గ్రూప్‌–1 ఫలితాల్లో జర్నలిస్టుల కుమార్తెల సత్తా | Journalists Daughters Secure Prestigious Group-1 Posts In Prakasam District, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

గ్రూప్‌–1 ఫలితాల్లో జర్నలిస్టుల కుమార్తెల సత్తా

Jan 31 2026 9:37 AM | Updated on Jan 31 2026 9:52 AM

AP Group 1 Result Story With Shruti

ఒంగోలు టౌన్‌: శుక్రవారం విడుదలైన గ్రూప్‌–1 ఫలితాల్లో జిల్లాకు చెందిన జర్నలిస్టుల కుమార్తెలు ఇద్దరు సత్తా చాటి ఉన్నత కొలువులు సంపాదించారు. ఒంగోలులో ఒక దినపత్రిక రిపోర్టర్‌గా పనిచేస్తున్న కొత్తపట్నం గ్రామానికి చెందిన బేతాళ శ్రీనివాస్‌ కూతురు శృతి గ్రూప్‌ 1 పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ చాటి సోషల్‌ వెల్ఫేర్‌ జిల్లా అధికారిగా ఎంపికయ్యారు. 

బేతాళ శృతి తల్లి ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. అలాగే ఒంగోలులోని కమ్మపాలేనికి చెందిన, ఓ పత్రికలో టెక్నికల్‌ విభాగంలో పనిచేస్తున్న పెండ్యాల రామకోటేశ్వరరావు కుమార్తె వెంకట నవీన డీఎస్పీగా ఎంపికయ్యారు. రామకోటేశ్వరరావు సతీమణి టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. జర్నలిస్ట్‌ కుటుంబాలకు చెందిన ఇద్దరు గ్రూపు–1 ఉద్యోగాలు సాధించడంతో పలువురు విలేకర్లు అభినందనలు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement