ప్రొసీజర్స్‌ ఎందుకు ఫాలో కావడం లేదు? | ACB Court Fires On SIT Over Officials Not Following Procedures For Investigation In AP Liquor Scam | Sakshi
Sakshi News home page

ప్రొసీజర్స్‌ ఎందుకు ఫాలో కావడం లేదు?

May 27 2025 3:44 AM | Updated on May 27 2025 1:29 PM

ACB court fires on SIT: Liquor Scam in Andhra Pradesh

సిట్‌ తీరుపై ఏసీబీ కోర్టు ఆగ్రహం 

మీకేమైనా స్పెషల్‌ ప్రొసీజర్‌ ఉందా అని నిలదీత 

అప్పటికప్పుడు విచారణాధికారిని పిలిపించి ప్రశ్నల వర్షం కురిపించిన న్యాయమూర్తి 

విచారణాధికారి తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్న న్యాయమూర్తి 

నిందితుల కస్టడీ పిటిషన్‌ 29కి వాయిదా  

సాక్షి ప్రతినిధి, విజయవాడ: మద్యం విధానంపై నమోౖ­దెన అక్రమ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) తీరుపై ఏసీబీ కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసు విషయంలో ప్రొసీజర్స్‌ ఎందుకు ఫాలో కా­వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మీకేమైనా స్పెషల్‌ ప్రొసీజర్‌ ఉందా’ అని నిలదీసింది. విచారణాధికారిని అప్పటికప్పుడు కోర్టుకు పిలిపించిన న్యా­యమూర్తి ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. విచారణాధికారి తీరుపై అనుమానాలు వ్యక్తమవ­#తున్నా­యని న్యాయమూర్తి పేర్కొన్నారు. నిందితుల కస్ట­డీ పిటిషన్‌ను ఈ నెల 29వ తేదీకి వాయి­దా వేశారు.

మద్యం విధానంపై నమోదైన కేసులో నిందితులుగా ఉన్న కేసిరెడ్డి రాజశేఖరరెడ్డి, కె.ధనుంజయ­రెడ్డి, పి.కృష్ణమోహన్‌రెడ్డి, గోవిందప్ప బాలాజీ కస్టడీ పిటిషన్‌లపై విజయవాడలోని ఏసీబీ కోర్టులో సోమవారం విచారణ జరిగింది. కేసిరెడ్డి రాజశేఖరెడ్డిని మూడు రోజులు, కె.ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌­రెడ్డి, గోవిందప్ప బాలాజీలను ఏడు రోజులపా­టు కస్టడీకి ఇవ్వాలని సిట్‌ అధికారులు పిటిషన్‌ దాఖలు చేశారు. 

నేరుగా ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపితే ఎలా! 
కేసిరెడ్డి, ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, గోవిందప్ప బాలాజీ తరఫున న్యాయవాదులు నాగార్జునరెడ్డి, దుష్యంత్‌రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, శరణ్‌ వాదనలు వినిపిస్తూ.. ఈ కేసు­లో ఇంతవరకు ఎవరెవరి నుంచి ఏం మెటీరియల్‌ సీజ్‌ చేశారో తెలపాలని కోరారు. సీజ్‌ చేసిన ఎల్రక్టానిక్‌ డివైజ్‌లను, మెటీరియల్‌ను కోర్టుకు సమర్పించకుండా నేరుగా ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు ఎలా పంపుతారని ప్రశి్నంచారు.

ఈ కేసును మొదట్లో సీఐడీ అధికారులు దర్యాప్తు చేశారని, అప్పుడు వారు సీజ్‌ చేసిన ఫైళ్లు, కంప్యూటర్లు కోర్టు ద్వారా ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపిన విషయాన్ని కోర్టు దృష్టికి తెచ్చారు. సిట్‌ అధికారులు ప్రొసీజర్స్‌ ఫాలో కావడం లేదని పేర్కొన్నారు. దర్యాప్తు ప్రారంభించినప్పటి నుంచి ఏ ఒక్క ఆధారం కోర్టుకు సమరి్పంచలేదని వివరించారు. ప్రొసీజర్స్‌ ఫాలో కాకుండా ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపితే ట్యాంపరింగ్‌ చేసే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు.  

ప్రొసీజర్‌ ప్రకారం చేయాల్సిందే 
బాధితుల తరఫు వాదనలు విన్న న్యాయమూర్తి స్పందిస్తూ.. సిట్‌ సమరి్పంచిన మెమోలో సైతం ఏ మెటీరియల్‌ సీజ్‌ చేశారనే విషయాలే నమోదై ఉన్నాయని, అందుకు సంబంధించిన ఆధారాలు మాత్రం కోర్టుకు సమరి్పంచలేదన్నారు. సిట్‌ తీరుపై విస్మయానికి గురైన న్యాయమూర్తి అప్పటికçప్పుడు విచారణ అధికారి ఆర్‌.శ్రీహరిబాబును కోర్టుకు పిలిపించి ప్రొసీజర్స్‌ ఎందుకు ఫాలో కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సిట్‌ తీరుపై ప్రశ్నల వర్షం కురిపించారు. వీటికి విచారణాధికారి సమాధానం చెప్పలేక నీళ్లు న­మి­లారు. ఈ నేపథ్యంలో ‘కోర్టు ప్రొసీజర్స్‌ ఫాలో కా­కుండా విచారణ ఎలా చేస్తారు. మీరు డైరెక్ట్‌గా ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపితే ట్యాంపరింగ్‌ చేసే అవకాశం ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతాయి. మీరు ఏదైనా కోర్టులో పెట్టి ప్రొసీజర్స్‌ ప్రకారం చేయాలి’ అని న్యాయమూర్తి విచారణాధికారిని ఆదేశించారు.  

ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపిత కేసు 
బాధితుల తరఫు న్యాయవాదులు తమ వాదనల్ని కొనసాగిస్తూ.. ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపిత కేసు అని, ఎలాంటి కుంభకోణం జరగలేదని కోర్టుకు స్పష్టం చేశారు. ఆధారాలు లేకుండా అరెస్టు చేసి, అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. సిట్‌ అధికారులు సాక్షులను తమకు అనుకూలంగా వ్యవహ­రించాల్సిందిగా బెదిరిస్తున్నారన్నారు. ఈ కేసుపై తాము సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. సాక్షులను బెదిరించకుండా, ప్రొసీజర్స్‌ ఫాలో కావాలని స్పష్టంగా చెప్పిన విషయాన్ని న్యాయవాదులు ఏసీబీ కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రాసిక్యూషన్‌ తరఫున జేడీ రాజేంద్రప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ మెమో దాఖలు చేశామని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు కస్టడీ పిటిషన్‌పై విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement