వాషింగ్టన్ : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు రాష్ట్రానికి చెందిన దంపతులు దుర్మరణం చెందారు. ఈరోజు(సోమవారం) వాషింగ్టన్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కృష్ణ కిషోర్, ఆశలు మృతిచెందారు. అమెరికాలో కృష్ణకిషోర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తన్నాడు.
ఓ కార్యక్రమం మీద బయటకు వెళ్లి తిరిగి కారలో వస్తుండగా వీరు రోడ్డు ప్రమాదం బారిన పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే మృతించెందారు. ఈ ప్రమాదంలో వారి కుమారుడు, కూతురికి తీవ్ర గాయాలయ్యాయి.
వీరిది భారత్లోని తెలుగు రాష్ట్రం ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుగా గుర్తించారు. పది రోజుల క్రితమే కిషోర్ పాలకొల్లుకు వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తన్నారు. పాలకొల్లు వచ్చిన సమయంలో తమ కలిసి వెళ్లాడని పలువురు స్నేహితులు గుర్తు చేసుకుంటున్నారు.


