గ్రూప్‌–1 ఫలితాల్లో జర్నలిస్టుల కుమార్తెల సత్తా | Journalists Daughters Secure Prestigious Group-1 Posts In Prakasam District, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

గ్రూప్‌–1 ఫలితాల్లో జర్నలిస్టుల కుమార్తెల సత్తా

Jan 31 2026 9:37 AM | Updated on Jan 31 2026 9:52 AM

AP Group 1 Result Story With Shruti

ఒంగోలు టౌన్‌: శుక్రవారం విడుదలైన గ్రూప్‌–1 ఫలితాల్లో జిల్లాకు చెందిన జర్నలిస్టుల కుమార్తెలు ఇద్దరు సత్తా చాటి ఉన్నత కొలువులు సంపాదించారు. ఒంగోలులో ఒక దినపత్రిక రిపోర్టర్‌గా పనిచేస్తున్న కొత్తపట్నం గ్రామానికి చెందిన బేతాళ శ్రీనివాస్‌ కూతురు శృతి గ్రూప్‌ 1 పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ చాటి సోషల్‌ వెల్ఫేర్‌ జిల్లా అధికారిగా ఎంపికయ్యారు. 

బేతాళ శృతి తల్లి ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. అలాగే ఒంగోలులోని కమ్మపాలేనికి చెందిన, ఓ పత్రికలో టెక్నికల్‌ విభాగంలో పనిచేస్తున్న పెండ్యాల రామకోటేశ్వరరావు కుమార్తె వెంకట నవీన డీఎస్పీగా ఎంపికయ్యారు. రామకోటేశ్వరరావు సతీమణి టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. జర్నలిస్ట్‌ కుటుంబాలకు చెందిన ఇద్దరు గ్రూపు–1 ఉద్యోగాలు సాధించడంతో పలువురు విలేకర్లు అభినందనలు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement