కలియుగదైవం తిరుమల శ్రీవారిని నటి మీనాక్షి చౌదరి దర్శించుకున్నారు. రీసెంట్గా తాను నటించిన ‘అనగనగా ఒక రాజు’ చిత్రం విజయం అందుకోవడంతో ఆమె స్వామివారి ఆశీస్సులను తీసుకునేందుకు అలిపిరి కాలినడకన కొండకు చేరుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ మూవీ విడుదల సమయంలో కూడా శ్రీవారిని ఆమె దర్శించుకున్న విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో మీనాక్షి పాల్గొన్నారు. దర్శన అనంతరం మీనాక్షికి రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. శ్రీవారిని దర్శించుకుని ఆలయం నుంచి బయటకు వస్తున్న సమయంలో అభిమానులు ఆమెతో సెల్ఫీలు దిగారు.


