టీటీడీ కీలక నిర‍్ణయం.. ఆన్‌లైన్‌లో శ్రీవాణి టికెట్లు | TTD Takes A Key Decision On Srivani Darshanam, Shifted Ticket Booking From Offline To Online From January 9 | Sakshi
Sakshi News home page

టీటీడీ కీలక నిర‍్ణయం.. ఆన్‌లైన్‌లో శ్రీవాణి టికెట్లు

Jan 6 2026 9:23 PM | Updated on Jan 7 2026 10:24 AM

TTD takes a key decision on ticket booking

సాక్షి తిరుపతి: భక్తుల సౌకర్యార్థంతో పాటు పరిపాలనా అవసరాల దృష్ట్యా టీటీడీ  దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవాణి దర్శన టికెట్ల జారీ విధానంలో మార్పులు చేపట్టింది. ఇది వరకూ తిరుమలలో ఆఫ్‌లైన్ కౌంటర్ల ద్వారా జారీ చేస్తున్న టికెట్లను జనవరి 9 నుండి  ఆన్‌లైన్ కరెంట్ బుకింగ్ విధానంలో అందించనున్నట్లు తెలిపింది.

ప్రస్తుతం తిరుమలలో  800 శ్రీ‌వాణి ద‌ర్శ‌న టికెట్ల‌ను  రోజువారి విధానంలో ఆఫ్‌లైన్ ద్వారా జారీ చేస్తున్నారు.  వాటిని జనవరి తొమ్మిది నుంచి ఆన్‌లైన్ ద్వారా రోజూవారి కరెంట్ బుకింగ్‌లోకి మార్చనున్నారు. ఈ టికెట్లను ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేసి, మధ్యాహ్నం 2 గంటల వరకు అందుబాటులో ఉంచుతారు. టికెట్ పొందిన భ‌క్తులు అదే రోజు సాయంత్రం 4 గంటలకు దర్శనానికి రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.

ఈ టికెట్లు  ఒక్క కుటుంబంలో 1+3 సభ్యులు (మొత్తం న‌లుగురు) మాత్రమే టికెట్ బుకింగ్‌కు అనుమతి ఉంటుంది. టికెట్ బుకింగ్‌లో దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఆధార్ ధృవీకరణ, మొబైల్ నంబర్  వివరాలు తప్పనిసరి. ఫ‌స్ట్ క‌మ్ ఫ‌స్ట్ స‌ర్వ్ విధానంలో  టికెట్లు అందజేయనున్నట్లు దేవస్థానం ప్రకటించింది. ఈ నూతన విధానాన్ని నెల రోజుల‌పాటు ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు.

అదేవిధంగా రోజుకు 500 శ్రీ‌వాణి ద‌ర్శ‌న టికెట్ల‌ను ఆన్ లైన్ అడ్వాన్స్ బుకింగ్ విధానంలో ఇప్పటికే విడుద‌ల చేయ‌డం జరిగింది. మూడు నెల‌ల అనంత‌రం ఈ విధానంపై స‌మీక్షించి నిర్ణ‌యం తీసుకోవ‌డం జ‌రుగుతుందని టీటీడీ తెలిపింది. తిరుప‌తి విమానాశ్ర‌యంలో ప్ర‌తిరోజూ భ‌క్తుల‌కు ఆఫ్ లైన్ విధానంలో జారీ చేస్తున్న 200 టికెట్ల జారీ విధానం కూడా య‌థావిధిగా కొన‌సాగ‌నుందని పేర్కొంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement