Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం | Devotees Rush At Tirumala | Sakshi
Sakshi News home page

Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Jan 31 2026 8:09 AM | Updated on Jan 31 2026 11:28 AM

Devotees Rush At Tirumala

తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ  సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 12 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి.     శుక్రవారం అర్ధరాత్రి వరకు 69,254  మంది స్వామివారిని దర్శించుకున్నారు. 20,954 మంది భక్తులు తలనీలాలు అరి్పంచారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.35  కో ట్లు సమరి్పంచారు. టైంస్లాట్‌ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. 

దర్శ న టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 10 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇసర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement