్పగించడం వెనుకే పక్కా కుట్ర దాగుంది. సాధారణంగా జిల్లా ఎస్పీలు, పోలీస్ కమిషనర్లను సిట్ లాంటి దర్యాప్తు సంస్థలకు ఇన్చార్జిగా నియమించరు. వారు తమ జిల్లా, పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ, ఇతర కీలక బాధ్యతలు పర్యవేక్షించాల్సి ఉంటుంది.సాధారణంగా రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలోని ఓ సీనియర్ అధికారికి సిట్ ఇన్చార్జ్ లాంటి బాధ్యతలు అప్పగిస్తారు. ఇందుకు విరుద్ధంగా విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్బాబును సిట్ ఇన్చార్జ్గా నియమించడం గమనార్హం. టీడీపీకి ఆది నుంచి వీరవిధేయుడుగా ఉన్న ట్రాక్ రికార్డు ఆయన సొంతం. గతంలో అనంతపురం జిల్లా ఎస్పీగా ఉన్నప్పటి నుంచి టీడీపీకి వీర విధేయుడనే ముద్రను చెరిపేసుకునేందుకు ఆయన ఏనాడూ ప్రయత్నించ లేదు. పైగా అదే తనకు అదనపు అర్హతగా భావించారు. గతేడాది టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే విజయవాడ పోలీస్ కమిషనర్గా నియమితులైన ఆయన రెడ్బుక్ కుట్రను అమలు చేయడంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసుల నమోదు వెనుక మాస్టర్మైండ్గా వ్యవహరించారు. వారిపై బీఎన్ఎస్ సెక్షన్ 111 కింద వ్యవస్థీకృత నేరాల చట్టాన్ని ప్రయోగించడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియా కార్యకర్తలపై బనాయించిన అక్రమ కేసుల్లో 75 శాతం ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే నమోదు కావడం గమనార్హం. సోషల్ మీడియా పోస్టులపై బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 111 కింద కేసుల నమోదు చెల్లదని హైకోర్టు స్పష్టం చేయడంతో రాజశేఖర్బాబు అరాచక పర్వానికి అడ్డుకట్ట పడింది. చెబితే చాలు.. ఎంత అడ్డగోలు పనైనా చేసేందుకు సదా సిద్ధంగా ఉంటారనే ఏకైక అర్హతతోనే ఆయన్ని సిట్ చీఫ్గా నియమించినట్టు తెలుస్తోంది. ఇక వలపు వల (హనీట్రాప్) విసిరి బడా బాబులను బురిడీ కొట్టించే నేర చరిత్ర ఉన్న ముంబై నటి కాదంబరి జత్వానీని అడ్డం పెట్టుకుని, అక్రమ కేసులను దగ్గరుండి పర్యవేక్షించింది రాజశేఖర్బాబే! ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో ప్రముఖ పారిశ్రామికవేత్త, జేఎస్డబ్ల్యూ గ్రూపు అధినేత సజ్జన్ జిందాల్ను వేధించారు. దాంతో రాష్ట్రంలో పెట్టాల్సిన రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులను జేఎస్డబ్ల్యూ గ్రూపు మహారాష్ట్రకు తరలించేసింది.‘స్పా’ంటేనియస్ అధికారి కొల్లి శ్రీనివాస్సిట్లో మరో సభ్యుడైన ఒంగోలు విజిలెన్స్–ఎన్ఫోర్స్మెంట్ విభాగం అదనపు ఎస్పీ కొల్లి శ్రీనివాస్ ట్రాక్ రికార్డు అత్యంత వివాదాస్పదం. గతంలో విజయవాడలో అదనపు డీసీపీగా ఉన్నప్పుడు అక్రమాలకు పాల్పడ్డారు. ‘స్పా’లలో అసాంఘిక కార్యకలాపాలకు అనుమతించడం వెనుక ఆయనే ప్రధాన సూత్రధారి. దాంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆయన్ను బదిలీ చేసి వీఆర్కు పంపింది. ఇప్పుడు టీడీపీ సర్కారు ఆయన్ను సిట్ సభ్యుడిగా నియమించింది.ఆ ఇద్దరూ అంతే...!సిట్లో మిగిలిన ఇద్దరు సభ్యులు సీఐడీ అదనపు ఎస్పీ ఆర్.శ్రీహరిబాబు, నంద్యాల జిల్లా డోన్ డీఎస్పీ పి.శ్రీనివాస్ తీరు కూడా అంతే. గతంలో ఆర్.శ్రీహరి బాబు గురజాల డీఎస్పీగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేల కాల్ రికార్డుల వివరాలను అక్రమంగా సేకరించి ఇతరులకు చేరవేశారు. నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు బ్లాక్ మెయిలింగ్ కుట్రలకు సహకరిస్తూ ఎమ్మెల్యేల కాల్ డేటాను అక్రమంగా సేకరించి ఇచ్చారు. దాంతో నాడు శ్రీహరిబాబును వైఎస్సార్సీపీ ప్రభుత్వం బదిలీ చేసింది. అదే అర్హతగా భావించి ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వం ఆయన్ను సిట్ సభ్యుడిగా నియమించింది. సిట్లో మరో సభ్యుడిగా ఉన్న నంద్యాల డీఎస్పీ పి.శ్రీనివాస్ అత్యంత వివాదాస్పద అధికారిగా ముద్ర పడ్డారు. శ్రీసత్యసాయి జిల్లా కదిరికి చెందిన ఆయన కుటుంబం టీడీపీలో క్రియాశీలకంగా ఉంది. ఎస్సై, సీఐగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో విధులు నిర్వహించిన శ్రీనివాస్ టీడీపీకి అనుకూలంగా పని చేయాలని ఇతర అధికారులపై ఒత్తిడి తేవడం అప్పట్లోనే వివాదాస్పదమైంది. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత ఉమ్మడి కర్నూలు జిల్లాలో సీఐలు, ఎస్సైల పోస్టింగుల్లో ఆయన మాటే చెల్లుబాటైందని పోలీసువర్గాలు చెబుతున్నాయి. అంతటి టీడీపీ వీర విధేయుడు కాబట్టే ఆయన్ను సిట్లో సభ్యుడిగా చేర్చారు. -
రెండోసారి గంట సేపు విచారణ!
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న శ్రవణ్కుమార్రావు బుధవారం రెండోసారి సిట్ ఎదుట హాజరయ్యారు. ఉదయం 11.30 గంటలకు వచ్చిన ఆయనను అధికారులు దాదాపు గంటపాటు ప్రశ్నించారు. శనివారం మొదటిసారి సిట్ ముందు హాజరైనప్పుడు అధికారులు, శ్రవణ్ను దాదాపు ఎనిమిది గంటల పాటు ప్రశ్నించారు. బుధవారం సైతం సుదీర్ఘంగానే విచారించాలని భావించారు. అయితే హెచ్సీయూ పరిణామాల నేపథ్యంలో పోలీసులు బిజీ అయ్యారు. దీంతో కేవలం గంట మాత్రమే ప్రశ్నించి పంపిస్తూ.. ఈ నెల 8న మరోసారి విచారణకు రావాలని నోటీసు జారీ చేశారు. శ్రవణ్రావు గతంలో ఓ టీవీ చానల్ను నిర్వహించారు. ఆ చానల్ను ఎందుకు తీసుకున్నారు? దానికి పెట్టుబడులు ఎవరు పెట్టారు? అనే కోణంలో అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. మరోపక్క దుబాయ్లో సొంత ఫ్లాట్ ఉన్న శ్రవణ్, ఇటీవల రెండు నెలల పాటు అక్కడ ఉన్నారు. ఆ సమయంలో ఆయనతో పాటు మరో ఐదుగురు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఆ ఫ్లాట్ ఎప్పుడు? ఎలా? ఖరీదు చేశారనే అంశంతో పాటు ఆ ఐదుగురు ఎవరని పోలీసులు అడిగారు. కాగా, పోలీసులు అడిగిన ఏ ప్రశ్నకు కూడా శ్రవణ్రావు నుంచి సరైన సమాధానం రాలేదని తెలు స్తోంది. శనివారం విచారణ సందర్భంగా శ్రవణ్రావు తాను 2023 ఎన్నికల సమయంలో ఓ సర్వే చేశానని. దాని వివరాలను ప్రభాకర్రావుతో పంచుకున్నానని చెప్పారు. ఆయనతో పాటు ఆయన ద్వారా పరిచయమైన ప్రణీత్తో తప్ప మరే ఇతర అధికారి, నాటి ప్రభుత్వ పెద్దలతో తనకు సంబంధం లేదంటూ శ్రవణ్రావు వాదిస్తున్నారు. అయితే ఆ సర్వే ఎవరి సూచనల మేరకు చేశారు? అందుకు సంబంధించిన నగదు ఎవరు చెల్లించారు? అనే అంశంపై పోలీసులు ప్రశ్నించినా.. శ్రవణ్ నుంచి సామాధానం రాలేదని తెలుస్తోంది. 2023 ఎన్నికల సమయంలో శ్రవణ్ 2 ఫోన్లు వాడినట్లు పోలీసులు గుర్తించారు. వాటిని తీసుకువచ్చి అప్పగించాలని శనివారమే స్పష్టం చేశారు. అయితే బుధవారం ఆయన ఓ పాత సెల్ఫోన్ తీసుకువచ్చి ఇచ్చారు. అది చూసి షాక్కు గురైన పోలీసులు గతంలో వాడినవి కావాలని స్పష్టం చేశారు. ఆ రెండు సెల్ఫోన్లను ఎనిమిదో తేదీన విచారణకు వచ్చే సమయంలో తీసుకురావాలని స్పష్టం చేశారు. సెల్ఫోన్లను మార్చే ప్రయత్నం చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దర్యాప్తు అధికారులకు పూర్తి స్థాయిలో సహకరించాలంటూ శ్రవణ్రావును సుప్రీంకోర్టు ఆదేశించిందని, అయితే ఆయన నుంచి సరైన సహకారం లభించడం లేదని పోలీసులు చెపుతున్నారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగిసిన విచారణ.. శ్రవణ్ రావుకు మళ్లీ నోటీసులు
హైదరాబాద్, సాక్షి: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు శ్రవణ్ రావు(Shravan Rao) విచారణ ముగిసింది. మూడు రోజుల కిందట విచారణకు హాజరైన ఆయన.. సుదీర్ఘంగా సాగిన విచారణలోనూ అసంపూర్తిగా సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ రావాలని దర్యాప్తు బృందం నోటీసులు జారీ చేయడంతో ఆయన హాజరయ్యారు. అధికారులు అడిగిన పత్రాలను సమర్పించగా.. ఈ నెల 8వ తేదీన మరోసారి విచారణకు రావాల్సిందిగా ఆయనకు సిట్ నోటీసులు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో శ్రవణ్ రావు ఏ6గా ఉన్నారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్ఐబీ) కేంద్రంగా ఎవరెవరిపై నిఘా ఉంచాలనే విషయంలో ఓ మీడియా సంస్థ అధినేత అయిన ఈయన సూచన మేరకే కీలక నిందితులు ప్రభాకర్రావు, ప్రణీత్రావులు నడుచుకున్నారనేది దర్యాప్తుసంస్థ ప్రధాన అభియోగం. అయితే కిందటి ఏడాది మార్చిలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిన వెంటనే.. శ్రవణ్ రావు అమెరికా వెళ్లిపోయారు. ఇంతకాలం విచారణకు హాజరు కాకుండా వచ్చారు. తాజాగా.. అరెస్ట్ నుంచి సుప్రీం కోర్టు(Supreme Court)లో మధ్యంతర ఉత్తర్వుల ద్వారా ఊరట పొందిన ఆయన.. దర్యాప్తుకు తప్పనిసరిగా సహకరించాలన్న షరతు మేరకు జూబ్లీహిల్స్ పీఎస్లో ప్రత్యేక దర్యాప్తు బృందం ముందు హాజరయ్యారు. అయితే గత విచారణ టైంలో ఆయనను మీడియా కంటపడనీయకుండా పోలీసులు వ్యవహరించిన తీరు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.కీలకంగా శ్రవణ్ రావుతొలుత నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో సిరిసిల్ల డీసీఆర్బీ అప్పటి డీఎస్పీ ప్రణీత్రావు పేరు మాత్రమే ఉంది. దర్యాప్తు ముందుకెళ్తున్నకొద్దీ నిందితుల జాబితా పెరుగుతూ వచ్చింది. ఈక్రమంలోనే శ్రవణ్రావును ఆరో నిందితుడిగా చేరుస్తూ న్యాయస్థానంలో పోలీసులు మెమో దాఖలు చేశారు. 2023 శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు లబ్ధి చేకూర్చేందుకే కాంగ్రెస్ అభ్యర్థులతోపాటు వారికి ఆర్థిక వనరులు సమకూర్చుతున్న వ్యాపారులపై నిఘా ఉంచాలని ఆయన సూచించారని అనుమానిస్తున్నారు. ఆయన్ను సుదీర్ఘంగా విచారిస్తే ఈ విషయాలపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. -
ముందుగానే ఎందుకు పారిపోయారు?
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరో నిందితుడిగా ఉన్న ఓ మీడియా ఛానల్ అధినేత శ్రవణ్రావు ఎట్టకేలకు పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. గత ఏడాది మార్చి నుంచి అమెరికాలో తలదాచుకున్న ఆయన.. శనివారం ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ ఎదుటికి వచ్చారు. ఉదయం 11.20 గంటలకు విచారణాధికారి ముందు హాజరయ్యారు. సాయంత్రం 6 గంటల వరకు వివిధ అంశాలపై ఆయనను ప్రశ్నించారు. ‘అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా మారకముందే దేశం విడిచి ఎందుకు పారిపోయారు? ఫోన్ ట్యాపింగ్లో మీ పాత్ర ఉన్నందుకే దర్యాప్తు పరిణామాలను ఊహించి పారిపోయారా? ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన ఎస్ఐబీ మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్ రావుతో మీకు ఉన్న సంబంధాలు ఎలాంటివి? విదేశాలకు పారిపోయేందుకు ఎవరు సహకరించారు? అక్కడ ఎవరి వద్ద తలదాచుకున్నారు?’అని సూటిగా ప్రశ్నించినట్లు తెలిసింది. కీలకంగా శ్రవణ్రావు? అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు 2024 మార్చి 10న నమోదు కాగా... మే మొదటి వారంలో శ్రవణ్రావును ఆరో నిందితుడిగా చేర్చారు. అయితే ఆయన అప్పటికే అమెరికా పారిపోయారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రతిపక్షాల నగదు లావాదేవీలపై దృష్టి పెట్టిన ప్రణీత్కు.. శ్రవణ్ కీలక ఇన్ఫార్మర్గా పనిచేసినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన వాట్సాప్ చాటింగ్లను ఇప్పటికే నిందితుల ఫోన్ల నుంచి రిట్రీవ్ చేశారు. ముగ్గురు బీఆర్ఎస్ నాయకుల ఆదేశాల మేరకే శ్రవణ్రావు ఈ పాత్ర పోషించారని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ కోణంలోనూ శ్రవణ్ను ప్రశ్నించారు. ప్రధానంగా రేవంత్రెడ్డితో పాటు ఆయన కుటుంబీకులు, వీరికి అండగా నిలుస్తున్న వారి వివరాలను తన నెట్వర్క్ ద్వారా సేకరించిన శ్రవణ్.. ఆ వివరాలను వాట్సాప్ ద్వారా ప్రణీత్రావుకు పంపాడని ఆధారాలు సేకరించారు. గత ఏడాది మార్చి 22న దర్యాప్తు అధికారులు జూబ్లీహిల్స్ రోడ్ నెం.78లోని శ్రవణ్ ఇంట్లో సోదాలు చేశారు. ఈ కేసులో కీలక నిందితుడైన ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావు అప్పట్లో అత్యాధునిక ట్యాపింగ్ పరికరాలను విదేశాల నుంచి తెప్పించి పలు చోట్ల మినీ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. వాటిలో ఒకటి శ్రవణ్ కార్యాలయం కేంద్రంగానూ పని చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ పరికరాల కొనుగోలు వెనుక శ్రవణ్ పాత్ర ఉన్నట్లు అనుమానిస్తున్న పోలీసులు ఆ కోణంలోనూ విచారించారు. ప్రణీత్రావు, తిరుపతన్న, భుజంగరావు, రాధాకిషన్రావు సెల్ఫోన్ల నుంచి రిట్రీవ్ చేసిన డేటా ఆధారంగానూ శ్రవణ్ను ప్రశ్నించారు. అయితే, ఆయన విచారణకు సహకరించలేదని పోలీసులు చెప్తున్నారు. కొన్ని ప్రశ్నలకు గుర్తులేదు, తెలీదు అని బదులిచ్చినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 2వ తేదీన మరోసారి విచారణకు రావాలని శ్రవణ్రావును పోలీసులు ఆదేశించారు. రహస్యంగా రావటం.. రహస్యంగానే పోవటం అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ సందర్భంగా గతంలో ఎప్పుడూ కనిపించని గోప్యతను శ్రవణ్రావు విషయంలో పోలీసులు పాటించారు. ఆయన మీడియా కంటపడకుండా అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. శ్రవణ్ రాక విషయం తెలుసుకున్న మీడియా.. ఉదయం 10 గంటల నుంచే సిట్ కార్యాలయం ఉన్న జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్కు చేరుకుంది. అయితే, మీడియాను పోలీసులు ఠాణా ప్రధాన గేటు దాటి లోపలికి అనుమతించలేదు. శ్రవణ్రావు విచారణకు వచ్చిన సమయంలో ఫొటోలు, వీడియోలు తీసుకునేందుకు మీడియా ప్రతినిధులు ప్రయత్నించగా.. ఆయన చుట్టూ పోలీసులు నిలబడి కెమెరా కంటికి దొరకనివ్వలేదు. విచారణ ముగిసిన తర్వాత బయటకు వచ్చే సమయంలో అయినా ఫొటోలు తీసుకుందామని భావించిన మీడియా సాయంత్రం 6 వరకు వేచి చూసింది. ఈసారి మరో ఎత్తు వేసిన పోలీసులు.. శ్రవణ్రావును వెనుక గేటు నుంచి చాటుగా పంపించారు. దీంతో మిగిలిన నిందితుల విషయంలో లేని గోప్యత శ్రవణ్రావు విషయంలోనే ఎందుకు పాటించారని పోలీసులను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీనికి అధికారుల నుంచి సమాధానం కరువైంది. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగిసిన శ్రవణ్రావు సిట్ విచారణ
హైదరాబాద్, సాక్షి: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉత్కంఠకు తెర పడింది. మీడియా సంస్థ నిర్వాహకుడు, ఈ కేసులో నిందితుడు శ్రవణ్ రావు సిట్ విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ పీఎస్లో ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) ఎదుట హాజరయ్యారు. ఫోన్ట్యాపింగ్ కేసులో శ్రవణ్రావు విచారణ ముగిసింది ఏడు గంటలకుపైగా శ్రవణ్రావును సిట్ అధికారులు ప్రశ్నించారు.ఇదిలా ఉంటే.. ఈ కేసులో ఏ6 నిందితుడిగా ఉన్న శ్రవణ్ కుమార్కు ఈ నెల 26వ తేదీన సిట్ నోటీసులు జారీ చేసింది. 29వ తేదీన తమ కార్యాలయానికి విచారణ నిమిత్తం రావాల్సిందిగా తెలిపింది. ఆయన అమెరికాలో ఉండడంతో కుటుంబ సభ్యులకు ఆ నోటీసులను అందజేసింది. అయితే ఈలోపు అరెస్ట్ నుంచి ఆయనకు సుప్రీం కోర్టు ఊరట ఇచ్చింది. అయినప్పటికీ ఈ కేసులో విచారణకు సహకరించాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం షరతు విధించింది. దీంతో ఆయన విచారణకు హాజరయ్యారు. మరోవైపు.. శ్రవణ్ రావు విచారణకు కచ్చితంగా హాజరు అవుతారని కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఈ వేకువఝామున విమానంలో ఆయన నగరానికి వచ్చారని తెలుస్తోంది. ఈ కేసులో శ్రవణ్ వాంగ్మూలం కీలకంగా మారవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ వెర్షన్ ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో.. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్ఐబీ) కేంద్రంగా ఎవరెవరిపై నిఘా ఉంచాలనే విషయంలో శ్రవణ్ రావు సూచన మేరకే కీలక నిందితులు ప్రభాకర్రావు, ప్రణీత్రావులు నడుచుకున్నారనేది దర్యాప్తుసంస్థ ప్రధాన అభియోగం. ఓ మీడియా సంస్థకు అధిపతిగా ఉంటూ 2023 శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు లబ్ధి చేకూర్చారని.. కాంగ్రెస్ అభ్యర్థులతోపాటు వారికి ఆర్థిక వనరులు సమకూర్చుతున్న వ్యాపారులపై నిఘా ఉంచాలని ఈయనే సూచించారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయన్ను విచారిస్తే ఈ విషయాలపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. గతేడాది మార్చి 10న పంజాగుట్ట ఠాణాలో ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైన వెంటనే ఆయన తొలుత లండన్కు.. అక్కడి నుంచి అమెరికాకు వెళ్లిపోయారు. సిట్ విచారణకు రాకుండా అక్కడే ఉండిపోయారు. ఇటీవలే ఆయనపై రెడ్కార్నర్ నోటీస్ సైతం జారీ అయింది. అయితే తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో.. సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ దాఖలు వేసి ఊరట పొందినప్పటికీ విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
బెట్టింగ్ యాప్లపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: బెట్టింగ్ యాప్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్పై సిట్ ఏర్పాటుకు ఆదేశించింది. ఆన్లైన్ బెట్టింగ్పై సిట్ విచారణకు సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఆన్లైన్ బెట్టింగ్ పట్ల కఠినంగా ఉండాలని నిర్ణయించామని సీఎం తెలిపారు.‘‘ఆన్లైన్ బెట్టింగ్ నిషేధిస్తూ గత ప్రభుత్వం చట్టం చేసింది.. కానీ అమలు జరగడం లేదు. దర్యాప్తు కోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను వేస్తున్నాం. ప్రకటనలు చేసినా.. నిర్వహణలో భాగస్వామ్యం ఉన్నా కఠిన చర్యలు ఉంటాయి. నేరాలు చెప్పి జరగవు. నేరాల పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటుంది. గతంలో న్యాయవాదులు, వెటర్నరీ డాక్టర్ హత్యలు జరిగాయి’’ అని రేవంత్ అన్నారు.ఎంఎంటీఎస్ రైలులో అత్యాచారయత్నం ఘటనపై సీఎం రేవంత్ స్పందిస్తూ.. శాంతిభద్రతలపై ప్రతిపక్షం దుష్ప్రచారం చేస్తోందన్నారు. ‘‘పెట్టుబడులు రాకుండా అడ్డుకోవాలని కుట్ర చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో దిశ ఘటన జరిగింది. వామనరావు దంపతులను నడిరోడ్డుపై చంపేశారు. జూబ్లీహిల్స్ అత్యాచారం కేసులో బీఆర్ఎస్ నేత కుమారుడిపై చర్యలు తీసుకోలేదు. తెలంగాణ అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్నారు. కుట్రలు మాని, విజ్ఞతతో మెలగాలి’’ అని రేవంత్రెడ్డి హితవు పలికారు. -
దర్యాప్తు ముసుగులో దాదాగిరీ!
సాక్షి, అమరావతి: రెడ్బుక్ కుట్రలను అమలు చేయడమే లక్ష్యంగా సాగుతున్న టీడీపీ కూటమి సర్కారు పోలీసు గూండాగిరీకి తెగిస్తోంది! అందుకోసం సిద్ధం చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) రాజ్యాంగేతర శక్తిగా మలుచుకుంది! గత ప్రభుత్వ హయాంలో అనుసరించిన మద్యం విధానాలపై అక్రమ కేసులతో బరితెగిస్తోంది. ఈ క్రమంలో సీఐడీ ద్వారా అక్రమ కేసుతో వేధించేందుకు పన్నిన పన్నాగం ఫలించకపోవడంతో ‘సిట్’ను తెరపైకి తెచ్చింది. ప్రలోభపెట్టో.. వేధించో.. హింసించో... తిమ్మిని బమ్మిని చేయాలని సిట్ను ఆదేశించింది. దర్యాప్తు పేరిట వేధింపులకు కుతంత్రం పన్నింది. సిట్ పోలీస్ స్టేషన్ ఎక్కడన్నది గుర్తించకుండా బరితెగించి సాగిస్తున్న ఈ కుట్ర ఇలా ఉంది..!సిట్ పోలీస్ స్టేషన్ ఎక్కడ..?నిబంధనల ప్రకారం సిట్ను ప్రత్యేక పోలీస్ స్టేషన్గా ప్రకటించి ఎక్కడి నుంచి పని చేస్తుందో అధికారికంగా నోటిఫై చేయాలి. అంటే సిట్ పోలీస్ స్టేషన్ ప్రాంగణాన్ని గుర్తించాలి. కక్ష సాధింపే లక్ష్యంగా పెట్టుకున్న చంద్రబాబు ప్రభుత్వం ఈ నిబంధనలను నిర్భీతిగా ఉల్లంఘిస్తోంది. వైఎస్సార్సీపీ హయాంలో మద్యం విధానంపై అక్రమ కేసు నమోదు చేసిన కూటమి సర్కారు సిట్ను ఏర్పాటు చేస్తూ ప్రత్యేక పోలీస్ స్టేషన్గా ప్రకటించింది. అయితే ఆ పోలీస్ స్టేషన్ ఎక్కడ అన్నది నోటిఫై చేయలేదు. సిట్ పోలీస్ స్టేషన్ భౌతికంగా ఎక్కడ ఉందో వెల్లడించకపోవడం వెనుక పక్కా కుట్ర ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.దర్యాప్తు పేరుతో వేధింపుల కుట్ర...సిట్ పోలీస్ స్టేషన్ ప్రాంగణాన్ని ఇప్పటివరకు గుర్తించకపోవడం వెనుక పక్కా కుట్ర ఉంది. పోలీస్ స్టేషన్ను అధికారికంగా గుర్తిస్తే అక్కడి నుంచే సిట్ విధులు నిర్వహించాలి. ఈ కేసులో నిందితులనుగానీ సాక్షులనుగానీ విచారించాలంటే నోటీసులు జారీ చేసి అక్కడకే పిలవాలి. ఆ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలోనే విచారించాలి. సక్రమ కేసు అయితే ఈ నిబంధనలను కచ్చితంగా పాటిస్తారు. రెడ్బుక్ కుట్రలో భాగంగా నమోదు చేసిన అక్రమ కేసు కాబట్టే కూటమి ప్రభుత్వం బరి తెగిస్తోంది. ఈ కేసులో సాక్షులా? నిందితులా? ఇతరులా? అనేది స్పష్టం చేయకుండా పలువురిని ఇప్పటికే విచారణ పేరుతో వేధించింది. వారిని ఎక్కడ విచారించిందో రహస్యంగా ఉంచింది. బెవరేజెస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, పూర్వ ఉద్యోగి సత్య ప్రసాద్, ప్రభుత్వ మాజీ సలహాదారు కసిరెడ్డి రాజశేఖర్రెడ్డి తదితరులను రోజుల తరబడి గుర్తు తెలియని ప్రదేశాల్లో నిర్బంధించి దర్యాప్తు పేరిట వేధించింది. ఎక్కడికి తరలించారో వారి కుటుంబ సభ్యులకు కనీస సమాచారం కూడా ఇవ్వలేదు. అదే రీతిలో మద్యం డిస్టిలరీల ప్రతినిధులను కూడా దర్యాప్తు పేరిట బెంబేలెత్తించారు. తాము చెప్పినట్లు చేయకుంటే వారి వ్యాపారాలను దెబ్బ తీస్తామని హడలెత్తించారు. వారిని ఏ ప్రాంతంలో విచారించారో స్పష్టత లేదు. సిట్ అధికారులతోపాటు రిటైర్డ్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్, ప్రైవేటు వ్యక్తులు ఈ కేసు దర్యాప్తు పేరిట పలువురిని తీవ్రంగా వేధించారు. తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలాలు ఇవ్వాలని బెదిరించారు. లేదంటే వారి కుటుంబ సభ్యులు, సమీప బంధువులపై సైతం అక్రమ కేసులు బనాయించి వేధిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ మాజీ సలహాదారు కసిరెడ్డి రాజశేఖర్రెడ్డిని అదే రీతిలో బెదిరించగా ఆయన సమీప బంధువులను కూడా తీవ్రంగా వేధించినట్లు సమాచారం. అజ్ఞాత ప్రదేశాల్లో ఈ వ్యవహారాలను సాగించారు. అదే పోలీస్ స్టేషన్ను గుర్తించి అధికారికంగా ప్రకటిస్తే నిందితులు, సాక్షులు, ఇతరులను అక్కడే విచారించాల్సి ఉంటుంది. అందుకే సిట్ పోలీస్ స్టేషన్ అన్నది ఎక్కడో ప్రకటించకుండా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు.సీసీ టీవీ కెమెరాలు లేవు... జనరల్ డైరీ లేదు..సిట్ దర్యాప్తు ప్రహసనంలో సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా చంద్రబాబు ప్రభుత్వం బేఖాతరు చేస్తోంది. అన్ని పోలీస్ స్టేషన్లలో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టంగా నిర్దేశించింది. టీడీపీ కూటమి ప్రభుత్వం పోలీస్ స్టేషన్లలో సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేయకపోవడాన్ని ఇటీవల హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. సోషల్ మీడియా కార్యకర్తలను అక్రమంగా నిర్బంధించి వేధిస్తున్న కేసు విచారణ సందర్భంగా పోలీసు శాఖపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అయినా సరే చంద్రబాబు ప్రభుత్వ తీరు మారలేదని సిట్ వ్యవహారం వెల్లడిస్తోంది. విచారణ పేరుతో ఎవరెవర్ని పిలుస్తున్నారు..? ఎంతసేపు తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు..? ఏ సమయంలో వచ్చారు... తిరిగి ఎప్పుడు వెళ్లారు..? వారితో పాటు న్యాయవాదులు వచ్చారా..? ఇలా ఏ ఒక్క అంశం అధికారికంగా రికార్డు కావడం లేదు. ఇక ఈ కేసుకు సంబంధించి జనరల్ డైరీ (జీడీ) నమోదు చేయడం లేదు. తద్వారా దర్యాప్తు ప్రాథమిక ప్రమాణాలను సిట్ బేఖాతరు చేస్తోంది. దాంతో ఈ కేసు దర్యాప్తులో సిట్కు జవాబుదారీతనం లేకుండా పోయింది. దర్యాప్తు పేరుతో ఎంతమందిని వేధించినా...శారీరకంగా, మానసికంగా హింసించినా తమను ప్రశ్నించకుండా ఉండాలన్నదే సిట్ లక్ష్యం. ప్రభుత్వ పెద్దల రెడ్బుక్ కుట్రలను అమలు చేయడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిట్ దర్యాప్తు ప్రమాణాలు, సుప్రీంకోర్టు ఆదేశాలు, పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తోందని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.డిస్టిలరీ ప్రతినిధికి చిత్రహింసలు..అక్రమ కేసులతో వేధిస్తున్న సిట్ అరాచకాలకు తెలంగాణకు చెందిన ఓ డిస్టిలరీ ప్రతినిధి జైపాల్రెడ్డికి ఎదురైన చేదు అనుభవమే నిదర్శనం. దర్యాప్తు పేరుతో జైపాల్రెడ్డిని అక్రమంగా నిర్బంధించిన సిట్ అధికారులు ఆయన్ను తీవ్రస్థాయిలో హింసించినట్లు తెలుస్తోంది. గుర్తు తెలియని ప్రదేశానికి తరలించి మూడు రోజులపాటు తీవ్ర వేధింపులకు గురి చేశారు. తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని సిట్ ఇన్చార్జీగా ఉన్న విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్బాబు ఆయనపై విరుచుకుపడినట్లు సమాచారం. జైపాల్రెడ్డిని తీవ్రంగా హింసించి బెంబేలెత్తించారు. అయినప్పటికీ తాను అవాస్తవాలను వాంగ్మూలంగా ఇవ్వబోనని ఆయన నిరాకరించడంతో సిట్ అధికారుల కుట్ర బెడిసికొట్టింది. ఇదే రీతిలో పలువురు సాక్షులు, డిస్టిలరీల ప్రతినిధులను సిట్ బృందం అక్రమ నిర్భందాలతో వేధిస్తూ అరాచకానికి తెగబడుతోంది. ఈ కుతంత్రాన్ని అమలు చేసేందుకే సిట్ పోలీస్ స్టేషన్ను అధికారికంగా గుర్తించకుండా కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. -
రెడ్బుక్ కుట్రకే ‘పచ్చ’ సిట్!
సాక్షి, అమరావతి: రెడ్ బుక్ కుట్రలో తాజా అంకానికి చంద్రబాబు ప్రభుత్వం తెరతీసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం కొనుగోళ్లపై అక్రమ కేసు నమోదు చేసిన సీఐడీ చేతులెత్తేయడంతో టీడీపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. దాంతో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణ పేరిట కొత్త పన్నాగం పన్నింది. తాము చూసి రమ్మని చెబితే.. కాల్చి వచ్చేసేంతటి టీడీపీ వీర విధేయ పోలీసు అధికారులతో సిట్ను నియమించడం గమనార్హం. సిట్ చీఫ్గా నియమించిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్బాబుతోపాటు అందులోని సభ్యుల ట్రాక్ రికార్డే చంద్రబాబు ప్రభుత్వ కుట్రను తేటతెల్లం చేస్తోంది. తాము లక్ష్యంగా చేసుకున్న వైఎస్సార్సీపీ నేతలకు వ్యతిరేకంగా తప్పుడు నివేదికలు ఇప్పించి, అక్రమ కేసులతో వేధించడమే ధ్యేయంగా సిట్ను నియమించారన్నది సుస్పష్టం. అందుకే సిట్కు అపరిమిత అధికారాలు కట్టబెడుతూ మరీ కుతంత్ర కార్యాచరణకు ఉపక్రమించింది. సిట్ సభ్యుల ట్రాక్ రికార్డు ఇలా ఉంది.అక్రమ కేసులు పెట్టడంలో అందెవేసిన చేయి అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక మెతుకు పట్టి చూస్తే చాలు అన్నట్టుగా సిట్ చీఫ్ను చూస్తే చాలు చంద్రబాబు ప్రభుత్వ కుట్ర తేటతెల్లమవుతుంది. టీడీపీ వీర విధేయుడిగా గుర్తింపు పొందిన అత్యంత వివాదాస్పద అధికారి ఎస్వీ రాజశేఖర్ బాబు. అనంతపురం జిల్లాలో పోస్టింగు నుంచి నేటి వరకు ఆయన టీడీపీకి అత్యంత అనుకూల అధికారిగా ముద్ర పడ్డారు. ఆ ముద్రను తొలగించుకునేందుకు ఆయన ఏనాడూ ప్రయత్నించక పోవడం గమనార్హం. గత ఏడాది టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే ఆయన్ను ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్గా నియమించింది. అప్పటి నుంచి ఆయన రెడ్బుక్ కుట్రను అమలు చేయడమే ఏకైక లక్ష్యంగా చెలరేగిపోతున్నారు. రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసుల నమోదు వెనుక మాస్టర్మైండ్గా పని చేశారు. బీఎన్ఎస్ సెక్షన్ 111 కింద వ్యవస్థీకృత నేరాల చట్టాన్ని ప్రయోగించడం దేశ వ్యాప్తంగా విస్మయ పరిచింది. టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియా కార్యకర్తలపై బనాయించిన అక్రమ కేసుల్లో 75 శాతం ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే నమోదు కావడం గమనార్హం. అక్రమంగా నిర్బంధించి రోజుల తరబడి శారీరకంగా హింసించడం పోలీసుల బరితెగింపునకు నిదర్శనం. ఇలా కేసుల నమోదు చెల్లదని హైకోర్టు స్పష్టం చేయడంతో రాజశేఖర్బాబు అక్రమ కేసుల కుట్రకు తెరపడింది. ఇక వలపు వల (హనీట్రాప్) విసిరి బడా బాబులను బురిడీ కొట్టించే నేర చరిత్ర ఉన్న ముంబయికి చెందిన కాదంబరి జత్వానీని అడ్డం పెట్టుకుని అక్రమ కేసులను దగ్గరుండీ పర్యవేక్షించిందీ రాజశేఖర్ బాబే. చంద్రబాబు ఆదేశాలతో ఆయన చేసిన నిర్వాకంతో ప్రముఖ పారిశ్రామికవేత్త, జేఎస్డబ్ల్యూ గ్రూపు అధినేత సజ్జన్ జిందాల్ను వేధించారు. దాంతో హడలిపోయిన జేఎస్డబ్ల్యూ గ్రూపు రాష్ట్రంలో పెట్టాల్సిన రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులను మహారాష్ట్రకు తరలించేసింది. ఇలా ప్రభుత్వ పెద్దలు చెబితే చాలు ఎంతటి అక్రమానికైనా తెగించే ఏకైక అర్హతతోనే రాజశేఖర్ బాబును సిట్ చీఫ్గా నియమించారు.పట్టుబట్టి తెలంగాణ నుంచి రప్పించి..సిట్లో మరో సభ్యుడు ఎల్.సుబ్బారాయుడు టీడీపీ వీరవిధేయ కుటుంబీకుడు. అనంతపురం జిల్లాకు చెందిన ఆయన కుటుంబం టీడీపీ తరఫున రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంది. అందుకే తెలంగాణ క్యాడర్కు చెందిన సుబ్బారాయుడును పట్టుబట్టి చంద్రబాబు మరీ ఏపీకి రప్పించుకున్నారు. అనంతరం రెడ్బుక్ కుట్ర కేసుల నమోదు బాధ్యతలను అప్పగించారు. సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు, అక్రమ నిర్బంధాలతో ఆయన హడలెత్తించారు.ఇటీవల తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ ప్రక్రియలో తొక్కిసలాట జరిగి, ఆరుగురు భక్తులు దుర్మరణం పాలవ్వడం పూర్తిగా పోలీసు వైఫల్యమే. అందుకు సుబ్బారాయుడిని సస్పెండ్ చేయాల్సిన ప్రభుత్వం కేవలం బదిలీతో సరిపెట్టింది. అది కూడా ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధక టాస్క్ ఫోర్స్ ఎస్పీగా నియమించి చిత్తూరు జిల్లాలోనే పోస్టింగ్ ఇచ్చింది. తాజాగా సిట్లో సభ్యుడిగా నియమించింది. టీడీపీ ఎంతంటే అంతే..సిట్లో మరో సభ్యుడు నంద్యాల డీఎస్పీ పి.శ్రీనివాస్ తీరు మొదటి నుంచి అత్యంత వివాదాస్పదం. సత్యసాయి జిల్లా కదిరికి చెందిన ఆయన కుటుంబం టీడీపీలో క్రియాశీలకంగా ఉంది. ఎస్సై, సీఐగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో విధులు నిర్వహించిన శ్రీనివాస్.. టీడీపీకి అనుకూల అధికారిగా ముద్ర పడ్డారు. గత ఏడాది ఎన్నికల ముందు కూడా ఆయన పలువురు పోలీసు అధికారులకు ఫోన్లు చేసి మరీ టీడీపీకి అనుకూలంగా పని చేయాలని ఒత్తిడి తేవడం వివాదాస్పదమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి శ్రీనివాస్ మాటే నంద్యాల జిల్లాలో శాసనంగా మారింది. జిల్లాలో సీఐలు, ఎస్సైల పోస్టింగుల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. అసాంఘికాలకు ఊతంఒంగోలు విజిలెన్స్–ఎన్ఫోర్స్మెంట్ విభాగం అదనపు ఎస్పీగా ఉన్న కొల్లి శ్రీనివాస్ను కూటమి ప్రభుత్వం సిట్లో సభ్యునిగా నియమించింది. గతంలో విజయవాడలో అదనపు డీసీపీగా ఉన్నప్పుడు అక్రమాలకు పాల్పడిన చరిత్ర ఆయన సొంతం. స్పాలలో అసాంఘిక కార్యకలాపాలకు అనుమతించడం వెనుక ఆయనదే ప్రధాన పాత్ర. దాంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆయన్ను బదిలీ చేసి వీఆర్కు పంపింది. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం ఆయన్ను సిట్ సభ్యునిగా నియమించింది. అక్రమంగా కాల్ రికార్డ్స్ ఆయన ఘనతసిట్లో మరో సభ్యుడు ప్రస్తుతం సీఐడీ అదనపు ఎస్పీగా ఉన్న ఆర్. శ్రీహరి బాబు ట్రాక్ రికార్డు మరింత వివాదాస్పదం. గతంలో ఆయన గురజాల డీఎస్పీగా ఉన్నప్పుడు పలువురు ఎమ్మెల్యేల కాల్ రికార్డుల వివరాలను అక్రమంగా సేకరించి ఇతరులకు చేరవేశారు. బ్లాక్ మెయిలింగ్కు పాల్పడే ఉద్దేశంతోనే కాల్ రికార్డుల డేటాను అక్రమంగా సేకరించడం అప్పట్లో తీవ్ర వివాదాస్పదమైంది. ఈ కాల్ రికార్డుల కుట్ర వెనుక సూత్రధారి నరసారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కావడం గమనార్హం. దాంతో శ్రీహరిబాబును వైఎస్సార్సీపీ ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనకు ఫోకల్ పోస్టింగు ఇవ్వకుండా పక్కన పెట్టింది. ఇలాంటి ట్రాక్ రికార్డు కలిగిన శ్రీహరి బాబును సిట్ సభ్యునిగా చేర్చడం కూటమి ప్రభుత్వం కుట్రకు తార్కాణం. -
AP: బియ్యం అక్రమ రవాణా కేసుల విచారణకు సిట్
సాక్షి, విజయవాడ: బియ్యం అక్రమ రవాణా కేసుల విచారణకు సిట్ ఏర్పాటైంది. సీఐడీ ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. అయితే, ‘సీజ్ ది షిప్’ ఎపిసోడ్పై విచారణను మాత్రం సిట్కి అప్పగించలేదు. గత నెల, ఈ నెలలో జరిగిన బియ్యం అక్రమ రవాణా అంశాలను సిట్ పరిధికి ప్రభుత్వం అప్పగించలేదు.స్టెల్లా, కెన్ స్టార్ షిప్లలో బియ్యం రవాణా అంశాన్ని సిట్కి అప్పగించని ప్రభుత్వం.. జూన్, జులైలో నమోదైన రేషన్ బియ్యం రవాణా కేసుల విచారణను మాత్రమే సిట్కి అప్పగించింది. 13 ఎఫ్ఐఆర్లు నమోదైన కేసులు సిట్కి అప్పగించింది. సిట్ జీవోలో ఎక్కడా కూడా సీజ్ ది షిప్ ఎపిసోడ్ ప్రస్తావన లేదు.ఇదీ చదవండి: ఓరి మీ యేశాలో!.. కాకినాడ పోర్టు కబ్జాకు బాబు, పవన్ ఎత్తులు -
కస్టడీలో మహిళకు చిత్రహింసలపై సిట్
న్యూఢిల్లీ: కోల్కతా ఆర్జీ కర్ ఆస్పత్రిలో ట్రెయినీ వైద్యురాలి హత్యాచారాన్ని నిరసిస్తూ ఆందోళనల్లో పాల్గొన్న ఓ మహిళను లాకప్లో ఉంచి చిత్రహింసలు పెట్టిన ఘటనపై సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం)ను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ కలకత్తా హైకోర్టు ఇచి్చన తీర్పును సవరిస్తూ సోమవారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ల ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. ప్రతి అంశాన్నీ సీబీఐకి బదిలీ చేయలేమని పేర్కొన్న ధర్మాసనం.. దర్యాప్తు బాధ్యతలను సీనియర్ ఐపీఎస్ అధికారులకు అప్పగించాలని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం సూచించిన అధికారులతో ఏర్పాటయ్యే సిట్ తమ విచారణ పురోగతిపై వారం వారం కలకత్తా హైకోర్టు నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. కేసు తీర్పు కోసం ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని కూడా కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ధర్మాసనం సూచించింది. కస్టడీలో మహిళను చిత్రహింసలకు గురిచేసిన ఘటనపై ఏర్పాటయ్యే ఏడుగురితో కూడిన ఐపీఎస్ల సిట్లో ఐదుగురు మహిళలు కూడా ఉండాలని నవంబర్ 11న జరిగిన విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఘటనపై దర్యాప్తునకు సమర్థులైన అధికారులుండగా హైకోర్టు మాత్రం పొరపాటున సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిందంటూ రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు తాజా ఆదేశాలిచ్చింది. సీబీఐ దర్యాప్తుతో రాష్ట్ర పోలీసుల్లో నైతిక స్థైర్యం దెబ్బతింటుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. నిరసనల్లో పాల్గొన్నారనే కారణంతో సెపె్టంబర్ 7వ తేదీన తమను కోల్కతాలోని ఫల్టా పోలీసులు అరెస్ట్ చేసి, కొట్టారంటూ రెబెకా ఖాతూన్ మొల్లా, రమా దాస్ అనే వారు పిటిషన్ వేశారు. ఈ ఆరోపణలు నిజమేనని తేలి్చన కలకత్తా హైకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ అక్టోబర్ 8న ఆదేశించింది. -
సుప్రీం కోర్టు నిర్ణయాలతో వణికిపోతోన్న చంద్రబాబు నాయుడు అండ్ కో
-
బాబు సిట్' క్లోజ్
-
స్వతంత్ర సిట్ నిజాలు నిగ్గుతేల్చుతుందా ?
-
సిట్ విచారణ నిలిపివేత
తిరుమల: తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ అంటూ అసత్య ఆరోపణలు చేసిన చంద్రబాబు.. ఆ ఆరోపణలపై విచారణ కోసం ఆయనే ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) విచారణ నిలిచిపోయింది. డీజీపీ ద్వారకా తిరుమలరావు తిరుమలలో మంగళవారం ప్రకటించారు. తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ ఆరోపణలపై సిట్ దర్యాప్తును నిలిపివేస్తున్నామని.. సుప్రీం కోర్టులో విచారణ జరుగుతుండటం వల్ల దర్యాప్తును ఆపుతున్నామని తెలిపారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై పోలీస్, టీటీడీ విజిలెన్స్ అధికారులతో తిరుమలలో మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవారి లడ్డులో కల్తీ నెయ్యి వాడిన కేసు తీవ్రత వల్లే సిట్ వేశామని.. మూడు రోజుల పాటు టీటీడీలో సిట్ దర్యాప్తు సాగిందన్నారు. ప్రస్తుతానికి సిట్ విచారణను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామన్నారు. ఈ నెల 3వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాల ప్రకారం దర్యాప్తుపై తదుపరి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. 3 రోజుల దర్యాప్తు వివరాలను సిట్ చీఫ్ తమకు అందజేశారని చెప్పారు.బ్రహ్మోత్సవాల్లో పటిష్ట భద్రత బ్రహ్మోత్సవాలకు సంబంధించి భద్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించామని డీజీపీ తెలిపారు. 5,145 మంది పోలీస్ సిబ్బందిని బ్రహోత్సవాలకు వినియోగిస్తున్నామన్నారు. గరుడ వాహనం రోజున ప్రత్యేకంగా మరో 1,264 మందిని భద్రత కోసం నియమిస్తున్నట్టు చెప్పారు. తిరుమలలో 24 ప్రాంతాలలో పార్కింగ్ స్థలాలను గుర్తించామని, వీటిలో 8 వేల వాహనాలను పార్కింగ్ చేసుకోవచ్చన్నారు. దసరాకు 6,100 ప్రత్యేక బస్సులు భక్తులకు రవాణా ఇబ్బందులు లేకుండా తిరుమలకు అదనంగా ఆర్టీసీ బస్సులు నడుపుతున్నట్టు ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ ద్వారకా తిరుమలరావు చెప్పారు. దసరా నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 6,100 ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని.. వీటిలో అదనపు చార్జీలు వసూలు చేయడం లేదని చెప్పారు. -
ఏఆర్ ఫుడ్స్పై ఫిర్యాదులో జాప్యం ఎందుకు: ‘సిట్’ ఆరా
సాక్షి,తిరుపతి: తిరుమల లడ్డూ వివాదంపై ఏర్పాటైన సిట్ మూడోరోజు విచారణను సోమవారం(సెప్టెంబర్30) కొనసాగిస్తోంది. లడ్డూలో వాడే నెయ్యి కల్తీ వ్యవహారంపై తిరుమల మార్కెటింగ్ జీఎం రెండు నెలల తర్వాత ఫిర్యాదు చేయడంపై సిట్ ఆరా తీస్తోంది.నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ ఫుడ్స్పై ఫిర్యాదు చేయడంలో జాప్యంపై సిట్ ప్రత్యేక దృష్టి పెట్టింది. లడ్డూ తయారీకి సంబంధించి భాగమైన ఫ్లోర్మిల్, ల్యాబ్, ఇతర ముడిసరుకుల నాణ్యతను సిట్ పరిశీలించింది.ఇదీ చదవండి: తిరుమల లడ్డూ వివాదం..సుప్రీంకోర్టులో విచారణ -
కల్తీ నెయ్యి వ్యవహారం పై జోరు పెంచిన సిట్ ..ఏఆర్ ఫుడ్స్ కు నోటీసులు
-
కల్తీ నెయ్యి వ్యవహారం పై జోరు పెంచిన సిట్ ..ఏఆర్ ఫుడ్స్ కు నోటీసులు
-
ఇది చంద్రబాబు బీ టీం.. సిట్ పై మల్లాది విష్ణు విమర్శలు
-
తిరుమల లడ్డూ ఎపిసోడ్ పై కొనసాగుతున్న సిట్ దర్యాప్తు
-
తిరుపతిలో నేడు రెండవ రోజు సిట్ బృందం విచారణ
-
సిట్.. బాబు స్కిట్.. ఏదో తేడా కొడుతోంది
-
హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు విచారణకు సిట్ ఏర్పాటు
సాక్షి, విశాఖపట్నం: హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. తాజాగా హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు విచారణకు విశాఖపట్నం సీపీ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు అయింది. విశాఖ సీపీ రవిశంకర్ ఆధ్వర్యంలో 20 మందితో సిట్ బృందం ఏర్పడింది. జాయింట్ సీపీ, ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్సైలు, 12 మంది హెడ్ కానిస్టేబుళ్లతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయనుంది. మరోవైపు.. ఆపరేషన్ కంబోడియా విజయవంతమైంది. 360 మంది భారతీయులను ఎంబసీ అఫ్ ఇండియా కాపాడింది. సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్: + 855 10642777 సంప్రదించాలని అధికారులు కోరారు. అయితే.. విదేశీ ఉద్యోగాలంటూ కోటి ఆశలతో కంబోడియా వెళ్లిన భారతీయులు మోసపోయారు. కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగమని తీసుకువెళ్లి అక్కడ బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తున్న చైనా గ్యాంగ్పై సోమవారం తిరుగుబాటు చేసిన బాధితులు జైలు పాలయ్యారు. అక్కడ నిర్వాహకులు తమను చిత్ర హింసలకు గురి చేస్తున్నారని కొంత మంది బాధితులు విశాఖ పోలీసులకు మంగళవారం వాట్సాప్తో పాటు ‘ఎక్స్’ ద్వారా వీడియో సందేశాలు పంపించిన విషయం తెలిసిందే.విదేశాల్లో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు అంటూ గాజువాకకు చెందిన చుట్టా రాజేష్ విజయ్కుమార్ సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చాడు. అది నిజమని నమ్మి విశాఖ నుంచే కాకుండా రాష్ట్రంలో సుమారు 150 మంది నిరుద్యోగులు రూ.1.5 లక్షలు చొప్పున చెల్లించారు. వారిని బ్యాంకాక్, సింగపూర్ల మీదుగా కంబోడియాకు పంపించారు. అక్కడ మరో గ్యాంగ్ బాధితులను రిసీవ్ చేసుకొని కంబోడియాలో పాయిపేట్ వీసా సెంటర్కు తీసుకెళ్లింది. ఓ నెలకు టూరిస్ట్ వీసా చేయించి ఆ గ్యాంగ్ చైనా ముఠాకు విక్రయించింది. నిరుద్యోగుల నైపుణ్యం ఆధారంగా వారిని రూ.2,500 నుంచి రూ.4వేల అమెరికన్ డాలర్లకు చైనా కంపెనీలకు అమ్మేశారు.అక్కడ పని చేసి చైనా వారి చెర నుంచి తప్పించుకున్న నగరానికి చెందిన బొత్స శంకర్ అనే వ్యక్తి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు సైబర్ నేరాలతో పాటు మానవ అక్రమ రవాణా వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు.ఈ కేసుని లోతుగా దర్యాప్తు చేయాలని సీపీ రవిశంకర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో జాయింట్ కమిషనర్ ఫకీరప్ప సారథ్యంలో సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ కె.భవానీప్రసాద్, సిబ్బందితో ఏడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. -
బదిలీలతో బరితెగింపు
సాక్షి, అమరావతి: ఎన్నికల వేళ పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో విధ్వంస కాండను అరికట్టడం, అనంతరం కేసుల దర్యాప్తులో పోలీసు అధికారులు విఫలమయ్యారని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) నిర్ధారించింది. నిందితులపై కీలక సెక్షన్ల కింద కేసులు నమోదు చేయకపోవడాన్ని ప్రస్తావించింది. మూడు జిల్లాల్లో హింసాత్మక సంఘటనలపై విచారించిన సిట్ బృందం ఇన్చార్జ్ వినీత్ బ్రిజ్లాల్ ప్రాథమిక నివేదికను సోమవారం రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో డీజీపీ హరీశ్కుమార్ గుప్తాకు అందచేశారు. రెండు రోజుల పాటు విస్తృతంగా విచారణ నిర్వహించిన సిట్ అధికారుల బృందం పోలీసుల వైఫల్యాలపై నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది. పూర్తి నివేదిక అందించేందుకు మరికొంత సమయం పడుతుందని పేర్కొంది. బదిలీ చేసిన జిల్లాల్లోనే హింసపోలింగ్కు ముందు చంద్రబాబు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఎన్నికల కమిషన్ (ఈసీ)పై ఒత్తిడి తెచ్చి పల్నాడు నుంచి అనంతపురం వరకు ఏకంగా 39 మంది పోలీసు అధికారులను బదిలీ చేయించిన విషయం తెలిసిందే. వారి స్థానాల్లో పురందేశ్వరి సమర్పించిన జాబితాలోని అధికారులనే ఈసీ నియమించడం గమనార్హం. ఈ క్రమంలో పోలింగ్ రోజు మే 13న, అనంతరం టీడీపీ గూండాలు యథేచ్చగా విధ్వంసానికి పాల్పడ్డారు. ఈసీ నియమించిన పోలీసు అధికారులు శాంతి భద్రతల పరిరక్షణలో దారుణంగా విఫలమయ్యారు. అనంతరం కేసుల నమోదు, దర్యాప్తులో నిర్లక్ష్యంగా వ్యవహరించారు.అదనపు సెక్షన్లు చేర్చండి..విధ్వంస కాండపై పోలీసుల దర్యాప్తు తూతూ మంత్రంగా ఉందని సిట్ స్పష్టం చేసింది. నిందితులను పట్టుకునేందుకు అదనపు బృందాలను ఏర్పాటు చేయడంతోపాటు అదనంగా మరికొన్ని సెక్షన్లు జోడించాలని సూచించింది. అందుకోసం న్యాయస్థానాల్లో మెమో దాఖలు చేయాలని పేర్కొంది. నిందితులను త్వరగా అరెస్టు చేయడంతోపాటు ముందస్తు తేదీతో చార్జ్షీట్లను దాఖలు చేయాలని పేర్కొంది. పోలింగ్ సందర్భంగా దాడుల కేసుల దర్యాప్తును తాము పర్యవేక్షిస్తామని సిట్ స్పష్టం చేసింది.నాలుగు బృందాలు..పోలింగ్ సందర్భంగా హింసాత్మక సంఘటనలపై సిట్ విస్తృతంగా దర్యాప్తు చేసింది. వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో ఏర్పాటైన సిట్ నాలుగు బృందాలుగా ఏర్పడి శని, ఆదివారాల్లో విచారణ నిర్వహించింది. పల్నాడు జిల్లాలో రెండు బృందాలు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో ఒక్కో బృందం పర్యటించి హింసాత్మక సంఘటనలు జరిగిన ప్రదేశాలను పరిశీలించాయి. బాధితులతో మాట్లాడి వారి నుంచి ఫిర్యాదులు స్వీకరించాయి. పోలీసు అధికారులను విచారించడంతోపాటు మొత్తం పరిస్థితిని సమీక్షించాయి.కుమ్మక్కుతో విధ్వంసకాండకాల్ డేటా విశ్లేషించి కఠిన చర్యలు తీసుకోవాలిసిట్ను కోరిన వైఎస్సార్సీపీ నేతలుకొందరు పోలీసు అధికారులు టీడీపీతో కుమ్మక్కై విధ్వంస కాండకు కొమ్ము కాశారని వైఎస్సార్సీపీ పేర్కొంది. పోలింగ్ రోజు, అనంతరం టీడీపీ రౌడీమూకల విధ్వంసకాండపై పారదర్శకంగా విచారణ నిర్వహించి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. దాడులు జరిగిన ప్రాంతాల్లో ఎస్సైలు, సీఐల కాల్ డేటా సేకరించి విచారణ నిర్వహించాలని కోరింది. ఈ కేసులపై విచారణ నిర్వహిస్తున్న సిట్ ఇన్చార్జ్ వినీత్ బ్రిజ్లాల్ను మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో వైఎస్సార్సీపీ ప్రతినిధి బృందం సోమవారం కలిసింది. టీడీపీ నేతలు, ఆ పార్టీ గూండాలు పక్కా పన్నాగంతో ఎలా దాడులకు పాల్పడ్డారో వివరిస్తూ ఆధారాలను అందచేసింది. మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేశ్తోపాటు వైఎసార్సీపీ నేతలు పేర్ని నాని, రావెల కిషోర్ బాబు, మల్లాది విష్ణు, కైలే అనిల్కుమార్, లేళ్ల అప్పిరెడ్డి, మనోహర్ రెడ్డి తదితరులు ఈ బృందంలో ఉన్నారు. అనంతరం డీజీపీ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ నేతలు మీడియాతో మాట్లాడారు.బదిలీలు చిన్న విషయం కాదు: అంబటి రాంబాబు, జలవనరుల శాఖ మంత్రిచంద్రబాబు, పురందేశ్వరి ఈసీపై ఒత్తిడి తెచ్చి ఎన్నికల ముందు పోలీసు అధికారులను మార్చి అల్లరి మూకలను దాడులకు పురిగొల్పారు. క్షేత్రస్థాయి పరిస్థితులపై పూర్తి అవగాహన ఉన్న పోలీసు అధికారులను బదిలీ చేయించడంతో టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడ్డాయి. అధికారులను బదిలీ చేసిన ప్రాంతాల్లోనే దాడులు, విధ్వంసం చోటుచేసుకున్నాయి. అప్పటికప్పుడు ఐపీఎస్ అధికారులను మార్చడం చిన్న విషయం కాదు. టీడీపీ పన్నాగంలో పోలీసు అధికారులు పావులుగా మారడం దురదృష్టకరం.అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై పోలీసులు దాడి చేసి సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. చాలా గ్రామాల్లో ఇప్పటికీ పరిస్థితులు కుదుట పడలేదు. మా పార్టీ నేతలపై జరిగిన దాడులపై ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసులు పెట్టడం లేదు. టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడమే తడవు తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు.ప్రజాబలంతో ఎదుర్కొలేక గూండాగిరి: మంత్రి జోగి రమేష్ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ చంద్రబాబు కుట్రలకు బరి తెగించారు. ప్రజల మద్దతులేని టీడీపీ కూటమి ఎన్నికలను ఎదుర్కోలేక దౌర్జన్యాలకు తెర తీసింది. అరాచకాలు, దౌర్జన్యాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. టీడీపీ నిర్వాకంతో ఈ ఎన్నికలు రాష్ట్ర చరిత్రలో ఒక మచ్చగా మిగిలిపోయాయి.హక్కులు కాలరాశారు: రావెల కిషోర్ బాబు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఓటింగ్లో పాల్గొనకుండా అడ్డుకునేందుకు టీడీపీ విధ్వంసకాండకు పాల్పడింది. వారిని గ్రామాల నుంచి తరిమేశారు. అంబేడ్కర్ అందించిన రాజ్యాంగ హక్కులను కాలరాసిన టీడీపీ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలి. 33 కేసులు.. 1,370 మంది నిందితులుపల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో పోలింగ్ సందర్భంగా దాడులు, దౌర్జన్యకాండపై ఇప్పటివరకు 33 కేసులు నమోదు చేశారు. పల్నాడు జిల్లాలో 22,అనంతపురం జిల్లాలో 7, తిరుపతి జిల్లాలో 4 కేసులు నమోదయ్యాయి. మొత్తం 1,370 మందిని నిందితులుగా పేర్కొనగా ఇప్పటివరకు 124 మందిని అరెస్ట్ చేశారు. మరో 94 మందికి సెక్షన్ 41 ఏ కింద నోటీసులు జారీ చేశారు. -
సత్తెనపల్లిలో సిట్ టీమ్
-
సిట్ వద్ద కీలక ఆధారాలు.. విచారణ అడ్డుకునే కుట్ర
-
చివరి అంకానికి సిట్ దర్యాప్తు
-
సిట్ ఎంట్రీతో అజ్ఞాతంలోకి కొంతమంది అనుమానితులు
-
సిట్ దర్యాప్తు ముమ్మరం
సాక్షి, అమరావతి/నరసరావుపేట/రెంటచింతల/తాడిపత్రి: రాష్ట్రంలో పోలింగ్ అనంతరం హింసాత్మక సంఘటనలపై కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో దాడులు, అల్లర్ల పూర్వాపరాలు విచారిస్తూ ఆ ఘటనలపై కేసులు నమోదు చేసిన తీరును విశ్లేíÙస్తోంది. ఎన్నికల ముందు టీడీపీ, బీజేపీ ఒత్తిడితో ఈసీ హడావుడిగా డీఐజీలు, ఎస్పీలు, ఇతర పోలీసు అధికారులను బదిలీ చేసిన పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లోనే పోలింగ్ రోజున, అనంతరం భారీగా విధ్వంసకాండ చెలరేగడం తెలిసిందే. వీటిపై ఏర్పాటైన సిట్కు నేతృత్వం వహిస్తున్న అదనపు డీజీ వినీత్ బ్రిజ్లాల్ తమ అధికారులను మూడు బృందాలుగా విభజించి శనివారం ఉదయానికే పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాలకు పంపారు. మరోవైపు ఆయన డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాతో శనివారం సమావేశమై సిట్ కార్యాచరణ గురించి చర్చించారు. అనంతరం ఆ మూడు జిల్లాల్లో విచారణ చేపట్టిన పోలీసు అధికారుల బృందాలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఏఏ అంశాలపై దృష్టి సారించాలనే అంశాన్ని వారికి స్పష్టం చేశారు. దాంతో పల్నాడు, అనంతపురం జిల్లాల్లో దాడులు సంభవించిన ప్రాంతాల్లో సిట్ సభ్యులు పర్యటించారు. గురజాల, మాచర్ల, నరసారావుపేట, సత్తెనపల్లి, తాడిపత్రి పోలీసు స్టేషన్లల్లో పోలీసు అధికారులను విచారించారు. దాడులు సంభవించిన తీరు, సమాచారం అందిన వెంటనే పోలీసు అధికారులు స్పందించిన తీరు, నమోదు చేసిన కేసులు, అందులో పేర్కొన్న సెక్షన్లు తదితర అంశాలపై ప్రధానంగా దృష్టి సారించారు. ఎఫ్ఐఆర్ కాపీలు, కేసు ఫైళ్లు, దాడుల వీడియో రికార్డింగులను పరిశీలించారు. దాడుల తీవ్రతను అంచనా వేసి, ఆ మేరకు తగిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారా.. లేక తూతూ మంత్రంగా కేసులు నమోదు చేసి చేతులు దులిపేసుకున్నారా.. అనే కోణాల్లో కూడా విచారణ కొనసాగిస్తున్నారు. దాదాపు అన్నీ నాన్ బెయిలబుల్ సెక్షన్లే ఆయా జిల్లాల్లో జరిగిన దాదాపు అన్ని సంఘటనల్లోనూ హత్యాయత్నం, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల ధ్వంసం, ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించడం తదితర నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు సిట్ బృందాలు గుర్తించినట్టు సమాచారం. 144 సెక్షన్ అమలులో ఉన్నా సరే అంత మంది ఎలా గుమిగూడగలిగారు? మాచర్ల నియోజకవర్గంలో పక్కా పన్నాగంతో దారి కాచి మరీ ఎలా దాడులు చేయగలిగారు? ఎలా వెంటపడి తరమగలిగారు? తాడిపత్రిలో వందలాది మంది ఒకేసారి వచ్చి ఎలా రాళ్ల దాడి చేయగలిగారు..? అనే కోణాల్లో సిట్ అధికారులు విచారిస్తున్నట్టు సమాచారం. సత్తెనపల్లి, గురజాల నియోజకవర్గాల్లో దాడుల బాధితులు రాత్రంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గుడిలో ఆశ్రయం పొందాల్సినంత పరిస్థితి ఎందుకు ఏర్పడింది.. దీనిపై పోలీసులకు సమాచారం ఉందా లేదా.. పోలీసులు ఆ బాధితులకు అండగా నిలబడేందుకు వెంటనే గుడి వద్దకు ఎందుకు వెళ్లలేకపోయారు.. అనే కోణాల్లో సిట్ అధికారులు విచారిస్తున్నట్టు తెలుస్తోంది. సమస్యాత్మక, అతి సమస్యాత్మకంగా గుర్తించిన పోలింగ్ కేంద్రాల వద్ద ఈసీ మార్గదర్శకాల మేరకు బందోబస్తుపై సిట్ అధికారులు సమీక్షించారు. ఆ కేంద్రాల వద్ద తగినంతగా కేంద్ర బలగాలను మోహరించలేదనే విషయాన్ని సిట్ అధికారులు గుర్తించినట్టు సమాచారం. కాగా, ఎన్నికల సందర్భంగా హింసాత్మక సంఘటనలు జరగకుండా ఉండేందుకు ముందుగానే నేర చరిత్ర కలిగిన వారిపై చేపట్టిన చర్యల గురించి సిట్ అధికారులు ప్రశి్నంచినట్లు తెలుస్తోంది. పీడీ యాక్ట్ కింద కేసుల నమోదులో నిర్లక్ష్యంగా వ్యవహరించారా.. అనే కోణంలోనూ విచారిస్తున్నారు. దాడులు అరికట్టడంలో వైఫల్యం చెందారని ఈసీ సస్పెండ్ చేసిన, బదిలీ చేసిన అధికారులను కూడా సిట్ అధికారులు ప్రశి్నంచనున్నారు. వారి వివరణను కూడా నమోదు చేస్తారు. ఈసీ బదిలీ చేసినా ఆయనదే పెత్తనమా!? హింసాత్మక సంఘటనలను కట్టడి చేయడంలో విఫలమయ్యారని ఈసీ బదిలీ చేసిన కొందరు ఉన్నతాధికారులు ఇంకా ఆ జిల్లాలో ప్రభావం చూపిస్తుండటం విస్మయ పరుస్తోంది. అనంతపురం జిల్లాల్లో ఈసీ సస్పెండ్ చేసిన ఓ అధికారే ప్రస్తుతం సిట్ దర్యాప్తు కోసం సమరి్పంచిన రికార్డుల వ్యవహారాలను పర్యవేక్షిస్తుండటం గమనార్హం. పోలీసు రికార్డుల విభాగంలో అత్యంత వివాదాస్పద డీఎస్పీ స్థాయి అధికారి అందుకు సహకరిస్తుండటం పోలీసు శాఖలో చర్చనీయాంశమైంది. దాడులను అరికట్టడంలో ఎవరైతే విఫలమయ్యారని ఈసీ భావించిందో.. ఆ అధికారి కనుసన్నల్లోనే సిట్ పరిశీలనకు అవసరమైన రికార్డులు సమర్పిస్తే పారదర్శకత, నిష్పాక్షికత ఎక్కడ ఉంటుందని అధికార వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. తాడిపత్రిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసంపై పోలీసులే దాడి చేయడం, ఆస్తులను ధ్వంసం చేయడం, వైఎస్సార్సీపీ కార్యకర్తలపై విచక్షణారహితంగా విరుచుకుపడటం గమనార్హం. దీన్ని ఈసీ తీవ్రంగా పరిగణించి, అందుకు బాధ్యులైన అధికారిని బదిలీ చేసి.. సిట్ విచారణకు ఆదేశించింది. కాగా ఆ అధికారే సిట్ దర్యాప్తునకు అవసరమైన రికార్డులను పరోక్షంగా రూపొందిస్తుండటం విభ్రాంతి కలిగిస్తోంది. మరి దీనిపై సిట్, ఈసీ ఎలా స్పందిస్తాయన్నది చూడాలి. ఇదిలా ఉండగా సిట్ అధికారులు ఆదివారం తిరుపతిలో పర్యటించనున్నారు. అల్లర్లు సంభవించిన ప్రాంతాల్లో పర్యటిస్తారు. దాడులు చెలరేగినప్పుడు పోలీసులు తీసుకున్న చర్యలను సమీక్షిస్తారు. రేపు ప్రాథమిక నివేదిక ఇంతటి సున్నితమైన అంశంపై కేవలం రెండు రోజుల్లోనే ప్రాథమిక నివేదిక సమరి్పంచాలని ఈసీ ఆదేశించడంతో సిట్కు సమయం చాలా తక్కువగా ఉంది. దాంతో సోమవారం ఉదయం తొలుత ప్రాథమిక నివేదికను ఈసీకి సమర్పించాలని భావిస్తోంది. దాడులు జరిగిన తీరు, వాటిపై పోలీసులు తీసుకున్న చర్యల గురించి ఈ ప్రాథమిక నివేదికలో పొందు పరచనుంది. పూర్తి స్థాయిలో విచారణకు మరింత సమయం కావాలని కోరే అవకాశాలున్నాయి. సిట్ ప్రాథమిక నివేదిక పరిశీలించిన అనంతరం ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఎన్ని కేసులు.. ఎంత మంది అరెస్ట్?ఏసీబీ అదనపు ఎస్పీ సౌమ్యలత ఆధ్వర్యంలోని సిట్ బృందం శనివారం నరసరావుపేటలో పర్యటించింది. మధ్యాహ్నం మూడు గంటలకు నరసరావుపేట చేరుకున్న బృందం నేరుగా టూ టౌన్ పోలీసు స్టేషన్ను సందర్శించింది. ఆ స్టేషన్ పరి«దిలో నమోదైన ఐదు కేసుల వివరాలను అధికారులు పరిశీలించారు. సీఐ భాస్కర్తో చర్చించారు. ఎవరెవరిపై కేసులు నమోదు చేశారు.. ఎవరిని అరెస్టు చేశారు.. దర్యాప్తు ఎంతవరకు వచి్చంది.. అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గృహంపై దాడిచేసి ఇద్దరిని గాయపర్చి మూడుకార్లు ధ్వంసంపై నమోదైన కేసు, బాలికోన్నత పాఠశాలలో ఏజెంట్లుగా కూర్చున్న వైఎస్సార్సీపీ నాయకులు గంటెనపాటి గాబ్రియేలు, గోపిరెడ్డి డ్రైవర్ హరిపై టీడీపీ అభ్యర్థి అరవిందబాబు, అతని అనుచరులు చేసిన దాడి కేసు, అరవిందబాబు కారుపై జరిగిన దాడి కేసు, మల్లమ్మసెంటర్లో బొలేరో వాహనాన్ని తగులపెట్టిన కేసు, రూరల్ పోలీసుస్టేషన్ పరిధిలో పమిడిపాడు, దొండపాడు గ్రామాల్లో జరిగిన సంఘటనలపై నమోదైన కేసుల వివరాలను ఆయా స్టేషన్ పోలీసుల నుంచి సేకరించారు. రబ్బరు బుల్లెట్లతో ఎందుకు ఫైరింగ్ చేయాల్సి వచి్చందో వివరణ తీసుకున్నట్లు తెలిసింది. కాగా, ఇద్దరు సిట్ బృందం అధికారులు శనివారం రాత్రి రెంటచింతల పోలీసు స్టేషన్కు వచ్చి రికార్డులను పరిశీలించారు. మండల పరిధిలోని తుమృకోట, రెంటచింతల, పాలువాయిగేటు, రెంటాల, జెట్టిపాలెం గ్రామాలలో చోటుచేసుకున్న పరిణామాల గురించి ఆరా తీశారు. ఆయా ఘటనల్లో నిందితులుగా ఉన్న వారు స్వచ్ఛందంగా లొంగిపోయి, గ్రామాలలో ప్రశాంత వాతావరణానికి సహకరించాలని అడిషనల్ ఎస్పీ రమణమూర్తి కోరారు. సిట్ బృందం తాడిపత్రిలో కూడా విచారించింది. ఏసీబీ డీఎస్పీ వి.శ్రీనివాసరావు, గుంటూరు రేంజ్ ఇన్స్పెక్టర్ వి.భూషణం, ఏసీబీ ఇన్స్పెక్టర్ జీఎల్ శ్రీనివాస్లు తాడిపత్రి పట్టణ పోలీస్స్టేషన్కు చేరుకుని కేసుల గురించి ఆరా తీశారు. డీఐజీ షిమోసీ వాజ్పాయ్తో మాట్లాడిన తర్వాత స్థానిక పోలీసులతో కలసి తాడిపత్రిలో అల్లర్లు జరిగిన ఓంశాంతి నగర్, టీడీపీ నేత సూర్యముని నివాసం, జూనియర్ కళాశాల మైదానం, ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసం, మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి నివాసం తదితర ప్రాంతాలను పరిశీలించారు. -
అల్లర్లపై రంగంలోకి దిగిన సిట్
-
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
బెంగళూరు: లైంగిక వేధింపుల కేసులో కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. అసభ్య వీడియోలు సోషల్ మీడియాలో వైరలైన అనంతరం ఆయన దేశం వదిలి జర్మనీ వెళ్లిపోయారు. ఇప్పటికే లైంగిక వేధింపుల కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది.‘ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేశాం. ఇంటర్పోల్ అన్ని దేశాలకు సమాచారం పంపించింది. ప్రజ్వల్ రేవణ్ణ ఎక్కడ ఉన్నా పట్టుకోవాలని ఇంటర్పోల్ ఇతర దేశాల పోలీసులకు ఆదేశించింది’ అని కర్ణాటక హోం మంత్రి జీ. పరమేశ్వర ఆదివారం పేర్కొన్నారు. ప్రజ్వల్ రేవణ్ణను భారత్కు తీసుకురావడానికి సిట్ ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసు పంపాలని సిట్(SIT)సీబీఐకి విజ్ఞప్తి చేసింది.ఇప్పటికే సిట్.. ప్రజ్వల్ రేవణ్ణపై రెండుసార్లు లుక్ అవుట్ నోటీసుల జారీచేసింది. మరోవైపు.. మహిళా కిడ్నాప్ కేసులో ప్రజ్వల్ తండ్రి హెడ్డీ రేవణ్ణను శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఇక.. లోక్సభ ఎన్నికల వేళ ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించినవి వైరల్ అయిన అసభ్యకర వీడియోలు, ప్రజ్వల్, ఆయన తండ్రిపై నమోదైన లైంగిక ఆరోపణల కేసు కన్నడ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది.బ్లూ కార్నర్ నోటీసులు అంటే?బ్లూ కార్నర్ నోటీసు ఇంటర్ పోల్ నోటీసుల్లో ఒక భాగం. ఇది ప్రపంచ వ్యాప్తంగా నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి సమాచారం కోసం ఇతర దేశాలతో హెచ్చరికలు, అభ్యర్థనలకు అనుమతి ఇస్తుంది. ఇతర దేశాల్లోని పోలీసులతో సమన్వయమై.. కీలకమైన నేర సంబంధిత సమాచారాన్ని పంచుకోవడానికి అనుమతి ఇవ్వబడుతుంది. మొత్తం ఏడు రకాల నోటీసులు ఉంటాయి. రెండ్, ఎల్లో, బ్లూ, బ్లాక్, గ్రీన్, ఆరెంజ్, పర్పుల్. నేర దర్యాప్తులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి సంబంధించి అదనపు సమాచారం సేకరించడానికి, వ్యక్తి గుర్తింపు, ఎక్కడ ఉన్నాడో తెలిపే లొకేషన్ వంటి కీలకమైన విషయాలను తెలుసుకోవడానికి ‘బ్లూ కార్నర్’ నోటీసులు జారీ చేస్తారు. -
PrajwalRevannavideo: త్వరలో భారత్కు ప్రజ్వల్ రేవణ్ణ..?
బెంగళూరు: మహిళలపై లైంగిక వేధింపుల వీడియోల వ్యవహారంలో సస్పెండైన జేడీఎస్ ఎంపీ రేవణ్ణ జర్మనీ నుంచి త్వరలో ఇండియా వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మే 3-4 తేదీల మధ్య రేవణ్ణ బెంగళూరుకు చేరుకోవచ్చని కర్ణాటక పోలీసు వర్గాలు చెబుతున్నాయి.లైంగిక వేధింపుల వీడియోల వ్యవహారంలో కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నోటీసులు ఇవ్వడంతో ప్రజ్వల్ భారత్కు రావాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ కేసులో ప్రజ్వల్ తండ్రి ఎమ్మెల్యే హెచ్డి రేవణ్ణకు కూడా సిట్ నోటీసులు ఇచ్చింది. కాగా, ప్రజ్వల్ రేవణ్ణ పలువురు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన వీడియోలు గత వారం హసన్ ప్రాంతంలో వైరల్ అయ్యాయి. మొత్తం 2,976 వీడియోలున్న పెన్డ్రైవ్ బయటపడడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలన్నీ 2019-2022 మధ్య బెంగళూరు, హసన్లలోని రేవణ్ణ నివాసాలలో చిత్రీకరించినవనిప్రాథమికంగా తేలింది. తనపై ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఒక మహిళ చేసిన ఫిర్యాదుతో అతడిపై ఐపీసీలోని పలు సెక్షన్ల కిందపోలీసులు కేసు నమోదు చేశారు.లైంగిక వేధింపుల వీడియోలు వెలుగు చూసి వివాదం పెద్దదైన నేపథ్యంలో రేవణ్ణ ఏప్రిల్ 27న బెంగళూరు నుంచి జర్మనీ వెళ్లిపోయాడు. కాగా, రేవణ్ణ జేడీఎస్ తరపున హసన్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీలో ఉన్నారు. ఇక్కడ ఏప్రిల్ 26న లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మరో ఇద్దరి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మాజీ టాస్క్ఫోర్స్ డీసీపీ రాధాకిషన్రావు, ఎన్స్పెక్టర్ గట్టు మల్లును అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వీరిని గురువారం హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ అధికారులు విచారిస్తున్నారు. ప్రభాకర్ రావు, ప్రణీత్ రావుతో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. కాగా ప్రణీత్రావుపై కేసు నమోదుకాగానే రాధాకిషన్రావు అమెరికా వెళ్లిపోయారు. లుకౌట్ నోటీసులు జారీ చేయడంతో హైదరాబాద్కు తిరిగివచ్చారు. ప్రణీత్ రావు డ్రైవర్ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభాకర్రావుతో సమానంగా రాధాకిషన్ ట్యాపింగ్కు పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేయడంతో రాధాకిషన్ గట్టుమల్లు కీలకపాత్ర వహించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే ప్రణీత్రావుతో పాటు అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రముఖుల వ్యక్తిగత విషయాలపై వీరు నిఘా పెట్టి, ప్రభుత్వం మారాక హార్డ్డిస్క్లను ధ్వంసం చేసినట్లు ఆరోపణలున్నాయి. మరో వైపు భుజంగరావు, తిరుపతన్నను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్పై నాంపల్లి కోర్టులో బుధవారం వాదనలు ముగియగా.. న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. చదవండి: ఎస్ఐబీలో నడిచిన ఓఎస్డీల రాజ్యం.. -
Adani-Hindenburg case: ‘అదానీ’కి భారీ ఊరట
న్యూఢిల్లీ: ప్రముఖ కార్పొరేట్ సంస్థ ‘అదానీ గ్రూప్’నకు మరో విజయం లభించింది. స్టాక్ ధరల్లో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ సంస్థపై కొనసాగుతున్న దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) లేదా సీబీఐకి అప్పగించేందుకు సుప్రీంకోర్టు బుధవారం నిరాకరించింది. అదానీ గ్రూప్పై మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా(సెబీ) కొనసాగిస్తున్న దర్యాప్తు పట్ల న్యాయస్థానం సంతృప్తి వ్యక్తం చేసింది. సెబీ సమగ్ర దర్యాప్తు జరుపుతోందని వెల్లడించింది. ఈ దశలో సెబీ దర్యాప్తుపై జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. దర్యాప్తును సెబీ నుంచి సిట్ లేదా సీబీఐకి బదిలీ చేయాలన్న వాదనలో అర్థం లేదని కొట్టిపారేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్దీవాలా, మనోజ్ మిశ్రాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం 46 పేజీల తీర్పు వెలువరించింది. అదానీ గ్రూప్పై పెండింగ్లో ఉన్న రెండు దర్యాప్తులను 3 నెలల్లోగా పూర్తి చేయాలని సెబీని ఆదేశించింది. సెబీ దర్యాప్తును అనుమానించలేం అదానీ గ్రూప్ తన లిస్టెడ్ కంపెనీల షేర్ల ధరలను కృత్రిమంగా పెంచిందని, మదుపర్లను మోసగించిందని ఆరోపిస్తూ అదానీ–హిండెన్బర్గ్ రీసెర్చ్ సంస్థ వివాదం తర్వాత సుప్రీంకోర్టులో నాలుగు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. న్యాయవాదులు విశాల్ తివారీ, ఎంఎల్ శర్మ, కాంగ్రెస్ నేత జయ ఠాకూర్, అనామికా జైశ్వాల్ ఈ పిటిషన్లు దాఖలు చేశారు. అదానీ గ్రూప్ వ్యవహారంపై హిండెన్బర్గ్ నివేదిక వచి్చన తర్వాత ఆ కంపెనీ షేర్లు భారీగా పతనమయ్యాయని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. సెబీ చట్టంలో చేసిన మార్పుల కారణంగా అదానీ గ్రూప్ అవకతవకలు బయటపడడం లేదని పిటిషనర్లు ఆరోపించారు. సెబీని పటిష్టం చేయాలని కోరారు. ఈ నాలుగు పిటిషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. పత్రికల్లో వచి్చన వార్తలు లేదా ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్టు(ఓసీసీఆర్పీ) వంటి థర్డ్ పార్టీ సంస్థల నివేదికల ఆధారంగా సెబీ దర్యాప్తును అనుమానించలేమని స్పష్టం చేసింది. అలాంటి నివేదికలను కేవలం ఇన్పుట్స్గా పరిగణించవచ్చని అభిప్రాయపడింది. సెబీ దర్యాప్తును అనుమానించడానికి అలాంటివి ఆధారాలుగా ఉపయోగపడవని పేర్కొంది. చట్టబద్ధమైన సంస్థ అయిన సెబీ కొనసాగిస్తున్న దర్యాప్తును మరో సంస్థకు బదిలీ చేసే అధికారం కోర్టుకు లేదని పేర్కొన్నారు. అసాధారణ పరిస్థితుల్లోనే మాత్రమే అలా బదిలీ చేయగలమని తేలి్చచెప్పింది. నిర్ధారణ కాని సమాచారంపై ఆధారపడొద్దు అదానీపై గ్రూప్పై 24 ఆరోపణలు రాగా, సెబీ ఇప్పటికే 22 ఆరోపణలపై దర్యాప్తు పూర్తి చేసిందని సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది. అదానీ గ్రూప్పై ఆరోపణలు చేయడానికి, కోర్టుకెక్కడానికి నిర్ధారణ కాని సమాచారంపై పిటిషనర్లు ఆధారపడినట్లు తెలుస్తోందని వెల్లడించింది. వారు తగిన పరిశోధన కూడా చేయకుండానే కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారని ఆక్షేపించింది. ఇకపై ఇలాంటివి పునరావృతం కాకూడదని సూచించింది. న్యాయవాదులు గానీ, పౌర సమాజం సభ్యులు గానీ అప్రమత్తంగా ఉండాలని, నిర్ధారణ కాని సమాచారం లేదా థర్డ్పార్టీ నివేదికల ఆధారంగా ఇష్టారాజ్యంగా పిటిషన్లు వేయడం సరైంది కాదని తేలి్చచెప్పింది. ఇదిలా ఉండగా, సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సానుకూల సంకేతాలు రావడంతో బుధవారం స్టాక్ మార్కెట్లో అదానీ గ్రూప్లోని నమోదిత కంపెనీల షేర్ల ధరలు పైకి ఎగబాకాయి. అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, ఎన్డీటీవీ, అదానీ టోటల్ గ్యాస్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ విల్మార్, అదానీ పవర్, అదానీ పోర్ట్స్, అంబుజా సిమెంట్స్ వంటి సంస్థల షేర్ల ధరలు గణనీయంగా పెరిగాయి. సత్యమేవ జయతే: గౌతమ్ అదానీ సుప్రీంకోర్టు తీర్పుపై అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ స్పందించారు. సత్యమే జయిస్తుందన్న నిజాన్ని ఈ తీర్పు మరోసారి నిరూపించిందని అన్నారు. భారతదేశ ప్రగతి చరిత్రలో తమ వంతు పాత్ర పోషిస్తూనే ఉంటామని చెప్పారు. ప్రతికూల సమయంలో తమకు అండగా నిలిచినవారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ‘సత్యమేవ జయతే’ అంటూ గౌతమ్ అదానీ బుధవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. -
అసైన్డ్ భూములు కొట్టేసేందుకు.. ‘నల్ల’మార్గం
సాక్షి, అమరావతి: అమరావతిలో అసైన్డ్ భూముల కుంభకోణం కేసు తీగ లాగితే నారా, నారాయణ నల్లధనం నెట్వర్క్ బట్టబయలైంది. అమరావతిలోని బడుగు, బలహీనవర్గాల అసైన్డ్ రైతులను బెదిరించి వారి భూములు కొల్లగొట్టడం కోసం నల్లధనం తరలించేందుకు చంద్రబాబు ముఠా పన్నిన పన్నాగం బయటపడింది. బంధువులు, బినామీలు, సన్నిహితులు, తమ ఉద్యోగుల పేరిట అసైన్డ్ భూములు హస్తగతం చేసుకునేందుకు వెచ్చించిన నల్లధనం గుట్టు రట్టయింది. అమరావతిలో అసైన్డ్ భూముల కుంభకోణం కేసు దర్యాప్తు చేస్తున్న సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఆ నల్లధనం నెట్వర్క్ను ఛేదించింది. అసైన్డ్ భూముల జాబితాలోని కేటగిరీ 1 నుంచి 4 వరకు ఉన్న 617.65 ఎకరాలను కొట్టేసేందుకు ఏర్పాటు చేసుకున్న ‘నల్ల’మార్గాన్ని ఆధారాలతోసహా బట్టబయలు చేసింది. బినామీల పేరిట అసైన్డ్ భూములు కొల్లగొట్టిన ముఠా జాబితా తవ్వుతుంటే.. చంద్రబాబు, లోకేశ్, నారాయణ, గంటా, ప్రత్తిపాటి, దేవినేని ఉమా ఇలా టీడీపీ పెద్దల పేర్లు బయటపడుతున్నాయి. నల్లధనం కోసం కంపెనీ ఏర్పాటు నారాయణ విద్యా సంస్థలకు మౌలిక వసతుల కల్పన, ఉద్యోగుల జీతాల చెల్లింపు కోసమని ‘ఎన్స్పైర మేనేజ్మెంట్ సర్వీసెస్’ అనే కంపెనీని ఏర్పాటు చేశారు. అసైన్డ్ భూములు కొల్లగొట్టడం కోసమే నారాయణ కుమార్తె సింధూర, అల్లుడు పునీత్ డైరెక్టర్లుగా ఎన్స్పైర కంపెనీని నెలకొల్పారు. నారాయణ విద్యా సంస్థలకు అన్ని రకాల చెల్లింపులు నిర్వహిస్తున్నందుకు ఎన్స్పైరకు 10 శాతం కమిషన్ చెల్లిస్తున్నట్లు రికార్డుల్లో చూపారు. ఇదే అవకాశంగా ఎన్స్పైరలోకి ఇతర సంస్థల నుంచి భారీగా నిధులు మళ్లించారు. ఎన్స్పైరలో ఇతర కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టినట్లు చూపడం గమనార్హం. ఒలంపస్ క్యాపిటల్ ఏషియా క్రెడిట్ అండ్ సీఎక్స్ పార్టనర్స్ మ్యాగజైన్ అనే కంపెనీ 2016లో ఏకంగా రూ. 400 కోట్లు పెట్టుబడి పెట్టినట్టు చూపించారు. ఇక 2018లో మోర్గాన్ స్టాన్లీ ప్రైవేట్ ఈక్విటీ ఏషియా, బన్యాన్ ట్రీ గ్రోత్ క్యాపిటల్ అనే సంస్థలు 75 మిలియన్ డాలర్లు (రూ. 613.27 కోట్లు) పెట్టుబడి పెట్టినట్టు రికార్డుల్లో చూపారు. దీంతో రెండు విడతల్లో ఎన్స్పైర కంపెనీలోకి రూ.1,013.27 కోట్లు వచ్చి చేరాయి. ఇలా భారీగా నల్లధనాన్ని ఎన్స్పైరలోకి మళ్లించినట్లు తెలుస్తోంది. ఎన్స్పైర టు రామకృష్ణ హౌసింగ్ నారాయణ సమీప బంధువు కేవీపీ అంజని కుమార్ రంగంలోకి వచ్చారు. ఆయన మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ను నల్లధనం తరలింపునకు మార్గంగా చేసుకున్నారు. అక్రమ నిధులను ఎన్స్పైర నుంచి రామకృష్ణ హౌసింగ్ కార్పొరేషన్ బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేశారు. అప్పటికే నారాయణ విద్యా సంస్థల సిబ్బంది, మరికొందరిని తమ బినామీలుగా ఎంపిక చేసుకున్నారు. రామకృష్ణ హౌసింగ్ బ్యాంకు ఖాతాల నుంచి ఆ బినామీల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లోకి నిధులను మళ్లించారు. వారు ఆ నగదు డ్రా చేసుకున్నారు. ప్రభుత్వం ఎలాంటి పరిహారం ఇవ్వకుండా అసైన్డ్ భూములను తీసుకుంటుందని బడుగు, బలహీనవర్గాల రైతులను అప్పటికే భయపెట్టారు. తద్వారా ఆ రైతుల అసైన్డ్ భూములను తమ బినామీలైన ఉద్యోగులు, ఇతరులకు అతి తక్కువకు విక్రయించేలా కథ నడిపించారు. నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్ భూములు తమ బినామీల ద్వారా హస్తగతం చేసుకున్నారు. తర్వాత బినామీలే సీఆర్డీఏకు ఆ భూములను ఇచ్చినట్టు చూపించి వారికే భూసమీకరణ ప్యాకేజీ వచ్చేలా చేశారు. ఆ విధంగా 617.65 ఎకరాలకు గాను రూ. 3,737 కోట్ల విలువైన భూసమీకరణ ప్యాకేజీ స్థలాలను పొందారు. జీపీఏ, సేల్డీడ్ల ద్వారా హస్తగతం కేటగిరీ 1 నుంచి 4 వరకు 617.65 ఎకరాలకు సంబంధించి రెవెన్యూ రికార్డుల్లో ఉన్న అసైన్డ్ రైతుల జాబితా, సీఆర్డీఏ రికార్డుల్లో ఉన్న రైతుల పేర్లను పరిశీలిస్తే అక్రమాల బాగోతం బయటపడుతోంది. ఈ జాబితాలో చంద్రబాబు, నారాయణ, గంటా శ్రీనివాసరావు, వారి సన్నిహితులు, బంధువులు, బినామీలే బయటపడుతున్నారు. అమరావతి పరిధిలోని అనంతవరం, కృష్ణాయపాలెం, కురగల్లు, లింగాయపాలెం, మందడం, నెక్కల్లు, నవులూరు, రాయపూడి, తుళ్లూరు, ఉద్దండరాయునిపాలెం, వెంకటపాలెం, బోరుపాలెం, నేలపాడు తదితర గ్రామాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులకు చెందిన 617.65 ఎకరాల అసైన్డ్ భూములను జీపీఏ, సేల్ డీడ్లు ద్వారా హస్తగతం చేసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతుల నుంచి అసైన్డ్ భూములను బినామీల ద్వారా కొల్లగొట్టిన టీడీపీ పెద్దలు ♦ నారా చంద్రబాబునాయుడు (టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి) ♦ నారా లోకేశ్ (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) ♦ పొంగూరు నారాయణ (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) ♦ గంటా శ్రీనివాసరావు (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) ♦ దేవినేని ఉమామహేశ్వరరావు (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) ♦ ప్రత్తిపాటి పుల్లారావు (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) ♦ రావెల కిశోర్ బాబు (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) ♦ తెనాలి శ్రావణ్ కుమార్ (టీడీపీ మాజీ ఎమ్మెల్యే) ♦ గుమ్మడి సురేశ్ (టీడీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు వియ్యంకుడు) ♦ మండల ఎస్.ఎస్.కోటేశ్వరరావు (రియల్టర్) ♦ మండల రాజేంద్ర (రియల్టర్) ♦ కేవీపీ అంజనీ కుమార్ (రియల్టర్) ♦ దేవినేని రమేశ్ (రియల్టర్) ♦ బొబ్బ హరిశ్చంద్ర ప్రసాద్ (రియల్టర్) ♦ హరేంద్రనాథ్ చౌదరి (రియల్టర్) ♦ పొట్లూరి సాయిబాబు (సిటీ కేబుల్) ♦ దోనేపూడి దుర్గా ప్రసాద్ (రియల్టర్) రూ.16 కోట్లతో.. రూ. 816 కోట్లు కొట్టేసిన నారాయణ రాజధానిలో నారాయణ బంధువులు, బినామీల పేరిట 148 ఎకరాలు ఉన్నట్టుగా సిట్ దర్యాప్తులో వెల్లడైంది. అందుకోసం నారాయణ రూ.16.50 కోట్లను అక్రమంగా తరలించారు. అందుకు ప్రతిగా 148 ఎకరాలను పొందారు. ఆ 148 ఎకరాలకు సీఆర్డీఏ భూసమీకరణ కింద ఇచ్చింది రూ.816 కోట్లు విలువైన స్థలాల ప్యాకేజీ. ఆ భూములకు పదేళ్లపాటు కౌలు కూడా పొందగలుగుతారు. బినామీ రైతులకు సీఆర్డీఏ ఇప్పటికే చెల్లించిన కౌలు మొత్తం రూ. 50 లక్షలు మళ్లీ రామకృష్ణ హౌసింగ్ బ్యాంకు ఖాతాలో జమ చేశారు. అక్కడ నుంచి ఆ మొత్తాన్ని మళ్లీ నారాయణ విద్యా సంస్థల బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేయడం గమనార్హం. అంటే అసైన్డ్ భూములు దక్కించుకుంది నారాయణే అన్నది స్పష్టమైంది. అదే రీతిలో చంద్రబాబు, గంటా, ప్రత్తిపాటి, దేవినేని ఉమా, ఇతర టీడీపీ పెద్దలు, వారి బంధువులు బినామీల ద్వారా 617 ఎకరాల్లో ఎంత భారీ దోపిడీకి పాల్పడ్డారో స్పష్టమవుతుంది. -
‘రింగ్’ అంతా లోకేశ్దే
సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) అలైన్మెంట్ ఖరారు పేరిట జరిగిన భూ దోపిడీలో నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కుమారుడు లోకేశ్ కీలక పాత్ర పోషించినట్లు సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వెల్లడించింది. ఈమేరకు ఈ కేసులో లోకేశ్ను ఏ–14గా చేర్చినట్లు న్యాయస్థానానికి సమర్పించిన మెమోలో పేర్కొంది. ఐఆర్ఆర్ అలైన్మెంట్ పేరిట చంద్రబాబు, లోకేశ్ క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారని, తద్వారా తమ కుటుంబానికే చెందిన హెరిటేజ్ ఫుడ్స్కు, లింగమనేని కుటుంబానికి చెందిన భూముల విలువ అమాంతం పెరిగేలా అక్రమాలకు పాల్పడ్డారని నిర్ధారించింది. 129 ఆధారాలతో దొరికిన లోకేశ్ ఐఆర్ఆర్ అలైన్మెంట్ మార్పుల ద్వారా భారీ అక్రమాలకు పాల్పడిన కేసులో సిట్ అధికారులు లోకేశ్ పాత్రకు సంబంధించి కీలకమైన 129 ఆధారాలను గుర్తించి, జప్తు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వాటిలో సీఆర్డీఏ, మున్సిపల్, రెవెన్యూ శాఖలకు చెందిన కీలక పత్రాలు, ఈమెయిల్ సందేశాలు, మ్యాపులతోపాటు మరికొన్ని కీలక ఆధారాలు ఉన్నాయి. అంతేకాదు.. టీడీపీ ప్రభుత్వంలో పని చేసిన అధికారులు, ప్రైవేటు ఏజెన్సీల ప్రతినిధుల వాంగ్మూలాలను కూడా సిట్ అధికారులు నమోదు చేశారు. వారిలో కొందరు కీలక అధికారులు సంబంధిత నోట్ ఫైళ్లలో తాము లిఖితపూర్వకంగా తెలిపిన అభ్యంతరాలను బేఖాతరు చేసి మరీ ఐఆర్ఆర్ అలైన్మెంట్ను ఖరారు చేశారని పేర్కొనడం గమనార్హం. ఐఆర్ఆర్ అలైన్మెంట్లో కీలక పాత్ర పోషించిన ప్రైవేటు ఏజెన్సీలు కూడా ఇదే విషయాన్ని తెలిపాయి. నిబంధనలకు విరద్ధంగానే ఐఆర్ఆర్ ఎలైన్మెంట్ను నిర్ధారించారని సిట్ అధికారులకు ఈమెయిళ్లు పంపాయి. ఐఆర్ఆర్ అలైన్మెంట్ కోసం నిర్వహించిన సర్వే నివేదికను కూడా సిట్ అధికారులు జప్తు చేశారు. వీటన్నింటిలో లోకేశ్దే కీలక పాత్ర అని సిట్ సేకరించిన ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. లింగమనేనితో క్విడ్ ప్రోకో.. హెరిటేజ్కు భూములు టీడీపీ ప్రభుత్వంలో సీఎంగా ఉన్న చంద్రబాబు అధికారిక నివాసంలోనే లోకేశ్ కూడా నివసించారు. రాజధాని ఎక్కడ నిరి్మస్తారన్నది ముందుగానే తెలియడంతో తాడేపల్లి, తుళ్లూరు, మంగళగిరి మండలాల్లో ముందుగానే భూముల కొనుగోలు పేరిట దక్కించుకున్నారు. ఇక లింగమనేని రమేశ్ కుటుంబంతో క్విడ్ప్రోకోకు పాల్పడ్డారు. అందులో భాగంగా అమరావతిలో భూములు పొందారు. 2014 జులై 1న 7.21 ఎకరాలను కొనుగోలు చేస్తూ హెరిటేజ్ ఫుడ్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో తీర్మానం చేశారు. అనంతరం 2014 జులై 7న ఆ భూములు రిజి్రస్టేషన్ చేయించారు. అనంతరం లింగమనేని రమేశ్ కుటుంబ సభ్యుల నుంచి 4.55 ఎకరాలు కొనుగోలు పేరిట దక్కించుకున్నారు. ఆ విషయం బయటకు పొక్కడంతో ఆ 4.55 ఎకరాలకు సేల్ అగ్రిమెంట్ను రద్దు చేసుకున్నారు. అనంతరం అధికారులపై ఒత్తిడి తెచ్చి లింగమనేని, హెరిటేజ్ ఫుడ్స్ భూములకు దూరంగా వెళుతున్న ఐఆర్ఆర్ అలైన్మెంట్ను మార్పించారు. లింగమనేని రమేశ్ కుటుంబానికి చెందిన 355 ఎకరాలు, హెరిటేజ్ ఫుడ్స్ భూములను ఆనుకొని ఐఆర్ఆర్ వెళ్లేలా అలైన్మెంట్ను ఖరారు చేశారు. దాంతోపాటు చంద్రబాబు బినామీల పేరిట భారీగా కొల్లగొట్టిన భూములు, ఆయన ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నారాయణ కుటుంబ సభ్యులు, బినామీల పేరిట కొల్లగొట్టిన 148 ఎకరాల విలువ అమాంతంగా పెరిగేలా కుట్రకు పాల్పడ్డారు. క్విడ్ప్రోకో కింద లింగమనేని రమేశ్ కృష్ణా నది కరకట్ట మీద ఉన్న బంగ్లాను చంద్రబాబుకు ఇచ్చారు. ఈ వివరాలన్నింటినీ పేర్కొంటూ సిట్ అధికారులు సమగ్రంగా దర్యాప్తు నిర్వహించి పూర్తి ఆధారాలతో న్యాయస్థానంలో మెమో దాఖలు చేశారు. దాంతో ఈ కేసులో తదుపరి పరిణామాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. హెరిటేజ్ అంటేనే నారా కుటుంబం హెరిటేజ్ ఫుడ్స్ అంటే నారా చంద్రబాబు కుటుంబం.. చంద్రబాబు కుటుంబం అంటే హెరిటేజ్ ఫుడ్స్ అనేది బహిరంగ రహస్యం. అందుకే చంద్రబాబు సీఎంగా ఉన్న కాలంలో హెరిటేజ్ ఫుడ్స్కు అనేక ప్రయోజనాలు కలిగించారు. ఐఆర్ఆర్ అలైన్మెంట్ మార్చడం ద్వారా హెరిటేజ్ ఫుడ్స్కు అడ్డగోలుగా కల్పించిన ప్రయోజనం పెద్ద కుంభకోణమే. అందుకే ఈ కేసులో హెరిటేజ్ ఫుడ్స్ను ఏ–6గా సీఐడీ పేర్కొంది. ఈ కేసులో ఏ–1 చంద్రబాబు సతీమణి అయిన నారా భువనేశ్వరి హెరిటేజ్ ఫుడ్స్కు వైస్ చైర్పర్సన్, ఎండీగా ఉండగా, ఏ–14గా ఉన్న లోకేశ్ భార్య బ్రాహ్మణి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ)గా ఉన్నారు. వారి ద్వారా హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీ వ్యవహారాలను పూర్తిగా చంద్రబాబు, లోకేశే నిర్వహిస్తున్నారు. 56 శాతానికిపైగా షేర్లు ఉండటంతో ఆ సంస్థ డైరెక్టర్ల బోర్డు అంతా ఆ కుటుంబం ఆధిపత్యంలోనే ఉంది. 23,66,400 షేర్లతో 10.20 శాతం వాటా లోకేశ్ పేరునే ఉంది. ఇక హెరిటేజ్ ఫుడ్స్ వైస్ చైర్పర్సన్ నారా భువనేశ్వరి 53,30,826 షేర్లతో 22.98 శాతం వాటా కలిగి ఉన్నారు. లోకేశ్ భార్య బ్రాహ్మణి పేరిట 1,01,00 షేర్లు, నందమూరి బాలకృష్ణ పేరిట 6,820 షేర్లు ఉన్నాయి. వారి సమీప బంధువులు వి.గంగరాజు నాయుడుకు 0.25 శాతం, ఆయన భార్య వి.సుధా శారదకు 5.28 శాతం, మెగాడిడ్ కంపెనీకి 5.28 శాతం, నిర్వాణ హోల్డింగ్స్కు 11.09 శాతం వాటా ఉన్నాయి. సంస్థ డైరెక్టర్ల బోర్డులో సభ్యులుగా ఉన్న నారా భువనేశ్వరి, బ్రాహ్మణి, తుమ్మల వెంకటేశ్వరరావు మెగాడిడ్, నిర్వాణ హోల్డింగ్స్లోనూ డైరెక్టర్లుగా ఉండటం గమనార్హం. ఇలా హెరిటేజ్ ఫుడ్స్ మొత్తం చంద్రబాబు కుటుంబం చేతిలోనే ఉంది. -
చంద్రబాబు ఏ–1.. లోకేశ్ ఏ–14
సాక్షి, అమరావతి: మాజీ సీఎం చంద్రబాబు సహకార డెయిరీలను దెబ్బతీసి తమ కుటుంబ సంస్థ హెరిటేజ్ ఫుడ్స్ వ్యాపారం, ఆస్తులను అమాంతం పెంచగా ఆయన తనయుడు లోకేశ్ రాజధానిలో ఇన్నర్ రింగ్ రోడ్డు(ఐఆర్ఆర్) అలైన్మెంట్ ఖరారులో అక్రమాలతో హెరిటేజ్ ఫుడ్స్ కోసం భూములను కొల్లగొట్టారు. తమ బినామీ, సన్నిహితుడు లింగమనేని రమేశ్ కుటుంబంతో క్విడ్ప్రోకోకు పాల్పడి భారీ భూదోపిడీకి తెగబడటంలో చంద్రబాబు, లోకేశ్ చక్కటి సమన్వయం కనబరిచారు. క్విడ్ ప్రోకో కింద చంద్రబాబు కరకట్ట నివాసాన్ని తీసుకోగా హెరిటేజ్ ఫుడ్స్ డైరెక్టర్ హోదాలో లోకేశ్ భూములను కొల్లగొట్టారు. ఈ అవినీతి భూబాగోతాన్ని సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఆధారాలతో సహా బట్టబయలు చేసింది. క్విడ్ ప్రోకో కింద చంద్రబాబు పొందిన కరకట్ట నివాసాన్ని, నారాయణ కుటుంబ సభ్యులు సీడ్ క్యాపిటల్లో పొందిన 75,888 చ.గజాల ప్లాట్లు, కౌలు మొత్తంగా పొందిన రూ.1.92 కోట్లను అటాచ్ చేయాలని ఇప్పటికే నిర్ణయించింది. ఈమేరకు న్యాయస్థానంలో పిటిషన్ కూడా దాఖలు చేసింది. ఈ కేసులో ఇప్పటికే ఏ–1గా చంద్రబాబు, ఏ–2గా నారాయణను పేర్కొన్న సిట్ నారా లోకేశ్ను ఏ–14గా పేర్కొంటూ విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానంలో మంగళవారం ప్రత్యేక మెమో దాఖలు చేసింది. లింగమనేని రమేశ్, రాజశేఖర్లతోపాటు హెరిటేజ్ ఫుడ్స్ సంస్థను కూడా ఈ కేసులో నిందితులుగా పేర్కొంది. ఐఆర్ఆర్ అలైన్మెంట్లో అవినీతి మెలికలు.. అమరావతి ముసుగులో చంద్రబాబు సాగించిన భారీ భూదందాలో ఐఆర్ఆర్ కుంభకోణం ఓ భాగం! మాజీ మంత్రి పొంగూరు నారాయణతోపాటు లోకేశ్ ఈ కుంభకోణంలో కీలక పాత్ర పోషించారు. చంద్రబాబు తమ బినామీ, సన్నిహితుడైన లింగమనేని రమేష్తో క్విడ్ ప్రోకోకు పాల్పడి ఆయన భూముల విలువను భారీగా పెరిగేలా చేశారు. అందుకు ప్రతిగా బినామీల పేరిట భారీగా భూములను పొందడమే కాకుండా కరకట్ట నివాసంతోపాటు హెరిటేజ్ ఫుడ్స్కు భూములు కానుకగా దక్కించుకున్నారు. నాడు సీఆర్డీఏ అధికారులు రూపొందించిన 94 కి.మీ. అమరావతి ఐఆర్ఆర్ అలైన్మెంట్పై చంద్రబాబు, నారాయణ మండిపడ్డారు. ఆ అలైన్మెంట్ ప్రకారం ఇన్నర్ రింగ్ రోడ్డు అమరావతిలోని పెదపరిమి, నిడమర్రు, చినవడ్లపూడి, పెదవడ్లపూడి మీదుగా వెళ్తుంది. హెరిటేజ్ ఫుడ్స్, లింగమనేని కుటుంబానికి చెందిన భూములకు 3 కి.మీ. దూరం నుంచి దాన్ని నిర్మించాల్సి వస్తుంది. దీంతో తమ భూముల విలువ అమాంతం పెరగదని వారు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వారి ఆదేశాలతో సీఆర్డీయే అధికారులు ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో మార్పులు చేశారు. చంద్రబాబు, లింగమనేని కుటుంబానికి చెందిన వందలాది ఎకరాలున్న తాడికొండ, కంతేరు, కాజాను పరిగణలోకి తీసుకున్నారు. అందుకోసం ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ను 3 కిలోమీటర్లు దక్షిణానికి జరిపారు. హెరిటేజ్ ఫుడ్స్, లింగమనేని కుటుంబానికి కంతేరు, కాజాలో ఉన్న భూములను ఆనుకుని ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మించేలా 97.50 కి.మీ. అలైన్మెంట్ను రూపొందించారు. అయితే ఆ విషయాన్ని గోప్యంగా ఉంచారు. అనంతరం సింగపూర్కు చెందిన సుర్బాన జ్యురాంగ్ కన్సల్టెన్సీని రంగంలోకి తెచ్చి అప్పటికే ఖరారు చేసిన ఇన్నర్ రింగ్ రోడ్ డిజైన్ను అమరావతి మాస్టర్ ప్లాన్లో చేర్చారు. ఎస్టీయూపీ అనే కన్సల్టెన్సీని నియమించి మాస్టర్ ప్లాన్లో పొందుపరిచిన అలైన్మెంట్కు అనుగుణంగా ఉండాలని ఆదేశించారు. అప్పటికే సీఆర్డీయే అధికారుల ద్వారా తాము ఖరారు చేసిన అలైన్మెంట్నే ఎస్టీయూపీ కన్సల్టెన్సీ ద్వారా ఆమోదించేలా చేశారు. ఈ క్రమంలో తాడికొండ, కంతేరు, కాజాలో హెరిటేజ్ ఫుడ్స్, లింగమనేని భూములను ఆనుకుని అలైన్మెంట్ను ఎస్టీయూపీ కన్సల్టెన్సీ ఖరారు చేసింది. హెరిటేజ్ ఫుడ్స్కు భూములు ఐఆర్ఆర్ అలైన్మెంట్ను మెలికలు తిప్పడం ద్వారా లింగమనేని కుటుంబం భూముల విలువను భారీగా పెరిగేలా చేశారు. కంతేరు, కాజాలో లింగమనేని కుటుంబానికి ఉన్న 355 ఎకరాలను ఆనుకునే అలైన్మెంట్ను ఖరారు చేశారు. అందుకు ప్రతిగా అదే ప్రాంతంలో హెరిటేజ్ ఫుడ్స్కు భూములను పొందారు. ఐఆర్ఆర్ అలైన్మెంట్ను ఆనుకుని కంతేరులో హెరిటేజ్ ఫుడ్స్కు 10.4 ఎకరాలు పొందగా 2014 జూన్ నుంచి సెప్టెంబరు మధ్యలో కొనుగోలు చేసినట్టు చూపించారు. లింగమనేని కుటుంబ నుంచి మరో 4.55 ఎకరాలను కొనుగోలు పేరిట హెరిటేజ్ ఫుడ్స్ దక్కించుకుంది. అప్పటికే ఈ కుంభకోణం గురించి బయటకు పొక్కడంతో ఆ సేల్ డీడ్ను రద్దు చేసుకున్నారు. ఐఆర్ఆర్ అలైన్మెంట్ను ఆనుకుని లింగమనేని కుటుంబానికి చెందిన 355 ఎకరాలతోపాటు హెరిటేజ్ ఫుడ్స్ భూములు ఉండటం గమనార్హం. లోకేశ్ కీలక ‘భూ’మిక క్విడ్ప్రోకోకు పాల్పడి హెరిటేజ్ ఫుడ్స్కు భూములను దక్కేలా చేయడంలో లోకేశ్ కీలక భూమిక పోషించారు. ఆయన 2008 జూలై 1 నుంచి 2013 జూన్ 29 వరకు హెరిటేజ్ ఫుడ్స్లో డైరెక్టర్గా ఉన్నారు. అనంతరం 2017 మార్చి 31 వరకు నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వ్యవహరించారు. ఐఆర్ఆర్ అలైన్మెంట్ను ఆనుకుని కొనుగోలు పేరిట భూములను దక్కించుకోవాలని నిర్ణయించిన హెరిటేజ్ ఫుడ్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో లోకేశ్ కూడా పాల్గొన్నారు. క్విడ్ ప్రోకో కింద భూములను పొందే ప్రక్రియలో ఆయన కీలక భూమిక పోషించారు. లోకేశ్ పేరిట హెరిటేజ్ ఫుడ్స్లో 23,66,400 షేర్లు ఉన్నాయి. అంటే హెరిటేజ్ ఫుడ్స్లో లోకేశ్కు 10.20 శాతం వాటా ఉంది. బాబుకు కరకట్ట నివాసం క్విడ్ప్రోకోలో భాగంగా లింగమనేని రమేశ్ విజయవాడ వద్ద కృష్ణా కరకట్టపై ఉన్న తన బంగ్లాను చంద్రబాబుకు ఇచ్చారు. దీనిపై కేసు నమోదు కావడంతో ఈ వ్యవహారాన్ని మసిపూసేందుకు చేసిన యత్నాలు బెడిసికొట్టాయి. ఆ బంగ్లాను అద్దెకు ఇచ్చానని లింగమనేని రమేశ్ బుకాయించారు. కానీ ఆయన అద్దె వసూలు చేసినట్టుగానీ, చంద్రబాబు చెల్లించినట్టుగానీ ఆదాయపన్ను వివరాల్లో లేవు. తరువాత ఆ ఇంటిని ప్రభుత్వానికి ఉచితంగా ఇచ్చానని చెప్పారు. మరి చంద్రబాబు ప్రభుత్వం నుంచి హెచ్ఆర్ఏ ఎందుకు పొందారన్న ప్రశ్నకు సమాధానం లేదు. దీంతో ఆ బంగ్లాను చంద్రబాబుకు వ్యక్తిగతంగా క్విడ్ప్రోకో కింద ఇచ్చారని స్పష్టమైంది. లింగమనేని నుంచి కానుకగా స్వీకరించిన కరకట్ట ఇంట్లోనే చంద్రబాబు, లోకేష్ దర్జాగా నివసించడం గమనార్హం. పవన్కూ వాటా జనసేన అధినేత పవన్ కల్యాణ్కు కూడా ఈ అవినీతి పాపంలో పిడికెడు వాటా ఇచ్చారు. కాజాకు సమీపంలో ఐఆర్ఆర్ అలైన్మెంట్కు చేరువలో పవన్కల్యాణ్కు 2.4 ఎకరాలున్నాయి. లింగమనేని కుటుంబం నుంచి ఆ భూములను ప్రభుత్వ ధర ప్రకారం ఎకరా రూ.8 లక్షలు చొప్పున కొనుగోలు చేసినట్లు చూపించారు. ల్యాండ్ పూలింగ్ నుంచి మినహాయింపు కల్పించిన భూమినే పవన్ కల్యాణ్కు ఇవ్వడం గమనార్హం. భారీగా పెరిగిన విలువ ఇన్నర్రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఖరారుకు ముందు లింగమనేని కుటుంబం ఆ ప్రాంతంలో ఎకరా భూమి రూ.8 లక్షల రిజిస్టర్ విలువ చొప్పున విక్రయించింది. మార్కెట్ ధర ప్రకారమైతే ఎకరా రూ.50 లక్షలు ఉంది. అంటే ఆ భూముల మార్కెట్ విలువ రూ.177.50 కోట్లు. ఇక ఇన్నర్రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఖరారు తరువాత ఎకరం రూ.36 లక్షల రిజిస్టర్ విలువ చొప్పున విక్రయించింది. అంటే రిజిస్టర్ విలువే నాలుగున్నర రెట్లకుపైగా పెరిగింది. మార్కెట్ ధర ప్రకారం ఎకరా రూ.2.50 కోట్లు పలికింది. 355 ఎకరాల విలువ మార్కెట్ ధర ప్రకారం అమాంతంగా రూ.887.50 కోట్లకు పెరిగింది. అమరావతి నిర్మాణం పూర్తయితే సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో ఎకరా విలువ రూ.4 కోట్లకు చేరుతుందని నాడు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబే ప్రకటించారు. ఇన్నర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న భూముల విలువ ఎకరా రూ.6 కోట్లకు చేరుతుందని అంచనా వేశారు. అంటే అమరావతి నిర్మాణం పూర్తయితే ఆ 355 ఎకరాల విలువ ఏకంగా రూ.2,130 కోట్లకు చేరుతుందని అంచనా. ఆ ప్రకారం మార్కెట్ ధరను బట్టి హెరిటేజ్ ఫుడ్స్ 10.4 ఎకరాల మార్కెట్ విలువ రూ.5.20 కోట్ల నుంచి రూ.41.6 కోట్లకు కోట్లకు పెరిగింది. అమరావతి నిర్మాణం పూర్తయితే రూ.62.4 కోట్లకు చేరుతుందని తేలింది. హెరిటేజ్ ఫుడ్స్ ఒప్పందం చేసుకుని రద్దు చేసినట్టు చూపిన మరో 4.55 ఎకరాల విలువ కూడా రూ.27.3 కోట్లకు చేరుతుంది. ఇక చంద్రబాబు బినామీల పేరిట ఉన్న వందలాది ఎకరాల విలువ అమాంతం పెరిగింది. -
మరో 15 రోజులు రిమాండ్ పొడిగించండి
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టై రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న మాజీ సీఎం చంద్రబాబు రిమాండ్ను మరో 15 రోజుల పాటు పొడిగించాలని కోరుతూ సీఐడీ ఆదివారం ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో మెమో దాఖలు చేసింది. తదుపరి దర్యాప్తు నిమిత్తం చంద్రబాబు రిమాండ్ను పొడిగించడం తప్పనిసరి అని అందులో పేర్కొంది. స్కిల్ కుంభకోణంలో దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, పలు కీలక డాక్యుమెంట్లను సేకరించాల్సి ఉందని, పలువురు సాక్షులను కూడా విచారించాల్సి ఉందని సీఐడీ తెలిపింది. ఈ కేసులో ప్రధాన సాక్షులైన పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ వాసుదేవ్ పార్థసాని దర్యాప్తు సంస్థకు అందుబాటులో లేకుండా పరారీలో ఉన్నారని నివేదించింది. ఈ కేసుతో వారిద్దరికీ చాలా దగ్గర సంబంధం ఉందని పేర్కొంది. పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ వాసుదేవ్ పార్థసాని పరారీ వెనుక చంద్రబాబు ప్రధాన అనుమానితుడిగా ఉన్నారని తెలిపింది. దుర్వినియోగమైన నిధులు అంతిమంగా ఎక్కడకు వెళ్లాయి? షెల్ కంపెనీల ద్వారా నగదు రూపంలో ఎవరికి చేరాయి? అనే వివరాలు వీరిద్దరికీ తెలుసని సీఐడీ తన మెమోలో పేర్కొంది. సాక్షులపై ఆ స్థాయిలో ప్రభావం చూపుతున్నారు.. చంద్రబాబును జ్యుడీషియల్ కస్టడీలో ఉంచాల్సిన అవసరం ఉందని, అప్పుడు మాత్రమే ఈ కుంభకోణంలో చంద్రబాబు పాత్ర గురించి మాట్లాడే సాక్షులకు రక్షణ ఉంటుందని సీఐడీ తెలిపింది. మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ పీవీ రమేష్ దర్యాప్తును పక్కదారి పట్టించేలా మీడియాలో మాట్లాడారని నివేదించింది. సాక్షులపై చంద్రబాబు, ఆయన మద్దతుదారులు ఆ స్థాయిలో ప్రభావం చూపుతున్నారని వివరించింది. ఈ కేసును డ్యామేజ్ చేసేందుకు చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారంది. సాక్షులను బెదిరించడం, భయపెట్టడం, ప్రభావితం చేస్తూ, సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని పేర్కొంది. చంద్రబాబుకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇచ్చే వారిని ప్రలోభపెట్టడం, బెదిరించడం లాంటివి చేస్తూ దర్యాప్తులో జోక్యం చేసుకునే అవకాశం ఉందని సీఐడీ తన మెమోలో తెలిపింది. దర్యాప్తు సంస్థకు, కోర్టుకు వాస్తవాలను తెలియనివ్వకుండా చేస్తున్నారని, వీటిని పరిగణలోకి తీసుకుని చంద్రబాబు రిమాండ్ను మరో 15 రోజుల పాటు పొడిగించాలని కోర్టును అభ్యర్థించింది. సరిహద్దు చెక్పోస్టులోముమ్మర తనిఖీలు జగ్గయ్యపేట: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలంలోని గరికపాడులో రాష్ట్ర సరిహద్దు వద్ద జిల్లా పోలీస్ కమిషనర్ టీకే రాణా ఆదేశాలతో శనివారం రాత్రి నుంచి ఆదివారం సాయంత్రం వరకు పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. స్థానిక పోలీస్ సిబ్బందితో పాటు ప్రత్యేక బలగాలతో తెలంగాణ నుంచి ఏపీకి వస్తున్న ప్రతి వాహనాన్ని తనిఖీ చేశారు. మైలవరం ఏసీపీ, సరిహద్దు చెక్పోస్టు ఇన్చార్జ్ రమేష్ మాట్లాడుతూ తెలంగాణ నుంచి టీడీపీ ఐటీ విభాగం తరఫున మాజీ సీఎం చంద్రబాబుకు మద్దతు పలికేందుకు హైదరాబాద్ నుంచి కార్లలో ర్యాలీగా రాజమండ్రి వస్తున్నారనే సమాచారంతో తనిఖీలు చేశామన్నారు. వాహన ర్యాలీకి అనుమతుల్లేవని నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
మళ్లీ ఆవు కథే!
సాక్షి, అమరావతి, రాజమహేంద్రవరం: రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణం కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ సీఎం చంద్రబాబు రెండు రోజుల సీఐడీ విచారణ ఆదివారం ముగిసింది. రూ.3,300 కోట్ల ప్రాజెక్టుగా నకిలీ ఒప్పందంతో నిబంధనలకు విరుద్ధంగా రూ.371 కోట్లు విడుదల చేసి రూ.241 కోట్లను షెల్ కంపెనీల ద్వారా కొల్లగొట్టిన కేసులో ప్రధాన ముద్దాయి చంద్రబాబు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. న్యాయస్థానం ఆదేశాలతో సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఆయన్ని రెండు రోజులపాటు కస్టడీలోకి తీసుకుని విచారించింది. పక్కా పన్నాగంతో ‘స్కిల్’ కుంభకోణానికి పాల్పడ్డ చంద్రబాబు సీఐడీ విచారణను కూడా పక్కదారి పట్టించేందుకు విశ్వ ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. రెండు రోజుల విచారణలోనూ ఆయన ఏమాత్రం సహకరించనందున చంద్రబాబు కస్టడీని పొడిగించాల్సిందిగా న్యాయస్థానాన్ని కోరాలని సీఐడీ నిర్ణయించింది. 40 ఇయర్స్ ఇండస్ట్రీ.. 14 ఏళ్లు సీఎంనంటూ సీఐడీ విచారణలో చంద్రబాబు సంబంధం లేని సంగతులు చెబుతూ తప్పించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు స్కిల్ కుంభకోణానికి సంబంధించి సిట్ అధికారులు ఏ ప్రశ్నలు వేసినా చంద్రబాబు ఒకటే చెబుతూ వచ్చారు. రాజకీయాల్లో తాను 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని... 14 ఏళ్లు సీఎంగా చేశానంటూ కాలయాపన చేసేందుకే ప్రయత్నించారు. దీంతో ఆయన రాజకీయ అనుభవం గురించి తమకు కూడా తెలుసని, ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్ జీవో, ఒప్పందాలను ఏ ప్రాతిపదికన చేశారు? బిల్లులు చెల్లింపుల్లో హేతుబద్ధత ఏమిటీ? నిధుల మళ్లింపులో పాత్రధారులతో సంబంధాలు ఏమిటీ? అనే అంశాలకు సూటిగా సమాధానాలు చెప్పాలని సిట్ అధికారులు పదేపదే పట్టుబట్టాల్సి వచ్చింది. వ్యూహాత్మక ప్రశ్నావళి.. కొంతవరకు సఫలీకృతం మొదటి రోజు చంద్రబాబు విచారణకు ఏమాత్రం సహకరించకపోవడంతో రెండో రోజు సిట్ అధికారులు ప్రశ్నావళిలో కొన్ని మార్పులు చేశారు. వరుస క్రమంలో కాకుండా ఓ అంశం నుంచి మరో అంశానికి జంబ్లింగ్ విధానంలో ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. ప్రధానంగా ఈ కేసులో ఇప్పటికే సీఐడీ, ఈడీ అరెస్ట్ చేసిన సుమన్బోస్, వికాస్ వినాయక్ కన్విల్కర్లతోపాటు నిధుల అక్రమ తరలింపులో షెల్ కంపెనీలతో చంద్రబాబు సంబందాలు, ఉత్తర ప్రత్యుత్తరాల గురించి కీలక ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. నిధుల అక్రమ మళ్లింపులో కీలక పాత్రధారులైన చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, షాపూర్జీ–పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్ పార్థసాని, షెల్ కంపెనీల సృష్టికర్త యోగేశ్ గుప్తాలతో చంద్రబాబు, లోకేశ్ లావాదేవీలపై కీలక ఆధారాలను ప్రదర్శిస్తూ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. సీఐడీ నోటీసులు జారీ చేయగానే పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ పార్థసాని పరారు కావడంపై సూటిగా ప్రశ్నించినట్లు సమాచారం. వెరసి రెండు రోజుల విచారణలో వ్యూహాత్మకంగా ప్రశ్నలు సంధించడం ద్వారా సీఐడీ అధికారులు కొంతవరకు సఫలీకృతమైనట్టు తెలుస్తోంది. న్యాయస్థానం ఆదేశాల మేరకు చంద్రబాబు విచారణ ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేశారు. మధ్యవర్తుల సమక్షంలో ఆయన వాంగ్మూలాన్ని నమోదుచేశారు. విచారణ సాగిన తీరు, వీడియో రికార్డింగ్ తదితర ఫైళ్లను న్యాయస్థానానికి సిట్ అధికారులు సమర్పించనున్నారు. మరింత విచారించాల్సిన అవసరం విచారణ ప్రక్రియను ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించి కాలహరణం చేసినందున చంద్రబాబును మరి కొద్ది రోజులు కస్టడీలో విచారించేందుకు అనుమతించాల్సిందిగా న్యాయస్థానాన్ని కోరాలని సీఐడీ నిర్ణయించింది. మరోవైపు ఈ కేసులో సిట్ నోటీసులు జారీ చేసిన ఇద్దరు కీలక వ్యక్తులు విదేశాలకు పరారు కావడం వెనుక చంద్రబాబు పాత్ర ఉన్నట్లు నివేదించనుంది. ఈ కేసులో గతంలో విచారించిన సాక్షులను ప్రభావితం చేసిన ఉదంతాలను కూడా న్యాయస్థానం దృష్టికి మరింత వివరంగా తీసుకెళ్లనుంది. ఈ నేపథ్యంలో ఈ కుంభకోణంలో కుట్రకోణానికి సంబంధించి పూర్తి వాస్తవాలను రాబట్టేందుకు చంద్రబాబును మరి కొద్ది రోజులు కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు అనుమతించాలని న్యాయస్థానానికి సిట్ అధికారులు విజ్ఞప్తి చేయనున్నారు. -
కిలారు.. పరారు!
సాక్షి, అమరావతి: మాజీ సీఎం చంద్రబాబు హయాంలో సాగించిన కుంభకోణాల్లో పాత్రధారుల పరారీ పరంపర కొనసాగుతోంది. సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణలో టీడీపీ సర్కారు అవినీతి బాగోతాలు బయటపడుతున్న కొద్దీ పరారవుతున్న వారి జాబితా పెరుగుతూ వస్తోంది. తాజాగా నారా లోకేశ్కు అత్యంత సన్నిహితుడైన కిలారు రాజేశ్ అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. ఎప్పుడూ లోకేశ్ వెన్నంటే ఉండే రాజేశ్ కొద్ది రోజులుగా కనిపించడం లేదు. లోకేశ్ ప్రస్తుతం ఢిల్లీలో ఉండగా రాజేశ్ మాత్రం ఎక్కడున్నాడో ఎవరికీ అంతుబట్టడం లేదు. చంద్రబాబు, లోకేశ్ ఆదేశాలతోనే అతడు పరారైనట్లు టీడీపీ వర్గాలే చెబుతుండటం గమనార్హం. నిధుల తరలింపులో పాత్రధారి.. నారా లోకేశ్కు కిలారు రాజేశ్ అత్యంత సన్నిహితుడన్నది బహిరంగ రహస్యం. చినబాబు తరపున అన్ని వ్యవహారాలను నెరిపేది రాజేశే. కొన్ని వ్యవహారాల్లో చంద్రబాబు మాట కంటే రాజేశ్ చెప్పిన దానికే లోకేశ్ మొగ్గు చూపుతారని టీడీపీ వర్గాలు చెబుతుండటం గమనార్హం. రాజేశ్ పరోక్షంగా టీడీపీ వ్యవహారాలన్నీ తన గుప్పిట్లో పెట్టుకున్నారు. టీడీపీ అనుకూల ఎన్నారైలతో మంతనాలు జరపడంతోపాటు పార్టీ ఆర్థిక వ్యవహారాలన్నీ రాజేశ్ కనుసన్నల్లోనే సాగుతున్నాయి. పార్టీలో ఏదైనా పదవి కావాలంటే చంద్రబాబు కంటే రాజేశ్ వద్దకు వెళితేనే పని అవుతుందన్న అభిప్రాయం సర్వత్రా నెలకొంది. లోకేశ్ యువగళం పాదయాత్రకు రాజేశ్ నిర్వాహకుడిగా వ్యవహరిస్తున్నాడు. షాడో మంత్రి.. నెట్వర్క్లో కీలకం టీడీపీ హయాంలో లోకేశ్ మంత్రిగా ఉన్నప్పుడు రాజేశ్ షాడో మంత్రిగా చెలరేగిపోయాడు. అన్ని ఫైళ్లను అనధికారికంగా అతడే చూసేవాడని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. చంద్రబాబు, లోకేశ్ సూత్రధారులుగా సాగించిన అన్ని కుంభకోణాల్లోనూ రాజేశ్ కీలక పాత్రధారిగా ఉన్నాడు. స్కిల్ డెవలప్మెంట్, అమరావతిలో తాత్కాలిక భవనాల నిర్మాణ కాంట్రాక్టుల ఖరారు, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్, ఫైబర్ నెట్ టెండర్ల ఖరారు.. ఇలా అన్ని కుంభకోణాల్లోనూ ప్రధానంగా వినిపించిన పేరు కిలారు రాజేశ్. అక్రమంగా కాంట్రాక్టులు కట్టబెట్టడం, నిబంధనలకు విరుద్ధంగా నిధుల విడుదల, షెల్ కంపెనీల ద్వారా అక్రమ నిధుల తరలింపు కోసం చంద్రబాబు ఏర్పాటు చేసిన నెట్వర్క్కు కిలారు రాజేశ్ సంధాన కర్తగా వ్యవహరించాడు. అదే విషయం సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది. చంద్రబాబు, లోకేశ్ ప్రధాన నిందితులుగా ఉన్న ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్, అసైన్డ్ భూముల కేసుల్లో కిలారు రాజేశ్ను కూడా విచారిస్తామని సీఐడీ అదనపు ఎస్పీ సంజయ్ ఇప్పటికే ప్రకటించారు. అతడి పాత్రపై పూర్తి ఆధారాలు లభించడంతోనే విచారించాలని సీఐడీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కిలారు రాజేశ్ అదృశ్యం కావడం గమనార్హం. మూడుకు చేరుకున్న అదృశ్యాలు.. కిలారు రాజేశ్ను విచారించాలని సీఐడీ నిర్ణయించడంతో చంద్రబాబు, లోకేశ్ బెంబేలెత్తారు. అతడిని సీఐడీ విచారిస్తే టీడీపీ హయాంలో సాగించిన మరెన్నో కుంభకోణాలు బయటకు వస్తాయని ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో రాజేశ్ను అజ్ఞాతంలోకి పంపించాలని నిర్ణయించిన చంద్రబాబు అదే విషయాన్ని ములాకత్లో తనను కలిసిన యనమల రామకృష్ణుడుకు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రాజేశ్ అదృశ్యమయ్యాడు. అతడు దేశంలోనే ఎక్కడైనా అజ్ఞాతంలో ఉన్నాడా...? విదేశాలకు పరారయ్యాడా? అన్నది తెలియరాలేదు. దీంతో చంద్రబాబు ఆదేశాలతో పరారైన వారి సంఖ్య మూడుకు చేరుకుంది. స్కిల్ కుంభకోణంలో విచారణకు హాజరు కావాలని సీఐడీ నోటీసులు జారీ చేయగానే చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ అమెరికాకు, షాపూర్జీ–పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్ పార్థసాని దుబాయ్కు పరారైన విషయం తెలిసిందే. -
మాజీమంత్రి నారాయణ ముందస్తు బెయిల్ పిటిషన్
విజయవాడ: ఇన్నర్రింగ్ స్కాం కేసులో భాగంగా ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి నారాయణ ముందస్తు పిటిషన్ దాఖలు చేశారు. ఇన్నర్రింగ్ స్కాంలో ఇప్పటికే నారాయణకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది హైకోర్టు. అయితే ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు నారాయణ. దీనికి సంబంధించి నేడు ఏపీ హైకోర్టులో విచారణ జరుగనుంది. ఏ–1 చంద్రబాబు, ఏ–2 నారాయణ,ఏ–6 లోకేశ్ ఇన్నర్ రింగ్ రోడ్డు భూ కుంభకోణాన్ని సిట్ పూర్తి ఆధారాలతో బట్టబయలు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడి (ఏ–1)గా చంద్రబాబు, ఏ–2గా నారాయణ, ఏ–6గా లోకేశ్పై కేసు నమోదు చేసింది. చంద్రబాబు, నారాయణ బినామీలు లింగమనేని రమేశ్ను ఏ–3గా, లింగమనేని రాజశేఖర్ ఏ–4గా, రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్ డైరెక్టర్ అంజని కుమార్ను ఏ–5గా పేర్కొంది. చదవండి: ‘ఇన్నర్ రింగ్ రోడ్డు’ అక్రమాల కేసు.. పీటీ వారంట్! -
చంద్రబాబు అరెస్టు
నంద్యాల: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును పోలీసులు అరెస్టు చేశారు. నంద్యాలలో చంద్రబాబు బస చేసిన ఆర్కే పంక్షన్ హాల్ వద్ద ఆయన్ను అరెస్ట్ చేశారు సీఐడీ పోలీసులు. ఈ రోజు(శనివారం) తెల్లవారుజామున చంద్రబాబును అరెస్ట్ చేశారు పోలీసులు. సీఆర్పీసీ సెక్షన్ 50(1) నోటీస్ ఇచ్చిన సీఐడీ.. 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద చంద్రబాబు అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఏ-1గా చంద్రబాబు ఉండగా, ఏ-2గా అచ్చెన్నాయుడు ఉన్నారు.చంద్రబాబు పై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రీడ్విత్ 34 and 37 ఐపీసీ సెక్షన్ ల కింద కేసులు నమోదు చేశారు. చంద్రబాబు అరెస్ట్ సమాచారం అందుకున్న టీడీపీ నాయకులు భారీగా చేరుకొని పోలీసులను అడ్డుకునేందుకు యత్నించారు . చంద్రబాబును కలువ నీయకుండా అడ్డుగా నిలబడి పోలీసు అధికారులతో టిడిపి నాయకులు వాగ్వాదానికి దిగారు . తమ నాయకుడు చంద్రబాబు విశ్రాంతిలో ఉన్నాడని, ఉదయం కలవండి అంటూ అధికారులతో టిడిపి నాయకులు వాధించారు. ఉదయం 6 గంటల తర్వాత చంద్రబాబునుకలవాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు వైద్యులను పిలిపించారు పోలీసులు. చంద్రబాబుతో పాటు పలువురు టిడిపి నాయకులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. చదవండి: ప్రజాధన కుంభకోణం.. అరెస్టు.. పదేళ్ల జైలు! చంద్రబాబుపై అభియోగాలు.. 👉ప్రభుత్వ డబ్బు రూ.371 కోట్లు అవినీతి 👉షెల్ కంపెనీల ద్వారా రూ. 241 కోట్ల కుంభకోణం 👉 కేబినెట్ను తప్పుదారిపట్టించి ఆ తర్వాత ఒప్పందంలో మరొకటిపెట్టి… డబ్బులు కాజేశారని అభియోగాలు. 👉స్కిల్ డెవలప్మెంట్ పేరిట స్కాం ఇది. 👉ఈడీ, సెబీ… ఇలా ఏజెన్సీలన్నీ కూడా దర్యాప్తుచేసిన స్కాం ఇది. 👉దోచేసిన సొమ్మును విదేశాలకు అక్కడనుంచి తిరిగి దేశంలోకి వచ్చింది. 👉చంద్రబాబుగారు జూన్ 2014లో అధికారం చేపట్టిన 2 నెలలకే ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కాంకు ఊపిరి. 👉ప్రాజెక్టు మొత్తం ఖర్చు రూ.3,356 కోట్లని, ఇందులో ప్రభుత్వ వాటా 10 శాతం అని, 90 శాతం సీమెన్స్ పెట్టుకుంటుందని చెప్పారు. అంటే దాదాపుగా రూ.౩వేల కోట్ల రూపాయలు సీమెన్స్ ఇస్తుందని చెప్పారు. 👉తమకు తాముగా తయారుచేసుకున్న అంచనా వ్యయాన్నే డీపీఆర్గా చూపిస్తూ స్కిల్డెవల్మెంట్ నుంచి నోట్ పెట్టించారు. ఇక ప్రభుత్వంలో సెక్రటరీ స్థాయి, ఆపైస్థాయి అన్నింటినీ ఓవర్రూల్ చేస్తూ కేబినెట్లోకి ఈనోట్ను తీసుకొచ్చారు. అదీ ఒక స్పెషల్ ఐటెంగా. కేబినెట్లోకి అలా రావడం, వెంటనే దానికి ఓకే చెప్పడం, తర్వాత జీవో విడుదల కావడం... అన్నీ ఆగమేఘాలమీద జరిగిపోయాయి. 👉ఈ పద్ధతిలో కేబినెట్కు నోట్ పెట్టడం అన్నది నియమాలకు, నిబంధలనకు, రూల్స్కు పూర్తిగా విరుద్ధం. 👉ఇక ఒప్పందం విషయానికొస్తే.. జీఓ ఒకలా ఉంటుంది, ఒప్పందం ఇంకోలా ఉంటుంది. 👉జీవోలో ఉన్నది... ఒప్పందంలో లేనప్పుడు సంతకాలు చేశారు?. 👉సీమెన్స్ నుంచి రావాల్సిన గ్రాంట్ ఇన్ ఎయిడ్గా ఒక్కపైసాకూడా రాకుండానే 5 దఫాలుగా ప్రభుత్వం రూ. 371 కోట్లు ఎలా విడుదలచేసింది. 👉డబ్బు విడుదలపై ఆర్థికశాఖ అధికారులు కొర్రీలు పెడితే… విడుదల చేయమని చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. 👉ఈ విషయాన్ని స్వయంగా అప్పటి ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ తన నోట్ఫైల్లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే విడుదలచేయమని ఆదేశాలు ఇచ్చినట్టుగా రాశారు. 👉సీఎంగారు చెప్పారు కాబట్టి విడుదలచేయమని చీఫ్ సెక్రటరీ నేరుగా ఫైలుపై రాశారు. 👉అన్నికంటే ముఖ్యంగా ప్రభుత్వం నుంచి విడుదలచేసిన ఈ డబ్బు పోయింది 👉మన అధికారులేకాదు… సీమెన్స్ సంస్థకూడా ఇంటర్నల్ ఎంక్వయిరీ చేసి… 164 సీఆర్పీసీ కింద ఏకంగా మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చారు. 👉ప్రభుత్వం జారీచేసిన జీవోకు, ఎంఓయూకు ఎలాంటి సంబంధం లేదని వాళ్లు కోర్టుకు తెలిపారు. 👉తమ కంపెనీలో పనిచేసే సుమన్బోస్ అనే వ్యక్తి మేనేజ్మెంట్నుగాని, లీగల్టీమ్కాని సంప్రదించలేదని సీమెన్స్ వాళ్లు ఏకంగా కోర్టుకు తెలియజేశారు. 👉ఈ డబ్బు 70కిపైగా షెల్ కంపెనీల ద్వారా చేతులు మారి మారి తిరిగి వచ్చింది, 👉వాస్తవంగా ఈ స్కిల్డెవలప్మెంట్ స్కాం గురించి ఒక వ్యక్తి రాష్ట్రంలో ఏసీబీ రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ప్రభుత్వానికి ఒక విజిల్బ్లోయర్ ఈ రకంగా జూన్ 2018న ఒక హెచ్చరిక జారీచేశారు. విచారణ మొదలుపెట్టి… దాన్ని ముందుకు కొనసాగించనీయకుండా పక్కనపెట్టేశారు. 👉ఇది ఎప్పుడైతే జరిగిందో… వెంటనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన నోట్ఫైల్స్ను మాయంచేసేశారు. 👉స్కిల్ స్కాంలో ప్రధాన పాత్ర పోషించిన పీవీఎస్పీ/స్కిల్లర్, డిజైన్టెక్ … 👉ఈరెండు కంపెనీలు సర్వీస్ ట్యాక్స్ కట్టకుండా సెన్వాట్కోసం క్లెయిమ్ చేశాయి. ఇన్ని కోట్ల రూపాయల మేర క్లెయిం చేయడంతో జీఎస్టీ అధికారులకు అనుమానం వచ్చి... ఆ కంపెనీ లావాదేవీలపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టారు. డబ్బులు హవాలా మార్గంలో తరలించినట్టు వెల్లడైంది. 2017లోనే ఇది బయటపడింది. అప్పుడు కూడా అప్పటి ప్రభుత్వం స్పందనలేదు. -
బాబు ముఠా పరార్
సాక్షి, అమరావతి: తన అవినీతి బండారం బట్ట బయలు కావడంతో మాజీ సీఎం చంద్రబాబు బెంబేలెత్తుతున్నారు. షెల్ కంపెనీల ద్వారా ప్రజాదనాన్ని కాజేసిన వైనం ఆధారాలతో సహా వెలుగు లోకి రావడంతో ఈ కుంభకోణంలో కీలక పాత్రధారులు రాత్రికి రాత్రే విదేశాలకు పరారయ్యారు. బాబు తరఫున అన్నీ తామై వ్యవహరించిన తన పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, షాపూర్జీ–పల్లోంజీ కంపెని ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్థసాని, షెల్ కంపెనీల సృష్టికర్త యోగేశ్ గుప్తాలకు సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నోటీసులు జారీ చేయడంతో చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. దీంతో చంద్రబాబు ఆదేశాలతో ఆయన పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ వాసుదేవ్ పార్థసాని హఠాత్తుగా విదేశాలకు పరారయ్యారు. మరో బినామీ యోగేశ్ గుప్తా ఆచూకీ తెలియడం లేదు. ఆ ముగ్గురే కీలకం.. తన అవినీతి పాపాలు పండటంతో చంద్రబాబు రోజుకో ఎత్తుగడ వేస్తున్నారు. తాను అధికారంలో ఉండగా యథేచ్ఛగా సాగించిన అవినీతి వ్యవహారాలను కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలు ఒక్కొక్కటిగా వెలికి తీయడంతో తప్పించుకునే దారి లేక సానుభూతి నాటకాలకు తెర తీశారు. రాజధాని అమరావతిలో తాత్కాలిక భవనాలు, పేదల టిడ్కో ఇళ్ల నిర్మాణాల్లో రూ.8 వేల కోట్లకుపైగా విలువైన కాంట్రాక్టుల కేటాయింపులో షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబు ముడుపులు అందుకున్న వైనాన్ని ఆదాయపన్ను శాఖ ఆధారాలతో సహా వెలికి తీసిన విషయం తెలిసిందే. ఇందులో కీలక పాత్ర పోషించిన బాబు బినామీలైన ముగ్గురు నిందితులే రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణంలో కూడా షెల్ కంపెనీల ద్వారా నిధులు మళ్లించినట్లు సీఐడీకి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తేటతెల్లం చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, షాపూర్జీ–పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్థసాని, షెల్ కంపెనీల సృష్టికర్త యోగేశ్ గుప్తా ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణంలో నిధుల తరలింపులో కీలకంగా వ్యవహరించారని నిగ్గు తేల్చింది. వారు ముగ్గురూ చంద్రబాబు బినామీలేనని తేలడంతో నోటీసులు జారీ చేసింది. మనోజ్ పార్థసాని, యోగేశ్ గుప్తాలను ఈ నెల 11న, పెండ్యాల శ్రీనివాస్ను ఈ నెల 14న విజయవాడలో విచారణకు హాజరుకావాలని ఈ మెయిల్ ద్వారా నోటీసులు పంపింది. ఈ క్రమంలో ఆ ముగ్గురూ హఠాత్తుగా అదృశ్యం కావడం, ఇద్దరు నిందితులు ఏకంగా దేశం విడిచి పరారు కావడం ఈ కుంభకోణాలకు సూత్రధారి చంద్రబాబేనని స్పష్టం చేస్తోంది. పాత్రలు ఫినిష్..! అక్రమ నిధులు తరలించేందుకు తాను ఏర్పాటు చేసుకున్న అవినీతి నెట్వర్క్ను కేంద్ర ఆదాయపన్ను శాఖ, సీఐడీ సిట్ ఛేదించడంతో చంద్రబాబుకు దారులు మూసుకుపోయాయి. అప్పటికే మనోజ్ పార్థసాని, యోగేశ్ గుప్తాల వాంగ్మూలాన్ని ఆదాయ పన్ను శాఖ నమోదు చేసింది. తాము చంద్రబాబు పీఎస్ శ్రీనివాస్ ద్వారా ఆయనకు భారీగా ముడుపులు అందించినట్లు వాంగ్మూలంలో వారు అంగీకరించారు. ఈ నేపథ్యంలో అక్రమ ఆదాయంపై ఆదాయ పన్ను శాఖ సమాచారంతో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఇంతలో స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో తన బినామీలు ముగ్గురికీ సిట్ నోటీసులు జారీ చేస్తుందని చంద్రబాబు ఊహించలేదు. దీంతో ఏ క్షణంలో ఏమైనా జరగవచ్చని ఆయన ఊహించారు. అందుకే తనను రెండు రోజుల్లో అరెస్టు చేయవచ్చంటూ తాజాగా చంద్రబాబు వ్యాఖ్యానించారు. తనను అరెస్టు చేస్తే రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి శాంతి భద్రతలకు విఘాతం కల్పించాలని ఆయన టీడీపీ శ్రేణులకు పరోక్షంగా సందేశమిచ్చారు. ఒకవైపు ఈ కుట్రలకు వ్యూహ రచన చేస్తూనే మరోవైపు తన బినామీలు మనోజ్ వాసుదేవ్ పార్థసాని, యోగేశ్ గుప్తా, పెండ్యాల శ్రీనివాస్ సిట్ విచారణకు హాజరైతే అక్రమాల చిట్టా బద్ధలవుతుందనే భయంతో వారిని విదేశాలకు పారిపోవాలని చంద్రబాబు ఆదేశించినట్లు సమాచారం. అమెరికాకు శ్రీనివాస్... దుబాయ్కి మనోజ్ చంద్రబాబు ఆదేశాలతో ఆయన పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ అప్పటికప్పుడే హఠాత్తుగా అమెరికాకు పరారయ్యారు. సిట్ నోటీసులు అందినట్లు ఆయన కుమార్తె తెలిపారు. నోటీసులపై ఆమె సంతకం కూడా చేశారు. అనంతరం హైదరాబాద్లోని తన నివాసంలో చంద్రబాబు పీఎస్ అందుబాటులో లేకుండా పోయారు. ఆ తరువాత అమెరికా వెళ్లిపోయారు. అంటే నోటీసులు అందడంతోనే పెండ్యాల శ్రీనివాస్ పరారైనట్లు స్పష్టమవుతోంది. ఇక మనోజ్ పార్థసాని దుబాయ్ ఉడాయించారు. ఆయన ముంబై నుంచి దుబాయ్ వెళ్లిపోయారు. తనకు సీఐడీ నోటీసులు జారీ చేసిందనే విషయం తెలియగానే ఆయన అందుబాటులో లేకుండా పోయారు. అనంతరం హడావుడిగా దుబాయ్కి పరారయ్యారు. అక్కడ నుంచి ఆయన ఎక్కడకు వెళ్తారన్నది సన్నిహితులకు కూడా చెప్పకుండా అత్యంత గోప్యంగా ఉంచారు. మరోవైపు షెల్ కంపెనీల సృష్టికర్త యోగేశ్ గుప్తా ఆచూకీ తెలియడం లేదు. ఆయన ఎక్కడ ఉన్నారన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. సీఐడీ నోటీసులు జారీ చేసిన వెంటనే చంద్రబాబు బినామీలు ముగ్గురూ హఠాత్తుగా అదృశ్యం కావడం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. టీడీపీ హయాంలో చంద్రబాబు యథేచ్ఛగా అవినీతికి పాల్పడ్డారన్న దానికి ఇదే తిరుగులేని నిదర్శనమని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. తాజా పరిణామాలతో తదుపరి చేపట్టాల్సిన చర్యలపై సీఐడీ అధికారులు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. -
వియ్యంకుల వారి భూ విందు
సాక్షి, అమరావతి: ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా..? చంద్రబాబు బృందం అమరా వతిలో ఏకంగా రూ.5,600 కోట్ల విలువైన 1,400 ఎకరాల అసైన్డ్ భూములను కొల్లగొట్టితే ఆయన మంత్రివర్గ సహచరులు పొంగూరు నారాయణ, గంటా శ్రీనివాసరావు అదే రీతిలో భారీ భూదోపిడీకి పాల్పడ్డారు. వియ్యంకులు కూడా అయిన వారిద్దరూ బినామీల పేరిట 48 ఎకరాల అసైన్డ్ భూములను కాజేసినట్లు సీఐడీకి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఆధారాలతో సహా వెలికి తీసింది. టీడీపీ సర్కారు ఒక్క రూపాయి కూడా పరిహారం ఇవ్వకుండానే అసైన్డ్ భూములను రాజధాని కోసం తీసుకుంటుందని బడుగు రైతులను బెదిరించి నారాయణ – గంటా తమ పన్నాగాన్ని అమలు చేశారు. అందుకోసం సీఆర్డీఏ అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారు. అసైన్డ్ భూముల చట్టాన్ని ఉల్లంఘించి తమ విద్యా సంస్థల సిబ్బంది, సమీప బంధువులు 37 మందిని బినామీలుగా చేసుకుని 142 సేల్ డీడ్ల ద్వారా 150 ఎకరాలను దక్కించుకు న్నారు. దీనిపై సిట్ అధికారులు పూర్తి ఆధారా లతో కేసు నమోదు చేశారు. రూ.18 కోట్లతో హస్త గతం చేసుకున్న ఆ 150 ఎకరాల విలువ ల్యాండ్ పూలింగ్ వర్తింపజేసిన అనంతరం అమాంతం రూ.550 కోట్లకు చేరుకోవడం గమనార్హం. బినామీల ఖాతాల్లోకి డబ్బులు.. వియ్యంకులైన పొంగూరు నారాయణ, గంటా శ్రీనివాసరావులు పన్నాగం పన్ని, అధికార బలంతో అమరావతిలో అసైన్డ్ భూములను కొల్లగొట్టారు. అనంతవరం, కృష్ణాయపాలెం, కురగల్లు, లింగాయపాలెం, మందడం, నెక్కళ్లు, నవులూరు, రాయపూడి, తుళ్లూరు, ఉద్దండరాయునిపాలెం, వెంకటపాలెంలోని అసైన్డ్ భూములపై కన్నేశారు. భూసమీకరణ కింద తీసుకునే అసైన్డ్ భూములకు ప్రభుత్వం పరిహారం ఇవ్వదని సీఆర్డీఏ, రెవెన్యూ అధికారుల ద్వారా ఆయా గ్రామాల్లోని పేద రైతులను నమ్మించారు. అనంతరం తమ బినామీలు అయిన ఆర్కే హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులతో ఆ భూములను కారు చౌకగా కొనుగోలు చేసేందుకు సంప్రదింపులు జరిపారు. అందుకోసం నారాయణ విద్యా సంస్థల ద్వారా రూ.18 కోట్లను ఆర్కే హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్కు మళ్లించారు. నారాయణ విద్యా సంస్థల సిబ్బంది, తమ సమీప బంధువులను బినామీలుగా చేసుకుని వారి పేరిట బ్యాంకు ఖాతాలు తెరిచారు. ఆర్కే హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఆ బినామీల బ్యాంకు ఖాతాల్లోకి నిధులు మళ్లించారు. అనంతరం నారాయణ విద్యా సంస్థల సిబ్బంది, తమ సమీప బంధువుల పేరిట అసైన్డ్ భూములను సేల్ డీడ్ ద్వారా హస్తగతం చేసుకున్నారు. మంగళగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కేంద్రంగా 37 మంది పేరుతో 142 సేల్డీడ్లు రిజిస్టర్ చేయడం గమనార్హం. ఇలా కేవలం రూ.18 కోట్లకు 150 ఎకరాలను గుప్పిట పట్టారు. ఈ వ్యవహారం అంతా 2015 సెప్టెంబరు, అక్టో బర్, నవంబరులో పూర్తి చేశారు. రూ.532 కోట్లు నష్టపోయిన అసైన్డ్ రైతులు అసైన్డ్ పేద రైతుల నుంచి 150 ఎకరాలు తమ హస్తగతం అయ్యాక నారాయణ, గంటాలు అసలు విషయాన్ని తెరపైకి తెచ్చారు. అప్పటికే చంద్రబాబు పన్నాగం ప్రకారం అసైన్డ్ భూము లకు కూడా భూసమీ కరణ ప్యాకేజీ ఇవ్వాలని నిర్ణయించారు. కానీ ఆ విషయాన్ని గోప్యంగా ఉంచారు. అసైన్డ్ భూములు తమ గుప్పిట్లోకి వచ్చిన తరువాత ఆ నిర్ణయాన్ని తాపీగా 2016 ఫిబ్రవరి లో ప్రకటించారు. అంతేకాదు అసైన్డ్ చట్టానికి విరుద్ధంగా అసైన్డ్ భూములను కొనుగోలు చేసినవారికి కూడా భూసమీకరణ ప్యాకేజీ వర్తింపజేస్తామని చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించడం గమనార్హం. తద్వారా అమరావతిలో భూముల మార్కెట్ విలువ అమాంతం పెరిగేలా చేశారు. అమరావతిలో ఎకరా మార్కెట్ విలువ రూ.4 కోట్లు అని నాడు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబే చెప్పడం గమనార్హం. నారాయణ, గంటా బినామీల ద్వారా దక్కించుకున్న 150 ఎకరాలకు భూసమీకరణ ప్యాకేజీని వర్తింపచేసుకున్నారు. దీని ప్రకారం జరీబు భూములకు ఎకరాకు వెయ్యి గజాల నివాస స్థలం, 450 గజాల వాణిజ్య స్థలం కేటాయించారు. ఈమేరకు 150 ఎకరాలకుగాను 1.50 లక్షల గజాల నివాస స్థలం, 67,500 గజాల వాణిజ్య స్థలం దక్కాయి. మార్కెట్ విలువ ప్రకారం ఆ భూముల విలువ దాదాపు రూ.550 కోట్లకు చేరింది. కేవలం రూ.18 కోట్లతో అక్రమంగా భూములను దక్కించుకుని 3 నెలల్లో ఆ భూముల విలు వను రూ.550 కోట్లకు పెంచేసుకున్నారు. అస త్య ప్రచారాలు, బెదిరింపులకు పాల్పడకుండా ఉంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ అసైన్డ్ రైతుల భూముల విలువ రూ.550 కోట్లకు పెరి గి ఆ ప్రయోజనం వారికే దక్కేది. దశాబ్దాలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులు సాగు చేసుకుంటున్న భూములను నారాయణ, గంటా బెదిరించి కా రుచౌకగా గద్దల్లా తన్నుకుపోయారు. కాగా, నారాయణ ఇప్పటికే ముందస్తు బెయిల్పై ఉన్నారు. -
బాబు బంగ్లాకే ముడుపులు.. మళ్లీ ఆ ముగ్గురే
సాక్షి, అమరావతి: తీగ లాగితే డొంకంతా కదులుతోంది! ముడుపుల చిట్టాలన్నీ చంద్రబాబు బంగ్లాకే దారి తీస్తున్నాయి!! అమరావతిలో తాత్కాలిక నిర్మాణాలు, టిడ్కో ఇళ్ల కాంట్రాక్టుల్లో ప్రజాధనాన్ని లూటీ చేసిన వ్యవహారంలో ఆదాయపన్ను (ఐటీ) శాఖ తీగ లాగితే... చంద్రబాబు కనుసన్నల్లో సాగిన ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణం పునాది బయటపడుతోంది. కుంభకోణాలు వేర్వేరైనా కొల్లగొట్టిన ప్రజాధనాన్ని షెల్ కంపెనీల ద్వారా తరలించడంలో పాత్రధారులు మాత్రం వారే. ఆ అక్రమార్జన అంతా చివరకు చేరింది సూత్రధారి చంద్రబాబు చెంతకే అన్నది స్పష్టమవుతోంది. టీడీపీ హయాంలో భవన నిర్మాణ ప్రాజెక్టుల కాంట్రాక్టులను కట్టబెట్టడంలో అక్రమార్జనకు సంబంధించి చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసుల ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఆ కుంభకోణంలో పాత్రధారులుగా ఉన్న మనోజ్ వాసుదేవ్ పార్థసాని, చంద్రబాబు పీఏస్ పెండ్యాల శ్రీనివాస్, యోగేశ్ గుప్తా ఏపీఎస్ఎస్డీసీ అవినీతి బాగోతంలోనూ కీలకంగా వ్యవహరించారని వెల్లడైంది. ఇప్పటికే ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణం కేసు దర్యాప్తులో కీలక ప్రగతి సాధించిన సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తాజా పరిణామాలతో తక్షణం రంగంలోకి దిగింది. ముడుపుల తరలింపులో సూత్రధారులుగా వ్యవహరించిన యోగేశ్ గుప్తా, మనోజ్ వాసుదేవ్ పార్థసాని, పెండ్యాల శ్రీనివాస్లను విచారించాలని నిర్ణయించింది. ఈమేరకు వారికి నోటీసులు జారీ చేసి దర్యాప్తును వేగవంతం చేసేందుకు సిద్ధమైంది. బాబు అవినీతి ‘స్కిల్’... టీడీపీ హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాన సూత్రధారిగా ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణం జరిగినట్లు ‘సిట్’ ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించింది. జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీకి ఏమాత్రం తెలియకుండా ఆ కంపెనీ పేరుతో ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా మోసగించి ప్రజాధనాన్ని కొల్లగొట్టినట్లు ఆధారాలతో సహా నిరూపించింది. రూ.3,300 కోట్ల ప్రాజెక్టును కాగితాలపై చూపించి సీమెన్స్ కంపెనీ 90 శాతం నిధులు సమకూరుస్తుందని బుకాయించి రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం నిధులను కేటాయించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. సీమెన్స్ కంపెనీ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండానే ప్రభుత్వ వాటా 10 శాతం కింద జీఎస్టీతో కలిపి మొత్తం రూ.371 కోట్లను అడ్డగోలుగా చెల్లించేశారు. అలా నిధులు చెల్లించడం నిబంధనలకు విరుద్ధమని అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుతోపాటు మరో ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులు వారించిన ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఖాతరు చేయలేదు. ఏకపక్షంగా రూ.371 కోట్లను సీమెన్స్ భాగస్వామ కంపెనీగా ఒప్పందంలో చూపించిన డిజైన్ టెక్ కంపెనీకి విడుదల చేశారు. అందులో రూ.241 కోట్లను పలు షెల్ కంపెనీలను సృష్టించి హవాలా మార్గంలో టీడీపీ ప్రభుత్వంలో ముఖ్య నేత కొల్లగొట్టారు. ఈ కేసులో సిట్ అధికారులు 8 మందిని అరెస్టు చేశారు. హవాలా మార్గంలో నల్లధనాన్ని చలామణిలోకి తెచ్చినందున కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ కూడా రంగంలోకి దిగింది. మనీలాండరింగ్కు పాల్పడ్డారని నిర్ధారించి ఈ కేసులో నలుగురిని అరెస్టు చేయడంతోపాటు డిజైన్ టెక్ కంపెనీకి చెందిన రూ.31.20 కోట్లను అటాచ్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. షెల్ కంపెనీలు.. బోగస్ ఇన్వాయిస్లు టీడీపీ ప్రభుత్వంలో అమరావతిలో తాత్కాలిక నిర్మాణాల కాంట్రాక్టులను కట్టబెట్టిన కుంభకోణంలో పాత్రధారులుగా ఉన్నవారే ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణంలోనూ కీలక పాత్ర పోషించారని సిట్ గుర్తించింది. షాపూర్జీ– పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్థసాని, షెల్ కంపెనీల సృష్టికర్త యోగేశ్ గుప్తా, చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్.. ఈ ముగ్గురూ అమరావతి భవన నిర్మాణాల కాంట్రాక్టు అవినీతి సొమ్మును చంద్రబాబుకు చేర్చడంతో కీలకంగా వ్యవహరించారన్నది ఇప్పటికే నిర్ధారణ అయ్యింది. రూ.8 వేల కోట్ల విలువైన నిర్మాణాల కాంట్రాక్టుల్లో భారీ అవినీతికి పాల్పడి ఆ నల్లధనాన్ని మనోజ్ వాసుదేవ్ పార్థసాని షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబుకు చేర్చారు. అందుకోసం షెల్ కంపెనీలను సృష్టించడంలో యోగేశ్ గుప్తా కీలక పాత్ర పోషించారు. ఆయన నివాసంలో ఐటీ శాఖ అధికారులు సోదాలు కూడా నిర్వహించారు. మరోవైపు ఆ షెల్ కంపెనీల పేరుతో మళ్లించిన నిధులను డ్రా చేసి మనోజ్ వాసుదేవ్ పార్థసాని నగదు రూపంలో చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్కు హైదరాబాద్లో అందించారు. ఆ విధంగా చంద్రబాబుకు చేరిన అక్రమార్జనలో రూ.118 కోట్లకు సంబంధించి లెక్కలు చెప్పాలని ఐటీ శాఖ నోటీసులు జారీ చేయడం జాతీయస్థాయిలో చర్చనీయాంశంగా మారింది. బాబుకు ముడుపులు చేరాయిలా... అమరావతిలో తాత్కాలిక నిర్మాణ కాంట్రాక్టుల అవినీతి దందాలో సూత్రధారులుగా వ్యవహరించిన యోగేశ్ గుప్తా, మనోజ్ పార్థసాని, పెండ్యాల శ్రీనివాస్ ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణంలో ప్రధాన భూమిక పోషించిన తీరు ఇదీ.. ► ఏపీఎస్ఎస్డీసీ నిధులను కొల్లగొట్టేందుకు యోగేశ్ గుప్తా పలు షెల్ కంపెనీలను సృష్టించాడు. ముంబై, పుణే కేంద్రాలుగా సృష్టించిన షెల్ కంపెనీల పేరిట నకిలీ ఇన్వాయిస్లను సమర్పించారు. ఆ ఇన్వాయిస్ల ఆధారంగా షెల్ కంపెనీలకు ఏపీఎస్ఎస్డీసీ రూ.371 కోట్లను విడుదల చేసింది. దీనిపై ఆధారాలు సేకరించిన అనంతరం సిట్ అధికారులు ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణంలో కేసులో యోగేశ్ గుప్తాను ఏ–22గా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం బెయిల్పై ఉన్నాడు. ► నకిలీ ఇన్వాయిస్ల ఆధారంగా షెల్ కంపెనీలకు చేరిన రూ.371 కోట్లను యోగేశ్ గుప్తా డ్రా చేసి మనోజ్ పార్థసానికి అందించాడు. ఆయన అందులో రూ.241 కోట్లను ముంబై నుంచి హైదరాబాద్కు తరలించాడు. రూ.241 కోట్ల నగదు మొత్తాన్ని హైదరాబాద్లో ఉన్న చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్కు అందించాడు. ► ఆ రూ.241 కోట్ల నగదు మొత్తం పెండ్యాల శ్రీనివాస్ ద్వారా చివరకు హైదరాబాద్లో చంద్రబాబు నివాసానికి చేరినట్లు స్పష్టమవుతోంది. ఆ ముగ్గురికీ సిట్ నోటీసులు ఏపీఎస్ఎస్డీసీ నిధులను కొల్లగొట్టడంతో పాత్రధారులుగా వ్యవహరించిన యోగేశ్ గుప్తా, మనోజ్ పార్థసాని, పెండ్యాల శ్రీనివాస్లకు సిట్ అధికారులు తాజాగా నోటీసులు జారీ చేశారు. విజయవాడలో సిట్ అధికారుల ఎదుట వచ్చే సోమవారం విచారణకు హాజరు కావాలని యోగేశ్ గుప్తా, మనోజ్ పార్థసానికి నోటీసులిచ్చారు. చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ ఈనెల 14న విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. -
TSPSC: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో కీలక పరిణామం
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పేపర్ లీకేజీలో ప్రమేయం ఉన్న వారంతా కేసు నుంచి తప్పించుకోవడానికి నానాతంటాలు పడుతున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన భార్యాభర్తలు సిమ్ కార్డులు మార్చి పుణ్యక్షేత్రాలకు తిరిగినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఈ కేసులో తప్పించుకోలేమని తెలుసుకొని ఎట్టకేలకు సిట్ ఎదుట లొంగిపోయారు. అంతేగాక కేసు నుంచి తప్పించుకునేందుకు మరో 15 మంది ప్రయత్నించినట్లు పేర్కొన్నారు. కాగా ఇప్పటివరకు ఈకేసులో 90 మందిని పైగా అరెస్టు చేసిన సిట్ అధికారులు.. ఈ నెలాఖరులో మరో 10 మందిని అరెస్టు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఫోరెన్సిక్ నివేదిక అందగాగానే రెండో ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి సిట్ సిద్ధమైంది. ఇక పేపర్ లీకేజ్ కేసులో అసలు సూత్రధారులు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిగా సిట్ తేల్చింది. కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఇంచార్జ్ శంకర్ లక్ష్మి కంప్యూటర్ నుంచి ప్రవీణ్ పేపర్ను తీసుకొని ఆమె డైరీలో ఉన్న సాస్వర్డ్, యూజర్నేమ్ ద్వారా పేపర్ లీక్ జరిగినట్లు సిట్ అధికారులు గుర్తించారు. -
TSPSC Case: ఛార్జ్షీట్ దాఖలు చేసిన సిట్.. ఏముందంటే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పేపర్ లీకేజీ కేసును కేసీఆర్ సర్కార్ సీరియస్గా తీసుకుంది. దీంతో, దర్యాప్తు కోసం సిట్ను ఏర్పాటు చేసింది. కాగా, ఈ కేసులో సిట్ తాజాగా ఛార్జ్షీట్ దాఖలు చేసింది. అయితే, సిట్ దాఖలు చేసిన ఛార్జ్షీట్ ప్రకారం.. పేపర్ లీకేజీ కేసులో ఇప్పటి వరకు రూ.1.63కోట్ల లావాదేవీలు జరిగాయి. పేపర్ లీక్ కేసులో ఇప్పటికి 49 మంది అరెస్ట్ అయ్యారు. ఈ వ్యవహారంలో 16 మంది మధ్యవర్తులుగా వ్యవహరించారు. మరో నిందితుడు ప్రశాంత్ రెడ్డి న్యూజిలాండ్లో ఉన్నాడు. ఎనిమిది మంది అభ్యర్థులకు డీఏఓ పేపర్ లీకైంది. ఏఈ పేపర్ 13 మందికి, గ్రూప్-1 ప్రిలిమ్స్ పేపర్ నలుగురికి లీకైంది. ఏఈఈ పేపర్ ఏడుగురు అభ్యర్థులకు లీకైంది. ఏఈఈ పరీక్షలో మరో ముగ్గురు మాల్ ప్రాక్టీస్కు పాల్పడ్డారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్స్, ఇతర పరికరాలను రామాంతపూర్లోని ఫోరెన్సిక్ సైన్స్ లేబోరేటరీకి పంపించామని సిట్ పేర్కొంది. ఇది కూడా చదవండి: బీజేపీ బిగ్ ప్లాన్.. ఈటల రాజేందర్కు కీలక బాధ్యతలు! -
విపక్షాల ‘పని’ మీదనే సీబీఐ ఉంది కదా సార్! నిజమే! సిట్ బెటర్!
విపక్షాల ‘పని’ మీదనే సీబీఐ ఉంది కదా సార్! నిజమే! సిట్ బెటర్! -
ప్రిలిమ్స్ వాయిదా లేదు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 11న గ్రూప్–1 ప్రిలిమ్స్ నిర్వహించేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)కు హైకోర్టు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ పరీక్షను వాయిదా వేసేందుకు నిరాకరించింది. మార్చిలో నోటిఫికేషన్ ఇచ్చి, పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాక ఇప్పుడు వాయిదా కోరుతూ పిటిషన్లు వేయడం సరికాదంది. ఆ పిటిషన్లను కొట్టివేసింది. పేపర్ లీకేజీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ పూర్తయ్యే వరకు గ్రూప్–1 పరీక్షలు ఆపాలని విజ్ఞప్తి చేస్తూ హైకోర్టులో ఐదు పిటిషన్లు దాఖలయ్యాయి. టీఎస్పీఎస్సీ సిబ్బందిలో ఎంతమందికి లీకేజీతో సంబంధం ఉందో తెలియకుండా అదే కమిషన్ పరీక్షలు నిర్వహించడం సరికాదని పిటిషనర్లు పేర్కొన్నారు. ఈ పిటిషన్లపై జస్టిస్ ముమ్మినేని సుధీర్కుమార్ ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్, న్యాయవాది పల్లె నాగేశ్వర్రావు వాదించగా, ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. యూపీఎస్సీతో పరీక్ష నిర్వహించాలి.. ‘టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో దర్యాప్తు ఇంకా పూర్తికాలేదు.. కొనసాగుతోంది. కమిషన్లో పనిచేసే వారికి లీకేజీతో సంబంధం ఉందని కొందరిని సస్పెండ్ చేశారు. దర్యాప్తు పూర్తి అయితేగానీ ఇంకా ఎవరైనా ఉన్నారా? లేదా? అన్న దానిపై స్పష్టత వచ్చే అవకాశం లేదు. దాదాపు 11 ఏళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన గ్రూప్–1 పరీక్ష నిర్వహిస్తోంది. 5 లక్షల మందికి పైగా అభ్యర్థులు గ్రూప్–1 కోసం ఎదురుచూశారు. ఈ పరీక్ష ద్వారా ప్రభుత్వంలో కీలకమైన పోస్టుల్లో అధికారుల నియామకం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో పరీక్ష పటిష్టంగా, పారదర్శకంగా నిర్వహించాల్సి ఉంది. ప్రస్తుత కమిషన్ ఆధ్వర్యంలో పరీక్ష సాగుతున్నప్పుడే లీకేజీ జరిగింది. అలాంటప్పుడు అదే కమిషన్ తిరిగి ఎలా పరీక్ష నిర్వహిస్తుంది? యూపీఎస్సీ లాంటి ఏదైనా థర్డ్ పార్టీ కమిషన్తో నిర్వహిస్తే ఎవరికీ ఎలాంటి అనుమానం, అభ్యంతరం ఉండదు. ’అని అవినాశ్ దేశాయ్ తెలిపారు. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.. ‘పేపర్ లీకేజీ విషయం తెలిసిన వెంటనే ప్రభుత్వం స్పందించి పరీక్షలను రద్దు చేసింది. ఇది ప్రభుత్వ పారదర్శకతకు నిదర్శనం. ఇప్పటివరకు టీఎస్పీఎస్సీలోని ఇద్దరు శాశ్వత ఉద్యోగులు, ఇద్దరు కాంట్రాక్టు ఉద్యోగులకు లీకేజీతో సంబంధం ఉందని తేలడంతో వారిని సస్పెండ్ చేశారు. వారిని దర్యాప్తు అధికారులు అరెస్టు కూడా చేశారు. పరీక్ష రద్దు చేసినప్పుడు ప్రభుత్వం నుంచి స్పందన లేకుంటే త్వరగా నిర్వహించమని అడగాలి తప్ప.. వాయిదా కోరడం సరికాదు. జూన్ 11న పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 3.18 లక్షల మంది గ్రూప్–1కు దరఖాస్తు చేయగా, ఇప్పటికే 1.13 లక్షల మంది హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. మిగతావారు కూడా ఒకట్రెండు రోజుల్లో డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 995 సెంటర్లలో ఏర్పాట్లు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో పరీక్ష వాయిదా వేయాలని కోరడం సమంజసం కాదు...’ అని బీఎస్ ప్రసాద్ నివేదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. వచ్చే ఆదివారమే పరీక్ష ఉన్న నేపథ్యంలో వాయిదా వేయలేమని స్పష్టం చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. -
TSPSC Case: ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’ చిత్రం చూసి మాస్ కాపీయింగ్.
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజ్తోపాటు హైటెక్ మాస్ కాపీయింగ్కు పాల్పడిన నీటిపారుదల శాఖ పెద్దపల్లి ఏఈ పూల రమేష్ విచారణలో కీలకాంశాలు వెలుగులోకి వచ్చాయి. సిట్ అధికారులు ఇతడిని బుధవారం కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. ఈ సందర్భంగా కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో కీలకాంశాలు ప్రస్తావించారు. హైటెక్ మాస్ కాపీయింగ్ ద్వారా ఇతడు రూ.1.1 కోటి వరకు ఆర్జించినట్లు తేల్చారు. ఒక్కో అభ్యర్ధితో రూ.20–30 లక్షల వరకు ఒప్పందం కుదుర్చుకుని, ఏడుగురితో ఏఈఈ, డీఏఓ పరీక్షలు రాయించినట్లు పేర్కొన్నారు. కొంత మొత్తం అడ్వాన్సుగా తీసుకున్న ఇతడు మిగిలింది ఫలితాల తర్వాత తీసుకోవాల్సి ఉందని అందులో చెప్పారు. కాగా, భార్యను హత్య చేసినట్లు రమేశ్పై ఆరోపణలున్నాయి. ఆస్పత్రిలో డాక్టర్ ద్వారా పరిచయం పెద్దపల్లిలో ఇరిగేషన్ ఏఈగా పనిచేస్తున్న రమేశ్కు గతంలో నార్కట్పల్లి వద్ద ప్రమాదం జరిగింది. అప్పట్లో అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా... డాక్టర్ ద్వారా టీఎస్పీఎస్సీ ఉద్యోగి సురేష్ పరిచయం అయ్యాడు. ఆపై ఇద్దరూ స్నేహితులుగా మారడంతో నగరంలోని రమేష్ ఇంట్లో సురేష్ అద్దెకు దిగాడు. ఆపై ఇద్దరి మధ్యా స్నేహం బలపడింది. టీఎస్పీఎస్సీలో ఉద్యోగం మానేసిన సురేష్ పేపర్ల లీకేజ్లో కీలకంగా మారాడు. ఇతడి ద్వారా ఏఈ పరీక్షలకు సంబంధించిన పేపర్లు రమేష్కు అందాయి. వీటిని ఇతడు 30 మందికి విక్రయించాడు. ఇలా వచ్చిన సొమ్ములో సగం సగం తీసుకుందామని సురేష్ ప్రతిపాదించాడు. దీనికి అంగీకరించని రమేష్... తనకు 70 శాతం ఇచ్చేలా సురేష్ను ఒప్పించాడు. అభ్యర్థులను వెతికి పట్టుకోవడం, విక్రయించడం లాంటి రిస్కులు తనవే అని, అందుకే ఎక్కువ వాటా కావాలన్నాడు. దీంతో సురేష్ ఏఈఈ, డీఏఓ పేపర్ల లీకేజ్ విషయం ఇతడికి చెప్పలేదు. దీంతో ఏడుగురితో ఒప్పందం చేసుకుని హైటెక్ మాస్ కాపీయింగ్కు పథకం వేశాడు. ఇతడు అనుసరించిన హైటెక్ కాపీయింగ్కు ఓ సినిమానే స్ఫూర్తిగా నిలిచింది. చదవండి: తెరపైకి కొత్త సీపీ.. సీఎంవోలో పని చేస్తున్న పోలీస్ ఉన్నతాధికారి ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’ చిత్రం చూసిన రమేష్ అందులోని కాపీయింగ్ పంథాను కాస్త హైటెక్గా మార్చి టీఎస్పీఎస్సీ పరీక్షలకు వినియోగించాడు. కాపీయింగ్కు రమేష్ భారీ స్కెచ్ వేశాడు. ఇంటర్నెట్ నుంచి అత్యాధునికమైన చెవిలో ఇమిడిపోయే బ్లూటూత్, సిమ్కార్డు ఆధారంగా పని చేసే చిన్న రిసీవర్, ట్రాన్స్మీటర్ తదితరాలు ఖరీదు చేశాడు. బ్లూటూత్ డివైజ్ ఎవరికీ కనిపించకుండా చెవిలో పెట్టించాడు. వారి చొక్కా కింది భాగంగా ప్రత్యేకంగా కుట్టించిన జేబులో రిసీవర్ ఉంచాడు. ఏడుగురు అభ్యర్థులు కచ్చితంగా ఇన్షర్ట్ చేసుకునేలా సూచించి తనిఖీల్లో దొరక్కుండా చేశాడు. ఓ పరీక్ష కేంద్రం నిర్వాహకుడితో ఒప్పందం చేసుకున్న రమేష్ పరీక్ష పత్రం బయటకు పంపేలా ప్రేరేపించాడు. ఆయా పరీక్షలకు గైర్హాజరైన వారి ప్రశ్నపత్రాలు అన్ని సిరీస్లవి ఫొటోలు తీసి ఈ నిర్వాహకుడు వాట్సాప్ ద్వారా రమేశ్కు పంపాడు. అప్పటికే ఇతడు సిద్ధం చేసుకున్న బృందానికి వీటిని పంపాడు. వాళ్లు చాట్జీపీటీ యాప్ ద్వారా ఆయా ప్రశ్నలకు సమాధానాలు గుర్తించి.. వాటిని తమ వద్ద ఉన్న ట్రాన్స్మీటర్ ద్వారా ఏడుగురు అభ్యర్థులకు చెప్పారు. ఒక సిరీస్ తర్వాత మరో సిరీస్లోని ప్రశ్నల జవాబులను వీళ్లు చెప్పారు. రమేశ్తోపాటు ముగ్గురు అభ్యర్థులను అరెస్టు చేసిన సిట్ మిగిలిన నిందితుల కోసం గాలిస్తోంది. అరెస్టయిన ఇతర నిందితులను కోర్టు అనుమతితో తమ కస్టడీలోకి తీసుకోవాలని సిట్ నిర్ణయించింది. ‘లీకేజీ’ వ్యవహారంలో 50 మంది డిబార్ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన పలువురిని సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇలా అరెస్టయి కస్టడీలో ఉన్న అభ్యర్థులను టీఎస్పీఎస్సీ పరీక్షల నుంచి డిబార్ చేసింది. ఆయా అభ్యర్థులను ఇప్పటికే టీఎస్పీఎస్సీ నిర్వహించిన పరీక్షల్లో అనర్హులుగా ప్రకటించగా... భవిష్యత్తులోనూ వారిని పరీక్షలకు అనుమతించబోమని తేల్చింది. ఇలా 50మందిని పరీక్షల నుంచి డిబార్ చేస్తూ టీఎస్పీఎస్సీ ఉత్తర్వులు జారీ చేసింది. డిబార్ చేసిన అభ్యర్థులు వివరణ సమర్పించాలని భావిస్తే రెండ్రోజుల్లోగా కమిషన్కు సమరి్పంచాల్సి ఉంటుందని వెబ్నోట్ ద్వారా వెల్లడించింది. అయిన అభ్యర్థులు వీరే.. పులిదిండి ప్రవీణ్కుమార్, అట్ల రాజశేఖర్రెడ్డి, రేణుక రాథోడ్, లవడ్యావత్ దాఖ్య, కే.రాజేశ్వర్, కే.నీలేశ్ నాయక్, పి.గోపాల్నాయక్, కే.శ్రీనివాస్, కే.రాజేందర్ నాయక్, షమీమ్, ఎన్.సురేశ్, డి.రమేశ్కుమార్, ఏ.ప్రశాంత్రెడ్డి, టి.రాజేంద్రకుమార్, డి.తిరుపతయ్య, సాన ప్రశాంత్, వై.సాయిలౌకిక్, ఎం.సాయి సుష్మిత, కోస్గి వెంకట జనార్థన్, కోస్గి మైబయ్య, కోస్గి రవి, కోస్గి భగవంత్ కుమార్, కొంతం మురళీధర్ రెడ్డి, ఆకుల మనోజ్ కుమార్, ఆది సాయిబాబు, పొన్నం వరున్కుమార్, రమావత్ మహేశ్, ముదావత్ శివకుమార్, దానంనేని రవితేజ, గున్రెడ్డి క్రాంతికుమార్ రెడ్డి, కొంతం శశిధర్రెడ్డి, అట్ల సుచరితారెడ్డి, జీపీ పురేందర్, నూతన్ రాహుల్ కుమార్, లవ్డ్యా శాంతి, రమావత్ దత్తు, అజ్మీరా పృథీ్వరాజ్, జాదవ్ రాజేశ్వర్, పూల రవికిశోర్, రాయపూర విక్రమ్, రాయపురం దివ్య, ధనావత్ భరత్ నాయక్, పాశికంటి రోహిత్కుమార్, గాదె సాయిమధు, లోకిని సతీశ్కుమార్, బొడ్డుపల్లి నర్సింగ్రావు, గుగులోత్ శ్రీనునాయక్, భుక్య మహేశ్, ముదావత్ ప్రశాంత్, వడిత్య నరేశ్, పూల రమేశ్కుమార్. -
ప్రశ్నాపత్రాల లీకేజీ కేసు.. టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్ష పేపర్ల లీకేజీతో ప్రమేయమున్న వారిని డీబార్ చేయాలని నిర్ణయించింది. సిట్ అరెస్టు చేసిన 37 మంది ఇకపై టీఎస్పీఎస్సీ నిర్వహించే ఎలాంటి పరీక్షలు రాయకుండా చేయాలని టీఎస్పీఎస్సీ ఆదేశించింది. దీనిపై అభ్యంతరాలుంటే రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని 37 మంది నిందితులకు టీఎస్పీఎస్సీ నోటీసులు జారీ చేసింది. చదవండి: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మరోసారి కవిత పేరు.. -
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరో కొత్త కోణం..
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. వరంగల్ జిల్లాకు చెందిన విద్యుత్ శాఖ డీఈ పేరు కొత్తగా వెలుగులోకి వచ్చింది. విద్యుత్ శాఖ డీఈ కనుసన్నల్లో ఏఈ పేపర్ చేతులు మారినట్లు సమాచారం. ఇప్పటికే ఈ కేసులో విద్యుత్ శాఖ జూనియర్ అసిస్టెంట్ రవికిషోర్ను సిట్ అరెస్ట్ చేసింది. ఆయన 20 మందికి పశ్నాపత్రాలు విక్రయించినట్లు సిట్ బృందం గుర్తించింది. డీఈ ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఓ కోచింగ్ సెంటర్లో శిక్షకుడిగా పనిచేస్తున్నాడని, అభ్యర్థులతో పరిచయం పెంచుకుని ఈ దందాకు తెరలేపినట్లు సిట్ అధికారులు గుర్తించారు. టాప్ మార్కులు వచ్చిన వారి వివరాలను సిట్ బృందం సేకరిస్తోంది. కాగా, ప్రశ్నపత్రాల లీకేజి కేసులో సిట్ అధికారులు గురువారం మరో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా, దీంతో ఈ కేసులో నిందితుల సంఖ్య 43కి, అరెస్ట్ అయిన వారి సంఖ్య 42కు చేరింది. ఈ వ్యవహారంలో సూత్రధారులుగా ఉన్న కమిషన్ మాజీ ఉద్యోగులు పులిదిండి ప్రవీణ్కుమార్, రాజశేఖర్రెడ్డి ద్వారా అనేక ప్రశ్నపత్రాలు ఒకప్పుడు కమిషన్లో పని చేసిన వీరి స్నేహితుడు సురేశ్కు చేరాయి. చదవండి: రవికిశోర్ ద్వారా మరో ముగ్గురికి.. ఇతడు వీటిలో అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ), డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏఓ) పేపర్లను తన అపార్ట్మెంట్లో నివసించే వారికి మధ్యవర్తి ద్వారా విక్రయించాడు. ఈ వ్యవహారంలో నల్లగొండ జిల్లా నకిరేకల్లో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న పూల రవికిశోర్ మధ్యవర్తిగా వ్యవహరించాడు. సురేశ్ గతంలోనే అరెస్టు కాగా.. రవికిశోర్తోపాటు ఏఈ, డీఏఓ పేపర్లు ఖరీదు చేసిన అన్నాచెల్లెళ్లు రాయపురం విక్రమ్, దివ్యలను బుధవారం అరెస్టు చేశారు. -
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ: తవ్వేకొద్దీ బయటపడుతున్న నిజాలు..
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. డీఏవో పరీక్ష టాప్ స్కోరర్లుగా ఉన్న రాహుల్, శాంతి, సుచరితలను సిట్ విచారిస్తోంది. నిందితులను విచారించేందుకు 3 రోజుల పాటు కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. చంచల్ గూడ నుండి నిందితులను కస్టడీని తీసుకుని సిట్ విచారిస్తోంది. మరో వైపు సిట్ ముందు విచారణకు రేణుకా హజరుకానుంది. ఇప్పటికీ యుజర్ ఐడి, పాస్ వర్డ్ వ్యవహారం కొల్లిక్కి లేదు. కస్టోడియన్ శంకర్ లక్ష్మిపై అనుమానాలు బలపడుతున్నాయి. ఇప్పటి వరకు శంకర్ లక్ష్మి కేవలం సాక్షిగా సిట్ పరిగణించింది. తవ్వేకొద్దీ నిందితుల పాత్ర బయట పడుతోంది. ఇప్పటి వరకు 37 మందిని సిట్ అరెస్ట్ చేసింది. మరికొంత మందికి పరీక్ష కంటే ముందే పేపర్ వెళ్లినట్టు సిట్ గుర్తించింది. అరెస్ట్ల సంఖ్య 50కి చేరుకునే అవకాశం ఉంది. చదవండి: కాంగ్రెస్.. మోదీ.. మధ్యలో కేటీఆర్ అదిరిపోయే ఎంట్రీ కాగా, టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో బోర్డుపై సిట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నోటీసులు ఇచ్చినా సరైన సమాచారం ఇవ్వలేదని సిట్ అధికారులు సీరియస్ అయ్యారు. దర్యాప్తుకు సహకరిచకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని బోర్డుకు వార్నింగ్ ఇచ్చారు. కాన్ఫిడెన్షియల్ ఇంచార్జ్ శంకర్ లక్ష్మీ అంశంలో సిట్ కీలక సమాచారం సేకరించింది. శంకర్ లక్ష్మీ కాల్ డేటా వివరాలు సేకరించిన సిట్.. లీకేజీ అంశంలో శంకర్ లక్ష్మీ ప్రమేయం ఉన్నట్లు గుర్తించింది. -
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో బోర్డుపై సిట్ ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో బోర్డుపై సిట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నోటీసులు ఇచ్చినా సరైన సమాచారం ఇవ్వలేదని సిట్ అధికారులు సీరియస్ అయ్యారు. దర్యాప్తుకు సహకరిచకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని బోర్డుకు వార్నింగ్ ఇచ్చారు. కాన్ఫిడెన్షియల్ ఇంచార్జ్ శంకర్ లక్ష్మీ అంశంలో సిట్ కీలక సమాచారం సేకరించింది. శంకర్ లక్ష్మీ కాల్ డేటా వివరాలు సేకరించిన సిట్.. లీకేజీ అంశంలో శంకర్ లక్ష్మీ ప్రమేయం ఉన్నట్లు గుర్తించింది. కాగా 2015 నుంచి శంకర్ లక్ష్మీ టీఎస్పీఎస్సీలో విధులు కొనసాగిస్తున్నారు. DAO, AEE, AE, పేపర్ల అంశంలో టీఎస్పీఎస్సీ వివరాలు దాచిపెట్టనట్లు సిట్ గుర్తించింది.పేపర్లు వాల్యుయేషన్ చేయలేదని TSPSC తప్పుడు వివరాలు ఇచ్చినట్లు తేలింది. మరోవైపు రాథోడ్ వ్యవహారంలో సిట్ కీలక సమాచారం సేకరించింది. బుధవారం మరో సారి విచారణకు రావాలని రేణుకకు నోటీసులు అందించింది. రేణుక నుంచి ప్రవీణ్కు పేపర్ మొదటగా వెళ్లింది. రేణుక రాథోడ్ నుంచి గంబిరాం రాహుల్కు గ్రూప్ పేపర్ చేరింది. అతన్ని సొంత వాహనంలో హైదరాబాద్త ఈసుకొచ్చిన రేణుక.. సిటీలోని సీక్రెట్ రూమ్ బుక్చేసుకొని లీకైన పేపర్ ప్రిపేర్ చేయించింది. అయితే ఇప్పటి వరకు టీఎస్పీఎస్సీ సిట్కు ఇచ్చిన వివరాల్లో తేడాలు ఉన్నట్లు సిట్ అనుమానిస్తోంది. TSPSC వివరాల కోసం సిట్ RTI దాఖలు చేయలేదని సిట్ స్పష్టం చేసింది. RTI దాఖలు చేసినట్లువ స్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపింది. చదవండి: వంట మనిషి కొడుకు ‘సివిల్స్’ కొట్టాడు.. -
ఒకటి... రెండు... మూడు! అరెస్టు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) నిర్వహించిన డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏఓ) పరీక్షల్లో అత్యధిక మార్కులు పొంది, రాష్ట్ర స్థాయిలో తొలి మూడు ర్యాంకులు సాధించింది ‘లీకు వీరులుగా’తేలింది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న రాజేశ్వర్కు మొదటి ర్యాంకు, అతడి భార్య శాంతికి రెండో ర్యాంకు, మరో నిందితురాలు లవడ్యావత్ రేణుక స్నేహితుడు రాహుల్ కుమార్కు మూడో ర్యాంకు వచ్చాయి. ఈ ముగ్గురూ లీౖకైన మాస్టర్ ప్రశ్నపత్రం ఆధారంగానే పరీక్షలు రాసినట్లు అధికారులు తేల్చారు. ఇప్పటికే అరెస్టయిన రాజేశ్వర్కి బెయిల్ కూడా వచ్చింది. దీంతో శాంతి, రాహుల్తో పాటు టీఎస్పీఎస్సీ మాజీ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ రాజశేఖర్రెడ్డి భార్య సుచరిత, నాగార్జునసాగర్కు చెందిన దళారి రమావత్ దత్తులను బుధవారం అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. రేణుక ద్వారా రాహుల్కు.. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న రాహుల్కు కొన్నేళ్లుగా లీకేజీలో కీలక సూత్రధారి అయిన ప్రవీణ్కుమార్ స్నేహితురాలు రేణుకతో పరిచయం ఉంది. డీఏఓ పరీక్ష రాస్తున్నాడనే విషయం తెలిసిన రేణుక ఈ ఏడాది ఫిబ్రవరిలో రాహుల్ను కలిసి డీఏఓ మాస్టర్ పేపర్ను చూపించింది. అందులో ఉన్న ప్రశ్నలు–జవాబులను రాహుల్ తన వద్ద ఉన్న నోట్ బుక్లో రాసుకున్నాడు. వీటి ఆధారంగా పరీక్షకు సిద్ధమైన అతడు మూడో ర్యాంకు సాధించాడు. ఇదే పేపర్ను రేణుక భర్త డాక్యా నుంచి తీసుకుని రాజేశ్వర్, అతడి భార్య శాంతి పరీక్ష రాశారు. తొలి పది ర్యాంకులు వచ్చిన వారిపై దృష్టి లీకేజ్ కేసు దర్యాప్తు ప్రారంభించిన సిట్ అధికారులు వివిధ కోణాల్లో ముందుకు వెళ్తున్నారు. ప్రతి పరీక్షలోనూ అధిక మార్కులు, మొదటి పది ర్యాంకులు సాధించిన వారి వివరాలను సేకరించి విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే డీఏఓ పరీక్షల్లో ర్యాంకులు, మార్కులు సాధించిన వారిపై దృష్టి పెట్టిన పోలీసులు శాంతి, రాహుల్, సుచరిత, రాజేశ్వర్ల వ్యవహారం గుర్తించారు. రాజేశ్వర్ గతంలోనే ఈ కేసులో అరెస్టు అవడంతో బుధవారం రాహుల్, శాంతి, సుచరిత, దత్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. వీళ్లు విషయం అంగీకరించడంతో అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ పేపర్ వీరి నుంచి మరెవరికైనా చేరిందా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. తదుపరి విచారణ నిమిత్తం ఈ నలుగురినీ కస్టడీకి కోరాలని సిట్ అధికారులు నిర్ణయించారు. ఈ అరెస్టులతో కలిసి ఇప్పటి వరకు లీకేజ్ కేసులో అరెస్టు అయిన వారి సంఖ్య 34కు చేరింది. -
‘టీఎస్పీఎస్సీ లీకేజ్’ కేసులో మరో ముగ్గురు
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్ల లీకేజీ కేసులో మరో ముగ్గురు నిందితులను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మంగళవారం అరెస్టు చేసింది. వీళ్లు ఏఈఈ, డీఏఓ పరీక్ష పత్రాలు ఖరీదు చేసిన అభ్యర్థులని అధికారులు ప్రకటించారు. వీరితో ఇప్పటి వరకు అరెస్టు అయిన వారి సంఖ్య 30కి చేరింది. కమిషన్ కార్యదర్శి వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పని చేసిన ప్రవీణ్కుమార్ నుంచి ఏఈఈ పేపర్లు వరంగల్, హైదరాబాద్లకు చెందిన దళారులు మనోజ్కుమార్రెడ్డి, మురళీధర్రెడ్డిలకు చేరాయి. వీటిని ఏడుగురికి విక్రయించారు. ఒక్కోక్కరితో రూ.10 లక్షలకు ఒప్పందం చేసుకుని రూ.1 లక్ష నుంచి రూ.1.5 లక్షల వరకు అడ్వాన్సులు తీసుకుని పేపర్లు అందించారు. మనోజ్, మురళీ విచారణలో వీరి నుంచి పేపర్లు ఖరీదు చేసిన వారి పేర్లు వెలుగులోకి వచ్చాయి. దీంతో గత వారం నలుగురిని అరెస్టు చేసిన సిట్ మంగళవారం క్రాంతి, శశిధర్రెడ్డిలను పట్టుకుంది. ఈ ద్వయం మురళీధర్రెడ్డి నుంచి ఏఈఈ పేపర్లు ఖరీదు చేసినట్లు గుర్తించింది. మరోపక్క ప్రవీణ్ కుమార్ రూ.6లక్షలు తీసుకుని ఖమ్మంకి చెందిన భార్యాభర్తలు సాయి సుస్మిత, సాయి లౌకిక్లకు డీఏఓ పేపర్ విక్రయించాడు. వీరిని సిట్ అధికారులు గత నెలలోనే అరెస్టు చేశారు. సాయి లౌకిక్ ఆ పేపర్ను తన స్నేహితుడైన రవి తేజకు విక్రయించాడు. దర్యాప్తులో ఈ విషయం గుర్తించిన పోలీసులు మంగళవారం రవితేజను కటకటాల్లోకి పంపారు. మంగళవారం అరెస్టయిన ముగ్గురు నిందితులను రిమాండ్కు తరలించారు. తదుపరి విచారణ నిమిత్తం వీరిని తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని సిట్ నిర్ణయించింది. పేపర్ లీకేజీపై ఈడీకి బీఎస్పీ ఫిర్యాదు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వెనుక ఉన్న అసలైన సూత్రధారులను అరెస్టు చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు ఈడీకి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ రాసిన లేఖను పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు వెంకటేష్ చౌహాన్, అరుణ, సంజయ్లు ఈడీ కార్యాలయంలో సంబంధిత అధికారికి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుద్యోగ యువత జీవితాలతో ఆడుకున్న విచారణ జరపాలని ఈడీకి ఫిర్యాదు చేశామని తెలిపారు. -
ఇచ్చిపుచ్చుకున్నారు.. చంద్రబాబు క్విడ్ ప్రో కో గుట్టురట్టు
సాక్షి, అమరావతి: కృష్ణా నది కరకట్టపై చంద్రబాబు నివాసం.. అమరావతిలో చంద్రబాబు క్విడ్ ప్రోకో కు ఓ మచ్చు తునకని నిగ్గు తేలింది. అమరావతిలోని సీడ్ క్యాపిటల్లో నారాయణ బినామీల పేరిట ఉన్న 75,888 చదరపు గజాల స్థలాలు టీడీపీ భూబాగోతానికి నిదర్శనమని నిర్ధారణ అయ్యింది. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో టీడీపీ పెద్దల అవినీతి బట్టబయలైంది. అమరావతి మాస్టర్ ప్లాన్ రూపకల్పనలోనే చంద్రబాబు, నారాయణ, లింగమనేని, వారి బంధువులు, బినామీలు భారీ భూ దోపిడీకి బరితెగించారని ఆధారాలతో సహా వెల్లడైంది. చంద్రబాబు అండ్ గ్యాంగ్ అమరావతిలోని అవినీతి సామ్రాజ్యాన్ని సీఐడీకి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) బట్టబయలు చేసింది. దాంతో టీడీపీ ప్రభుత్వంలో అమరావతి కేంద్ర బిందువుగా ఏ–1 నారా చంద్రబాబు, ఏ–2 పొంగూరు నారాయణ యథేచ్ఛగా సాగించిన భారీ భూ దోపిడీపై ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. అమరావతిలో చంద్రబాబు ప్రభుత్వం పాల్పడిన అక్రమాలు, అవినీతిపై దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను నియమించడం సరైనదేనని ఇటీవల సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దాంతో తన అవినీతి బట్టబయలు కాకుండా చంద్రబాబు కొన్నేళ్లుగా అడ్డుకుంటున్న కుట్రలకు తెరపడింది. ఈ నేపథ్యంలో రాజధాని ల్యాండ్ పూలింగ్, సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లలో పచ్చ ముఠా అక్రమాలపై ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. బాబు, నారాయణవి అక్రమ ఆస్తులే అక్రమ మార్గంలో సంపాదించిన ఆస్తులను అటాచ్ చేసేందుకు ప్రభుత్వానికి అధికారం కల్పిస్తున్న క్రిమినల్ లా ఆర్డినెన్స్ ప్రకారం అనుమతించాలని సీఐడీ కోరింది. ఈ మేరకు అవినీతి నిరోధక చట్టం–1988 ప్రకారం లింగమనేని కుటుంబం క్విడ్ ప్రో కో కింద చంద్రబాబుకు ఇచ్చిన కరకట్ట నివాసం.. సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో నారాయణ బినామీల పేరిట పొందిన 75,888 చదరపు గజాల స్థలాలను అటాచ్ చేసేందుకు సీఐడీకి అనుమతిస్తూ హోమ్ శాఖ రెండు వేర్వేరు జీవోలు జారీ చేసింది. దాంతో సీఐడీ ఆ విషయాన్ని ఏసీబీ న్యాయస్థానానికి నివేదించి, ఆ ఆస్తులను అటాచ్ చేసేందుకు ఉపక్రమించనుంది. తదుపరి దశల్లో మరిన్ని కఠిన చర్యలు చేపట్టేందుకు సన్నాహాలు వేగవంతం చేస్తోంది. భారీ అవినీతికే ‘మాస్టర్ ప్లాన్’ అమరావతి మాస్టర్ ప్లాన్ రూపకల్పనలోనే ఏ–1 చంద్రబాబు, ఏ–2 నారాయణ భారీ అవినీతికి పునాది వేశారు. కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండానే అప్పటి టీడీపీ ప్రభుత్వం, సింగపూర్కు చెందిన ఇంటర్నేషనల్ ఎంటర్ప్రైజస్తో ఒప్పందం చేసుకుంది. అమరావతి మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు కన్సల్టెన్సీ ఎంపిక కోసం కనీసం టెండర్ల ప్రక్రియ కూడా చేపట్టకుండా సింగపూర్ కంపెనీకి నామినేషన్ పద్ధతిలో అడ్డగోలుగా అప్పగించేశారు. దాంతో చంద్రబాబు, నారాయణ కనుసన్నల్లోనే మాస్టర్ ప్లాన్ను సింగపూర్ కంపెనీ రూపొందించింది. లింగమనేని రమేశ్, లింగమనేని రాజశేఖర్, హెరిటేజ్ ఫుడ్స్, చంద్రబాబు బినామీలకు చెందిన భూములు ల్యాండ్ పూలింగ్ పరిధిలోకి రాకుండా.. వారి భూముల వెలుపలి నుంచే ల్యాండ్ పూలింగ్ చేసేలా మాస్టర్ ప్లాన్ను ఖరారు చేశారు. అందుకు ప్రతిగా చంద్రబాబు కుటుంబానికి లింగమనేని కుటుంబం భారీగా ప్రతిఫలాన్ని ముట్టజెప్పింది. క్విడ్ ప్రోకో కిందే కరకట్ట నివాసం చంద్రబాబు, లింగమనేని క్విడ్ ప్రో కో కింద పరస్పరం భారీగా అవినీతికి పాల్పడినట్టు సిట్ నిర్ధారించింది. లింగమనేని కుటుంబ సభ్యుల భూములు ల్యాండ్ పూలింగ్ పరిధిలోకి రాకుండా చేసినందుకు చంద్రబాబుకు భారీగా ముట్టజెప్పారు. ఇన్నర్రింగ్ రోడ్డుకు ఆనుకుని ఉన్న భూములను హెరిటేజ్ ఫుడ్స్కు ‘అమ్మినట్టు’ ఇవ్వడంతో సరిపెట్టలేదు. లింగమనేని కృష్ణానది కరకట్ట మీద ఉన్న నివాసాన్ని కూడా చంద్రబాబుకు ఇవ్వడం గమనార్హం. పక్కా క్విడ్ ప్రో కోలో భాగంగానే కరకట్ట నివాసం చంద్రబాబుకు ఉచితంగా ఇచ్చేశారని సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది. కరకట్ట నివాసంపై బాబు కట్టుకథలు కరకట్ట నివాసంపై న్యాయస్థానాన్ని, ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు జీతంతోపాటు హౌస్ రెంట్ అలవెన్స్ (ఇంటి అద్దె అలవెన్స్) కూడా తీసుకున్నారు. అంటే ప్రజాధనం నుంచి సీఎంగా ఇంటి అద్దె అలవెన్స్ తీసుకున్నారు. కానీ చంద్రబాబు 2017 నుంచి తాను ఉంటున్న కరకట్ట నివాసానికి అద్దెను లింగమనేని కుటుంబానికి చెల్లించినట్టు ఎక్కడా బ్యాంకు లావాదేవీలు లేవు. చంద్రబాబు నుంచి తీసుకున్న అద్దెకు లింగమనేని ఎక్కడా జీఎస్టీ చెల్లించనే లేదు. అంటే ఇంటి అద్దె అలవెన్స్ను ప్రజాధనం నుంచి తీసుకుంటున్న చంద్రబాబు.. తాను నివసిస్తున్న ఇంటికి మాత్రం అద్దె చెల్లించడమే లేదన్నది నిర్ధారణ అయ్యింది. క్విడ్ ప్రో కోలో భాగంగా ఆ నివాసం చంద్రబాబుకు లింగమనేని ఇచ్చారు కాబట్టే అద్దె చెల్లించలేదు. దేశ భక్తితో ఇచ్చారట! కరకట్ట నివాసంపై న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించేందుకు లింగమనేని కూడా యత్నించారు. తాను దేశభక్తితోనే కరకట్ట నివాసాన్ని అప్పటి ప్రభుత్వం వాడుకునేందుకు ఉచితంగా ఇచ్చానని లింగమనేని రమేశ్ న్యాయస్థానానికి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. మరి ఉచితంగా ఇచ్చిన ఇంటికి చంద్రబాబు ప్రజాధనం నుంచి ఇంటి అద్దె అలవెన్స్ను ఎలా తీసుకున్నారన్న ప్రశ్నకు సమాధానమే లేదు. దేశభక్తితో ఉచితంగా ఇస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలి గానీ చంద్రబాబుకు వ్యక్తిగతంగా ఇవ్వడం ఏమిటి? ప్రభుత్వానికే ఉచితంగా ఇచ్చి ఉంటే.. చంద్రబాబు సీఎం పదవి నుంచి దిగిపోగానే ఆ ఇంటిని ఖాళీ చేయాలి. ఆ ఇంటిని ప్రభుత్వానికి అప్పగించాలి. ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగిన తర్వాత ప్రభుత్వ ఆధ్వర్యంలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయాన్ని ఖాళీ చేయాలి. ఆ నివాసం ప్రభుత్వానికి చెందుతుంది. కానీ 2019లో సీఎం పదవి నుంచి దిగిపోయిన తర్వాత కూడా చంద్రబాబు అదే కరకట్ట నివాసంలో ఉంటున్నారు. అంటే లింగమనేని దేశ భక్తితో ప్రభుత్వానికి ఉచితంగా ఇచ్చారన్నది అవాస్తవం. క్విడ్ ప్రో కోలో భాగంగానే ఆయన చంద్రబాబుకు ఇచ్చారన్నది దీనినిబట్టి కూడా నిర్ధారణ అయ్యింది. లింగమనేని నుంచి హెరిటేజ్ ఫుడ్స్కు భూమి 2014లో లింగమనేని కుటుంబ సభ్యుల నుంచి హెరిటేజ్ ఫుడ్స్ 4 ఎకరాలను ‘కొనుగోలు చేసినట్టు’ చూపించడం గమనార్హం. అమరావతి ల్యాండ్ పూలింగ్ పరిధిలోకి రాకుండా ఇన్నర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న భూమినే హెరిటేజ్ ఫుడ్స్ కొనుగోలు చేసింది. ఆ పేరుతో ఆ భూమిని హెరిటేజ్ ఫుడ్స్కు బదలాయించారు. ఆ మేరకు అప్పట్లోనే నారా లోకేశ్ డైరెక్టర్గా ఉన్న హెరిటేజ్ ఫుడ్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో తీర్మానం చేశారు. అనంతరం ఎమ్మెల్సీగా ఎన్నికై, మంత్రి కూడా అయిన లోకేశ్ అదే లింగమేని కుటుంబం ఇచ్చిన కరకట్ట మీద నివాసంలోనే నివసించారు. సీడ్ క్యాపిటల్లో వేళ్లూనుకున్న అవినీతి ► అమరావతిలో అత్యంత ప్రధానమైన సీడ్ క్యాపిటల్లో కూడా ఏ–1 చంద్రబాబు, ఏ–2 నారాయణ భారీగా భూ అక్రమాలకు పాల్పడ్డారు. ఎందుకంటే శాసనసభ, సచివాలయం మొదలైన ప్రధాన విభాగాలన్నీ కూడా సీడ్ క్యాపిటల్ పరిధిలోనే నిర్మించాలని నిర్ణయించారు. ► ఆ ప్రాంతంలో భూముల ధరలు భారీగా పెరుగుతాయి కాబట్టి, సీడ్ క్యాపిటల్లో పూర్తిగా తమ వాటా భూములే ఉండేట్టుగా చంద్రబాబు, నారాయణ పన్నాగం పన్నారు. సింగపూర్ కంపెనీ సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ను ప్రభుత్వానికి 2015 జూలైలోనే సమర్పించింది. కానీ ఆ ప్లాన్ను బహిర్గతం చేయకుండా, ఆమోదించకుండా మూడు నెలలపాటు కాల యాపన చేశారు. ► ఆ సమయంలోనే నారాయణ తమ బినామీలు, బంధువులైన పొత్తూరి ప్రమీల, రాపూరి సాంబశివరావు, ఆవుల ముని శంకర్, వరుణ్ కుమార్ కొత్తప్ప పేరున సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో 65.50 ఎకరాలు కొనుగోలు చేశారు. అందుకోసం నారాయణ భార్య రమాదేవి, అల్లుడు డైరెక్టర్లుగా ఏర్పాటు చేసిన ఎన్స్పైరా కంపెనీ నుంచి నిధులను తమ బంధువులు, బినామీల ఖాతాల్లోకి మళ్లించారు. వారి పేరున సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో భూములు కొనుగోలు చేశారు. ► రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరును బినామీగా పెట్టుకుని కూడా నారాయణ సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో భూములు కొనుగోలు చేశారు. నారాయణ కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల నుంచి రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ బాం్యకు ఖాతాకు నిధులు బదిలీ చేశారు. ఆ నిధులతో ఆ కంపెనీ ఉద్యోగుల పేరున భూములు కొనుగోలు చేశారు. ► కేసు దర్యాప్తులో భాగంగా ఆ ఉద్యోగులను సిట్ అధికారులు ప్రశ్నించగా తాము నారాయణ బినామీలుగానే భూములు కొనుగోలు చేశామని వాంగ్మూలం ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇలా నారాయణ తమ బంధువులు, బినామీల పేరిట సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో కొనుగోలు చేసిన 65.50 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ కింద సీఆర్డీఏకు ఇచ్చారు. ► అందుకు ప్రతిగా ల్యాండ్ పూలింగ్ ప్యాకేజీ కింద సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో అత్యంత విలువైన 75,888 చదరపు గజాల స్థలాలు పొందారు. వాటిలో 7,620 చదరపు గజాలు, 8,880 చదరపు గజాలు, 6,550 చదరపు గజాలు, 25 వేల చదరపు గజాల స్థలాలు కూడా ఉన్నాయి. అవి నేరుగా సీడ్ యాక్సెస్ రోడ్డుకు అనుసంధానించి ఉండటం గమనార్హం. ► భవిష్యత్లో స్టార్ హోటళ్లు, షాపింగ్ మాల్స్, ఇతర భారీ వాణిజ్య సముదాయాల నిర్మాణానికి అనుకూలమైన విలువైన స్థలాలను పొందారన్నది స్పష్టమవుతోంది. పూలింగ్ ప్యాకేజీ కింద ఏటా సీఆర్డీఏ ఇప్పటి వరకు చెల్లించిన రూ.1.92 కోట్ల కౌలు మొత్తం ఎన్స్పైరా ఖాతాల్లో జమ చేస్తున్నారు. అంటే ఆ భూములు కొనుగోలు చేసి సీఆర్డీఏకే ఇచ్చినట్టు పేర్కొన్న పొత్తూరి ప్రమీల, రా>పూరి సాంబశివరావు, ఆవుల ముని శంకర్, వరుణ్ కుమార్ కొత్తప్ప పూర్తిగా నారాయణ బినామీలేనన్నది నిర్ధారణ అయ్యింది. వారి భూముల వద్దే ఇన్నర్ రింగ్ రోడ్డు అమరావతిలో 75 మీటర్ల ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ను రూపొందించడంలో చంద్రబాబు, నారాయణ యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడ్డారు. వారి భూములను ఆనుకునే ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మించేలా అలైన్మెంట్ను రూపొందించారు. లింగమనేని కుటుంబం, హెరిటేజ్ ఫుడ్స్, నారాయణ విద్యా సంస్థల సమీపం నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మించేలా చంద్రబాబు, నారాయణ ప్రత్యేకంగా పర్యవేక్షించారు. తమ భూముల నుంచి కాకుండా సామాన్య రైతుల భూముల నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మించేలా అలైన్మెంట్ను ఖరారు చేయడం గమనార్హం. అందుకోసం ముందుగానే ఆ భూముల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు, ఇళ్ల నిర్మాణాలకు కూడా అనుమతి ఇవ్వకుండా సీఆర్డీయే నిలుపుదల చేసింది. అంటే కన్సల్టెన్సీ సంస్థ అలైన్మెంట్ను రూపొందించకముందే చంద్రబాబు, నారాయణ ఇన్నర్ రింగ్ రోడ్డు ఎలా నిర్మించాలో నిర్ణయించేశారు. అప్పటికే నిర్ణయించిన అలైన్మెంట్ను ఖరారు చేసేందుకే ఓ కన్సల్టెన్సీని నియమించి కనికట్టు చేశారు. చదవండి: దిగజారుడు పాత్రికేయానికి మరో మచ్చుతునక వాస్తవానికి విజయవాడలోని కామినేని ఆస్పత్రి వద్ద ఉన్న తాడిగడప– ఎనికేపాడు మీదుగా ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మించాలని కన్సల్టెన్సీ సంస్థ ఎస్టీయూపీ అలైన్మెంట్ను రూపొందించింది. అలా నిర్మిస్తే నారాయణ విద్యా సంస్థలతోపాటు హెరిటేజ్ ఫుడ్స్, లింగమనేని భూముల మీదుగా రోడ్డును నిర్మించాల్సి వస్తుంది. దీనిపై అప్పటి సీఆర్డీయే వైస్ చైర్మన్గా ఉన్న నారాయణ సీఆర్డీయే సమావేశంలోనే అధికారులపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. తాడిగడపకు 3 కి.మీ. దూరంగా తూర్పు వైపు నుంచి పెనమలూరు– నిడమానూరు మీదుగా ఇన్నర్రింగ్ రోడ్డు నిర్మించేలా అలైన్మెంట్ను మార్పించారు. -
TSPSC: పేపర్ లీక్లో మరో ట్విస్ట్.. ఎంపీడీవో ఆఫీసు ఉద్యోగి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసు ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. కాగా, పేపర్ లీకేజీ కేసులో సిట్ స్పీడ్ పెంచింది. ఈ కేసులో తాజాగా మరో ఇద్దరిని సిట్ అరెస్ట్ చేసింది. వికారాబాద్ ఎంపీడీవో కార్యాలయంలో పనిచేస్తున్న భగవంత్, అతడి తమ్ముడు రవికుమార్ను సిట్ అధికారులు అరెస్టు చేశారు. వివరాల ప్రకారం.. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో నిందితుడిగా ఉన్న డాక్యా నాయక్ నుంచి ఏఈ పేపర్ను తన తమ్ముడు రవి కోసం భగవంత్ కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో వారిద్దరిని అరెస్ట్ చేసినట్టు సిట్ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో డాక్యా నాయక్ ఖాతాలను విశ్లేషించగా.. రూ.2లక్షలకు భగవంత్ ఏఈ పేపర్ కొనుగోలు చేసిన విషయం బయటపడినట్లు సిట్ వెల్లడించింది. కాగా ఈ వ్యవహారంలో ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో నిందితులకు రూ.33.4 లక్షలు అందినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఇది కూడా చదవండి: పొంగులేటి, జూపల్లితో భేటీపై ఈటల రాజేందర్ ఏమన్నారంటే? -
బాబు అక్రమాలపై విచారణకు సుప్రీం గ్రీన్సిగ్నల్ ఇవ్వడం శుభ పరిణామమే
ఆంధప్రదేశ్లో 2014 నుంచి 2019 వరకు పాలన సాగించిన తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై విచారణకు సుప్రింకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేష పరిణామమే. కాని ఇప్పటికి మూడేళ్లపాటు ఈ విచారణ ముందుకు సాగకుండా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అడ్డుకోగలిగారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి ఆరోపణలపై జరుగుతున్న విచారణ చేయకుండా ప్రాధమిక దశలోనే హైకోర్టు స్టే ఇవ్వడాన్ని సుప్రీం ఆక్షేపించింది. దీనిని ఎవరైనా స్వాగతించవలసిందే. అప్పట్లో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై చాలా విమర్శలు వచ్చాయి. గత ప్రభుత్వ నిర్ణయాలను కొత్త ప్రభుత్వం సమీక్షించకూడదంటే, గత పాలన హయాంలో జరిగిన అవినీతిని ఆ తర్వాత ప్రభుత్వం విచారించకూడదని న్యాయ వ్యవస్థ నిర్ణయం చేస్తే, ఎదురయ్యే దుష్పపరిణామాలపై చాలా చర్చ జరిగింది. నిజానికి ఈ కేసు లో పిటిషన్లు వేసిన వారికి ఈ స్కామ్ లతో నేరుగా సంబంధం లేదు. వారు ధర్డ్ పార్టీ అవుతారు. వారితో హైకోర్టులో పిటిషన్ వేయించి , ఇంతకాలం విచారణ జరపకుండా ఆటంకాలు సృష్టించిన టీడీపీ ఇకపై కూడా రకరకాల వ్యూహాలు అనుసరించి,కేసు ముందుకు సాగకుండా యత్నించవచ్చు. గౌరవ హైకోర్టు వారు ఇలాంటి అవినీతి కేసుల దర్యాప్తు మొదలు కాకుండానే ఎఫ్.ఐ.ఆర్.కొట్టివేసే పరిస్థితి వస్తే భవిష్యత్తులో ఎవరు ప్రభుత్వంలో ఉన్నా యధేచ్చగా అక్రమాలకు పాల్పడే అవకాశం ఉంటుందన్న అభిప్రాయం ఏర్పడింది. అమరావతి భూముల స్కామ్ , ఫైబర్ నెట్ స్కామ్, స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్, అమరావతి అస్సైన్డ్ భూముల కుంభకోణం , అమరావతి రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్పు వంటి పలు ఆరోపణలు అప్పట్లో వచ్చాయి. వీటిపై కొత్తగా అదికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘం ద్వారా పరిశీలన చేయించింది. తదుపరి ఉప సంఘం సిఫారస్ మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందాలను (సిట్ ) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సిట్ తమ పని మొదలు పెట్టిందో, లేదో తెలుగుదేశం పార్టీ వారు హైకోర్టును ఆశ్రయించడం ఆరంబించారు. అప్పట్లో హైకోర్టులో కూడా పలు ఉత్తర్వులు ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన క్రమంలో ఈ విషయంలో కూడా ఎదురుదెబ్బే తగిలింది. అయితే ఏపీ ప్రభుత్వం ఈ అవినీతి కేసుల విచారణను రాష్ట్ర ప్రభుత్వం కాకుండా కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐ వంటివాటితో చేయించడానికి అభ్యంతరం లేదని చెప్పినా హైకోర్టు ఒప్పుకోలేదు. కారణం ఏమైనా , అలాంటి తీర్పులు సమాజానికి మేలు చేస్తాయా?లేదా? అన్న మీమాంస ఏర్పడింది. ఈ తీర్పుల ఆధారంగా టీడీపీ రెచ్చిపోయి, అసలు అవినీతే జరగలేదని కోర్టు తమకు సర్టిఫికెట్ ఇచ్చేసినంతగా ప్రచారం చేసుకునేది . జగన్ కాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు కాని చేసిన ఆరోపణలలో పస లేదని అనేవారు. విశేషమేమిటంటే కేసులు పెట్టకపోతే మీరు ఏమి పీకారు? ఒక్క దానిలో కూడా కేసు పెట్టలేకపోయారు? ఒక్క కేసు కూడా రుజువు చేయలేకపోయారు!అని వ్యాఖ్యానించేవారు. అదే కేసు పెట్టగానే ఇంకేముంది ఈ ప్రభుత్వం కక్ష కట్టిందని సానుభూతి కోసం మాట్లాడేవారు .ఇలా డబుల్ గేమ్ ఆడుతూ వచ్చిన టీడీపీకి ఇప్పుడు సుప్రింకోర్టు షాక్ ఇచ్చినట్లయింది. వారు ఇది ఊహించని విషయమే అయి ఉంటుంది. ఇప్పుడు అసలు గేమ్ మొదలవుతుంది. సిట్ దర్యాప్తునకు అభ్యంతరాలు తొలగిపోవడంతో అదికారులు తమ విచారణను వేగవంతం చేయవచ్చు.ఇప్పటికే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో సహా పలువురు మంత్రులు ఈ కేసుల్లో చంద్రబాబు కూడా అరెస్టు అవక తప్పదని అంటున్నారు. అది ఎంతవరకు జరుగుతుందనేది అప్పుడే చెప్పలేం. ఎందుకంటే చంద్రబాబును తక్కువ అంచనా వేయజాలం. ఆయా వ్యవస్థను మేనేజ్ చేయడంలో ఆయన సిద్దహస్తుడన్న పేరు ఉంది. అరెస్టు సంగతి ఎలా ఉన్నా, ఇప్పటికే ఆయనపైన, ఆయన అనుచరులపైన నమోదైన కేసులలో విచారణకు స్వయంగా హాజరు కాక తప్పకపోవచ్చు. చంద్రబాబును ఒక విచారణాధికారి ముందు కూర్చోబెట్టి ప్రశ్నించగలిగితే అదే గొప్ప విషయం గా అనుకునే పరిస్థితి ఉంది.అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ అయినా ఆయా కేసులలో విచారణ ఎదుర్కున్నారేమో కాని, పస్తుత అధ్యక్షుడు బిడైన్ ఇంటిలో ఎఫ్ బి ఐ అదికారులు సోదాలు జరిపారేమో కాని, చంద్రబాబుపై ఎన్ని ఆరోపణలు ఉన్నా, ఎవరూ ఆయన దాకా వెళ్లలేకపోయారు. చదవండి: విచారిస్తేనే వెలుగులోకి! బాబు సర్కారు కుంభకోణాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు మన దేశంలో ఎమర్జెన్సీ తర్వాత ఇందిరాగాంధీ,ఎమ్.పిలకు ముడుపులు చెల్లించారన్న అభియోగం లో పివి నరసింహారావు వంటి మాజీ ప్రధానులు ,కొన్ని అవినీతి కేసులలో కొందరు మాజీ ముఖ్యమంత్రులు కూడా దర్యాప్తులకు అతీతంగా లేరు. కాని చంద్రబాబు మాత్రం ఏదో రకంగా రక్షణ పొందడమే ఆయన ప్రత్యేకత అని చెప్పాలి.ఉదాహరణకు ఓటు కు నోటు కేసును తీసుకోవచ్చు చార్జీషీట్ లో ముప్పైఆరుసార్లు చంద్రబాబు పాత్రపై ప్రస్తావన ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆ కేసులో చంద్రబాబును బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడని అనేవారు. కాని అంతిమంగా చంద్రబాబుపై ఎఫ్ ఐ ఆర్ కూడా పెట్టలేకపోయారు. అది చంద్రబాబు మేనేజ్ మెంట్ స్కిల్ అని చాలా మంది అబిప్రాయపడ్డారు. వైసిపి ప్రభుత్వం వచ్చాక పలు ఆరోపణలపై చంద్రబాబు,మంత్రి నారాయణ, తదితరులపై కేసులు పెట్టినా అడుగు ముందుకు పడుతుందా?లేదా? అన్న సంశయం కలిగించగలిగారు.న్యాయ వ్యవస్థకు చెందిన కొందరు ప్రముఖుల బంధువులు కూడా ఇన్వాల్వ్ అయిన మరో కేసును హైకోర్టు కొట్టివేసింది. చదవండి: చంద్రబాబుకు బిగ్ షాక్.. ఈ కేసులో మొదటి నుంచీ ఏం జరిగిందంటే? అది కూడా పెద్ద చర్చే అయింది. ఇలా ఎన్నో ప్రతికూలతలను ఎదుర్కొన్నా, పట్టుదలతో ప్రభుత్వం ముందుకు సాగి ఈ కేసుల దర్యాప్తు సాగించడానికి ఇప్పటికి ఒక కొలిక్కి తీసుకు వచ్చినట్లు అనిపిస్తుంది. హైకోర్టులో టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ లు వేసిన మెయిన్ పిటిషన్ లపై మూడు నెలల్లో విచారణ పూర్తి కావల్సి ఉంది. ఆ పిటిషన్ లు పెండింగులో ఉన్నా సిట్ దర్యాప్తుకు ఇబ్బంది లేదని చెబుతున్నారు. ఆ పిటిషన్ లను హైకోర్టు కొట్టివేస్తే ప్రభుత్వం మరింత చురుకుగా ముందుకు వెళ్లవచ్చు.భిన్నమైన తీర్పు వస్తే మాత్రం మళ్లీ అడ్డంకులు ఏర్పడతాయి. కాని సుప్రింకోర్టు ఇచ్చిన తీర్పులోని కొన్ని అంశాలు ,ప్రత్యేకించి అసలు దర్యాప్తు ప్రాధమిక దశలో ఉండగానే స్టే ఇవ్వడం ఏమిటని సుప్రింకోర్టు ప్రశ్నించిన తీరు ప్రభావం హైకోర్టు విచారణలో ఎంతో కొంత పడుతుంది. సిబిఐ విచారణకు సిద్దపడడం కూడా రాష్ట్ర ప్రభుత్వ వాదనకు బలం చేకూరే అంశం అవుతుంది. అవినీతి ఆరోపణల కేసులలో న్యాయ వ్యవస్థ ఒక్కోసారి ఒక్కోరకంగా స్పందిస్తోందన్న భావన ఏర్పడడం మంచిది కాదు. చంద్రబాబు ప్రభుత్వం వేల కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడిందన్నది ఆరోపణ. దళితులకు సంబంధించిన వందల ఎకరాలను అక్రమంగా టీడీపీ నేతలు కాజేశారన్నది మరో అబియోగం. వీటిపై ఇప్పటికే పలుమార్లు అసెంబ్లీలో చర్చించారు. పలు ఆధారాలు కూడా ప్రభుత్వం ప్రదర్శించింది. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ స్కామ్ లో అయితే ముఖ్యమంత్రి జగన్ పూసగుచ్చినట్లు స్కామ్ జరిగిన తీరును వివరించారు. ఇంత చెప్పిన తర్వాత కూడా వాటిపై విచారణ జరిపి ఒక అర్ధవంతమైన ముగింపు తేలేకపోతే వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం లేకుండా పోతుంది. ప్రభుత్వం తాను అనుకున్నట్లు ఈ కేసులలో వేగం పెంచగలుగుతుందా?లేక చంద్రబాబు మేనేజ్ మెంట్ స్కిల్ మరోసారి బయటకు వస్తుందా అన్నది తేలడానికి మరికొంత సమయం పడుతుంది. :::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ ప్రెస్ అకాడెమీ చైర్మన్ -
చంద్రబాబు సర్కారు కుంభకోణాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలను హైకోర్టు తప్పుగా అన్వయించింది. గత సర్కారు నిర్ణయాలను రద్దు చేసినట్లుగా హైకోర్టు పరిగణించిందన్న రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ న్యాయవాది వాదనలు సమర్థనీయంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన రెండు జీవోలను పరిశీలిస్తే.. గత సర్కారు తీసుకున్న నిర్ణయాలపై సమీక్షించటాన్ని రద్దు చేస్తున్నట్లుగా భావించలేం. – ‘సుప్రీం’ ధర్మాసనం సాక్షి, అమరావతి: ఇన్నాళ్లూ సాంకేతిక కారణాలతో తప్పించుకుని తిరుగుతున్న మాజీ సీఎం చంద్రబాబు బృందం అక్రమాలపై ‘స్టే’లను కొట్టివేస్తూ విచారణ కొనసాగించేందుకు వీలుగా అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ సర్కారు హయాంలో చోటు చేసుకున్న అవినీతి బాగోతాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ద్వారా విచారణకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. అమరావతి భూ కుంభకోణం, ఏపీ ఫైబర్ నెట్ కుంభకోణం తదితరాల విషయంలో సుప్రీంకోర్టు బుధవారం కీలక తీర్పు వెలువరించింది. గత సర్కారు తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు, అవినీతి ఆరోపణలు, ఉల్లంఘనలపై వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు మంత్రివర్గ ఉపసంఘం, సిట్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోల్లో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ హైకోర్టు 2020లో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను తాజాగా అత్యున్నత న్యాయస్థానం రద్దు చేసింది. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. అసలు హైకోర్టు ఆ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి ఉండాల్సింది కాదని వ్యాఖ్యానించింది. కేసు మొత్తం ఇంకా ప్రాథమిక దశలోనే ఉండగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం ఎంత మాత్రం సరికాదంది. ఈ జీవోలపై తదుపరి చర్యల నిలుపుదలకు హైకోర్టు చెప్పిన కారణాలు ఈ వ్యవహారానికి ఎంత మాత్రం సంబంధించినవి కావని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అంతేకాక గత ప్రభుత్వ నిర్ణయాలను ఆ తరువాత వచ్చే కొత్త ప్రభుత్వం సమీక్షించడానికి వీల్లేదన్న హైకోర్టు ఉత్తర్వులను సైతం సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఈ విషయం అసలు ప్రధాన కేసుకు ఎంత మాత్రం సంబంధం లేదని తేల్చి చెప్పింది. ఈమేరకు సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ ఎం.ఎం.సుందరేష్ల ధర్మాసనం బుధవారం 13 పేజీల తీర్పును వెలువరించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మనుసింఘ్వి, నిరంజన్రెడ్డి వాదించగా, ప్రతివాదులు వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్రప్రసాద్ తరఫున సీనియర్ న్యాయవాది సిద్దార్ధ దవే వాదనలు వినిపించారు. కేంద్రం, ఈడీని ప్రతివాదిగా చేర్చాలి.. గత ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించేందుకు, తిరగరాసేందుకే మంత్రివర్గ ఉప సంఘం, సిట్ ఏర్పాటైనట్లు హైకోర్టు తప్పుగా భావించిందన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనను సుప్రీంకోర్టు సమర్థించింది. ఆ రెండు జీవోలను పరిగణలోకి తీసుకుంటే గత ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించేందుకు, తిరగరాసేందుకు అవి జారీ అయ్యాయని ఎంత మాత్రం చెప్పజాలమంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఉల్లంఘనలు, అవినీతి ఆరోపణలపై విచారణ జరిపేందుకే మంత్రివర్గ ఉప సంఘం, సిట్ ఏర్పాటయ్యాయని సుప్రీంకోర్టు తెలిపింది. అలాగే జీవోలను సవాల్ చేస్తూ టీడీపీ నేతలు దాఖలు చేసిన వ్యాజ్యాల్లో కేంద్ర ప్రభుత్వం, ఈడీలను ప్రతివాదులుగా చేర్చాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టి వేయడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. హైకోర్టు ఆ పని చేసి ఉండకూడదని వ్యాఖ్యానించింది. ప్రధాన వ్యాజ్యాలను ఇంకా పరిష్కరించకుండా, సీబీఐ దర్యాప్తు కోరుతూ రాష్ట్రం రాసిన లేఖపై కేంద్రం నిర్ణయం తీసుకోక ముందే హైకోర్టు ప్రభుత్వ అనుబంధ పిటిషన్ను కొట్టేయడం సరికాదంది. అసలు ప్రభుత్వ జీవోలను సవాలు చేస్తూ పిటిషన్లు దాఖలు చేసిన టీడీపీ నేతలే కేంద్రం, ఈడీలను ప్రతివాదులుగా చేర్చి ఉండాల్సిందని స్పష్టం చేసింది. టీడీపీ నేతలు దాఖలు చేసిన వ్యాజ్యాల్లో కేంద్ర ప్రభుత్వం, ఈడీలు తప్పనిసరిగా అవసరమైన పార్టీలని తేల్చి చెప్పింది. వారిని హైకోర్టు ముందున్న వ్యాజ్యాల్లో ప్రతివాదులుగా చేర్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అంతేకాక కేంద్రం, ఈడీ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలంది. చట్ట ప్రకారం కేసు పూర్వాపరాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని టీడీపీ నేతలు దాఖలు చేసిన వ్యాజ్యాలను మూడు నెలల్లో పరిష్కరించాలని హైకోర్టుకు సూచించింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీళ్లను అనుమతించింది. నిగ్గు తేల్చిన ఉపసంఘం, సిట్... టీడీపీ హయాంలో జరిగిన అమరావతి భూ కుంభకోణం, ఏపీ ఫైబర్ నెట్ స్కామ్లతో పాటు నాటి విధానపరమైన నిర్ణయాలు, చేపట్టిన ప్రాజెక్టులపై వచ్చిన అవినీతి ఆరోపణలు, ఉల్లంఘనలపై వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమిస్తూ 2019లో జీవో 1411 జారీ చేసింది. గత ప్రభుత్వ విధాన నిర్ణయాలతో పాటు పలు అంశాలపై సమీక్ష జరిపిన మంత్రి వర్గ ఉప సంఘం పలు ప్రాథమిక ఆధారాలతో ప్రభుత్వానికి ఓ నివేదికను సమర్పించింది. ఈ నివేదిక ఆధారంగా గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలు, ఉల్లంఘనలపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2020లో జీవో 344 జారీ చేసింది. దీనిపై విచారణ చేపట్టిన సిట్ ఈ కుంభకోణాలు చాలా విస్తృతమైనవని, ఇందులో చాలా కీలక అంశాలు ముడిపడి ఉన్నందున దీనిని సీబీఐ దర్యాప్తునకు ఇవ్వడం సమంజసంగా ఉంటుందని ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ లేఖ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఓ లేఖ రాసి, ఈ కుంభకోణాలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరింది. పార్టీ ప్రయోజనం కోసమే వేశామన్నా పట్టించుకోని హైకోర్టు... రాష్ట్ర ప్రభుత్వ లేఖపై కేంద్రం నిర్ణయం తీసుకోక ముందే టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్రప్రసాద్ వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. మంత్రివర్గ ఉపసంఘం, సిట్ ఏర్పాటు జీవోలను సవాలు చేశారు. ఈ వ్యాజ్యాల్లో వారు ఉద్దేశపూర్వకంగానే సీబీఐ, ఈడీలను ప్రతివాదులుగా చేర్చలేదు. తమ పార్టీ ప్రయోజనాల కోసమే పిటిషన్లు దాఖలు చేశామని వర్ల రామయ్య లిఖితపూర్వంగా కోర్టుకు చెప్పారు. టీడీపీ నేతలు వేసిన ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు విచారణ జరిపారు. అసలు మంత్రివర్గ ఉప సంఘం, సిట్ ఏర్పాటు వల్ల పిటిషనర్లు వ్యక్తిగతంగా ఏ విధంగానూ ప్రభావితం కావడం లేదని, వారు దాఖలు చేసిన వ్యాజ్యాలకు విచారణార్హత లేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. అంతేకాకుండా సీబీఐ, ఈడీలను ఈ వ్యాజ్యాల్లో ప్రతివాదులుగా చేర్చాలంటూ అనుబంధ వ్యాజ్యాలను దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో టీడీపీ నేతల వ్యాజ్యాలపై సుదీర్ఘ విచారణ జరిపిన న్యాయమూర్తి రాష్ట్ర ప్రభుత్వ అభ్యంతరాలన్నింటినీ తోసిపుచ్చారు. టీడీపీ నేతలు కోరిన విధంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. జీవోల్లో తదుపరి చర్యలన్నీ నిలిపేశారు. గత ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించే అధికారం కొత్త ప్రభుత్వానికి లేదని తేల్చి చెప్పేశారు. హైకోర్టు పరిగణలోకి తీసుకుని ఉండాల్సింది.. 2020లో హైకోర్టు ఇచ్చిన ఈ మధ్యంతర ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వ పిటిషన్పై విచారణ చేపట్టి తీర్పును రిజర్వ్ చేసిన జస్టిస్ షా ధర్మాసనం బుధవారం తమ ఉత్తర్వులను వెలువరించింది. మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసిన ప్రధాన ఉద్దేశాలను హైకోర్టు పరిగణలోకి తీసుకుని ఉండాల్సిందని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావించిన పలు న్యాయపరమైన అంశాలను హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదని ధర్మాసనం ఆక్షేపించింది. సీబీఐ దర్యాప్తు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు రాసిన లేఖను హైకోర్టు ఏ మాత్రం పరిగణలోకి తీసుకోలేదని సుప్రీంకోర్టు ధర్మాసనం తప్పుపట్టింది. కేసు విచారణ సందర్భంగా ‘సుప్రీం’ వ్యాఖ్యలివీ – పారదర్శకంగా ఉన్నప్పుడు సిట్ దర్యాప్తునకు ఎందుకు భయపడుతున్నారు? – గత ప్రభుత్వ అవినీతిని సమీక్షించకూడదంటే వందశాతం ఇమ్యునిటీ ఇచ్చినట్లే కదా? – పాలనలో దురుద్దేశం ఉన్నప్పుడు విచారణ జరగాలి కదా? – సీబీఐ విచారణకు స్వీకరించలేదంటే తప్పు జరగలేదని ముందే ఎలా ఊహించుకుంటారు? – ప్రతి ఒక్కరూ చీకట్లోనే వెతుకుతారు? విచారణ జరిగితే అన్నీ వెలుగులోకి వస్తాయి -
చంద్రబాబుకు బిగ్ షాక్.. ఈ కేసులో మొదటి నుంచీ ఏం జరిగిందంటే?
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వంలో అక్రమాలపై సిట్ దర్యాప్తుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో సుప్రీం కోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. అసలు ఈ కేసులో మొదట నుంచీ ఏం జరిగిందో ఒకసారి పరిశీలిస్తే.. ►చంద్రబాబు ప్రభుత్వంలో అక్రమాలపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసిన వైఎస్ జగన్ ప్రభుత్వం ►2019 జూన్ 26న కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం ►చంద్రబాబు ప్రభుత్వ హయాంలో తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు, ప్రాజెక్టులు, కార్యక్రమాలు, కార్పొరేషన్లు, సొసైటీలు, కంపెనీలపై తీసుకున్న నిర్ణయాలపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు ►విధానపరమైన లోపాలు, న్యాయపరమైన తప్పిదాలు, ఆర్థిక అక్రమాలు, మోసపూరిత లావాదేవీలను గుర్తించిన కేబినెట్ సబ్ కమిటీ ►సీఆర్డీయే సహా పలు ప్రాజెక్టుల్లో అక్రమాలు జరిగాయని గుర్తించిన కేబినెట్ సబ్ కమిటీ ►డిసెంబర్ 27, 2019న తొలినివేదిక ఇచ్చిన కేబినెట్ సబ్ కమిటీ చదవండి: ‘రాజధాని దొంగల’పై సంచలన నివేదిక ►కేబినెట్ సబ్ కమిటీ నివేదికపై తదుపరి రాష్ట్ర అసెంబ్లీలో చర్చ. కేబినెట్ సబ్ కమిటీ గుర్తించిన అంశాలపై చర్చ ►దీనిపై దర్యాప్తు జరిపించాలని ఆదేశించిన స్పీకర్. సిట్తో విచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయం ►ప్రభుత్వ నిర్ణయం మేరకు ఫిబ్రవరి 21, 2020లో సిట్ ఏర్పాటు ►10 మంది సభ్యులతో సిట్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం ►సిట్ గుర్తించిన అంశాలపై దర్యాప్తు చేసి కేసులు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేసే అధికారాన్ని సిట్కు అప్పగించిన ప్రభుత్వం ►అవసరమైన పక్షంలో కేంద్ర దర్యాప్తు సంస్థలతో సమాచారాన్ని పంచుకోవడం, దర్యాప్తులో వారితో సమన్వయం చేసుకోవాలని సిట్కు నిర్దేశించిన ప్రభుత్వం ►ఎరినైనా విచారణ చేయడానికి, సీఆర్పీసీ ప్రకారం వారి స్టేట్మెంట్లను నమోదు చేయడానికి సిట్కు అధికారం ►దర్యాప్తునలో ఏ అంశానికైనా సంబంధించి ఏ రికాక్డునైనా పరిశీలించే అధికారం సిట్కు ఉంది కోర్టుకెక్కిన టీడీపీ: ►సిట్ ఏర్పాటును, దర్యాప్తును సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించిన తెలుగు దేశం పార్టీ. టీడీపీ నాయకులు వర్లరామయ్య, ఆలపాంటి రాజేంద్ర ప్రసాద్ వేర్వేరుగా పిటిషన్లు దాఖలు ►తమ పార్టీ ప్రయోజనాలకోసమే పిటిషన్లు దాఖలు చేశామని వెల్లడించిన వర్ల రామయ్య ►మార్చి 4, 2020న హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన టీడీపీ జనరల్ సెక్రటరీ వర్ల రామయ్య ►మార్చి 10న మరో రిట్ పిటిషన్ దాఖలు చేసిన వర్ల రామయ్య జీవోలను పక్కనపెట్టాలని పిటిషన్దాఖలు ►మార్చి 23, 2020న కేంద్ర ప్రభుత్వానికి లేఖ. అమరావతి వ్యవహారాలపై సీబీఐ దర్యాప్తుకోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేఖ అప్పుడు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇలా: ►సెప్టెంబరు 16, 2020న ఈకేసులో మధ్యంతర ఉత్తర్వులు జారీచేసిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. అంతకుముందు మీడియాలో వార్తలు కూడా ప్రసారం చేయవద్దంటూ ఆదేశాలు ఇచ్చిన హైకోర్టు. ►అమరావతి ప్రాంతంలో ఎవరెవరు ఎంతెంత భూములు కొన్నారో… వివరాలను కోర్టు ముందు ఉంచిన ప్రభుత్వం ►సీబీఐ దర్యాప్తునకు రాసిన లేఖనూ కోర్టు ముందు ఉంచిన ప్రభుత్వం ►ఈడీ ఈసీఐఆర్ నమోదుచేసిన విషయాన్నీ కోర్టు ముందు ఉంచిన ప్రభుత్వం ►ఈ కారణంగా - కేంద్ర ప్రభుత్వం, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలను ప్రతివాదులుగా చేర్చాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థననూ తోసిపుచ్చిన కోర్టు ►ప్రత్యేక కోర్టు ఏర్పాటు లాంటి రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనలను కొట్టిపారేసిన జస్టిస్ డీవీ సోమయాజులు ►గత ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని పేర్కొన్న హైకోర్టు ►రాష్ట్ర ప్రభుత్వం అధికారాల ప్రయోగానికి పరిమితులు ఉన్నాయన్న హైకోర్టు ►గత ప్రభుత్వ విధానాలను తప్పనిసరిగా అనుసరించాలని, నిర్దిష్టమైన, బలమైన కారణాలు ఉన్నప్పుడు మాత్రమే పక్కకు తప్పుకోవాలన్న కోర్టు ►గత ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించాలంటే శాసనపరమైన అధికారం ఉండాలే తప్ప, స్వతఃసిద్ధ అధికారాలు లేవన్న హైకోర్టు ►ప్రభుత్వానికి ఇలాంటి అధికారులు కట్టబెడుతూ ఎలాంటి చట్టం లేదన్న కోర్టు ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమందంటే..? ►హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ►ఈ కేసును సిబిఐకి అప్పగించాలని కోరామన్న విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చిన ప్రభుత్వం ►దర్యాప్తు చేయొద్దని హైకోర్టు బ్లాంకెట్ ఆర్డర్ ఎలా ఇస్తుందని వాదన ►ప్రభుత్వ విధాన నిర్ణయాలలో ప్రజాధనం దుర్వినియోగం, వృధా , దురుద్దేశం తదితర అంశాలపై దర్యాప్తు చేస్తే తప్పేంటి అని విచారణ సందర్భంగా ప్రశ్నించిన సుప్రీంకోర్టు ►గత ప్రభుత్వ నిర్ణయాలపై సమీక్ష జరపొద్దు అంటే వంద శాతం ఇమ్యూనిటీ ఇచ్చినట్టు కాదా? అని విచారణ సమయంలో వ్యాఖ్యానించిన సుప్రీం ►సిట్ నియామకంపై హై కోర్ట్ ఇచ్చిన స్టే ను కొట్టి వేసిన సుప్రీం కోర్టు ►ఆదేశాలు ఇచ్చిన జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్ ఎం.ఎం.సుందరేష్ ధర్మాసనం ►చంద్రబాబు ప్రభుత్వం లోని అక్రమాలపై దర్యాప్తుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ►దర్యాప్తు ప్రాథమిక దశలోనే స్టే ఇవ్వడం సరైంది కాదన్న సుప్రీం కోర్టు ►సిబిఐ , ఈడీ దర్యాప్తుకు సైతం ఏపీ ప్రభుత్వం పంపేందుకు సిద్ధమైన ఈ కేసులో స్టే అవసరం లేదు ►సిట్ ఏర్పాటు కోసం ఇచ్చిన జీవోలు గత ప్రభుత్వ విధానాలను మార్చడానికి ఇవ్వలేదు ►జీవోలో ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ హైకోర్టు పరిశీలించలేదన్న సుప్రీం ►పిటిషన్ ను తాజాగా విచారించే సమయంలో , ఈ కేసును సిబిఐ, ఈడీకి పంపుతామన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను హై కోర్ట్ పరిగణలోకి తీసుకోవాలన్న సుప్రీంకోర్టు. చదవండి: సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వానికి భారీ ఊరట -
అవినీతి మొత్తం బయటకు తీస్తాం.. అరెస్టులు కూడా జరుగుతాయి: సజ్జల
సాక్షి, తాడేపల్లి: అమరావతి పేరుతో భారీ అవినీతి జరిగిందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. జరిగిన అవినీతి మొత్తం బయటకు తీస్తామని తెలిపారు. సిట్ దర్యాప్తుతో మరిన్ని వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పారు. కచ్చితంగా అరెస్టులు కూడా జరుగుతాయని అన్నారు. సుప్రీంకోర్టులోఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారీ విజయం దక్కిందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. విధానపరమైన నిర్ణయాలతో రాష్ట్రానికి నష్టం కలిగిస్తే తప్పేనని పేర్కొన్నారు. గతంలో జరిగిన తప్పులను తప్పకుండా సమీక్ష చేయాల్సిందేనని తెలిపారు. రాష్ట్ర సంపదకు నష్టం కలిగించే కుట్రలను బయటకు తీస్తామన్నారు. టీడీపీ హయాంలో తప్పు చేయకపోతే వారికి భయమెందుకని ప్రశ్నించారు. చదవండి: సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వానికి భారీ ఊరట స్కిల్ డెవలప్మెంట్ స్కాంలోనూ చంద్రబాబు హస్తం ఉందని సజ్జల పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ స్కాంకు రాజధాని పేరు పెట్టారని.. అమరావతి పేరు చెప్పి దోచుకోవాలనుకున్నారని మండిపడ్డారు. అరచేతిలో స్వర్గం చూపించి రైతులను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాత్కాలిక నిర్మాణాల్లోనూ అవినీతికి పాల్పడ్డరన్నారు. టీడీపీ హయాంలో దేశంలోనే అతిపెద్ద భూ కంభకోణం జరిగిందన్నారు. నిజనిజాలను బయటకు తీసేందుకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రాజధాని పేరుతో చంద్రాబాబు ముఠా దోచుకున్నారని సజ్జల దుయ్యబట్టారు. తప్పు చేయకపోతే స్టే కోసం కోర్టులకు ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నించారు. టీడీపీ సహా చంద్రబాబు ముఠాకు ఎందుకంత భయమని అన్నారు. టీడీపీ హయాంలో అక్రమాలపై సిట్ ఏర్పాటు జరిగిందని, సిట్ దర్యాప్తుపై స్టే తెచ్చుకుంటే అందులో ఏదో మతలబు ఉన్నట్లేనని అన్నారు. టీడీపీ నేతల్లో ఒకవైపు భయం, మరోవైపు అహంకారం కనిపిస్తోందన్నారు. సిట్ ఏర్పాటు కక్ష సాధింపు కానే కాదని స్పష్టం చేశారు. చదవండి: ‘రాజధాని దొంగల’పై సంచలన నివేదిక -
సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వానికి భారీ ఊరట
ఢిల్లీ: సుప్రీం కోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు కోసం ఏపీ ప్రభుత్వ ఏర్పాటు చేసిన సిట్కు లైన్ క్లియర్ అయ్యింది. ఈ క్రమంలో హైకోర్టు ఇచ్చిన స్టేను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేస్తూ బుధవారం తీర్పు ఇచ్చింది. చంద్రబాబు సీఎంగా ఉన్న టైంలో కీలక విధాన నిర్ణయాలు, అమరావతి భూ కుంభకోణం సహా భారీ ప్రాజెక్టులలో అవకతవకలు జరిగినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించింది. ఈ క్రమంలో సిట్ దర్యాప్తునకు ఆదేశించింది. అయితే.. ఆ సిట్ నియామకంపై టీడీపీ నేతలు ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో హైకోర్టు స్టే విధించింది. ఈ స్టేను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది ఏపీ ప్రభుత్వం. దర్యాప్తు ప్రాథమిక దశలోనే స్టే ఇవ్వడం సరైంది కాదన్న సుప్రీం కోర్టు.. సీబీఐ , ఈడీ దర్యాప్తునకు సైతం ఏపీ ప్రభుత్వం పంపేందుకు సిద్ధమైన ఈ కేసులో స్టే అవసరం లేదని పేర్కొంది. సిట్ ఏర్పాటు కోసం ఇచ్చిన జీవోలు గత ప్రభుత్వ విధానాలను మార్చడానికి ఇవ్వలేదని, జీవోలో ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ హైకోర్టు పరిశీలించలేదని సుప్రీం బెంచ్ ప్రస్తావించింది. ఈ తరుణంలో.. హైకోర్టును తీర్పును పక్కనపెడుతున్నట్లు జస్టిస్ ఎం. ఆర్. షా నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు ఇచ్చింది. దీంతో చంద్రబాబు ప్రభుత్వం లోని అక్రమాలపై దర్యాప్తుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయ్యింది. మరోవైపు అమరావతి భూ కుంభకోణం సహా కీలక ప్రాజెక్టులు విధానాల లో జరిగిన అవినీతిపై దర్యాప్తునకు ఆటంకాలు తొలిగాయి. ఇక కేసు విచారణ సమయంలో.. సుప్రీం కోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ప్రభుత్వ విధాన నిర్ణయాలలో ప్రజాధనం దుర్వినియోగం, వృధా , దురుద్దేశం.. తదితర అంశాలపై దర్యాప్తు చేస్తే తప్పేంటి?. గత ప్రభుత్వ నిర్ణయాలపై సమీక్ష జరపొద్దు అంటే వంద శాతం ఇమ్యూనిటీ ఇచ్చినట్టు కాదా? అని వ్యాఖ్యానించింది బెంచ్. బలంగా ఏపీ ప్రభుత్వ వాదనలు.. ఇక ప్రాథమిక దశలోనే దర్యాప్తును అడ్డుకోవడం సమంజసం కాదని, ఈ కేసును సీబీఐ అప్పగించాలని కోరామన్న విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది ఏపీ ప్రభుత్వం. అలాగే.. దర్యాప్తు చేయొద్దని హైకోర్టు బ్లాంకెట్ ఆర్డర్ ఎలా ఇస్తుందని వాదనలు వినిపించింది. దీంతో ఏపీ ప్రభుత్వ వాదనలతో జస్టిస్ ఎం. ఆర్. షా నేతృత్వంలోని ధర్మాసనం ఏకీభవిస్తూ.. ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఇదీ చదవండి: ఎన్టీఆర్ను నిజంగా అంత అభిమానిస్తే అలా ఎలా చేశావ్? -
TSPSC పేపర్ లీక్ కేసు విచారణ జూన్కి వాయిదా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ కేసులో విచారణను తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. సిట్ దర్యాప్తు నిదానంగా సాగుతున్నట్లు అనిపిస్తుందని వ్యాఖ్యానించిన ఉన్నత న్యాయస్థానం.. జూన్ 5వ తేదీ వరకు ఈ కేసు విచారణ వాయిదా వేస్తున్నట్లు శుక్రవారం వెల్లడించింది. పేపర్ లీక్ కేసులో ఇవాళ్టి విచారణ సందర్భంగా.. సిట్ ఏసీపీ నర్సింగ్ రావ్ హైకోర్టుకు హాజరయ్యారు. ఈ క్రమంలో.. ఎప్పటిలోపు దర్యాప్తు పూర్తి చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. టీఎస్పీఎస్సీలో ఉన్న అవుట్సోర్సింగ్ సిబ్బంది అందరినీ విచారించారా?.. ఏ -16 ప్రశాంత్ రోల్ ఏంటి?. ఈ కేసులో నిందితురాలిగా ఉన్న రేణుక భర్త డాక్యా నాయక్ నుండి డబ్బులు పెట్టీ పేపర్ కొన్న వాళ్ళు.. మళ్ళీ ఎవరికైనా అమ్మారా?.. అంటూ వరుసగా ప్రశ్నలు గుప్పించింది. ఈ క్రమంలో.. సిట్ దర్యాప్తు నిదానంగా సాగుతున్నట్లు అనిపిస్తోందని వ్యాఖ్యానించింది బెంచ్. అయితే.. సిట్ ఏసీపీ నర్సింగ్ రావ్, అడ్వొకేట్ జనరల్లు ఆ ప్రశ్నలపై కోర్టుకు వివరణ ఇచ్చారు. వివరణపై సంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు.. ఎప్పటి లోపు దర్యాప్తు పూర్తి చేస్తారని మరోసారి ప్రశ్నించింది. అయితే.. సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ నుండి రిపోర్ట్ రావాల్సి ఉందని అడ్వొకేట్ జనరల్ వివరణ ఇచ్చారు. ఇక కేసును సీబీఐకి అప్పగించాలని కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్పై.. తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పేపర్ లీక్ కేసులో సిట్ విచారణ సంతృప్తికరంగానే ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేసిన తెలంగాణ హైకోర్టు.. కేసును సీబీఐకి అప్పగించడంపై కేసు దర్యాప్తు దశలో ఉన్నందున ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేమని తెలిపింది. తదుపరి విచారణ జూన్ 5వ తేదీకి వాయిదా వేస్తూ.. ఆ తేదీన పేపర్ లీక్ కేసు దర్యాప్తుపై స్టేటస్ రిపోర్ట్ను సమర్పించాలని సిట్కు ఆదేశాలు జారీ చేసింది. ఇదీ చదవండి: తెలంగాణలో ఊహకందని స్థాయిలో పంట నష్టం! -
కవిత స్పందన బ్లేమ్గేమ్లా ఉంది
సాక్షి, న్యూఢిల్లీ: తన క్లయింట్ సుకేశ్ చంద్రశేఖర్ లేవనెత్తిన ఆరోపణలపై ఎమ్మెల్సీ కవిత స్పందించిన తీరు మీడియా, రాజకీయ పార్టీలపై బ్లేమ్ గేమ్ (పరిష్కారం కోసం చూడకుండా నిందలు వేయడం)లా ఉందని న్యాయవాది అనంత్ మాలిక్ విమర్శించారు. సుకేశ్ ఎవరో తనకు తెలియదంటూ కవిత విడుదల చేసిన ప్రకటనపై స్పందించారు. ఈ మేర కు మీడియాకు ప్రకటన విడుదల చేశారు. ‘సుకేశ్ చంద్రశేఖర్ లేవనెత్తిన అంశాలపై కవిత జారీ చేసిన ప్రకటన చిన్నపిల్లల వ్యవహారంలా ఉంది. సుకేశ్ తన ఆరోపణలను అఫిడవిట్ రూపంలో ఇచ్చారు. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 65బీ కింద ధ్రువపత్రం కూడా ఇచ్చారు. ఈ విషయంలో న్యాయమైన విచారణను స్వాగతించకుండా అస్పష్టమైన ఆరోపణలతో దర్యాప్తు నుంచి తప్పించుకోవాలని యత్నించడం నీటిని ఒడిసి పట్టుకొని ఉంచాలనుకోవడమే. అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడెవరైనా విచారణ స్వాగతించేవారు. కవిత స్పందన చూస్తుంటే దాగుడుమూతలు ఆడడంలో ఉన్న నైపుణ్యం కనిపిస్తోంది. ఈ అంశం ప్రత్యేక దర్యాప్తు సంస్థల ప్రత్యేక పరిశోధనకు సంబంధించినదే కానీ, ప్రజల్లో ప్రజాదరణ కోసం పోటీ కాదు. అయితే నా క్లయింట్ కూడా ఈ వారంలోనే పూర్తిస్థాయిలో స్పందిస్తారు’ అని అనంత్ తెలిపారు. -
నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఈడీ
-
సీబీఐ అక్కర్లేదు.. తెలంగాణ హైకోర్టులో సిట్
సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజ్ కేసులో తమ దర్యాప్తు సజావుగానే సాగుతోందని, సీబీఐ అవసరం లేదని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(SIT) తెలంగాణ హైకోర్టుకు తెలిపింది. పేపర్ లీకేజ్ కేసులో దర్యాప్తు రిపోర్ట్ను మంగళవారం హైకోర్టుకు సమర్పించింది సిట్. ఆ స్టేటస్ రిపోర్ట్లో కీలకాంశాలను ప్రస్తావించింది. ఇప్పటిదాకా జరిగిన దర్యాప్తు ఆధారంగా.. మొత్తం 250 పేజీల రిపోర్ట్తో పాటు ఎంక్లోజర్స్ను సైతం తెలంగాణ హైకోర్టుకు సమర్పించింది సిట్. ‘‘పేపర్ లీక్ కేసులో.. రూ.40 లక్షల నగదు బదిలీ జరిగినట్లు దర్యాప్తులో గుర్తించాం. పేపర్ కొనుగోలు చేసిన 15 మందిని అరెస్ట్ చేశాం. శంకర్ లక్ష్మిని సాక్షిగా పరిగణించాం. సాక్షులు, నిందితులు, టీఎస్పీఎస్సీ చైర్మన్, కమిషన్ మెంబర్ను సైతం ప్రశ్నించాం. వాళ్ల నుంచి సేకరించిన స్టేట్మెంట్స్ ఆధారాలన్నీ కోర్టుకు సమర్పించాం. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాజకీయ నేతలకు నోటీసులు ఇచ్చాం. కానీ, పొలిటికల్ లీడర్స్ నుంచి ఎలాంటి కీలక సమాచారం అందలేదు. గతంలో ఎన్నో సెన్సేషన్ కేసుల్ని డీల్ చేశాం. ఈ పేపర్ లీక్ కేసును సైతం నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తున్నాం. కాబట్టి.. ఈ కేసు విచారణలో సీబీఐ అవసరం లేదు. కేసులో కీలకమైన ఎఫ్ఎస్ఎల్(FSL) రిపోర్ట్ రావాల్సి ఉంది. అది వస్తే.. కేసులో మరింత పురోగతి సాధించొచ్చు అని హైకోర్టుకు సమర్పించిన కేసు స్టేటస్ రిపోర్ట్లో సీబీఐ పేర్కొంది. ఇదీ చదవండి: బండి సంజయ్ మూడు సింహాల ప్రమాణంపై రియాక్షన్ -
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసు.. కీలక ఘట్టానికి సిట్ విచారణ..
సాక్షి, హైదరాబాద్: టీఎస్సీఎస్సీ పరీక్ష పేపర్ల లీకేజ్ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ ఇందులో కీలక ఘట్టమైన క్రాస్ వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభించింది. ఈ కేసులో అరెస్టు అయిన నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలను సరిపోల్చి చూడటం ద్వారా అడ్డదారిలో లబి్ధపొందిన అభ్యర్థులు ఇంకా ఎవరైనా ఉన్నారా? అనేది తేల్చనుంది. మరోపక్క మంగళవారం హైకోర్టుకు సమర్పించేందుకు సమగ్ర స్టేటస్ రిపోర్టు సిద్ధం చేస్తోంది. ఇందులో ఇప్పటివరకు దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాలు, తీసుకున్న చర్యలను వివరించనుంది. కమిషన్ నిర్వహించే ఆరు రకాలైన పరీక్షలకు సంబంధించిన 15 క్వశ్చన్ పేపర్లు లీకైనట్లు ఇప్పటికే సిట్ నిర్ధారించింది. వీటిలో గ్రూప్–1 ప్రిలిమ్స్ సహా నాలుగు పరీక్షలను కమిషన్ రద్దు చేయగా మూడింటిని వాయిదా వేసింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారులుగా ఉన్న కమిషన్ కార్యదర్శి వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పని చేసిన పి.ప్రవీణ్కుమార్, టీఎస్పీఎస్సీ మాజీ నెట్వర్క్ అడ్మిన్ ఎ.రాజశేఖర్రెడ్డి సహా మొత్తం 17 మంది నిందితులను సిట్ అరెస్టు చేసింది. వీరిలో డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏఓ) పేపర్ ఖరీదు చేసిన ఖమ్మం జంట మినహా మిగిలిన 15 మందినీ సిట్ అధికారులు న్యాయస్థానం అనుమతితో తమ కస్టడీలోకి తీసుకుని విచారించారు. ప్రవీణ్, రాజశేఖర్ సహా నలుగురి విషయంలో అదనపు కస్టడీ ప్రక్రియా జరిగింది. కాగా ఈ కేసు దర్యాప్తులో వ్యూహాత్మకంగా వ్యవహరించిన పోలీసులు బృందాలుగా మారి నిందితులను విచారించారు. దాదాపు 37 ప్రశ్నలతో కూడిన క్వశ్చనీర్ ఆధారంగా ముందుకు వెళ్లారు. తొలుత నిందితులను విడివిడిగా, ఆపై ఒకరిద్దరిని కలిపి ఇలా వేర్వేరు పంథాల్లో విచారించిన అధికారులు ప్రతి ఒక్కరి నుంచి ప్రతి సందర్భంలోనూ వాంగ్మూలాలు నమోదు చేశారు. వీటన్నింటినీ సమగ్రంగా అధ్యయనం చేయడం కోసం ఓ ప్రత్యేక క్రాస్ వెరిఫికేషన్ బృందం సిట్లో ఏర్పాటైంది. వాంగ్మూలాల్లో తేడాలు తేల్చేందుకే.. వాంగ్మూలాల మధ్య ఎక్కడైనా తేడాలు ఉన్నాయా? ఒకే వ్యక్తి చెప్పిన, వేర్వేరు నిందితులు ఒకే అంశంపై ఇచి్చన సమాచారంలో అనుమానాస్పద అంశాలు ఉన్నాయా? అనేది ఈ ప్రక్రియ ద్వారా గుర్తించనున్నారు. అలాగే నిందితుల కాల్ డిటెయిల్స్, వాట్సాప్ చాటింగ్స్లతో పాటు బ్యాంకు లావాదేవీలు, యూపీఐ విధానంలో జరిగిన నగదు బదిలీలు, ఆయా సమయాల్లో వీరి లొకేషన్స్ ఇలా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ క్రాస్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియ ద్వారా దర్యాప్తులో మిస్సైన లింకులతో పాటు అడ్డదారిలో లబి్ధపొందిన అభ్యర్థులను గుర్తించాలని సిట్ నిర్ణయించింది. ఖమ్మం జంటను కస్టడీలోకి తీసుకుని విచారించడం మినహా మిగతా దర్యాప్తు దాదాపు పూర్తయింది. తదుపరి న్యాయస్థానం ఇచ్చే ఆదేశాలను బట్టి సిట్ అధికారులు ముందుకు వెళ్లనున్నారు. చదవండి: అవరోహణ విధానంలో గురుకుల పోస్టుల భర్తీ -
డేటా లీకుపై పోలీసుల దూకుడు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన డేటా చౌర్యం కేసులో సైబరాబాద్ పోలీసులు దూకుడు పెంచారు. గత నెల రోజుల వ్యవధిలో సైబరాబాద్ పోలీసులు నాలుగు డేటా చౌర్యం, విక్రయం, నకిలీ కాల్ సెంటర్ నిర్వహణ కేసులను ఛేదించారు. వీటిల్లో 30 మంది నిందితులను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆయా కేసులలో నిందితులు విక్రయానికి పెట్టిన వ్యక్తిగత సమాచారం థర్డ్ పార్టీ ఏజెన్సీలు, ఈ–కామర్స్ సంస్థల నుంచి లీకైనట్లు గుర్తించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఆయా కంపెనీలను విచారించాలని నిర్ణయించింది. ఇప్పటికే బిగ్ బాస్కెట్, ఫోన్పే, ఫేస్బుక్, క్లబ్ మహీంద్రా, పాలసీ బజార్, యాక్సిస్ బ్యాంక్, అస్ట్యూట్ గ్రూప్, మ్యాట్రిక్స్, టెక్ మహీంద్రా, బ్యాంక్ ఆఫ్ బరోడా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలకు నోటీసులు జారీ చేసింది. తాజాగా మరో పది కంపెనీలకూ తాఖీదులు జారీ చేసింది. ఇప్పటికే సిట్ ముందు హాజరైన కంపెనీలు.. కస్టమర్ల డేటా, సమీకరణ, భద్రతా విధానాలు, థర్డ్ పార్టీ ఏజెన్సీలు తదితరాలపై సమగ్ర సమాచారాన్ని సమర్పించాయి. ఆయా సమాచారాన్ని విశ్లేషించిన పోలీసులు మరికొంత అదనపు సమాచారం కోసం మరోసారి నోటీసులు జారీ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. నాలుగు రాష్ట్రాల్లో గాలింపు.. ప్రధానంగా హరియాణాలోని ఫరీదాబాద్కు చెందిన వినయ్ భరద్వాజ్ దేశంలోని 70 కోట్ల మంది వ్యక్తులు, సంస్థలకు చెందిన వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించి, విక్రయానికి పెట్టడం సంచలనం సృష్టించింది. ఇందులో 2.60 లక్షల మంది రక్షణ శాఖ ఉద్యోగుల సమాచారంతో పాటు విద్యుత్, ఇంధనం వంటి ప్రభుత్వ శాఖలు, విద్యార్థులు, ప్రవాసులు, గృహిణులు, బ్యాంకు ఖాతాదారుల సమాచారం ఉండటం గమనార్హం. ఈ కేసులో నిందితుడు వినయ్ భరద్వాజ్ ఈ డేటాను గుజరాత్కు చెందిన అమీర్ సోహైల్, మదన్ గోపాల్ అనే వ్యక్తుల నుంచి కొనుగోలు చేసినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు. దీంతో వారి కోసం సిట్ బృందాలు గాలిస్తున్నాయి. ఢిల్లీ, రాజస్తాన్, హరియాణా, పశ్చిమ బెంగాల్లో నిందితుల కోసం వేట కొనసాగిస్తున్నట్లు తెలిసింది. -
TSPSC Case: ప్రియురాలి కోసం పేపర్ కొనుగోలు.. ఇద్దరు అరెస్టు
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. సాయి లౌకిక్, సుష్మితలను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రియురాలు సుష్మిత కోసం లౌకిక్ డీఏఓ(డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్) పేపర్ కొనుగోలు చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ప్రవీణ్ నుంచి రూ. 6 లక్షలకు లౌకిక్ ఈ పేపర్ కొన్నట్లు నిర్ధారించారు. ఫిబ్రవరి 26న డీఏఓ పరీక్ష జరగ్గా.. పేపర్ లీక్ అంశం తెరపైకి వచ్చిన తరువాత టీఎస్పీఎస్సీ ఈ పరీక్షను కూడా రద్దు చేసింది. తెలంగాణలో టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటి వరకు 17 మందిని అరెస్ట్ చేశారు. ఈ కేసు విచారణను దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు సోమవారం కమిషన్ చైర్మన్ జనార్దన్రెడ్డి వాంగ్మూలం నమోదు చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవి కావడంతో చైర్మన్కు నోటీసులు పంపకుండా స్వయంగా టీఎస్పీఎస్సీ కార్యాలయానికి అధికారులు వెళ్లారు. సిట్ చీఫ్గా ఉన్న అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్ నేతృత్వంలో సీసీఎస్ ఏసీపీ కె.నర్సింగ్రావుతో కూడిన బృందం టీఎస్పీఎస్సీకి వెళ్లి మూడు గంటలకుపైగా చైర్మన్ను ప్రశ్నించింది. ఈ మేరకు సిట్కు జనార్దన్రెడ్డి వివరణ ఇచ్చారు. -
సిబ్బందే లీక్ చేస్తారని ఊహించలేదు
సాక్షి, హైదరాబాద్: కమిషన్లో పనిచేస్తున్న వ్యక్తులే పేపర్ల లీకేజీకి పాల్పడతారని ఊహించలేకపోయినట్లు టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్రెడ్డి సిట్ అధికారుల విచారణలో పేర్కొన్నారు. ఇప్పటివరకు తమ దృష్టికి వచ్చిన దాని ప్రకారం ప్రవీణ్, రాజశేఖర్, రమేష్, షమీమ్లపై గతంలో ఎలాంటి ఆరోపణలు లేవని... ఈ నేపథ్యంలో ఇలాంటి లీకేజీ జరుగుతుందని ఊహించలేదని వివరణ ఇచ్చారు. టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్ల లీకేజీ స్కాంను దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు సోమవారం కమిషన్ చైర్మన్ జనార్దన్రెడ్డి వాంగ్మూలం నమోదు చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవి కావడంతో చైర్మన్కు నోటీసులు పంపకుండా స్వయంగా టీఎస్పీఎస్సీ కార్యాలయానికి అధికారులు వెళ్లారు. సిట్ చీఫ్గా ఉన్న అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్ నేతృత్వంలో సీసీఎస్ ఏసీపీ కె.నర్సింగ్రావుతో కూడిన బృందం టీఎస్పీఎస్సీకి వెళ్లి మూడు గంటలకుపైగా చైర్మన్ను ప్రశ్నించింది. ఈ కేసులో ప్రధాన నిందితులైన ప్రవీణ్ కుమార్, రాజశేఖర్రెడ్డి నుంచి స్వా«ధీనం చేసుకున్న ల్యాప్టాప్లను అధికారులు తమ వెంట తీసుకువెళ్లారు. ప్రధానంగా టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల తయారీ, వాటి భద్రత తదితర అంశాలపైనే జనార్దన్రెడ్డిని విచారించారు. పర్యవేక్షణ బాధ్యత నాదే: చైర్మన్ ప్రశ్నపత్రాల తయారీ, భద్రత పర్యవేక్షణ తనదేనని విచారణ సందర్భంగా చైర్మన్ పోలీసులకు తెలిపారు. ప్రతి పరీక్షకు సంబంధించి ప్రశ్నపత్రాల తయారీకి సెట్టర్స్గా పిలిచే నిపుణుల సహాయం తీసుకుంటామని, వారినే వ్యక్తిగతంగా కాన్ఫిడెన్షియల్ విభాగానికి ఆహ్వానిస్తామని వివరించారు. అక్కడకు వచ్చే వరకు ఒక సెట్టర్ విషయం మరొకరికి తెలియకుండా జాగ్రత్తలు ఉంటాయన్నారు. వారు రూపొందించిన ప్రశ్నపత్రం కాపీలను కస్టోడియన్ శంకరలక్ష్మి కంప్యూటర్లో భద్రపరుస్తారని, ఓ డిజిటల్ కాపీని సెక్షన్లోని లాకర్లో ఉంచడం ఏళ్లుగా కొనసాగుతున్న ఆనవాయితీ అని జనార్దన్రెడ్డి సిట్ అధికారులకు తెలియజేశారు. తనతోపాటు కాన్ఫిడెన్షియల్ సెక్షన్ అధికారులే ప్రశ్నపత్రం తయారీలో ప్రత్యక్షంగా పాల్గొంటారని ఆయన వివరించారు. లీకేజీ వ్యవహారంలో కస్టోడియన్ నిర్లక్ష్యం సహా వివిధ అంశాలపై అంతర్గత విచారణ కూడా జరుగుతోందని, అది పూర్తయ్యాక వెలుగులోకి వచ్చే వివరాల ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చైర్మన్ పేర్కొన్నారని తెలిసింది. వాంగ్మూల పత్రాలపై ఆయన సంతకాలు తీసుకున్న దర్యాప్తు అధికారులు వాటిని కోర్టులో దాఖలు చేయనున్నారు. పరీక్షలు రాసిన ఉద్యోగులపైనా ఆరా పరీక్షలకు హాజరైన టీఎస్పీఎస్సీ ఉద్యోగుల్లో ఎందరు అనుమతి పొందారనే అంశాన్నీ సిట్ సేకరిస్తోంది. కమిషన్ ఉద్యోగులు, సభ్యులకు బంధువులు, స్నేహితులు, కుటుంబీకుల్లో ఎవరైనా టీఎస్పీఎస్సీ పరీక్షలు రాశారా? వారి పరిస్థితి ఏంటి? తదితర వివరాల పైనా దృష్టి పెట్టి దర్యాప్తు చేస్తోంది. కమిషన్ కార్యాలయానికి వెళ్లిన సిట్ అధికారులు కాన్ఫిడెన్షియల్ సెక్షన్, కస్టోడియన్ ఛాంబర్తో పాటు ప్రవీణ్, రాజశేఖర్రెడ్డి, రమేష్, షమీమ్లు కూర్చునే సీట్ల వద్దా తనిఖీలు చేశారు. అక్కడ నుంచి కొన్ని రికార్డులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. భద్రత పెంచాలని సూచించాం.. మా దర్యాప్తులో టీఎస్పీఎస్సీలో ఉన్న అనేక లోపాలను గుర్తించాం. ల్యాన్లో మార్పుచేర్పులు, యాక్సస్ కంట్రోల్, త్రీ స్టెప్ వెరిఫికేషన్ ఇలా అనేక ఆవశ్యకతలను చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లాం. సైబర్ ఆడిట్ సిఫార్సుల ప్రకారం భద్రత పెంచాలని సూచించాం. – ఓ ఉన్నతాధికారి -
TSPSC: 40 లక్షలకు మూడు ఏఈ పేపర్లు లీక్.. సినిమా రేంజ్ ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో సిట్ ఇప్పటికే స్పీడ్ పెంచింది. కాగా, తాజాగా టీఎస్పీఎస్సీ నిందితుల విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఏఈ పేపర్ లీక్లో కేతావత్ రాజేశ్వర్ కీలక పాత్ర పోషించినట్టు పోలీసులు గుర్తించారు. అయితే, మూడు ఏఈ పేపర్లను రాజేశ్వర్ రూ.40 లక్షలకు అమ్మినట్టు విచారణలో తేలింది. ఇందుకు రూ. 25 లక్షలను రాజేశ్ అడ్వాన్స్గా తీసుకున్నాడు. మిగిలిన డబ్బును పరీక్ష ఫలితాలు వచ్చిన తర్వాత వచ్చేలా ఒప్పందం చేసుకున్నాడు. ఈ క్రమంలో నిందితుల నుంచి పోలీసులు.. రూ. 8.5 లక్షలను రికవరీ చేశారు. ఈ క్రమంలో ప్రవీణ్ కుమార్.. రేణుకకు పేపర్ లీక్ చేశాడు. నమ్మకమైన వారికి పేపర్ అమ్మాలని రేణుకకు సూచించాడు. ఈ సందర్బంగా రూ. 10లక్షలకు రేణుకతో బేరం కుదుర్చుకున్నాడు. దీంతో, రేణుక వద్ద నుంచి ప్రవీణ్ అడ్వాన్స్గా రూ. 5లక్షలు తీసుకున్నాడు. ఇక, ఈ పేపర్లను రేణుక తన భర్త డాక్యానాయక్ ద్వారా అమ్మకానికి పెట్టింది. వారి సమీప బంధువైన రాజేశ్వర్కు పేపర్ విషయం చెప్పి అమ్మాలని సూచించారు. రంగంలోకి దిగిన రాజేశ్వర్.. మధ్యవర్తులు గోపాల్, నీలేష్, ప్రశాంత్, రాజేంద్రకుమార్లకు రూ. 40 లక్షలకు పేపర్లను విక్రయించాడు. వారి వద్ద నుంచి అడ్వాన్స్గా రూ. 23 లక్షలు తీసుకున్నాడు. అనంతరం, రూ.10లక్షలు డాక్యానాయక్కు ఇచ్చిన రాజేశ్వర్. ఇక, ఇందులో నుంచి మరో రూ.5లక్షలను ప్రవీణ్కు డాక్యా నాయక్ ఇచ్చాడు. అయితే, రాజేశ్వర్ తల్లి గండీడ్(మండలం) మన్సూర్పల్లి తండా సర్పంచ్. పేపర్లు అమ్మగా వచ్చిన డబ్బుతో రూ. 8లక్షలు వెచ్చించి ఊరిలో రాజేశ్వర్ అభివృద్ధి పనులు చేశారు. ప్రభుత్వం నుంచి బిల్లులు మంజూరయ్యాక రూ.8లక్షలు తీసుకుందామని రాజేశ్వర్ ప్లాన్ చేసుకున్నాడు. -
అమ్ముడైంది 40లక్షలకు.. అందింది 23లక్షలు!
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) పరీక్షల ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారంలో ‘ఆర్థికాంశాలు’ కొలిక్కివచ్చాయి. ఈ పత్రాల విక్రయంలో కేతావత్ రాజేశ్వర్ కీలకపాత్ర పోషించినట్లు సిట్ అధికారులు గుర్తించారు. అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) నియామక పరీక్షకు సంబంధించిన మూడు ప్రశ్నపత్రాలను రూ.40 లక్షలకు విక్రయించారని, ఇప్పటికే నిందితులకు రూ.23 లక్షలు ముట్టగా మిగతా సొమ్ము పరీక్ష ఫలితాలు వచ్చాక ఇచ్చేలా ఒప్పందాలు చేసుకున్నట్లు పోలీసులు తేల్చారు. ఇందులో ఇప్పటికే రూ.8.5 లక్షలు రికవరీ చేశారు. గ్రూప్–1 ప్రిలిమ్స్ పేపర్లను పంచుకున్నారే తప్ప అమ్ముకోలేదని అధికారులు చెబుతున్నారు. టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పని చేసిన పులిదిండి ప్రవీణ్ కుమార్, మాజీ నెట్వర్క్ అడ్మిన్ అట్ల రాజశేఖర్ రెడ్డి సంయుక్తంగా ఈ పేపర్లు తస్కరించినట్లు ఇప్పటికే సిట్ స్పష్టం చేసింది. ఏఈ పరీక్ష పేపర్లను ప్రవీణ్ తన స్నేహితురాలైన రేణుక రాథోడ్, ఆమె భర్త లవడ్యావత్ డాక్యాలకు ఇచ్చాడు. నమ్మకమైన వారికే వీటిని విక్రయించాలని చెప్పాడు. తనకు రూ.10 లక్షలు ఇవ్వాలని చెప్పి రూ.5 లక్షలు అడ్వాన్సుగా తీసుకున్నాడు. డాక్యా ఈ పేపర్ల గురించి సమీప బంధువైన కేతావత్ రాజేశ్వర్కు చెప్పాడు. ఇతడు ఏర్పాటు చేసుకున్న మధ్యవర్తుల ద్వారానే గోపాల్, నీలేశ్, ప్రశాంత్, రాజేంద్రకుమార్లకు రూ.40 లక్షలకు విక్రయించాడు. వీరి నుంచి రూ.23 లక్షలు వసూలు చేసిన రాజేశ్వర్.. అందులోంచి డాక్యాకు రూ.10 లక్షలిచ్చాడు. తన వాటాగా వచ్చిన దీని నుంచి ఇతగాడు మరో రూ.5 లక్షలు ప్రవీణ్కు ఇచ్చాడు. ప్రవీణ్ తన వద్దకు వచ్చిన డబ్బులోంచి (మొత్తం రూ.10 లక్షలు) రూ.4 లక్షలు ఇంట్లోనే ఉంచుకుని, రూ.3.5 లక్షలు తన సమీప బంధువుకు ఇచ్చాడు. ఓ బీమా పాలసీకి సంబంధించి రూ.1.2 లక్షలు చెల్లించాడు. మిగిలిన మొత్తం ఇతర ఖర్చులకు వాడేశాడు. ఈ సొమ్ములో సిట్ అధికారులు రూ.7.5 లక్షలు రికవరీ చేశారు. గ్రామానికి రూ.8 లక్షలు వెచ్చించిన రాజేశ్వర్ గతంలో చిట్టీల వ్యాపారం చేసిన రాజేశ్వర్ నష్టాలు రావడంతో ఆపేశాడు. ఇతడి తల్లి ప్రస్తుతం మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం మన్సూర్పల్లి తండాకు సర్పంచ్గా ఉన్నారు. ఈమె తరఫున గ్రామంలో అభివృద్ధి పనులను ఇతడే పర్యవేక్షిస్తుంటాడు. పేపర్లు విక్రయించగా వచ్చిన మొత్తంలో డాక్యాకు ఇచ్చింది మినహా మిగిలింది తన వద్దే ఉంచుకున్నాడు. పరీక్ష ఫలితాలు వచ్చిన తర్వాత చేతికందే రూ.17 లక్షల నుంచి మిగిలిన వారికి వాటాలు ఇవ్వాలనుకున్నాడు. తన వద్ద ఉన్న సొమ్ములో రూ.8 లక్షలు వెచ్చించి గ్రామంలో అభివృద్ధి పనులు చేశాడు. వీటికి సంబంధించిన బిల్లులు ప్రభుత్వం మంజూరు చేశాక ఆ మొత్తం తాను తీసుకోవాలని భావించాడు. నిందితుడి విచారణలో సిట్ అధికారులకు ఈ విషయం తెలిసింది. దీంతో ఆ బిల్లులకు సంబంధించిన మొత్తం తమకు అందేలా చర్యలు తీసుకోవాలని సిట్ అధికారులు ప్రభుత్వానికి లేఖ రాయనున్నారు. అలా వచ్చిన మొత్తాన్ని సీజ్ చేసి కోర్టుకు సమర్పించాలని భావిస్తున్నారు. చైర్మన్కు నోటీసులు ఇవ్వకుండా... సిట్ అధికారులు శనివారం కమిషన్ కార్యదర్శి అనిత రామచంద్రన్, సభ్యుడు లింగారెడ్డిని ప్రశ్నించి వాంగ్మూలాలు నమోదు చేశారు. టీఎస్పీఎస్సీలో ప్రశ్నపత్రాలకు సంబంధించిన కాన్ఫిడెన్షియల్ సెక్షన్ చైర్మన్ ఆధీనంలోనే పని చేస్తుంది. ఈ స్కామ్ మొత్తం ప్రశ్నపత్రాలకు సంబంధించిందే కావడంతో చైర్మన్ వాంగ్మూలం నమోదు అనివార్యంగా మారింది. అయితే కార్యదర్శి, సభ్యులు, ఉన్నతోద్యోగుల మాదిరిగా చైర్మన్కు నోటీసులు జారీ చేయడం సాధ్యం కాదని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఈ పోస్టు రాజ్యాంగ బద్ధమైంది కావడంతోపాటు ప్రస్తుత చైర్మన్ సీనియర్ ఐఏఎస్ అధికారిగా గుర్తింపు పొందారు. ఈ నేపథ్యంలో ఆయనకు నోటీసులు జారీ చేయడానికి బదులు స్టేట్మెంట్ తీసుకోవాలని సిట్ అధికారులు నిర్ణయించారు. సోమవారమే దీన్ని పూర్తి చేయాలని భావిస్తున్నారు. -
TSPSC: పేపర్ లీక్ కేసులో కీలక ట్విస్ట్..
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పరీక్ష పత్రాల లీకేజీ స్కాంపై దర్యాప్తు చేస్తున్న ‘సిట్’ శనివారం కమిషన్ కార్యదర్శి అనితా రామచంద్రన్, సభ్యుడు లింగారెడ్డిలను ప్రశ్నించిన విషయం తెలిసిందే. తీగ లాగితే డొంక కదిలింది అన్న చందంగా ఈ కేసులో ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. కమిషన్లో ఏం జరిగిందో ఇప్పుడిప్పుడే బయటకు వస్తోంది. మరోవైపు.. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్ కీలక నిర్ణయం తీసుకుంది. టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్రెడ్డి స్టేట్మెంట్ను రికార్డు చేయాలని సిట్ భావిస్తున్నట్టు సమాచారం. ఇక, పేపర్ లీక్ కేసులో టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్, సభ్యుడు లింగారెడ్డిని సిట్ శనివారం విచారించింది. వీరిద్దరినీ వేరువేరుగా 2 గంటలపాటు సిట్ విచారించింది. ఇక, విచారణ సందర్బంగా ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రవీణ్ కుమార్ గ్రూప్-1 పరీక్ష రాసినట్టు తనకు తెలుసని సిట్కు అనితా రామచంద్రన్ తెలిపారు. అయితే, పరీక్షల్లో ప్రవీణ్ అర్హత సాధించకపోవడంతో అతడిపై అనుమానం రాలేదని ఆమె చెప్పారు. మరోవైపు, లింగారెడ్డి మాత్రం తన పీఏ రమేష్ గ్రూప్-1 పరీక్ష రాసినట్లు తనకు తెలియదని అన్నారు. ఇక, మొత్తం పరీక్షల నిర్వహణను కాన్ఫిడెన్షియల్గా సిట్ సేకరించింది. సిట్ అదుపులో ఉన్న మాజీ ఉద్యోగులపై ఆగ్రహం.. అంతకు ముందు.. అనిత రామ్చంద్రన్, లింగారెడ్డి సిట్ కార్యాలయానికి వచ్చిన సమయంలో పోలీసు కస్టడీలో ఉన్న కమిషన్ మాజీ ఉద్యోగులు షమీమ్, రమేష్, సురేష్లు అక్కడే ఉన్నారు. వారిలో షమీమ్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గా, రమేష్ సభ్యుడు లింగారెడ్డికి వ్యక్తిగత సహాయకుడిగా అరెస్టు అయ్యే వరకు పనిచేశారు. వారిని సిట్ కార్యాలయంలో చూసిన అనిత, లింగారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. మీ చర్యల వల్ల కమిషన్ పరువుపోవడంతోపాటు వేలాది మంది నిరుద్యోగుల పరిస్థితి దయనీయంగా మారిందని మండిపడ్డట్లు తెలుస్తోంది. కమిషన్ ఉద్యోగులు, వివిధ పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు అందించాలని సిట్ అనితను కోరింది. -
TSPSC: పేపర్ల లీకేజీలో మీ నిర్లక్ష్యం లేదా?
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పరీక్ష పత్రాల లీకేజీ స్కాంపై దర్యాప్తు చేస్తున్న ‘సిట్’ శనివారం కమిషన్ కార్యదర్శి అనితా రామచంద్రన్, సభ్యుడు లింగారెడ్డిలను ప్రశ్నించింది. సిట్ ఇన్చార్జ్గా ఉన్న అదనపు సీపీ (నేరాలు) ఏఆర్ శ్రీనివాస్ నేతృత్వంలోని బృందం ఇరువురినీ వేర్వేరుగా దాదాపు రెండు గంటల చొప్పున విచారించింది. కమిషన్ నిర్వహణ తీరు, లోపాలు, నిబంధనలు సహా అనేక అంశాలపై 27 ప్రశ్నలు సంధించి వాంగ్మూలాలు నమోదు చేసింది. అనిత కార్యాలయానికి వెళ్లి విచారించాలని సిట్ అధికారులు భావించగా తానే సిట్ ఆఫీసుకు వస్తానని చెప్పిన అనిత.. అన్నట్లుగా శనివారం ఉదయం వచ్చారు. లింగారెడ్డి మధ్యాహ్నం సిట్ అధికారుల ముందు హాజరుకాగా ఇద్దరినీ దాదాపు 2 గంటల చొప్పున ప్రశ్నించారు. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో కమిషన్ నిర్లక్ష్యం లేదా? అనే అంశంపై కొంత సమాచారం సేకరించారు. సిబ్బందే లీక్ చేస్తారనుకోలేదు.. జాగ్రత్తలన్నీ తీసుకొనే ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నామని... కానీ కమిషన్లో పనిచేసే సిబ్బందే లీకేజీకి పాల్పడతారని ఊహించలేదని అనితా రాంచంద్రన్, లింగారెడ్డి స్పష్టం చేశారు. నిందితులు కొన్నాళ్లుగా వ్యక్తిగత సహాయకులుగా పనిచేస్తున్నందున ఏ సందర్భంలోనూ వారిపై అనుమానం రాలేదని సిట్కు తెలిపారు. సైబర్ ఆడిటింగ్లో గుర్తించిన లోపాలను సరిచేయకపోవడానికిగల కారణాలపైనా సిట్ అధికారులు వారిద్దరినీ ప్రశ్నించారు. కమిషన్ పరిధిలోని అంశాలపై ఎప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నామని, ప్రభుత్వ, ఇతర శాఖల పరిధిలోని అంశాల్లోనే జాప్యం జరుగుతోందని వివరణ ఇచ్చారు. కమిషన్లో చైర్మన్ నుంచి ఉన్నతోద్యోగుల వరకు ఎవరి బాధ్యతలు ఏమిటన్నది అగడటంతోపాటు వాటిని సంబంధిత వ్యక్తులు సక్రమంగా నిర్వర్తిస్తున్నారా? దానిపై నిత్యం పర్యవేక్షణ ఉంటోందా? అనే అంశంపైనా సిట్ అనిత, లింగారెడ్డిల నుంచి సమాచారం సేకరించింది. కాన్ఫిడెన్షియల్ సెక్షన్ నిర్వహణ, యాక్సెస్ కంట్రోల్ లేకపోవడం, కస్టోడియన్ల ఎంపిక తదితర విషయాలపైనా ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. కీలక బాధ్యతల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగులను నియమించుకోవడంపైనా పోలీసులు ప్రశ్నించారు. అయితే విధానపరమైన నిర్ణయాలు ఏ ఒక్కరో తీసుకోరని, ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తామని అనిత, లింగారెడ్డి సిట్ దృష్టికి తీసుకువెళ్లారు. టీఎస్పీఎస్సీ చైర్మన్, కార్యదర్శి, సభ్యుల వద్ద వ్యక్తిగత సహాయకులుగా పనిచేస్తున్న వాళ్లు కమిషన్ నిర్వహించే పోటీ పరీక్షలు రాయవచ్చా? అనే అంశంపై సిట్ అనితను ప్రశ్నించింది. ఇలా రాయకూడదని ఎలాంటి నిబంధన లేదన్న ఆమె గతంలోనూ అనేక మంది ఉద్యోగులు రాశారని వివరించారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్రెడ్డితోపాటు మిగిలిన సభ్యులు, ఉన్నతాధికారులకు సైతం త్వరలో నోటీసులు ఇచ్చి విచారించడం ద్వారా వాంగ్మూలాలను నమోదు చేయాలని సిట్ అధికారులు నిర్ణయించారు. సిట్ అదుపులో ఉన్న మాజీ ఉద్యోగులపై ఆగ్రహం... అనిత రామ్చంద్రన్, లింగారెడ్డి సిట్ కార్యాలయానికి వచ్చిన సమయంలో పోలీసు కస్టడీలో ఉన్న కమిషన్ మాజీ ఉద్యోగులు షమీమ్, రమేష్, సురేష్లు అక్కడే ఉన్నారు. వారిలో షమీమ్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గా, రమేష్ సభ్యుడు లింగారెడ్డికి వ్యక్తిగత సహాయకుడిగా అరెస్టు అయ్యే వరకు పనిచేశారు. వారిని సిట్ కార్యాలయంలో చూసిన అనిత, లింగారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. మీ చర్యల వల్ల కమిషన్ పరువుపోవడంతోపాటు వేలాది మంది నిరుద్యోగుల పరిస్థితి దయనీయంగా మారిందని మండిపడ్డట్లు తెలుస్తోంది. కమిషన్ ఉద్యోగులు, వివిధ పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు అందించాలని సిట్ అనితను కోరింది. వారి మధ్య ఏమైనా సంబంధాలు ఉన్నాయా? ఉంటే ఏమిటి? తదితర అంశాలు సరిచూడటానికి ఈ కోణంలో ముందుకు వెళ్తున్నారు. -
సిట్ ఆఫీస్లో ముగిసిన అనిత విచారణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజ్ కేసులో సిట్ దర్యాప్తుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇంతకాలం లీకేజీ రాయులు, అభ్యర్థులు, టీఎస్పీఎస్సీ ఉద్యోగులనే ప్రశ్నించిన దర్యాప్తు బృందం, ఇప్పుడు ఏకంగా కమిషన్లోని సభ్యులపైనే దృష్టిసారించింది. ఈ క్రమంలో.. ఇవాళ కమిషన్ సెక్రెటరీ అనితా రామచంద్రన్(ఐఏఎస్)ను సిట్ విచారించింది. శనివారం ఉదయం హిమాయత్నగర్లోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు అనితా రామచంద్రన్. సుమారు రెండు గంటలపాటు ఆమెను సిట్ చీఫ్ ఏఆర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలోని టీం ప్రశ్నించినట్లు తెలుస్తోంది. సిట్ అధికారులు ఈ మేరకు ఆమె నుంచి స్టేట్మెంట్ను రికార్డు చేశారు. ప్రశ్నాపత్రాల తయారీ, వాటిని భద్రపర్చడం తదితర వ్యవహరాలన్నీ కాన్ఫిడెన్షియల్ విభాగం పరిధిలోనే ఉంటాయి. ఈ విభాగం పూర్తిగా సెక్రెటరీ అయిన అనిత పర్యవేక్షణలోనే ఉంటుంది. అయితే కాన్ఫిడెన్షియల్ విభాగంలో పని చేసే శంకర్ లక్ష్మి కంప్యూటర్ని హ్యాక్ చేసి.. ప్రశ్నాపత్రాలు కొట్టేసినట్లు సిట్ ఇదివరకే ధృవీకరించుకుంది. ఈ నేపథ్యంలోనే అనితా రామచంద్రన్ను సిట్ విచారించింది. మరోవైపు పేపర్ లీకేజ్లో నిందితుడిగా ఉన్న రమేష్, కమిషన్ సభ్యుడైన లింగారెడ్డికి పీఏగా తెలుస్తోంది. వీరిద్ధిరి మధ్య సత్సబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. అనితకు, లింగారెడ్డిలకు సీఆర్పీసీ సెక్షన్ 91, సెక్షన్ 160ల ప్రకారం వీళ్లిద్దరికీ సిట్ నోటీసులు జారీ చేసింది. అనితా రామచంద్రన్, లింగారెడ్డిలు అందించే వివరాలను బట్టి.. సిట్ కమిషన్లోనే మరికొందరికి నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. -
టీఎస్పీఎస్సీకి సిట్ టెస్ట్.. పేపర్ల లీకేజీలో సెక్రెటరీ, సభ్యుడికి నోటీసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సరీ్వస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) పేపర్ల లీకేజీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్, సభ్యుడు లింగారెడ్డి, చైర్మన్ జనార్దనరెడ్డిల వాంగ్మూలాలను నమోదు చేయాలని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నిర్ణయించింది. ఇందులో భాగంగా అధికారులు శుక్రవారం అనితా రామచంద్రన్, లింగారెడ్డిలకు నోటీసులు జారీ చేశారు. జనార్దనరెడ్డికి నోటీసులు ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ ముగ్గురికీ అనువైన సమయంలో సిట్ అధికారులే టీఎస్పీఎస్సీ కార్యాలయానికి వెళ్లి వాంగ్మూలాలు తీసుకోనున్నారు. ఇక లీకైన పేపర్ల ‘మారి్పడి’ మొత్తం హార్డ్కాపీల (ప్రింటెడ్ కాపీల) రూపంలోనే జరిగిందని.. కేవలం ఇద్దరికి మాత్రమే ఎనీడెస్క్ అప్లికేషన్ ద్వారా అందిందని సిట్ అధికారులు తేల్చారు. రాజశేఖర్రెడ్డి తనకు కంప్యూటర్ యాక్సెస్ ఇచ్చినందుకు ప్రతిఫలంగా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఏఎస్ఓ) షమీమ్కు గ్రూప్–1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రం అందించాడని గుర్తించారు. ప్రతి అంశాన్ని పరిశీలిస్తూ.. సిట్ అధికారులు ఏప్రిల్ 11న హైకోర్టుకు స్టేటస్ రిపోర్టు సమరి్పంచాల్సి ఉంది. దీంతో ప్రతి అంశంలోనూ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ప్రతి అంశంలో న్యాయ నిపుణులు, న్యాయ సలహాదారుల అభిప్రాయం తీసుకుంటున్నారు. టీఎస్పీఎస్సీ కార్యదర్శి చైర్మన్ నేతృత్వంలో పనిచేయడంతో పాటు కార్యనిర్వాహక బాధ్యతలను పర్యవేక్షిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరి వాంగ్మూలాలు కేసులో కీలకమని సిట్కు న్యాయ నిపుణులు సూచించడంతో.. కార్యదర్శికి నోటీసులు జారీచేశారు, చైర్మన్కూ ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక గ్రూప్–1 ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో అరెస్టైన డేటా ఎంట్రీ ఆపరేటర్ డామెర రమేశ్కుమార్ ఇంతకుముందు కమిషన్ సభ్యుడు లింగారెడ్డి వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పనిచేశారు. ఈ క్రమంలో లింగారెడ్డికి నోటీసులు ఇచ్చిన సిట్ అధికారులు.. మిగతా సభ్యుల విషయమై న్యాయ సలహా తీసుకుంటున్నారు. కేవలం ప్రింటెడ్ పత్రాలే ఇస్తూ.. లీకైన పేపర్లలో గ్రూప్–1 ప్రిలిమ్స్, ఏఈ ప్రశ్నపత్రాలు మాత్రమే అభ్యర్థులకు చేరాయని సిట్ అధికారులు చెప్తున్నారు. ఇవి మొత్తం తొమ్మిది మందికి చేరాయని ఇప్పటివరకు తేలి్చనట్టు సమాచారం. కస్టోడియన్ కంప్యూటర్ నుంచి ప్రవీణ్, రాజశేఖర్ చేజిక్కించుకున్నవి సాఫ్ట్కాపీలే. అయినా ఈ ‘వాట్సాప్ జమానా’లో కూడా వారు ప్రశ్నపత్రాల ఆన్లైన్ షేరింగ్ జోలికి పోలేదు. న్యూజిలాండ్లో ఉన్న రాజశేఖర్ సమీప బంధువు ప్రశాంత్రెడ్డి, టీఎస్పీఎస్సీ సభ్యుడి వద్ద పీఏగా పనిచేసిన రమేశ్కు మాత్రమే ఎనీడెస్క్ అప్లికేషన్ ద్వారా సాఫ్ట్కాపీలు ఇచ్చారు. మిగతా వారికి ప్రింట్ఔట్స్ రూపంలో ఉన్న మాస్టర్ క్వశ్చన్ పేపర్ల పత్రాలే అందించారు. ఎక్కడా సాంకేతిక ఆధారాలు చిక్కకూడదనే ఇలా చేసినట్టు సిట్ అధికారులు భావిస్తున్నారు. కంప్యూటర్ యాక్సెస్ కోసం పేపర్ ఇచ్చి.. రాజశేఖర్ తన పెన్డ్రైవ్లో ఉన్న గ్రూప్–1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాన్ని ప్రశాంత్రెడ్డికి ఎనీడెస్క్ అప్లికేషన్ ద్వారా పంపినా.. ఇందుకోసం తన కంప్యూటర్ను నేరుగా వినియోగించలేదు. ఎవరైనా సహోద్యోగులు చూసే ప్రమాదం ఉందని, సాంకేతిక ఆధారాలు చిక్కకూడదని భావించాడు. ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేíÙంచిన అతడికి తన స్నేహితురాలైన ఏఎస్ఓ షమీమ్ కూడా గ్రూప్–1 రాస్తున్నట్టు తెలిసింది. ఆమెను సంప్రదించిన రాజశేఖర్.. తాను ఇచ్చే పెన్డ్రైవ్ను ఇంటికి తీసుకువెళ్లి ల్యాప్టాప్కు కనెక్ట్ చేయాలని, ఎనీడెస్క్ ద్వారా న్యూజిల్యాండ్లో ఉన్న ప్రశాంత్కు యాక్సెస్ ఇవ్వాలని కోరాడు. ఇలా చేసినందుకు అందులో ఉన్న ప్రశ్నపత్రాన్ని పేపర్ తీసుకోవచ్చని.. ఈ విషయం ఎవరికీ తెలియదని భరోసా ఇచ్చాడు. రాజశేఖర్ ఇచి్చన పెన్డ్రైవ్ను తీసుకువెళ్లిన షమీమ్ తన ఇంటివద్ద ల్యాప్టాప్కు కనెక్ట్ చేసింది. తర్వాత రాజశేఖర్ సూచనల ప్రకారం నిరీ్ణత సమయంలో ఎనీడెస్క్ ద్వారా ఈ ల్యాప్టాప్ను యాక్సెస్ చేసిన ప్రశాంత్రెడ్డి.. ఆ పెన్డ్రైవ్లో ఉన్న గ్రూప్–1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాన్ని తన కంప్యూటర్లోకి కాపీ చేసుకున్నాడు. తర్వాత రమేశ్కు ప్రవీణ్ ఇదే పంథాలో తన కంప్యూటర్ నుంచి ఎనీడెస్క్ ద్వారా ప్రశ్నపత్రం అందించాడు. గ్రూప్–1 మెయిన్స్ పేపర్లు సైతం ఇలానే చేజిక్కించుకోవాలని పథకం వేసిన ప్రవీణ్.. ఎక్కడా లీకేజ్ వ్యవహారం బయటపడకూదని, సాంకేతిక ఆధారాలు ఉండకూడదనే ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నాడని సిట్ అధికారులు చెప్తున్నారు. ఫోరెన్సిక్ పరీక్షలకు కంప్యూటర్లు, ల్యాప్టాప్ షమీమ్, రమేశ్, సురేశ్లను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న సిట్ అధికారులు.. ఈ అంశాలను నిర్ధారించుకోవడంతోపాటు న్యూజిలాండ్లో ఉన్నది మినహా మిగతా కంప్యూటర్లు, ల్యాప్టాప్లను స్వా«దీనం చేసుకున్నారు. వాటిని ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం ఎఫ్ఎస్ఎల్కు పంపనున్నారు. మరోవైపు సిట్ అధికారులు గ్రూప్–1 ప్రిలిమ్స్లో 100 కంటే ఎక్కువ మార్కులు వచి్చన 121 మందినీ ప్రశి్నస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం నాటికి 103 మందిని విచారించామని, ఎలాంటి అనుమానాస్పద అంశమూ తమ దృష్టికి రాలేదని సిట్ అధికారులు చెప్తున్నారు. చదవండి: రేవంత్ ఆరోపణలపై సిట్ రియాక్షన్ -
Tspsc Paper Leak: రేవంత్ ఆరోపణలపై సిట్ రియాక్షన్
సాక్షి,హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆరోపణలపై సిట్ స్పందించింది. డేటా ఎవరికీ ఇవ్వలేదని సిట్ అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు వంద మందిని విచారించాం. రూ.4 లక్షల నగదు సీజ్ చేశామని తెలిపారు. కాగా, పేపర్ల లీకేజీ వ్యవహారంలో సిట్ దూకుడు ప్రదర్శిస్తోంది. టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్, సభ్యుడు లింగారెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. ఛైర్మన్నూ కూడా సిట్ విచారించనుంది. ఇంటి దొంగల పాత్రపై సిట్ ఫోకస్ పెట్టింది. పేపర్ లీకేజీకి సంబంధించి ముగ్గురు నిందితులను సిట్ తన కస్టడీకి తీసుకున్న సంగతి తెలిసిందే. నాంపల్లి కోర్టు అనుమతితో నిందితులు షమీమ్, సురేష్, రమేష్ను సిట్ ఐదు రోజుల పాటు ప్రశ్నించనుంది. ఇక, ముగ్గురు నిందితుల్లో ఇద్దరు టీఎస్పీఎస్సీ ఉద్యోగులే కావడం గమనార్హం. అయితే, పేపర్ లీకేజీలో నిందితులు కీలకంగా వ్యవహరించినట్టు పోలీసులు గుర్తించారు. చదవండి: కేటీఆర్ ఏమైనా రకుల్ సినిమాకు సైన్ చేసినట్టా..! రేవంత్ రెడ్డి ఫైర్ -
టీఎస్పీఎస్సీ పేపర్ల లీక్ కేసులో కీలక మలుపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సంచలనంగా మారిన టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకంపై.. టీఎస్పీఎస్సీ మెంబర్లను విచారించాలని సిట్ నిర్ణయించింది. టీఎస్పీఎస్సీలో ఏడుగురు బోర్డు సభ్యుల స్టేట్మెంట్ను సిట్ అధికారులు రికార్డు చేయనున్నారు. కాగా, ఈ కేసు దర్యాప్తులో భాగంగా సిట్ దూకుడు పెంచింది. పేపర్ లీకేజీకి సంబంధించి ముగ్గురు నిందితులను సిట్ తన కస్టడీకి తీసుకుంది. నాంపల్లి కోర్టు అనుమతితో నిందితులు షమీమ్, సురేష్, రమేష్ను సిట్ ఐదు రోజుల పాటు ప్రశ్నించనుంది. ఇక, ముగ్గురు నిందితుల్లో ఇద్దరు టీఎస్పీఎస్సీ ఉద్యోగులే కావడం గమనార్హం. అయితే, పేపర్ లీకేజీలో నిందితులు కీలకంగా వ్యవహరించినట్టు పోలీసులు గుర్తించారు. మరోవైపు, పేపర్ కేసు ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్, డాక్యా నాయక్తో వీరికి ఉన్న సంబంధాలపై సిట్ ఆరా తీస్తోంది. ఇక ఈ కేసులో ఇప్పటి వరకు 15 మంది అరెస్ట్ అయ్యారు. పలువురికి నోటీసులు కూడా ఇచ్చారు. దీంతో, అరెస్ట్ల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. చదవండి: ఆ ఆరు పరీక్షలపై దృష్టి -
Telangana: 15 పేపర్లు అవుట్!
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీక్ కేసు దర్యాప్తులో వెలుగు చూస్తున్న అంశాలు నివ్వెరపరుస్తున్నాయి. మొత్తం ఆరు రకాల పరీక్షలకు సంబంధించి ఏకంగా 15 క్వశ్చన్ పేపర్లు ముందే బయటకు వచ్చినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తేల్చింది. గ్రూప్–1 పేపర్ లీక్ ఐదుగురికే పరిమితమైందని, ఏఈ ప్రశ్నపత్రం పలువురికి విక్రయించారని, మిగతావి పెన్డ్రైవ్కే పరిమితమైనట్లు స్పష్టమైంది. గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలకు సంబంధించిన పేపర్లు తస్కరించేందుకు కూడా నిందితులు పథకం వేసినట్లు బయటపడింది. అన్నీ మాస్టర్ ప్రశ్నపత్రాలే.. ఈ స్కామ్లో సూత్రధారులుగా ఉన్న కమిషన్ కార్యదర్శి మాజీ పీఏ ప్రవీణ్ కుమార్, నెట్వర్క్ అడ్మిన్ రాజశేఖర్రెడ్డితో పాటు 13 మంది నిందితులను పోలీసులు వివిధ కోణాల్లో విచారించారు. గతేడాది అక్టోబర్ మొదలు గత నెల ఆఖరి వారం వరకు సాగిన ఈ లీకేజ్ వ్యవహారంపై కీలక ఆధారాలు సేకరించారు. గ్రూప్–1 ప్రిలిమ్స్ పేపర్ను ప్రవీణ్.. సురేష్, రమేష్లకు కూడా ఇచ్చాడు. రాజశేఖర్రెడ్డి.. షమీమ్కు, న్యూజిలాండ్లో ఉండే తన సమీప బంధువు ప్రశాంత్ రెడ్డికి ఇచ్చాడు. ఈ ఐదుగురికి మినహా మరెవరికీ ఈ ప్రశ్నపత్రం చేరినట్లు ఇప్పటివరకు ఆధారాలు లభించలేదని సిట్ అధికారులు చెబుతున్నారు. గత నెల 5న జరిగిన ఏఈ పరీక్ష పత్రాలు నీలేష్, గోపాల్, ప్రశాంత్, రాజేంద్రకుమార్ ఖరీదు చేశారని తేల్చారు. వీరి ద్వారా మరికొందరికి చేరే అవకాశాలు తక్కువని చెప్తున్న అధికారులు.. ఆ కోణంలోనూ దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ప్రవీణ్ పెన్డ్రైవ్లో మొత్తం ఆరు పోస్టులకు సంబంధించిన పరీక్షల పత్రాలు ఉన్నట్లు గుర్తించారు. గ్రూప్–1 ప్రిలిమ్స్, అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ), అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) టౌన్ ప్లానింగ్ బిజినెస్ ఓవర్సీర్ (టీపీబీఓ), జూనియర్ లెక్చరర్ (జేఎల్), డిస్ట్రిక్ట్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏఓ) పేపర్లు పెన్డ్రైవ్లో ఉన్నాయని, ఇవన్నీ మాస్టర్ క్వశ్చన్ పేపర్లని సిట్ అధికారులు చెప్తున్నారు. వీటిల్లో ఆయా ప్రశ్నలతో పాటు సమాధానాలు కూడా ఉంటాయి. ఈ కారణంగానే గ్రూప్–1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాలు తీసుకున్నవారు, ఏఈ పేపర్ను ఖరీదు చేసిన వారు.. సిద్ధం కావడం తేలికైంది. లేనిపక్షంలో సమాధానాలు వెతుక్కోవడానికి, ఆపై సిద్ధం కావడానికి మరికొంత సమయం అవసరమై ఉండేదని అంటున్నారు. గ్రూప్–1 మెయిన్స్ పేపర్లు కొట్టేసేందుకూ ప్లాన్ గ్రూప్–1, ఏఈఈ మినహా మిగిలినవి ప్రవీణ్ వద్దే ఉండిపోయాయని, ఖరీదు చేసే వాళ్ల కోసం ప్రయత్నాలు జరుగుతుండగానే స్కామ్ వెలుగు చూసిందని సిట్ అధికారులు పేర్కొంటున్నారు. ప్రవీణ్, రాజశేఖర్లు గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలకు సంబం«ధించిన పేపర్లు కూడా కస్టోడియన్ కంప్యూటర్ నుంచి తస్కరించాలని పథకం వేశారని, ఈ మేరకు షమీమ్, సురేష్, రమేష్, ప్రశాంత్రెడ్డిలకు సమాచారం ఇచ్చారని ఓ ఉన్నతాధికారి చెప్పారు. 8 గంటల పాటు విచారణ పోలీసు కస్టడీలో ఉన్న ముగ్గురు నిందితులు షమీమ్, సురేష్, రమేష్లను సిట్ పోలీసులు రెండోరోజు గురువారమూ 8 గంటల పాటు ప్రశ్నించారు. ఎల్బీనగర్, సైదాబాద్, ఉప్పల్ ప్రాంతాల్లోని వారివారి ఇళ్లకు వెళ్లి ఆధారాల కోసం సోదాలు చేశారు. గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించి మాస్టర్ ప్రశ్నపత్రాల కాపీలు స్వాధీనం చేసుకున్నారు. కస్టోడియన్ శంకరలక్ష్మి వాంగ్మూలం గురువారం మరోసారి నమోదు చేశారు. ఆ 15 ప్రశ్నపత్రాల జాబితా ఇది... 1. గ్రూప్–1 జనరల్ స్టడీస్ 2. ఏఈఈ సివిల్ ఇంజనీరింగ్ 3. ఏఈఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 4. ఏఈఈ మెకానికల్ ఇంజనీరింగ్ 5. డీఏఓ జనరల్ స్టడీస్ 6. డీఏఓ మేథమెటిక్స్ 7. జనరల్ స్టడీస్ డిప్లొమా ఏఈ 8. సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా ఏఈ 9. మెకానికల్ ఇంజనీరింగ్ డిప్లొమా ఏఈ 10. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిప్లొమా ఏఈ 11. మెకానికల్ ఇంజనీరింగ్ డిప్లొమా ఏఈ పేపర్–2 12. సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా ఏఈ పేపర్–2 13. టీపీబీఓ ఒకేషనల్ జనరల్ స్టడీస్ పేపర్–1 14. టీపీబీఓ ఇంటర్మీడియట్ ఒకేషనల్ పేపర్–2 15. జూనియర్ లెక్చరర్స్ ఎగ్జామ్ -
HYD: డేటా చోరీ కేసులో బిగ్ ట్విస్ట్.. ఈడీ ఎంట్రీ!
సాక్షి, హైదరాబాద్: డేటా చోరీ కేసు తెలంగాణ సహా దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. కాగా, తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద దీనిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేసు నమోదు చేసింది. ఈ కేసులో సైబరాబాద్ పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసినట్టు తెలిపింది. ఇదిలా ఉండగా, అంతకుముందు.. దేశంలోనే అతి పెద్ద డేటా చోరీ కేసును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. ప్రజల వ్యక్తిగత డేటాను విక్రయిస్తున్న ఆరుగురు సభ్యుల ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా 16.80 కోట్ల మంది డేటా చోరీ అయినట్లు గుర్తించారు. మరో 10 కోట్ల మంది డేటా చోరీ జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో, తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. వెంటనే ఈ కేసును దర్యాప్తు చేసేందుకు ఐపీఎస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో సిట్ను ఏర్పాటు చేసింది. డేటా చోరికి సంబంధించిన వివరాలను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మీడియాకు వివరించారు. డేటా చోరీ కేసు దర్యాప్తులో తేలిన వాస్తవాలను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ఈ రోజు మీడియాకు వెల్లడించారు. డేటా చోరి స్కామ్లో పలు బ్యాంకుల క్రెడిట్ కార్డు జారీ చేసే ఏజెన్సీ ఉన్నట్లు గుర్తించామన్నారు. దేశంలోని కోట్ల మంది పర్సనల్ డేటా, గ్యాస్ డేటాను చోరీ చేసినట్లు గుర్తించామన్నారు. పలు కంపెనీలు, బ్యాంకుల్లో ఇన్సూరెన్స్, లోన్ల కోసం అప్లై చేసుకున్న దాదాపు 4 లక్షల మంది డేటా చోరీకి గురైందని వెల్లడించారు. డిఫెన్స్, ఆర్మీ ఉద్యోగుల సెన్సిటివ్ డేటా కూడా చోరీకి గురైందని తేల్చారు. ఫేస్ బుక్, ట్విట్టర్ వాడే 7 లక్షల మంది వ్యక్తిగత డేటా, వారి ఐడీలు, పాస్ వర్డులను సైబర్ నేరగాళ్లు దొంగిలించినట్లు స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: ‘దిశ’ కేసులో వాయిదాలు సరికాదు -
పని పూర్తి చేయమంటే 'పేపర్ అమ్మమన్నాడు'!
సాక్షి, హైదరాబాద్: ఉపాధి హామీ పథకం పనుల ఆలస్యంపై ఓ సర్పంచ్ కుమారుడిని ప్రశ్నించడంతోనే తిరుపతయ్య తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) పరీక్ష పేపర్ల లీకేజీ స్కామ్లో భాగస్వామి అయ్యాడని తెలుస్తోంది. ఇతడితో పాటు ఇద్దరు అభ్యర్థులను అరెస్టు చేసిన సిట్ అధికారులు వీరిని తమ కస్టడీలోకి తీసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరోపక్క లీకేజీ కేసులో జైలుకు వెళ్లిన టీఎస్పీఎస్సీ మాజీ ఉద్యోగులు షమీమ్, సురేశ్, రమేశ్లను పోలీసులు బుధవారం తమ కస్టడీలోకి తీసుకున్నారు. టీఎస్పీఎస్సీ కార్యదర్శికి వ్యక్తిగత సహాయకుడిగా పని చేసిన ప్రవీణ్ కుమార్ నుంచి రేణుక, ఆమె భర్త డాక్యాలకు ఏఈ పరీక్ష ప్రశ్నపత్రాలు అందిన విషయం తెలిసిందే. వీటిని విక్రయించడానికి ఈ భార్యాభర్తలు ఏర్పాటు చేసుకున్న దళారుల్లో తమ స్వగ్రామమైన మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం మన్సూర్పల్లి తండాకు చెందిన కేతావత్ రాజేశ్వర్ అలియాస్ రాజు ఒకరు. రాజేశ్వర్ తల్లి మన్సూర్పల్లి తండాకు సర్పంచ్గా పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ తండాకు సంబంధించిన అభివృద్ధి పనులను రాజేశ్వర్ పర్యవేక్షించేవాడు. సల్కర్పేట గ్రామానికి చెందిన తిరుపతయ్య ఉపాధి హామీ పథకంలో టెక్నికల్ అసిస్టెంట్గా పని చేస్తున్నాడు. ఇతడు ఎనిమిదేళ్లుగా గండీడ్ మండలంలో పని చేస్తున్నాడు. దీంతో తిరుపతయ్య, రాజేశ్వర్ మధ్య పరిచయాలు ఉన్నాయి. మన్సూర్పల్లి తండాలో జరిగే ఓ అభివృద్ధి పనిని తిరుపతయ్య పర్యవేక్షిస్తున్నాడు. అది నిర్ణీత సమయానికి పూర్తికాకపోవడంతో ఆలస్యానికి కారణం ఏమిటంటూ రాజేశ్వర్ను ప్రశ్నించాడు. అప్పటికే ఏఈ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థుల వేటలో ఉన్న రాజేశ్వర్ అదే విషయం తిరుపతయ్యకు చెప్పి, ఆ బిజీలో ఉండటంతో అభివృద్ధి పనిని పర్యవేక్షించడం సాధ్యం కాలేదని, ఎవరైనా అభ్యర్థులు ఉంటే తీసుకురావాలని సూచించాడు. ప్రశ్నపత్రం విక్రయించగా వచ్చిన సొమ్ములో కమీషన్ ఇస్తానని చెప్పాడు. దీనికి అంగీకరించిన తిరుపతయ్య.. ఉపాధి హామీ పథకంలో పరిచయమైన రాజేంద్రకుమార్, ప్రశాంత్ను సంప్రదించాడు. వీరిని రాజేశ్వర్ వద్దకు తీసుకువెళ్లి, డాక్యా ద్వారా కర్మన్ఘాట్లోని ఓ లాడ్జి వద్ద ప్రశ్నపత్రం ఇప్పించాడు. వీరి నుంచి అడ్వాన్సుగా రూ.8 లక్షలు తీసుకున్నట్లు తెలిసింది. కస్టడీకోసం కోర్టులో సిట్ పిటిషన్ ఈ కేసులో వీరిని మరింత లోతుగా ప్రశ్నించడంతో పాటు నగదు రికవరీ కోసం తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ సిట్ పోలీసులు బుధవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు ప్రకారం గ్రూప్–1 ప్రిలిమ్స్ పేపర్ ప్రవీణ్, రాజశేఖర్ల ద్వారా ఈ ముగ్గురితో పాటు రాజశేఖర్ సమీప బంధువు ప్రశాంత్రెడ్డి వద్దకు మాత్రమే వెళ్లింది. రమేశ్, సురేశ్లకు ప్రవీణ్ ఇవ్వగా.. షమీమ్తో పాటు ప్రశాంత్రెడ్డిలకు రాజశేఖర్ ఇచ్చాడు. అయితే ఆ పేపర్ ఈ ఐదుగురితో పాటు ఇంకా ఎవరికైనా చేరిందా? అనే కోణంలో సిట్ వీరిని ప్రశ్నించనుంది. సిట్ అధికారులు గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్షల్లో 100కు పైగా మార్కులు సాధించిన 121 మందిని ప్రశ్నించడం కొనసాగిస్తున్నారు. బుధవారం నాటికి 84 మందిని ప్రశ్నించారు. కాగా, ఏఈ ప్రశ్నపత్రం మాదిరిగా గ్రూప్–1 పేపర్ వ్యవహరంలో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేవని ఓ అధికారి వ్యాఖ్యానించారు. -
TSPSC Paper Leak: పేపర్ లీక్ వ్యవహారంలో మరో ట్విస్ట్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే, ఈ కేసు దర్యాప్తులో భాగంగా సిట్ దూకుడు పెంచింది. పేపర్ లీకేజీకి సంబంధించి ముగ్గురు నిందితులను సిట్ తన కస్టడీకి తీసుకుంది. నాంపల్లి కోర్టు అనుమతితో నిందితులు షమీమ్, సురేష్, రమేష్ను సిట్ ఐదు రోజుల పాటు ప్రశ్నించనుంది. ఇక, ముగ్గురు నిందితుల్లో ఇద్దరు టీఎస్పీఎస్సీ ఉద్యోగులే కావడం గమనార్హం. అయితే, పేపర్ లీకేజీలో నిందితులు కీలకంగా వ్యవహరించినట్టు పోలీసులు గుర్తించారు. మరోవైపు, పేపర్ కేసు ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్, డాక్యా నాయక్తో వీరికి ఉన్న సంబంధాలపై సిట్ ఆరా తీయనుంది. ఇక, ఈ కేసులో ఇప్పటి వరకు 15 మంది అరెస్ట్ అయ్యారు. పలువురికి నోటీసులు కూడా ఇచ్చారు. దీంతో, అరెస్ట్ల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. ఇది కూడా చదవండి: పేపర్ లీకేజీ దొంగలకు కేటీఆర్ అండ! -
TSPSC పేపర్ లీకులో వరుస అరెస్టులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నిరుద్యోగుల్ని కుదిపేసి.. రాజకీయంగానూ ప్రకంపనలు సృష్టించిన పేపర్ల లీక్ వ్యవహారంలో వరుస అరెస్టులు చోటు చేసుకుంటున్నాయి. నిందితులు ఒకరికి తెలియకుండా మరొకరు పేపర్లు అమ్ముకుని.. ఒక్కొక్కరుగా బయట పడుతున్నారు. తాజాగా.. ఈ కేసులో మరొకరిని అరెస్ట్ చేసింది సిట్. మహబూబ్నగర్ గండీడ్కు చెందిన తిరుపతయ్య అనే అభ్యర్థిని సిట్ అరెస్ట్ చేసింది. దీంతో.. పేపర్ లీక్ కేసులో అరెస్టుల సంఖ్య 15కి చేరింది. మొదట.. ఈ కేసులో ఒకేసారి తొమ్మిది మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ తొమ్మిది మంది సిట్ విచారణలో ఇచ్చిన సమాచారంతో మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఆపై మరో ఇద్దరినీ, తాజాగా తిరుపతయ్యను అరెస్ట్ చేసింది సిట్. డాక్యా నాయక్ నుంచి తిరపతయ్య ఏఈ పేపర్ను కొనుగోలు చేసినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. అంతేకాదు ఈ కేసులో నిందితురాలు రేణుక, తిరుపతయ్య ఒకే ప్రాంతానికి చెందిన వాళ్లు కావడం గమనార్హం. ఇదిలా ఉంటే.. సిట్ ఇవాళ నిందితులను మళ్లీ కస్టడీలోకి తీసుకోనుంది. దీంతో మరిన్నిపేర్లు బయటపడొచ్చని, అరెస్టులు జరగొచ్చని అర్థమవుతోంది. గ్రూప్ -1(Group 1) ప్రిలిమ్స్లో(రద్దైంది) 100కుపైగా మార్కులు వచ్చినవాళ్లను సిట్ పిలిచి విచారిస్తున్నట్లు సమాచారం. వాళ్లకు 15 అంశాలతో కూడిన ప్రశ్నావళి రూపొందించి సమాధానాలు ఇవ్వాలని కోరుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం సిట్ కార్యాలయంలో నిందితుల విచారణ కొనసాగుతోంది. ప్రవీణ్ , రాజశేఖర్ , డాక్య నాయక్ , కేతావత్ రాజేశ్వర్ లను రెండో రోజు కస్టడీలోకి తీసుకుని సీసీఎస్ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు సిట్ అధికారులు. ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాల నడుమ మరో వందేభారత్ -
నోటీసులపై స్పందించిన బండి సంజయ్.. సిట్కు లేఖ.. ఏం చెప్పారంటే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణను పట్టి కుదిపేస్తున్న టీఎస్సీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారం రాజకీయంగా మరింత వేడిపెంచింది. ఈనేపథ్యంలోనే టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో తాను చేసిన వ్యాఖ్యలకుగానూ ఆధారాలను వ్యక్తిగతంగా హాజరై.. తమకు సమర్పించాలంటూ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్కు సిట్ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా సిట్ నోటీసులపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. ఈమేరకు ఆయన సిట్ అధికారికి ఆదివారం లేఖ రాశారు. ‘నాకు సిట్ మీద నమ్మకం లేదు. పార్లమెంట్ సమావేశాల కారణంగా బిజీగా ఉన్నాను అని ఇప్పటికే తెలిపాను. అయినా మళ్ళీ నోటీస్ లు ఇచ్చారు. మీ పరిస్థితి ని అర్థం చేసుకోగలను. ఆ బాధ్యత గల మంత్రి ఇద్దరు మాత్రమే ఉన్నారు అని అన్నారు. లీక్ లో చాలా మంది ఉన్నారని సిట్ హెడ్ గా మీకు తెలుసు. స్కాం ను తక్కువ చేసి చుపెట్టే ప్రయత్నం మొదటి నుండి జరుగుతుంది. రాజకీయాల ను పక్కన పెట్టి మీ ఆత్మ సాక్షి తో ఆలోచించండి. ఈ స్కాం తో ఎన్నో లక్షల మంది మనో వేదనకు గురవుతున్నారు. ఒక గ్రామం నుండి ఎక్కువ మంది గ్రూప్ వన్ కి సెలెక్ట్ అయ్యారని సమాచారం నాకు వచ్చింది. దాన్ని ప్రజల ముందు పెట్టాను. ప్రజా ప్రతినిధి గా వివిధ మార్గాల నుండి సమాచారం వస్తుంది.. ఈ సమయం లో పూర్తి వివరాలను బహిర్గతం చేయడం భావ్యం కాదని అనుకుంటున్నాను. అసలు విషయం పై విచారణ జరపకుండా. మీరు నాకు నోటీస్ లు ఇవ్వడానికి ప్రాధాన్యత ఇచ్చారు. పార్లమెంట్ సమావేశాలు నేపథ్యం లో నేను హాజరు కావడం లేదు’ అని బండి సంజయ్ లేఖలో పేర్కొన్నారు. -
సిట్ విచారణకు బండి సంజయ్ గైర్హాజరు?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్ రేపు(ఆదివారం) సిట్ విచారణకు గైర్హాజరు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో తాను చేసిన వ్యాఖ్యలకుగానూ ఆధారాలను వ్యక్తిగతంగా హాజరై.. తమకు సమర్పించాలంటూ సిట్ నోటీసుల ద్వారా ఆయన్ని కొరిన సంగతి తెలిసిందే. అయితే గతంలో జారీ చేసిన నోటీసులు తనకు అందలేదని ఆయన విచారణకు గైర్హాజరు కాగా.. తాజాగా ఇవాళ ఆయనకు సిట్ మళ్లీ నోటీసులు జారీ చేసింది. అయితే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో హైదరాబాద్ లిబరేషన్ కార్యక్రమంతో పాటు.. ఎన్నికల ప్రచార కార్యక్రమంలలో పాల్గొనేందుకు ఆయన ఆదివారం బీదర్(కర్ణాటక) వెళ్లనున్నట్లు సమాచారం. దీంతో ఆయనకు బదులు లీగల్టీం సిట్ విచారణకు హాజరు కావొచ్చని తెలుస్తోంది. -
పేపర్ లీక్ కేసు: సిట్ కస్టడీ రిపోర్ట్లో కీలకాంశాలు
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ TSPSC పేపర్ లీకేజ్ కేసులో నలుగురు నిందితులను మాత్రమే అదీ మూడు రోజుల సిట్ కస్టడీకి అనుమతించిన నాంపల్లి కోర్టు. శనివారం సాయంత్రం ఈ కేసులోని నిందితులను కోర్టులో ప్రవేశపెట్టి.. ఆరు రోజుల కస్టడీకి కోరింది సిట్. అయితే.. ఈ కేసులోని ఏ -1 ప్రవీణ్,ఏ -2 రాజశేఖర్, ఏ -4 డాక్య, ఏ -5 కేతావత్ రాజేశ్వర్ నిందితులను మాత్రమే సిట్ కస్టడీ అనుమతించింది కోర్టు. దీంతో రేపటి నుంచి మంగళవారం వరకు వీళ్లను కస్టడీకి తీసుకుని విచారించనున్నారు సిట్ అధికారులు. అయితే మిగిలిన ముగ్గురు(ఏ-10 షమీమ్, ఏ -11, సురేష్, ఏ -12 రమేష్) కస్టడీ పిటిషన్ను మాత్రం సోమవారానికి వాయిదా వేసింది కోర్టు. కస్టడీ రిపోర్ట్లో కీలకాంశాలు ఇక పేపర్ లీకేజీ కేసులో.. సిట్ కస్టడీ రిపోర్ట్లో కీలకాంశాలను పేర్కొంది. ‘‘నిందితులు విచారణకు సహకరించడం లేదు. పూర్తి సమాచారం ఇవ్వడం లేదు. పేపర్ లీకేజీ వ్యవహారంలో.. చైన్ ప్రాసెస్పై నోరు మెదపడం లేదు. కేవలం ముగ్గురి పేర్లే చెప్పారు. ఇందులో మిగతా వారి పాత్ర కూడా బయటపడాలి. నిందితులు వాడిన పరికరాలపై ప్రశ్నించాలి. ప్రవీణ్, రాజశేఖర్ ఇచ్చిన సమాచారం ఆధారంగానే.. షమీమ్, రమేశ్, సురేష్లను అరెస్ట్ చేశాం. పేపర్ లీకేజీ వ్యవహారంలో.. ఇంకా దర్యాప్తు పూర్తి కాలేదు. కాబట్టి.. నిందితుల కస్టడీ అత్యంత కీలకం అని పేర్కొంది. ఇక నిందితులలో నలుగురిని.. నాంపల్లి కోర్టు మూడు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చిదని సిట్ అధికారులు తెలిపారు.